
ముంబై: ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సన్నీ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్షణాన్ని ఈ విగ్రహంగా మలిచారు. ఐసీసీ మాజీ చైర్మన్ శరద్ పవార్ విగ్రహావిష్కరణ కూడా ఇదే కార్యక్రమంలో జరిగింది. స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న క్రికెట్ మ్యూజియంలో గావస్కర్తో పాటు వీటిని ఉంచుతారు. ఈ మ్యూజియం సెపె్టంబర్ 22 నుంచి అభిమానులకు అందుబాటులో ఉంటుంది.