
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో థియేటర్లలో అంతగా రాణించని ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం ఊహించని రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్ రోజు మహేశ్ బాబు అభిమానులు థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేశారు. ఓ అభిమాని ఏకంగా పామును పట్టుకుని మూవీ థియేటర్కు వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
అయితే ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత అనూహ్యంగా ఆమె పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఆమె ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అని అందరూ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు.. ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.
ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్లో షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తాడు. ఈ సీన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సీన్స్లో నటించిన దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట తెగ వైరలైంది. అయితే ఇది చూసిన ఆమె.. ఖలేజా మూవీలో తాను నటించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ఖలేజా రీ రిలీజ్ కావడంతో దిలావర్ సింగ్ భార్యగా నటించింది దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ రోల్ తాను చేయలేదని స్పష్టం చేసింది. తానేనని చాలామంది పొరపాటుగా పోస్ట్ చేశారని తెలిపింది.