Srilanka: 500 అడుగుల లోయలో పడిన బస్సు.. 15మంది దుర్మరణం | Fifteen Passengers Died After Horrible Accident At Sri Lanka, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

Srilanka: 500 అడుగుల లోయలో పడిన బస్సు.. 15మంది దుర్మరణం

Sep 5 2025 7:42 AM | Updated on Sep 5 2025 10:37 AM

horrible accident at sri lanka

కొలంబో: శ్రీలంకలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 500 అడుగుల  లోయలో పడి 15మంది ప్రయాణికులు దుర్మరణ పాలయ్యారు. 15మంది త్రీవంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.  

పోలీసుల వివరాల మేరకు గురువారం రాత్రి (సెప్టెంబర్‌4)తంగల్లే మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులు విహారయాత్రకు బయల్దేరారు. అయితే ఈ విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ఎల్లా-వెల్లావాయ ప్రధాన రహదారిలోని 24వ కి.మీ పోస్ట్ సమీపంలోని లోయలో బస్సు పడింది. ఈ దుర్ఘటనలో 15మంది ఉద్యోగులు మరణించారు.

దుర్ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు,పోలీసులు బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. బాధితుల్ని   బదుల్లా టీచింగ్ హాస్పిటల్‌లో చేర్చారు. 500 అడుగుల లోయ కారణంగా వెలుతురు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్రం ఆటంకం కలిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement