breaking news
test series
-
Ashes: పింక్బాల్ టెస్టుకు ముందు ఆసీస్కు భారీ షాక్!
ఇంగ్లండ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఈ మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. గాయాల బెడద వల్ల వీరిద్దరు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు కూడా దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఇటీవలే వెల్లడించింది.యాషెస్ సిరీస్తో బిజీఅయితే, తాజా సమాచారం ప్రకారం ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) కూడా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో అతడు కూడా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉంది ఆస్ట్రేలియా.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ (Steve Smith) జట్టును ముందుకు నడిపించగా.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4-8 మధ్య బ్రిస్బేన్లోని గాబా వేదికగా రెండో టెస్టు జరుగనుంది.ఖవాజా సైతం..పింక్బాల్తో జరిగే ఈ డై- నైట్ టెస్టుకు సంబంధించి ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. కమిన్స్తో పాటు హాజిల్వుడ్ గాయాల వల్ల అందుబాటులో లేకుండా పోయారని తెలిపింది. అయితే, ఇప్పుడు ఖవాజా ఫిట్నెస్ సమస్య ఆసీస్కు తలనొప్పిగా మారింది. పెర్త్ టెస్టు సందర్భంగా ఖవాజాకు వెన్ను నొప్పి తిరగబెట్టింది.గత మూడు మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు అతడేఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్లోనూ ఓపెనింగ్ చేయలేదు. ఇక పింక్బాల్ టెస్టుకు సన్నద్ధమయ్యే క్రమంలోనూ అతడు వెన్నునొప్పితో బాధపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ముప్పై నిమిషాల పాటు జరిగిన సెషన్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు ఇబ్బందిపడినట్లు పేర్కొంది.దీంతో రెండో టెస్టుకు ఖవాజా అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అతడు ఈ మ్యాచ్కు దూరమైతే జట్టుకు కష్టమే. గాబాలో గత మూడు పింక్ బాల్ టెస్టుల్లోనూ ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో అతడికి మాత్రమే ఉంది. కాగా ఖవాజా గనుక ఇంగ్లండ్తో రెండో టెస్టుకు దూరమైతే బ్యూ వెబ్స్టర్, జోష్ ఇంగ్లిస్ల రూపంలో బ్యాకప్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇంగ్లండ్తో పింక్బాల్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్రాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్! -
Ashes: ఉస్మాన్ ఖవాజాపై క్రికెట్ ఆస్ట్రేలియా ఫైర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చిక్కుల్లో పడ్డాడు. అభ్యంతకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి సొంత బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన విషయం తెలిసిందే.ఈ టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్ వేదిక (Perth Stadium)గా తొలి మ్యాచ్లో పర్యాటక ఇంగ్లండ్ను ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. అయితే, తొలిరోజు పెర్త్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఎక్స్ట్రా బౌన్స్తో పేసర్లు బ్యాటర్లను తిప్పలు పెట్టారు.తొలిరోజే పందొమ్మిది వికెట్లుఈ క్రమంలో ఆట మొదలైన రోజే ఏకంగా పందొమ్మిది వికెట్లు కూలాయి. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఏడు వికెట్లతో చెలరేగగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (Ben Stokes) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో ఆసీస్ నుంచి బ్రెండన్ డాగెట్ రెండు, కామెరాన్ గ్రీన్ ఒక వికెట్ తీయగా.. ఇంగ్లండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ రెండు, బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు కూల్చారు.అదొక గొప్ప వికెట్ అంటూ వెటకారంఈ నేపథ్యంలో పెర్త్ వికెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సైతం పెర్త్ పిచ్పై స్పందిస్తూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. SEN క్రికెట్తో మాట్లాడుతూ.. ‘‘తొలిరోజే 19 వికెట్లు పడ్డాయి. ఇరవై మందికి దెబ్బలు కూడా తగిలాయి. అదొక గొప్ప వికెట్. నిజంగానే ఎవరైనా ఈ మాట అంటారా?నా కెరీర్లో స్టీవ్ స్మిత్ వంటి గొప్ప బ్యాటర్ను ఇంత వరకు చూడలేదు. అయితే, అతడు కూడా పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. తను అసలు బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అతడి మోచేతికి బంతి తగిలింది. బ్యాట్ను ఆడించడమే గగనం అయిపోయింది.నా దృష్టిలో S**T వంటిదిఅందుకే పెర్త్లో తొలి రోజు ఆట నా దృష్టిలో S**T వంటిది. ఇది చెప్పడానికి నేనేమీ భయపడను. గతేడాది.. ఇప్పుడ ఈ పిచ్ ఒకేలా ఉంది’’ అంటూ ఉస్మాన్ ఖవాజా ఘాటు విమర్శలు చేశాడు. ఓవైపు ఐసీసీ నుంచి పెర్త్ పిచ్కు.. ‘చాలా బాగుంది (Very Good)’ అనే ప్రశంస రాగా.. ఖవాజా మాత్రం ఇలా మాట్లాడటం గమనార్హం.అంత మాట అంటావా?.. సీఏ ఫైర్ఈ నేపథ్యంలోనే ఖవాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పెర్త్ పిచ్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా అతడికి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఖవాజా వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న బోర్డు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబరు 4-8 మధ్య రెండో టెస్టు (పింక్బాల్)కు ముహూర్తం ఖరారైంది. చదవండి: అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్ -
వాళ్లకి టెస్టు క్యాప్లు ఎలా ఇస్తారు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ స్టార్లకు టెస్టు క్యాప్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటినప్పటికీ చాలా మంది ఆటగాళ్లు టెస్టుల్లో రాణించలేకపోతున్నారని విమర్శించాడు.సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్వాష్వాస్తవానికి సదరు ప్లేయర్లు టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వారిని ఆడిస్తూ జట్టు భారీ మూల్యమే చెల్లిస్తోందని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా స్వదేశంలో టీమిండియాకు టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయిన టీమిండియా.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 2-0 (IND vs SA)తో చిత్తుగా ఓడింది.ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో మరీ దారుణంగా ప్రొటిస్ జట్టు చేతిలో 408 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో పాటు సెలక్టర్ల విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ క్రికెటర్లు.. బ్యాటర్ల వైఫల్యాన్ని తూర్పారబడుతున్నారు.అంత మాత్రాన టెస్టు జట్టులో చోటిచ్చేస్తారా?ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సైతం యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇటీవలి కాలంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో చాలా మందికి ఎక్కువగా ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. యశస్వి జైస్వాల్ 15, శుబ్మన్ గిల్ (Shubman Gill) 20-22 మ్యాచ్లు ఆడిన తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేశారు.సాయి సుదర్శన్ 29, నితీశ్ కుమార్రెడ్డి 23, ధ్రువ్ జురెల్ 15 మ్యాచ్లు ఆడి ఉంటారు. దేవదత్ పడిక్కల్ అందరి కంటే ఎక్కువగా 31 మ్యాచ్లు ఆడినా.. అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్ లేదంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో విజృంభించినంత మాత్రాన టెస్టు జట్టులో చోటిచ్చేస్తారా?జైసూ, గిల్ వంటి ఆటగాళ్లు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అనుభవం తక్కువగా ఉన్నా టెస్టుల్లో తమను తాము ఇప్పటికే నిరూపించుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు అలాగే ఆడలేరు కదా!.. ఫార్మాట్కు అనుగుణంగా రాణించేందుకు కొందరికి తక్కువ సమయం పడితే.. మరికొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు.అర్థం చేసుకోవాల్సింది మీరే!ఇప్పుడు జరిగింది ఇదే. ప్రొటిస్తో మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు వారు ఆపసోపాలు పడ్డారు. నిజానికి వాళ్లు సంప్రదాయ ఫార్మాట్ ఆడేందుకు సిద్ధంగా లేరు. కనీసం 3-4 సీజన్లలో వరుసగా రెడ్బాల్ క్రికెట్ ఆడితే వారు పూర్తి స్థాయిలో టెస్టులకు సన్నద్ధం కాగలరు. కానీ అది గుర్తించకుండా వెంటనే జాతీయ జట్టులోకి పిలిపిస్తే ఎలా?నిజానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. వారు సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాల్సింది మీరే!.. ఓ ఆటగాడికి టెస్టు క్యాప్ అందించే ముందు అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో కనీసం 2-3 సీజన్లు ఆడేలా చూసుకోండి. నిలకడగా పరుగులు రాబట్టిన బ్యాటర్లు, వికెట్లు తీసిన బౌలర్లకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. ఆ తర్వాతే టెస్టుల్లో ఆడించండి. సంధి కాలంలో ఇదే సరైన విధానం అనిపించుకుంటుంది’’ అంటూ టీమిండియా మేనేజ్మెంట్కు ఆకాశ్ చోప్రా చురకలు అంటించాడు.చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన -
గంభీర్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం!?.. ఇంకోసారి ఇలా చేస్తే..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ అకస్మాత్ రిటైర్మెంట్ ప్రకటనల వెనుక గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.విమర్శలు.. రాజీనామాకు డిమాండ్అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్కోచ్గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, అశ్విన్ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.అండగా ఉంటామని చెప్పినా..ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గంభీర్ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్ అలా తయారు చేయించానని గంభీర్ అంగీకరించిన విషయం తెలిసిందే.అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి, యువ పేసర్ హర్షిత్ రాణాను ఆడించే విషయమై గంభీర్ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులుఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్గా నిలిచిన ఆ క్రెడిట్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్కప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపితేనే గంభీర్ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన -
Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. కాగా సొంతగడ్డపై ఆసీస్ ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో తలపడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పెర్త్ వేదికగా నవంబరు 21న ఇరుజట్ల మధ్య మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్.. ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక డిసెంబరు 4-8 వరకు ఇంగ్లండ్- ఆసీస్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. డే- నైట్ మ్యాచ్గా నిర్వహించే ఈ పింక్ బాల్ టెస్టు (Pink Ball Test) కంటే ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో ఇంగ్లండ్ తలపడనుంది.కమిన్స్, హాజిల్వుడ్ అవుట్ఇదిలా ఉంటే.. ఫిట్నెస్ సమస్యల వల్ల యాషెస్ తొలి టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins).. రెండో టెస్టుతో తిరిగి వస్తాడనే ప్రచారం జరిగింది. జట్టుతో పాటు అతడు బ్రిస్బేన్కు వచ్చి నెట్స్లో ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. అయితే, అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం.ఫలితంగా కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ మరోసారి జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇక కమిన్స్తో పాటు మరో పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల నొప్పి నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా రెండో టెస్టు బరిలోనూ దిగుతున్నట్లు ఆసీస్ ప్రకటించింది. కాగా పింక్ బాల్ టెస్టుకు బ్రిస్బేన్లోని గాబా మైదానం వేదిక.సత్తా చాటిన స్టార్క్కాగా తొలి టెస్టులో కమిన్స్, హాజిల్వుడ్ లేని లోటును మిచెల్ స్టార్క్ పూడ్చాడు. మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కామెరాన్ గ్రీన్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్ అతడికి తోడుగా నిలిచారు. ఇక.. ఇంగ్లండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్గా వచ్చిన ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 83 బంతుల్లో 123 పరుగులతో హెడ్ సత్తా చాటగా.. వన్డౌన్ బ్యాటర్ లబుషేన్ అజేయ అర్ధ శతకం (51)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్ వెదర్లాడ్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదేస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్రాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: తన వధువుతో ఇంటికి రావాలని కలలు కన్నాడు.. కానీ: పలాష్ ముచ్చల్ తల్లి -
గంభీర్ నా బంధువు కాదు.. తప్పంతా వాళ్లదే: అశ్విన్ ఆగ్రహం
టీమిండియా సిరీస్ పరాజయానికి హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్వాష్ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో కీలక వ్యాఖ్యలు చేశాడు.అది సరైంది కాదు‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.తప్పంతా వాళ్లదేభారత క్రికెట్ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.కోచ్, కెప్టెన్ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?గంభీర్ నా బంధువు కాదు.. గంభీర్ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్ వివరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయిన విషయం తెలిసిందే. చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ గంభీర్కు అండగా నిలిచాడు. కోచ్ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో గావస్కర్ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్ పరాజయానికి గంభీర్ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్గా ఉంచాలని మీరు చెప్పారా. మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్ వైపు చూస్తారు’ అని గావస్కర్ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్ను కోచ్గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్రెండన్ మెక్ల్లమ్ అన్ని ఫార్మాట్లలో కోచింగ్ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు. -
గంభీర్పై వేటు తప్పదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!
సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్ కోచ్గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.కోచ్గా ఎలాంటి అనుభవం లేకపోయినా..టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్కోచ్గా తప్పుకోగా.. గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్గా గంభీర్కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయింది భారత్. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లలో చాంపియన్గా నిలిచి సత్తా చాటింది.ద్రవిడ్కే ఆ క్రెడిట్కానీ చాంపియన్స్ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ భాయ్ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు టైటిల్కు అందించిన హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు.పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అంతకుముందే స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్మన్ గిల్కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.సంధి కాలంఈ నేపథ్యంలో గంభీర్ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.కివీస్తో సిరీస్తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్ విజ్ఞప్తి చేశాడు.బీసీసీఐ నిర్ణయం ఇదే!ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్కప్ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్ను హెడ్కోచ్గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్.. సరికొత్త చరిత్ర -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సత్తా చాటింది. స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో 2-0తో వైట్వాష్ చేసింది. ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్లో విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ తాజా సీజన్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్స్వీప్ చేశారు.408 పరుగుల భారీ తేడాతోరెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో భారత్పై గెలిచిన సౌతాఫ్రికా.. గువాహటిలో చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన బర్సపరా స్టేడియంలో ఆద్యంత ఆధిపత్యం కనబరిచి.. టీమిండియా (IND vs SA 2nd Test)ను ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.తొలి జట్టుగా చరిత్ర తద్వారా ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. గతంలో ఆస్ట్రేలియా నాగ్పూర్ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో గెలవగా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది.కాగా టీమిండియాను వైట్వాష్ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లది కీలక పాత్ర. పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) రెండో టెస్టులో సత్తా చాటి ప్లేయర్గా నిలవగా.. సఫారీ పేసర్ సైమన్ హార్మర్ రెండు మ్యాచ్లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఘోర పరాజయాలు (పరుగుల పరంగా)🏏సౌతాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి- 2025, గువాహటి🏏ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి- 2008, నాగ్పూర్🏏పాకిస్తాన్ చేతిలో 341 పరుగుల తేడాతో ఓటమి- 2006, కరాచి🏏ఆస్ట్రేలియా చేతిలో 337 పరుగుల తేడాతో ఓటమి- 2007, మెల్బోర్న్🏏ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి- 2017, పూణె.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బర్సపరా స్టేడియం, గువాహటి👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్👉సౌతాఫ్రికా స్కోర్లు: 489 &260/5 డిక్లేర్డ్👉భారత్ స్కోర్లు: 201 &140👉ఫలితం: 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు.. సిరీస్ 2-0తో వైట్వాష్.చదవండి: సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే.. -
మా కోచ్ ఒక్కడేనా?.. వాళ్లూ హద్దు దాటారు: బవుమా కౌంటర్
సౌతాఫ్రికా కెప్టెన్గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్వాష్ చేసిన ప్రొటిస్ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.సాష్టాంగపడేలా చేస్తాంగువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.కోచ్ కామెంట్స్పై బవుమా స్పందన ఇదేఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.హద్దు మీరి ప్రవర్తించారుఅదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్లో మా కోచ్ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్ లైన్ క్రాస్ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.కాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్కతాలో భారత్పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్ -
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్
సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.కాస్త నిరాశకు లోనయ్యాంఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.భారీ మూల్యమే చెల్లించాముఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. క్రికెట్లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్ పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్లు ఆడింది. కోల్కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇరవై ఐదేళ్ల తర్వాతఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్వాష్ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల దూరం కాగా.. పంత్ పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్ బౌలర్లు అడియాసలు చేశారు.ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్ హార్మర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్ రెండు, సెనూరన్ ముత్తుస్వామి ఒక వికెట్ తీశారు. పేసర్ మార్కో యాన్సెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యాన్సెన్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి భారత్ను 201 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. హార్మర్ (మొత్తంగా 17 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.చదవండి: Sai Sudharsan: సూపర్ స్లో బ్యాటింగ్! -
టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!
ఊహించిందే జరిగింది.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA) 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కనీస పోరాట పటిమ కూడా కనబరచకుండా ‘స్టార్’ బ్యాటర్లంతా పెవిలియన్కు వరుస కట్టడం భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) -2025 విజేత సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు భారత్కు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఇరుజట్ల మధ్య కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది.ఆది నుంచే ఆధిపత్యంఅనంతరం భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.549 పరుగుల లక్ష్యంఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్ వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నెమ్మదిగా ఆడుతూనే 78.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్ జట్టు తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. టీమిండియాకు 549 పరుగుల (288+260) భారీ లక్ష్యాన్ని విధించింది.రెండో ఇన్నింగ్స్లో ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. టోనీ డి జోర్జీ (49) తృటిలో అర్ధ శతంక చేజార్చుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (13)ను యాన్సెన్ వెనక్కి పంపగా.. కేఎల్ రాహుల్ (6)ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.హార్మర్ విజృంభణఈ క్రమంలో 27/2 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ చుక్కలు చూపించాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (5)ను సైమన్ బౌల్డ్ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14)ను సెనూరన్ ముత్తుస్వామి వెనక్కి పంపాడు.ఆ తర్వాత సైమన్ హార్మర్ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్ జురెల్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. లాంఛనం పూర్తి చేసిన మహరాజ్ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్ కేశవ్ మహరాజ్.. మొహమ్మద్ సిరాజ్ (0) ఆఖరి వికెట్గా వెనక్కి పంపి టీమిండియా ఓటమిని ఖరారు చేశాడు. మొత్తంగా సైమన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ రెండు, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ యాన్సెన్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక సమిష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టు సిరీస్ గెలవడమే కాదు..వైట్వాష్ చేసింది కూడా!! భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 489 & 260/5 డిక్లేర్డ్భారత్: 201 & 140ఫలితం: 408 పరుగుల తేడాతో భారత్పై సౌతాఫ్రికా గెలుపుచదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు
స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదుర్కోవడానికి సిద్ధపడింది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా (IND vs SA Tests) చేతిలోనూ అదే చేదు ఫలితం పొందనుంది. గువాహటి వేదికగా ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్ సేన తడబడింది.భారీ ఆధిక్యం లభించినా..బర్సపరా స్టేడియంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు చేసింది. నిజానికి నాలుగో రోజు భారీ ఆధిక్యం లభించినా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంలో ప్రొటిస్ జట్టు ఆలస్యం చేసింది. ఆఖరి రోజు వరకు టీమిండియాను తిప్పలుపెట్టాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సాష్టాంగపడేలా చేస్తాంఈ విషయం గురించి సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ.. టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇలా చేశాము.వాళ్లు బ్యాటింగ్ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి మాదే పైచేయి అవుతుంది’’ అంటూ అవమానకరంగా మాట్లాడాడు.కాస్త హుందాగా ఉండండిఈ నేపథ్యంలో షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ మండిపడ్డారు. అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. ‘‘యాభై ఏళ్ల క్రితం అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ వెస్టిండీస్ జట్టును ఉద్దేశించి ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.విండీస్ అగ్రస్థానానికి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. సౌతాఫ్రికా ఇప్పుడు చారిత్రాత్మక సిరీస్ గెలిచేందుకు చేరువైంది. నిజానికి మీదే పైచేయిగా ఉన్నపుడు.. మీరు మాట్లాడే మాటలు కూడా అంతే హుందాగా ఉండాలి. కోచ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలా ఎవరైనా మాట్లాడతారా?ఇక ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇదే విషయంపై స్పందించాడు. ‘‘ఇది అసలు ఎలాంటి మాట? నిజానికి ఈ విషయంపై స్పందించాలని కూడా నేను అనుకోవడం లేదు. ఇదొక అసందర్భ ప్రేలాపన. సౌతాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం సాధించింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి మాటలను నేను అస్సలు సమర్థించను’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో స్టెయిన్ ఫైర్ అయ్యాడు.ఓటమి అంచున టీమిండియాఇదిలా ఉంటే.. గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఓటమికి చేరువైంది. టీ బ్రేక్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులే చేసింది. విరామం తర్వాత టీమిండియా మరింత కష్టాల్లో కూరుకుపోయింది. 56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు చేసింది. భారత్ విజయానికి 440 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా కేవలం నాలుగు వికెట్లు తీస్తే సిరీస్ సొంతం చేసుకోగలదు. ఇప్పటికే కోల్కతా వేదికగా సౌతాఫ్రికా టీమిండియాపై 30 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. Update: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!చదవండి: టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
రోడ్డు మీద కూడా ఆడలేరా?.. ఈ టెస్టు కూడా పోయినట్లేనా?
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.రోడ్డు మీద కూడా ఆడలేరా?ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్ మీద సఫారీలు రయ్ రయ్మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్వాష్ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చేదు అనుభవం తప్పదా?స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (93) ఇన్నింగ్స్ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగిసఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58)తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఫలితంగా 201 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలగా.. ప్రొటిస్ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.మరోసారి మనోళ్లు ఫెయిల్రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్క్రమ్ (29) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ భారీ హాఫ్ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్ ముల్దర్ (35 నాటౌట్) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి.. యాన్సెన్ బౌలింగ్లో వెనుదిరగగా.. కేఎల్ రాహుల్ 6 పరుగులు చేసి సైమన్ హార్మర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్ 2, కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!చదవండి: పీవీ సింధు ఫిట్నెస్పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు -
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
గువాహటి వేదికగా భారత్తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు.తొలి ఇన్నింగ్స్లో..ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్ను ఫాలో ఆన్ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్నైట్ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.టార్గెట్ ఎంతంటే?తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది సౌతాఫ్రికా. వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్ ముల్డర్ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్-5 జాబితా)🏏1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 403.. భారత్ విజయం (406/4)🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టార్గెట్ 387.. భారత్ విజయం (387/4)🏏2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టార్గెట్ 328.. భారత్ విజయం (329/7)🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 276.. భారత్ విజయం (276/5)🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్లో టార్గెట్ 264.. భారత్ విజయం (264/5).చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి -
గెలుపు జోష్లో ఉన్న ఆసీస్కు అదిరిపోయే శుభవార్తలు
స్వదేశంలో ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)ను ఆస్ట్రేలియా విజయంతో మొదలుపెట్టింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4- 8 వరకు రెండో టెస్టుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు వచ్చేస్తున్నారా!బ్రిస్బేన్లోని గాబా మైదానంలో ఈ డే- నైట్ మ్యాచ్ జరుగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)కు ముందు ఆస్ట్రేలియాకు అదిరిపోయే శుభవార్తలు అందాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా తొడ కండరాల గాయంతో హాజిల్వుడ్ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.మరోవైపు.. ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ సమస్యల వల్ల చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, హాజిల్వుడ్ సిడ్నీలోని క్రికెట్ సెంట్రల్లో బాల్తో ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. కమిన్స్ కూడా పింక్ బాల్తో నెట్స్లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ మాట్లాడుతూ..పూర్తి స్థాయిలో కోలుకుంటేనే‘‘యాషెస్ సిరీస్లో ఏదో ఒక దశలో హాజిల్వుడ్ అందుబాటులోకి వస్తాడని మాకు తెలుసు. అయితే, ఇంకాస్త ముందుగానే అతడు జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక కమిన్స్ రిహాబిలిటేషన్ దాదాపుగా పూర్తై పోయింది.తన బౌలింగ్లో వేగం కనిపిస్తోంది. అతడు సానుకూలంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, కమిన్స్ను మ్యాచ్ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటేనే రంగంలోకి దిగుతాడు’’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు. కాగా యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టులకు జరుగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలో స్టీవెన్ స్మిత్ ఆసీస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.చదవండి: IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే! -
IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మరింతగా పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 395 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. గువాహటి వేదికగా 26/0 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది సౌతాఫ్రికా.ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగాడు. జడ్డూ బౌలింగ్లో మూడో బంతికి షాట్ ఆడబోయి బంతిని గాల్లోకి లేపిన ర్యాన్ రికెల్టన్ (35) సిరాజ్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.ఇక 29వ ఓవర్లో జడ్డూ మార్క్రమ్ (29)ను బౌల్డ్ చేయగా.. 32వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతం చేశాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) రూపంలో కీలక వికెట్ పడగొట్టాడు. వాషీ బౌలింగ్లో లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. 1-0తో ఆధిక్యంలో సౌతాఫ్రికాఇందులో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ మెరుగ్గా రాణించగా.. టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో ప్రొటిస్ జట్టు 489 పరుగులకు ఆలౌట్ అయింది. తేలిపోయిన భారత బ్యాటర్లుఅనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే మొగ్గుచూపింది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. UPDATE: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం 508 పరుగులుస్కోరు: 220/4 (70)చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
విలియమ్సన్ రీఎంట్రీ.. విండీస్తో టెస్టులకు కివీస్ జట్టు ఇదే
వెల్లింగ్టన్: సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) న్యూజిలాండ్ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. విదేశీ లీగ్లలో ఆడేందుకు జాతీయ కాంట్రాక్టుకు దూరమైన విలియమ్సన్... పరిమిత మ్యాచ్ల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో చాలా మ్యాచ్లకు దూరమైన కేన్... వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్ (NZ vs WI Tests)తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆడనున్నాడు. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ సారథ్యంలో..ఇప్పటికే వెస్టిండీస్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన న్యూజిలాండ్... సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లోనూ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. టామ్ లాథమ్ జట్టుకు సారథ్యం వహించనుండగా... కాన్వే, విలియమ్సన్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. ఇక విలియమ్సన్ వంటి అనుభవం గల ఆటగాడు జట్టులో ఉండటం ఇతర ఆటగాళ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని న్యూజిలాండ్ హెడ్కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. పేస్ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్ జట్టులో చోటు దక్కించుకోగా... గాయం నుంచి పూర్తిగా కోలుకోని కైల్ జెమీసన్ను ఈ సిరీస్కు పరిగణించలేదు. వెస్టిండీస్తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
పాపం రాహుల్!.. అంత దూకుడు ఎందుకు?.. కాస్త తగ్గు సిరాజ్!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మూడో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. సోమవారం నాటి ఆట ముగిసే సరికి మొత్తంగా 314 పరుగుల ఆధిక్యం సంపాదించారు.గువాహటి వేదికగా రెండో టెస్టులో భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. బౌలర్ల పేలవ ఆట తీరు వల్ల సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే, ఇదే వేదికపై ప్రొటిస్ బౌలర్లు మాత్రం దుమ్ములేపారు.ఆరు వికెట్లతో చెలరేగి..ముఖ్యంగా పేస్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) ఆరు వికెట్లతో చెలరేగి.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. కీలక వికెట్లు తీసి.. పంత్ సేన 201 పరుగులకే కుప్పకూలడంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మాత్రం తామే బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకోగా.. వికెట్లు తీసేందుకు యత్నించిన బౌలర్లకు ఏమాత్రం కలిసిరాలేదు.పటిష్ట స్థితిలోనే..సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. బర్సపరా స్టేడియంలో సోమవారం ఆట పూర్తయ్యేసరికి ప్రొటిస్ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.కాగా అప్పటికే బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాకు.. మూడో రోజు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో సహజంగానే బౌలర్లు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ కాస్త దూకుడు ప్రదర్శించగా.. కేఎల్ రాహుల్ అతడిని వారించిన తీరు హైలైట్గా నిలిచింది.ఫ్రస్టేషన్లో సిరాజ్ మియా.. వైల్డ్ త్రోప్రొటిస్ రెండో ఇన్నింగ్స్లో సోమవారం నాటి ఆఖరి ఓవర్ (8)ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని రికెల్టన్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. సిరాజ్ బంతిని అందుకున్నాడు. అయితే, అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న సిరాజ్ మియా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపు వైల్డ్గా బాల్ త్రో చేశాడు.పంత్ ఆ బంతిని మిస్ కాగా.. స్లిప్స్లో అతడి వెనకే ఉన్న కేఎల్ రాహుల్ కష్టమ్మీద బంతిని ఒడిసిపట్టాడు. ఆ సమయంలో సిరాజ్ తన దూకుడు పట్ల పశ్చాత్తాపంగా నాలుక కరచుకోగా.. ‘అంత దూకుడు ఎందుకు.. కాస్త తగ్గు.. నెమ్మదిగా వెయ్’ అన్నట్లు రాహుల్ సైగ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.చదవండి: ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లేpic.twitter.com/xq4i771JXV— Nihari Korma (@NihariVsKorma) November 24, 2025 -
ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లే
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్ పారేసుకుని పెవిలియన్ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.దారుణంగా విఫలంసఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.పంత్ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. టెయిలెండర్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్ అనవసరపు షాట్కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్.. యాన్సెన్ బౌలింగ్లో స్లాగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంత్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.ఇలా ఎవరైనా చేస్తారా?కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.అతడిని త్వరగా అవుట్ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్ మ్యాచ్ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షోలో పంత్ షాట్ సెలక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
చరిత్ర సృష్టించిన యాన్సెన్.. పట్టు బిగించిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్ పర్యటనకు వచ్చింది. కోల్కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.సెంచరీ.. జస్ట్ మిస్బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ఆరు వికెట్లు పడగొట్టిఇక ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో చెలరేగిన యాన్సెన్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ (19), జస్ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్.ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్లో టెస్టు మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.పట్టు బిగించిన సౌతాఫ్రికాటీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్లో ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్ -
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం గంభీర్ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను కోల్కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్లో వాషీతో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్ చేశారు.అసలు సెన్స్ ఉందా?ఈ పరిణామాలపై కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.కోల్కతాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి? ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?కోల్కతా టెస్టులో వాషీని వన్డౌన్లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. మరీ అంత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ ఆధిక్యంలో సఫారీ జట్టుకాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ (288) కలుపుకొని.. భారత్ కంటే ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులతో రాణించాడు. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.అయితే, సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్ అయిన యాన్సెన్ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్ సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్తో చెలరేగిపోయాడు.భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.జైసూ హాఫ్ సెంచరీభారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.అంతా ఫెయిల్.. వాషీ ఒక్కడే..వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్కు పంపాడు.ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్.. బుమ్రా (5)ను కూడా అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్ హార్మర్ మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటయ్యా? అంటూ పంత్ సేనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: IND vs SA: పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే? -
బంగ్లాదేశ్ క్లీన్స్వీప్
మిర్పూర్: బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐర్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను బ్లంగాదేశ్ క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ 217 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2–0తో చేజిక్కించుకుంది. 509 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 176/6తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ చివరకు 113.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. కర్టీస్ కాంపెర్ (259 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మ్యాచ్ను ‘డ్రా’ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి చక్కటి పోరాటంతో బంగ్లాదేశ్ను విసిగించాడు. ఆఖరి రోజు దాదాపు 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన అతడు మ్యాచ్ను కాపాడలేకపోయినా... తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్ నీల్ (46 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 85 బంతుల్లో 48 పరుగులు జోడించిన కాంపెర్... ఆ తర్వాత పదో స్థానంలో బ్యాటింగ్కు వచి్చన గవిన్ హోయ్ (104 బంతుల్లో 37; 4 ఫోర్లు)తో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీ 9వ వికెట్కు 191 బంతులాడి 54 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు ఎంతగా పరీక్షిస్తున్నా ఈ జంట సహనం కోల్పోలేదు. దీంతో ఐర్లాండ్ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకునేలా కనిపించినా... హసన్ మురాద్ వరుస బంతుల్లో గవిన్, మాథ్యూ (0)ను అవుట్ చేసి ఐర్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, హసన్ మురాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 476 పరుగులు చేయగా... ఐర్లాండ్ 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బంగ్లా 297/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెరీర్లో వందో టెస్టులో సెంచరీతో మెరిసిన ముష్ఫికర్ రహీమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, తైజుల్ ఇస్లామ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. -
IND vs SA: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరెంతంటే?
టీమిండియాతో రెండో టెస్టులో ఓపెనర్లు సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ కలిసి ఆచితూచి ఆడుతూ తొలి వికెట్కు 161 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. ఎట్టకేలకు టీ విరామ సమయానికి ముందు మార్క్రమ్ను పెవిలియన్కు పంపాడు.ఇదే జోరులో బ్రేక్కు వెళ్లి వచ్చిన వెంటనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మ్యాజిక్ చేశాడు. ర్యాన్ రికెల్టన్ను అవుట్ చేసి భారత్కు రెండో వికెట్ అందించాడు. ఏదేమైనా ఓపెనర్లు మార్క్రమ్- రికెల్టన్ 82 పరుగుల భాగస్వామ్యం కారణంగా సౌతాఫ్రికాకు శుభారంభమే లభించిందని చెప్పవచ్చు.స్టబ్స్, బవుమా నిలకడగా..ఇక ఓపెనర్లు అవుటైన తర్వాత వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబా బవుమా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఫలితంగా భోజన విరామ సమయానికి (మధ్యాహ్నం 1.24 నిమిషాలు) సౌతాఫ్రికా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్టబ్స్ 82 బంతుల్లో 32, బవుమా 86 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచారు.భారత బౌలర్లలో పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా ముందుకు సాగుతోంది. తొలిసారి ఇలాకాగా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి డే మ్యాచ్లో ముందుగా టీ విరామం ఇచ్చి.. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి. గువాహటిలో సూర్యోదయం, సూర్యస్తమయానికి అనుగుణంగా టైమింగ్స్ ఇలా సెట్ చేశారు. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్ -
Ashes: ఇంగ్లండ్ ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలోనే తుది అంకానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లోనూ సత్తా చాటింది.172 పరుగులకే ఆలౌట్తద్వారా.. పేసర్లకు అనుకూలిస్తున్న పెర్త్ పిచ్పై ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఒక రకంగా భారీ లక్ష్యాన్నే విధించింది. కాగా పెర్త్ స్టేడియం (Perth Stadium)లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21)తో పాటు.. ఓలీ పోప్ (46) రాణించగా.. హ్యారీ బ్రూక్ అర్ధ శతకం (52)తో మెరిశాడు.మిగతావారిలో వికెట్ కీపర్ జేమీ స్మిత్ (33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 32.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. డాగెట్ రెండు, గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.తామేమీ తక్కువ కాదని నిరూపించిన ఇంగ్లండ్ బౌలర్లుఅనంతరం తొలి రోజే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు కూల్చారు. దీంతో 123 పరుగులకే ఆసీస్ ఏకంగా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (21), గ్రీన్ (24), అలెక్స్ క్యారీ (26) మాత్రం ఇరవై పరుగుల స్కోరు దాటారు.ఈ క్రమంలో 123/9 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో తొమ్మిది పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. ఫలితంగా నలభై పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాకు ‘కొండంత’ లక్ష్యందీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్కు 205 పరుగుల లక్ష్యం (40+164) విధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 28, పోప్ 33 పరుగులు చేయగా.. టెయిలెండర్లు గస్ అట్కిన్సన్ 37, కార్స్ 20 పరుగులతో సత్తా చాటారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లతో విజృంభించగా.. డాగెట్, స్టార్క్ చెరో మూడు వికెట్లు కూల్చారు.చదవండి: IND vs SA: ఎంత పని చేశావు రాహుల్?!.. బుమ్రా రియాక్షన్ వైరల్ -
ఎంత పని చేశావు రాహుల్?!.. బుమ్రా రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test)కు ఆరంభం నుంచే పెద్దగా కలిసి రావడం లేదు. గువాహటిలో టాస్ ఓడి తొలుత బౌలింగ్కు దిగిన భారత్ టీ విరామ సమయం వరకు కనీసం ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయింది. వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.నిలకడగా ఆడిన ఓపెనర్లుప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించగా.. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయలేక అవస్థలు పడ్డారు. నిజానికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే మార్క్రమ్ను వెనక్కి పంపే సువర్ణావకాశం టీమిండియాకు వచ్చింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏడో ఓవర్ రెండో బంతిని గంటకు 142.5 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.క్యాచ్ జారవిడిచిన రాహుల్ఈ గుడ్లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో ముందుకు వచ్చిన మార్క్రమ్ బ్యాట్ అంచుకు తాకిన బంతి.. గాల్లోకి లేచింది. ఈ క్రమంలో సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ (KL Rahul) తన ఎడమ పక్కకు జరిగిన మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని రీతిలో రాహుల్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బుమ్రా.. ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.KL Rahul dropped the catch of A Markram 🫣#TeamIndia #IndvSA #TestCricket pic.twitter.com/yA8MzTtkWJ— MEHRA (@DevMehra790) November 22, 2025తొలి వికెట్ బుమ్రాకేఇక నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్క్రమ్.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, 27వ ఓవర్ ఐదో బంతికి బుమ్రా అద్భుత బంతితో మార్క్రమ్ను బౌల్డ్ చేశాడు. దీంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ నిష్క్రమించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. భారత్కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది. టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. మార్క్రమ్ (38).. ర్యాన్ రికెల్టన్తో కలిసి తొలి వికెట్కు 82 పరుగులు జోడించాడు. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ సమం చేసి పరువు నిలుపుకోగలుగుతుంది.చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అక్షర్పై వేటు.. నితీశ్ రెడ్డితో పాటు అతడి ఎంట్రీ
టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బర్సపరా వికెట్ ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలిస్తుందనే అంచనాతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొటిస్ జట్టు కెప్టెన్ తెంబా బవుమా తెలిపాడు. పిచ్పై ప్రస్తుతానికి పగుళ్లు లేవన్న బవుమా.. ఈ వికెట్పై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉన్నామని పేర్కొన్నాడు.గువాహటి వేదికగా జరిగే చారిత్రాత్మక తొలి టెస్టులో తాము భాగం కావడం సంతోషంగా ఉందని బవుమా హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. సెనురాన్ ముత్తుస్వామి జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరుటీమిండియా రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో రిషభ్ పంత్ పగ్గాలు చేపట్టాడు. బీసీసీఐ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.గిల్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశామన్న పంత్.. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్ను తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇక తొలిసారి భారత జట్టు టెస్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్న పంత్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. టాస్ ఓడటంపై స్పందిస్తూ.. బర్సపరా వికెట్ బ్యాటింగ్కు బాగుంటుందన్న పంత్.. బౌలింగ్ కూడా మరీ అంత చెత్త ఆప్షన్ ఏమీ కాదన్నాడు. శుబ్మన్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరతాడని పంత్ తెలిపాడు.టీమిండియాకు చావోరేవోఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టు జరుగగా.. భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక గువాహటి వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో పంత్ సేన చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై సఫారీల చేతిలో వైట్వాష్ కాకతప్పదు. మరోవైపు.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడటంతో పాటు.. తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో గువాహటి పిచ్ను ఎర్రమట్టితో తయారు చేయించినట్లు తెలుస్తోంది. తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ వికెట్.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ టాస్ ఓడటం భారత జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేభారత్కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.Updates: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 156-2(55)స్టబ్స్ 32, బవుమా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.డ్రింక్స్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 129-2 (42)బవుమా 24, స్టబ్స్ 19 పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా27.2: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన రికెల్టన్ (82 బంతుల్లో 35).టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరు: 82-1 (26.5).ట్రిస్టన్ స్టబ్స్ 0, రికెల్టన్ 35 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా26.5: బుమ్రా బౌలింగ్లో మార్క్రమ్ (81 బంతుల్లో 38) బౌల్డ్.చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్లో టీమిండియా ఓటమి🚨 Toss 🚨#TeamIndia have been asked to bowl first Updates ▶️ https://t.co/Wt62QebbHZ#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/isE64twdaB— BCCI (@BCCI) November 22, 2025 -
IND vs SA: అతడిపై వేటు.. భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరు!
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహటి వేదికగా శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడం ఆందోళనకరంగా పరిణమించింది.గిల్ స్థానంలో రిషభ్ పంత్ (Rishabh Pant)ను బీసీసీఐ తాత్కాలిక కెప్టెన్గా నియమించింది. అయితే, తుదిజట్టులో గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పంత్ స్పందిస్తూ.. తాము ఇప్పటికే గిల్ రీప్లేస్మెంట్ గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ ఆటగాడి పేరు మాత్రం వెల్లడించలేదు.ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం (Saba Karim) కీలక వ్యాఖ్యలు చేశాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లను ఆడించాలని సూచించాడు. అదే విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వాలని పేర్కొన్నాడు.ఇందులో భాగంగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై వేటు వేయక తప్పదని సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అయితే, ఇలాంటి సమయంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్తో పాటు దేవ్దత్ పడిక్కల్ను కూడా తీసుకుంటే మంచిది.అతడిపై వేటు వేయాల్సి వస్తుందిఆరు స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగాలి. గువాహటిలో గెలవాలంటే ఇదే సరైన కాంబినేషన్. కాబట్టి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తప్పించకతప్పదు. బ్యాటింగ్, బౌలింగ్లో వైవిధ్యం కోసం అతడిపై వేటు వేయాల్సి వస్తుంది.కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ల కోటాలో తుదిజట్టులో ఉంటారు. ఇక పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ఉండనే ఉన్నారు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. సాయి, పడిక్కల్ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు లెఫ్ట్- రైట్ కాంబినేషన్ సెట్ అవుతుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో ఆరుగురుకాగా కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్.. సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తొలి టెస్టులో భారత్ ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.చదవండి: గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ -
గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ
హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.గంభీర్ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్వాష్ అయింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి ఫామ్లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది. వేళ్లన్నీ గంభీర్ వైపేకోల్కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు.ఈ క్రమంలో గంభీర్ కూడా పిచ్ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘మా సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.అయితే, ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్కోచ్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.అదే విధంగా.. ఆసియా టీ20 కప్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్ సైకియా.. గంభీర్, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు. కాగా గంభీర్ గైడెన్స్లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్ -
ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా సారథిగా రిషభ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్.. తనకు కెప్టెన్గా అవకాశం ఇచ్చినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ధన్యవాదాలు తెలిపాడు.నా కెప్టెన్సీ అలాగే ఉంటుందిటీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్.. గువాహటి టెస్టులో తమ తుదిజట్టు కూర్పు గురించి స్పందించాడు. ‘‘మా బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాం.పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏదేమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడి దరిచేరనీయము. నా కెప్టెన్సీ సంప్రదాయబద్దంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్-ఆఫ్-ది- బాక్స్ కూడా ఆలోచిస్తా.ఆడాలని ఉన్నా..నిజానికి రెండో టెస్టులో ఆడాలని శుబ్మన్ ఎంతగానో పరితపించాడు. కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకూ ఇది ప్రత్యేకం.పిచ్ తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండవచ్చు. ఆతర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ మార్గదర్శనంలో ఆల్రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ..‘‘జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్టు ప్లేయర్ల కంటే కూడా ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీమ్ బ్యాలెన్స్ దృష్ట్యానే ఆల్రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప.. టెస్టు స్పెషలిస్టులను పక్కనపెట్టాలని కాదు’’ అని పంత్ స్పష్టం చేశాడు.ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాంఅదే విధంగా.. గిల్ స్థానంలో తుదిజట్టులోకి ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్ ప్లేస్లో ఎవరు ఆడతారో.. ఆ ప్లేయర్కు తెలుసు’’ అంటూ తాత్కాలిక కెప్టెన్ పంత్ మాట దాటవేశాడు. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా కోల్కతాలో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిస్తేనే టీమిండియా పరువు నిలుస్తుంది.ఇక కోల్కతా టెస్టులో టీమిండియా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లను ఆడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శుబ్మన్ గిల్ సఫారీలతో తొలి టెస్టులో భాగమయ్యారు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ -
ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్కు గంభీర్ సలహా ఇదే
టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill). భారత జట్టు టెస్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్గానూ పగ్గాలు చేపట్టాడు. ఇక అంతకంటే ముందే ఆసియా కప్-2025 సందర్భంగా టీమిండియా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.విరామం లేని షెడ్యూల్ఇలా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న గిల్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా ఆట మధ్యలోనే నిష్క్రమించి.. మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. ఐసీయూలో చికిత్స పొందిన ఈ కెప్టెన్ సాబ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫలితంగా గువాహటిలో సఫారీలతో జరిగే రెండో టెస్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కాగా నిద్రలేమి, అవిశ్రాంతంగా ఆడటం వల్లే గిల్ మెడ నొప్పి తీవ్రమైందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే.. పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సైతం పనిభారం తగ్గించుకునే క్రమంలో ఇంగ్లండ్లో ఐదింటికి కేవలం రెండే టెస్టులు ఆడిన విషయం తెలిసిందే.వారికి విశ్రాంతిఅంతేకాదు.. సౌతాఫ్రికాతో టీ20లకు కూడా బుమ్రా దూరంగా ఉండనున్నాడని.. అతడితో పాటు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు కూడా సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మరోసారి చర్చ మొదలైంది.ఈ విషయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) వైఖరి ఏమిటన్న ప్రశ్నలు మొదలుకాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాను ఈ విషయం గురించి గంభీర్తో చర్చించినపుడు ఆటగాళ్లను ఉద్దేశించి అతడు ఓ కీలక సూచన చేశాడని తాజాగా వెల్లడించాడు.ఐపీఎల్ ఆడకపోతే సరిజియోస్టార్తో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ‘‘వెస్టిండీస్తో టీమిండియా టెస్టు మ్యాచ్ సందర్భంగా నేను గౌతమ్ను ఓ ప్రశ్న అడిగాను. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు ఏం చేయాలంటారు? అని అడిగాను. అందుకు అతడు.. ‘ఐపీఎల్ ఆడకపోతే సరి’ అని సమాధానం ఇచ్చాడు.‘ఐపీఎల్లో కెప్టెన్గా ఉంటే.. అదనపు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటపుడు సారథిగా ఉండకుండా పగ్గాలు వదిలేయడం ఇంకా మంచిది. ఒకవేళ టీమిండియా కోసం ఆడాలనుకుంటే.. ఫిట్గా ఉండటంతో పాటు మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి.అలా జరగాలంటే ఐపీఎల్ వంటి టోర్నీలను వదిలేస్తే సరి’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు’’ అని తెలిపాడు. ఏదేమైనా టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు అదనపు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుస సిరీస్లు ఆడగలరని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మానసికంగా బలంగా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్కు విరామం ఇవ్వాల్సిన అవసరం రాదని అభిప్రాయపడ్డాడు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ -
శుబ్మన్ గిల్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. అంతేకాదు అతడు జట్టును వీడి తిరిగి ముంబైకి పయనమైనట్లు సమాచారం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియాతో రెండు టెస్టులు (IND vs SA) ఆడేందుకు సౌతాఫ్రికా ఇక్కడకు వచ్చింది.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. కోల్కతా వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగగా సౌతాఫ్రికా టీమిండియాపై ముప్పై పరుగుల తేడాతో గెలిచింది. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది.ఆ మరుసటి రోజు గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు వెల్లడించింది. అయితే, మెడ నొప్పి ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో టెస్టుకు గిల్ దూరమవుతాడనే అంచనాలు రాగా.. అనూహ్యంగా అతడు జట్టుతో పాటు గువాహటికి ప్రయాణం చేశాడు. తద్వారా మ్యాచ్కు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు.అయితే, గిల్ ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు ఫిజియోలు, వైద్యులు నిర్ణయించలేదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ గురువారం మీడియా సమావేశంలో తెలిపాడు. శుక్రవారం సాయంత్రానికి గిల్ పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు. తాజా సమాచారం ప్రకారం గిల్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.జట్టు నుంచి రిలీజ్!టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ గిల్ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. కోలుకునే దశలో భాగంగా అతడిని మళ్లీ ముంబైకి పంపించినట్లు తెలుస్తోంది. బోర్డు సూచన మేరకు కొన్నాళ్ల పాటు గిల్ ముంబైలో డాక్టర్ దిన్షా పార్థీవాలా పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం. రికవరీని బట్టి గిల్ సౌతాఫ్రికాతో వన్డేలు ఆడతాడా? లేదా? అన్న విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుంది. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై టెస్టులలో మరో ఘోర పరాభవం తప్పదు.చదవండి: IND vs SA: 'నీ ఈగోను పక్కన పెట్టు'.. టీమిండియా ఓపెనర్కు వార్నింగ్ -
Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ (The Ashes) తాజా ఎడిషన్ శుక్రవారం మొదలైంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుని.. ఆతిథ్య ఆసీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆదిలోనే ఇంగ్లండ్కు కోలుకోలేని షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేశాడు. స్టార్క్ బౌలింగ్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చిన క్రాలీ.. ఆరు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.ముచ్చటగా మూడుఅనంతరం ఏడో ఓవర్ నాలుగో బంతికి స్టార్క్ మరోసారి తన బౌలింగ్ పదును చూపించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇదే జోరులో తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి మరో కీలక వికెట్ను స్టార్క్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ను స్టార్క్ డకౌట్ చేశాడు.వంద వికెట్ల క్లబ్లోతద్వారా మూడు కీలక వికెట్లు కూల్చిన స్టార్క్.. యాషెస్ సిరీస్లో ఓవరాల్గా వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆస్ట్రేలియన్గా... అదే విధంగా.. 21వ బౌలర్గా ఈ లెఫ్టార్మ్ పేసర్ చరిత్రకెక్కాడు. కేవలం 23 టెస్టుల్లోనే (యాషెస్) స్టార్క్ వంద వికెట్ల క్లబ్లో చేరడం విశేషం.అంతేకాదు.. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా కర్ట్లీ ఆంబ్రోస్ రికార్డును కూడా స్టార్క్ సమం చేశాడు. టెస్టుల్లో 405 వికెట్లు పూర్తి చేసుకుని.. ఆంబ్రోస్ సరసన నిలిచాడు. తద్వారా వసీం అక్రం (పాకిస్తాన్- 414) తద్వారా అత్యధిక టెస్టు వికెట్లు కూల్చిన రెండో లెఫ్టార్మ్ పేసర్గా స్టార్క్ రికార్డు సాధించాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్తో యాషెస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్ ఇప్పటికే 110 వికెట్లు పూర్తి చేసుకోగా.. స్టార్క్ తాజాగా 100 వికెట్ల క్లబ్లో చేరాడు.ఇక స్టార్క్తో పాటు కామెరాన్ గ్రీన్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. నిలకడగా ఆడుతున్న వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (46)ను గ్రీన్ ఎల్బీడబ్ల్యూ చేసి ఆసీస్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేసింది.UPDATE: ఏడేసిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన ఇంగ్లండ్చదవండి: SL vs ZIM: శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే -
అది ఎవరి పని?.. బీసీసీఐ తీరుపై మండిపడ్డ మాజీ క్రికెటర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి మండిపడ్డాడు. సీనియర్ ఆటగాళ్ల విషయంలో మేనేజ్మెంట్ వైఖరి సరిగా లేదని విమర్శించాడు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని సాకులు చెబుతూ కావాలనే పక్కకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఇక అతడు టెస్టులు ఆడి రెండేళ్లకు పైగానే గడిచిపోయింది. అంతర్జాతీయ టీ20లలో కూడా షమీకి ప్రాధాన్యం దక్కడం లేదు. అయితే, వన్డేల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచి మేనేజ్మెంట్ అతడిని పక్కనపెట్టింది.మాటల యుద్ధంఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- షమీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. షమీ ఫిట్గా లేడంటూ అగార్కర్ చెప్పగా.. రంజీల్లో బెంగాల్ తరఫున వికెట్లు తీస్తూ షమీ ఆటతో కూడా అతడికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇక రంజీల్లో సత్తా చాటినప్పటికీ సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు షమీని ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ మాజీ ఆటగాడు మనోజ్ తివారి తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా సర్కిల్లో పరస్పర నమ్మకం, అర్ధం చేసుకునే తత్వం కొరవడిందని అనిపిస్తోంది. దేశీ క్రికెట్లో బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ నిలకడగా ఆడుతూ వికెట్లు తీస్తున్నాడు.కానీ టెస్టులకు అతడిని అసలు ఎంపిక చేయడమే లేదు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలకు కూడా అతడిని సెలక్ట్ చేయలేదు. షమీ ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని చీఫ్ సెలక్టర్ బహిరంగంగా చెబుతాడు.అది ఎవరి పని?అయినా.. ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి అడగాల్సిన బాధ్యత ఎవరిదో అతడికి తెలియదా?.. ఫిజియోలు, ట్రెయినర్లు ఏం చేస్తున్నారు? వారే కదా ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి ఆరా తీసి సెలక్టర్లకు చెపాల్సింది. ఇప్పటికైనా మీకు ఫోన్లను కాస్త వాడండి. ఆటగాళ్లకు కాల్ చేసి వారి నుంచి సమాధానం తెలుసుకోండి.షమీ చాలా ఏళ్లుగా జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడికి కనీస గౌరవం ఇవ్వండి. అతడికి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. కోచ్, సెలక్షన్ కమిటీ నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత అది’’ అని మనోజ్ తివారి టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. కోల్కతా వేదికగా తొలిటెస్టులో సఫారీ జట్టు చేతిలో ముప్పై పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటి వేదిక.చదవండి: IPL 2026: ‘సన్రైజర్స్కు అతడు దొరకడు.. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’ -
గిల్ స్థానంలో అతడే ఆడతాడు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆడతాడా? లేదా? అన్న సందిగ్దం నెలకొంది. కోల్కతాలో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పి కారణంగా గిల్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు.అయితే, గిల్ మెడ నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఇంకా పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలోనే అతడు గువాహటి టెస్టు ఆడడనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) గురువారం స్పందించాడు.కెప్టెన్ కోలుకుంటున్నాడు‘‘గిల్ కోలుకుంటున్నాడు. నిన్ననే అతడిని కలిశాను. తనకు పెద్దగా సమస్య లేదు. అయితే, అతడు ఆడతాడా? లేదా అన్న అంశంపై శుక్రవారం సాయంత్రమే స్పష్టత వస్తుంది. ఫిజియోలు, డాక్టర్ల నిర్ణయాన్ని బట్టే అతడి ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ప్రస్తుతానికి గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ మ్యాచ్ సమయంలో నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలను కొట్టిపడేయలేము. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే కచ్చితంగా అతడికి విశ్రాంతినిస్తాం. ఏదేమైనా కీలక బ్యాటర్, కెప్టెన్గా గిల్ సేవల్ని మాత్రం మేము కోల్పోతాము.అయినా మరేం పర్లేదు. ఒకవేళ గిల్ ఆడకపోయినా.. మాకు చాలా మంది బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్లంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లే. జట్టు కోసం వచ్చి ఆడతారు. గిల్ ఆడాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే, అతడి ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.గిల్ స్థానంలో అతడే ఆడతాడుగిల్ ఆడే నాలుగో స్థానంలో ధ్రువ్ జురెల్ అందుబాటులో ఉండనే ఉన్నాడు. అయితే, గిల్ ప్లేస్లో తుదిజట్టులోకి ఎవరు వస్తారనేది రేపే నిర్ణయిస్తాం’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇదిలా ఉంటే.. కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలో గెలిస్తేనే రెండు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 1-1తో సమం చేయగలదు.చదవండి: IPL 2026: ‘సన్రైజర్స్కు అతడు దొరకడు.. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’ -
గంభీర్ మాస్టర్ ప్లాన్తో వాళ్లకు చెక్!.. ఎవరీ మిస్టరీ స్పిన్నర్?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఊహించని ఫలితాన్ని పొందింది. ప్రొటిస్ బ్యాటర్ల కోసం బిగించిన స్పిన్ ఉచ్చులో.. మనవాళ్లే చిక్కుకుపోయి విలవిల్లాడారు. సఫారీ స్పిన్నర్లు సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) ధాటికి తాళలేక చేతులెత్తేశారు.కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 93 పరుగులకే కుప్పకూలి ఓటమిని ఆహ్వానించారు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో పిచ్ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో గువాహటిలో సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాతక్మకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ను సమం చేయగలుగుతుంది. ఇలాంటి తరుణంలో బర్సపరా క్రికెట్ మైదానంలో ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని బీసీసీఐ సంకల్పించింది.ఈ నేపథ్యంలో పేస్తో పాటు ఎక్కువగా బౌన్స్ అవుతూ.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ను క్యూరేటర్ రూపొందించినట్లు సమాచారం. ఇలాంటి వికెట్పై పరుగులు రాబట్టే క్రమంలో టీమిండియా బ్యాటర్లు.. ఈడెన్ గార్డెన్స్లోనే ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా మంగళవారం ఓ ప్రత్యేక బౌలర్ను భారత బ్యాటర్లు ఎదుర్కొన్నారు.అతడు మరెవరో కాదు.. బెంగాల్ మిస్టరీ స్పిన్నర్ కౌశిక్ మెయిటీ. రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల సవ్యసాచి. కుడి చేతితో ఆఫ్ స్పిన్.. ఎడమ చేతితో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల కౌశిక్ను పిలిపించాలన్నది హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచన అని సమాచారం. గతంలో పలు ఐపీఎల్ జట్లకు నెట్ బౌలర్గా కౌశిక్ మెయిటీ పనిచేశాడు.అయితే, టీమిండియాకు నెట్స్లో కౌశిక్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. 26 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. నెట్స్లో లెఫ్టాండర్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దేవ్దత్ పడిక్కల్కు ఆఫ్ స్పిన్ వేశాడు. అదే విధంగా.. కుడిచేతి వాటం గల బ్యాటర్లు ధ్రువ్ జురెల్ వంటి వాళ్లను లెఫ్టార్మ్ స్పిన్తో తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో హార్మర్, మహరాజ్లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల విలక్షణ నైపుణ్యం కలిగిన కౌశిక్ మెయిటీ కారణంగా టీమిండియాకు అన్ని రకాలుగా సిద్ధమయ్యే అవకాశం దొరికింది. కాగా కోల్కతాకు చెందిన కౌశిక్ మెయిటీ దేశీ క్రికెట్లో ఎనిమిది లిస్ట్-ఎ మ్యాచ్లతో పాట మూడు టీ20 మ్యాచ్లు ఆడి.. మొత్తంగా పదకొండు వికెట్లు కూల్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియాకు నెట్స్లో బౌలింగ్ చేసే అవకాశం రావడంపై కౌశిక్ మెయిటీ స్పందిస్తూ.. ‘‘మొదటిసారి భారత బ్యాటర్లకు నెట్స్ బౌలింగ్ చేశాను. కల నిజమైన అనుభూతి కలిగింది. నేను జడ్డూ భాయ్కు బౌలింగ్ చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.తాను బౌలింగ్ చేస్తున్నపుడు గౌతం గంభీర్ కానీ.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని.. తనను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనిచ్చారని మెయిటీ తెలిపాడు. తన సహజ నైపుణ్యాలపై నమ్మకం ఉంచినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. జడేజా తనకు కొన్ని సూచనలు ఇచ్చాడని.. ఈ ట్రెయినింగ్ సెషన్ తనకు సరికొత్త అనుభవం, అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు. -
శుబ్మన్ గిల్ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక అప్డేట్ అందించింది. గిల్ గువాహటికి ప్రయాణం చేస్తాడని స్పష్టం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.మెడ నొప్పి తీవ్రం కావడంతోఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ భారత తొలి ఇన్నింగ్స్ సమయంలో గాయపడ్డాడు. మెడ నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడాడు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గిల్ను ఆస్పత్రికి తరలించిన బీసీసీఐ.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది.ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉంది. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ మెడ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు. దీంతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో గిల్ విమాన ప్రయాణం చేస్తే.. నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం బయటకు వచ్చింది.దీంతో సౌతాఫ్రికాతో గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గిల్ అందుబాటులో ఉండడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా గిల్ ఆరోగ్యం గురించి కీలక అప్డేట్ అందించింది.శుబ్మన్ గిల్ వెళ్తాడు.. కానీఈ మేరకు.. ‘‘కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాము.మరుసటి రోజు అతడు డిశ్చార్జ్ అయ్యాడు. చికిత్సకు గిల్ స్పందిస్తున్నాడు. నవంబరు 19న జట్టుతో కలిసి అతడు గువాహటికి ప్రయాణం చేస్తాడు. అయితే, బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. పరిస్థితిని బట్టి అతడిని రెండో టెస్టులో ఆడించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటాం’’ అని బీసీసీఐ బుధవారం నాటి ప్రకటనలో పేర్కొంది.చదవండి: ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే.. -
అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?.. గంభీర్పై డీకే ఫైర్!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను పక్కనపెట్టడం.. మూడో స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కూడా ఈ జాబితాలో చేరాడు. గంభీర్ నిర్ణయం వల్ల వాషింగ్టన్ సుందర్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లేనిపోని ఆందోళనలతో అతడు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.టాపార్డర్కు ప్రమోట్కాగా సౌతాఫ్రికాతో కోల్కతా వేదికగా భారత తుదిజట్టులో తమిళనాడు ప్లేయర్ సాయి సుదర్శన్కు చోటు ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను కాదని.. మరో తమిళనాడు ఆటగాడు, ఎడమచేతి వాటం ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేశారు.ఈ క్రమంలో.. బ్యాటింగ్కు అనుకూలించని పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు వాషీ. అయితే, బంతితో మాత్రం ఈ స్పిన్ ఆల్రౌండర్ రాణించలేకపోయాడు. ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో ఒకే ఒక్క ఓవర్ వేసి మూడు పరుగులు ఇచ్చిన వాషీకి.. రెండో ఇన్నింగ్స్లో అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు.ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్.. టెస్టు ప్లేయర్.. అతడు బ్యాటింగ్ చేయగల బౌలరా? అతడిని మీరు మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. తద్వారా.. పరోక్షంగా ‘నువ్వు బ్యాటింగ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టు’ అనే సందేశం ఇచ్చారు.అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?బ్యాటింగ్ ప్రాక్టీస్లో గంటలు గంటలు తలమునకలైదే.. బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గించాల్సి వస్తుంది. రెండూ సమానంగా చేయాలంటే శారీరకంగా మరింత శ్రమించక తప్పదు. టాపార్డర్కు ప్రమోట్ చేయడం ద్వారా.. ‘నీ నుంచి ఎక్కువ పరుగులు ఆశిస్తున్నాం’ అని చెబితే.. అతడు గందరగోళానికి గురవ్వచ్చు.అతడి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారవచ్చు’’ అంటూ గంభీర్ తీరును డీకే విమర్శించాడు. కాగా తొలి టెస్టులో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గువాహటి వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ఆరంభానికి షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడాడు. ఓ సెంచరీ సాయంతో టెస్టుల్లో 821 పరుగులు చేసిన వాషీ.. ఇప్పటికి 35 వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
సుదీర్ఘ కెరీర్లో బంగ్లాదేశ్ క్రికెట్కు మూలస్థంభంలా నిలిచిన ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఢాకా వేదికగా బుధవారం ఐర్లాండ్ (BAN vs IRE Test)తో మొదలైన టెస్టు మ్యాచ్ అతడి కెరీర్లో 100వది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ గుర్తింపు పొందాడు.కాగా 18 ఏళ్ల 17 రోజుల వయసులో మొదటి టెస్టు ఆడిన ముష్ఫికర్ రహీమ్.. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం (Lord's Stadium)లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాతి రోజుల్లో బంగ్లా తరఫున అత్యంత కీలక ఆటగాడిగా అతడు ఎదిగాడు. మిడిలార్డర్ బ్యాటర్గాటెస్టుల్లో పెద్ద స్థాయికి చేరలేకపోయిన తన టీమ్ వరుస పరాజయాల్లో భాగమైన రహీమ్...జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాతవికెట్ కీపర్గా జట్టులోకి వచ్చినా... క్రమేణా తన బ్యాటింగ్కు మెరుగులు దిద్దుకొని కీపింగ్ వదిలేసి రెగ్యులర్ మిడిలార్డర్ బ్యాటర్గా ముష్ఫికర్ రహీమ్ సత్తా చాటాడు. సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న (20 ఏళ్ల 5 నెలల 25 రోజులు) ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున 99 టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ 38.02 సగటుతో 6351 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్కు 34 టెస్టుల్లో కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన అతడు ...55 టెస్టుల్లో వికెట్ కీపర్గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఐర్లాండ్రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సెల్హైట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్.. ఐరిష్ జట్టును ఇన్నింగ్స్ మీద 47 పరుగుల తేడాతో ఓడించింది.ఇక బంగ్లా- ఐర్లాండ్ మధ్య బుధవారం ఢాకా వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఓపెనర్లలో మహ్ముదుల్ హసన్ జాయ్ 34, షాద్మాన్ ఇస్లాం 35 పరుగులు చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో (8) విఫలమయ్యాడు.వన్డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ (17*)కు తోడుగా ముష్ఫికర్ రహీమ్ (3*) క్రీజులో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ ఆండీ మెక్బ్రిన్ మూడు వికెట్లు కూల్చాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! -
‘టీమిండియా హెడ్కోచ్గా అతడు ఉంటే బాగుండేది’
గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ చేదు ఫలితమే చవిచూసింది.30 పరుగుల తేడాతోకోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలో సఫారీలు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రొటిస్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో టీమిండియా కూరుకుపోయింది.కాగా గంభీర్ హెడ్కోచ్గా నియమితుడైన తర్వాత టెస్టుల్లో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను మాత్రమే ఓడించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లండ్ టూర్లో 2-2తో సిరీస్ను సమం చేసుకుంది.జీర్ణించుకోలేకపోతున్నాంఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్.. కోచ్ గంభీర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకపక్ష నిర్ణయాలతో కోచ్లను నియమిస్తే ఇలాగే ఉంటుందటూ బీసీసీఐని విమర్శించాడు. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్లో ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని.. కోచ్ల నియామకంలో పారదర్శకత ప్రదర్శిస్తే బాగుండేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.పెద్దగా బాధపడే వారు కాదు.. కానీ ఈసారిఅదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరును కైఫ్ తెరమీదకు తెచ్చాడు. ఈ మేరకు.. ‘‘అవును.. స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడితే కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. గతంలో.. ఆస్ట్రేలియా పర్యటన అంటే ఓటమి ఖరారు అనే భావన ఉండేది. ముందుగానే అభిమానులు కూడా ఫిక్స్ అయ్యే వారు కాబట్టి పెద్దగా బాధపడే వారు కాదు.ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఓటమిని మరీ ఎక్కువగా మనసుకు తీసుకునేవారు కాదు. కానీ మన సొంతగడ్డపై ఇలా మ్యాచ్లు ఓడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సౌతాఫ్రికా మన కోటను బద్దలు కొట్టింది. న్యూజిలాండ్ గతంలోనే వైట్వాష్ చేసింది.ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు..కాబట్టి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు అందరికీ గుర్తుకువస్తుంది. అయన లాంటి మరికొందరి పేర్లు కూడా కోచింగ్ పోటీదారుల జాబితాలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. నిజానికి కోచింగ్ ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తారు.ఇంటర్వ్యూ ద్వారా కోచ్ను సెలక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ.. దరఖాస్తులు ఆహ్వానించినా తమకు నచ్చిన వారి కోసం.. మిగతా వారిని నిర్దద్వంగా తిరస్కరిస్తున్నారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ లేకుండానే కోచ్ను ఎంపిక చేస్తున్నారు. అలాంటపుడు ఎవరు మాత్రం ఎందుకు ముందుకు వస్తారు?పారదర్శకత లేదుతమ దరఖాస్తు తిరస్కరణకు గురి అవుతుందని కచ్చితంగా తెలిసిన తర్వాత అవమానపడాలని ఎందుకు అనుకుంటారు?.. అక్కడ పారదర్శకత లేదని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని కైఫ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించాడు.కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా ఉన్న సమయంలో.. హైదరాబాదీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బ్యాకప్ కోచ్గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్గా పనిచేస్తున్నాడు. కోచింగ్ పరంగా వీవీఎస్కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కైఫ్ ఈ మేరకు అతడు హెడ్కోచ్గా వస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇంతకుముందు ఎలాంటి కోచింగ్ అనుభవం లేకుండానే గంభీర్ నేరుగా టీమిండియా హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే.చదవండి: IND vs SA: సిరీస్ సమమా? సమర్పణమా? -
శుబ్మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతడు ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ఇంకా కనీసం మూడు, నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.ఊహించని ఆటగాడుగిల్ ప్రస్తుతం విమానంలో ప్రయాణించే పరిస్థితి లేదు కాబట్టి.. గువాహటి వేదికగా రెండో టెస్టు (IND vs SA 2nd Test)కు అతడు దూరమయ్యే పరిస్థితి ఉందని బీసీసీఐ అధికారి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తుదిజట్టులో గిల్ స్థానాన్ని మేనేజ్మెంట్ ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ జరుగుతుండగా.. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఊహించని ఆటగాడి పేరు తెరపైకి తెచ్చాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను టెస్టు జట్టులోకి తీసుకోవాలా? ఈ మాట వింటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఇప్పటికే సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ఎంపిక చేసిన తర్వాత రుతు పేరెందుకు? అని మీరు అడుగవచ్చు.సాయి, పడిక్కల్ కాదు!రెండో టెస్టులో గిల్ ఆడతాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మెడ నొప్పి ఇంకా తగ్గలేదనే సమాచారం ఉంది. ఒకవేళ అతడు మ్యాచ్కు పూర్తిగా దూరమైతే.. సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్లో ఒకరిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుంటారా?ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్టాండర్లు ఉన్నారు. మరి అలాంటపుడు మరో ఇద్దరు లెఫ్టాండర్ల (సాయి, పడిక్కల్)లలో ఒకరివైపు మొగ్గుచూపుతారా? అలాంటపుడు మొత్తంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఆడించాల్సి వస్తుంది.రుతు బెస్ట్.. ఎందుకంటే?అలాంటపుడే బెటర్ ఆప్షన్ కోసం చూడాలి. రుతురాజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. భారత్-‘ఎ’ తరఫున వైట్బాల్ క్రికెట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లలో అదరగొడుతున్నాడు. రంజీ, దులిప్ ట్రోఫీ వంటి రెడ్బాల్ టోర్నీల్లోనూ పరుగులు రాబడుతున్నాడు.మిడిలార్డర్లోనూ రుతు బ్యాటింగ్ చేయగలడు. అతడి టెక్నిక్ కూడా బాగుంటుంది. నిజానికి టెస్టులకు అతడు సరైన ఆప్షన్. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్లో ఇదే వేదిక (గువాహటి)పై రుతు సెంచరీ చేశాడు. కాబట్టి శుబ్మన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో లేకుంటే.. రుతురాజ్ను తీసుకువస్తే బాగుంటుంది’’ అంటూ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది? -
చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్.. గంభీర్ చర్య వైరల్
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA 1st Test) చేదు ఫలితాన్ని చవిచూసింది. సొంతగడ్డపై చతికిల పడి సఫారీల చేతిలో ఓటమిపాలైంది. కోల్కతాలో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో గిల్ సేన ముప్పై పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ (Eden Gardens Pitch)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోవడం.. నాలుగు ఇన్నింగ్స్లో ఒకే ఒక్క అర్ధ శతకం నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఘాటుగానే స్పందించాడు. టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగానే తమ క్యూరేటర్ పిచ్ తయారుచేశాడని కౌంటర్ ఇచ్చాడు.సంతృప్తిగానే గంభీర్ఈ క్రమంలో తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందిస్తూ.. ‘‘ఈ పిచ్పై పరుగులు రాబట్టవచ్చు. అయితే, మా వాళ్లు డిఫెన్స్ సరిగ్గా ఆడలేకపోయారు’’ అని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తప్పేమీ లేదన్నట్లు అతడిని సమర్థించాడు. ఇక భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం (నవంబరు 22) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక.ఆలింగనం చేసుకున్న గౌతీఅయితే, టీమిండియా మాత్రం ఇంకా కోల్కతాలోనే ఉంది. అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పట్ల గంభీర్ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. సుజన్ను ఆలింగనం చేసుకున్న గంభీర్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. తద్వారా తమ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు.చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శల నేపథ్యంలో సుజన్ ముఖర్జీ టైమ్స్ నౌ బంగ్లాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు పిచ్ గురించే ప్రశ్నిస్తున్నారు. టెస్టు మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ తయారుచేయాలో నాకు బాగా తెలుసు. అదే విధంగా తొలిటెస్టుకూ పిచ్ను రూపొందించాను.జట్టు కోరినట్లుగానే పిచ్ తయారు చేశా. వేరే వాళ్లు ఏదో చెప్పారని నేను చేయను. అది సరైంది అనిపిస్తేనే చేస్తా. ఏదేమైనా నా పనిని పూర్తి అంకితభావంతో పూర్త చేస్తా. భవిష్యత్తులోనూ నా వైఖరి ఇలాగే ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు.చదవండి: నేనేమీ హర్మన్ప్రీత్ కౌర్ని కాదు.. అలా ఎందుకు చేస్తా?: బంగ్లా కెప్టెన్ ఓవరాక్షన్ -
వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ను టీమిండియా ఓటమి (IND vs SA)తో ఆరంభించింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.అందుకే ఓడిపోయాంఈ నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Risbah Pant) ఓటమిపై స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లమని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.వాళ్లిద్దరు అద్భుతంఈ మేరకు.. ‘‘124 పరుగుల టార్గెట్ను మేము ఛేదించి ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే, మేము దానిని అధిగమించలేకపోయాము. తెంబా, బాష్.. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్ను తమ వైపునకు తిప్పేసుకున్నారు.ఇలాంటి పిచ్పై 120 పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో సఫలం కాలేకపోయాము. మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.బవుమా ఫిఫ్టీ.. నిలబడిన బాష్కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోయింది. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన సఫారీ జట్టుకు కెప్టెన్ తెంబా బవుమా, టెయిలెండర్ కార్బిన్ బాష్ అద్భుత బ్యాటింగ్తో మెరుగైన స్కోరు అందించారు.తొలి ఇన్నింగ్స్(3)లో విఫలమైన బవుమా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం (136 బంతుల్లో 55) బాదాడు. మరోవైపు.. బాష్ 37 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 79 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. ఆది నుంచే తడబాటుఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినందున.. విజయ లక్ష్యం 124 పరుగులుగా మారింది. అయితే, లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), యశస్వి జైస్వాల్ (0) పూర్తిగా విఫలం కాగా.. ధ్రువ్ జురెల్ (13), రిషభ్ పంత్ (2) నిరాశపరిచారు.ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. రవీంద్ర జడేజా (18), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (1), సిరాజ్ (0) చేతులెత్తేయగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ అబ్సెంట్ హర్ట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయింది. కాగా మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ పంత్.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి -
పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.గంభీర్ ప్రయోగాలుకోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్ పర్యటన, వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్ను తుదిజట్టు నుంచి తప్పించింది.సాయికి బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది. వన్డౌన్లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.వాషీ పర్లేదుఇక రెండో ఇన్నింగ్స్లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్ బౌలింగ్లో హార్మర్కు క్యాచ్ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.గిల్ స్థానంలో జురెల్ఈ మ్యాచ్లో మరో ప్రయోగం... ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్ను ప్రమోట్ చేశాడు హెడ్కోచ్ గౌతం గంభీర్. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఐదో నంబర్ బ్యాటర్ రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు.గెలుపు ఆశలు రేపిన అక్షర్మరోవైపు టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. Pressure? What pressure? 🔥#AxarPatel takes the attack to the South African bowlers! 🏏👏#INDvSA | 1st Test, Day 3, LIVE NOW 👉 https://t.co/19cUrY4aXc pic.twitter.com/zpiIumJibl— Star Sports (@StarSportsIndia) November 16, 2025అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్లో (34.5)నే బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇక గిల్ ఆబ్సెంట్ హర్ట్ (0) కావడంతో.. ఆలౌట్ అయిన భారత్ ఓటమి ఖరారైంది.టాస్ గెలిచిన.. తొలుత బ్యాటింగ్రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది.ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తెంబా బవుమా హాఫ్ సెంచరీఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా హాఫ్ సెంచరీ (55 నాటౌట్) చేయడంతో ప్రొటిస్ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.తప్పని ఓటమిఅయితే, ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్ నాలుగు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు. ఓపెనర్లను అవుట్ చేసి యాన్సెన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్ -
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్
టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.మూడో రోజు హాఫ్ సెంచరీఅయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.టెస్టు క్రికెట్ను చంపేస్తారా?ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు. అస్సలు ఊహించలేదుమరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.నాలుగు రోజుల పాటు పిచ్పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీమిండియా ఓటమిసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్కు షాకులు తగిలాయి.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్ చేసిన ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్.. మూడో ఓవర్ ఆరంభంలోనే రాహుల్ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు. ఆచితూచి ఆడకపోతే..ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్ గార్డెన్స్ పిచ్ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.మరి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 2012లో ఇంగ్లండ్ 41 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1977లో ఇంగ్లండ్ 16 పరుగుల లక్ష్య ఛేదన.చదవండి: సన్రైజర్స్ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత? -
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.టార్గెట్ 124ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) మొదలైంది. తొలిరోజు పేసర్లు సత్తా చాటగా.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.అనంతరం ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా.. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను.. 153 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా.. భారత జట్టు లక్ష్యం 124 పరుగులుగా మారింది. దీంతో టార్గెట్ చిన్నదే కదా అని సంబరపడిన అభిమానులకు సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ ఆదిలోనే షాకులు ఇచ్చారు.చెలరేగిన సఫారీ పేసర్మొత్తంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కైలీ వెరెన్నెకు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్.. ఈసారి ఆరు బంతులు ఎదుర్కొని యాన్సెన్ బౌలింగ్లో వెరెన్నెకు క్యాచ్ ఇవ్వడంతో నిష్క్రమించాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రాహుల్ అవుటయ్యాడు.తొలి ఓవర్లో జైసూను.. మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ను వెనక్కి పంపి యాన్సెన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో కేవలం ఒకే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే, వన్డౌన్లో వాషింగ్టన్ సుందర్ రాగా.. నాలుగో స్థానంలో మరో ప్రయోగానికి టీమిండియా తెరలేపింది. జురెల్ ముందుగానేకెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను టాప్కి ప్రమోట్ చేసింది. నిజానికి ఐదో నంబర్ బ్యాటర్ పంత్ బ్యాటింగ్కు వస్తాడనుకుంటే అనూహ్యంగా జురెల్ ముందుగా వచ్చాడు.ఇక భోజన విరామ సమయానికి ఏడు ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి పది పరుగులే చేసింది. వాషీ 20 బంతుల్లో 5, జురెల్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో నిలిచారు.టీమిండియా చెత్త రికార్డుజైసూ, రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగోసారి అత్యల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది.సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు సంయుక్తంగా సాధించిన అత్యల్ప స్కోర్లు👉1964లో ఆస్ట్రేలియాతో చెన్నై మ్యాచ్లో- 0 (ఎంఎల్ జైసింహ 0, ఇంద్రజిత్సిన్హ్జీ 0)👉1999లో న్యూజిలాండ్తో మొహాలీ మ్యాచ్లో- 0 (దేవాంగ్ గాంధీ 0, సదగోపన్ రమేశ్ 0)👉2010లో న్యూజిలాండ్తో అహ్మదాబాద్ మ్యాచ్లో- 1 (గంభీర్ 0, సెహ్వాగ్ 1)👉2025లో సౌతాఫ్రికాతో కోల్కతాలో మ్యాచ్లో- 1 (జైస్వాల్0, కేఎల్ రాహుల్ 1).చదవండి: ఐసీయూలో శుబ్మన్ గిల్ -
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అర్ధ శతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిలకడగా ఆడుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైంది. కోల్కతాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు.31, 39.. తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్లు ఇవేఇక తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో సఫారీ టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. బవుమా పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగులో క్రీజులో నిలిచారు.జోడీని విడదీసిన బుమ్రాఈ క్రమంలో 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికా కాసేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బవుమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన టెయిలెండర్ బాష్ను బుమ్రా అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. బవుమా- బాష్ (25) జోడీని విడదీసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్అయితే, బవుమా మాత్రం జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయాడు. బుమ్రా బౌలింగ్లో ఫోర్ బాది.. 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిరాజ్ సైమన్ హార్మర్ (20 బంతుల్లో 7)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సఫారీ జట్టు ఆలౌట్అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ మియా కేశవ్ మహరాజ్ (0)ను పదో వికెట్గా వెనక్కి పంపడంతో సఫారీ జట్టు ఆలౌట్ అయింది. మొత్తంగా 54 ఓవర్ల ఆటలో 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. దీంతో టార్గెట్ 124 (153-30=123) పరుగులుగా మారింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మూడోరోజు బుమ్రా ఒక వికెట్ పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జడ్డూ -
ఐసీయూలో శుబ్మన్ గిల్!.. టీమిండియాకు ఊహించని షాక్!
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు తొలి టెస్టులో మిగిలిన ఆటకు.. రెండో టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.బిజీబిజీకాగా టెస్టు, వన్డే సారథి గిల్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఆసియా టీ20 కప్ టోర్నీ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ (IND vs SA)లో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.కోల్కతాలో సఫారీ జట్టుతో శుక్రవారం మొదలైన టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. అయితే, శనివారం నాటి ఆట సందర్భంగా కెప్టెన్ గిల్ మెడకు గాయమైంది. నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన గిల్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.నొప్పి ఎక్కువగా ఉండటంతోప్రొటిస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్కు మెడపట్టేసింది. వెంటనే ఫిజియో వచ్చి గిల్ను పరిశీలించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్ను డ్రెసింగ్రూమ్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా అతడిని కోల్కతాలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.ఐసీయూలో చికిత్సఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. గిల్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. అయితే, ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే వైద్యుల సమక్షంలో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు వెల్లడించాయి.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానేగిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటైందని.. క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం గిల్ వుడ్లాండ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని.. పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే అతడు మళ్లీ మైదానంలో దిగుతాడా? లేదా? అన్నది తేలుతుందని తెలిపాయి.కాగా తొలి ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత కూడా మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్గా ప్రకటించారు. ఈ మ్యాచ్లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.బీసీసీఐ అప్డేట్గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడని తెలిపింది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.చదవండి: IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే -
చరిత్ర సృష్టించిన జడేజా.. భారత తొలి క్రికెటర్గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సత్తా చాటాడు. కోల్కతా వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా బ్యాట్తో, బాల్తో రాణించాడు.భారత తొలి ఇన్నింగ్స్లో 45 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, సైమన్ హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఈ లెఫ్లాండర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఏదేమైనా భారత్ 189 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో జడ్డూ తన వంతు పాత్రను పోషించాడని చెప్పవచ్చు.ఆకాశమే హద్దుగాఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది ఓవర్ల బౌల్ చేసి పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్లో శనివారం నాటి రెండో రోజు ఆటలో జడ్డూ 13 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.భారత తొలి క్రికెటర్గా రికార్డుప్రొటిస్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11), టోనీ డి జోర్జి (2) రూపంలో మూడు వికెట్ల తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. ట్రిస్టన్ స్టబ్స్ (5)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 250 వికెట్ల క్లబ్లో చేరిన భారత తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు.ప్రపంచంలో రెండో ప్లేయర్గాఅంతేకాదు.. ఓవరాల్గా ప్రపంచంలో స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన (స్వదేశంలో 2000+ 250 వికెట్లు) రెండో ఆటగాడిగా జడేజా నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో ఓవరాల్గా నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కి పైగా వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్గా ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ బోతమ్, కపిల్ దేవ్, డానియెల్ వెటోరి జడ్డూ కంటే ముందు వరుసలో ఉన్నారు.కాగా భారత్తో తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు సాధించింది. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సౌతాఫ్రికా. ఆట పూర్తయ్యేసమయానికి 35 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: అందుకే రాజస్తాన్ రాయల్స్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్ -
తిప్పేసిన జడ్డూ.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు ప్రభావం చూపితే.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు తిప్పేశారు. ఫలితంగా అరవై పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. శనివారం ఆట ముగిసే సరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్ చేసింది. పర్యాటక జట్టును తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది.తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్ల సత్తాటీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్ల చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23).. వియాన్ ముల్దర్ (24), టోనీ డి జోర్జి (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఇక 37/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో 152 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా 189 పరుగులు చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాపై ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ప్రొటిస్ బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.భారత స్పిన్ దెబ్బకు సఫారీలు విలవిలఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు ఆది నుంచే భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. రియాన్ రికెల్టన్ (11)ను కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేసి వికెట్ల వేట మొదలుపెట్టగా... జడ్డూ ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11)లను వెనక్కి పంపి సఫారీలకు కోలుకోలేని షాకిచ్చాడు..@imkuldeep18 comes into the attack… and STRIKES instantly! 💥South Africa lose their first as Rickelton falls LBW to the Chinaman! 👌🏻Catch the LIVE action ⬇️#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/OOZQRsBLzl— Star Sports (@StarSportsIndia) November 15, 2025 అదే విధంగా.. టోనీ డి జోర్జి (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వికెట్ కీపర్ కైలీ వెరెన్నె (9)ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్.. మార్కో యాన్సెన్ (13)ను పెవిలియన్కు పంపించాడు. Spinning a web! 🕸️🌀Some gun bowling from the No.1 Test All-rounder #RavindraJadeja has South Africa 3 down!#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/qgrOk7lvGW— Star Sports (@StarSportsIndia) November 15, 2025నాలుగేసిన జడ్డూఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 35 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే కేవలం 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇక మూడోరోజైన ఆదివారం ఆటలో ఆరంభంలోనే మిగిలిన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారంటే.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యమే ఉంటుందని చెప్పవచ్చు. స్పిన్నర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. టార్గెట్ వంద కంటే తక్కువగానే ఉండొచ్చు.ఇదిలా ఉంటే.. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. సిరాజ్ చేతికి ఇంకా బంతి రానేలేదు.చదవండి: ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే.. -
ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఇందుకు వేదిక.రాణించిన భారత బౌలర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్.. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చెరో రెండు.. అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు.అయితే, బుమ్రా ఆది నుంచే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో అప్పటికే 43 పరుగులు ఇచ్చేసిన సిరాజ్ మియా చేతికి ఆ తర్వాత బంతి రావడానికి చాలా సమయమే పట్టింది.ఒకే ఓవర్లో రెండుఎట్టకేలకు తను వేసిన పదో ఓవర్లో సిరాజ్ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 45వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన ఈ రైటార్మ్ పేసర్.. తొలి బంతికి కైల్ వెరెన్నె(16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి మార్కో యాన్సెన్(0)ను బౌల్డ్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు.ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వుఈ నేపథ్యంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట తర్వాత సిరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వు అని గిల్ను అడిగాను. అదే ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు తీశాను’’ అని సిరాజ్ తెలిపాడు.అదే విధంగా బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వికెట్ తీయడానికి నేను ఇబ్బంది పడుతున్న సమయంలో జస్సీ భాయ్ వచ్చి.. స్టంప్స్ మీదకు బౌల్ చేయమని చెప్పాడు. ఎల్బీడబ్ల్యూ కోసం ట్రై చేయమన్నాడు. బౌల్డ్ చేయడం.. క్యాచ్లు పట్టడం.. ఇలా వికెట్ తీయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయని.. నన్ను కేవలం బౌలింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. తాను నిరాశకు గురైన వేళ బుమ్రా తనలో ఆత్మవిశ్వాసం నింపాడని తెలిపాడు. కాగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మొత్తంగా 12 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.స్వల్ప ఆధిక్యంకాగా తొలిరోజు సౌతాఫ్రికాను 159 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. శుక్రవారం ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో ఆటలో భాగంగా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
‘అసలే మరుగుజ్జు కదా!’.. స్పందించిన సౌతాఫ్రికా కోచ్!
భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య రెండు టెస్టుల సిరీస్కు శుక్రవారం తెరలేచింది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.బంతితో అదరగొట్టిన బుమ్రాఈ క్రమంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆది నుంచే నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వేగంగా ఆడుతూనే.. క్రీజులో పాతుకుపోవాలని ప్రయత్నించిన ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (48 బంతుల్లో 31), రియాన్ రికెల్టన్ (22 బంతుల్లో 23)లను త్వరగానే పెవిలియన్కు పంపాడు.అంతేకాదు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24), సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)లను కూడా అవుట్ చేసిన బుమ్రా.. మొత్తంగా ఐదు వికెట్లతో మెరిశాడు. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఈ రైటార్మ్ పేసర్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.అదే సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాను ఉద్దేశించి.. బుమ్రా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికా స్కోరు 62/2 వద్ద ఉన్న వేళ.. బవుమా క్రీజులో ఉండగా.. బుమ్రా అద్భుతమైన బంతిని సంధించాడు. దీనిని ఎదుర్కొనే క్రమంలో బవుమా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బాల్ అతడి ప్యాడ్కు తాకింది.బుమ్రా నోట ఊహించని మాటదీంతో బుమ్రాతో పాటు టీమిండియా ఫీల్డర్లు కూడా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. అయితే, బుమ్రా మాత్రం కచ్చితంగా బంతి వికెట్లను గిరాటేస్తుందన్న నమ్మకంతో .. వికెట్ కీపర్ రిషభ్ పంత్తో చర్చించేందుకు వెళ్లాడు. బాల్ మరీ ఎత్తులో వెళ్లిందా? లేదా? అని చర్చించాడు. ఇందుకు పంత్.. బాల్ ఎత్తులోనే వెళ్తుందని అభిప్రాయపడ్డాడు.అసలే మరుగుజ్జు కదా!మరోవైపు.. బుమ్రా ఊహిస్తున్నట్లుగా ఇది అవుట్ కాదని భావించిన కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా రివ్యూ తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలోనే బుమ్రా.. ‘క్రీజులో ఉన్నది అసలే మరుగుజ్జు కదా!’ అంటూ ఒక రకంగా బవుమాను ఎగతాళి చేస్తూ బౌలింగ్ చేసేందుకు వెళ్లాడు. దీంతో భారత ఆటగాళ్లంతా నవ్వుకోగా.. బుమ్రా మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.నిజానికి బుమ్రా మైదానంలో ఇలా వ్యవహరించడం అరుదు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి గురించి అతడు ఇలా మాట్లాడతాడని అభిమానులు కూడా అస్సలు ఊహించలేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లు బుమ్రా తీరు సరికాదంటూ విమర్శల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం సరదాగా అన్న మాటలకు అపార్థాలు ఆపాదించవద్దని హితవు పలికారు.స్పందించిన సౌతాఫ్రికా కోచ్!ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్వెల్ ప్రిన్స్ తాజాగా స్పందించాడు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం గురించి మా జట్టులో ఎలాంటి చర్చా రాలేదు. అవును.. ఇలా జరగడం ఇదే తొలిసారి.అందుకే త్వరగానే నా దృష్టికి కూడా వచ్చింది. అయితే, అక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ అంటూ మాట దాటేశాడు. ఏదేమైనా బుమ్రా తీరుకు బవుమా, అతడి అభిమానులు నొచ్చుకున్నారన్నది మాత్రం నిజమేనని తెలుస్తోంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్లో.. బవుమా కెప్టెన్సీలోని సౌతాఫ్రికా టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్లో జరిగిన టైటిల్ పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సఫారీలు ఐసీసీ గదను సొంతం చేసుకున్నారు. చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్దే పైచేయి!JB - "bauna hai yeh"RP- "bauna hai but laga yahape"JB - "bauna hai yeh BC"Review not taken for the appeal of LBW against Bavuma.#INDvsSA #Bumrah pic.twitter.com/r8UO8afR1J— The last dance (@26lastdance) November 14, 2025 -
బుమ్రా సూపర్ హిట్.. జైసూ విఫలం.. తొలిరోజు హైలైట్స్
భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) తొలి రోజు ఆట ముందుగానే ముగిసిపోయింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బౌలర్ల విజృంభణ కారణంగా మొదటి రోజు ఆతిథ్య భారత్.. ప్రొటిస్ జట్టుపై పైచేయి సాధించింది.ఈడెన్ గార్డెన్స్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం టెస్టు సిరీస్ మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.159 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బవుమా బృందం టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లు ఆడి 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) ఓ మోస్తరుగా రాణించగా.. వీరిద్దరని భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెనక్కి పంపించాడు.వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 51 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ తెంబా బవుమా దారుణంగా విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.ఒకే ఓవర్లోమరోవైపు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24) నిలబడే ప్రయత్నం చేయగా బుమ్రా.. అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వికెట్ కీపర్ కైల్ వెరెన్నె(16)తో పాటు.. మార్కో యాన్సెన్ (0)ను ఒకే ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ పెవిలియన్కు చేర్చాడు. కార్బిన్ బాష్ (3)ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యూ చేయగా.. సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)ల వికెట్లు కూల్చి.. బుమ్రా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్కు చరమగీతం పాడాడు. ట్రిస్టన్ స్టబ్స్ 74 బంతులు ఎదుర్కొని 15 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. జైసూ విఫలంఅనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన లభించిన లైఫ్లను దుర్వినియోగం చేసుకున్నాడు.మొత్తంగా 27 బంతులు ఎదుర్కొన్న జైసూ.. మూడు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 59 బంతుల్లో 13, వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ 38 బంతుల్లో 6 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి.. పైచేయిఫలితంగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్.. 20 ఓవర్ల ఆటలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 122 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి గిల్ సేన ఆధిపత్యం కొనసాగించింది. చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్ -
IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్ రాణించడంతో ప్రొటిస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.టాస్ గెలిచిన సౌతాఫ్రికాప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC )సీజన్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే విజృంభించిబుమ్రా ఆరంభం నుంచే బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలకు షాకిచ్చాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సౌతాఫ్రికా వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (24)తో పాటు కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?ఆ తర్వాత బుమ్రా మరోసారి తన పేస్ పదునుతో టోనీ డి జోర్జి (24)ని బౌల్డ్ చేయగా.. వికెట్ కీపర్ వెరెన్నె (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్.. మార్కో యాన్సెన్ (0)ను డకౌట్ చేశాడు. ఇక స్పిన్నర్ అక్షర్ పటేల్.. కార్బిన్ బాష్ (3)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఒక వికెట్ దక్కించుకోగా.. సైమన్ హార్మర్ (5)ను తొమ్మిదో వికెట్గా బుమ్రా వెనక్కి పంపాడు.ఆ తర్వాత కేశవ్ మహరాజ్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన బుమ్రా.. ఐదు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకుని... సౌతాఫ్రికా కథను ముగించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.దక్షిణాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ని (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్ -
దక్షిణాఫ్రికాతో సవాల్కు సిద్ధంగా ఉన్నాను: సిరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ను ‘డ్రా’ చేయడంలో కీలకపాత్ర పోషించిన భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు స్వదేశంలో మరో పటిష్ట జట్టుపై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో మన టీమ్ పైచేయి సాధిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘వరల్ట్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్లపరంగా మనకు ఇది చాలా కీలక సిరీస్.పైగా దక్షిణాఫ్రికా చాంపియన్ కూడా. ఆ జట్టు ఇటీవల పాక్పై సిరీస్ 1–1తో ‘డ్రా’ చేసుకున్నది వాస్తవమే. అయితే మా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్తో చాలా బాగా ఆడి ఇటీవల వెస్టిండీస్పై అలవోకగా గెలిచాం. ఈ ఫామ్ కారణంగా టీమ్లో ఆత్మవిశ్వాసం పెరిగి అంతా సానుకూల వాతావరణం ఉంది. వ్యక్తిగతంగా నా బౌలింగ్ మంచి లయతో సాగుతోంది. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా. పెద్ద జట్లను ఎదుర్కొనేటప్పుడు మన లోపాలు ఏమిటో తెలిసి వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సిరాజ్ చెప్పాడు. భారత్ తరఫున 43 టెస్టులు ఆడిన సిరాజ్ 133 వికెట్లు పడగొట్టాడు. -
IND vs SA: టీమిండియాకు భారీ షాక్
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా (IND vs SA)కు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant Injured) మరోసారి గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ.. రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. కాగా సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.ఇందుకు సన్నాహకంగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా - ‘ఎ’ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ పంత్ భారత్- ‘ఎ’ కెప్టెన్గా తిరిగి వచ్చాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ (BCCI) ఆఫ్ ఎక్సలెన్స్ స్టేడియం వేదికగా.. తొలి అనధికారిక టెస్టులో పంత్ సేన గెలుపొందింది.ధ్రువ్ జురెల్ అజేయ శతకంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (132) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.అయితే, తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. సఫారీ పేసర్ షెపో మొరేకి వేసిన రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి పరిశీలించగా.. పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి మొరేకి బౌలింగ్లో అవుటయ్యాడు.34 పరుగుల స్వల్ప ఆధిక్యంఇక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు.. 34 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కగా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆదిలోనే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 27) వికెట్ను భారత్ కోల్పోగా.. పంత్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు 108-4గా ఉన్న వేళ పంత్కు రెండుసార్లు గాయమైంది. రెండుసార్లు బంతి బలంగా తాకడంతోమొరేకి బౌలింగ్లో తొలుత పంత్ ఎడమ మోచేతికి గాయమైంది. తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో 22 బంతులు ఎదుర్కొన్న పంత్.. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుండగా.. పంత్ రూపంలో కీలక ఆటగాడు గాయపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో మ్యాచ్లో భారత్ 43 ఓవర్ల ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి.. 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఐసీసీ కీలక నిర్ణయంRishabh Pant retires hurt after taking three blows today. First on the helmet, second on the left-hand elbow, third on the abdomen. Tough day for the fighter. ❤️🩹 pic.twitter.com/kdTX8jdM8B— Harsh 17 (@harsh03443) November 8, 2025 -
‘వాళ్లు ముందే డిసైడ్ అవుతారు.. తర్వాత సాకులు చెబుతారు’
సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని మరోసారి పక్కనపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ బెంగాల్ బౌలర్కు మొండిచేయి చూపుతున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.కావాలనే షమీని పక్కనపెడుతున్నారుఈ నేపథ్యంలో షమీ చిన్ననాటి కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ (Mohammed Badruddin) ఘాటుగా స్పందించాడు. కారణం లేకుండానే షమీని జట్టుకు దూరం చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడుతూ... ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వాళ్లు కావాలనే షమీని పక్కనపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.ఇంతకంటే వాళ్లకు వేరే కారణం ఏమీ లేదు. అతడు ఫిట్గా లేడని అంటారా?... ఓ ఆటగాడు టెస్టు మ్యాచ్లు ఆడుతూ.. రెండు మ్యాచ్లలో కలిపి 15 వికెట్లు పడగొట్టినా అతడు ఫిట్గా లేడంటే మనం ఏం చేయగలం?వాళ్లు ముందే డిసైడ్ అవుతారుసెలక్టర్లు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. తాము అలా చేయడం లేదంటే.. షమీని తప్పించడానికి గల కారణం ఏమిటో వాళ్లే స్వయంగా చెప్పాలి. సౌతాఫ్రికాతో సిరీస్కు షమీని ఎంపిక చేస్తారని భావించాను.స్వదేశంలో టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్బౌలర్లనే ఆడిస్తారు. కాబట్టి షమీకి ఈసారి అవకాశం ఇస్తారని అనుకున్నా. బుమ్రా వర్క్లోడ్ను తగ్గించే క్రమంలో షమీని పిలుస్తారని ఎదురుచూశా. అయినా.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదు.వాళ్లు ముందుగానే.. తమకు ఏ ఆటగాళ్లు కావాలో ఎంచుకుంటారు. ఆ తర్వాత తామేదో పారదర్శకంగా జట్టును ఎంపిక చేసినట్లు మాట్లాడతారు. టెస్టు జట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ ప్రదర్శనల కంటే ప్రామాణికం ఏమి ఉంటుంది?టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేస్తామనడం సరికాదు. రంజీల్లో బాగా ఆడుతున్న వారినే టెస్టుల్లోకి తీసుకోండి. ఏదేమైనా ఇక్కడ ముందుగానే తమకు ఇష్టమైన ఆటగాళ్లను ఎంచుకుంటారు.సాకులు చెబుతారుఅదే జాబితాకు కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత.. ‘అతడు ఫిట్గా లేడు.. అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి’ అంటూ తప్పించిన ఆటగాళ్ల గురించి సాకులు చెబుతారు’’ అంటూ బద్రుద్దీన్ టీమిండియా సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేశాడు.ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదుఅదే విధంగా.. షమీది కష్టపడే తత్వమన్న బద్రుద్దీన్.. ఆట ద్వారానే అతడు అందరికీ సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు. వంద శాతం ఫిట్గా ఉన్న షమీ.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడనే నమ్మకం తనకు ఉందని.. షమీతో తాను ఇదే మాట చెప్పానని తెలిపాడు. అద్భుతంగా ఆడే ఆటగాడిని సెలక్టర్లు ఏదో ఒకరోజు జట్టుకు ఎంపిక చేయక తప్పదని పేర్కొన్నాడు. వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీలో జట్టు కోసం శ్రమించిన ఆటగాడిని పక్కనపెట్టడం ఎంతమాత్రం సరికాదని బద్రుద్దీన్ పునరుద్ఘాటించాడు.చదవండి: అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై విమర్శల వర్షంసౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.ఫలితంగా టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ కావాలనే షమీ కెరీర్ను ప్రశ్నార్థకం చేశారంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీ చివరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు.ఆ తర్వాత చీలమండ గాయంతో చాన్నాళ్లు జట్టుకు దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే టోర్నీలో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులు, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఈ రైటార్మ్ పేసర్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అప్డేట్ లేదని.. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని.. అందుకే పక్కనపెట్టామని చెప్పాడు. అయితే, అగార్కర్ వ్యాఖ్యలకు షమీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రంజీలు ఆడేందుకు ఫిట్గా ఉన్న తాను.. వన్డేలు కూడా ఆడలేనా? అని ప్రశ్నించాడు.ఆటతోనే సమాధానంఈ క్రమంలో అగార్కర్ బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే తాము అతడిని ఇంగ్లండ్ పర్యటన, ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ నేపథ్యంలో రంజీ సీజన్లో బెంగాల్ తరఫున చివరగా గుజరాత్తో మ్యాచ్ ఆడిన షమీ.. ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడు.గుజరాత్తో మ్యాచ్లో మొత్తంగా ఎనిమిది వికెట్ల (3/44, 5/38)తో చెలరేగి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. ఈ క్రమంలో మీడియా షమీని పలకరించగా.. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా.. అందుకు అపార్థాలు తీస్తారని పేర్కొన్నాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త సెలక్టర్ ఆర్పీ సింగ్ సూచన మేర, అతడి నుంచి అందిన హామీ మేరకే షమీ ఇలా మాట మార్చాడని నెటిజన్లు చర్చించుకున్నారు. అగార్కర్- షమీ మాటల యుద్ధానికి తెరపడినట్లేనని.. సౌతాఫ్రికాతో టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది.బెంగాల్ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్న మరో పేసర్ ఆకాశ్ దీప్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. షమీకి మాత్రం మరోసారి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమీ టెస్టు రీఎంట్రీ కల ముగిసినట్లేనని.. ఇకపై షమీని టీమిండియా టెస్టు జెర్సీలో చూడలేమంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మీకు ఎందుకింత పగ‘ఇగో’ కారణంగానే అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారంటూ.. మీకు ఎందుకింత పగ? అంటూ అగార్కర్పై మండిపడుతున్నారు. కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రకటించింది.చదవండి: IND vs SA Tests: సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని ఈ టీమ్కు పదిహేను మంది సభ్యులను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇక ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ప్రొటిస్ జట్టుతో సిరీస్ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే పంత్.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA) కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.పడిక్కల్పై సెలక్టర్ల నమ్మకంబెంగళూరు వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్టులో పంత్ 90 పరుగులతో రాణించి.. భారత్ను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. సాయి సుదర్శన్తో పాటు దేవదత్ పడిక్కల్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు.ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. ఇటీవల సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో విఫలమైనా పడిక్కల్పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం విశేషం. మరోవైపు.. పంత్ వికెట్ కీపర్గా రీఎంట్రీ ఇవ్వగా.. ధ్రువ్ జురెల్ స్పెషలిస్టు బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.షమీకి మరోసారి మొండిచేయిఇక స్పిన్నర్ల కోటాలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్థానం సంపాదించగా.. పేసర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ క్రమంలో వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మరోసారి మొండిచేయే ఎదురైంది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఇటీవల బెంగాల్ తరఫున షమీ సత్తా చాటినా సెలక్టర్లు అతడిని కనికరించలేదు. మరో బెంగాల్ పేసర్ ఆకాశ్కు చోటిచ్చి షమీని మాత్రం పక్కనపెట్టారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. నవంబరు 14- నవంబరు 26 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. తొలి టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కాగా.. రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే -
టీమిండియాతో టెస్టు సిరీస్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన
టీమిండియాతో టెస్టు సిరీస్ (IND vs SA Tests)కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తమ కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. భారత్లో సఫారీ జట్టుకు సారథ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బవుమా కెప్టెన్సీలో టీమిండియాతో టెస్టులు ఆడబోయే జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది.భారత్తో రెండు టెస్టులుప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్టుల్లో తలపడనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్ నిర్వహణకు నవంబరు 14- 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జట్టును ప్రొటిస్ బోర్డు తాజాగా ప్రకటించింది.ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన జట్టులో స్వల్ప మార్పులతోనే టీమిండియాతోనూ సఫారీలు బరిలో దిగనున్నారు. బవుమా తిరిగి రావడంతో డేవిడ్ బెడింగ్హామ్ జట్టులో చోటు కోల్పోయాడు. కాగా పాక్తో ఇటీవల సౌతాఫ్రికా జట్టు రెండు టెస్టులు ఆడింది.పాక్తో టెస్టు సిరీస్ సమంబవుమా గైర్హాజరీలో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సౌతాఫ్రికా.. అనూహ్య రీతిలో పాక్తో తొలి టెస్టులో ఓడింది. ఆ తర్వాత రావల్పిండి వేదికగా రెండో టెస్టు గెలిచి సిరీస్ను 1-1 సమం చేయగలిగింది. తతదుపరి పాక్తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడిన తర్వాత సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో బాగంగా టీమిండియాతో తొలుత రెండు టెస్టులు ఆడనున్న సఫారీలు.. తదుపరి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనున్నారు. విండీస్ను వైట్వాష్ చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో ఓటమి చవిచూసింది. తదుపరి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ పూర్తి చేసుకుని.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇక డబ్ల్యూటీసీ తాజా సీజన్లో గిల్ సేన తొలుత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో వైట్వాష్ చేసి జోరు మీదుంది.టీమిండియాతో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు ఇదేతెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైలీ వెరెన్నె, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, సెనురాన్ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్ హార్మర్. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! -
WTC: ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో పాకిస్తాన్ (PAK vs SA 2nd Test) ఓటమి పాలైంది. రావల్పిండి వేదికగా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు... ఆతిథ్య పాక్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC) సీజన్లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాహోర్లో జరిగిన తొలి టెస్టులో పాక్ గెలిచి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. అయితే, గురువారం ముగిసిన రెండో టెస్టులో సఫారీల చేతిలో ఓడటంతో పాక్ ర్యాంకు పడిపోయింది.బాబర్ ఆజమ్ అర్ధ శతకంకాగా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్తాన్- సౌతాఫ్రికా ఇదే తొలి సిరీస్ కాగా.. ఇరు జట్లు చెరో విజయం ఖాతాలో వేసుకున్నాయి. ఇక గురువారం ఓవర్నైట్ స్కోరు 94/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ చివరకు 49.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ధశతకం పూర్తిచేసుకున్న వెంటనే వెనుదిరగ్గా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. మొహమ్మద్ రిజ్వాన్ (18), సల్మాన్ ఆగా (28), నోమాన్ అలీ (0), షాహీన్ షా అఫ్రిది (0), సాజిద్ ఖాన్ (13) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు.దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మెర్ 6 వికెట్లతో అదరగొట్టగా... కేశవ్ మహరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో వీరిద్దరే కలిసి 17 వికెట్లు తీశారు. ఈ క్రమంలో హర్మెర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో వెయ్యి వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు. రెండే వికెట్లు కోల్పోయి..అనంతరం 68 పరుగులు లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రికెల్టన్ (25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (42; 8 ఫోర్లు) రాణించారు.లక్ష్యం మరీ చిన్నది కావడంతో సఫారీ జట్టు ఎలాంటి తడబాటు లేకుండా రెండే వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో నోమాన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 404 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్తోనూ ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సెనురన్ ముత్తుస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!ఇక ఈ విజయంతో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్ రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. అదే విధంగా ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రీలంక మూడు నుంచి రెండుకు, టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకున్నాయి. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు మ్యాచ్ గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే.. ఇరుజట్లకు నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు జమచేస్తారు.అత్యధిక మ్యాచ్లు ఆడింది ఎవరంటే?డబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్ టెస్టు సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. అదే విధంగా.. శ్రీలంక.. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్ గెలిచింది.మరోవైపు.. ఇప్పటికే ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది టీమిండియా. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఓటమిపాలైంది.ఇటీవల సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో వైట్వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లు సంపాదించింది. ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లు సాధించింది. అయితే, సౌతాఫ్రికా తాజాగా టాప్-5లోకి దూసుకురాగా.. ఇంగ్లండ్ ఆరో స్థానానికి పడిపోయింది.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
పాకిస్తాన్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా..
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 72 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సమమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో ఐడైన్ మార్క్రమ్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. రికెల్టన్ 25 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో నోమన్ అలీ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.తిప్పేసిన హర్మర్..అంతకుముందు 94/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన పాక్కు సౌతాఫ్రికా స్పిన్నర్ హర్మర్ చుక్కలు చూపించాడు. అతడు స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న పాక్..సెకెండ్ ఇన్నంగ్స్లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. 44 పరుగుల వ్యవధిలో ఆతిథ్య జట్టు ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో సఫారీలు ముందు పాక్ జట్టు కేవలం 72 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.సౌతాఫ్రికా బౌలర్లలో హర్మర్ ఆరు వికెట్లతో సత్తాచాటగా.. మహారాజ్ రెండు, రబాడ ఒక్క వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 404 పరుగులు భారీ స్కోర్ సాధించింది.టెయిలాండర్ బ్యాటర్లలు సెనురన్ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కగిసో రబడ (61 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టారు. పాక్ తమ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేసింది. కేశవ్ మహారాజ్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కగా.. హర్మర్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ఎట్టకేలకు బాబర్ ఆజంను కనికరించిన సెలక్టర్లు.. రిజ్వాన్కు భారీ షాక్ -
బాబర్ ఆజం ఖేల్ ఖతం!.. పాక్ హెడ్కోచ్ ఏమన్నాడంటే..
ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్సీ కోల్పోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడికి.. టీ20 జట్టులో స్థానం కూడా కరువైంది.పేలవ ప్రదర్శన అయితే, వన్డే, టెస్టుల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు ఆడలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 56 పరుగులే చేసిన బాబర్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.కనీసం ఒక్క సెంచరీ కూడా లేదులాహోర్ వేదికగా తొలి టెస్టులో బాబర్ రెండు ఇన్నింగ్స్లో చేసిన పరుగులు 23, 47. ఇక రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 16 పరుగులే చేసి నిష్క్రమించాడు. కాగా గత 75 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో బాబర్ కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.గత మూడేళ్ల కాలంలో టెస్టు క్రికెట్లో బాబర్ బ్యాటింగ్ సగటు 30కి తక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ పవర్ తగ్గిపోయిందని.. రిటైర్ అయితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒత్తిడికి లోనవుతున్నాడు..అయితే, పాకిస్తాన్ హెడ్కోచ్ అజర్ మహమూద్ మాత్రం బాబర్ ఆజంపై నమ్మకం ఉంచాడు. ‘‘ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుంది. ప్రతి మ్యాచ్లోనూ బాబర్ రాణించాలని అంతా కోరుకుంటారు. దీంతో అతడు భారమంతా తనపైనే ఉందనే ఒత్తిడికి లోనవుతున్నాడు.అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో ఒకడు. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 40కి పైగా పరుగులు చేశాడు. ఒక్కసారి ఒత్తిడిని అధిగమించాడంటే.. కనీసం ఒక్క ఫిఫ్టీ చేసినా అతడు మళ్లీ గాడిలో పడతాడు’’ అని అజర్ మహమూద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా తొలి టెస్టులో ఊహించని రీతిలో వరల్డ్చాంపియన్ సౌతాఫ్రికాకు షాకిచ్చిన పాకిస్తాన్.. 93 పరుగులు తేడాతో గెలిచింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులకు ఆలౌట్ అయిన పాక్.. సఫారీలను నిలువరించేందుకు గట్టిగానే కృషి చేస్తోంది.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
WTC: రెండో స్థానంలోకి దూసుకువచ్చిన పాక్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా (Pak vs SA)తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. స్పిన్కు అనుకూలించే పిచ్పై రాణించి.. పర్యాటక సఫారీ జట్టును 93 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో తొలి గెలుపు నమోదు చేసింది.రెండో స్థానానికి దూసుకువచ్చిన పాక్ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ రెండో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటికి ఆడిన ఒక్క మ్యాచ్లో గెలవడం ద్వారా.. వందకు వంద విజయ శాతం నమోదుతో ఊహించని రీతిలో టాప్-2లోకి చేరుకుంది. ఇక ఈ పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.ఆసీస్ వందకు వంద శాతండబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్తో తలపడింది. విండీస్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య జట్టును 3-0తో వైట్వాష్ చేసింది. ఇక మూడో స్థానంలో ఉన్న శ్రీలంక.. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్లో గెలుపొందింది.అత్యధిక మ్యాచ్లు ఆడింది టీమిండియానే.. అందుకే ఇలాఇక ఈ సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్ సేన.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో విండీస్ను వైట్వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లతో టాప్-5లో నిలిచింది.ఖాతా తెరవని విండీస్కాగా ఈ సీజన్లో ఇప్పటికి ఐదు టెస్టులు ఆడిన వెస్టిండీస్ మాత్రం ఇంత వరకు గెలుపు ఖాతా తెరవలేదు. కనీసం ఒక్క మ్యాచ్నైనా డ్రా కూడా చేసుకోలేకపోయింది. దీంతో సున్నా పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ఇప్పటి వరకు న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ 2025-27 ప్రయాణం మొదలుపెట్టనే లేదు. పాయింట్లు ఇలాకాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు వస్తాయి. ఒకవేళ ఇరుజట్ల మధ్య మ్యాచ్ డ్రా అయితే.. నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. ఇక 2017లో తొలిసారి డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టగా 2019 నాటి ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించి.. మొట్టమొదటి చాంపియన్గా అవతరించింది.ఇక 2019-23 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాపై గెలుపొంది టైటిల్ సాధించగా.. 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఐసీసీ గద గెలుచుకుంది. ఇప్పటికి రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్తోనే సరిపెట్టుకున్న టీమిండియా.. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలోనైనా పని పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది.పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 378👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 269👉పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 167👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 183👉ఫలితం: సౌతాఫ్రికాపై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.PC: ICCచదవండి: ఇప్పటికీ అవే వాడుతున్నాడు.. వాటిని అస్సలు మార్చడు: సూర్య -
చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఏడు వికెట్ల తేడాతో జయభేరిప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియా స్వదేశంలో విండీస్తో రెండు మ్యాచ్లు ఆడింది. తొలుత అహ్మదాబాద్లో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. ఢిల్లీలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.కేఎల్ రాహుల్తో కలిసితద్వారా విండీస్తో టెస్టు సిరీస్ను భారత్ 2-0తో వైట్వాష్ చేసింది. ఇక వెస్టిండీస్తో రెండో టెస్టులో జురెల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 79 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు పరుగులతో అజేయంగా నిలిచి.. కేఎల్ రాహుల్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సరికొత్త చరిత్రకాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ధ్రువ్ జురెల్ గతేడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారణంగా కొన్నిసార్లు బెంచ్కే పరిమితమైన జురెల్.. ఇప్పటికి ఏడు టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 761 పరుగులు సాధించాడు.ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం నుంచి భారత్ తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం సాధించిన జట్లలో భాగమైన తొలి ఆటగాడిగా జురెల్ నిలిచాడు. అంతకు ముందు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అరంగేట్రం (2013) నుంచి వరుసగా ఆరు టెస్టుల్లో గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.భారత్ తరఫున వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన క్రికెటర్లు👉ధ్రువ్ జురెల్- 7👉భువనేశ్వర్ కుమార్- 6👉కరుణ్ నాయర్- 4👉వినోద్ కాంబ్లీ- 4👉రాజేశ్ చౌహాన్- 4. చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు -
PAK vs SA: రమీజ్ రాజా ‘చీప్’ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా (Ramiz Raja) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. పాక్ వెటరన్ ఆటగాడు నొమన్ అలీ (Noman Ali)ని ఉద్దేశించి చవకబారు వ్యాఖ్యలు చేశాడు. దీంతో సొంత జట్టు అభిమానులే రమీజ్ రాజాపై మండిపడుతున్నారు. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా పాక్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది.బాబర్ ఆజం విఫలంఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93), కెప్టెన్ షాన్ మసూద్ (76), సల్మాన్ ఆఘా (93) రాణించగా.. మాజీ సారథి బాబర్ ఆజం (Babar Azam) 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో పాక్ 378 పరుగులకు ఆలౌట్ అయింది.కాగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మేర్ బౌలింగ్లో బాబర్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ ముందుగా నాటౌట్ ఇవ్వగా.. సౌతాఫ్రికా ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లింది. ఇందులో బంతి ముందుగా ప్యాడ్ను తాకినట్లు (లెగ్ స్టంప్ ఎగిరినట్లు) తేలింది. ఫలితంగా థర్డ్ అంపైర్ బాబర్ను అవుట్గా ప్రకటించాడు.రివ్యూతో గట్టెక్కాడుఇక అంతకు ముందు ఒక పరుగు వద్ద ఉన్న వేళ బాబర్ ఆజం రివ్యూతో గట్టెక్కాడు. ముతుసామి వేసిన బంతిని ఆడటంలో బాబర్ విఫలం కాగా.. ప్రొటిస్ బౌలర్లు మాత్రం అప్పీలు చేశారు. ఈ క్రమంలో బంతిని బ్యాట్ను తాకలేదని భావించిన బాబర్ రివ్యూకు వెళ్లగా.. అతడికి అనుకూల ఫలితం వచ్చింది.కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడుఈ విషయం గురించి కామెంట్రీలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఇది అవుటే అనిపిస్తోంది. ఒకవేళ నిర్ణయం తనకు అనుకూలంగా లేకుంటే అతడు కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడు’’ అని నోరుపారేసుకున్నాడు. అయితే, అప్పటికి తన మైకు ఆన్లో ఉందని రమీజ్ రాజాకు తెలియకపోవడం గమనార్హం.ఇక తాజాగా మరోసారి రమీజ్ రాజా తమ జట్టు ఆటగాడిని టార్గెట్ చేశాడు. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులకే ఆలౌట్ చేయడంలో పాక్ స్పిన్నర్ నొమన్ అలీది కీలక పాత్ర. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అచ్చంగా వెల్డింగ్ గ్లాస్లా ఉన్నాయిఅయితే, ఈ మ్యాచ్లో నొమన్ అలీ సన్గ్లాసెస్ ధరించి బౌలింగ్ చేశాడు. ఈ విషయం గురించి కామెంట్ చేస్తూ.. ‘‘ఫ్యాన్సీ గ్లాసెస్ ధరించాడు నొమన్ అలీ. ఇవైతే అచ్చంగా వెల్డింగ్ గ్లాస్లా ఉన్నాయి’’ అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా సేవలు అందించిన నీ దృష్టిలో ఆటగాళ్లంటే ఇంత చిన్నచూపా. నీ కెరీర్లో అంత గొప్పగా ఏం సాధించావని ఇంతగా బిల్డప్ ఇస్తున్నావు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 18 ఓవర్లు ముగిసేసరికి పాక్.. తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు -
IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరింది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గిల్ సేన 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.121 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి రోజు తొలి సెషన్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలవగా.. సుదర్శన్(39) రెండో ఇన్నింగ్స్లోనూ సత్తాచాటాడు. అంతకుముందు యశస్వి జైశ్వాల్, గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 518/5 డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లు పోరాడారు. క్యాంప్బెల్, హోప్లు సెంచరీలతో సత్తాచాటడంతో సెకెండ్ ఇన్నింగ్స్లో కరేబియన్ జట్టు 390 పరుగులు చేయగల్గింది. దీంతో విండీస్ 121 పరుగుల టార్గెట్ను భారత్ ముందు ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ చేధించింది.సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్లో అద్బుతమైన విజయం సాధించిన భారత్ ఓ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఒకే జట్టుపై వరుసుగా అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా సరసన టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా టీమ్ విండీస్(1998-24)పై వరుసగా 10 సార్లు టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది.భారత్ కూడా వెస్టిండీస్ (2002-25)పై 10 సార్లు టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల తర్వాత ఆస్ట్రేలియా ఉంది. విండీస్పై ఆసీస్ ఇప్పటివరకు 9 సార్లు టెస్టు సిరీస్లలో పై చేయి సాధించింది.చదవండి: అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు -
వెస్టిండీస్ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో గిల్ సేన క్లీన్ స్వీప్ చేసింది.63/1 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ సాయిసుదర్శన్(39), కెప్టెన్ గిల్(13) వికెట్ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(58 నాటౌట్), ధ్రువ్ జురెల్(6 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశారు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ ఛేజ్ రెండు, వారికన్ ఓ వికెట్ సాధించారు. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం. సెంచరీలతో మెరిసిన హోప్, క్యాంప్బెల్..కాగా ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఫాల్ ఆన్ ఆడిన వెస్టిండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన పోరాటం కనబరిచింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్లు), షై హోప్ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో కరేబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓ దశలో భారత్ ముందు మెరుగైన టార్గెట్ను ఉంచేలా కన్పించిన విండీస్ బ్యాటర్లు.. మరోసారి కుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి చిత్తు అయ్యారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను ముగించింది.అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది.భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), శుభ్మన్ గిల్(129) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 8 వికెట్ల పడగొట్టాడు. అతడితో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా రాణించారు.చదవండి: అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు -
నితీశ్ రెడ్డి జట్టులో ఎందుకు?.. ఆల్రౌండర్ అంటే ఇదేనా?: మాజీ క్రికెటర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ (Dodda Ganesh) విమర్శించాడు. నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) విషయంలో మేనేజ్మెంట్ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. అతడికి బౌలింగ్ చేసే అవకాశమే ఇవ్వనపుడు ఆల్రౌండర్గా ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించాడు.నాలుగు ఓవర్లు మాత్రమేగాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. తాజాగా వెస్టిండీస్తో టెస్టులతో పునరాగమనం చేశాడు. అహ్మదాబాద్లో తొలి టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకున్న 22 ఏళ్ల ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.మొత్తంగా పదహారు పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయని నితీశ్ రెడ్డి.. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కే రాలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఇక తాజాగా ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. రెండు ఇన్నింగ్స్లోనూ అసలు బౌలింగ్కే రాలేదు.54 బంతుల్లో 43 పరుగులుటీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ రెడ్డి.. 54 బంతుల్లో 43 పరుగులు చేసి నిష్క్రమించాడు. అయితే, బౌలర్గా మాత్రం అతడు రంగంలోకి దిగలేదు. ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్తోనూ ఓ ఓవర్ వేయించిన మేనేజ్మెంట్ నితీశ్ సేవలు మాత్రం వాడుకోలేదు.నితీశ్ రెడ్డి జట్టులో ఎందుకు?.. ఆల్రౌండర్ అంటే ఇదేనా?ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘నితీశ్ రెడ్డికి అసలు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకుండానే అతడిని ఆల్రౌండర్గా ఎలా సన్నద్ధం చేస్తున్నారు?.. ఇలా అయితే ఆల్రౌండర్ పాత్రకు తను ఎలా న్యాయం చేయగలడు’’ అని మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు.ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యంఇదిలా ఉంటే.. నితీశ్ సేవలను ఉపయోగించుకునే విషయంలో విమర్శలు రాగా.. వెస్టిండీస్ రెండో టెస్టుకు ముందు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందించిన విషయం తెలిసిందే‘‘బ్యాటింగ్ చేయగల అరుదైన సీమ్ బౌలర్. అతడి నైపుణ్యాల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలో (సెంచరీ) చూపించాడు. అయితే, విదేశీ గడ్డ మీదే తన సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటాం. తనను పూర్తిస్థాయి ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’’ అని డష్కాటే స్పష్టం చేశాడు.పోరాట పటిమ కనబరిచిన విండీస్ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఢిల్లీలో శుక్రవారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుబ్మన్ గిల్ (129 నాటౌట్) శతక్కొట్టగా.. సాయి సుదర్శన్ 87 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 43, ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. ఫలితంగా 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు కుప్పకూలగా.. భారత్ ఫాలో ఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ విండీస్ బ్యాటర్లు అద్భుత పోరాటం చేసి.. టీమిండియాకు 121 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (115), షాయీ హోప్ 103 పరుగులతో రాణించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో విండీస్కు ఇన్నింగ్స్ పరాజయం తప్పింది.చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే... -
ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) మైదానంలో ఎంతో కూల్గా ఉంటాడు. బాల్తోనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లతో మాట్లాడతాడు. పదునైన యార్కర్లతో, బౌన్సర్లతో వారిని బోల్తా కొట్టిస్తాడు. అయితే, తాజాగా బుమ్రా కూడా కాస్త సహనం కోల్పోయాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా- వెస్టిండీస్ (IND vs WI 2nd Test) మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటకు చేరుకుంది. 173/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.జాన్ క్యాంప్బెల్ సెంచరీఇక ఆదివారం 87 పరుగులతో క్రీజులో నిలిచిన విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (John Campbell)... సెంచరీ (115) సాధించాడు. అయితే, క్యాంప్బెల్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ బుమ్రా అతడిని వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నట్లు కనిపించింది.ఎల్బీడబ్ల్యూ కాదుఅయితే, ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్వర్త్ మాత్రం తల అడ్డంగా ఉపుతూ ఎల్బీడబ్ల్యూ (Leg Before Wicket) ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో టీమిండియా రివ్యూకి వెళ్లింది. అయితే, రీప్లేలో అల్ట్రాఎడ్జ్ స్పైక్ వచ్చింది. కానీ బంతి ముందుగా ప్యాడ్స్ లేదంటే బ్యాట్ను తాకిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బంతి అటు బ్యాట్కు.. ఇటు ప్యాడ్కు అత్యంత సమీపంగా ఉన్నట్లు కనిపించడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది.ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఇన్సైడ్ ఎడ్జ్ ఉందని.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండవచ్చని స్పష్టం చేశాడు. దీంతో టీమిండియా రివ్యూ కోల్పోయింది.ఇది అవుట్ అని మీకూ తెలుసుఈ క్రమంలో బుమ్రా తిరిగి బౌలింగ్కు వెళ్లే సమయంలో.. ‘‘ఇది అవుట్ అని మీకూ తెలుసు. కానీ సాంకేతికత కూడా దానిని నిరూపించలేదు కదా!’’ అంటూ నవ్వుతూనే అంపైర్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. కాగా విండీస్ రెండో ఇన్నింగ్స్ 55వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.ఇక ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 93 ఓవర్ల ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తద్వారా 33 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు టీమిండియా 518/5 వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. విండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది.pic.twitter.com/fDtB3GBWPV— crictalk (@crictalk7) October 13, 2025చదవండి: జైస్వాల్ అంటే గిల్కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్Trapped! 🕸#RavindraJadeja gets the all-important wicket of centurion #JohnCampbell. 💪Catch the LIVE action 👉 https://t.co/WbUGnskEdz#INDvWI 👉 2nd Test, Day 4 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/eHUVezgNs2— Star Sports (@StarSportsIndia) October 13, 2025 -
ఆరేసిన సౌతాఫ్రికా స్పిన్నర్.. విలవిల్లాడిన పాక్ బ్యాటర్లు
సొంతగడ్డపై ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాక్ 378 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 313/5 ఓవర్ నైట్ స్కోర్తో అదనంగా 65 పరుగులు సాధించి ఆలౌటైంది. ఓ దశలో పాకిస్తాన్ నాలుగు వందలకు పైగా సాధిస్తుందని భావించారు.కానీ స్పిన్నర్ ముత్తుసామి దెబ్బకు ఆతిథ్య జట్టు ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను త్వరగా ముగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్ దాటికి పాక్ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (153 బంతుల్లో 93; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ షాన్ మసూద్ (147 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (140 బంతుల్లో 75; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సల్మాన్ ఆఘా (145 బంతుల్లో 93 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (2) విఫలం కాగా... ఇమామ్తో కలిసి షాన్ మసూద్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జంట రెండో వికెట్కు 161 పరుగులు జోడించడంతో పాకిస్తాన్కు శుభారంభం దక్కింది. రెండేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న ఇమామ్... చక్కటి షాట్ సెలెక్షన్తో ఆకట్టుకున్నాడు. అయితే షాన్ మసూద్ అవుటైన అనంతరం ఒకే స్కోరు వద్ద పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది.199 పరుగుల వద్ద ఇమామ్ ఉల్ హక్తో పాటు సౌద్ షకీల్ (0), బాబర్ ఆజమ్ (23) వెనుదిరిగారు. దీంతో పాక్ జట్టు 199/5తో కష్టాల్లో పడింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా... హర్మెర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో ప్రత్యర్ధి పైచేయి సాధించే అవకాశం ఇవ్వకుండా వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా మెరుగ్గా ఆడారు. చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా? -
జైస్వాల్ అంటే గిల్కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)భారీ శతకం బాదాడు. మొత్తంగా 258 బంతులు ఎదుర్కొనని 175 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో ఘోర తప్పిదం చేశాడు.ఇరవై ఐదు పరుగుల దూరంలోఅనవసరపు పరుగుకు యత్నించిన జైసూ.. రనౌట్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాడు. ద్విశతకానికి ఇరవై ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఢిల్లీ వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.భారత్ తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో జేడన్ సీల్స్ (Jayden Seals) బౌలింగ్లో జైస్వాల్.. బంతిని మిడాఫ్ దిశగా బాదగా.. అది నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, అప్పటికే సింగిల్ కోసం జైసూ క్రీజును వీడగా.. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మాత్రం పరిస్థితిని అంచనా వేసి తన స్థానం నుంచి కదిలినా మళ్లీ యథాస్థితికి వచ్చాడు.తలబాదుకుంటూఇంతలో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా అప్పటికే బంతిని అందుకున్న విండీస్ వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్.. దానిని వికెట్లకు గిరాటేయగా.. జైసూ రనౌట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జైస్వాల్ తలబాదుకుంటూ మైదానం వీడాడు.ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు గిల్ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్కు దిగారు. జైస్వాల్ అంటే గిల్కు అసూయ అని.. అందుకే అతడు రన్ కోసం పిలుపునిచ్చినా సరైన సమయంలో స్పందించలేదని నిందిస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు.జైస్వాల్ అంటే గిల్కు అసూయా?‘‘నితీశ్ రెడ్డి కోసం గిల్ పరిగెడతాడు. కానీ జైస్వాల్ కోసం సింగిల్ తీయడు. ఎందుకిలా?.. ఎందుకంటే.. జైస్వాల్ అంటే గిల్కు అసూయ!.. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?వారి విషయంలోనూ ఇలాగే చేశారురోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలోనూ మీరు ఇలాగే చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరూ కలిసికట్టుగా జట్టును గెలిపించారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇద్దరూ ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.ఇక ఇప్పుడు మీరేమో మళ్లీ జైస్వాల్- గిల్ల గురించి ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టారు. వాళ్లిద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒకే జట్టుకు ఆడుతున్నారు. ఈ రనౌట్ విషయంలో తప్పు ఎవరిదైనా.. డ్రెసింగ్రూమ్లో వాళ్లిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో కూడా చూడండి.అసహనం ప్రదర్శించాడంతేఈ ఘటన తర్వాత కూడా వాళ్లిద్దరు ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందో అర్థంకాక జైస్వాల్ అసహనం ప్రదర్శించాడంతే. ఫ్యాన్స్ ఆర్మీలే ఇలాంటి గొడవలు సృష్టిస్తాయి. కలిసికట్టుగా కాకుండా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆడతారని కామెంట్లు చేస్తారు. గిల్- జైస్వాల్ల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దయచేసి ఇలాంటి ట్రోలింగ్ ద్వారా వారి కెరీర్పై ప్రభావం పడేలా చేయకండి. వాళ్లిద్దరు కలిసి భారత క్రికెట్ను ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడండి’’ అంటూ ఆకాశ్ చోప్రా ట్రోలర్స్పై మండిపడ్డాడు.కాగా విండీస్తో రెండో టెస్టులో గిల్ అజేయ శతకం (129) సాధించిన తర్వాత.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్.. ఫాలో ఆన్ ఆడుతోంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా? -
రెండేళ్ల కిందట మ్యాచ్ ఫిక్సింగ్.. కట్ చేస్తే! ఇప్పుడు పాక్ తరపున అరంగేట్రం
సౌతాఫ్రికా-పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లహోర్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లహోర్ టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది.ఈ మ్యాచ్తో 38 ఏళ్ల లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. కాగా 2022లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రుజువు కావడంతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. బుకీలు తనను సంప్రదించినప్పటికి పీసీబీ ఆంటీ-కరప్షన్ విభాగానికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆసిఫ్పై అనర్హత వేటు పడింది.గతేడాది అతడిపై పీసీబీ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడిన అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడికి సౌతాఫ్రికాతో టెస్టులకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడిని జట్టులోకి తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అయినపప్పటికి టీమ్ మెనెజ్మెంట్ ఏకంగా తుది జట్టులోనే చోటు ఇచ్చి అందరిని ఆశ్చర్చపరిచింది. అసిఫ్ అఫ్రిది 39 ఏళ్ల మరో స్పిన్నర్ నమాన్ అలీతో బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు.ఆసియాకప్-2025కు దూరమైన స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు కూడా ఈ తుది జట్టులో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో షాహీన్ షా అఫ్రిది, హసన్ అలీ పాక్ జట్టుకు కీలకం కానున్నారు. కాగా ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు పాక్ తుది జట్టుఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, నౌమన్ అలీ, ఆసిఫ్ అఫ్రిది. -
ఇదొక ఊహించని పరిణామం.. తప్పు అతడిదే: కుంబ్లే
టెస్టుల్లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించాడు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal). వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా ముచ్చటగా మూడోది పూర్తి చేస్తాడనుకుంటే ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.25 పరుగుల దూరంలోఢిల్లీలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. అనవసరపు పరుగు కోసం యత్నించి జైసూ మూల్యం చెల్లించాడు. 175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.జేడన్ సీల్స్ (Jayden Seales) బౌలింగ్లో బంతిని మిడాఫ్ దిశగా జైసూ బంతిని బాదగా.. అది నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. అయితే అప్పటికే పరుగు కోసం క్రీజు వీడిన జైస్వాల్.. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ శుబ్మన్ గిల్కు పిలుపునిచ్చాడు. కానీ ఫీల్డర్ చేతికి బంతి చిక్కడంతో జాగ్రత్త పడ్డ గిల్ కాస్త ముందుకు కదిలినా మళ్లీ తన స్థానంలోకి వచ్చేశాడు.గిల్కు మద్దతుగా కుంబ్లేఇంతలో జైసూ వెనక్కి పరిగెత్తగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో జైసూ- గిల్ తీరుపై విమర్శలు వస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం గిల్కు మద్దతుగా నిలిచాడు. స్వీయ తప్పిదంతోనే జైస్వాల్ వికెట్ పారేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు.‘‘ఇదొక ఊహించని పరిణామం. జైస్వాల్ వంటి ప్రతిభావంతమైన ఆటగాడు ఇలా చేస్తాడని ఎవరైనా అనుకుంటారా?.. తన షాట్ బాగానే ఆడానని జైస్వాల్ భావించి ఉంటాడు. ఏదేమైనా పరుగుకోసం వెళ్లాలనేది జైస్వాల్ నిర్ణయం.తప్పంతా అతడిదేఇందులో నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఆటగాడి (గిల్) తప్పేమీ లేదు. ఎందుకంటే జైసూ మిడాఫ్ ఫీల్డర్కు నేరుగా బంతిని అందించినట్లయింది. ఆ సమయంలో పరుగుకు తీయడానికి అసలు అవకాశమే లేదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో కుంబ్లే పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గిల్ 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
వెస్టిండీస్తో రెండో టెస్టు.. టీమిండియా భారీ స్కోరు.. డిక్లేర్డ్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగడంతో భారత్ ఈ మేర స్కోరు సాధ్యమైంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా భారత్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ రెండు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్లో ఇరుజట్లు తలపడగా.. టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్ భారీ శతకంఇక ఢిల్లీలో శుక్రవారం రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలు కాగా.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) ఊహించని విధంగా స్టంపౌట్ కాగా.. యశస్వి జైస్వాల్ మాత్రం భారీ శతకంతో విరుచుకుపడ్డాడు.తొలి టెస్టు సెంచరీ మిస్మరోవైపు.. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (87)కెరీర్లో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన టీమిండియా.. శనివారం ఆట మొదలైన కాసేపటికే మూడో వికెట్ కోల్పోయింది.జైసూ రనౌట్175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి జైస్వాల్ రనౌట్ అయి.. డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, కెప్టెన్ గిల్ నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేసి.. అర్ధ శతకాలు పూర్తి చేసుకోకుండానే వెనుదిరిగారు.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025గిల్ నిలకడగాఇక గిల్ మొత్తంగా 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ రాహుల్, సాయి, నితీశ్ రెడ్డి వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ జురెల్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.ఆరునెలలు తిరిగే లోపేఅంతేకాదు.. ఈ ఏడాది గిల్కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. 2017, 2018లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టి ఆరునెలలు తిరిగే లోపే గిల్ ఈ ఫీట్ సాధించడం మరో విశేషం.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025ఇంగ్లండ్ పర్యటనలో నాలుగుకాగా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానంలో గిల్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల్లో భాగంగా గిల్ నాలుగు శతకాలు బాదాడు.అంతేకాదు ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 269 పరుగులు సాధించి.. ఈ వేదిక మీద డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో అహ్మదాబాద్లో తొలి టెస్టు జరుగగా.. భారత్.. విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన భారత జట్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఉన్న వేళ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గిల్ 196 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) భారీ శతకం సాధించగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) గొప్పగా రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38, ఆల్రౌండర్ నితీశ్ కుమార్రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ జొమెల్ వారికన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
అతడు సెహ్వాగ్లా కానేకాదు!.. సూపర్ ప్లేయర్: మాజీ క్రికెటర్
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్తో రెండో టెస్టులో జైసూ శతక్కొట్టిన తీరు అద్భుతమని కొనియాడాడు. చాలా మంది జైసూను.. విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)తో పోలుస్తారన్న ఆకాశ్ చోప్రా.. అది నిజం కాదన్నాడు.ఏడో సెంచరీసెంచరీతో తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సెంచరీలు బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. విండీస్తో రెండో టెస్టు సందర్భంగా శుక్రవారం ఏడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించుకున్న ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి.. 253 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 173 పరుగులు చేశాడు.మొదటి బంతి నుంచే హిట్టింగ్ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘చాలా మంది జైస్వాల్ను తరచూ వీరేందర్ సెహ్వాగ్తో పోలుస్తూ ఉంటారు. కానీ అతడు సెహ్వాగ్ కంటే భిన్నమైన ప్లేయర్.వచ్చామా.. మొదటి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలి అన్నట్లుగా సెహ్వాగ్ అప్రోచ్ ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలపై దూకుడు ప్రదర్శిస్తూ కుదిరితే లంచ్లోపే సెంచరీ కొట్టేయాలని వీరూ భావించేవాడు.జైస్వాల్ అలా కాదుకానీ జైస్వాల్ అలా కాదు. అతడి మైండ్సైట్ సెహ్వాగ్ కంటే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం టెస్టుల్లో మాత్రమే అతడికి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడంపైనే అతడి దృష్టి ఉంది.పిచ్ ఒకవేళ బాగుంటే.. బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా ఉన్నా.. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలుపెడతాడు. ఓపికగా ఆడుతూ.. అవసరమైనపుడు మాత్రమే షాట్లు బాదుతూ అనుకున్న పనిని పూర్తి చేస్తాడు.ప్రతి బంతిని షాట్ బాదాలన్న ఇగో ఏమాత్రం లేదు. భోజనానికి ముందు ఓపికగా ఆడిన జైసూ.. ఆ తర్వాత అటాకింగ్ మొదలుపెట్టాడు. ప్రత్యర్థిని బెంబెలెత్తించి భారీ శతకం సాధించాడు’’ అని ఆకాశ్ చోప్రా జైస్వాల్ను ప్రశంసించాడు.రనౌట్కాగా తొలిరోజు అదరగొట్టిన జైస్వాల్.. శనివారం రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన ఈ 23 ఏళ్ల బ్యాటర్.. డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక శనివారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు చేసింది.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
నితీశ్ రెడ్డికి ప్రమోషన్.. ధనాధన్ దంచికొట్టి.. అంతలోనే..
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా (IND vs WI) అదరగొడుతోంది. రెండు మ్యాచ్ల సిరీస్ను వైట్వాష్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గిల్ సేన.. లక్ష్యం దిశగా పయనిస్తోంది. శనివారం నాటి రెండో రోజు ఆట భోజన విరామ సమయానికి 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.కాగా అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. ఢిల్లీలో విండీస్తో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. తొలిరోజు ఆటలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 318 పరుగులు చేసి ఆధిక్యం ప్రదర్శించింది.డబుల్ సెంచరీ మిస్ చేసుకు న్న జైసూఈ క్రమంలో 318/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 173 పరుగులతో ఆట మొదలుపెట్టిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. మరో రెండు పరుగులు జతచేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దీంతో డబుల్ సెంచరీ చేయకుండానే జైసూ (175) నిష్క్రమించాడు.నితీశ్ రెడ్డి ధనాధన్అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జోరు కనబరిచిన ఈ విశాఖ కుర్రాడు.. తృటిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 54 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత బంతితో నితీశ్ రెడ్డిని వెనక్కి పంపాడు.𝗕𝗶𝗴 𝗵𝗶𝘁, 𝗯𝗶𝗴 𝗶𝗺𝗽𝗮𝗰𝘁! 🙌#NitishKumarReddy hits a massive six, firing up the crowd as #TeamIndia builds momentum. 🔥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/OZzBhNROPF— Star Sports (@StarSportsIndia) October 11, 2025 ఐదో నంబర్కు ప్రమోట్ అయిటీమిండియా తొలి ఇన్నింగ్స్ 108.3వ ఓవర్లో వారికన్ బౌలింగ్లో జేడన్ సీల్స్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రెడ్డి పెవిలియన్ చేరాడు. కాగా బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో నంబర్కు ప్రమోట్ అయి.. ధనాధన్ దంచికొట్టి ఇలా అతడు వెనుదిరగడం అభిమానులన నిరాశపరిచింది.ఇక లంచ్ బ్రేక్ సమయానికి గిల్ 75 పరుగులు, ధ్రువ్ జురెల్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అంటే తొలి రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ శతకం (87) చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక విండీస్ తీసిన నాలుగు వికెట్లలో మూడు వారికన్ ఖాతాలోనే ఉన్నాయి. జైసూ రనౌట్తో విండీస్కు మరో కీలక వికెట్ దక్కింది.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!Leading from the front! 👑Captain @ShubmanGill brings up a classy half-century - crossing 1000 runs as skipper in international cricket! 💥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CDjnnehzO6— Star Sports (@StarSportsIndia) October 11, 2025 -
గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!
వెస్టిండీస్తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది.తొలిరోజు భారత్దేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan- 87) రాణించాడు.జైసూ డబుల్ సెంచరీ మిస్ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173, కెప్టెన్ శుబ్మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక శనివారం ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన జైస్వాల్ తన తొందరపాటు చర్యతో రనౌట్ అయ్యాడు.గిల్ తప్పా?టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో విండీస్ పేసర్ జేడన్ సీల్స్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్లో రెండో బంతికి మిడాఫ్ దిశగా జైసూ బాదిన బంతి నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, ఇంతలోనే జైస్వాల్ పరుగు కోసం క్రీజు వీడగా.. గిల్ మాత్రం పరిస్థితికి తగ్గట్టుగా నాన్-స్ట్రైకర్ ఎండ్లోనే ఉండిపోయాడు.Yashasvi Jaiswal (runout) seems to have developed a habit of taking off for a run even when the ball goes straight to the fielder. He really needs to learn from this —When you're on a big score, what's the rush for a single? 🤦♂️pic.twitter.com/asdamXT1zj— Sporttify (@sporttify) October 11, 2025 తల బాదుకున్న జైసూదీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా.. అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దానిని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్నైట్ స్కోరుకు కేవలం రెండు పరుగులు జతచేసి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైసూ.. కోపంలో తలబాదుకుంటూ క్రీజును వీడాడు.తప్పు నీదేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతుండగా.. కొంతమంది గిల్ను తప్పుబడుతున్నారు. అయితే, చాలా మంది మాత్రం.. ‘బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినా తొందరపడి పరుగుకు రావడం జైసూ తప్పు. అతడికి ఇదొక అలవాటుగా మారింది. 175 పరుగులు చేసిన నీకు ఈ రిస్కీ సింగిల్ అవసరమా? ఇది నీ స్వీయ తప్పిదం’’ అంటూ జైస్వాల్ను విమర్శిస్తున్నారు.కాగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 258 బంతులు ఎదుర్కొని 22 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. వంద ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్గా ఉండే గంభీర్పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
హార్ట్బ్రేక్.. చేజారిన టెస్టు తొలి సెంచరీ
వెస్టిండీస్తో రెండో టెస్టు (IND vs WI)లో టీమిండియా వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)కు చేదు అనుభవం ఎదురైంది. అద్భుతమైన ఇన్నింగ్స్తో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలి టెస్టు శతకానికి పదమూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. దీంతో సాయితో పాటు అతడి అభిమానుల హార్ట్బ్రేక్ అయింది.జైస్వాల్ భారీ శతకంభారత్- వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) భారీ శతకంతో మెరిశాడు. అతడికి జతగా వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా అదరగొట్టాడు.193 పరుగుల భాగస్వామ్యంఈ ఇద్దరు లెఫ్టాండర్లు కలిసి రెండో వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు రాబట్టిన సాయి సుదర్శన్.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా సాయి టెస్టుల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ఇక తొలిరోజు 83 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో వారికన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జైసూ 151, కెప్టెన్ శుబ్మన్ గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున నాలుగు మ్యాచ్లు ఆడిన ఈ చెన్నై చిన్నోడు 234 పరుగులు సాధించాడు. చదవండి: దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్.. భారత రెండో బ్యాటర్గా.. At his clinical best! 🧿#SaiSudharsan makes batting look easy as he brings up his half-century! 🙌Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/yhYag1I0if— Star Sports (@StarSportsIndia) October 10, 2025 -
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. దిగ్గజాల సరసన
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టాడు. ఢిల్లీ వేదికగా శుక్రవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 145 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ యాభైవ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి జైసూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు.కాగా టెస్టు కెరీర్లో జైస్వాల్కు ఇది ఏడో శతకం కావడం విశేషం. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అరుదైన క్లబ్లో చేరాడు. 24 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన దిగ్గజాల సరసన నిలిచాడు. టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో బ్యాటర్గా జైసూ చరిత్రకెక్కాడు.ఇక 23 ఏళ్ల జైస్వాల్ 2023లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయిన జైసూ.. తాజాగా మరోసారి సెంచరీతో మెరిశాడు.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. వైట్వాష్పై గురిపెట్టింది. రెండో టెస్టు తొలిరోజు టీ బ్రేక్ సమయానికి 58 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే నిష్క్రమించగా.. జైసూ 162 బంతుల్లో 111, వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 132 బంతుల్లో 71 పరుగులతో క్రీజులో ఉన్నారు.24 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు వీరే🏏డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా)- 12🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)-11🏏గ్యారీ సోబర్ఫీల్డ్ (వెస్టిండీస్)- 9🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్), గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), యశస్వి జైస్వాల్ (ఇండియా)-7.చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రాWhat a player! 👏@ybj_19 joins South African icon #GraemeSmith to score the most Test tons (7) by an opener aged 23 or younger! 🙌Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/aig46QChOd— Star Sports (@StarSportsIndia) October 10, 2025 -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?
ఢిల్లీ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య శుక్రవారం (అక్టోబరు 10) రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలైంది. అరుణ్జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill).. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ టీమిండియాకు శుభారంభం అందించారు.ఈసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్అయితే, గత మ్యాచ్లో సెంచరీ సాధించిన రాహుల్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచాడు. 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. విండీస్ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ జొమెల్ వారికన్ తన తొలి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రాహుల్ను బోల్తా కొట్టించాడు.Shifting gears! ⚙After a steady start, @klrahul unwinds with an elegant punch down the ground. ⚡Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CpSkK3IJXi— Star Sports (@StarSportsIndia) October 10, 2025స్టంపౌట్గాటీమిండియా తొలి ఇన్నింగ్స్లో పద్దెనిమిదవ ఓవర్ మూడో బంతికి వారికన్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ బెయిల్స్కు గిరాటేశాడు. pic.twitter.com/iNdmtNK9e6— crictalk (@crictalk7) October 10, 2025 దీంతో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే దురదృష్టవశాత్తూ స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 58 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?ఇక తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ఓపికగా ఆడుతున్నాడు. తొలిరోజు నాటి భోజన విరామ సమయానికి జైసూ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇక వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ 36 బంతుల్లో మూడు ఫోర్లు బాది 16 పరుగులతో జైసూతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా శుక్రవారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 28 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో త్తుగా ఓడించి.. రెండుమ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తుది జట్లు..టీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహహ్మద్ సిరాజ్వెస్టిండీస్: జాన్ క్యాంప్బెల్, తగ్నరైన్ చందర్పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
రోహిత్పై వేటు!.. నాకు ముందే తెలుసు: శుబ్మన్ గిల్
రోహిత్ శర్మ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు. రోహిత్ భయ్యా తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).వన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు!గతేడాది టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన రోహిత్.. ఈ ఏడాది ఐసీసీ (వన్డే) చాంపియన్స్ ట్రోఫీ -2025లో జట్టుకు కప్ అందించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించగా.. టెస్టు సారథిగా గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అయితే, వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినా.. బీసీసీఐ (BCCI) ఇటీవలే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. రోహిత్ స్థానంలో వన్డే కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ను నియమించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడి శకం మొదలుకానుంది. ఇక ప్రసుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు.నాకు ముందే ఈ విషయం గురించి తెలుసుఈ సందర్భంగా వన్డే సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే, అంతకంటే ముందే నాకు ఈ విషయం గురించి తెలుసు. నాకు దక్కిన గొప్ప గౌరవం. అతిపెద్ద బాధ్యత.వన్డేల్లో టీమిండియాను ముందుకు నడిపించడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. గత కొన్ని నెలలుగా నా జీవితం కొత్తగా మారిపోయింది. ఉత్సుకతను పెంచింది. భవిష్యత్తులో జట్టును గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్నవి ఇవేఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావన రాగా.. ‘‘రోహిత్ భాయ్లో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిని వారసత్వంగా నేను స్వీకరిస్తా. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం.. డ్రెసింగ్రూమ్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ఆయనలో నాకు నచ్చే గుణాలు. ఈ రెండింటిని నేను తప్పకుండా కొనసాగిస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు.కాగా వెస్టిండీస్తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అక్టోబరు 10- 14 మధ్య జరిగే రెండో టెస్టులోనూ గెలిచి వైట్వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. చదవండి: నిజం చెప్పడానికి సిగ్గెందుకు?: సూర్యకుమార్ యాదవ్ -
నితీశ్ కుమార్ రెడ్డిపై టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు
టీమిండియాలోకి దూసుకువచ్చిన నయా సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy). ఈ ఆంధ్ర ఆల్రౌండర్ గతేడాదే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. మెల్బోర్న్ క్రికెట్లో సెంచరీ (114)తో సత్తా చాటాడు.వెస్టిండీస్తో సిరీస్లో.. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన నితీశ్ రెడ్డి.. ఆస్ట్రేలియాతో సిరీస్ (IND vs AUS) సందర్భంగా ఇటీవలే తొలిసారిగా వన్డే జట్టుకూ ఎంపికయ్యాడు. ఇక 22 ఏళ్ల ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ప్రస్తుతం వెస్టిండీస్ (IND vs WI)తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్తో బిజీగా ఉన్నాడు.బౌలింగ్ పరిమితం.. నో బ్యాటింగ్అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టులో నితీశ్ రెడ్డికి.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్ చేసే అవకాశం వచ్చింది. మొత్తంగా పదహారు పరుగులు ఇచ్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కే రాలేదు.ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 445-8 వద్ద డిక్లేర్ చేయడం సహా.. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలవడంతో నితీశ్ రెడ్డికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. విదేశీ గడ్డపైనే కీలకంఈ నేపథ్యంలో విండీస్తో రెండో టెస్టుకు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే నితీశ్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ అరుదైన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ సేవలను విదేశీ గడ్డపై ఎక్కువ ఉపయోగించుకోవాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.‘‘అతడొక అద్భుతమైన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ చేయగల అరుదైన సీమ్ బౌలర్ తను. కాబట్టి తన శరీరానికి కూడా కాస్త విశ్రాంతి కావాలి. హార్దిక్ పాండ్యా విషయంలోనూ మేము ఇలాగే చేశాము.సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ల నైపుణ్యాల విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే, టెస్టు క్రికెట్లో వారి శరీరం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. తాను ఎంత గొప్పగా బ్యాటింగ్ చేయగలడో నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో నిరూపించాడు.నాణ్యమైన ఆల్రౌండర్విదేశీ గడ్డ మీద అతడు కీలకం. మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కోబోతున్నాడు. ఇక స్వదేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అతడి సేవలను పరిమితం చేసినా పెద్దగా తేడా ఉండదు. అతడొక నాణ్యమైన ఆల్రౌండర్ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం (అక్టోబరు 10)- మంగళవారం (అక్టోబరు 14) వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ఫిట్గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు: స్పందించిన షమీ -
మహ్మద్ షమీ కీలక నిర్ణయం
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.చాంపియన్ జట్టులోకోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో ఐదు మ్యాచ్లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.రెండేళ్ల నుంచీ నిరాశే పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.షమీ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి అప్డేట్ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్ కోచ్ టెలిగ్రాఫ్తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్ మ్యాచ్ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్ మ్యాచ్లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.అయితే, ఐపీఎల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్.. కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్కు ఎండ్ కార్డ్? -
ఫ్రీ ఫ్రీ.. రండి బాబు రండి! బ్రతిమాలుకుంటున్న పీసీబీ
ఆసియాకప్-2025 టైటిల్ను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు మరో కఠిన సవాల్కు సిద్దమవుతోంది. స్వదేశంలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సౌతాఫ్రికాతో పాక్ తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లహోర్ వేదికగా అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16 వరకు జరగనుంది.ఈ నేపథ్యంలో అభిమానులను ఆకర్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో కొన్ని స్టాండ్స్ వరకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశాన్ని పీసీబీ కల్పించింది. జనరల్, ఫస్ట్-క్లాస్, ప్రీమియం, వీఐపీ ఎన్క్లోజర్ స్టాండ్స్కు ఎటువంటి ధరలను పాక్ క్రికెట్ కేటాయించలేదు. తొలి టెస్టు జరిగే లహోర్లో వీఐపీ ఇక్బాల్ అండ్ జిన్నా ఎండ్, గ్యాలరీ టిక్కెట్ ధరలను పీకేఆర్ 800-1,000( భారత కరెన్సీలో రూ.350-రూ.440)గా నిర్ణయించారు. రావాల్పిండి స్టేడియంలో పీసీబీ గ్యాలరీ మొదటి నాలుగు రోజుల టిక్కెట్ ధర పీకేఆర్ 800(రూ.350), ఐదో రోజు పీకేఆర్ 1,000 (రూ.440)గా కేటాయించారు. పాకిస్తాన్లో టెస్టు క్రికెట్కు అదరణ రోజు రోజుకు తగ్గిపోతుంది. పాక్ జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ప్రేక్షకులు స్టేడియంకు రావడం లేదు. ఇంతకుముందు జరిగిన టెస్టు సిరీస్లలో స్టాండ్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే ప్రీ ఎంట్రీ ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఇప్పటికైనా స్టేడియాలకు ప్రేక్షకులు వస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు అన్న మాటతో ఇలా..: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా ఉన్నాడు. 2017లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ పేస్ బౌలర్.. అదే ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత రెండేళ్లకు వన్డేల్లో.. మూడేళ్లకు టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు ప్రధాన బౌలర్గా ఎదిగాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విశ్రాంతి లేకుండా వెయ్యికి పైగా బంతులు బౌల్ చేసి.. ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు.ఇక ప్రస్తుతం వెస్టిండీస్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న సిరాజ్.. కెరీర్ తొలినాళ్లలో తనపై ట్రోలింగ్ జరిగిన తీరు.. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఇచ్చిన సలహాల గురించి తాజాగా పంచుకున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ధోని ఆరోజు నాకో మాట చెప్పాడు‘‘నేను టీమిండియాలో అడుగుపెట్టినపుడే ఎంఎస్ ధోని నాకో మాట చెప్పాడు. ‘ఇతరులు ఏమంటున్నారో అస్సలు పట్టించుకోకు. నువ్వు బాగా ఆడినపుడు ప్రపంచం మొత్తం నీతోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు విఫలమైతే మాత్రం నిన్ను దూషించడానికి కూడా ఎవరూ వెనుకాడరు’ అని అన్నాడు.అవును.. కెరీర్ తొలినాళ్లలో నేనూ ట్రోలింగ్ బారినపడ్డాను. ఏదేమైనా ట్రోల్స్ చేయడం చెడ్డ విషయం. నేను బాగా ఆడినపుడు అభిమానులతో పాటు ఈ ప్రపంచం మొత్తం.. ‘వారెవ్వా.. సిరాజ్ లాంటి బౌలర్ మరొకరు లేనేలేరు’ అని ప్రశంసిస్తారు.వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకోఒకవేళ నేను ఫెయిల్ అయితే.. ‘వెళ్లు.. వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’ అన్నవాళ్లూ లేకపోలేదు. ఇదే తరీఖా?.. ఓ మ్యాచ్లో హీరో అయిన వాళ్లు మరో మ్యాచ్లో పూర్తిగా జీరో అయిపోతారా? (నవ్వులు).ప్రజలు అంత త్వరగా తమ మాటలు మార్చేస్తారా?.. బయట వ్యక్తుల అభిప్రాయాలను పట్టించుకోవద్దని నేను చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు నా గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. వేరే వాళ్లను అసలు పట్టించుకోను. ఇతరులు నా గురించి ఏం అంటున్నా నేను లెక్క చేయను’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.తీవ్ర విషాదాన్ని దిగమింగుకుని..కాగా హైదరాబాద్కు చెందిన సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారు. అయినప్పటికీ క్రికెటర్ కావాలన్న కుమారుడి కలకు ఆయన ఊతమిచ్చారు. అయితే, తనకెంతో ఇష్టమైన సంప్రదాయ ఫార్మాట్లో కొడుకు అరంగేట్రం చేయడానికి కొన్ని రోజుల ముందే గౌస్ మరణించారు.ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా కోవిడ్ సమయంలో సిరాజ్ తండ్రి మృతి చెందారు. అయితే, సిరాజ్ మాత్రం అరంగేట్రం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తన తండ్రికి టెస్టు ఫార్మాట్ అంటే ఇష్టమని.. ఆయనకు తనిచ్చే నివాళి ఇదేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక అప్పటి నుంచి ప్రతి సిరీస్కు ముందు తండ్రి సమాధిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొడుకు క్రికెటర్ అవుతాడా అన్న హేళనలకు ఆటతోనే సమాధానం ఇచ్చి టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదిగి... రూ. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుకున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు.కాగా 31 ఏళ్ల సిరాజ్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 44 వన్డేలు, 42 టెస్టులు, 16 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు కూల్చాడు. ఐపీఎల్లో 108 మ్యాచ్లలో కలిపి 109 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
వరుసగా ఆరు ఓటములు.. మరేం పర్లేదు.. ఆ ముగ్గురు అద్భుతం: గిల్
వెస్టిండీస్తో తొలి టెస్టులో గెలుపు పట్ల టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక సంపూర్ణ మ్యాచ్ అని.. రెండు ఇన్నింగ్స్లో బౌలర్లు రాణించిన తీరు అద్భుతమని కొనియాడాడు. బ్యాటింగ్ పరంగానూ తాము గొప్పగా ఆడామని.. ముగ్గురు సెంచరీలు చేయడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సారథిగా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్గా, కెప్టెన్గా రాణించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల్లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు.వరుసగా ఆరు ఓటములుతాజాగా వెస్టిండీస్తో తొలి టెస్టు (IND vs WI 1st Test)లోనూ ఇదే రిపీటైంది. అయితే, సారథిగా టాస్ ఓడినా మ్యాచ్లు మాత్రం గెలిచాడు గిల్. ఈ నేపథ్యంలో విండీస్పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘వరుసగా ఆరుసార్లు టాస్ ఓడిపోయాను.అయితే, మ్యాచ్లు మాత్రం గెలుస్తూనే ఉన్నాం. కాబట్టి టాస్లో ఓడిన ప్రభావం పడిందని అనుకోను. దానిని అసలు లెక్కేచేయను. ఇదొక సంపూర్ణ మ్యాచ్. విజయం పట్ల సంతోషంగా ఉంది.ఎలాంటి ఫిర్యాదులూ లేవుముగ్గురు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ రెండు ఇన్నింగ్స్లోనూ భేషుగ్గా ఉంది. ఏ విషయంలోనూ ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ఈ పిచ్ బ్యాటింగ్కు బాగానే ఉంది.అయితే, నేను, జైస్వాల్ మెరుగ్గా ఆడలేకపోయాము. శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయాము. ఇక మా స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వారిని రొటేట్ చేసుకోవడమే కష్టం. అయితే, ఇలాంటి సవాలు ఎదురుకావడం జట్టుకు మంచిదే.కెప్టెన్గా చాలా విషయాలు నేర్చుకుంటున్నాఅవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి పని పూర్తి చేస్తారు. మా జట్టులో యువకులు ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్గా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలుసుకుంటున్నా. జట్టుగా మేమంతా ఇప్పటికీ నేర్చుకునే దశలోనే ఉన్నాం. అనుభవం గడించే కొద్దీ మేము మరింత సానుకూలంగా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలం’’ అని గిల్ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104- నాటౌట్) సెంచరీలు చేయగా.. గిల్ 50 పరుగులు సాధించాడు. ఇక బౌలర్లలో పేసర్లు సిరాజ్ ఓవరాల్గా ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మూడు వికెట్లు కూల్చాడు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు, కుల్దీప్ యాదవ్ నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 448/5 డిక్లేర్డ్వెస్టిండీస్: 162 & 146ఫలితం: వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
వెస్టిండీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును.. ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టిగా రాణించి ముచ్చటగా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్తో తలపడిన టీమిండియా.. ఐదు మ్యాచ్లలో రెండు గెలిచి 2-2తో సిరీస్ సమం చేసుకుంది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడుతోంది.చెలరేగిన భారత బౌలర్లుఇందులో భాగంగా తొలుత అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs WI 1st Test) మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26), జస్టిన్ గ్రీవ్స్ (32) ఓ మోస్తరుగా రాణించారు.ఈ క్రమంలో 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి వెస్టిండీస్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్.. తగ్నరైన్ చందర్పాల్ (0), అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), రోస్టన్ ఛేజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.మరోవైపు.. బుమ్రా జాన్ కాంప్బెల్ (8), జస్టిన్ గ్రీవ్స్ (32), జొహాన్ లేన్ (1) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్.. షాయీ హోప్ (26), వారికన్ (8) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఖరీ పియరీ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రాహుల్, డీజే, జడ్డూ శతకాలుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 128 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు.అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే భారత్ తమ ఓవర్నైట్ స్కోరు 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 286 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ 146 పరుగులకే కుప్పకూలింది.మరోసారి చెలరేగిన భారత బౌలర్లుభారత బౌలర్ల విజృంభణ కారణంగా విండీస్ బ్యాటర్లు పెవిలియన్కు వరుసకట్టారు. సిరాజ్ టీమిండియా తరఫున వికెట్ల వేట మొదలుపెట్టగా.. జడ్డూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో విండీస్ను ఆడుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ (8) మరోసారి విఫలం కాగా.. జాన్ కాంప్బెల్ 14, బ్రాండన్ కింగ్ 5, రోస్టన్ ఛేజ్ 1, షాయీ హోప్ 1 పరుగు చేశారు. వన్డౌన్బ్యాటర్ అలిక్ అథనాజ్ 38 పరుగులు సాధించగా.. అతడితో కలిసి జస్టిన్ గ్రీవ్స్ (25) కాసేపు పోరాటం చేశాడు.టీమిండియా ఘన విజయంఆఖర్లో ఖరీ పియరీ 13 పరుగులతో అజేయంగా నిలవగా.. బౌలర్ జేడన్ సీల్స్ 22 పరుగులతో సత్తా చాటాడు. అయితే, కుల్దీప్ బౌలింగ్లో సీల్స్ పదో వికెట్గా వెనుదిరగడంతో విండీస్ పరాజయం ఖరారైంది.ఇన్నింగ్స్ మీద 140 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జడ్డూ నాలుగు, సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: వెస్టిండీస్.. తొలుత బ్యాటింగ్👉వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 162 ఆలౌట్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/5 డిక్లేర్డ్ ✊భారత్కు 286 పరుగుల ఆధిక్యం👉వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్✌️ఫలితం: వెస్టిండీస్పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా?Hugs and smiles all around 😊#TeamIndia celebrate a magnificent victory in Ahmedabad and take a 1-0 lead in the series 👏Scorecard ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/22q4aUUhqp— BCCI (@BCCI) October 4, 2025 -
జడ్డూ మాయాజాలం.. విండీస్ విలవిల!.. 49 పరుగులకే..
వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI) బౌలర్లు అదరగొడుతున్నారు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులకే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది.162 పరుగులకేరెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో విండీస్ను 162 పరుగులకే ఆలౌట్ చేసింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లు దక్కించుకున్నాడు.టీమిండియా భారీ స్కోరుచైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) రెండు వికెట్లు తీయగా.. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో.. భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాల వల్ల ఇది సాధ్యమైంది.220 పరుగులు వెనుకబడిఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 220 పరుగులు వెనుకబడి ఉంది.ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ (8) రూపంలో సిరాజ్ తొలి వికెట్ అందించగా.. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో మరో ఓపెనర్ జాన్ కాంప్బెల్ (14), నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (5), వికెట్ కీపర్బ్యాటర్ షాయీ హోప్ (1)లను వెనక్కి పంపించాడు.ఇక కుల్దీప్ యాదవ్.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (1)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. శనివారం లంచ్ బ్రేక్ సమయానికి వన్డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ 27, ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా..#TeamIndia's fielding brilliance continues 👏This time it's Yashasvi Jaiswal 👌West Indies 5️⃣ down now!Updates ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/5gKY0dXiVt— BCCI (@BCCI) October 4, 2025 -
వారెవ్వా!.. స్టన్నింగ్ క్యాచ్తో మెరిసిన నితీశ్ రెడ్డి.. వీడియో వైరల్
వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సంచలన క్యాచ్తో మెరిశాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి రెండు చేతులతో బంతిని ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షేర్ చేయగా నెట్టింట వైరల్గా మారింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్ (IND vs WI)తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకు ఆలౌట్ అయింది.ఇన్నింగ్స్ డిక్లేర్ఇందుకు బదులుగా టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 286 పరుగుల ఆధిక్యంలో ఉన్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విండీస్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.సిరాజ్ బౌలింగ్లో వెస్టిండీస్ ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. బంతిని గాల్లోకి లేపాడు. ఇంతలో.. స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి గాల్లోకి ఎగిరి.. డైవ్ చేసి మరీ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది.49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి..ఇక ఈసారి కూడా భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. శనివారం నాటి మూడో రోజు ఆటలో 23 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులు మాత్రమే చేసిన విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏Nitish Kumar Reddy grabs a flying stunner 🚀Mohd. Siraj strikes early for #TeamIndia ☝️Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en— BCCI (@BCCI) October 4, 2025 -
IND vs WI Day 3: ట్విస్ట్ ఇచ్చిన టీమిండియా!
వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI 1st Test) తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఊహించని రీతిలో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో విండీస్ బ్యాటింగ్కు దిగింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై టీమిండియా.. విండీస్తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం మొదటి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక విండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్ల విజృంభణభారత బౌలర్ల ధాటికి.. తొలి ఇన్నింగ్స్లో భాగంగా 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ జట్టు కుప్పకూలింది. ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (8), తగ్నరైన్ చందర్పాల్ (0)లతో పాటు.. వన్డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ (12) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.మిగతా వారిలో బ్రాండన్ కింగ్ (13), ఖరీ పియరీ (11) రెండంకెల స్కోరు చేయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26) ఫర్వాలేదనిపించారు. ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్లో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లతో చెలరేగగా.. బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బౌలర్లు ఇలా తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. బ్యాటర్లు కూడా విజృంభించారు.ముగ్గురు మొనగాళ్లుఓపెనర్ కేఎల్ రాహుల్ (100)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (125), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ శుబ్మన్ గిల్ 50 పరుగులు చేయగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) నిరాశపరిచాడు. ఇటీవల సూపర్ ఫామ్ కనబరిచిన సాయి సుదర్శన్ (7) మాత్రం ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. విండీస్పై మొదటి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వేట మొదలుపెట్టిన సిరాజ్ఫలితంగా విండీస్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొమ్మిది ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ తగ్నరైన్ చందర్పాల్ (8) మరోసారి విఫలం అయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ జాన్ కాంప్బెల్ 12, అలిక్ అథనాజ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ అదేమిటంటే...!ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా- విండీస్ (IND vs WI Tests) మధ్య రెండు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది.శతక్కొట్టిన కేఎల్ రాహుల్నరేంద్ర మోదీ మైదానంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి.. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 448 పరుగులు సాధించింది.I wish KL Rahul does what Michael Hussey has done in his career,KL hits his prime in 30s and wants him to score at least 10k test runs for india otherwise it's a waste of talent.India has done a lot of backing, now it's finally paying off.pic.twitter.com/JokYjzK6Lt— Sujeet Suman (@sujeetsuman1991) October 3, 2025 ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (36) ఫర్వాలేదనిపించగా... రెండో రోజు ఆట సందర్భంగా కేఎల్ రాహుల్ శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 197 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే.. వారికన్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇవ్వడంతో రాహుల్ శతక ఇన్నింగ్స్కు తెరపడింది.ఏకైక క్రికెటర్గా..కాగా టెస్టు మ్యాచ్లో రాహుల్ ఇలా సరిగ్గా వంద పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కావడం ఇది రెండోసారి. జూలైలో ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టులోనూ సెంచరీ చేసిన తర్వాత రాహుల్ పెవిలియన్ చేరాడు. ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్లో ఓ ఆటగాడు సరిగ్గా వంద పరుగులు చేసి రెండుసార్లు అవుట్ కావడం.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.అదే విధంగా.. ఓవరాల్గా టెస్టు కెరీర్లో 100 పరుగుల వద్ద రెండుసార్లు అవుటైన ఏడో ప్లేయర్గా కేఎల్ రాహుల్ నిలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాహుల్ కెరీర్లో ఇది పదకొండో టెస్టు సెంచరీ కావడం విశేషం.448/5 డిక్లేర్డ్ఇక రాహుల్ (100)తో పాటు ధ్రువ్ జురెల్ (125) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అజేయ సెంచరీ (104)తో క్రీజులో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం (100 బంతుల్లో 50) సాధించాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి 448 పరుగులు చేసిన టీమిండియా.. విండీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఇదే స్కోరు వద్ద (448/5) టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలం.. తిలక్ వర్మ మెరిసినా... -
టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్
వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చందర్పాల్ తనయుడు తేజ్నారాయణ్ చందర్పాల్ తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. దాదపు 20 నెలల తర్వాత విండీస్ జట్టులోకి వచ్చిన చందర్పాల్ తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో తేజ్నారాయణ్ డకౌట్గా వెనుదిరిగాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లను ఎదుర్కొవడానికి చందర్పాల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో 11 బంతులు ఎదుర్కొన్న చందర్పాల్ సిరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్స్ చేరాల్సింది. చందర్పాల్ 2022లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత జింబాబ్వేపై అద్బుతమైన డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఈ జూనియర్ చందర్ పాల్ ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత తన ఫామ్ను అతడు కోల్పోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టాడు. అతడు ఈ మ్యాచ్ కంటే ముందు చివరగా ఆస్ట్రేలియాపై గతేడాది జనవరిలో విండీస్ తరపున ఆడాడు.అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు అతడికి తిరిగి పిలుపునిచ్చారు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చందర్పాల్ ఇప్పటివరకు పది టెస్టు మ్యాచ్లు ఆడి 32.94 సగటుతో 560 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తడబడుతోంది. విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్లను దెబ్బ తీయగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
వెస్టిండీస్తో తొలి టెస్టు.. టీమిండియాకు ఊహించని షాక్
ఆసియాకప్-2025 అనంతరం తొలి సవాల్కు టీమిండియా సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్కు ముందు గిల్ సేనకు భారీ షాక్ తగిలింది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సుందర్ చేతి వేలికి గాయమైనట్లు సమాచారం.దీంతో అతడు ఫీల్డింగ్ డ్రిల్స్కు దూరంగా ఉన్నాడు. గాయం తర్వాత సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికి కాస్త అసౌకర్యంగా కన్పించినట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. అతడి చేతి వేలికి బీసీసీ వైద్య బృందం టేపింగ్ చేశారు. అయితే అతడి గాయం తీవ్రతపై ఇప్పటివరకు బీసీసీఐ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. కెప్టెన్ గిల్ మాత్రం సుందర్ వద్దకు వెళ్లి గాయం తీవ్రత గురుంచి తెలుసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సుందర్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ తమిళనాడు స్పిన్నర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆల్రౌండ్ షోతో సుందర్ అదరగొట్టాడు. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్లో కూడా అతడు టీమిండియాకు కీలకం కానున్నాడు. ఒకవేళ మ్యాచ్ సమయానికి అతడి ఫిట్గా లేకపోతే అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.వెస్టిండీస్ సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్ , మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్కు నఖ్వీ షరతు -
‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్పై వేటు’
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్ ముగిసిన తర్వాత బారత క్రికెట్ జట్టు టెస్టులతో బిజీ కానుంది. సొంతగడ్డపై వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా విండీస్ జట్టుతో టీమిండియా రెండు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారమే ఇందుకు సంబంధించిన జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ సారథ్యంలో.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసినట్లు తెలిపింది.ఓపెనర్ల కోటాలో వారేబీసీసీఐ ప్రకటించిన పదిహేను మంది సభ్యుల జట్టులో ఓపెనర్ల కోటాలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ తమ స్థానాల్ని పదిలం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సాయి సుదర్శన్ (Sai Sudharsan), దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయనున్నారు. వీరంతా దాదాపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నవాళ్లే.అతడిపై వేటుఅయితే, ఇంగ్లండ్ టూర్కు రిజర్వు ఓపెనర్గా సెలక్ట్ చేసిన అభిమన్యు ఈశ్వరన్పై మాత్రం సెలక్టర్లు ఈసారి వేటు వేశారు. దీంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టీమిండియా అరంగేట్రం కల మరోసారి వాయిదా పడింది. కాగా దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున పరుగుల వరద పారించిన అభిమన్యు ఈశ్వరన్.. 2022లో తొలిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.అభిమన్యు తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్న తర్వాత.. దాదాపు పదిహేను మంది అరంగేట్రం చేశారు. కానీ అతడు మాత్రం ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేకపోయాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో భాగంగా టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో మాత్రం మేనేజ్మెంట్ అతడిని ఆడించలేదు.బీసీసీఐపై తండ్రి విమర్శలుఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐని బాహాటంగానే విమర్శించారు. ‘‘అభిమన్యు అరంగేట్రం కోసం సంవత్సరాలు లెక్కబెడుతున్నాం. మూడేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు.అభిమన్యు సెలక్ట్ అయినపుడు జట్టులోనే లేని కరుణ్ నాయర్ను తిరిగి పిలిపించి ఇంగ్లండ్లో ఆడించారు. కానీ మావాడిని మాత్రం లెక్కచేయలేదు. సంప్రదాయ క్రికెట్లో రాణించిన వారిని పక్కనపెట్టి.. ఐపీఎల్లో ఆడిన వారికి పెద్దపీట వేస్తారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.అతడి తండ్రి గట్టిగా మాట్లాడాడు.. అందుకే ఆ ప్లేయర్పై వేటుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా స్పందించాడు. వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్కు అభిమన్యును ఎంపిక చేయకపోవడాన్ని విమర్శిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘అభిమన్యు ఈశ్వరన్ విషయంలో బాధగా ఉంది. నాకు తెలిసి.. ఇంగ్లండ్ పర్యటన తర్వాత అభిమన్యు తండ్రి ఘాటుగానే బీసీసీఐ తీరును విమర్శించారు. బహుశా అందుకే సెలక్టర్లు అతడిని తప్పించి ఉంటారు.అయితే, చీఫ్ సెలక్టర్ మాత్రం.. సొంతగడ్డపై టెస్టుల్లో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉండదని.. అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. ఇది కూడా కొంత వరకు సమంజసమే’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ పర్యటనలో వరుస అవకాశాలు ఇచ్చినా విఫలమైనా కరుణ్ నాయర్పై వేటు వేయడాన్ని చిక్కా సమర్థించాడు.చదవండి: IND vs WI: అందుకే సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్ -
కరుణ్ నాయర్పై వేటు
దుబాయ్: ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులకే పరిమితమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా... స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న రెండు మ్యాచ్లకూ అందుబాటులో ఉండనున్నాడు. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా అక్టోబర్ 2 నుంచి టీమిండియా... వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... అంతా ఊహించినట్లే జట్టు ఎంపిక సాగింది. దేశవాళీల్లో రాణించి ఇంగ్లండ్ టూర్కు ఎంపికైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ను ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించి దేవదత్ పడిక్కల్కు అవకాశమిచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల పడిక్కల్ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో 9 ఇన్నింగ్స్ల్లో కరుణ్ నాయర్ ఒక్క అర్ధశతకం మాత్రమే చేసి నిరాశ పరిచాడు. రెగ్యులర్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గైర్హాజరీలో రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిజర్వ్ ఓపెనర్, బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ను ఇక ఎంపిక చేయబోమని సెలెక్టర్లు సంకేతాలు పంపారు. గత మూడు నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పయనిస్తున్న ఓపెనర్ ఈశ్వరన్కు ఇక అవకాశాలు రావడం కష్టమే అని అగార్కర్ వెల్లడించాడు. వచ్చే ఏడాది కాలంలో భారత జట్టు విదేశాల్లో టెస్టు మ్యాచ్లు ఆడేది లేదు. స్వదేశంలో మ్యాచ్లకు ఓపెనర్లతో పాటు రిజర్వ్గా నారాయణ్ జగదీశన్ అందుబాటులో ఉన్నాడు. దీనిపై అగార్కర్ మాట్లాడుతూ... ‘సాధారణంగా విదేశీ పర్యటనలకు 16, 17 మందితో జట్టును ఎంపిక చేస్తారు. అలాంటి సమయంలో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ చక్కగా ఆడుతున్నారు. ఈ సమయంలో మూడో ఓపెనర్గా ఈశ్వరన్ను తీసుకొని అతడిని బెంచ్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ వరకు పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయని అగార్కర్ తెలిపాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్ రెడ్డి, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కరుణ్ నాయర్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించాం. కానీ అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. పడిక్కల్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. పోటీలో అతడు ముందున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ చక్కటి భరోసా కల్పించాడు. అతడికి మరిన్ని అవకాశాలిస్తాం. వెస్టిండీస్తో రెండు మ్యాచ్లకు ఇదే జట్టు. ఇంగ్లండ్తో చివరి టెస్టు ఆడని బుమ్రాకు ఆ తర్వాత కూడా తగినంత విశ్రాంతి లభించింది. దీంతో అతడు రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. –అజిత్ అగార్కర్, చీఫ్ సెలెక్టర్ -
IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)ను మరోసారి దురదృష్టం వెంటాడింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ (IND vs WI) ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే, ఈసారి గాయం వల్ల అతడికి ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.చివరగా గతేడాదిసొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు టెస్టులు ఆడి మూడు అర్ధ శతకాలు, ఓ సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు. చివరగా గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో సర్ఫరాజ్ టీమిండియాకు ఆడాడు.భారీగా బరువు తగ్గి... ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తారని ఆశించిన సర్ఫరాజ్ ఖాన్కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ క్రమంలో తనకు దొరికిన విరామాన్ని ఈ ముంబై బ్యాటర్ ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టేందుకు ఉపయోగించుకున్నాడు. రెండు నెలల వ్యవధిలో ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి గుర్తుపట్టలేనంతగా సన్నబడ్డాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ ద్వారా కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఈ రెడ్బాల్ టోర్నీలో ముంబై తరఫున సర్ఫరాజ్ శతకంతో సత్తా చాటాడు. 114 బంతుల్లో పది బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో 138 పరుగులు సాధించాడు. విండీస్కు జట్టును ఎంపిక చేసే సమయంలో తనను గుర్తుపెట్టుకోవాలన్నట్లుగా ఇలా బ్యాట్తోనే సెలక్టర్లకు సందేశం ఇచ్చాడు.అంతా తలకిందులుకానీ గాయం కారణంగా అంతా తలకిందులైంది. తొడ కండరాల నొప్పితో బాధపడిన 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్... దులిప్ ట్రోఫీ టోర్నీకి కూడా దూరమయ్యాడు. తాజాగా వెస్టిండీస్తో టెస్టులకు కూడా అతడు ఎంపిక కాలేదు. ఇందుకు గల కారణాన్ని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. గాయం కారణంగానే అతడు సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడని తెలిపాడు.కాగా టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 2- 6 తొలి టెస్టు.. ఢిల్లీలో అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.వెస్టిండీస్తో టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.చదవండి: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
BCCI: వెస్టిండీస్తో టెస్టులకు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో.. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది.ఇక స్వదేశంలో జరిగే ఈ సిరీస్కు గిల్ డిప్యూటీగా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను.. బీసీసీఐ వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతోనే భారత్ విండీస్తో బరిలో దిగనుంది.రిషభ్ పంత్ దూరం.. కరుణ్పై వేటువైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా వెస్టిండీస్తో సిరీస్కు దూరం కాగా.. ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలు చవిచూసిన కరుణ్ నాయర్పై వేటు పడింది. కాగా దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టీమిండియా తరఫున ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ధ్రువ్ జురెల్తో పాటు అతడు..ఐదు టెస్టుల్లో భాగంగా నాలుగు మ్యాచ్లు ఆడిన కరుణ్ నాయర్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయగలిగాడు. దీంతో బీసీసీఐ అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపకపోవడం గమనార్హం. మరోవైపు.. వికెట్ కీపర్ల కోటాలో.. పంత్ గైర్హాజరీలో ధ్రువ్ జురెల్తో పాటు తమిళనాడు ప్లేయర్ నారాయణ్ జగదీశన్ జట్టుకు ఎంపికయ్యాడు.నితీశ్ రెడ్డికి చోటుఇక గాయం వల్ల ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా.. విండీస్తో సిరీస్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో కలిసి ప్రసిద్ కృష్ణ మరోసారి సేవలు అందించనున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ ఆల్రౌండర్ల కోటాలో జడేజా, అక్షర్ పటేల్తో కలిసి వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నాడు.2-2తో సమంకాగా ఆసియా టీ20 కప్- 2025 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా అక్టోబరు 2- అక్టోబరు 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. కాగా చివరగా గిల్ సేన ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తలపడి 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్తో టెస్టులకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.చదవండి: పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. తగ్గమంటూ పీసీబీ ఓవరాక్షన్ -
వరల్డ్ చాంపియన్ సౌతాఫ్రికాకు భారీ షాక్!.. ఓ గుడ్న్యూస్ కూడా..!
పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ (South Africa tour of Pakistan, 2025) జట్టుకు భారీ షాక్ తగిలింది. పాక్తో టెస్టు సిరీస్కు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) దూరమయ్యాడు. పిక్కల్లో గాయం కారణంగా అతడు పాక్ టూర్కు అందుబాటులో ఉండటం లేదు.కాగా గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న బవుమా.. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో మరోసారి గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో పాక్ పర్యటనకు అతడు దూరమయ్యాడు.వరల్డ్ చాంపియన్గా నిలిపాడుఫలితంగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలినట్లయింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023- 2025 సీజన్లో బవుమా ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో ప్రొటిస్ జట్టును ఫైనల్కు చేర్చిన అతడు.. ఏకంగా చాంపియన్గానూ నిలిపాడు. తద్వారా డబ్ల్యూటీసీ మూడో సీజన్ టైటిల్ సౌతాఫ్రికా సొంతమైంది.బవుమా స్థానంలో అతడేఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ (2025-27)లో వరల్డ్ చాంపియన్ సౌతాఫ్రికా తొలుత పాకిస్తాన్తో తలపడనుంది. అదే విధంగా పాక్తో పరిమిత ఓవర్ల సిరీస్లు కూడా ఆడనుంది. ఈ నేపథ్యంలో బవుమా గైర్హాజరీలో ప్రొటిస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టెస్టు జట్టును ముందుకు నడిపించనున్నాడు.గుడ్ న్యూస్ ఏంటంటేఇక పాక్తో టీ20 సిరీస్లో డేవిడ్ మిల్లర్, వన్డేల్లో మాథ్యూ బ్రీట్జ్కే సౌతాఫ్రికాకు నాయకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సౌతాఫ్రికాకు సానుకూలాంశంగా పరిణమించింది.వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా డికాక్.. యాభై ఓవర్ల ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్తో అతడు తిరిగి వన్డేల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇక అక్టోబరు 12- నవంబరు 8 వరకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు పాక్ పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.పాకిస్తాన్తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్* , వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనేలన్ సుబ్రేయన్, కైలీ వెరెన్నె.పాకిస్తాన్తో టీ20లకు సౌతాఫ్రికా జట్టుడేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగీ ఎన్గిడి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, ఆండీలే సిమెలానే, లిజాడ్ విలియమ్స్.పాకిస్తాన్తో వన్డేలకు సౌతాఫ్రికా జట్టుమాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్న్ ఫార్చూయిన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగి ఎన్గిడి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెతెంబా కెషిలె.చదవండి: ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. వైభవ్, వేదాంత్, అభిగ్యాన్ అదుర్స్ -
యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్కు భారీ షాక్.. కెప్టెన్ అవుట్!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఈ మేజర్ సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్నుపాము దిగువ భాగంలో నొప్పితో కమిన్స్ కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.నెలలుగా ఆటకు దూరంజూన్- జూలైలో ఆసీస్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా కమిన్స్ మాత్రం ఫిట్నెస్ సమస్యలతో స్వదేశంలోనే ఉండిపోయాడు. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లీ మైదానంలో దిగలేదు. అంతేకాదు.. అక్టోబరులో న్యూజిలాండ్, టీమిండియాలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు కూడా కమిన్స్ దూరమయ్యాడు.ఇంగ్లండ్తో యాషెస్ టెస్టు సిరీస్కు తగినంత విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్.. తమ కెప్టెన్ విషయంలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంది. అయితే, తాను యాషెస్ కూడా ఆడతానో లేదో అంటూ కమిన్స్ తాజాగా బాంబు పేల్చాడు.ఆడతానో.. లేదో!.. వేచి చూద్దాంవిలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. జిమ్లో వర్కౌట్లు చేస్తున్నా. అయితే, గాయం నుంచి వంద శాతం కోలుకున్నానని చెప్పలేను. యాషెస్ నుంచి మళ్లీ మైదానంలో దిగాలనే ఆశిస్తున్నా.అయితే, ఈ విషయంపై ఇప్పుడే స్పష్టత మాత్రం ఇవ్వలేను. యాషెస్లో ఆడాలనే భావిస్తున్నా. ఐదు టెస్టులు ఆడతానో లేదో ఇపుడే చెప్పడం కష్టం. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కాగా ఈసారి ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంరు 21- జనవరి 8 వరకు ఐదు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.యాషెస్ సిరీస్ 2025 షెడ్యూల్ ఇదే👉తొలి టెస్టు: నవంబరు 21- 25- పెర్త్👉రెండో టెస్టు: డిసెంబరు 4- 8- బ్రిస్బేన్👉మూడో టెస్టు: డిసెంబరు 17- 21- అడిలైడ్👉నాలుగో టెస్టు: డిసెంబరు 26- 30- మెల్బోర్న్👉ఐదో టెస్టు: జనవరి 4- 8- సిడ్నీ.చదవండి: IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్కు ధీటుగా.. -
IND vs WI: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు
టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. వారిపై వేటుఇక ఈ టూర్లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్వెట్పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్లను కూడా జట్టు నుంచి తప్పించింది.వికెట్ల వీరుడికి చోటుఅదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్షిప్లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్పాల్కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.చందర్పాల్ రాకతో టాపార్డర్లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆడాడు. సీమర్ల కోటాలో వీరేఅయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్లు జరుగనున్నాయి.టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ జట్టురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్బెల్, తగెనరైన్ చందర్పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.చదవండి: మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం -
ఒకే ఒక్క మ్యాచ్.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారానికి అతడు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు.. ఆన్లైన్లో అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.ఇక ఆగష్టు 2025 నెలకు గానూ నామినేట్ అయిన పురుష క్రికెటర్ల పేర్లను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఇందులో ఈసారి ముగ్గురూ బౌలర్లే ఉండటం విశేషం. టీమిండియా నుంచి సిరాజ్, న్యూజిలాండ్ జట్టుకు చెందిన మ్యాట్ హెన్రీ (Matt Henry), వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (Jayden Seals) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.ఆగష్టు నెలలో ఒకే ఒక్క మ్యాచ్కాగా ఈ ఏడాది ఆగష్టు నెలలో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇంగ్లండ్తో జూలై 31- ఆగష్టు 4 వరకు ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో... ఈ హైదరాబాదీ పేసర్ చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు టెస్టుల సిరీస్ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.ఆఖరి రోజు.. చివరి సెషన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ చేతిలో ఆరు వికెట్లు ఉండి విజయానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్న వేళ ఈ రైటార్మ్ పేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (14), ఓలీ పోప్ (27), జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9) రూపంలో కీలక వికెట్లు కూల్చి సిరాజ్ మియా.. ఆఖరి వికెట్గా గస్ అట్కిన్సన్ (17)ను వెనక్కి పంపాడు.సిరీస్ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్రఇలా వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచేలా చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు కూల్చి.. టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు నెలకుగానూ ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.అదరగొట్టిన హెన్రీ, జేడన్ సీల్స్మరోవైపు.. జింబాబ్వేతో టెస్టు సిరీస్లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ గొప్పగా రాణించాడు. రెండు మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చి.. న్యూజిలాండ్ సిరీస్ను 2-0తో వైట్వాష్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఇక పాకిస్తాన్పై 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంలో జేడన్ సీల్స్ పాత్ర కీలకం. ఆఖరి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు కూల్చి.. పాక్పై విండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కేవలం 4.10 ఎకానమీ రేటుతో సీల్స్ పది వికెట్లు కూల్చడం గమనార్హం.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
బాబర్కు పిలుపు.. రిజ్వాన్, నసీం షా అక్కడే!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ టీ20 జట్టులో చోటు కోల్పోయిన బాబర్.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీకి కూడా ఎంపిక కాలేకపోయాడు.అయితే, తాజాగా బాబర్ ఆజంకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో.. లాహోర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగే శిక్షణా శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ సన్నాహక శిబిరం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం సెప్టెంబరు 8నే ఎన్సీఏలో రిపోర్టు చేయాల్సిందిగా పీసీబీ ఆటగాళ్లను ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా పదకొండు మంది ఇందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే, వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్తో పాటు పేసర్ నసీం షా మాత్రం ఈ శిక్షణా శిబిరానికి దూరం కానున్నారు. వారిద్దరు ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్తో బిజీగా ఉన్నారు.అయితే, బాబర్తో పాటు అబ్దుల్లా షఫీక్, అలీ రెజా, అజాన్ అవైస్, సాజిద్ ఖాన్, రొహైల్ నజీర్ కూడా ఈ సన్నాహక శిబిరానికి హాజరుకానున్నట్లు సమాచారం.ముక్కోణపు సిరీస్లో ఫైనల్లో పాక్బ్యాటింగ్లో ఫఖర్ జమన్ (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు), స్పిన్ బౌలింగ్తో అబ్రార్ అహ్మద్ (4–0–9–4) పాకిస్తాన్ను గెలిపించి ముక్కోణపు సిరీస్ ఫైనల్కు చేర్చారు. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్లో భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై గెలుపొందింది. మొదట పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్హాన్ (16), అయూబ్ (11) విఫలమైనా... ఫఖర్ ధాటిగా ఆడాడు. ఆఖర్లో మొహమ్మద్ నవాజ్ (27 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో దిగిన యూఏఈ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ అలీషాన్ (51 బంతుల్లో 68; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పరుగులే చేయలేకపోవడంతో జట్టుకు ప్రతికూలంగా మారింది. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ యూఏఈ బ్యాటర్లకు స్పిన్ ఉచ్చు బిగించాడు. రేపు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: సక్సెస్ఫుల్ కెప్టెన్.. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తాడు: ఇర్ఫాన్ పఠాన్కు చురకలు -
‘జట్టు నుంచి తప్పిస్తా!.. ద్రవిడ్.. అతడిని నా దగ్గరికి రావొద్దని చెప్పు’
దూకుడైన బ్యాటింగ్కు పెట్టింది పేరు వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag). ఈ విధ్వంసకర ఓపెనర్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్లకు చుక్కలే. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) తర్వాత టీమిండియాకు దొరికిన అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో సెహ్వాగ్ ఒకడు. పాకిస్తాన్ గడ్డపై 2004లో ట్రిపుల్ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ ఫీట్ సాధించిన భారత తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.టీమిండియా స్టార్లకు చేదు అనుభవాలుఅయితే, ప్రతీ ఆటగాడి కెరీర్లాగే సెహ్వాగ్ కెరీర్లోనూ ఎత్తుపళ్లాలు ఉన్నాయి. 2005- 06 మధ్యకాలంలో పరుగులు రాబట్టడంలో వీరూ కాస్త తడబడ్డాడు. ఆ సమయంలోనే టీమిండియా హెడ్కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) వచ్చాడు. అపుడే సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించడం జరిగాయి.హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు కూడా చాపెల్ వ్యవహారశైలితో నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని సెహ్వాగ్ తాజాగా వెల్లడించాడు. అయితే, తాను ఆటతోనే అతడి నోరు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గతం నాకు అనవసరం‘‘అప్పట్లో నేను పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బందిపడ్డాను. అపుడు గ్రెగ్ చాపెల్ అన్న మాటలు నన్ను బాధించాయి. ‘నువ్వు కాలు కదపనంత వరకు పరుగులు రాబట్టలేవు’ అని నాతో అన్నాడు. అందుకు బదులుగా.. ‘గ్రెగ్.. నేను టెస్టుల్లో 50కి పైగా సగటుతో ఇప్పటికే 6000 పరుగులు సాధించాను’ అని చెప్పాను.ఇందుకు స్పందిస్తూ.. ‘నువ్వు గతంలో ఏం చేశావో నాకవసరం లేదు. నీకు మళ్లీ అదే మాట చెబుతున్నా. నువ్వు కాలు కదిపితేనే పరుగులు వస్తాయి’ అన్నాడు. దీంతో మా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.జట్టు నుంచి నిన్ను తప్పిస్తా.. నువ్వేం చేసుకుంటావో చేసుకోఅప్పుడు కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వచ్చి మమ్మల్ని విడదీయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు నేను బ్యాటింగ్కు వెళ్తున్న సమయంలో.. ‘నువ్వు ఈరోజు కచ్చితంగా పరుగులు చేయాలి. లేదంటే.. జట్టు నుంచి నిన్ను తప్పిస్తా’ అని గ్రెగ్ నాతో అన్నాడు.‘నువ్వేం చేసుకుంటావో చేసుకో’ అని నేను బదులిచ్చాను. ఓ ఆటగాడు బ్యాటింగ్కు వెళ్తున్న సమయంలో కోచ్ నుంచి వచ్చే ఇలాంటి మాటలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశం మీద అతడికి కాస్తైనా అవగాహన లేదు.ఆరోజు నాకు స్ట్రైక్ రాగానే బంతిని బాదడం మొదలుపెట్టాను. భోజన విరామ సమయానికి ముందు నేను 99 పరుగుల వద్ద ఉన్నాను. అపుడు డ్రెసింగ్రూమ్లోకి వెళ్తుంటే ద్రవిడ్ అక్కడే నిల్చుని ఉన్నాడు.నా దరిదాపుల్లోకి కూడా రావొద్దని మీ కోచ్కు చెప్పునేను తనను పిలిచి.. ‘నా దరిదాపుల్లోకి కూడా రావొద్దని మీ కోచ్కు చెప్పు’ అని అన్నాను. లంచ్ తర్వాత తిరిగి వచ్చి 180 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పుడు ఓ మూలన నిల్చుని ఉన్న గ్రెగ్ వైపు ఓ లుక్కేశాను.‘నా కాలు కదిపినా.. కదపకపోయినా.. పరుగులు ఎలా చేయాలో మాత్రం నాకు తెలుసు’ అని మరోసారి అతడితో అన్నాను’’ అని సెహ్వాగ్ గత జ్ఞాపకాలను లైఫ్ సేవర్ పాడ్కాస్ట్లో పంచుకున్నాడు. అయితే, ఇందులో సెహ్వాగ్ సదరు మ్యాచ్ ఏదో చెప్పలేదు. అయితే, భారత్- వెస్టిండీస్ మధ్య 2006 నాటి టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఆనాటి మ్యాచ్లో సెహ్వాగ్ 180 పరుగులు చేయగా.. ద్రవిడ్ 140, మహ్మద్ కైఫ్ 148 పరుగులు (నాటౌట్) సాధించారు. ఈ క్రమంలో 588/8 వద్ద భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. కాగా తన కెరీర్లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 8586 పరుగులు సాధించాడు.చదవండి: పాపం హార్దిక్ పాండ్యా!.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి కామెంట్స్ వైరల్ -
‘అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తీరును మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ (Karsan Ghavri) విమర్శించాడు. పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ బోర్డు ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీగా మారిస్తే.. ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు. ఒకవేళ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ పేరును మార్చి ఉంటే మాత్రం.. సునిల్ గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడని.. ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడని విమర్శలు చేశాడు.కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు భారత దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ గౌరవార్థం పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించగా.. దీనికి ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)గా నామకరణం చేశారు. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ల పేరు మీదుగా ఇకపై ఈ సిరీస్ను నిర్వహిస్తామని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది.అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడుఈ నేపథ్యంలో కర్సన్ ఘవ్రీ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తప్పు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ను ఎల్లప్పుడూ ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీగానే వ్యవహరిస్తారు. టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీని బోర్డుర్- గావస్కర్ ట్రోఫీ అనే పిలుస్తారు.ఒకవేళ ఆసీస్తో టీమిండియా సిరీస్కు ఈ పేరును గనుక మార్చి ఉంటే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు. అయినా.. ఈసీబీ, ఎంసీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బీసీసీఐ కోరాల్సింది. పటౌడీ పేరు తీసివేయొద్దని గట్టిగా చెప్పాల్సింది.సచిన్ నో చెప్పాల్సిందిసచిన్ టెండుల్కర్ కూడా పేరు మార్పునకు అంగీకరించకుండా ఉండాల్సింది. తను నో చెప్పి ఉంటే బాగుండేది. ఏదేమైనా కనీసం అభ్యంతరం లేవనెత్తకపోవడం సరికాదు’’ అని విమర్శించాడు.‘‘ఏదేమైనా పటౌడీ భారత క్రికెట్లో ఓ దిగ్గజం. ఆయన పేరును తొలగిస్తుంటే మీరెలా ఊరుకున్నారు?’’ అని ఘవ్రీ ప్రశ్నించాడు. ఇక విమర్శల అనంతరం ఈసీబీ విజేత జట్టుకు పటౌడీ మెడల్ ఇస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ మీరు మెడల్స్ ఇవ్వాలని అనుకుంటే.. అందుకోసం ట్రోఫీ పేరునే మార్చాల్సిన అవసరం లేదు కదా!’’ అంటూ ఘవ్రీ ఈసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా గుజరాత్కు చెందిన 74 ఏళ్ల కర్సన్ ఘవ్రీ 1974- 1981 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఘవ్రీ.. 39 టెస్టుల్లో 913 పరుగులు, 19 వన్డేల్లో 114 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన ఘవ్రీ టెస్టుల్లో 109, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.2-2తో సమం చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా 2-2తో సిరీస్ సమం చేసింది. ఈ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్గా ప్రయాణం ఆరంభించిన శుబ్మన్ గిల్ .. 754 పరుగులతో సిరీస్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ టూర్లో టీమిండియా ఎడ్జ్బాస్టన్లో తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడం హైలైట్గా నిలిచింది.చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
అతడు సుదీర్ఘకాలం భారత క్రికెట్ను ఏలుతాడు: రవిశాస్త్రి
భారత టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)పై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. సారథిగా తన ఆగమనాన్ని ఘనంగా చాటాడని.. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ను ఏలే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు.ఇంగ్లండ్ పర్యటన రూపంలో తొలి ప్రయత్నంలోనే గట్టి సవాలును ఎదుర్కొన్నాడు. అయితే, సారథిగా అనుభవం లేకపోయినా ఇంగ్లండ్ గడ్డపై గిల్ మెరుగైన ఫలితాన్నే అందుకున్నాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసుకున్నాడు.డబుల్ సెంచరీతో.. అంతేకాదు.. బ్యాటర్గానూ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత రీతిలో రాణించిన గిల్.. ఇంగ్లండ్ గడ్డ మీద రికార్డుల మోత మోగించాడు. ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్ మైదానంలో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) సాధించి.. ఈ మైదానంలో టీమిండియాకు తొలి గెలుపు అందించాడు. మొత్తంగా.. 754 పరుగులు సాధించి సిరీస్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.సుదీర్ఘకాలం భారత క్రికెట్ను ఏలుతాడుతద్వారా తనపై విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ.. ఇంగ్లండ్లో ఇలాంటి సిరీస్ ఆడిన తర్వాత.. అతడి స్థానం తప్పక సుస్థిరమవుతుంది. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్లో భాగంగా ఉంటాడు.అతడికి ఇప్పుడు 25 ఏళ్లే. ఇంకా మెరుగుపడతాడు. ఇంగ్లండ్తో సిరీస్లో అతడి టెంపర్మెంట్ బాగుంది. నిజమైన నాయకుడిలా.. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసే రాజులా పరిణతి చూపిస్తూనే.. దూకుడు ప్రదర్శించాడు. పట్టుదలగా నిలబడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు’’ అంటూ రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.గొప్పగా నడిపించాడు: యువీమరోవైపు.. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో శుబ్మన్ గిల్ కెప్టెన్గా భారత జట్టును నడిపించిన తీరుపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్కు ముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ ఒకేసారి జవాబిస్తున్నట్లుగా అతని సారథ్యం కనిపించిందని యువీ అన్నాడు. గిల్ కెప్టెన్సీ నమ్మశక్యంగా అనిపించలేదని కితాబిచ్చాడు. కెరీర్ ఆరంభంలో స్వయంగా యువీనే మెంటార్గా గిల్కు మార్గనిర్దేశనం చేశాడు.‘విదేశాల్లో గిల్ రికార్డును చాలా మంది ప్రశ్నించారు కానీ అతను కెప్టెన్ కావడంతోనే నాలుగు సెంచరీలు బాదాడు. బాధ్యతను అప్పగిస్తే దానిని మరింత సమర్థంగా నిర్వర్తించిన తీరు నమ్మశక్యం కాని రీతిలో ఉంది. భారత జట్టును చూస్తే గర్వంగా అనిపించింది. పేరుకు సిరీస్ ‘డ్రా’ అయినా నా దృష్టిలో ఇది మనం గెలిచినట్లే. పెద్దగా అనుభవం లేని జట్టు ఇంగ్లండ్కు వెళ్లి ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటడం అంత సులువు కాదు’ అని యువరాజ్ అభిప్రాయ పడ్డాడు. కోహ్లి, రోహిత్లు లేకపోవడాన్ని ఒక సవాల్గా తీసుకొని మన కుర్రాళ్లు సత్తా చాటారని యువీ అన్నాడు.‘సాధారణంగా యువ ఆటగాళ్లు ఇంగ్లండ్కు వెళ్లినప్పుడు వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కోహ్లి, రోహిత్లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ కుర్రాళ్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. నా దృష్టిలో జడేజా, సుందర్ సెంచరీలతో మాంచెస్టర్ టెస్టును ‘డ్రా’ చేసుకోవడం కీలక మలుపు. ఇలాంటిది చాలా కాలంగా నేను చూడలేదు. ఇది మన జట్టు స్థాయి ఏంటో చూపించింది. జడేజాకు అంటే చాలా అనుభవం ఉంది. కానీ యువ ఆటగాడు సుందర్ ప్రదర్శనను మాత్రం ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది’ అని యువరాజ్ విశ్లేషించాడు. చదవండి: ‘యాడ్స్ చేయడానికే పనికివస్తారు.. కోచ్ల మాట అస్సలు వినరు’ -
బాబర్ ఆజం రికార్డు బద్దలుకొట్టిన శుబ్మన్ గిల్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) బద్దలు కొట్టాడు. అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ICC Player Of The Month)’ అవార్డును గెలిచిన ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ను వెనక్కినెట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతీ నెలా ప్రకటించే ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ జూలై నెలకు గానూ గిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన అతడిని జూలై నెల అవార్డుకు అర్హుడిగా మార్చింది. 754 పరుగులుఐదు టెస్టుల ఈ సిరీస్లో మొత్తం 754 పరుగులు చేసిన గిల్... అవార్డుకు పరిగణనలోకి తీసుకున్న జూలై నెలలో 3 టెస్టుల్లో కలిపి 567 పరుగులు సాధించాడు. ఇందులో బర్మింగ్హామ్లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో చేసిన 269, 161 (మొత్తం 430) పరుగుల ప్రదర్శన గిల్ కెరీర్లో హైలైట్గా నిలిచింది.ఐసీసీ అవార్డుకు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన గిల్... ఎడ్జ్బాస్టన్ మైదానంలో తాను ఆడిన 269 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు. ఎప్పటికీ మర్చిపోలేనిది‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కెప్టెన్గా తొలి టెస్టు సిరీస్లో ప్రదర్శనకుగాను నాకు గుర్తింపు దక్కడం దీనిని మరింత ప్రత్యేకంగా మార్చింది. బర్మింగ్హామ్లో చేసిన డబుల్ సెంచరీ ఎంతో ప్రత్యేకమైంది. ఎప్పటికీ మర్చిపోలేనిది.ఇంగ్లండ్తో సిరీస్ కెప్టెన్గా నేను ఎంతో నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇరు జట్లు చాలా బాగా ఆడాయి. ఆటగాళ్లందరికీ కూడా ఇది చిరస్మరణీయం. మున్ముందు ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తాను’ అని గిల్ స్పందించాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందడం గిల్కిది నాలుగోసారి. 2023 జనవరిలో, సెప్టెంబర్లో... 2025 జనవరిలో, జూలైలో గిల్కు ఈ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే అత్యధికసార్లు ఈ అవార్డు నెగ్గిన మేల్ క్రికెటర్గా.. అదే విధంగా.. ఒకే ఏడాదిలో రెండుసార్లు అవార్డు గెలిచిన తొలి ప్లేయర్గా గిల్ నిలిచాడు.అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన పురుష క్రికెటర్లు వీరే1. శుబ్మన్ గిల్- ఇండియా- నాలుగుసార్లు విజేత2. బాబర్ ఆజం- పాకిస్తాన్- మూడుసార్లు విజేత3. శ్రేయస్ అయ్యర్- ఇండియా- రెండుసార్లు విజేత4. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- రెండుసార్లు విజేత5. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- రెండుసార్లు విజేత6. కమిందు మెండిస్- శ్రీలంక- రెండుసార్లు విజేత7. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- రెండుసార్లు విజేత8. ముహమ్మద్ వసీం- యూఏఈ- రెండుసార్లు విజేత.చదవండి: IPL 2026: ‘ఈసారి వేలంలో ఖరీదైన ప్లేయర్గా అతడే’ -
ఆ డబుల్ సెంచరీ గుర్తుండిపోతుంది.. కెప్టెన్ హోదాలో ఇలా..: గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అవార్డు లభించింది. జూలై నెలకు గానూ అతడు ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player Of The Month)’ అవార్డు గెలుచుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్లో అదరగొట్టడం ద్వారా గిల్కు ఈ గౌరవం దక్కింది.భారీ డబుల్ సెంచరీఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత టెస్టు జట్టు కెప్టెన్గా యువ క్రికెటర్ శుబ్మన్ గిల్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శతక్కొట్టి (147)న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. బర్మింగ్హామ్లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) సాధించి ఈ వేదికపై భారత్కు తొలి గెలుపు అందించాడు.అంతేకాకుండా.. మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టులో మరోసారి శతకం (103) బాది ఈ మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకోవడంలో గిల్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో బ్యాటర్గా విఫలమైనా.. కెప్టెన్గా విజయం సాధించి.. సిరీస్ను 2-2తో సమం చేయగలిగాడు.754 పరుగులుఇక ఇంగ్లండ్తో ఓవరాల్గా ఐదు టెస్టుల సిరీస్లో శుబ్మన్ గిల్.. పది ఇన్నింగ్స్లో కలిపి 754 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో జూలై నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు అతడు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న గిల్.. ఎట్టకేలకు వీరిద్దరిని అధిగమించి అవార్డును సొంతం చేసుకున్నాడు.నాలుగోసారి.. అత్యంత మధురమైన క్షణం అదేకాగా 25 ఏళ్ల గిల్ ఈ పురస్కారం అందుకోవడం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో గిల్ స్పందిస్తూ.. ‘‘జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం గొప్పగా అనిపిస్తోంది. ఈసారి టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో.. నా ప్రదర్శనకు గానూ ఈ పురస్కారం అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది.బర్మింగ్హామ్లో డబుల్ సెంచరీ సాధించడం ఇంగ్లండ్ పర్యటన మొత్తంలో నాకు అత్యంత మధురమైన క్షణం. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడం గొప్ప అనుభవం. ఇరుజట్లు అద్భుత పోరాట పటిమ కనబరిచాయి.నాకు ఈ అవార్డు దక్కేలా చేసిన జ్యూరీ మెంబర్లకు ధన్యవాదాలు. అదే విధంగా.. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన నా సహచర ఆటగాళ్లకు శుభాకాంక్షలు. దేశం కోసం మరింత గొప్పగా ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని గిల్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ఆన్లైన్ ద్వారా వచ్చే అభిమానుల ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.చదవండి: AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో.. -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
జింబాబ్వే పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పసికూనకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆతిథ్య జింబాబ్వే (ZIM vs NZ)ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్ టీమ్.. రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ఏకంగా 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.125 పరుగులకే ఆలౌట్కాగా బులవాయో వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో 125 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రెండన్ టేలర్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ టఫాజ్వ త్సింగా (33 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన వారిలో నిక్ వెల్చ్ (11), సీన్ విలియమ్స్ (11) మాత్రమే పది పరుగుల స్కోరు దాటాడు.కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మాథ్యూ ఫిషర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.కాన్వే, రచిన్, నికోల్స్ భారీ శతకాలుఓపెనర్లలో డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153) శతక్కొట్టగా.. విల్ యంగ్ (Will Young) హాఫ్ సెంచరీ (74)తో రాణించాడు. నైట్ వాచ్మన్గా వచ్చిన బౌలర్ జేకబ్ డఫీ మాత్రం 36 పరుగులే చేయగలిగాడు. అయితే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.రచిన్ కేవలం 139 బంతుల్లోనే 165 పరుగులతో అజేయంగా ఉండగా.. నికోల్స్ 245 బంతుల్లో 150 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 130 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే కంటే తొలి ఇన్నింగ్స్లో 476 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ప్రపంచంలోనే తొలి జట్టుగాకాన్వే, నికోల్స్, రచిన్ల భారీ సెంచరీల కారణంగానే ఇది సాధ్యమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. విదేశీ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు ఆటగాళ్లు 150కి పైగా వ్యక్తిగత స్కోర్లు సాధించడం ఇదే తొలిసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా కివీస్ అవతరించింది.ఇక ఓవరాల్గా ఈ జాబితాలో ఇంగ్లండ్ (1938లో ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా మీద మూడు 150+ స్కోర్లు), టీమిండియా (శ్రీలంక మీద కాన్పూర్లో మూడు 150+ స్కోర్లు) న్యూజిలాండ్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్ ఆఫ్రిది -
IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. సంకుచిత బుద్ధి!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి విమర్శల పాలైంది. ‘‘ఇంత సంకుచిత బుద్ధి ఎందుకు?. అసలు మిమ్మల్ని ఎవరు ఆ పోస్టు పెట్టమన్నారు’’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విషయం ఏమిటంటే.. టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ (IND vs ENG)తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ గడ్డ మీద జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్ను భారత జట్టు 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే బ్యాటర్గా చిరస్మరణీయ రికార్డులు సాధించిన శుబ్మన్ గిల్ (Shubman Gill).. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్లతో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా అదరగొట్టారు.నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడుఅయితే, ఈ సిరీస్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఐదు టెస్టుల్లో కలిపి 53.20 సగటుతో ఈ కర్ణాటక ఆటగాడు 532 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.హెడింగ్లీలో తొలి టెస్టులో 137 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్.. లార్డ్స్లో 100 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్బాస్టన్లో 55, ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో 90 పరుగులు సాధించాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో శుబ్మన్ గిల్ (754), జో రూట్ (537) తర్వాత మూడో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.రాహుల్ ఫొటో లేకుండానే..అసలు విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టింది. ‘‘యుగాల పాటు నిలిచిపోయే ఫొటో ఆల్బమ్’’ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా కేఎల్ రాహుల్ లేడు.ఒక్కటీ దొరకలేదా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ లక్నో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇలా చేయడం అస్సలు బాలేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.ఓపెనర్గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొని 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడి ఫొటో మాత్రం మీకు దొరకలేదా?’’ అంటూ దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. నెటిజన్లు ఇందుకు స్పందిస్తూ.. ‘‘అంతే సార్.. వాళ్లకు గొప్పగా ఆడినవాళ్లు కనబడరు. అయినా లక్నోకు ఇలా చేయడం అలవాటే. వాళ్ల ఓనర్ సంజయ్ గోయెంకానే వారికి ఆదర్శం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.గతేడాది లక్నోను వీడిన రాహుల్కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన అతడు రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. అయితే, గతేడాది లక్నో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సంజీవ్ గోయెంకా అందరిముందే కేఎల్ రాహుల్ను తిట్టడం విమర్శలకు దారితీసింది. అనంతరం రాహుల్ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు.అయితే, టీమిండియా తరఫున అతడు గొప్పగా చాటినా లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసే ఫొటోల్లో అతడిపై వివక్ష చూపించడం.. వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం అని కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు.చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్This is getting embarrassing. Couldn’t get a picture of an opener who played the new ball and scored 500+ runs 🤷♂️ https://t.co/fGhFFuOWi3— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 8, 2025 -
అతడంటే వణుకు.. టీమిండియా కూడా భయపడేది: భారత మాజీ క్రికెటర్
టెస్టు క్రికెట్ దిగ్గజాల్లో వెస్టిండీస్ స్టార్ బ్రియాన్ లారా (Biran Lara)కు ప్రత్యేక స్థానం ఉంది. షాట్ సెలక్షన్ విషయంలో దూకుడుగా ఉండే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చక్కటి ఫుట్వర్క్తో ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. కవర్ డ్రైవ్లు, పుల్షాట్లు ఆడటంలో అతడు దిట్ట.స్లెడ్జ్ చేయాలంటే వణుకుఅన్నింటికీ మించి బ్యాటింగ్ చేస్తున్నపుడు.. ఎలాంటి పరిస్థితులు ఎదురైననా లారా ఆత్మవిశ్వాసంతో ఉండటం.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను మరింత భయపట్టేది. అందుకే అతడిని స్లెడ్జ్ చేయాలంటే వాళ్లు వణికిపోయేవారు. అనవసరంగా లారా జోలికి వెళ్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. తమ పనిని పూర్తి చేసుకుని వెళ్లేవారు.టీమిండియాకూ అదే భయం.. ముందే చెప్పారుటీమిండియా కూడా లారాను స్లెడ్జ్ చేసే విషయంలో భయపడేదట. భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జియోహాట్స్టార్తో మాట్లాడుతూ.. ‘‘స్లెడ్జింగ్ గురించి ముందుగానే ఎలాంటి ప్రణాళికలను మేము సిద్ధం చేసుకునేవాళ్లం కాదు.అయితే, లారాను మాత్రం అస్సలు స్లెడ్జ్ చేయొద్దని మాత్రం నిర్ణయించుకున్న సంఘటన నాకు గుర్తుంది. అతడితో పెట్టుకోవద్దని ముందే డిసైడ్ అయ్యేవాళ్లం. టీమిండియా వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లినపుడు లారాకు అంతటి ప్రాముఖ్యం ఉండేది.అతడు బ్యాటింగ్ చేస్తున్నపుడు ఒక్క మాట కూడా అనవద్దని టీమిండియా సమావేశంలో నిర్ణయించారు. తనకు తానుగా అవుటయ్యేంత వరకు వేచిచూడాలని చెప్పేవారు. ఒకవేళ అతడిని మాటలతో రెచ్చగొడితే.. మనమే తిరిగి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు’’ అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.చెక్కు చెదరని ప్రపంచ రికార్డుకాగా అద్భుతమైన టెక్నిక్తో, అగ్రెసివ్ షాట్లతో అలరించే లారా.. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (400 నాటౌట్) సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక1990- 2006 వరకు వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 56 ఏళ్ల లారా.. 131 టెస్టుల్లో 11953 పరుగులు సాధించాడు. ఇందులో 34 శతకాలు, తొమ్మిది డబుల్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 299 వన్డేలు ఆడిన లారా.. 19 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీల సాయంతో 10405 పరుగులు సాధించాడు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభానికి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. ఈసారి ఈ టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 21- 25 మధ్య తొలి టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇప్పటి నుంచే ఇరుజట్ల ఆటగాళ్లు మైండ్గేమ్ మొదలుపెట్టేశారు.ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు చేశాడు. ఇంగ్లిష్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్తో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పిచ్ల మీద అతడు పెద్దగా బ్యాట్ ఝులిపించలేడు. గతంలో కూడా ఇలాగే జరిగింది.అతడికి ఇక నిద్రలేని రాత్రులే!నాకు బ్రాడీ బౌలింగ్లో ఎలాగైతే కాళరాత్రులు మిగిలాయో.. రూట్కు కూడా జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో నిద్రలేని రాత్రులే మిగులుతాయి. జో అద్భుతమైన క్రికెటర్. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు రాబట్టిన రెండో ఆటగాడు.కానీ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం అతడికి కాస్త కష్టమే. దానిని అతడు ఈసారి అధిగమిస్తాడనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని వార్నర్ పేర్కొన్నాడు.వార్నర్ ఓ జోకర్!వార్నర్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ ఘాటుగా స్పందించాడు. ‘‘అతడు వార్నర్. వార్నర్ అంటే ఓ జోకర్ లాంటివాడు. రూటీ మైండ్లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. కానీ ఎన్నటికీ అది జరుగదు.అసలు రూట్తో సరదా ఫైట్కు కూడా వార్నర్ సరిపోడు. అతడు వార్నర్.. జస్ట్ వార్నర్ అంతే!.. అంతేనా? కాదా?’’ అంటూ మొయిన్ అలీ వార్నర్ పరువు తీశాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. యాషెస్ మొదలైన తర్వాత ఇంకెలా ఉంటుందో అంటూ ఇరుజట్ల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.సూపర్ ఫామ్లో రూట్కాగా జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో మూడు శతకాలతో దుమ్ములేపాడు. ఐదు టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించిన రూట్.. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (754) తర్వాత రెండో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.భారత్తో సిరీస్ సందర్భంగానే జో రూట్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రిక్కీ పాంటింగ్ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు రాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.ఇలాంటి వాళ్లు సరిపోరుఈ విషయం గురించి మొయిన్ అలీ ప్రస్తావిస్తూ.. ‘‘రూటీ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. వార్నర్ లాంటి వాళ్ల మాటలు అతడిపై ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. అయినా.. రూట్ లాంటి వాళ్లను ప్రభావితం చేయాలంటే ఇలాంటి వాళ్లు సరిపోరు’’ అంటూ వార్నర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా నవంబరు 21- జనవరి 8 వరకు ఆసీస్- ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగనుంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ ఇందుకు వేదికలు. చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
టీమిండియా సెలక్టర్లు కాదు.. ఇకపై అతడే డిసైడ్ చేస్తాడా?
టీమిండియాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవతరం ఆటగాళ్లంతా పనిభారం అంటూ సాకులు చూపడం సరికాదని విమర్శించాడు. ఆధునిక క్రికెట్లో కెప్టెన్, హెడ్కోచ్ కంటే ఫిజియోలకే ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గిల్ సేన 2-2తో సమంగా ముగించింది. బుమ్రా మూడే ఆడాడుఅయితే, ఈ సిరీస్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా కీలక సమయంలో.. కీలక మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. సిరీస్ డ్రా అయింది కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే బుమ్రాతో పాటు మేనేజ్మెంట్పై విమర్శల దాడి మరింత ఎక్కువయ్యేది. ఈ నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అతడే డిసైడ్ చేస్తాడా?‘‘అసలు బీసీసీఐ ఇలాంటి వాటికి ఎలా అంగీకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కెప్టెన్, హెడ్కోచ్ కంటే వీరికి ఫిజియోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయ్యేలా ఉన్నాడు. అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు?సెలక్షన్ కమిటీ సమావేశాల్లో వీరితో కలిసి ఫిజియో కూడా కూర్చుంటాడా ఏమిటి?. ఎవరి వర్క్లోడ్ ఎంత? ఎవరు ఆడాలని అతడే డిసైడ్ చేస్తాడా?’’ అని 1983 వన్డే వరల్డ్కప్ విన్నర్ సందీప్ పాటిల్ అసహనం వ్యక్తం చేశాడు.పనికిమాలిన వ్యవహారంఅదే విధంగా.. ‘‘వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేదే ఓ పనికిమాలిన వ్యవహారం. ఆటగాళ్లు ఫిట్గా ఉన్నారా? లేదంటే అన్ఫిట్?.. ఈ రెండిటి ఆధారంగానే జట్ల ఎంపిక ఉండాలి. అంతేగానీ.. ఈ వర్క్లోడ్ బిజినెస్ను పట్టించుకోకూడదు.మా రోజుల్లో అయితే ఫ్యాన్సీ స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించినా సునిల్ గావస్కర్ తిట్టేవాడు. అయితే, రోజులు మారాయి. కానీ ఈ నవతరం క్రికెటర్లు తరచూ మ్యాచ్లు మిస్ కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా’’ అని సందీప్ పాటిల్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
IND vs WI: టీమిండియాకు భారీ షాక్!
ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో సత్తా చాటి.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- tendulkar Trophy) సిరీస్ను సమం చేసింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండానే విదేశీ గడ్డ మీద సత్తా చాటింది. యువ నాయకుడు శుబ్మన్ గిల్ సారథ్యంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న భారత్ తదుపరి ఆసియా కప్-2025 ఆడనుంది.శుభవార్త.. ఓ చేదు వార్త కూడా..ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నమెంట్కు ఆగష్టు చివరి వారంలో బీసీసీఐ (BCCI) జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఒకే సమయంలో శుభవార్త.. ఓ చేదు వార్త అందాయి.ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు సర్జరీ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే, పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు విశ్రాంతి మాత్రం అవసరం అని చెప్పినట్లు తెలుస్తోంది.విండీస్తో రెండు టెస్టులుఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఆసియా కప్-2025తో పాటు వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు కూడా దూరం కానున్నాడు. కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ సెప్టెంబరు 8- 28 వరకు జరుగనుండగా.. స్వదేశంలో విండీస్తో అక్టోబరు 2- 14 వరకు టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలుకాగా ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో రిషభ్ పంత్ అదరగొట్టాడు. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలు బాదిన ఈ లెఫ్టాండర్.. ఓవరాల్గా 479 పరుగులు సాధించాడు.గాయంతోనే..అయితే, మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్కూప్షాట్కు యత్నించిన పంత్.. విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి కుడికాలికి తగలగా పాదం ఉబ్బింది. అనంతరం బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయినా సరే.. పంత్ మళ్లీ బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఈ మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్ -
సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్
భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ (IND vs ENG) సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు దేశం కోసం ఆడటం పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు. గాయం తాలుకు బాధ వెంటాడుతున్నా జట్టు ప్రయోజనాల కోసం మైదానంలో దిగి.. అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు.వారిద్దరు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes). మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా వోక్స్ బౌలింగ్లోనే పంత్ గాయపడ్డాడు. వోక్స్ వేసిన బంతి పంత్ కుడికాలి పాదానికి బలంగా తాకడంతో ఉబ్బిపోయింది.బొటనవేలు ఫ్రాక్చర్ దీంతో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన పంత్ స్కానింగ్కు వెళ్లగా.. బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే, సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మళ్లీ బరిలో దిగాల్సిన పరిస్థితి. జట్టు ప్రయోజనాలు, దేశం కోసం ఆడటమే పరమావధిగా భావించే పంత్.. కట్టుతోనే బ్యాట్తో బరిలోకి దిగి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అనంతరం రెండో ఇన్నింగ్స్లో పంత్ ఆడాల్సిన అవసరం రాకపోగా.. ఈ టెస్టు డ్రా అయింది. ఇక ఐదో టెస్టుకు పంత్ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆఖరిదైన ఐదో టెస్టులో విజయం ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు దోబూచులాడింది. ఐదో రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. టీమిండియా నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ భారత పేసర్లు విజృంభించారు.అతడూ జట్టే ముఖ్యం అనుకున్నాడుఈ క్రమంలో తొమ్మిదో వికెట్ పడగానే క్రిస్ వోక్స్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావాల్సి వచ్చింది. అంతకుముందే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కిందపడ్డగా.. అతడి భుజం విరిగింది. అయినప్పటికీ పంత్ మాదిరే అతడూ జట్టే తనకు ముఖ్యం అనుకున్నాడు.అయితే, వోక్స్కు ఇబ్బంది కలుగకుండా మరో ఎండ్లో ఉన్న గస్ అట్కిన్సన్ స్ట్రైక్రొటేట్ చేస్తూ తానే క్రీజులో ఉండేలా చూసుకున్నాడు. అయితే, మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు నిలిచిపోగా.. టీమిండియా జయభేరి మోగించి సిరీస్ను 2-2తో సమం చేసింది.సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్ఈ నేపథ్యంలో రిషభ్ పంత్తో జరిగిన సంభాషణ గురించి క్రిస్ వోక్స్ తాజాగా వెల్లడించాడు. ‘‘నా ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ రిషభ్ సెల్యూట్ ఎమోజీతో అభినందించాడు. అందుకు నేను అతడికి కృతజ్ఞతలు చెప్పాను.నాపై ప్రేమ చూపినందుకు థాంక్యూ.. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను. అప్పుడు నాకు రిషభ్ వాయిస్ నోట్ పంపించాడు. ‘మరేం పర్లేదు. త్వరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. తొందర్లోనే మనం మళ్లీ తిరిగి కలవాలని కోరుకుంటున్నా’ అన్నాడు.అయితే, తన పాదం విరగడానికి పరోక్ష కారణం నేనే కాబట్టి.. రిషభ్కు సారీ చెప్పకుండా ఉండలేకపోయాను’’ అని క్రిస్ వోక్స్ మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నా.. ఆటగాళ్లుగా తమ మధ్య ఉండే అనుబంధం గురించి తెలిపాడు.ఇక మ్యాచ్ ముగియగానే టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా క్రిస్ వోక్స్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ విషయం గురించి వోక్స్ ది గార్డియన్తో మాట్లాడుతూ.. ‘‘నువ్వు నిజంగా సాహసమే చేశావు’ అని గిల్ నాతో అన్నాడు.అందుకు బదులిస్తూ.. ‘మీరు అసాధారణ రీతిలో సిరీస్ పూర్తి చేసుకున్నారు. అద్భుతంగా ఆడారు. ఇందుకు మీ జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని నేను అన్నాను’’ అని తెలిపాడు. చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్ -
‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే
ముంబై: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్హామ్, ఓవల్ టెస్టులలోనే టీమిండియా గెలిచింది. దాంతో బుమ్రా లేకపోయినా పెద్దగా తేడా రాదని, అతను లేకపోయినా మ్యాచ్లు గెలవగలమని కొన్ని విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అసాధారణ బౌలర్ అయిన బుమ్రా గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ అండగా నిలిచాడు. ‘బుమ్రా సిరీస్ను చాలా బాగా మొదలు పెట్టాడు. ఆడింది మూడు మ్యాచ్లే అయినా... తొలి టెస్టులో ఒకసారి, మూడో టెస్టులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ప్రజలు వేరే అంశాలు ముందుకు తెచ్చి అతను లేని టెస్టుల్లో భారత్ గెలిచిందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ నా అభిప్రాయ ప్రకారం అది యాదృచ్ఛికం మాత్రమే. బుమ్రా ఒక అసాధారణ బౌలర్. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణించాడు. నా దృష్టిలో నిస్సందేహంగా అందరికంటే అతను అగ్ర స్థానంలో ఉంటాడు’ అని సచిన్ కితాబిచ్చాడు. మాంచెస్టర్ టెస్టులో స్టోక్స్ ‘షేక్ హ్యాండ్’కు నిరాకరించి జడేజా, సుందర్ ఆటను కొనసాగించడంలో ఎలాంటి తప్పూ లేదని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘డ్రా’కు అంగీకరించాలని ఇంగ్లండ్ కోరడంలో అర్థం లేదన్న సచిన్... భారత బ్యాటర్లు స్పందించిన తీరుతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని అన్నాడు. -
IND vs ENG: అతడొక అండర్రేటెడ్ ప్లేయర్: సచిన్ టెండుల్కర్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravnidra Jadeja) బ్యాట్తో అదరగొట్టాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆసాంతం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కీలక సమయాల్లో తానున్నానంటూ జట్టును ఆదుకున్నాడు.మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి జడ్డూ 516 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం.. ఐదు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు జడ్డూ ఈ సిరీస్లో ఏడు వికెట్లు కూడా పడగొట్టడం గమనార్హం. ఇలా ఇంగ్లండ్తో సిరీస్ను టీమిండియా 2-2తో సమం చేయడంలో తన వంతు పాత్రను జడేజా సమర్థవంతంగా పూర్తి చేశాడు.అతడు ఓ అండర్రేటెడ్ ప్లేయర్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రవీంద్ర జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వెటరన్ ఆల్రౌండర్ అద్భుతంగా ఆడినా రావాల్సినంత గుర్తింపు దక్కడం లేదని పేర్కొన్నాడు. ‘‘అతడు ఓ అండర్రేటెడ్ ప్లేయర్ అనే చెప్తాను.క్రెడిట్ దక్కడం లేదుజట్టు కోసం అతడు ఎంతో కష్టపడతాడు. తన వంతుగా పరుగులు రాబడతాడు. వికెట్లు తీస్తాడు. కానీ అతడికి ఎక్కువగా క్రెడిట్ దక్కడం లేదు. ఇంగ్లండ్తో సిరీస్లో బ్యాటర్గా చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచాడు.ఈ ఒక్క సిరీస్ అనే కాదు.. గతంలోనూ చాలా సార్లు జట్టుకు అవసరమైన వేళ నేనున్నానంటూ వచ్చి.. ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు’’ అని సచిన్ టెండుల్కర్ జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించాడు.కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనఅదే విధంగా.. కేఎల్ రాహుల్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనను మరోసారి ఈ సిరీస్లో చూశాను. అతడు చక్కగా డిఫెండ్ చేసుకోవడంతో పాటు.. వీలు చిక్కినప్పుడల్లా తనవైన షాట్లతో అలరించాడు. ఏ బంతిని ఆడాలో.. దేనిని వదిలేయాలో అతడికి తెలుసు. కొన్నిసార్లు తన ప్లానింగ్తో బౌలర్లనే బోల్తా కొట్టించాడు కూడా’’ అని సచిన్ టెండుల్కర్ రాహుల్ను కొనియాడాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడింది. తొలుత లీడ్స్లో ఓటమిపాలైన గిల్ సేన.. ఎడ్జ్బాస్టన్లో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది. అనంతరం లార్డ్స్ టెస్టులో ఓడిన భారత జట్టు.. మాంచెస్టర్ టెస్టును డ్రా చేసింది. అయితే, చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరిదైన ఓవల్ టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఓటమి ఖాయమనుకున్న వేళ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లోనూ భారత్కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే. చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్తో సిరాజ్.. కొంప మునిగేదే! -
అతడికి నువ్వెందుకు చెప్పవు? గిల్తో సిరాజ్.. కొంప మునిగేదే!
ఐదో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరులో భారత్ ఇంగ్లండ్పై గెలిచి సిరీస్ను సమం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లినా.. అనూహ్య రీతిలో పుంజుకుని సంచలన విజయం సాధించింది. ఓవల్లో చివరిదైన ఐదో రోజు ఆటలో ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉండగా.. భారత్కు నాలుగు వికెట్లు అవసరమయ్యాయి.అద్భుతం చేసిన సిరాజ్ ఇలాంటి క్లిష్ట సమీకరణాల వేళ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతమైన బౌలింగ్తో.. ఆఖరి రోజు నాలుగింటిలో మూడు వికెట్లు తానే పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి వికెట్గా గస్ అట్కిన్సన్ను వెనక్కి పంపి భారత్ను గెలుపు తీరాలకు చేర్చడం సిరీస్ మొత్తానికే హైలైట్గా నిలిచింది.జురెల్ ఏమరపాటు కారణంగానిజానికి ఇంగ్లండ్ ఇంకాస్త ముందే ఈ వికెట్ కోల్పోయి ఉండేది. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కాస్త ఏమరపాటుగా ఉండటంతో ప్రత్యర్థి జట్టుకు పరుగు లభించింది. దీంతో మరోసారి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సిరాజ్ సరైన సమయంలో అట్కిన్సన్ను అవుట్ చేయకపోయి ఉంటే.. జురెల్ చేసిన పొరపాటు కారణంగా టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది.అసలేం జరిగిందంటే.. ఓవల్ టెస్టు ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోగానే.. ఆ జట్టు ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ బ్యాటర్గా వచ్చాడు. అయితే, స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అట్కిన్సన్.. వోక్స్ బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి.. ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి.. మళ్లీ తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.సిరాజ్ ప్లాన్ ఇదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)- సిరాజ్ కలిసి ఈ జోడీని రనౌట్ చేయాలి లేదంటే.. అద్భుతమైన డెలివరీతో అట్కిన్సన్ను వెనక్కి పంపాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే 84వ ఓవర్లో వైడ్ లేదా యార్కర్ వేయాలని సిరాజ్- గిల్ ప్లాన్ చేశారు.అనుకున్నట్లుగానే అట్కిన్సన్ సిరాజ్ వేసిన బంతిని మిస్సయ్యాడు. అయినా సింగిల్కు వెళ్లాడు. అయితే, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సరైన సమయంలో బంతిని అందుకుని స్టంప్స్ వైపు గిరాటెయ్యలేకపోయాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి అట్కిన్సన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. దీంతో సిరాజ్ వెళ్లి గిల్తో కాస్త గట్టిగానే ఏదో వాదించినట్లుగా కనిపించింది.అయితే, ఆ మరుసటి ఓవర్లోనూ సింగిల్ తీయగలిగిన అట్కిన్సన్ (29 బంతుల్లో 17)ను.. 86వ ఓవర్ మొదటి బంతికే సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. సిరీస్ను 2-2తో సమం చేయగలిగింది.అతడికి ఎందుకు చెప్పవు?ఈ పరిణామాలపై స్పందించిన కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. రనౌట్ చేసేందుకు ధ్రువ్ జురెల్ను సిద్ధంగా ఉండమని చెప్పాడు. అయితే, నేను ధ్రువ్తో ఈ మాట చెప్పే కంటే ముందే సిరాజ్ బౌలింగ్ చేసేందుకు రన్ మొదలుపెట్టాడు.దీంతో ధ్రువ్ వేగంగా స్పందించలేకపోయాడు. అతడు స్టంప్స్ను మిస్ చేయగానే సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. ‘నువ్వు అతడికి ఎందుకు చెప్పవు?’’ అని నన్ను ప్రశ్నించాడు’’ అని గిల్ తెలిపాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా గిల్కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్లో సిరాజ్ వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చడం విశేషం.చదవండి: ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్ज़िन्दगी देती है मौक़ा एक , अपनी पहचान बनाने काकुछ कर दिखाने का ✨@UltraTechCement | #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia pic.twitter.com/atceen4I2W— Sony Sports Network (@SonySportsNetwk) August 5, 2025 -
ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద ఆద్యంతం ఆసక్తిగా సాగిన టెస్టు సిరీస్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో అసాధారణ రీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టుపై విజయభేరి మోగించింది. తద్వారా ఓడిపోవడం ఖాయమనుకున్న ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది.దీంతో వరుస పరాజయాల తర్వాత హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు కాస్త ఊరట లభించింది. టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు కూడా శుభారంభమే దక్కింది. అయితే, తుదిజట్టు విషయంలో కొన్ని అనూహ్య ఎంపికలు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను సిరీస్ మొత్తానికి దూరంగా ఉంచడం వీరిద్దరిపై విమర్శలకు కారణమయ్యాయి.దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత..ఏదేమైనా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... అది కూడా విదేశీ గడ్డ మీద జరిగిన సిరీస్లో భారత్ ఈ మేర సఫలం కావడం హర్షించదగ్గ విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్రూమ్లో చేసిన ప్రసంగం వైరల్గా మారింది.ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు‘ఇక్కడ ఈ సిరీస్ను 2–2తో ముగియడం చాలా గొప్ప ఫలితం. అందరికీ నా అభినందనలు. అయితే మనం మెరుగుపడేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తే సుదీర్ఘ కాలం టీమిండియా ప్రపంచ క్రికెట్ను శాసించగలదు.ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. డ్రెస్సింగ్రూమ్లో సంస్కృతి ఎలా ఉండాలంటే అందరూ ఇందులో భాగం కావాలని కోరుకోవాలి. ఇదే మనం చేయాల్సిన పని’ అని గంభీర్ మార్గనిర్దేశనం చేశాడు. ఓవల్లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ ఈ మేరకు ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు.గొప్పగా అనిపించిందిఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అనే ప్రత్యేక అవార్డును రవీంద్ర జడేజా చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ‘ఇంగ్లండ్లో వరుసగా నాలుగు టెస్టులు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. ఇక్కడ బాగా ఆడాలని ఎంతో కోరుకున్నాను. ప్రతీ రోజు మన జట్టు ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్-2025 ఫలితాలు👉తొలి టెస్టు- హెడింగ్లీ, లీడ్స్- ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు✊రెండో టెస్టు- ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్- 336 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం- ఈ వేదికపై భారత్కు ఇదే తొలి గెలుపు👉మూడో టెస్టు- లార్డ్స్, లండన్- 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్🤝నాలుగో టెస్టు- ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్- డ్రా✊ఐదో టెస్టు- కెన్నింగ్టన్ ఓవల్, లండన్- ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు🤝సిరీస్ ఫలితం- 2-2తో సమంచదవండి: Asia Cup 2025: ఆసియా కప్లో గిల్, జైస్వాల్! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
IND vs ENG: టీమిండియా నుంచి ఆరుగురు.. గిల్కు చోటు లేదు!
ఐదు టెస్టులు.. ఇరవై ఐదు రోజులు.. ఆద్యంతం ఆసక్తికరం.. ఆఖరి టెస్టు.. ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరు.. టెస్టు క్రికెట్ ప్రేమికుల మది దోచుకున్న సిరీస్.. అదే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 2-2తో సమంగా ముగిసింది.లీడ్స్లో ఇంగ్లండ్, ఎడ్జ్బాస్టన్లో టీమిండియా గెలవగా.. లార్డ్స్లో ఆతిథ్య జట్టు జయభేరి మోగించింది. అనంతరం మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టు డ్రా కాగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను డ్రా చేసింది. సిరాజ్ మేజిక్అయితే, ఇరుజట్లు కూడా ఆఖరి నిమిషం వరకు పోరాడిన తీరు అద్భుతం. చివరకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి టీమిండియా విజయాన్ని ఖరారు చేయడం అభిమానులను ఖుషీ చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మెగా సిరీస్కు సంబంధించి ఇంగ్లండ్- ఇండియా నుంచి అత్యుత్తమ తుదిజట్టును ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఎంపిక చేశాడు. తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా జోడీకి స్థానం ఇచ్చిన ఈ లెజెండరీ బౌలర్.. మిడిలార్డర్లో మాత్రం ఇంగ్లండ్కే పెద్దపీట వేశాడు.అదనపు భారాన్నీ తానే మోశాడుఇక ఆల్రౌండర్ జాబితాలో వాషింగ్టన్ సుందర్కూ చోటిచ్చిన బ్రాడ్.. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్తో పాటు టీమిండియా ద్వయాన్ని కూడా ఎంపిక చేశాడు. ఓవరాల్గా తన జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఐదుగురు ఇంగ్లండ్ ప్లేయర్లకు చోటిచ్చాడు. అయితే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, 754 పరుగులు సాధించిన భారత సారథి శుబ్మన్ గిల్కు మాత్రం అతడు స్థానం కల్పించలేదు.ఈ సందర్భంగా సిరాజ్ను ప్రత్యేకంగా అభినందించాడు స్టువర్ట్ బ్రాడ్. ‘‘ప్రతిసారి బంతిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. బాధ్యతంతా తన మీదే వేసుకున్నాడు. బుమ్రా గైర్హాజరీలో అదనపు భారాన్నీ తానే మోశాడు. పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. సిరాజ్ ఉండటం భారత జట్టును మరింత పటిష్టం చేస్తుంది’’ అంటూ స్టువర్ట్ బ్రాడ్ సిరాజ్పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో పదకొండు వందలకు పైగా బంతులు వేసిన సిరాజ్ 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ 2025 టెస్టు సిరీస్- స్టువర్ట్ బ్రాడ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జోఫ్రా ఆర్చర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
IND vs ENG: ఐదో టెస్టులో కొత్త సూపర్స్టార్ని చూస్తాం: అశ్విన్
భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచం ఓ కొత్త సూపర్స్టార్ను చూడబోతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఓవల్ టెస్టులో సత్తా చాటి.. నయా సూపర్స్టార్గా అవతరించబోతున్నాడని జోస్యం చెప్పాడు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు పూర్తి కాగా ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో లండన్లోని ఓవల్ మైదానంలో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టుతో ఫలితం తేలనుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తుదిజట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం నొప్పి కారణంగా ఐదో టెస్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. జేమీ ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు.అసాధారణ ప్రతిభమరోవైపు.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లకు తుదిజట్టులో స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఐదో టెస్టు సందర్భంగా క్రికెట్ ప్రపంచం కొత్త సూపర్స్టార్ను చూడబోతోంది.అతడు కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అవును.. జేకబ్ బెతెల్ గురించే నేను మాట్లాడుతున్నాను. అతడిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. బ్యాట్తో అద్భుతాలు చేయగలడు. లెఫ్టార్మ్ బౌలింగ్తో అదనపు బౌలర్గానూ పనికివస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.టీమిండియాలోనూ నాలుగు మార్పులుఇదిలా ఉంటే.. ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కూడా నాలుగు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ఆకాశ దీప్, ప్రసిద్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ తుదిజట్టులోకి వచ్చారు.కాగా 21 ఏళ్ల జేకబ్ బెతెల్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు.. లెఫ్టార్మ్ స్పిన్నర్గానూ సేవలు అందించగలడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జేకబ్.. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 12 వన్డేలు, 13 టీ20లు, మూడు టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 317, 281, 260 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో ఏడు, టీ20లలో నాలుగు, టెస్టుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘మీకు మరో దారి లేదు’.. షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది! -
‘కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు.. అందుకు కారణం అదే’
బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియా యాజమాన్యం తరచూ మార్పులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ (Nick Compton) అన్నాడు. మేనేజ్మెంట్ నిలకడలేమితనం కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడతారని.. ఇది వారి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇందుకు కేఎల్ రాహుల్ నిదర్శనం అని కాంప్టన్ తెలిపాడు.కాగా టెస్టుల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) గత కొన్నాళ్లుగా వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే కొన్నిసార్లు ఓపెనర్గా.. మరికొన్నిసార్లు మిడిలార్డర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఓపెనర్గా వచ్చిన అతడు.. రోహిత్ రాకతో మళ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతోఇక ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఓపెనర్గా కేఎల్ రాహుల్ స్థానం సుస్థిరమైంది. యశస్వి జైస్వాల్తో కలిసి ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ఆట తీరుతో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ నిక్ కాంప్టన్ మాట్లాడుతూ.. రాహుల్ పట్ల టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టాడు. ‘‘ఇంగ్లండ్ జట్టును చూడండి. జో రూట్ ఎల్లప్పుడూ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు.ఓపెనర్లు కూడా మారరు. కానీ టీమిండియాలో శుబ్మన్ గిల్ ఓసారి మూడో స్థానంలో ఆడతాడు. ఇంకోసారి మరెవరో.. మళ్లీ గిల్ తిరిగి వస్తాడు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.అందుకే రాహుల్ వరుసగా విఫలమయ్యాడుఇక కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని అటూ.. ఇటూ మారుస్తూనే ఉన్నారు. ఫలితంగా అతడి ప్రదర్శన ప్రభావితం అయింది. రాహుల్ వరుసగా విఫలమయ్యాడు.నిజానికి అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు. అయినా కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్ల విషయంలో టీమిండియా త్వరత్వరగా నిర్ణయాలు మార్చేసుకోవడం సరికాదు. ఇంగ్లండ్ జట్టులో ఎవరిపై అంత తేలికగా వేటు వేయరు.సాయి సుదర్శన్ టాలెంట్ ప్లేయర్. కానీ అతడిని తప్పించి కరుణ్ నాయర్ను తీసుకురావడం.. మళ్లీ కోసం కరుణ్ నాయర్పై వేటు వేసి అతడిని తప్పించడం సరికాదు. సెలక్షన్లో నిలకడ లేకపోవడం వల్ల జట్టు నిర్మాణం దెబ్బతింటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాంప్టన్ రెవ్స్పోర్ట్స్తో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.రెండు శతకాలుకాగా ఇంగ్లండ్తో టెస్టుల్లో తిరిగి ఓపెనర్గా వస్తున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 42, 137, 2, 55, 100, 39, 46, 90.ఇక ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియాపై ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన సిరీస్ను 2-2తో సమం చేయగలుగుతుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో సాయి సుదర్శన్ను మూడో స్థానంలో ఆడించిన యాజమాన్యం.. రెండు, మూడో టెస్టుల్లో ఆ స్థానంలో కరుణ్ నాయర్ను పంపింది. ఇక నాలుగో టెస్టులో తిరిగి సాయిని పిలిపించిన సెలక్టర్లు.. కరుణ్పై వేటు వేశారు. మరోవైపు.. విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. అంతకుముందు అతడు వన్డౌన్లో వచ్చేవాడు.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్లో ఇండియా -
IND vs ENG: కీలక టెస్టుకు బుమ్రా దూరం.. జట్టులోకి వచ్చేదెవరంటే?
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ రైటార్మ్ పేసర్ ఓవల్ టెస్టు నుంచి తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు టీమిండియా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే, లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో మాత్రం పోరాడి ఓడింది.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లగా.. తమకు అచ్చిరాని మాంచెస్టర్లో టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది. అనూహ్య రీతిలో పుంజుకుని ఓటమి నుంచి తప్పించుకుంది. ఇక ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు లండన్లోని ఓవల్ మైదానంలో జరుగనుంది.ఈ సిరీస్ను కాపాడుకోవాలంటే ఆఖరి టెస్టులో టీమిండియా తప్పక విజయం సాధించాల్సిందే. ఇంతటి కీలకమైన టెస్టులో ప్రధాన పేసర్ బుమ్రాను ఆడించాలని యాజమాన్యం తొలుత భావించింది. అయితే, అతడి ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకొని.. మున్ముందు ఇబ్బంది రాకుండా ఉండాలంటే విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని బీసీసీఐ వైద్య బృందం సిఫారసు చేసింది.తుదిజట్టులోకి ఆకాశ్ దీప్ఈ నేపథ్యంలో ఐదో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడు. అతడి స్థానంలో మరో పేసర్ ఆకాశ్ దీప్ భారత తుదిజట్టులోకి రానున్నాడు. స్వల్ప గాయం కారణంగా ఆకాశ్ మాంచెస్టర్ టెస్టులో ఆడలేదు. అయితే, ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్గా ఉన్న నేపథ్యంలో ఓవల్ టెస్టు బరిలో దిగనున్నాడు. కాగా ఆకాశ్ దీప్ ఎడ్జ్బాస్టన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఏకంగా పది వికెట్లు కూల్చి ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో బుమ్రా కేవలం మూడు టెస్టులే ఆడతాడని బీసీసీఐ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. లీడ్స్లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు దూరంగా ఉన్నాడు. అనంతరం లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చిన అతడు.. మాంచెస్టర్లోనూ ఆడాడు. అయితే, ఓవల్లోనూ ఆడాలని అనుకున్నా ఫిట్నెస్ సమస్యల వల్ల సాధ్యపడటం లేదు. కాగా ఈ సిరీస్లో ఆడిన మూడు టెస్టుల్లో కలిపి బుమ్రా 14 వికెట్లు తీశాడు.చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
IND vs ENG 5th Test: ‘వాళ్లు అతి చేశారు.. అందుకే’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)- ఓవల్ పిచ్ క్యూరేటర్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) వివరణ ఇచ్చాడు. ఓవల్ గ్రౌండ్ క్యురేటర్ కాస్త దూకుడైన వ్యక్తి అని తమకు ముందే తెలుసని తెలిపాడు. మేమేమీ స్పైక్స్తో రాలేదుఈ సిరీస్లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ పిచ్ క్యురేటర్లు తమకు బాగా సహకరించారని, ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ‘ఒక జట్టు కోచ్ను 2.5 మీటర్ల దూరం నిలబడమని చెప్పడం చాలా ఇబ్బందిగా అనిపించింది.మేమేమీ స్పైక్స్తో రాలేదు. రబ్బరు చెప్పులతో అక్కడ నిలబడ్డాం కాబట్టి పిచ్ పాడవుతుందనే సమస్యే లేదు. అలా ఎవరైనా ఎందుకు చేస్తారు. పిచ్ను జాగ్రత్తగా చూసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ ఇది కాస్త అతిగా అనిపించింది. అది క్రికెట్ పిచ్ మాత్రమేమా జట్టు సభ్యులు అక్కడ ఆడబోతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా అది క్రికెట్ పిచ్ మాత్రమే. కాలు పెట్టగానే విరిగిపోయేందుకు అదేమీ 200 ఏళ్లనాటి పురాతన వస్తువు కాదు’ అని కొటక్ వివరించాడు. కాగా ఇంగ్లండ్తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. లండన్లోని ఓవల్ మైదానంలో జరిగే ఆఖరి పోరుకు సిద్ధమయ్యే క్రమంలో భారత ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ నేపథ్యంలో ప్లేయర్లతో పాటు కోచింగ్ బృందం మైదానానికి వెళ్లింది.హద్దుల్లో ఉండుఈ క్రమంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ తన సహచర సిబ్బందితో కలిసి పిచ్ను పరిశీలించేందుకు వెళ్లాడు. అయితే, ఓవల్ మైదానం క్యూరేటర్ లీ ఫోర్టస్ బృందంలోని ఓ సభ్యుడు గంభీర్, అతడి సహచరులను పిచ్కు దూరంగా ఉండమని హెచ్చరించాడు. పిచ్ పాడకుండా జాగ్రత్తలు చెప్పే క్రమంలో అతడు కాస్త ‘అతి’గా ప్రవర్తించడంతో చిర్రెత్తిపోయిన గంభీర్.. ‘నువ్వు గ్రౌండ్స్మెన్వి మాత్రమే. హద్దుల్లో ఉండు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో సితాన్షు కొటక్ వచ్చి క్యూరేటర్ను దూరంగా తీసుకువెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. క్యూరేటర్- గంభీర్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
BCCI: ఇద్దరు టీమిండియా కోచ్లపై వేటు!.. అతడు మాత్రం..
గత కొన్నాళ్లుగా టీమిండియా టెస్టుల్లో నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడుతోంది. స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ చేదు అనుభవం చవిచూసింది.కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 ఫైనల్ చేరే అవకాశాన్ని కూడా టీమిండియా కోల్పోయింది. డబ్ల్యూటీసీ మొదలుపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్.. ఈసారి మాత్రం ఇలా డీలాపడింది.అయితే, గత వైఫల్యాలు మరిచి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ను ఆరంభించిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ నిరాశపరుస్తోంది. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలో... టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్లో ఓడిపోయిన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో మాత్రం తొలిసారి గెలుపు జెండా ఎగురవేసింది.అనంతరం లార్డ్స్లో ఓడిపోయిన గిల్ సేన... తాజాగా మాంచెస్టర్లో ముగిసిన నాలుగో టెస్టులో ‘డ్రా’ తో గట్టెక్కింది. ఇక ఓవల్ మైదానంలో.. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయగలుగుతుంది. లేదంటే.. విదేశీ గడ్డపై వరుసగా రెండోసారి భంగపాటు తప్పదు.నిజానికి లీడ్స్, లార్డ్స్లో వ్యూహాత్మక తప్పిదాల వల్లే గెలవాల్సిన మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయింది. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలు వాడుకోకపోవడం.. కరుణ్ నాయర్ విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.అయితే, గంభీర్పై నమ్మకం ఉంచిన యాజమాన్యం బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటేలపై మాత్రం వేటు వేయనున్నట్లు సమాచారం. ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. ఆసియా కప్-2025 ముగిసిన తర్వాత వీళ్లిద్దరికి ఉద్వాసన పలికేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంగం సిద్ధం చేసింది. వెస్టిండీస్తో అక్టోబరులో జరిగే సిరీస్కు ముందే వీరిపై వేటు వేయనుంది. మోర్కెల్ బౌలింగ్ కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమీ రాలేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు.. అసిస్టెంట్ కోచ్గా డష్కాటే సేవలు కూడా అంత గొప్పగా లేవనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోర్కెల్, డష్కాటేలను సాగననంపేందుకు బోర్డు సిద్ధమైంది.కాగా గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్, డష్కాటేలతో పాటు అభిషేక్ నాయర్ను మేనేజ్మెంట్ అతడి సహాయక సిబ్బందిలో చేర్చింది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అభిషేక్ నాయర్పై వేటు వేసిన బీసీసీఐ... తాజాగా మోర్నీ, డష్కాటేల భవితవ్యంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
చరిత్ర సృష్టించిన జడేజా.. రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనత
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడిన జడ్డూ.. తాజాగా నాలుగో టెస్టులోనూ పట్టుదలగా నిలబడ్డాడు. సహచర ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)తో కలిసి శతక్కొట్టి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు.. వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆల్రౌండర్గా రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనత సాధించాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.జడేజా వీరోచిత పోరాటంఇందులో భాగంగా లీడ్స్ టెస్టులో 36 పరుగులు చేసిన జడేజా.. ఒక వికెట్ తీశాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 89 విలువైన పరుగులు చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్లో 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జడేజా రెండు అద్భుత అర్ధ శతకాలు (72, 61 నాటౌట్) చేశాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మాంచెస్టర్ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన హాఫ్ సెంచరీని శతకంగా మలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 20 పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో అజేయ శతకం (107)తో మెరిశాడు. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.రెండో ఆల్రౌండర్గా అరుదైన ఘనతఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటి వరకు 34 వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు జడ్డూ. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీఫీల్డ్ సోబర్స్ తర్వాత ఇంగ్లండ్లో 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్గా విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన మూడో ఆల్రౌండర్ జడ్డూ. అతడి కంటే ముందు సోబర్స్తో పాటు ఇంగ్లండ్కు చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్ ఈ ఫీట్ నమోదు చేశారు.‘డ్రా’ గా ముగిసిన నాలుగో టెస్టుకాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం - ఆదివారం జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 669 పరుగులు చేసింది. తద్వారా 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన వేళ.. కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుత శతకం (103) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ హాఫ్ సెంచరీ (90)తో ఆకట్టుకున్నాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్కు ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను డ్రాతో గట్టెక్కించారు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ముందున్న ఇంగ్లండ్కు.. ఓవల్లో జరిగే ఐదో టెస్టులో చెక్ పెట్టి సిరీస్ను డ్రా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడు అవుట్
టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతో మాంచెస్టర్ బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయం వల్ల దూరం కాగా.. అతడి స్థానంలో లియామ్ డాసన్ (Liam Dawson) ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు.వేలు ఫ్యాక్చర్ఇదొక్క మార్పు మినహా లార్డ్స్లో ఆడిన జట్టుతోనే ఇంగ్లండ్ నాలుగో టెస్టు ఆడనుంది. కాగా భారత్తో మూడో టెస్టు సందర్భంగా షోయబ్ బషీర్ ఎడమచేతి వేలికి ఫ్యాక్చర్ అయింది. తన బౌలింగ్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో బషీర్ గాయపడ్డాడు. దీంతో సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకూ అతడు దూరం కాగా.. బషీర్ స్థానంలో డాసన్ జట్టులోకి వచ్చాడు.ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీమరోవైపు.. ఇంగ్లండ్ సెలక్టర్లు.. గాయం నుంచి కోలుకున్న పేసర్ గస్ అట్కిన్సన్ను కాదని డాసన్ వైపు మొగ్గు చూపడం విశేషం. కాగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల లియామ్ డాసన్ దేశీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గత మూడేళ్లలో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడు 140కి పైగా వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల తర్వాత అతడు మరోసారి ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. తన కెరీర్లో ఇప్పటికి మూడు టెస్టులు మాత్రమే ఆడిన డాసన్ ఏడు వికెట్లు పడగొట్టాడు.ఆధిక్యంలో ఇంగ్లండ్కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన స్టోక్స్ బృందం.. ఎడ్జ్బాస్టన్లో గిల్ సేన చేతిలో 336 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే, లార్డ్స్లో ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య తొమ్మిది టెస్టులు జరుగగా.. టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.భారత్తో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్, జోఫ్రా ఆర్చర్.చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్కు ఇదెలా సాధ్యమైందంటే? -
అతడిని కాదని అన్షుల్ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు నేపథ్యంలో ఆల్రౌండర్ అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) కొత్తగా టీమిండియాలోకి చేరాడు. స్టార్ క్రికెటర్లు గాయాల పాలు కావడంతో ఈ హర్యానా ఆటగాడికి ఈ మేర బంపరాఫర్ దక్కింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కాగా.. పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) నాలుగో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.మరోవైపు.. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఫిట్నెస్పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రైటార్మ్ పేసర్ అన్షుల్ కాంబోజ్ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం అధికారికంగా వెల్లడించింది.అతడిని కాదని అన్షుల్ను ఎలా ఎంపిక చేస్తారు?అయితే, సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం సరికాదంటూ భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. హర్షిత్ రాణాను కాదని అన్షుల్ కాంబోజ్ను ఎలా పిలిపించారని ప్రశ్నించాడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదుకాగా ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. అయితే, ఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ జట్టులోకి అదనపు ఆటగాడిగా హర్షిత్ రాణాను తీసుకుని.. అక్కడే ఉంచింది యాజమాన్యం.అయితే, హర్షిత్ ఎంపికపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. అతడు కొన్ని రోజులకే స్వదేశానికి తిరిగి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇలా గాయాల బెడద నేపథ్యంలో అన్షుల్ను పిలిపించింది మేనేజ్మెంట్.అపుడు హర్షిత్.. ఇపుడు అన్షుల్ ఎందుకు?ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా లేడు. ఇపుడేమో ఇతడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతోందని మనమంతా ఆశ్చర్యపోవాలా? ఎవరు జట్టులోకి వస్తారు? ఎవరిని ఎప్పుడు తీసేస్తారు? అన్న విషయాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు?భారత్-ఎ తరఫున ప్రదర్శన గురించి మాట్లాడితే అన్షుల్ కాంబోజ్ మెరుగ్గా ఆడాడు. కానీ మీరు ముందుగా హర్షిత్ రాణాను టీమిండియాతో కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు.అలాంటపుడు అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది. కానీ ఇప్పుడు అతడు స్వదేశానికి వచ్చేశాడు. అన్షుల్ కాంబోజ్ని అక్కడే ఉంచారు. అంతా గందరగోళంగా ఉంది. మేనేజ్మెంట్కు ఈ విషయంలో స్పష్టత ఉండవచ్చేమో గానీ.. మనకు ఎవరూ ఏమీ చెప్పరు.అయినా, టీమిండియాలో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఏదేమైనా అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చేందుకు అర్హుడు. ఎట్టకేలకు అతడు టీమిండియాతో చేరాడు’’ అని పేర్కొన్నాడు.వీరి ప్రదర్శన ఇలాకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024-25 సందర్భంగా 23 ఏళ్ల హర్షిత్ రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో మాత్రం అతడు రెండు మ్యాచ్లలో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.మరోవైపు.. 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ నార్తాంప్టన్లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి అజేయ అర్ధ శతకం (51)తో మెరిశాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో గిల్ సేన ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్ (జూలై 23-27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు టీమిండియా (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.చదవండి: శతక్కొట్టిన భారత సంతతి బ్యాటర్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఫెయిల్! -
శతక్కొట్టిన భారత సంతతి బ్యాటర్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఫెయిల్!
ఇంగ్లండ్తో రెండో యూత్ టెస్టులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నిరాశపరిచాడు. సంప్రదాయ ఫార్మాట్లోనూ విధ్వంసకర రీతిలో ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పద్నాలుగు బంతులు ఎదుర్కొని ఇరవై పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ ఫోర్తో పాటు.. రెండు సిక్సర్లు ఉన్నాయి.ఇంగ్లండ్ పేసర్ అలెక్స్ గ్రీన్ (Alex Greeen) బౌలింగ్లో సిక్సర్ బాదిన సూర్యవంశీ.. తదుపరి బంతికి మరోసారి బంతిని గాల్లోకి లేపగా ఫ్రెంచ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 (India u19) క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.వన్డేలలో ఇరగదీసిన వైభవ్ఇందులో భాగంగా యూత్ వన్డేల్లో ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. 3-2తో సిరీస్ను గెలిచింది. ఈ విజయాల్లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఐదు వన్డేల్లో కలిపి ఓ విధ్వంసకర శతకం (143) సాయంతో మొత్తంగా 355 పరుగులు సాధించాడు.ఆరంభంలో నిరాశపరిచినా.. అయితే, ఇంగ్లండ్ తొలి యూత్ టెస్టు ఆరంభంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 14 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఈ పార్ట్టైమ్ స్పిన్నర్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్లో వైభవ్ 44 బంతుల్లోనే 56 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల 107 రోజులు) ఓ యూత్ టెస్టులో ఓ వికెట్ తీయడంతో పాటు అర్ధ శతకం కూడా బాదిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.మళ్లీ ఫెయిల్తాజాగా రెండో యూత్ టెస్టులో మాత్రం మరోసారి వైభవ్ అనుకున్న స్థాయిలో రాణించలేక నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ యువ జట్టుతో చెమ్స్ఫోర్డ్ వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులో.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.శతక్కొట్టిన ఏకాన్ష్ సింగ్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 81.3 ఓవర్లలో 309 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ ర్యూ అర్ధ శతకం (59)తో మెరవగా.. భారత సంతతికి చెందిన ఏకాన్ష్ సింగ్ (117) శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో జేమ్స్ మింటో (46) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.ఇక సోమవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 258 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే 24, వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG: కరుణ్పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే! -
IND vs ENG: కరుణ్పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే!
స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారింది. పేసర్లలో ఆకాశ్ దీప్ (Akash Deep) ఫిట్నెస్లేమితో సతమతమవుతుండగా.. అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. లోయర్ ఆర్డర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్లోనూ రాణించగల ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి?ఎడమ మోకాలికి గాయమైన కారణంగా నితీశ్ రెడ్డి ఇంగ్లండ్తో మిగిలిన ఉన్న రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ టెస్టు కోసం జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి స్థానంలో సీనియర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడా? అనే చర్చ జరుగుతోంది.లేదంటే.. బీసీసీఐ తాజాగా జట్టులోకి తీసుకున్న మరో ఆల్రౌండర్ అన్షుల్ కాంబోజ్పై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శార్దూల్, అన్షుల్ ఇద్దరూ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లే కాబట్టి.. వీరిలో ఒకరికే అవకాశం ఇచ్చి.. ఆకాశ్ దీప్ స్థానాన్ని ప్రసిద్ కృష్ణతో భర్తీ చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది.తద్వారా అన్షుల్ రూపంలో ఆల్రౌండర్తో పాటు ప్రసిద్ను తీసుకోవడం ద్వారా పేస్ బౌలింగ్ దళం బలం కూడా పెరుగుతుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు తోడుగా ప్రసిద్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.ధ్రువ్ జురెల్కు ఛాన్స్అయితే, బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటే మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు ఛాన్స్ దక్కుతుంది. నిజానికి నాలుగో టెస్టులో రిషభ్ పంత్ వేలి గాయం కారణంగా.. కేవలం బ్యాటర్గానే అందుబాటులో ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వికెట్ కీపర్గా జురెల్కు లైన్ క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.కరుణ్ నాయర్పై ఈసారి వేటుమరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్పై ఈసారి వేటు పడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన కెరీర్లో రెండో టెస్టు ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టు వికెట్ దృష్ట్యా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఈసారైనా బరిలోకి దింపాలనే సూచనలు వస్తున్నాయి.కుల్దీప్ను ఈసారైనా ఆడించండిబంతిని రెండు వైపులా టర్న్ చేయగల సత్తా కుల్దీప్నకు ఉందని.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లు అంత సులువుగా కుల్దీప్ను అటాక్ చేయలేరని.. కాబట్టి అతడిని తప్పక తీసుకోవాలని సూచించాడు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో ఉన్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లకు కుల్దీప్ కూడా తోడైతే జట్టు మరింత పటిష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లింది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో గిల్ సేన జయభేరి మోగించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 22 పరుగుల తేడాతో గెలిచిన స్టోక్స్ బృందం.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక. ఇందులో భారత్ తప్పకుండా గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్/అన్షుల్ కాంబోజ్.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని చూడగానే ఫిక్సయిపోయాం.. అతడొక అద్భుతం’ -
BCCI: నితీశ్ రెడ్డితో పాటు అతడూ అవుట్.. జట్టులోకి కొత్త ప్లేయర్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు (IND vs ENG)కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిషభ్ పంత్ (Rishbah Pant) వేలి గాయంతో కేవలం బ్యాటర్గా బరిలోకి దిగుతాడని తెలుస్తుండగా.. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఎడమ మెకాలికి గాయమైన కారణంగా ఈ ఆంధ్రా కుర్రాడు.. ఇంగ్లండ్ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. మరోవైపు.. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా మాంచెస్టర్ టెస్టుకు దూరమయ్యాడు. బెకెన్హామ్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది.నాలుగో టెస్టుకు దూరంఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో అర్ష్దీప్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఈ పంజాబీ బౌలర్ ఇప్పట్లో కోలుకునేలా లేడు. అందుకే నాలుగో టెస్టుకు అతడు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో మెన్స్ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అన్షుల్ కంబోజ్ను జట్టుకు ఎంపిక చేసింది. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా అతడు జట్టుతో చేరనున్నాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.గాయాల బెడదకాగా శుబ్మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు పూర్తికాగా ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్బాస్టన్లో చారిత్రాత్మ విజయం సాధించిన టీమిండియా.. మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)నూ గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఈ వేదికపై ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు గెలవకపోవడం.. పైగా ఇలా గాయాల బెడద వేధిస్తుండటం ఆందోళనకరంగా మారింది.ఇదిలా ఉంటే.. లీడ్స్లో ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బదులు.. నితీశ్ కుమార్ రెడ్డి రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చాడు. అయితే, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చివరగా లార్డ్స్లో మూడు వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా కేవలం 43 పరుగులే చేశాడు.మరోవైపు.. టీమిండియా తరఫున టీ20, వన్డేలలో అదరగొడుతున్న అర్ష్దీప్ ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఇక హర్యానాకు చెందిన అన్షుల్ కాంబోజ్ ఇటీవల ఇంగ్లండ్తో భారత్-‘ఎ’ జట్టు తరఫున అనధికారిక సిరీస్ ఆడాడు. నార్తాంప్టన్లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అన్షుల్ రెండో ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ అర్ధ శతకం (51) సాధించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు తీయడంతో ఆపటు 486 పరుగులు చేశాడు.ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్ ):శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ -
‘నేను తగినవాడిని కాదనిపించింది’
లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్కు ఇరు దేశాల బోర్డులు కలిసి తమ దిగ్గజాలను గౌరవిస్తూ ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’గా పేరు పెట్టాయి. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (200), అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉండగా... ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ అగ్ర స్థానంలో, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నారు. అయితే ట్రోఫీ కోసం సచిన్తో తన పేరును జత పర్చడం తనను చాలా ఆశ్చర్యపర్చిందని అండర్సన్ వ్యాఖ్యానించాడు. ఇది తాను ఊహించలేకపోయానని అతను అన్నాడు. ‘నా పేరిట ఒక ట్రోఫీ ఉండటమే విశేషం అయితే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజంతో నా పేరు జత కట్టడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. అసలు నా పేరును సచిన్ పక్కన చూసుకుంటే అది నేనేనా అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే నేను తగినవాడిని కాదనే భావన కూడా వచి్చంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడైన సచిన్ అంటే ఎంతో గౌరవభావం ఉంది. చిన్నప్పుడు అభిమానిగా అతని ఆటను చూశాను. ఆపై ప్రత్యరి్థగా తలపడ్డాను. కెరీర్ ఆసాంతం అతను ఒక దేశం ఆశల భారాన్ని మోశాడు. అలాంటి వ్యక్తితో నా పేరు జత చేయడం నా అదృష్టం’ అని అండర్సన్ తన మనసులో మాటను వెల్లడించాడు. -
India-England Test XI: భారత్ నుంచి ఏడుగురు.. సచిన్కు నో ప్లేస్
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar)లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలిస్తే.. ఎడ్జ్బాస్టన్లో భారత్ తొలిసారి విజయబావుటా ఎగురవేసింది. అయితే, లార్డ్స్లో ఆఖరి వరకు పోరాడిన గిల్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్లోనూ తొలిసారి గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ఇక ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కామెంటేటర్ వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర ఎంపికతో ముందుకు వచ్చాడు. ఇరుజట్ల నుంచి 21వ శతాబ్దానికి గానూ తన అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. దిగ్గజాలకు నో ప్లేస్అయితే, ఇందులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)తో పాటు గౌతం గంభీర్, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలకు మాత్రం పుజ్జీ చోటివ్వలేదు.అదే విధంగా.. ఇంగ్లండ్ లెజెండరీ ఆటగాళ్లు సర్ అలిస్టర్ కుక్, జేమ్స్ ఆండర్సన్ (James Anderson)లను కూడా పుజారా పట్టించుకోలేదు. ఇక తన కంబైన్డ్ జట్టుకు ఓపెనర్లుగా అలెక్ స్టెవార్ట్, రాహుల్ ద్రవిడ్లను ఎంచుకున్న పుజారా.. వన్డౌన్లో జో రూట్ను ఆడిస్తానని తెలిపాడు. భారత్ నుంచి ఏడుగురుమరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఎంపిక చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. ఐదో స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా ఆటగాళ్లకే పుజారా పెద్ద పీట వేశాడు. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు చోటిచ్చిన పుజారా.. స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లకు స్థానం కల్పించాడు. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్లను పుజారా ఎంపిక చేశాడు. మొత్తంగా టీమిండియా- ఇంగ్లండ్ 21వ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మాత్రమే పుజారా చోటివ్వడం విశేషం. పన్నెండో ఆటగాడిగా మాథ్యూ హోగర్డ్ను పుజ్జీ ఎంచుకున్నాడు.ఎదురుచూపులే మిగిలాయికాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేల్లో కలిపి 51 పరుగులు మాత్రమే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో 30 మ్యాచ్లలో కలిపి 390 రన్స్ చేశాడు. చివరగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ ఆడిన పుజారా.. టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, యువ ఆటగాళ్లతో పోటీలో అతడు పూర్తిగా వెనుకబడ్డాడు.పుజారా ఎంచుకున్న 21వ శతాబ్దపు భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్అలెస్ స్టెవార్ట్ (వికెట్ కీపర్), రాహుల్ ద్రవిడ్, జో రూట్, విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మాథ్యూ హొగర్డ్ (12th man).చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?.. ధోని నిర్ణయం ఇదే.. -
రిస్క్ తీసుకోవా?.. సింగిల్స్ తీయడానికే ఉన్నావా?
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును టీమిండియా మాజీ హెడ్కోచ్ గ్రెగ్ చాపెల్ విమర్శించాడు. లార్డ్స్ టెస్టు (Lord's Test)లో జడ్డూ సింగిల్స్కే పరిమితం కావడం సరికాదని.. టెయిలెండర్లకు స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల వచ్చే లాభమేమీ ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో సరైన వ్యూహంతో షాట్లు బాదితే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికి మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. రెండింట ఓడిన గిల్ సేన.. ఒకటి గెలిచింది. చివరగా లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినప్పటికీ భారత జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.ఆశాకిరణంలా..ఆఖరి రోజు ఆటలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్కు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆశాకిరణంలా కనిపించాడు. కీలక బ్యాటర్లు అవుటైనప్పటికీ టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5), మహ్మద్ సిరాజ్ (30 బంతుల్లో 4)తో కలిసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.పోరాటం వృథాఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జడ్డూ 181 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ అనూహ్య రీతిలో పదో వికెట్గా వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలవడంతో జడ్డూ పోరాటం వృథాగా పోయింది.ఈ నేపథ్యంలో జడ్డూ పోరాటపటిమను ప్రశంసిస్తూ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు భారత మాజీ క్రికెటర్లు కామెంట్లు చేయగా.. గ్రెగ్ చాపెల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘అప్పటికి ప్రధాన బ్యాటర్గా జడేజా ఒక్కడే క్రీజులో ఉన్నాడు. టీమిండియా కచ్చితంగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాలనే పట్టుదలతో ఉంది.బంతుల్ని వదిలేస్తూ.. సింగిల్స్ తీస్తూ ఉంటే ఎలా?అలాంటి సమయంలో అతడు కొన్ని వ్యూహాత్మకమైన రిస్కులు తీసుకోవాల్సింది. బంతుల్ని వదిలేస్తూ.. సింగిల్స్ తీస్తూ ఉంటే ఎలా?.. గెలవాల్సిన మ్యాచ్లో ఇలా ఎవరైనా ఆడతారా?నిజానికి డ్రెసింగ్రూమ్ నుంచి అతడికి కచ్చితమైన సందేశం ఇచ్చి ఉండాల్సింది. ‘నువ్వే ఈ పని పూర్తి చేయాలి. టెయిలెండర్లు నీకు మద్దతుగా మాత్రమే నిలవగలరు. కానీ నువ్వే గెలిపించాలి’ అనే సందేశాన్ని కెప్టెన్ అతడికి అందించాల్సింది.ఆ పరిస్థితిలో జడేజా స్పెషలిస్టు బ్యాటర్లా ఆలోచించి ఉండాల్సింది. టెయిలెండర్లకు స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం?.. లార్డ్స్ పిచ్ మీద ఇది క్రమశిక్షణతో కూడిన ఇన్నింగ్సే. కానీ.. సరైందేనా? అంటే మాత్రం సమాధానం ఉండదు’’ అంటూ గ్రెగ్ చాపెల్ జడ్డూ ఆట తీరును విమర్శించాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23- 27) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తదుపరి ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు (జూలై 31- ఆగష్టు 4)కు లండన్లోని కెన్నింగ్ ఓవల్ మైదానం వేదిక.చదవండి: రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం -
బుమ్రా స్థానంలో యువ పేసర్.. కుల్దీప్ యాదవ్కూ చోటు!
భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టు నేపథ్యంలో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) టీమిండియా యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. ఒకవేళ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాంచెస్టర్ టెస్టు ఆడకుంటే.. అతడి స్థానంలో అర్ష్దీప్ సింగ్ను తుదిజట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.బుమ్రా ఆడతాడా? లేదా? ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే మూడు పూర్తికాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా బుమ్రా ఆడతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.అర్ష్దీప్నే ఎందుకంటే..ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే స్పందిస్తూ.. ‘‘ఒకవేళ బుమ్రా ఆడకపోతే.. అతడి స్థానంలో అర్ష్దీప్ను తుదిజట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే.. ఇంగ్లండ్లో బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల లెఫ్టార్మ్ సీమర్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఇందుకు అర్ష్దీప్ సరైనోడు.కుల్దీప్నూ ఆడించాలిఅతడి బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది. అందుకే బుమ్రా లేకుంటే అర్ష్దీప్నే కచ్చితంగా ఆడించాలి. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కూడా ఆడిస్తే బాగుంటుంది. గత మూడు టెస్టుల మాదిరే పిచ్ ఉన్నట్లయితే.. ఈసారి తప్పకుండా అతడిని ఆడించాలి.ప్రతిసారీ ఫాస్ట్బౌలర్లపైనే ఆధారపడటం సరికాదు. వికెట్లు తీయగల కుల్దీప్ వంటి వారికి అవకాశం ఇవ్వాలి. ఏదేమైనా మన బ్యాటింగ్ విభాగం మెరుగ్గానే రాణిస్తోంది. చేయాల్సిన దాని కంటే 25 -30 పరుగులు తక్కువ స్కోరు చేస్తున్నారేమో గానీ.. మరేం పర్లేదు’’ అంటూ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇప్పటికి టీ20, వన్డేలలో మాత్రమేకాగా టీమిండియా తరఫున టీ20, వన్డేల్లో రాణిస్తున్న అర్ష్దీప్ సింగ్ టెస్టుల్లో ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. 2022లో అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన అర్ష్దీప్.. ఇప్పటికి 63 టీ20లలో కలిపి 99 వికెట్లు, 9 వన్డేల్లో 14 వికెట్లు కూల్చాడు.ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక. అయితే, ఇక్కడ టీమిండియాకు దారుణమైన రికార్డు ఉంది. ఆడిన తొమ్మిది టెస్టుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. ఇంగ్లండ్ చేతిలో నాలుగింట ఓడిన టీమిండియా.. ఐదు టెస్టులను డ్రా చేసుకోగలిగింది. చదవండి: WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్ -
ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్.. ఇంగ్లండ్లో ఆ షాట్లు వద్దులే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికి మూడు టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి 70కి పైగా సగటుతో 425 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉండటం విశేషం.అయితే, పంత్ కొన్నిసార్లు అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకోవడం వల్ల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్లోనూ అదే పునరావృతం చేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) బౌలింగ్లో రెండుసార్లు భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకున్నాడు.ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్ఈ నేపథ్యంలో పంత్ రిస్కీ షాట్ల గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫారూఖ్ ఇంజనీర్ స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా అతడు ఇలాంటి షాట్లు ఆడటం మానుకోవాలి. ఇలాంటివి ఐపీఎల్ కోసం దాచిపెట్టుకోవాలి. టెస్టు క్రికెట్లో ఎంతో క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాల్లో ఆడేవాళ్లు సరైన రీతిలో ఆడాలి. సహచర ఆటగాళ్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి.. తమ ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మలచుకోవాలి’’ అని సూచించాడు.పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో!అదే విధంగా.. ‘‘పంత్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయితే, కీలక సమయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతడు ప్రతిభావంతుడైన ఆటగాడే. కొత్త కొత్త షాట్లు కనిపెడతాడు. ఒక్కోసారి హెల్మెట్ ఉండబట్టి సరిపోయిందిలే అనిపిస్తుంది. మా రోజుల్లో అయితే, పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో’’ అంటూ ఫారూఖ్ ఇంజనీర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా రిషభ్ పంత్ వేలికి గాయమై విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టులో అతడు కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాలని.. అతడికి బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా వ్యవహరించాలని ఫారూఖ్ ఇంజనీర్ సూచించాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికి మూడు పూర్తి కాగా.. ఇంగ్లండ్ రెండు గెలవగా.. టీమిండియా ఒక మ్యాచ్లో విజయం సాధించింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు -
సిరాజ్ సింహం లాంటోడు.. ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు.నాలుగో టెస్టు గెలిస్తేనే..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025 (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఐదింటిలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.బుమ్రా ఆడేది మూడేఅయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమిండియా యాజమాన్యం ముందే చెప్పింది. అతడు కేవలం మూడు టెస్టులే ఆడతాడని స్పష్టం చేసింది. ఈ క్రమంలో లీడ్స్లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్లో విశ్రాంతి తీసుకుని.. లార్డ్స్లో మళ్లీ ఆడాడు.ఇక బుమ్రా గైర్హాజరీలో పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనూ ఆడిన అతడు.. మొత్తంగా 13 (2, 6, 1, 2, 2) వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్లో ఆరు వికెట్లతో చెలరేగి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.సిరాజ్ సింహం లాంటోడుఈ నేపథ్యంలో డస్కటే సిరాజ్పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్బౌలర్గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం.అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం.మేమే అతడిని వారిస్తాంలార్డ్స్లో స్టోక్స్ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అతడు ఫిట్గా ఉండేలా చూసుకోవడం మా పని. అందుకే ఒక్కోసారి మేనేజ్మెంట్ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.కాగా 2023 నుంచి టీమిండియా ఆడిన 27 టెస్టులలో సిరాజ్ 24 మ్యాచ్లు ఆడాడు. టీమిండియా ఫాస్ట్బౌలర్లలో ఒక్కరు కూడా ఇలా వరుస మ్యాచ్లు ఆడలేదు. ఇక 2023 నుంచి ఇప్పటిదాకా అతడు 569.4 ఓవర్లు బౌల్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (721.2 ఓవర్లు), పేసర్ మిచెల్ స్టార్క్ (665.1) తర్వాత ఈ స్థాయిలో అలుపెరగకుండా బౌలింగ్ చేసిన ఏకైక భారత ఫాస్ట్బౌలర్ సిరాజ్. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా జూలై 23-27 మధ్య భారత్- ఇంగ్లండ్ నాలుగో టెస్టు జరుగనుంది.చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
లార్డ్స్లో అతడి పోరాటం అసాధారణం: గంభీర్ ప్రశంసలు
లార్డ్స్ టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అసాధారణ పోరాటం చేశాడని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. విజయం కోసం చివరి వరకు పట్టుదలగా నిలబడిన జడ్డూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతోంది.ఇందులో భాగంగా తొలుత లీడ్స్లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్ 1-1తో సమంగా ఉన్న వేళ లార్డ్స్ (Lord's Test)లో జరిగిన మూడో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.జడ్డూ పోరాటం వృథాఅయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తరుణంలో టీమిండియా సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందని అంతా భావించారు. కానీ జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత పోరాటపటిమతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, టెయిలెండర్ మహ్మద్ సిరాజ్ (30 బంతుల్లో 4) అనూహ్య రీతిలో బౌల్డ్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. జడ్డూ పోరాటం వృథాగా పోయింది.ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే, సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు జడ్డూ ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించారు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం జడేజా సరైన రీతిలోనే ఆడాడంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ‘‘అదొక అసాధారణ పోరాటం. జడ్డూ పోరాడిన తీరు నిజంగా ఒక అద్భుతం లాంటిదే’’ అని గంభీర్ జడ్డూను కొనియాడాడు. డ్రెసింగ్రూమ్లో ఈ మేరకు అతడు వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా జట్టులో ఉండటం అదృష్టంఇక సిరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్... ఇలా మూడు విభాగాల్లోనూ జడ్డూ భాయ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు.జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ బ్యాట్తో ఆదుకుంటాడు. క్షిష్ట సమయాల్లో రాణించే ఇలాంటి ప్లేయర్ అన్ని జట్లలోనూ ఉండడు. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ ప్రశంసించాడు. కాగా టీమిండియాతో సిరీస్లో 2-1తో ఇంగ్లండ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉ఇంగ్లండ్: 387 & 192👉భారత్: 387 & 170👉ఫలితం: 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
తగ్గేదేలే!.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న భారత అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఖాతాలో మరో ప్రపంచ రికార్డు చేరింది. యూత్ టెస్టు మ్యాచ్లో వికెట్ తీయడంతో పాటు.. అర్ధ శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఈ చిచ్చరపిడుగు చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు (IND U19 Vs ENG U19)తో జరిగిన తొలి యూత్ టెస్టు సందర్భంగా సాధించిన ఈ ఘనత గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.వన్డేలలో విధ్వంసకర శతకంఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు (Youth ODI's), రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ టూర్లో ఆది నుంచి వైభవ్ సూర్యవంశీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. యూత్ వన్డే సిరీస్ను భారత్ 3-2తో గెలుచుకోవడంలో పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిది కీలక పాత్ర.ఆరంభంలో నిరాశపరిచినా..ఐదు వన్డేల్లో ఐదు సాధించిన స్కోర్లు వరుసగా.. 48 (19), 45 (34), 86 (31), 143 (78), 33 (42). నాలుగో యూత్ వన్డేలో 52 బంతుల్లోనే శతకం బాది.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. అనంతరం ఇంగ్లండ్తో తొలి యూత్ టెస్టు (జూలై 12- 15)లో మాత్రం వైభవ్ ఆరంభంలో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.రెండు వికెట్లు, ఓ అర్ధ శతకంఅయితే, బ్యాట్తో విఫలమైనా వైభవ్ ఇక్కడ బంతితో రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ హంజా షేక్ (84), వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రూ (34) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్.ఇక భారత రెండో ఇన్నింగ్స్లో వైభవ్ బ్యాట్ ఝులిపించాడు. 44 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు సాధించాడు. తద్వారా ఇంగ్లండ్తో తొలి యూత్ టెస్టులో రెండు వికెట్లు తీయడంతో పాటు అర్ధ శతకం నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే అత్యంత పిన్న వయసులో ఒక యూత్ టెస్టులో వికెట్ తీయడంతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ పేరిట ఉండేది. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది.అత్యంత చిన్న వయసులో ఒక యూత్ టెస్టులో వికెట్ తీయడంతో పాటు 50 స్కోరు చేసిన క్రికెటర్లు వీరే🏏వైభవ్ సూర్యవంశీ (ఇండియా): 14 ఏళ్ల, 107 రోజుల వయసులో- బెకెన్హామ్ వేదికగా ఇంగ్లండ్ మీద🏏మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 167 రోజుల వయసులో- మిర్పూర్ వేదికగా శ్రీలంక మీద🏏షైకత్ అలీ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 204 రోజుల వయసులో- సైలెట్ వేదికగా ఇంగ్లండ్ మీద🏏నాసిర్ హుసేన్ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 219 రోజుల వయసులో డెర్బీ వేదికగా శ్రీలంక మీద🏏సురేశ్ రైనా (ఇండియా): 15 ఏళ్ల 242 ఏళ్ల వయసులో- కొలంబో వేదికగా ఇంగ్లండ్ మీద.చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే -
ఫిట్గా లేకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ (Dilip Vengarkar) ఘాటు విమర్శలు చేశాడు. ఫిట్గా లేనపుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడవద్దని.. అయినా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇలాంటి వాళ్లకు ఎందుకు అనుమతినిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించాడు.పనిభారం తగ్గించాలని..కాగా ఇంగ్లండ్తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderosn- Tendukar Trophy)లో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ముగియగా ఇంగ్లండ్ రెండు, భారత్ ఒకటి గెలిచింది. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్ బుమ్రా ఈ సిరీస్లో కేవలం మూడు టెస్టులే ఆడతాడని యాజమాన్యం ముందుగానే ప్రకటించింది. ఫిట్నెస్ సమస్యల ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా అతడిపై పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.దిలీప్ వెంగ్సర్కార్ ఫైర్అందుకు తగ్గట్లుగానే తొలి టెస్టు ఆడిన బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. తిరిగి లార్డ్స్లో మూడో టెస్టు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్ మ్యాచ్లో ఆడతాడా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్సర్కార్ బుమ్రా, టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.‘‘ఒకవేళ టీమిండియాకు ఆడాలని అనుకుంటే ప్రతి ఒక్క ఆటగాడు తప్పక ఫిట్గా ఉండాలి. ఫిట్గా లేకుంటే అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదు. తొలి, రెండో టెస్టుకు మధ్య 7- 8 ఎనిమిది రోజుల విరామం వచ్చింది. అయినా సరే అతడు రెండో టెస్టు ఆడలేదు.గంభీర్, అగార్కర్లకు నచ్చుతుందేమో గానీఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. అగార్కర్, గంభీర్లు ఇలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. ఎక్కడా ఇలా జరగదు’’ అంటూ దిలీప్ వెంగ్సర్కార్ రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.టెస్టు మ్యాచ్లలో బౌలర్ల ఎంపిక విషయంలో తను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్న వెంగ్సర్కార్.. ఫిట్గా ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే జట్టు ప్రయోజనాల కోసం సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడాలని సూచించాడు. అదే సమయంలో బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడికి ఉందని ప్రశంసించాడు. అయితే, ఒక్కసారి జట్టుతో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడతా అంటే కుదరదు అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా టెస్టు సిరీస్లో టీమిండియాపై ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక.చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
‘బుమ్రా ఆడినపుడే.. టీమిండియా ఓడిపోతుంది’
ఇంగ్లండ్తో మూడో టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మాంచెస్టర్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్లో జరిగిన ఉత్కంఠ పోరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని.. సిరీస్ను 2-2తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందే బుమ్రా పనిభారం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పేస్దళ నాయకుడిపై భారాన్ని తగ్గించేందుకు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో.. అతడు కేవలం మూడింటిలో మాత్రమే ఆడతాడని వీరు స్పష్టం చేశారు.నో క్లారిటీఇందుకు తగ్గట్లుగానే లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్లీ లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్లో ఆడతాడా? లేదా? అన్న అంశంపై మేనేజ్మెంట్ ఇంతవరకు స్పష్టతనివ్వలేదు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడొక ప్రపంచస్థాయి బౌలర్ అంటూనే.. బుమ్రా ఆడిన మ్యాచ్లలో టీమిండియాకు ఎక్కువసార్లు ఓటమే ఎదురైందని పేర్కొన్నాడు. అతడు లేనప్పుడే చిరస్మరణీయ విజయాలు అందుకుందని విమర్శించాడు.టీమిండియా గెలిస్తే ఐదో టెస్టు ఆడతాడా?‘‘ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో బుమ్రా కేవలం మూడే ఆడతాడని కోచ్ గౌతం గంభీర్ స్వయంగా చెప్పాడు. అతడు ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడాడు. సిరీస్లో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక్క టెస్టు మాత్రమే అతడు ఆడతాడన్నది తెలిసిందే.ఒకవేళ మేనేజ్మెంట్ తమ మాటకు కట్టుబడి ఉంటే.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తుందా? లేదంటే.. సిరీస్ ప్రాధాన్యత దృష్ట్యా ఐదో టెస్టులోనూ ఆడించాలని కోరుకుంటుందా?.. ఒకవేళ అతడు తదుపరి ఓల్డ్ ట్రఫోర్ట్ టెస్టులో ఆడి.. టీమిండియా గెలిస్తే అప్పుడు 2-2తో సిరీస్ సమం అవుతుంది.కాబట్టి సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో అతడిని ఆడించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా కాకుండా నాలుగో టెస్టులో టీమిండియా ఓడి 3-1తో సిరీస్ కోల్పోతే.. ఇక ఆఖరి టెస్టుకు అతడి అవసరం ఉండదని అనుకోవచ్చు.బుమ్రా జట్టులోనే ఉంటేనే ఓటమి?!ఇదొక అసాధారణ అంశం. ఏదేమైనా.. అతడు ఆడిన మ్యాచ్లలో టీమిండియా గెలిచిన సందర్భాల కంటే.. ఓడిన దాఖలాలే ఎక్కువని అంటూ ఉంటారు. అతడొక వరల్డ్క్లాస్ బౌలర్. అతడి బౌలింగ్ శైలి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఉత్తమ బౌలరే అయినా.. అతడి విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’’ అంటూ లాయిడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.కాగా 2018లో బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఇప్పటికి 47 మ్యాచ్లు ఆడాడు. ఇందులో టీమిండియా 20 గెలవగా.. 23 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో బుమ్రా మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ ఇందులో గిల్ సేన ఓటమిపాలైంది. ఇక రెండో టెస్టుకు అతడు దూరంగా ఉండగా ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ను ఏకంగా 336 పరుగుల తేడాతో ఓడించి ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.ఇక మూడో టెస్టుతో తిరిగి వచ్చిన బుమ్రా మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన (మొత్తం ఏడు వికెట్లు)తో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23-27) జరుగనుంది.చదవండి: జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్ జితేశ్ శర్మ -
నేను కెప్టెన్గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదు: జో రూట్
టీమిండియాతో రెండో టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. లార్డ్స్ (Lord's Test)లో ఇందుకు బదులు తీర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎట్టకేలకు గిల్ సేనపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో 2-1తో ముందంజ వేసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)ది కీలక పాత్ర.తగ్గేదేలేఓవైపు ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నా స్టోక్స్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఇటు బ్యాట్తోనూ.. అటు బంతితోనూ సత్తా చాటాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాటు.. టీమిండియా కీలక వికెట్లు కూల్చి జట్టు విజయానికి పునాది వేశాడు.లార్డ్స్ టెస్టులో స్టోక్స్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 44, 33 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీమిండియా రెండు ఇన్నింగ్స్లో కలిపి 44 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (40), నితీశ్ రెడ్డి (30) వికెట్లు కూల్చిన స్టోక్స్.. రిషభ్ పంత్ (74)ను రనౌట్ చేశాడు.అదే విధంగా.. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (39), ఆకాశ్ దీప్ (1) వికెట్లను పడగొట్టిన స్టోక్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ పట్టుదల, జట్టు ప్రయోజనాల పట్ల అతడి నిబద్ధత గురించి సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ జో రూట్ (Joe Root) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నేను కెప్టెన్గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదుటీమిండియాతో నాలుగో టెస్టుకు ముందు రూట్ మాట్లాడుతూ.. ‘‘అతడు ప్రతిసారీ నా మాట వినడు. ముఖ్యంగా నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఎంతగా చెప్పినా వినేవాడే కాదు. తన శరీరాన్ని కష్టపెట్టి ఎక్కువగా బౌలింగ్ చేసేవాడు.పనిభారాన్ని తగ్గించుకోమని చెబితే.. తను మాత్రం అసాధారణ రీతిలో జట్టు కోసం పట్టుదలగా ఆడేవాడు. కొన్నిసార్లు అతడి గాయాలు మరీ తీవ్రతరమైతే పరిస్థితి ఏమిటని నేను భయపడిపోయేవాడిని. కానీ అతడు మాత్రం రెండుసార్లు తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా మళ్లీ కోలుకుని ఇలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆట పట్ల తన అంకిత భావం అలాంటిది మరి’’ అని స్టోక్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా లార్డ్స్ టెస్టులో రూట్- స్టోక్స్ కలిసి రెండు ఇన్నింగ్స్లో వరుసగా 88, 67 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (104) చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 40 పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ (జూలై 23- 27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా -
బ్యాట్ను నేలకేసి కొట్టిన సిరాజ్!.. ఓటమిపై స్పందన ఇదే
లార్డ్స్ టెస్టులో గెలుపు కోసం చివరిదాకా పోరాడిన టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. మూడో టెస్టులో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో అనూహ్య రీతిలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌల్డ్ కావడంతో గిల్ సేన ఓటమి ఖరారైంది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 22 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. మరోసారి లార్డ్స్లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది.అంతేకాదు.. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నిజానికి.. ఐదో రోజు ఆరంభంలోనే టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో రిషభ్ పంత్ (9) బౌల్డ్ కాగా.. ఆ తర్వాత ఇన్ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (39) కూడా ఊహించని రీతిలో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.జడేజా ఒంటరి పోరాటంఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (0) డకౌట్ అయ్యాడు. అనంతరం నితీశ్ రెడ్డి (53 బంతుల్లో 13) కాసేపు నిలబడినా.. క్రిస్ వోక్స్ అద్భుత డెలివరీతో అతడిని వెనక్కిపంపించేశాడు. ఈ క్రమంలో బాధ్యతను నెత్తికెత్తుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.అతడికి తోడుగా టెయిలెండర్ జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5) చాలాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి సామ్ కుక్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్గా వెనుదిరగడంతో టీమిండియా అభిమానుల్లో గెలుపు ఆశలు దాదాపుగా చచ్చిపోయాయి. మహ్మద్ సిరాజ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడంటూ అంతా ఉసూరుమన్నారు.పాపం సిరాజ్ మియా..అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సిరాజ్ మియా 29 బంతుల్ని ఎదుర్కొని డిఫెండ్ చేసుకున్నాడు. ముప్పైవ బంతిని కూడా బాగానే డిఫెంగ్ చేసుకున్నా అనుకున్నాడు. కానీ ఊహించని రీతిలో బంతి పిచ్ మీద రోల్ అయి లెగ్ స్టంప్ను తాకగా బెయిల్ ఎగిరిపడింది.ఊహించని ఈ పరిణామంతో సిరాజ్తో పాటు టీమిండియా హృదయం కూడా ముక్కలైంది. ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంతో అలా సిరాజ్ పదో వికెట్గా వెనుదిరగ్గా.. లార్డ్స్లో టీమిండియా మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో కోపంతో సిరాజ్ బ్యాట్ను నేలకేసి కొట్టిన వీడియోతో పాటు.. ఓటమి నేపథ్యంలో అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారాయి.ఓటమిపై స్పందన ఇదే‘‘కొన్ని మ్యాచ్లు మన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే, కేవలం ఫలితం ఆధారంగా మాత్రమే కాదు.. అవి నేర్పిన పాఠాల వల్ల అలా గుర్తుండిపోతాయి’’ అంటూ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మూడు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండు, పర్యాటక టీమిండియా ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్లో నాలుగో మ్యాచ్ జరుగనుంది. చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా pic.twitter.com/Bm2Hp9Cm8K https://t.co/f4wTxyJSyg— Babu Bhaiya (@Shahrcasm) July 15, 2025 -
జితేశ్ శర్మకు అవమానం.. దినేశ్ కార్తిక్ కూడా పట్టించుకోలేదా?
టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)కు చేదు అనుభవం ఎదురైంది. భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మూడో టెస్టు వీక్షించేందుకు వెళ్తుంటే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. తాను ఎవరన్న విషయం స్పష్టంగా చెప్పినా.. లార్డ్స్ మైదానం (Lord's Stadium)లోకి ప్రవేశించకుండా ఆపేశారు.డీకేను సాయం కోరిన జితేశ్ఇలా జితేశ్ శర్మ స్టేడియం వెలుపల భద్రతా సిబ్బందితో పాట్లు పడుతున్న వేళ.. ఆర్సీబీ కోచ్, టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్ కామెంటేటర్ దినేశ్ కార్తిక్ బయటకు వచ్చాడు. అయితే, అతడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. ఇంతలో డీకేను చూసిన జితేశ్.. తనకు సాయం చేయాల్సిందిగా అతడిని కోరాడు.కానీ.. అప్పటికే ఆటోగ్రాఫ్లు, ఫొటోల కోసం తనను చుట్టుముట్టిన అభిమానుల గోల కారణంగా జితేశ్.. దినేశ్ కార్తిక్ను పిలిచినా అతడికి.. జితేశ్ గొంతు వినబడే పరిస్థితి లేకపోయింది. దీంతో జితేశ్ స్వయంగా డీకేకు ఫోన్ చేసి తన ఇబ్బంది గురించి చెప్పగా.. అతడు రంగంలోకి దిగాడు. అనంతరం ఇద్దరూ కలిసి మైదానంలోకి వెళ్లారు.ఇంతలా అవమానిస్తారా?.. అదేం లేదు!ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘అంతర్జాతీయ క్రికెటర్ అయిన జితేశ్ శర్మను ఇంతలా అవమానిస్తారా?’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతుండగా.. సెక్యూరిటీ సిబ్బంది తమ విధి నిర్వహణలో భాగంగానే ఇలా చేసిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా.. లార్డ్స్ ఎంట్రీ విషయంలో కచ్చితమైన నిబంధనలు ఉంటాయని.. స్టువర్ట్ బ్రాడ్ సైతం రిటైర్ అయిన వెంటనే తనకు స్టేడియంలోకి నేరుగా వచ్చే యాక్సెస్ లేకుండా పోయిందని గుర్తుచేస్తున్నారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా సిబ్బంది అలా ప్రవర్తించడంలో తప్పులేదని సమర్థిస్తున్నారు.ఆర్సీబీ గెలుపులో కీలక పాత్రకాగా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు విదర్భ ఆటగాడు జితేశ్ శర్మ. ఇప్పటికి ఏడు టీ20 మ్యాచ్లు ఆడి. 100 పరుగులు సాధించాడు. ఈ 31 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు వన్డే, టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో జితేశ్ శర్మది కీలక పాత్ర. 15 మ్యాచ్లలో కలిపి 261 పరుగులు చేసిన జితేశ్.. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించాడు కూడా!.. ఇక ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.ఇక ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తోన్న భారత జట్టు.. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్లో 1-2తో వెనుకబడింది గిల్ సేన. కాగా అంతకుముందు ముందు లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్లో నాలుగో టెస్టు జరుగుతుంది.చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారాpic.twitter.com/7gqAeAJHtx— Out Of Context Cricket (@GemsOfCricket) July 16, 2025 -
‘అతడిని టూర్లకు తిప్పుతారంతే.. తుదిజట్టులో చోటు ఉండదు’
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ (WV Raman) విమర్శల వర్షం కురిపించాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఆడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. నాయకత్వ బృందం ఆలోచన విధానం, నిర్ణయాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా టీమిండియా చేదు ఫలితాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. తాజాగా ఇంగ్లండ్ (IND vs ENG)లో పర్యటిస్తున్న టీమిండియా ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో వెనుకబడి ఉంది.బెంచ్కే పరిమితంఇక ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ టూర్లోనూ టీమిండియాతో ఉన్న ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Eswaran). అయితే, ఇంత వరకు అతడికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ బెంగాల్ వెటరన్ ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో అదరగొడుతూ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ.. తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కడం లేదు.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ డబ్ల్యూవీ రామన్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి అభిమన్యు ఈశ్వరన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వాలి. కానీ మేనేజ్మెంట్ అలా చేయడం లేదు. అతడి విషయంలో ఏదో ఒక నిర్ణయమైతే తీసుకోవాలి కదా!టూర్లకు తిప్పుతారంతే.. తుదిజట్టులో చోటు ఉండదుఓ క్రికెటర్ను వరుసగా టూర్లకు తిప్పుతారు.. కానీ తుదిజట్టులో మాత్రం చోటు ఇవ్వరు.. ఇలా చేయడంలో అర్థం ఉందా అసలు?.. ప్రత్యర్థి జట్టు, పిచ్ స్వభావం.. ఇలా పలు అంశాలను బట్టే తుదిజట్టు కూర్పు ఉంటుందని తెలుసు.. కానీ మరీ ఇలా ప్రతిసారీ అతడిని పక్కనపెట్టడం సరికాదు.కోచ్లు, సెలక్టర్లు బాగా ఆలోచించిన తర్వాతే జట్టును ఎంపిక చేస్తారు. మరి.. కొందరిని మాత్రం తుదిజట్టులో కనీసం ఒక్కసారైనా ఎందుకు ఆడించరు?.. తన గురించి యాజమాన్యం ఏమనుకుంటుందో అని సదరు ఆటగాడు కూడా ఆందోళనకు లోనవుతూ ఉంటాడు.అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలి.. జట్టులో ఎలా ఆడించాలన్న అంశాలపై మేనేజ్మెంట్కు కూడా అవగాహన ఉండదు. మరి అలాంటపుడు అసలు ఎంపిక చేయడం ఎందుకు? అభిమన్యు మంచి ప్లేయర్. అయితే, అతడిని ఆడించాలా వద్దా అన్న అంశంపై మేనేజ్మెంట్ ఏదో ఒక నిర్ణయానికి రావాలి.సెంచరీల వీరుడుఅంతేగాని.. సెలక్ట్ చేసిన ప్రతిసారీ బెంచ్కే పరిమితం చేయడం సరికాదు’’ అని యాజమాన్యం తీరును తప్పుబట్టాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ డబ్ల్యూవీ రామన్ ఈ మేరకు విమర్శలు చేశాడు. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 103 మ్యాచ్లు ఆడి 49కు పైగా సగటుతో 7841 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఒక్క మ్యాచ్కే వేటు వేస్తారా?అదే విధంగా.. కేవలం ఒక టెస్టులో విఫలమైనంత మాత్రాన సాయి సుదర్శన్పై వేటు వేయడం కూడా సరికాదని డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 30 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. రెండో టెస్టు నుంచి అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. వరుస వైఫల్యాల వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్కు మాత్రం ఇప్పటికి జరిగిన మూడు టెస్టుల్లోనూ ఆడే అవకాశం ఇచ్చారు.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్.చదవండి: అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే


