ఈసారి పాక్‌ను కలిపి ఇచ్చి పడేశారు..! | Jaishankars dig at US Pak relations a history of overlooking their history | Sakshi
Sakshi News home page

ఈసారి పాక్‌ను కలిపి ఇచ్చి పడేశారు..!

Aug 23 2025 6:05 PM | Updated on Aug 23 2025 7:06 PM

Jaishankars dig at US Pak relations a history of overlooking their history

ఎన్‌ జైశంకర్‌.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు  సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్‌ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్‌ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్‌లపై సెటైరిక్‌గా స్పందించారు. 

ఎకనమిక్స్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్‌ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్‌కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా  పాక్‌-అమెరికాల వైఖరిపై జై శంకర్‌ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.  ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు.  

 

ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్‌ ఖైదా నాయకుడు బిన్‌ లాడెన్‌ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు.  అమెరికా-పాకిస్తాన్‌లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్‌ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్‌.

ఇదీ చదవండి: 

భారత్‌తో సమస్య ఉంటే.. ట్రంప్‌కు జై శంకర్‌ స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement