మూడో రోజు నుంచి ‘స్పిన్’ | From the third day of the 'spin' | Sakshi
Sakshi News home page

మూడో రోజు నుంచి ‘స్పిన్’

Dec 6 2016 12:56 AM | Updated on Sep 4 2017 9:59 PM

మూడో రోజు నుంచి ‘స్పిన్’

మూడో రోజు నుంచి ‘స్పిన్’

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు నాలుగో టెస్టుతోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

ముంబై వాంఖడే మైదానం సిద్ధం  
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు నాలుగో టెస్టుతోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో గత రెండు టెస్టులలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా సిద్ధమవుతోంది. ఈ పిచ్‌పై మూడో రోజు ఉదయం నుంచి బంతి తిరగవచ్చని భావిస్తున్నారు. గురువారం నుంచి టెస్టు ప్రారంభం కానుండగా, ఇప్పటికే పిచ్‌పై ఉన్న పచ్చికను కత్తిరించి, నీళ్లు చిలకరించడం కూడా తగ్గించేశారు. ఈ విషయాన్ని పిచ్ క్యురేటర్ మమున్‌కర్ ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ వేదిక బౌలింగ్‌కు అనుకూలించలేదు. అరుుతే కొత్తగా మార్పులు చేర్పులు చేసిన తర్వాత వాంఖడే వికెట్ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు కలిసొచ్చింది. గతంలో మురళీ కార్తీక్, ఓజా, పనేసర్ ఇక్కడ అద్భుత గణాంకాలు నమోదు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement