
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని ఎవరకీ ఉండదు చెప్పండి. బాల్యంలో తన కుటుంబంతో గడిపిన ఎన్నో మధుర క్షణాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదిలితే వచ్చే ఫీలింగే వేరు. మరీ ముఖ్యంగా ఓకే కుటుంబంలో పుట్టి పెరిగిన అన్నదమ్ములు, అక్కచెలెల్లు మధ్య అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరం ఓకే ఇంట్లో ఉండి సరదాగా ఉండే మనం.. ఇప్పుడు పెరిగి, పెళ్లిళ్లు అయ్యాక కేవలం మన కుటుంబమే లోకంగా జీవిస్తున్నాం. అలాంటి ఈ రోజుల్లో మనకు తోబుట్టులను గుర్తు చేసుకునేందుకు ఒక డే ఉందని మీకు తెలుసా? రక్తం పంచుకుని పుట్టిన బంధాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కనీసం ప్రత్యేకమైన సిబ్లింగ్స్ డే రోజైనా వారిని గుర్తు చేసుకుందాం.
తాజాగా ఇవాళ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన సిస్టర్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది. మై ఫేవరేట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటూ తనతో ఉన్న త్రో బ్యాక్ పిక్ను షేర్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే శిల్పా శిరోద్కర్ సైతం తన అక్క నమ్రతాతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వు అతిపెద్ద మద్దతుగా నిలిచే వ్యక్తి నువ్వే అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్బాస్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. టాప్-5 నిలిచి మరింత ఫేమస్ అయ్యారు.