-
రోహిత్ శర్మకు ‘షాకిచ్చిన’ మహిళా అభిమాని! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఇంత వరకు బోణీ కొట్టని ఒకే ఒక జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడో ఓడి.. హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. సొంత మైదానం వాంఖడేలోనైనా సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన పంత్ సేనకు ముంబైతో పోరు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ‘అస్త్రశస్త్రాల’తో సంసిద్ధులయ్యారు. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు వాంఖడేకు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఈ క్రమంలో ఓ యువతి హిట్మ్యాన్ను కలిసేందుకు మైదానానికి వచ్చింది. మ్యాచ్కు ముందు సేద తీరుతున్న రోహిత్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి.. అతడి పాదాలకు నమస్కరించింది.దీంతో రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. 💥 pic.twitter.com/LsWwFUCbRg — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024 కాస్త ఇబ్బందిపడుతూనే ఇలా చేయవద్దవంటూ వారించాడు. ఇక తన అభిమాన క్రికెటర్ను కలిసిన అనంతరం సదరు యువతి.. రోహిత్ ఫొటోపై అతడి ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆ తర్వాత ఫొటోలు కూడా దిగి ఫ్యాన్గర్ల్ మూమెంట్ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడేమో చూడాలి!! చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచారు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్లో రేణుక సింగ్తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం సాధ్యమే. -
సచిన్ విగ్రహంపై అభిమానుల అసంతృప్తి.. స్టీవ్ స్మిత్లా ఉందంటూ కామెంట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా ఏర్పాటైన సచిన్ టెండూల్కర్ విగ్రహంపై భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విగ్రహం ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ను పోలి ఉండటంతో సచిన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తాయారు చేసి ఉండాల్సిందని విగ్రహ రూపకర్తను దూషిస్తున్నారు. సచిన్ అంటే గిట్టని వారు, క్రికెట్ పరిజ్ఞానం లేని వారు స్టీవ్ స్మిత్ విగ్రహం భారత్లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వాంఖడేలో నిన్న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ నుంచి సచిన్ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, నవంబర్ 1న ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వాంఖడేలో సచిన్ స్టాండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఆఫ్సైడ్ షాట్ ఆడే పోజ్లో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా విగ్రహావిష్కరణ చేశారు. కాగా, సచిన్ తన సొంత మైదానమైన వాంఖడేలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ (నవంబర్ 16, 2013) ఆడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
Sachin Tendulkar Statue At Wankhede Stadium: వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
నేడు సచిన్ విగ్రహావిష్కరణ
ముంబై: ప్రతిష్టాత్మక వాంఖెడె మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహం ఏర్పాటు కానుంది. బుధవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సచిన్ స్టాండ్ పక్కనే దీనిని ఏర్పాటు చేయనుండగా...ఆఫ్సైడ్లో షాట్ ఆడుతున్న చిత్రాన్ని ఈ విగ్రహం కోసం ఎంచుకున్నారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే దీనిని రూపొందించారు. స్వయంగా సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు దీనికి హాజరవుతారు. తన సొంత మైదానమైన ముంబై వాంఖెడె స్టేడియంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న సచిన్... తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ను ఇక్కడే నవంబర్ 16, 2013న ఆడాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement