breaking news
england
-
కోచ్గా ఫ్లెమింగ్.. కెప్టెన్గా రూట్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెస్టు జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను నియమించింది. అదే సమయంలో స్టార్ బ్యాటర్ జో రూట్ను మరోసారి టెస్టు జట్టు కెప్టెన్గా ప్రకటించింది.53 ఏళ్ల ఫ్లెమింగ్ ఇప్పటివరకు ఏ జాతీయ జట్టుకూ ప్రధాన కోచ్గా పనిచేయలేదు. అయితే 2009లో ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్కు 17 ఏళ్లుగా ప్రధాన కోచ్గా కొనసాగి, ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిళ్లను అందించాడు.ఇటీవల వరుస పరాజయాలు, మైదానం వెలుపల జరిగిన వివాదాల నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ను తొలగించారు. అయితే ఆయన వైట్బాల్ జట్ల కోచ్గా కొనసాగనున్నారు.మరోవైపు, జో రూట్ 2017 నుంచి 2022 వరకు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ కాలంలో 65 టెస్టులకు నాయకత్వం వహించి, రికార్డు స్థాయిలో 27 విజయాలు అందించాడు.కొత్త బాధ్యతపై స్పందించిన ఫ్లెమింగ్, "ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కోచింగ్ పదవుల్లో ఇది ఒకటి. ఈ బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నాడు.పాక్ సిరీస్కు అందుబాటులో ఉండడుఆగస్టు 19 నుంచి పాకిస్తాన్తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు ఫ్లెమింగ్ అందుబాటులో ఉండడు. ఆ సిరీస్లో సహాయ కోచ్ మార్కస్ ట్రెస్కోతిక్ తాత్కాలిక ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు.స్వదేశంలో కుటుంబంతో కొంత సమయం గడిపిన అనంతరం ఫ్లెమింగ్ ఇంగ్లండ్కు చేరుకుని డిసెంబర్లో జరిగే దక్షిణాఫ్రికా టెస్టు పర్యటనకు జట్టును సిద్ధం చేయనున్నాడు. -
ఇంగ్లండ్ గడ్డపై కుల్దీప్ మెరుపులు
భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్కడి వన్డే కప్లో యార్క్షైర్ కౌంటీ తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.టోర్నీ తొలి మ్యాచ్లో గ్లామోర్గన్పై 10 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇది కుల్దీప్కు వన్డే కౌంటీల్లో అరంగేట్రం మ్యాచ్.అనంతరం రెండో మ్యాచ్లో సస్సెక్స్పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరోసారి రెండు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆతర్వాత వోర్సెస్టర్షైర్పై మూడోసారి రెండు వికెట్ల ప్రదర్శన (2-34) నమోదు చేసి టూ వికెట్స్ హ్యాట్రిక్ సాధించాడు.కుల్దీప్ వరుస సక్సెస్లతో దూసుకుపోవడంతో అతడి జట్టు యార్క్షైర్ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. ఇంగ్లండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన కుల్దీప్ యార్క్షైర్ బౌలింగ్ విభాగానికి కీలక బలంగా మారాడు.2027 వన్డే ప్రపంచకప్కు ఎంపిక దృష్ట్యా ఈ ప్రదర్శనలు కుల్దీప్ ఎంతో సానుకూలత కలగజేస్తాయి. కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు.దీంతో కుల్దీప్ తనను తాను నిరూపించుకునేందుకు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు. కుల్దీప్ టీమిండియాలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అతడికి అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. -
ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్కే బౌలర్కు చుక్కెదురు
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్లో భాగంగా ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్లో కవల సోదరులు క్రెయిగ్ ఓవర్టన్, జేమీ ఓవర్టన్ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్ స్పిరిట్) బౌలింగ్ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్ ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్లో సిక్సర్తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్ను ముగించాడు.అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.బట్లర్ విధ్వంసంమరో మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్ ఫీనిక్స్పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. -
ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటాడు. దేశీ వన్డే కప్ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి.. యార్క్షైర్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా అఫ్గానిస్తాన్తో స్వదేశంలో చివరగా వన్డే సిరీస్లో పాల్గొన్నాడు కుల్దీప్.మేనేజ్మెంట్ తీరుపై విమర్శలుఅయితే, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఈ చైనామన్ స్పిన్నర్కు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డేలోనూ ఆడించకుండా.. కుల్దీప్ను బెంచ్కే పరిమితం చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ముఖ్యంగా లార్డ్స్లో చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తమ పార్ట్ టైమ్ స్పిన్నర్ల సేవల్ని ఉపయోగించుకుని గెలుపొంది.. సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశం పొందలేని కుల్దీప్ యాదవ్.. ఆ వెంటనే కౌంటీ ఫ్రాంఛైజీ యార్క్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ వన్డే కప్-2026లో భాగంగా శుక్రవారం గ్లామోర్గాన్తో యార్క్షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేశాడు.ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు కుల్దీప్. మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మొదటి తొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, తన ఆఖరి ఓవర్లో అలెక్స్ హోర్టాన్, జేమీ మెక్రాయ్ వికెట్లు తీశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 10 ఓవర్లలో 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.యార్క్షైర్ విజయంఇక యార్క్షైర్కు చెందిన మీడియం పేసర్ బెంజమిన్ క్లిఫ్ కేవలం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా గ్లామోర్గాన్ 186 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో యార్క్షైర్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.మరోవైపు.. నార్తాంప్టన్ తరఫున కెంట్ జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్లో నార్తాంప్టన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించుకున్నాడు! -
నో మెయిల్... నో మొబైల్...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని ‘ది ఒడిస్సీ’ సినిమా ఫీవర్ చుట్టేసింది. దేశీయ చిత్రాల కన్నా మిన్నగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు సినీపండితుల అంచనాలను మించిపోతున్నాయి. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ భారతీయ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ టాప్ డైరెక్టర్ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలు...క్రిస్టోఫర్ నోలన్ 1970 జూలై 30న ఇంగ్లాండ్లోని లండన్ లో జన్మించారు. ఏడేళ్ల వయసులో, తన తండ్రితో కలిసి తోటలో లఘు చిత్రాలు తీసేవారు. తన అద్భుతమైన, అత్యంత ఖరీదైన చిత్రాలకు క్రిస్టోఫర్ నోలన్ ప్రసిద్ధి చెందారు, కానీ 55 ఏళ్ల ఈ దర్శకుని వ్యక్తిగత జీవితం మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్...‘ది ఒడిస్సీ’ సినిమాలో భార్యాభర్త, తండ్రీ కొడుకు... వంటి కుటుంబ బంధాలను బలంగా చూపించిన క్రిస్టోఫర్ నిజ జీవితంలోనూ అంతే బలమైన సెంటిమెంట్స్ను అనుసరించడం కనిపిస్తుంది. ఆయన తన కాలేజీ స్వీట్హార్ట్ అయిన ఎమ్మా థామస్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్లో తొలిసారి కలుసుకున్నారు, కలిసి సింకాపీ ఇంక్ అనే నిర్మాణసంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి ఫీచర్ ఫిల్మ్కు ఎమ్మా థామస్ నిర్మాత. నోలన్ సోదరుడు జోనాథన్ సహ–రచయితగా పనిచేస్తుంటాడు. మెమెంటోకు స్ఫూర్తినిచ్చిన లఘు కథతోపాటు, ది ప్రెస్టీజ్, ది డార్క్నైట్, ది డార్క్నైట్ రైజెస్, ఇంటర్స్టెల్లార్ చిత్రాలకు సహ–రచయితగా పనిచేశాడు. అతని నలుగురు పిల్లలు ‘ది ఒడిస్సీ’ నిర్మాణ సమయంలో వివిధ ప్రాక్టికల్ క్రూ విభాగాలలో తెర వెనుక పనిచేశారు. ఆయన కుమార్తె ఫ్లోరా ఇంటర్స్టెల్లార్, ఓపెన్ హైమర్ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయన కుమారుల్లో ఆలివర్ ది ప్రెస్టీజ్ చిత్రంలో, అలాగే రోరీ ది డార్క్ నైట్ రైజెస్లో, మాగ్నస్: ఇన్సెప్షన్ చిత్రంలో నటించారు. నో మొబైల్...టెక్నికల్గా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దర్శకుల్లో ముందు వరుసలో ఉండే క్రిస్టొఫర్ నోలన్ నిజజీవితంలో కనీసం వ్యక్తిగతం గా ఈ మెయిల్ వాడకానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు, స్మార్ట్ఫోన్ కూడా వినియోగించరంటే విశేషమే. ఇలా వ్యక్తిగతంగా డిజిటల్ వినియోగాలకు దూరంగా ఉండే ఆయన దినచర్య, పని అలవాట్లు ఒక విలక్షణమైన, పాతకాలపు జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఆయన తన స్క్రీన్ ప్లేలను ఫొటోకాపీ చేయకుండా ఉండేందుకు, ఒక నల్లనోట్బుక్లో పెన్నుతో రాసుకుంటారు. అంతేకాదు, తన ప్రధాన నటీనటులకు స్క్రిప్ట్లను స్వయంగా చేతితో అందించడానికి ఇష్టపడతారు. అలాగే ఆయన ఎక్కడికి వెళ్లినా ఒక ఫ్లాస్క్నిండా టీ కూడా ఉంటుంది. సింపుల్గా నోలన్ పక్కా ఫ్యామిలీ మ్యాన్!– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోని యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని యార్క్షైర్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.31 ఏళ్ల ఎడమచేతి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఐదు మ్యాచ్లు ఆడనున్నాడు. అనంతరం సెప్టెంబర్లో జరిగే రోతెసే కౌంటీ ఛాంపియన్షిప్ చివరి నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు. కుల్దీప్ శుక్రవారం గ్లామోర్గన్తో జరిగే వన్డే మ్యాచ్ ద్వారా యార్క్షైర్ తరఫున బరిలోకి దిగనున్నాడు.యార్క్షైర్తో ఒప్పందంపై స్పందించిన కుల్దీప్, "యార్క్షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టం. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆడాలనే ఆసక్తి మరింత పెరిగింది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.కాగా, కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున సరైన అవకాశాలు రావడం లేదు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపటి నుంచి జరుగబోయే జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు. దీంతో అతడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు.కుల్దీప్.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అతడి వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. -
బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పోటీ క్రికెట్లోకి ఘనంగా తిరిగొచ్చాడు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన మూడు వారాల తర్వాత వన్డే కప్ (ఇంగ్లండ్) బరిలోకి దిగిన స్టోక్స్.. డర్హమ్ తరఫున అజేయ శతకంతో అదరగొట్టాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత డర్హమ్ తరఫున లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన స్టోక్స్, డెర్బీషైర్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అజేయంగా 108 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.ఇన్నింగ్స్ మొత్తం తీవ్ర కండరాల నొప్పి (క్రాంప్స్)తో ఇబ్బంది పడినప్పటికీ, పోరాట పటిమను ప్రదర్శిస్తూ చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు బౌలింగ్లోనూ స్టోక్స్ తొమ్మిది ఓవర్లు వేసి వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. డెర్బీషైర్ 9 వికెట్లకు 256 పరుగులు చేసింది. మార్టిన్ ఆండర్సన్ (112) అద్భుత శతకం సాధించి జట్టుకు పోటీ స్కోరు అందించాడు.లక్ష్య ఛేదనలో డర్హమ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెన్ ఐచిసన్ రెండు వికెట్లు తీయడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. అయితే స్టోక్స్, విల్ రోడ్స్ (45)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం కొలిన్ అకర్మన్, ఒల్లీ రాబిన్సన్ కూడా విలువైన పరుగులు జోడించారు.అర్ధశతకం తర్వాత క్రాంప్స్తో మైదానంలోనే కుప్పకూలిన స్టోక్స్, నొప్పిని తట్టుకుని మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. చివరకు శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచి డర్హమ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కోచ్గా ఆస్ట్రేలియా దిగ్గజం?
ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి బ్రెండన్ మెకల్లమ్ వైదొలిగన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ వేటను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, దిగ్గజ కోచ్ జస్టిన్ లాంగర్ పేరు దాదాపుగా ఖారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. లాంగర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. తమ హెడ్కోచ్గా లాంగర్ను నియమించాలని ఈసీబీ భావిస్తున్నప్పటికి.. అతడి ఫ్రాంచైజీ ఒప్పందాలు ఇందుకు అడ్డంకిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.లాంగర్ ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్లకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టు బాధ్యతలు స్వీకరిస్తే ఈ కాంట్రాక్టుల నుంచి అతడు తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసీబీతో చర్చలు కొలిక్కి వస్తే లక్నో ఫ్రాంచైజీతో తన బంధాన్ని తెంచుకోవడానికి లాంగర్ సిద్ధంగా ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా తొలుత ఈ రేసులో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ పేరు వినిపించింది. ఫ్లవర్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్గా ఉంటూ 2025, 2026 లలో వరుసగా బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ అందించాడు.గతంలో ఇంగ్లండ్ను కూడా టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా తీర్చిదిద్దాడు. దీంతో అతడిని తిరిగి ప్రధాన కోచ్గా నియమించాలని ఇంగ్లండ్ క్రికెట్ పెద్దలు భావించారు. కానీ ఫ్లవర్ మాత్రం అందుకు సముఖత చూపలేదు. ఫ్రాంచైజీ క్రికెట్లో కోచింగ్తో తను సంతృప్తిగా ఉన్నాని ఈసీబీకి ఫ్లవర్ తెలియజేశాడు. వచ్చే నెలలో పాకిస్తాన్తో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లీష్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. -
స్పెయిన్ నంబర్వన్.. ర్యాంకింగ్స్లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్గా నిలిచిన స్పెయిన్ నంబర్వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
పోరాడి ఓడిన టీమిండియా
-
రోహిత్ రఫ్ఫాడించినా...
లండన్: ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ (110 బంతుల్లో 138; 17 ఫోర్లు, 5 సిక్స్లు) భారీ సెంచరీతో చెలరేగినా... భారత జట్టుకు పరాజయం తప్పలేదు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం లార్డ్స్లో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితంగా ఆతిథ్య ఇంగ్లండ్ 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్నీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. బుమ్రా గైర్హాజరీలో భారత బౌలింగ్ను ఆటాడుకున్న ఇంగ్లండ్ జట్టు... లార్డ్స్ మైదానంలో లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. టీమిండియాపై ఇంగ్లండ్కిదే అత్యధిక స్కోరు. బెన్ డకెట్ (135 బంతుల్లో 141; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాకబ్ బెతెల్ (93 బంతుల్లో 91; 11 ఫోర్లు, 2 సిక్స్లు) శతకం చేజార్చుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ జో రూట్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు) వరుసగా మూడో మ్యాచ్లోనూ అజేయంగా నిలవగా... జోస్ బట్లర్ (13 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) ఆఖర్లో దంచికొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు చేసి ఓడిపోయింది. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో కదంతొక్కగా... కెపె్టన్ శుబ్మన్ గిల్ (84 బంతుల్లో 77; 10 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (60 బంతుల్లో 74; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరంభం అదిరినా... ఈ మ్యాచ్తోనే వన్డే కెరీర్కు వీడ్కోలు పడనుందనే అనుమానాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ శర్మ పూర్తి సాధికారికంగా ఆడాడు. గిల్తో కలిసి నిధానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన రోహిత్ కుదురుకున్నాక మైదానం నలువైపులా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో మొదట గిల్ 53 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... రోహిత్ 50 బంతుల్లోనే ఆ మార్క్ దాటాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట తొలి వికెట్కు 147 పరుగులు జోడించింది. అనంతరం గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా... రోహిత్కు కోహ్లి జతవడంతో ఇన్నింగ్స్ మరోస్థాయికి చేరింది. ఈ మ్యాచ్ రోహిత్, కోహ్లి కలిసి ఆడిన 400వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ప్రపంచ క్రికెట్లో మరే జోడీ కలిసి ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. సచిన్ టెండూల్కర్–రాహుల్ ద్రవిడ్ జంట (391 మ్యాచ్లతో) రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొన్న రోహిత్ 84 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా లార్డ్స్లో వన్డే ఫార్మాట్లో సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్ గడ్డపై రోహిత్కు ఇది 8వ వన్డే సెంచరీ. మరే బ్యాటర్ ఇంగ్లండ్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. సచిన్ టెండూల్కర్, డికాక్, డివిలియర్స్, సయీద్ అన్వర్ ఏడు చొప్పున శతకాలు బాదారు. సెంచరీ తర్వాతా ధాటిగా ఆడిన రోహిత్ ఎట్టకేలకు బెతెల్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. రోహిత్, కోహ్లి రెండో వికెట్కు 86 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు. భారత్ విజయానికి 42 బంతుల్లో 88 పరుగులు అవసరమైన దశలో ఇన్నింగ్స్ 44వ ఓవర్లో ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0)లను అవుట్ చేసిన సామ్ కరన్... తన తదుపరి ఓవర్లో కోహ్లిని అవుట్ చేసి టీమిండియాను విజయానికి దూరం చేశాడు. చివరి 3 ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకోవడమే... ఛేదనలో భారత్కు పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది. చివరి 3 ఓవర్లలో 62 పరుగులు... పవర్ప్లేలో చినుకులా మొదలైన ఇంగ్లండ్ పరుగుల ప్రవాహం... మధ్య ఓవర్లలో వరదలా మారి... ఆఖర్లో ఉప్పెనలా ముంచెత్తింది. ఓపెనర్లు డకెట్, బెతెల్ ఆరంభంలో నిదానంగా ఆడారు. ఫలితంగా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 58 పరుగులు చేసింది. ఆ తర్వాత గేరు మార్చిన ఈ జంట... ఎడాపెడా బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టింది. మోకాలి గాయంతో బుమ్రా ఈ మ్యాచ్కు దూరంకాగా... పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్ను ఇంగ్లండ్ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో బెతెల్ 51 బంతుల్లో, డకెట్ 64 బంతుల్లో హాఫ్సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్కు 192 పరుగులు జోడించాక బెతెల్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రూట్ ఫామ్ కొనసాగించాడు. ఈ సిరీస్లో వరుసగా మూడో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. రూట్ 154 స్ట్రయిక్రేట్తో పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో డకెట్ 108 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. రెండో వికెట్కు 101 పరుగులు జోడించిన తర్వాత లార్డ్స్ మైదానంలో అత్యధిక లిస్ట్ ‘ఎ’వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన డకెట్ అవుటయ్యాడు. కెప్టెన్ బ్రూక్ (14) ఎక్కువసేపు నిలవలేకపోగా ... చివర్లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రూట్, బట్లర్ దూకుడుతో చివరి 3 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 62 పరుగులు పిండుకుంది. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ మృతికి సంతాపంగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి అండ్ బి) ప్రిన్స్ 141; బెతెల్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 91; రూట్ (నాటౌట్) 74; బ్రూక్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ 14; బట్లర్ (నాటౌట్) 41; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 3 వికెట్లకు) 387. వికెట్ల పతనం: 1–192, 2–293, 3–324. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–72–0; ప్రసిధ్ 10–2–69–2; ప్రిన్స్ యాదవ్ 10–0–79–1; గుర్నూర్ 10–0–97–0; అక్షర్ 10–0–61–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) బెతెల్ 138; గిల్ (ఎల్బీ) (బి) ఆదిల్ 77; కోహ్లి (సి) బ్రూక్ (బి) కరన్ 74; ఇషాన్ (సి) (సబ్) రేహాన్ (బి) కరన్ 14; శ్రేయస్ (సి) (సబ్) రేహాన్ (బి) కరన్ 0; కేఎల్ రాహుల్ (బి) ఆర్చర్ 12; అక్షర్ (సి) జాక్స్ (బి) కరన్ 2; గుర్నూర్ (నాటౌట్) 18; అర్ష్ దీప్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 360. వికెట్ల పతనం: 1–147, 2–260, 3–304, 4–304, 5–315, 6–327, 7–329. బౌలింగ్: ఆర్చర్ 10–0–63–1; అట్కిన్సన్ 6–0–24–0; టంగ్ 5–1–43–0; సామ్ కరన్ 10–0–75–4; ఆదిల్ రషీద్ 8–0–64–1; జాక్స్ 4–0–38–0; బెతెల్ 7–0–49–1. -
ప్రాణాన్ని కాపాడిన బుల్లి బ్యాట్మ్యాన్.. నిజంగానే సూపర్ హీరో
హీరోలు పుట్టుకతో రారు. పరిస్థితులకు అనుగుణంగా మంచి హృదయంతో ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయమే వారిని హీరోలుగా నిలబెడుతుంది. ఇంగ్లాండ్లోని మెర్సీసైడ్లోని న్యూ బ్రైటన్లో బ్యాట్మ్యాన్ వేషంలో ఉన్న ఐదేళ్ల బాలుడు అలాంటి హీరో అయ్యాడు.వేగంగా నీటిలో మునిగిపోతున్న ఇసుకదిబ్బపై ఓ వ్యక్తి చిక్కుకుని ఆ ఊబిలో కూరుకుపోతున్నాడు. అదే సమయంలో లూకాస్ అనే 5 ఏళ్ల బాలుడు పాఠశాలలో సూపర్ హీరో పాత్ర పోషించి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతడు వస్తున్న కారు తీరప్రాంత రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఊబిలో కూరుకుపోతున్న వ్యక్తిని చూశాడు. దీంతో లూకాస్ వెంటనే బ్యాట్మ్యాన్లా స్పందించాడు. దూరంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే కారు ఆపి విర్రల్ కోస్ట్గార్డ్కు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆర్ఎన్ఎల్ఐ సిబ్బందికి సమాచారం చేరింది. వారు వచ్చి ఆ వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తిని లూకాస్ చూడకపోయినా, చూసి స్పందించకపోయినా బాధితుడు మృతి చెందేవాడు. బ్యాట్మ్యాన్ వేషంలో ఉన్న లూకాస్ను అందరూ నిజమైన బ్యాట్మ్యాన్ నువ్వే అంటూ ప్రశంసలు కురిపించారు.“అతను తన డ్యాన్స్ స్కూల్ సంగీత ప్రదర్శనలో బ్యాట్మ్యాన్ పాత్ర పోషించాడు. ఇంటికి వస్తున్న సమయంలో కిటికీలోంచి చూసి, ‘అది ఏమిటి?’ అని అడిగాడు” అని లూకాస్ వాళ్ల ఆంటీ డెబ్బీ ముర్రే చెప్పింది. “మేము చూసేసరికి ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించాలంటూ చేతులు ఊపుతున్నాడు. వెంటనే కారు ఆపి, నేను ఫోన్ తీసుకున్నాను. మా పక్కగా కొందరు నడుచుకుంటూ వెళ్లారు. అతను అరుస్తున్నా కూడా అంత దూరంలో ఉండటంతో ఎవరికీ వినిపించి ఉండేది కాదు” అని ఆమె గుర్తు చేసుకుంది.అదృష్టవశాత్తూ అప్పటికే శిక్షణలో ఉన్న లైఫ్బోట్ వెంటనే అక్కడికి చేరుకుంది. చిక్కుకున్న వ్యక్తిని, అతని రెండు కుక్కలను రక్షించింది. డెబ్బీ, సహాయక కార్యకర్తగా పని చేస్తోంది. “అతను చిన్న బొట్టులా కనిపించాడు. అందుకే జూమ్ చేశాను. నా ఫోన్లో జూమ్ చాలా బాగుంది. అయినా అతను చాలా చిన్నగానే కనిపించాడు. అంత దూరంలో ఉన్నాడు. ఇసుక వేర్వేరు ఎత్తుల్లో ఉంటుంది. అతను ఎత్తైన ఇసుకదిబ్బపై చిక్కుకున్నాడు. అదే అత్యంత ఎత్తైన చోటు. అక్కడి నుంచి ముందుకు అడుగు వేస్తే పూర్తిగా నీటిలో మునిగిపోయేవాడు” అని ఆమె చెప్పింది. కోస్ట్గార్డ్ సిబ్బంది సరైన సమయంలో అక్కడికి చేరుకున్నారని ఆమె తెలిపింది.ఈ అంతా జరుగుతున్న సమయంలో లూకాస్ కారులోనే బ్యాట్మ్యాన్ దుస్తుల్లో కూర్చున్నాడు. “నువ్వు ఆ వ్యక్తి ప్రాణం కాపాడటంలో సాయం చేశావు” అని అతని అత్త చెప్పింది. వెంటనే ఆ చిన్నారి, “బ్యాట్మ్యాన్లాగే!” అని సమాధానం ఇచ్చాడు. ఆ ‘బ్యాట్మ్యాన్’కు న్యూ బ్రైటన్ లైఫ్బోట్ కేంద్రాన్ని సందర్శించే ఆహ్వానం వచ్చింది. 4, 5 ఏళ్ల చిన్నారుల స్కౌట్స్ విభాగమైన స్క్విరెల్స్ సభ్యుడైన లూకాస్.. తన పనికి గుర్తింపుగా 999 బ్యాడ్జ్ వస్తుందని ఆశిస్తున్నాడు. 999 బ్యాడ్జ్ అంటే అత్యవసర పరిస్థితిలో సరైన విధంగా స్పందించిన చిన్నారులకు ఇచ్చే గుర్తింపు చిహ్నం. -
ఫుట్బాల్ ప్రపంచాన్ని షేక్ చేసిన 10 గోల్స్ మ్యాచ్c
-
ఫిఫా ప్రపంచకప్.. మూడో స్ధానం ఇంగ్లండ్దే
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మయామి వేదికగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఈ 'బ్రాంజ్ ఫైనల్' పోరు ఫస్ట్ హాఫ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాలకే కెప్టెన్ డెక్లాన్ రైస్ ఒక అద్భుతమైన లాంగ్-రేంజ్ గోల్తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా గోల్గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అనంతరం బుకాయో సాకా వరుసగా రెండు గోల్స్ను సాధించి ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్ను 4-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. తొలి ఆర్ధ భాగంలో ఫ్రాన్స్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో ఇంగ్లండ్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు.కానీ సెకెండ్ హాఫ్లో మాత్రం ఫ్రాన్స్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. కెప్టెన్ ఎంబాపే 48వ నిమిషంలో ఫ్రాన్స్కు తొలి గోల్ను అందించాడు. వెంటనే 54వ నిమిషంలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. ఆ తర్వాత 66వ నిమిషంలో ఎంబాపే మరో గోల్ కొట్టడంతో స్కోరు 4-3కి చేరింది. దీంతో ఇంగ్లండ్ డౌగౌట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావారణం నెలకొంది. అయితే ఫ్రాన్స్ జట్టు మ్యాచ్ను సమం చేసేలా కనిపించిన సమయంలో, ఇంగ్లండ్ స్టార్ బుకాయో సాకా మరోసారి సత్తాచాటాడు. 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్గా మలిచి తన హాట్రిక్ను పూర్తి చేసుకున్నాడు. ఈ గోల్తో ఇంగ్లండ్ 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఫ్రాన్స్ మళ్లీ గోల్ సాధించి పోటీలో నిలిచింది. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్హామ్ మరో గోల్ కొట్టి తన జట్టు విజయాన్ని 6-4తో ఖరారు చేశాడు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 1966 తర్వాత ఫిఫా ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఓ మెడల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. -
రోహిత్పైనే అందరి దృష్టి
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది. రో‘హిట్’ కొట్టేనా! గత రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్గా నిలచిన రూట్... భారత్పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్ను ఆపడం కష్టతరమే! బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. పిచ్ ఎలా ఉందంటే... లార్డ్స్లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్లో భారత్ గెలిచింది. ఓవరాల్గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్కు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్. -
మూడో స్థానం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ మధ్య పోరు
ఫిఫా ప్రపంచకప్-2026లో ఫైనల్కు చేరాలన్న కల నెరవేరకపోయినా, టోర్నీని విజయంతో ముగించాలని ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. శనివారం జరిగే మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్లో ఈ రెండు యూరోపియన్ దిగ్గజాలు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ అర్దరాత్రి (జులై 19) 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్, అర్జెంటీనా చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ (మూడో స్థానం) ఆడాల్సి రావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్లు స్పష్టం చేశారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోలేదు"ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటే మాట్లాడుతూ, "మేమంతా ఫైనల్లో ఆడాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు ఇలా మారాయి. ఇప్పుడు మూడో స్థానం కోసం అయినా గెలిచి టోర్నీని ముగించాలని చూస్తున్నాం" అని తెలిపాడు.తుచెల్పై విమర్శలు.. జట్టులో మార్పులుఅర్జెంటీనాతో సెమీఫైనల్లో వ్యూహాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ కోచ్ థామస్ తుచెల్, ఈ మ్యాచ్లో జట్టులో మార్పులు చేస్తామని వెల్లడించారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇది ప్రపంచకప్ అధికారిక మ్యాచ్. గత 60 ఏళ్లలో ఇంగ్లండ్కు ఇదే అత్యుత్తమ ప్రపంచకప్ ఫలితం సాధించే అవకాశం. ఆటగాళ్ల పోరాట పటిమను మరోసారి చూపించాల్సిన సమయం ఇది" అని తుచెల్ అన్నారు.సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో ఆధిక్యాన్ని కోల్పోవడంపై బాధ్యత తనదేనని కూడా ఆయన అంగీకరించారు.గోల్డెన్ బూట్ రేసులో ఎంబపేఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబపే ఈ మ్యాచ్లో మరో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన అతడు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీతో సమానంగా ఉన్నాడు. అయితే నాలుగు అసిస్టులతో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్హామ్ తలో ఆరు గోల్స్తో పోటీలో ఉన్నారు.ఇదిలా ఉంటే, అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఇంగ్లండ్కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్ కోచ్
ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ నియామక ప్రక్రియకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పదవికి ప్రధాన పోటీదారుగా భావించిన ఆండీ ఫ్లవర్ తాను ఆ రేసులో లేనని స్పష్టం చేశారు. దీంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కొత్త కోచ్ కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.బ్రెండన్ మెకల్లమ్ టెస్టు జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త రెడ్బాల్ కోచ్ కోసం ECB అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో మాజీ ఇంగ్లండ్ కోచ్ అయిన ఆండీ ఫ్లవర్తో మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పలుమార్లు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ ఊహాగానాలకు ఫ్లవర్ స్వయంగా తెరదించారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బాధ్యతలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, ఇంగ్లండ్ టెస్టు కోచ్ పదవి కోసం ఆర్సీబీని వీడే ఆలోచన లేదని వెల్లడించారు."ఈ అంశంపై ECBతో, రాబ్ కీతో మాట్లాడాను. ఇంగ్లండ్ కోచ్గా పనిచేయడం ఎవరికైనా గౌరవమే. నేను గతంలో ఆ బాధ్యతలు నిర్వర్తించి అద్భుతమైన అనుభవాన్ని పొందాను. కానీ ప్రస్తుతం నేను చేస్తున్న పనితో చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే అదే కొనసాగిస్తాను" అని ఫ్లవర్ తెలిపారు.ఈ నిర్ణయంతో ఫ్లవర్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హెడ్ కోచ్గా కొనసాగనున్నారు. అలాగే ఇంగ్లండ్లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు కూడా కోచ్గా సేవలు అందిస్తారు.ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్ పదవి కోసం జస్టిన్ లాంగర్, జోనాథన్ ట్రాట్, రిచర్డ్ డాసన్, కుమార సంగక్కర, స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హెసన్, టామ్ మూడీ, ఎడ్రియన్ బిరెల్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం ఇంగ్లండ్, పాకిస్థాన్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ ప్రారంభానికి ముందే కొత్త టెస్టు హెడ్ కోచ్ను నియమించాలని ECB భావిస్తోంది. -
సెంచరీ కన్నా... గెలుపే ముఖ్యం
కార్డిఫ్: వ్యక్తిగత మైలురాళ్ల కన్నా... జట్టు విజయమే ముఖ్యమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు. భారత్తో గురువారం జరిగిన రెండో వన్డేలో రూట్ 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. కావాల్సినన్ని బంతులు అందుబాటులో ఉన్నా సెంచరీ పూర్తి చేసుకోవాలని చూడకుండా... సహచరుడికి మ్యాచ్ ముగించమని సూచించి తన విలువ చాటుకున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా... రూట్ అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందింది. భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ కాగా... ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రూట్ మాట్లాడుతూ... ‘జట్టు విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం వ్యక్తిగత మైలురాళ్లు దాటినప్పుడు రాదు. భారత్ ఫీల్డింగ్ను దృష్టిలో పెట్టుకొని... అవకాశం వస్తే విన్నింగ్ రన్స్ చేయమని అట్కిన్సన్కు చెప్పా. 99 పరుగుల వద్ద అజేయంగా ఉంటాను అనే భావన కూడా నా మనసులో రాలేదు. ఆఖరి మ్యాచ్లోనూ ఇదే జోరు కనబరుస్తూ సిరీస్ సాధించాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. వన్డేల్లో 99 నాటౌట్గా నిలిచిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్ రూట్ కాగా... ఓవరాల్గా 17వ బ్యాటర్. ఇంగ్లండ్ విజయానికి 42 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో... 98 పరుగుల వద్ద ఉన్న రూట్ సింగిల్ తీసి సహచరుడికి బ్యాటింగ్ ఇవ్వడం గమనార్హం. వన్డే ఫార్మాట్లో తమ జట్టు మరింత పట్టుదలగా ఆడాల్సిన అవసరముందని రూట్ అన్నాడు. యువ ఆటగాళ్లు వీలైనంత త్వరగా ఫార్మాట్కు అనుగుణంగా ఆటను మార్చుకోవాలని సూచించాడు. ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రూట్... ఒంటి చేత్తో ఒడ్డున పడేశాడు. వన్డే కెరీర్లో ఇప్పటి వరకు 191 మ్యాచ్లాడిన రూట్ 50.66 సగటుతో 7752 పరుగులు చేశాడు. అందులో 20 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
ఇంగ్లండ్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటన
ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో డెన్లీ ప్రొఫెషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2026 కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్ ముగిసిన తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తీసుకోనున్నట్లు ప్రకటించాడు.2009లో ఐర్లాండ్పై వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డెన్లీ, ఇంగ్లండ్ తరఫున 15 టెస్టులు, 16 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది.కెంట్తో చిరస్మరణీయ అనుబంధండెన్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగనప్పటికీ.. దేశవాలీ క్రికెట్లో మాత్రం సుదీర్ఘ ప్రయాణం చేశాడు. మిడిల్సెక్స్ తరఫున మూడేళ్లు ఆడిన అతడు.. తన దేశవాళీ కెరీర్లో ఎక్కువ భాగం కెంట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 250కి పైగా ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 14 వేలకుపైగా పరుగులు చేశాడు. టీ20ల్లో 300కుపైగా మ్యాచ్లు ఆడి 7 వేలకుపైగా పరుగులు సాధించాడు.అరుదైన రికార్డు, టైటిల్ విజయం2018లో సర్రేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో డెన్లీ సెంచరీ చేయడంతో పాటు హ్యాట్రిక్ కూడా సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అనంతరం 2022లో కెంట్ కెప్టెన్గా వన్డే కప్ టైటిల్ (1974 తర్వాత) అందించాడు.డెన్లీ ఇంగ్లండ్ జాతీయ, దేశవాలీ క్రికెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), బిగ్ బాష్ లీగ్ (BBL), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) వంటి పలు ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్ల్లో తన సేవలు అందించాడు. -
అర్జెంటీనా ఫ్యాన్స్ దుశ్చర్య.. ఇంగ్లండ్కు అవమానం!
ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు. ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఫిఫా సెమీస్లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV— The Resonance (@Partisan_12) July 16, 2026చదవండి: ‘రోహిత్ రిటైర్మెంట్పై కోహ్లి రియాక్షన్ వైరల్!’ -
సాహో అర్జెంటీనా
జగజ్జేత జట్టు ఆట ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు మరోసారి ప్రపంచానికి చూపించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరడం... ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడటం... ప్రత్యర్థి జట్ల ఆశలను చివరి క్షణాల్లో గల్లంతు చేయడం... ఏ లక్ష్యంతోనైతే అడుగు పెట్టామో దానిని ఎలా సాధించాలో ... తమను చూసి నేర్చుకోవాలని అర్జెంటీనా చాటి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్కు మూడోసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్ పీడకలగా మారిపోయింది. ఆధిక్యంలో ఉన్నామన్న ధీమాతో... మేటి జట్లను తక్కువ అంచనా వేస్తే చివరకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లండ్కు మరోసారి అనుభవమైంది. అట్లాంటా: వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందేందుకు అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ముగిసిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. అర్జెంటీనా తరఫున ఎంజో ఫెర్నాండెజ్ (85వ నిమిషంలో), సబ్స్టిట్యూట్ లాటారో మార్టినెజ్ (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆంథోనీ గోర్డాన్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. కెప్టెన్ మెస్సీ అందించిన పాస్లతోనే అర్జెంటీనా రెండు గోల్స్ నమోదు చేయడం విశేషం. 85వ నిమిషం వరకు 0–1తో వెనుకబడిన అర్జెంటీనా ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి మరో అద్భుతం నమోదు చేసింది. ఈజిప్ట్ తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–2తో వెనుకబడ్డాక 13 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా మూడు గోల్స్ కొట్టి అనూహ్య విజయం అందుకున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి న్యూజెర్సీ వేదికగా జరిగే ఫైనల్లో ప్రస్తుత యూరోపియన్ చాంపియన్, 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్ జట్టును అర్జెంటీనా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో అర్జెంటీనా విజయం సాధిస్తే... ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. ప్రపంచకప్లో ఏడోసారి ఫైనల్కు చేరుకున్న అర్జెంటీనా మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా, మూడుసార్లు (1930, 1990, 2014) రన్నరప్గా నిలిచింది. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన అర్జెంటీనా కీలక సమరంలోనూ సత్తా చాటింది. 55వ నిమిషంలో ఇంగ్లండ్కు గోల్ సమర్పించుకున్న అర్జెంటీనా ఆ తర్వాత అసలు సిసలు ఆటతీరును కనబరిచింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అవకాశం దొరికినపుడల్లా ఇంగ్లండ్ గోల్పోస్ట్ దిశగా దూసుకెళ్లాడు. 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఇంగ్లండ్ మరీ రక్షణాత్మకంగా ఆడింది. ఎలాగైనా అర్జెంటీనాను గోల్ చేయనీకుండా నిలువరించాలన్న ధ్యేయంతో కనిపించింది. గోల్కీపర్తో కలిపి రక్షణశ్రేణిలో తొమ్మిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కనిపించారు. మరోవైపు స్కోరును సమం చేయాలన్న కసితో అర్జెంటీనా దాడుల్లో పదును పెంచింది. రెండుసార్లు దాదాపు గోల్ అయినట్లే కనిపించింది. ఇంగ్లండ్ గోల్కీపర్ పిక్ఫర్డ్ అప్రమత్తతతో రెండుసార్లు గోల్ కాకుండా నిలువరించాడు. 69వ నిమిషంలో నికో గొంజాలెజ్ షాట్ను... 76వ నిమిషంలో మాక్ అలిస్టర్ షాట్ను పిక్ఫర్డ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత అలిస్టిర్ కొట్టిన షాట్ ఒకటి ఇంగ్లండ్ గోల్పోస్ట్కు తగిలి వెనక్కి వచ్చింది. ఓవరాల్గా 55 నిమిషం నుంచి 85వ నిమిషం వరకు బంతి అర్జెంటీనా ఆధీనంలో 88 శాతం, ఇంగ్లండ్ ఆ«దీనంలో 12 శాతం ఉండటం గమనార్హం. ఎట్టకేలకు 85వ నిమిషంలో అర్జెంటీనా స్కోరు సమం చేయడంలో సఫలమైంది. మెస్సీ అందించిన పాస్ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న ఎంజో ఫెర్నాండెజ్ కళ్లు చెదిరే కిక్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. ఆ తర్వాత 90+2 నిమిషంలో మెస్సీ అందించిన క్రాస్ పాస్ను ‘డి’ ఏరియా లోపల ఇద్దరు ఇంగ్లండ్ డిఫెండర్లకంటే ఎత్తుకు ఎగిరిన మార్టినెజ్ హెడర్ షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. స్టాపేజ్ సమయంలోని మిగిలిన సమయంలో ఇంగ్లండ్ను కట్టడి చేసి అర్జెంటీనా ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఇంగ్లండ్ కేవలం ఐదుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. ఈ టోర్నీలో ఆరు గోల్స్ చొప్పున కొట్టి నిలకడగా రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్హమ్ కీలకమైన సెమీస్లో ఆకట్టుకోలేకపోయారు. 1966లో చివరిసారి ఫైనల్ చేరి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మూడుసార్లు (1990, 2018, 2026) సెమీఫైనల్లో ఓడిపోయింది. 19 ప్రస్తుత ప్రపంచకప్లో అర్జెంటీనా చేసిన గోల్స్. ఒకే ప్రపంచకప్లో అర్జెంటీనా సాధించిన అత్యధిక గోల్స్ ఇవే కావడం విశేషం. 1930 లో అర్జెంటీనా 18 గోల్స్ నమోదు చేసింది.6 ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా ఆడిన ఆరు సెమీఫైనల్స్లోనూ (1930, 1986, 1990, 2014, 2022, 2026) నెగ్గింది. అర్జెంటీనా తొలిసారి విజేతగా నిలిచిన 1978 ప్రపంచకప్ లో సెమీస్ జరగలేదు. 8 జట్లను 2 గ్రూప్లుగా విభ జించారు. గ్రూప్ విన్నర్స్గా అర్జెంటీనా, నెదర్లాండ్స్ ఫైనల్లో ఆడాయి. -
స్కోరు 82/8.... తొమ్మిదో స్థానంలో వచ్చి.. ప్రపంచ రికార్డు!
ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్-2026 లీగ్లో సోమర్సెట్ స్టార్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మరీ అతడు విధ్వంసం సృష్టించడం విశేషం. 161 పరుగులులీడ్స్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో యార్క్షైర్తో సోమర్సెట్ తలపడింది. టాస్ గెలిచిన యార్క్షైర్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. యార్క్షైర్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడం లిత్ అర్ధ శతకం (64) సాధించగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగులు చేయలేకపోయారు.సోమర్సెట్ బౌలర్లలో జేక్ బాల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. డానియెల్ సామ్స్, క్రెయిగ్ ఓవర్టన్, రిలే మెరెడిత్ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్కు యార్క్షైర్ బౌలర్లు చుక్కలు చూపించారు.టాప్, మిడిల్ ఆర్డర్ కుదేలుఓపెనర్లలో విల్ స్మీడ్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. థామస్ రూ ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరి వికెట్లను జార్జ్ హిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ టామ్ బాంటన్ (1).. మిడిలార్డర్లో జేమ్స్ రూ (1), టామ్ కోలెర్కాడ్మోర్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు.మిగిలిన వారిలో లోయర్ ఆర్డర్లో లైయీస్ గోల్డ్స్వర్తి 19, కెప్టెన్ లూయీస్ గ్రెగరీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. డేనియల్ సామ్స్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో కేవలం 82 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన సోమర్సెట్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది.From the most unlikely of positions, Craig Overton has pulled off something SPECTACULAR and sent Somerset to Finals Day 😱 pic.twitter.com/EcYh6pgQT5— Vitality T20 Blast (@VitalityBlast) July 15, 2026కేవలం 30 బంతుల్లోనేఇలాంటి తరుణంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. కేవలం 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు రాబట్టాడు. అతడితో పాటు రిలే మెరెడిత్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా మరో బంతి మిగిలి ఉండగానే సోమర్సెట్ లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 162 పరుగులు సాధించింది. తద్వారా రెండు వికెట్ల తేడాతో యార్క్షైర్ను ఓడించి.. సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శనివారం జరిగే తొలి సెమీస్ మ్యాచ్లో నార్తాంప్టన్షైర్తో సోమర్సెట్ అమీతుమీ తేల్చుకుంటుంది.క్రెయిగ్ ఓవర్టన్ ప్రపంచ రికార్డుటీ20 క్రికెట్ చరిత్రలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా క్రెయిగ్ ఓవర్టన్ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు జమ్మూ కశ్మీర్కు చెందిన సయ్యద్ సాగర్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2013లో భాగంగా హర్యానాతో మ్యాచ్లో సాగర్ తొమ్మిదో స్థానంలో వచ్చి 36 బంతుల్లో 74 పరుగులు చేశాడు. కాగా క్రెయిగ్ ఓవర్టన్ మరెవరో కాదు ఇంగ్లండ్ స్టార్ జేమీ ఓవర్టన్కు స్వయానా సోదరుడు.చదవండి: విధ్వంసకర శతకాలు.. ప్రపంచ రికార్డు బద్దలు -
ఫిఫా వరల్డ్కప్.. అర్జెంటీనాకు భారీ షాక్!
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్కు దూసుకువెళ్లింది. అట్లాంటా వేదికగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇక సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.చిరకాల ప్రత్యర్థులుఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది. కాగా క్రికెట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ల మాదిరే ఫుట్బాల్లో అర్జెంటీనా- ఇంగ్లండ్ మ్యాచ్లకూ అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇందుకు ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాలు.. తదనుగుణంగా చెలరేగే భావోద్వేగాలు కారణం అని చెప్పవచ్చు.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.24 ఏళ్ల తర్వాత తొలిసారిఅయితే, ఫాక్లాండ్ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా- ఇంగ్లండ్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం వచ్చింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గట్లు రాణించింది. అర్జెంటీనా తరఫున 85వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండెజ్, అదనపు సమయం (90+2వ నిమిషం)లో మార్టినేజ్ చెరో గోల్ గొట్టారు.ఇక వీరిద్దరు గోల్స్ సాధించడంలో కెప్టెన్ మెస్సీ సహకారం అందించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ తరఫున ఆంటోనీ గార్డన్ 55వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.షాక్ తప్పదా?ఈ నేపథ్యంలో ఓవైపు టైటిల్ సమరానికి మరోసారి అర్హత సాధించడం.. మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను ఓడించిన సంబరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫాక్లాండ్ దీవులు తమవే అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించారు.Argentina Team with The Falkland Islands Banner 😂😂😂! pic.twitter.com/NlSUZXXlsS— The Final Whistle (@Rufus_45) July 16, 2026అయితే, అర్జెంటీనా ఆటగాళ్లపై అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ.. ముందుగా బ్యానర్ ప్రదర్శించిన ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.నిబంధనలు ఏం చెబుతున్నాయి?IFAB నిబంధనల ప్రకారం.. మైదానంలో పరికరాల ద్వారానైనా సరే ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన విషయాలకు సంబంధించి.. అదే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం, ఫొటోలు ప్రదర్శించడం నిషిద్ధం.ఆటగాళ్ల లోదుస్తులపై సైతం కేవలం తయారీ లోగో మాత్రమే ఉండాలి. అది కాకుండా తమ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఆటగాళ్లు ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే సదరు ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధిస్తారు. జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ లేదంటే ఫిఫా ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ మద్దతుఅర్జెంటీనా ఉపాధ్యక్షురాలు విక్టోరియా విలారుయెల్ మాత్రం తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ‘‘ఫాక్లాండ్స్ ఎప్పటికీ అర్జెంటీనావే! వాళ్లు స్టేడియంలోకి బ్యానర్ తీసుకురాకుండా నిషేధం విధించారు. కానీ ఈ భావం మా నరనరాల్లో, హృదయాల్లో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ రికార్డు బద్దలు¡Las Malvinas son Argentinas! 🇦🇷 Prohibieron llevarlas a la cancha y se olvidaron que las llevamos en la sangre y el corazón. pic.twitter.com/qB455HeqVX— Victoria Villarruel (@VickyVillarruel) July 15, 2026 -
సిరీస్ లక్ష్యంగా...
కార్డిఫ్: ఇంగ్లండ్ చేతిలో టి20ల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో భారత్ వన్డే సిరీస్ విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్ల పోరులో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన తొడ కండరాల గాయంతో గత మ్యాచ్లో అర్ధాంతరంగా తప్పుకున్న గిల్ కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది మ్యాచ్కు ముందే తేలనుంది. అక్షర్, సుందర్ బ్యాటింగ్లోనూ తాము ఎంతో కీలకమో చూపించారు. ఇదే జోరును కొనసాగిస్తే మరో విజయం సాధించడం కష్టం కాకపోవచ్చు.మరోవైపు ఇంగ్లండ్ బ్యాటింగ్లో తడబాటు కనిపించింది. జో రూట్, డాసన్ ఆదుకోకపోయి ఉంటే గత మ్యాచ్లో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉండేది. బెతెల్, బట్లర్, జాక్స్ వన్డేకు అనుగుణంగా తమ ఆటను మార్చుకోలేపోయారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా పూర్తి స్థాయిలో సత్తా చాటితేనే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో ఉంటుంది. ఆర్చర్ బౌలింగ్లో పదును కనిపించినా... ఇతర బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. వన్డేల్లో భారత్ చేతిలో వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిన ఇంగ్లండ్... సొంత గడ్డపైనైనా సిరీస్ను కోల్పోరాదని పట్టుదలగా ఉంది. -
ఫిఫా వరల్డ్కప్.. ఫైనల్కు చేరిన అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్కు దూసుకెళ్లింది. అట్లాంటా వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 2-1 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా.. స్పెయిన్తో తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మెస్సీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బంతిని గోల్ పోస్ట్లోకి పంపలేకపోయాడు. ఇంగ్లండ్ కూడా ప్రథమార్ధంలో గోల్ సాధించలేకపోయింది.దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు తమ ఖాతాను తెరవలేదు. అయితే సెకెండ్ హాఫ్లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. యువ సంచలనం ఆంథోనీ గోర్డాన్ 58 నిమిషంలో ఒక సూపర్ గోల్తో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం దగ్గరపడుతున్నప్పటికి అర్జెంటీనా ఇంకా గోల్ సాధించకపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్కు ఓటమి తప్పదని అంతా భావించారు.అర్జెంటీనా అదరహోఈ సమయంలో అర్జెంటీనా అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. 85వ నిమిషంలో మిడ్ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి-బాక్స్ లాంగ్-రేంజ్ షాట్తో బంతిని గోల్ పోస్ట్లోకి పంపాడు. ఈ గోల్తో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం అదనపు సమయం(90+2)లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ చేశాడు.మైదానం మధ్యలో నుంచి ఇంగ్లండ్ డిఫెన్స్ను తప్పించుకుంటూ మెస్సీ అందించిన ఒక అద్భుతమైన క్రాస్ పాస్ను.. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ గోల్గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి నిమిషాల్లో ఇంగ్లండ్ మరో గోల్ సాధించకపోవడంతో మెస్సీ సేన వరుసగా రెండో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్కు క్వాలిఫై అయింది. ఆదివారం(జూలై 20) జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. -
ఓం భీమ్ బుష్.. 'కబాలాస్'ను నమ్ముకున్న అర్జెంటీనా ఫ్యాన్స్
ఫుట్బాల్ అంటే కేవలం ఆట కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ, వ్యూహాలు, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. కొంతమంది అభిమానుల నమ్మకాల్లో అదృష్టం కూడా అంతే కీలకం. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్-2026 సెమీఫైనల్ ముందు అర్జెంటీనా అభిమానులు తమ జట్టు విజయం కోసం ఆసక్తికరమైన ‘కబాలాస్’ను ఆశ్రయిస్తున్నారు.ఇంగ్లండ్తో కీలక పోరుకు ముందు.. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్హామ్ పేర్లను కాగితాలపై రాసి ఫ్రీజర్లో పెట్టడం అర్జెంటీనాలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి ఆటగాళ్లు చల్లబడిపోవాలని, మైదానంలో తమ ప్రభావం చూపలేకపోవాలని ఇలా చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. కొందరు అభిమానులు ఏఐ సాయంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను మంచులో బంధించినట్లుగా చిత్రాలు రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అసలు ‘కబాలాస్’ అంటే ఏమిటి?అర్జెంటీనా ఫుట్బాల్ సంస్కృతిలో ‘కబాలాస్ (Cábalas)’ అనేది చాలా కాలంగా కొనసాగుతున్న నమ్మకం. జట్టు గెలవాలంటే ఒకే టీ-షర్ట్ ధరించడం, మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం, ఒకే ఆహారం తినడం వంటి అలవాట్లను అభిమానులు అదృష్ట సూచికలుగా భావిస్తారు. కొంతమంది అభిమానుల నమ్మకం ప్రకారం.. ఒకసారి చేసిన పని జట్టుకు విజయం తెచ్చిపెడితే, తదుపరి మ్యాచ్ల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే అదృష్టం కలిసి వస్తుందట. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. అర్జెంటీనా ఫుట్బాల్లో ఈ సంప్రదాయం భావోద్వేగంగా కొనసాగుతోంది.Photo Credit: FIFA Twitterకేన్, బెల్లింగ్హామ్లకు ‘ఫ్రీజర్ ట్రీట్మెంట్’ఇంగ్లండ్తో సెమీఫైనల్ పోరు కావడంతో ఈసారి అర్జెంటీనా అభిమానుల కబాలాస్ మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లను "ఐస్లో పెట్టడం" ద్వారా వారి ఆటను నిలువరించవచ్చని కొందరు నమ్ముతున్నారు. హ్యారీ కేన్ ఇంగ్లండ్ ప్రధాన గోల్ ఆయుధం కాగా.. జూడ్ బెల్లింగ్హామ్ మిడ్ఫీల్డ్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే వీరిద్దరినీ టార్గెట్గా చేసుకుని అభిమానులు ఈ ప్రతీకాత్మక చర్యలకు దిగారు.కోచ్లకూ ఉన్న నమ్మకాలుఅర్జెంటీనా ఫుట్బాల్లో ఇలాంటి నమ్మకాలు అభిమానులకే పరిమితం కాదు. మాజీ కోచ్ Carlos Bilardo కూడా ప్రత్యేక అలవాట్లు, నమ్మకాలతో ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత కోచ్ Lionel Scaloni కూడా కొన్ని వ్యక్తిగత అలవాట్లను పాటిస్తారని చెబుతారు. మైదానంలోకి అడుగుపెట్టే విధానం, మ్యాచ్కు ముందు చేసే కొన్ని ఆచారాలు ఆయనకు అదృష్టాన్ని తెస్తాయని అభిమానులు భావిస్తుంటారు.అర్జెంటీనా-ఇంగ్లండ్.. ఆ మాత్రం ఉంటదిఅర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్ అంటే కేవలం ఫుట్బాల్ పోటీ కాదు.. దానికి చరిత్ర, భావోద్వేగాలు కూడా జతకట్టాయి. 1986 ప్రపంచకప్లో Diego Maradona చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఈ రెండు దేశాల మధ్య పోటీ మరింత ప్రత్యేకంగా మారింది. ప్రపంచకప్ వేదికపై ఈ రెండు జట్లు ఎదురుపడితే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈసారి కూడా సెమీఫైనల్కు ముందు అర్జెంటీనా అభిమానులు తమ కబాలాస్పై నమ్మకం పెట్టుకున్నారు.మైదానంలో విజయం మాత్రం ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. ఫుట్బాల్లో అభిమానుల విశ్వాసాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్జెంటీనా ఫ్యాన్స్ ‘ఫ్రీజర్ కబాలా’ మరోసారి చూపించింది.Concuerdo, las cábalas NO se comparten.En lo personal, yo soy bien supersticioso en el deporte y tengo un buen.¿Ustedes tienen? https://t.co/DLQ6MvhLBt— Iván Jacob (@ivanjacobvg) July 15, 2026 -
‘టెస్టులో అన్నీ బాగా కుదిరాయి’
లండన్: టి20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్పై ఏకైక టెస్టులో ఘన విజయంతో సత్తా చాటింది. హర్మన్ప్రీత్ బృందానికి ఈ గెలుపు ఊరటనిచ్చింది. ఈ టెస్టులో మన జట్టుకు అన్ని అంశాలు కలిసొచ్చాయని జట్టు చీఫ్ కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. దూకుడు, ఓపిక కలగలిసిన ప్రదర్శనతో ఫలితం రాబట్టామని అతను అన్నాడు. ‘అందరూ చెబుతున్నట్లుగా ఈ టెస్టు మ్యాచ్లో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ఏదో ఒక్క అంశం గురించే ప్రత్యేకంగా చెప్పడం లేదు. ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెడుతూ అన్ని విధాలా క్రమశిక్షణను ప్రదర్శించాం. బ్యాటింగ్, బౌలింగ్ బాగా చేయడమే కాదు ఫీల్డింగ్లో కూడా ఎంతో మెరుగయ్యాం. మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడం సానుకూల ఫలితం ఇచ్చింది. దూకుడుతో పాటు కాస్త ఓపికను కూడా చూపించాం. ఇవే విజయానికి కారణంగా నిలిచాయి. మాకు మొత్తంగా చాలా మంచి మ్యాచ్గా మిగిలిపోయింది’ అని మజుందార్ విశ్లేషించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తిక భాటియా, క్రాంతి గౌడ్లపై కోచ్ ప్రశంసలు కురిపించాడు. క్రాంతి తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ను కుప్పకూల్చగా, యస్తిక సెంచరీతో చెలరేగింది. ‘యస్తిక ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకమైంది. అదీ లార్డ్స్ మైదానంలో రావడం దానిని చిరస్మరణీయంగా మార్చింది. గత రెండేళ్లుగా గాయాలతో బాధపడిన యస్తిక వాటి నుంచి కోలుకొని, ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఇప్పుడు ఇలాంటి బ్యాటింగ్ చేయడం నిజంగా అభినందించదగ్గ అంశం. ముఖ్యంగా ఆమె ఆడిన చక్కటి షాట్లు చూసేవారికి కనువిందు చేశాయి. క్రాంతి బంతిపై నియంత్రణ చూపిన తీరు అద్భుతం. సరైన చోట ఆమె తాను అనుకున్నట్లుగా బంతులు వేయగలిగింది. గుడ్ లెంగ్త్లో బౌలింగ్తో వికెట్లు రాబట్టింది’ అని మజుందార్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ విషయంలో భారత జట్టు మొదటినుంచీ పటిష్టంగానే ఉందన్న కోచ్...యస్తిక కీపింగ్ ప్రదర్శనను కూడా కొనియాడాడు. -
బట్లర్ డబుల్ సెంచరీ.. కేవలం రెండో ప్లేయర్
భారత్తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆట పరంగా అతడు ఈ మ్యాచ్లో నిరాశపరిచినా (14 బంతుల్లో 5 పరుగులు), తన దేశం తరఫున అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ జోస్కు వన్డేల్లో 200వది. ఇతనికి ముందు కేవలం ఇయాన్ మోర్గాన్ (225) మాత్రమే ఇంగ్లండ్ తరఫున 200 వన్డేల మార్కును తాకాడు.చివరిగా భారత్తోనే జరిగిన టీ20లో మెరుపు శతకం బాదిన జోస్, ఆ ఫామ్ను తొలి వన్డేలో ప్రదర్శించలేకపోయాడు. వన్డేల్లో ఇతనికిది వరుసగా ఏడో వైఫల్యం (కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం).బట్లర్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. 2012లో పాకిస్థాన్పై అరంగేట్రం చేసి తొలి మ్యాచ్లోనే డకౌటయ్యాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ అత్యుత్తమ పరిమిత ఓవర్ల బ్యాటర్లలో ఒకరిగా ఎదిగాడు.ఇప్పటివరకు 172 ఇన్నింగ్స్ల్లో 38.87 సగటున 5520 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. పరుగుల పరంగా జో రూట్, ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా కొనసాగుతున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్–డాసన్ పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది.పేసర్లకు అనుకూలించిన పిచ్పై 107 పరుగులకే 6 వికెట్లు పోయిన ఆ జట్టును జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు జీవం పోశారు.ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2, బుమ్రా, దూబే తలో వికెట్ తీశారు. -
రూట్, డాసన్ అద్భుత పోరాటం.. ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.పేసర్లకు అనుకూలించిన పిచ్పై 107 పరుగులకే 6 వికెట్లు పోయిన ఇంగ్లండ్ ను జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు జీవం పోశారు.అంతకుముందు ఓపెనర్ బెన్ డకెట్ (43) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ప్లేయర్లలో జేకబ్ బేతెల్ 14, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 1, జోస్ బట్లర్ 5, సామ్ కర్రన్ డకౌట్, విల్ జాక్స్ 20, జోఫ్రా ఆర్చర్12, ఆదిల్ రషీద్ 1, టంగ్ డకౌటాయ్యారు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2, బుమ్రా, దూబే తలో వికెట్ తీశారు. -
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.ఐపీఎల్ 2026 సందర్భంగా చేతికి గాయం కావడంతో కార్స్ కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. అనంతరం మోచేతి సమస్య నుంచి కోలుకుని డర్హమ్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్లో మూడు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న తొలి వన్డేలో పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు కనిపించడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి 30 ఓవర్లలో భారత్ బౌలింగ్లో స్పిన్నర్లకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇవ్వగా, మిగిలిన 27 ఓవర్లు పేసర్లు వేశారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అన్నీ పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి.ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్స్ను జట్టులో చేర్చినట్లు సమాచారం.భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ తాజా జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జో రూట్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమ్స్ కోల్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్స్.కార్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, భారత్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు, మూడు వన్డేలు జులై 16, 19 తేదీల్లో కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరుగనున్నాయి.ఇవాళ జరుగుతున్న తొలి వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, భారత పేసర్ల ధాటికి 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. రూట్ (56), డాసన్ (65) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు అజేయమైన 115 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. 42.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 222-6గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్తో బరిలోకి అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జూన్ 16న అట్లాంటా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. అయితే ఇంగ్లండ్తో సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రత్యేక జెర్సీ కిట్తో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేవీ బ్లూ జెర్సీతోనే అర్జెంటీనా ఫిఫా చరిత్రలో రెండు అద్భుతాలకు నాంది పలికిందిఇంగ్లండ్పై మానసికంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సెమీస్ రోజున అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీని ధరించనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అర్జెంటీనా ఫిఫా నుంచి అనుమతి కూడా పొందింది. ప్రతీ ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఒక మ్యాచ్ను నేవీ బ్లూ జెర్సీతో ఆడడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ ఫిఫాలో ఇప్పటికే జోర్డాన్తో మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగారు. Photo Credit: FIFA Twitterఇంగ్లండ్తో సెమీస్ సందర్భంగా తమకు రెండోసారి నేవీ బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఇవ్వాలని అర్జెంటీనా ఫిఫాను అభ్యర్థించింది. తాజాగా ఫిఫా నుంచి అనుమతి రావడంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీకి లైన్ క్లియర్ అయింది. సెమీస్లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీ, నల్లరంగు షార్ట్ను ధరించనుండగా.. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్లో బరిలోకి దిగనుంది.జెర్సీ వెనుక పెద్ద కథే..అర్జెంటీనా ప్రతి ఫిఫాలో నేవీ బ్లూ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడడం వెనుక పెద్ద కథే దాగుంది. 1986 ఫిఫా ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పట్లో ఇద్దరి జెర్సీ రంగు దాదాపు ఒకే విధంగా ఉండడంతో జట్ల మధ్య తేడా ఉండాలని అర్జెంటీనా నేవీ బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లోనే మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' తో పాటు 'గోల్ ఆఫ్ ది సెంచరీ' నమోదు చేశాడు.Photo Credit: FIFA Twitterఆ మ్యాచ్కు గుర్తుగా తాజా ఫిఫాలో సెమీస్లో మరోసారి ఇంగ్లండ్తో తలపడుతున్న వేళ అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాలని నిర్ణయించుకుంది. ఇది మానసికంగా ఇంగ్లండ్పై తమకు విజయం సాధించినట్లవుతుందని అర్జెంటీనా అభిప్రాయపడుతుంది. 1986 ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుసార్లు అర్జెంటీనా, ఇంగ్లండ్లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు కూడా అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగడం విశేషం. 1998 ఫిఫాలో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3తో ఇంగ్లండ్పై విజయాన్ని అందుకుంది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్హమ్ మెరుపులతో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుజట్లు నాకౌట్ మ్యాచ్లో తలపడనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.Photo Credit: FIFA Twitterహ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్'హ్యాండ్ ఆఫ్ గాడ్' అనేది 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డియెగో మారడోనా ఇంగ్లాండ్పై చేసిన వివాదాస్పద గోల్. అతను ఇంగ్లాండ్ గోల్ కీపర్ కంటే ఎత్తున ఎగిరి, బంతిని తన ఎడమ చేతితో గోల్ పోస్ట్లోకి నెట్టాడు. రిఫరీలు దీన్ని గమనించకపోవడంతో గోల్ చెల్లుబాటయింది. ఆ తర్వాత మారడోనా కొట్టిన గోల్ను హ్యాండ్ ఆఫ్ గాడ్గా అభివర్ణించారు.Photo Credit: FIFA Twitterగోల్ ఆఫ్ ది సెంచరీఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమమైన గోల్గా పేరొందిన "గోల్ ఆఫ్ ది సెంచరీ"ని 1986 జూన్ 22న అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా సాధించాడు. మెక్సికోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో, మారడోనా దాదాపు 60 మీటర్ల దూరం నుంచి ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను దాటుకుంటూ వెళ్లి ఈ అద్భుతమైన గోల్ చేయడం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీనిని గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.చదవండి: చెన్నై వేదికగా తొలి మ్యాచ్.. బిగ్బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల -
కోహ్లి, రోహిత్ వచ్చేశారు...
బర్మింగ్హామ్: ‘టి20 సిరీస్ ప్రభావం మాపై ఉండదు. ఫార్మాట్ వేరు, జట్టు వేరు, లక్ష్యం వేరు. పూర్తిగా భిన్నమైన, కొత్త తరహా వాతావరణం ఇక్కడ కనిపించనుంది’... ఇంగ్లండ్తో భారత్ వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కెప్టెన్ శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్య ఇది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో కలిపి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఆరు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పోరుకు సిద్ధమైంది. ఇక్కడైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి సిరీస్లో పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే టి20లకంటే ఈ ఫార్మాట్లో టీమిండియా ప్రదర్శన కీలకం కానుంది. భారత జట్టు తాము ఆడిన గత 6 వన్డే సిరీస్లలో 3 సిరీస్లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్తో జరిగిన గత 5 వన్డేల్లోనూ భారత్ గెలవడం విశేషం. బుమ్రా 2 ఏళ్ల 8 నెలల తర్వాత... మాజీ కెప్టెన్లు, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ రాకతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరికి తోడు నిలకడగా రాణించే కెప్టెన్ గిల్ ఆట జట్టుకు అదనపు బలం. ఎలాగైనా వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో తమకు లభించే ప్రతీ అవకాశాన్ని సమర్థంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారిద్దరి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించవచ్చు. ఈ టాప్–3 తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్ బాధ్యతలు తీసుకుంటారు. వన్డేల్లో రెగ్యులర్ బ్యాటర్గా రాహుల్ ఇప్పటికే పలు మార్లు తన విలువను చూపించాడు. ఇప్పుడు శ్రేయస్పై మాత్రం అదనపు భారం ఉంది. పేస్ బౌలింగ్లో అన్నింటికంటే పెద్ద బలం జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంగా చెప్పవచ్చు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా వన్డేలే ఆడలేదు! మరో ఇద్దరు యువ పేసర్లు గుర్నూర్, ప్రిన్స్లకు చోటు కల్పిస్తారా... ఒకరిని పక్కన పెట్టిన అర్ష్ దీప్ను ఆడిస్తారా చూడాలి.ఆల్రౌండర్లే బలం... టి20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లండ్ అదే ఊపులో వన్డే సిరీస్పై కన్నేసింది. టి20 టీమ్లో ఉన్న కెప్టెన్ బ్రూక్, ఆర్చర్, బెతెల్, బట్లర్, కరన్, టంగ్, రషీద్, జాక్స్లు వన్డేల్లో కూడా జట్టును గెలిపించగల సమర్థులు. వీరందరితో పాటు సీనియర్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులో ఉండటం ఇంగ్లండ్కు పెద్ద సానుకూలాశం. అయితే జనవరిలో శ్రీలంకతో తలపడిన తర్వాత టీమ్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. దాంతో ఈ ఫార్మాట్లో సన్నద్ధత విషయంలో కొంత తడబాటు కనిపించింది. అయితే సొంతగడ్డపై సిరీస్ కాబట్టి ఇంగ్లండ్ ఈ సవాల్ను అధిగమించగలదు. 2024 నుంచి ఆడిన 7 వన్డే సిరీస్లలో 5 ఓడిపోయిన ఇంగ్లండ్... చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. -
భారత్తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో రేపు (జులై 14) జరుగబోయే తొలి వన్డే (మూడు మ్యాచ్ల సిరీస్) కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో కీలక మార్పులు చేసిన ఆతిథ్య జట్టు, యువ ఆల్రౌండర్ జేకబ్ బెతెల్ను ఓపెనర్గా బరిలోకి దింపాలని నిర్ణయించింది.జేకబ్ బెతెల్, బెన్ డకెట్ ఇన్నింగ్స్ను ప్రారంభించనుండగా, అనుభవజ్ఞుడు జో రూట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో, జోస్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు.బౌలింగ్ విభాగంలో సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. భారత బ్యాటింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో సమతూక జట్టును రూపొందించింది.ఇటీవల టీ20 సిరీస్లో భారత్పై ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్, అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ విజయంతో సిరీస్ను ఆరంభించాలని భావిస్తోంది. రేపటి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత తుది జట్టును ప్రకటించాల్సి ఉంది.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:జేకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్. -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్ల్లో ఆరు గోల్స్తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్ల్లో 8 గోల్స్తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడగా.. స్పెయిన్దే పైచేయి. 38 మ్యాచ్ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్లో ప్రిక్వార్టర్స్లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్గా యస్తిక భాటియా -
విజయం దిశగా భారత్
లండన్: చారిత్రక టెస్టు మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయానికి చేరువైంది. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్లో జరుగుతున్న తొలి మహిళల సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య ఇంగ్లండ్పై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓవర్నైట్ స్కోరు 154/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 86.3 ఓవర్లలో 341/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా (113; 14 ఫోర్లు) లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పగా... స్మృతి మంధాన (70; 9 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (50 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్స్టోన్ 5 వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం 115 పరుగులు కలుపుకొని ప్రత్యర్థి ముందు భారత జట్టు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి, సయాలి, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు తీశారు. చేతిలో 4 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ విజయానికి ఇంకా 327 పరుగులు చేయాల్సి ఉంది. నేడు మ్యాచ్కు చివరి రోజు. -
అర్జెంటీనా... అదే దూకుడు
కాన్సస్ సిటీ: ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా చేరువైంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన చివరిదైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో ఏడోసారి సెమీఫైనల్కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (112వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (120+1వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్విట్జర్లాండ్ జట్టుకు డాన్ ఎండోయో (67వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 72వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం స్విట్జర్లాండ్ పదిమంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ టోర్నీలో మొదటి ఐదు మ్యాచ్ల్లో గోల్స్ కొట్టిన మెస్సీ ఈ మ్యాచ్లో మాత్రం గోల్ చేయలేదు. అయితే అలెక్సిస్ తొలి గోల్ చేసేందుకు మెస్సీ సహాయపడ్డాడు. గత మూడు నాకౌట్ మ్యాచ్ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అర్జెంటీనా ఏమాత్రం ఆందోళన చెందకుండా విజయమే లక్ష్యంగా చివరి క్షణం వరకు పోరాడింది. ఈ పోరాట ఫలితమే అర్జెంటీనా జట్టుకు సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసింది. స్విట్జర్లాండ్తో పోరులో అర్జెంటీనా 22 సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేసి ఏడుసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. గతంలో సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు (1930, 1978, 1986, 1990, 2014, 2022) అర్జెంటీనా జట్టు ఫైనల్లోకి ప్రవేశించడంతోపాటు మూడుసార్లు విజేతగానూ నిలిచింది. ఏడోసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. 12 ప్రపంచకప్లో వరుసగా 12 మ్యాచ్ల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి జట్టుగా అర్జెంటీనా రికార్డు నెలకొల్పింది. 72 ఏళ్లుగా ఉరుగ్వే (1930 నుంచి 1954 వరకు; వరుసగా 11 మ్యాచ్ల్లో ) పేరిట ఉన్న రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది.4 అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య 1992లో వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక... తొలిసారి ప్రపంచకప్లో టాప్–4 జట్లు సెమీఫైనల్ చేరాయి. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో ఫ్రాన్స్ తొలి స్థానంలో, స్పెయిన్ రెండో స్థానంలో, అర్జెంటీనా మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.బెలింగ్హమ్ ‘డబుల్’ ధమాకా...నార్వేను ఓడించి సెమీస్లోకి ఇంగ్లండ్ మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ఎర్లింగ్ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్ను సబ్స్టిట్యూట్గా ఆడించారు. 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. -
భారత్పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి
భారత్పై చరిత్రాత్మక టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రత్యేక బహుమతి ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మద్యపానంపై కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ, భారత్పై 4-0తో సిరీస్ గెలిచిన సందర్భంగా ఆటగాళ్లు విజయోత్సవాలు జరుపుకునేందుకు తాత్కాలికంగా ఆంక్షలను సడలించాడు.ఇటీవల హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఈసీబీ ఆటగాళ్లపై కఠిన మార్గదర్శకాలు అమలు చేసింది. అర్ధరాత్రి కర్ఫ్యూ, టెస్టు మ్యాచ్ల మధ్య లేదా మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు మద్యం సేవించకూడదనే నిబంధనలను తీసుకొచ్చింది. అలాగే మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దని కూడా హెచ్చరించింది.అయితే భారత్పై అద్భుత విజయంతో ఆటగాళ్ల కృషిని గుర్తించిన మెకల్లమ్, విజయానందాన్ని ఆస్వాదించేందుకు వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. "ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విజయం సాధించిన తర్వాత ఆ ఆనందాన్ని ఆస్వాదించే హక్కు వారికి ఉంది. ఎవరికైనా బీర్ తాగాలనిపిస్తే ఈ రోజు అందుకు సరైన సందర్భమే. అయితే అది పరిమితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా రేపటి పత్రికల మొదటి పేజీలో తప్పు కారణాలతో కనిపించకూడదు" అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.భారత్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించి 4-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల టీ20 జట్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. -
ఇంగ్లండ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న మెక్కల్లమ్
ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ తప్పుకున్నాడు. 2022 నుంచి బెన్ స్టోక్స్తో కలిసి ఇంగ్లండ్ టెస్టు క్రికెట్కు కొత్త దిశానిర్దేశం చేసిన అతడు.. యాషెస్ వైఫల్యం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మెక్కల్లమ్ వైట్బాల్ జట్లకు మాత్రం హెడ్ కోచ్గా కొనసాగనున్నాడు.2022లో టెస్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన మెకల్లమ్, అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి దూకుడైన ఆటతీరుకు శ్రీకారం చుట్టాడు. ఈ శైలికి 'బజ్బాల్' అనే పేరు పెట్టారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2024లో మెక్కల్లమ్కు వైట్బాల్ జట్ల బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పటి నుంచి అతడు ఇంగ్లండ్ ఆల్ ఫార్మాట్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఓటమి పాలవడం, ఆ తర్వాత బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసీబీ ఒత్తిడి మేరకు మెక్కల్లమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది యాషెస్ను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టుకు కొత్త కోచ్ను నియమించాలని ఈసీబీ భావిస్తోంది.మెకల్లమ్ మార్గదర్శకత్వంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. జట్టు ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిన కోచ్గా ఆయన ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతారు.మెకల్లమ్ మార్గదర్శకత్వంలో, హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరడమే కాకుండా, తాజాగా భారత్పై 4-0తో టీ20 సిరీస్ను కైవసం చేసుకుని ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. -
ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ సెమీస్కి.. నార్వే ఇంటికి..
మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఇక 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ఎర్లింగ్ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్ను సబ్స్టిట్యూట్గా ఆడించారు. కాగా 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్లోనే నిరాశగా వెనుదిరిగింది. -
ఆఖరిదీ పోయింది
సౌతాంప్టన్: ఐర్లాండ్–ఇంగ్లండ్ టి20 టూర్ను భారత జట్టు ఒక్క గెలుపు లేకుండా శూన్య హస్తాలతో ముగించింది. ఫలితం తేలిన 6 మ్యాచ్లలోనూ జట్టు పరాజయంపాలైంది. ఐర్లాండ్ చేతిలో 0–2తో ఓడిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో 0–4తో ఓడటంతో కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ప్రయాణం తీవ్ర నిరాశతో మొదలైంది. శనివారం జరిగిన ఐదో టి20లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ టి20లో తన రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరు రెండో వికెట్కు 103 బంతుల్లోనే 233 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా...శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న భారత్ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రసిధ్ రెండో ఓవర్లోనే సాల్ట్ (6)ను వెనక్కి పంపినా...ఆ తర్వాత బట్లర్, బ్రూక్ కలిసి చెలరేగిపోయారు. ఏ భారత బౌలర్నూ వదిలిపెట్టకుండా వీరిద్దరు ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్ప్లేలో ఇంగ్లండ్ 61 పరుగులు చేయగా...అక్షర్ ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 111 పరుగులకు చేరింది. 19 బంతుల్లోనే బ్రూక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ప్రిన్స్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదిన బట్లర్...అక్షర్ ఓవర్లో భారీ సిక్స్తో 51 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. చివరి 4 ఓవర్లలో ఇంగ్లండ్ 48 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన భారత్కు కష్టంగా మారిపోయింది. పవర్ప్లేలో 65/2తో మెరుగ్గానే కనిపించిన జట్టు 10 ఓవర్లలో 110 పరుగులు చేసి ప్రత్యర్థితో సమంగానే నిలిచింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన జట్టు 11–20 ఓవర్ల మధ్య 91/6 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిపాలైంది. వైభవ్ స్థానంలో సామ్సన్... మూడు మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత సంజు సామ్సన్ను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించిన భారత టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లో సామ్సన్ను మళ్లీ జట్టులోకి తీసుకుంది. 15 ఏళ్ల వయసులో భారీ అంచనాలతో బరిలోకి దిగి వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ను టీమ్ ఈ సారి పక్కన పెట్టింది.233 అంతర్జాతీయ టి20ల్లో రెండో వికెట్కు బట్లర్, బ్రూక్ జోడించిన 233 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కాగా...ఓవరాల్గా ఏ వికెట్కైనా ఇది నాలుగో అత్యధిక పార్ట్నర్షిప్.7 శ్రేయస్ అయ్యర్ వరుసగా గెలిచిన టాస్ల సంఖ్య. కెప్టెన్గా తొలి 7 మ్యాచ్లలో అయ్యర్ ఈ ఫీట్ ప్రదర్శించగా... గతంలో వాలీ హామండ్ (8) మాత్రమే కెప్టెన్గా తన తొలి 8 మ్యాచ్లలో టాస్ నెగ్గాడు.మూడు క్యాచ్లు వదిలిపెట్టి... భారత జట్టు పేలవ ఫీల్డింగ్ ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. బ్రూక్ 3 పరుగుల వద్ద శివమ్ దూబే, బట్లర్ 101 వద్ద ఉన్నప్పుడు సూర్యాంశ్ షెడ్గే, 90 వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను ఇషాన్ కిషన్ వదిలేశారు. అన్నింటిలో షార్ట్ థర్డ్మాన్ స్థానంలో బంతిని సరిగా అంచనా వేయలేక దూబే వదిలేసిన బ్రూక్ క్యాచ్ భారీ నష్టం కలిగించింది!స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సూర్యాంశ్ (బి) ప్రసిధ్ 6; బట్లర్ (సి) అయ్యర్ (బి) దూబే 131; బ్రూక్ (నాటౌట్) 95; బెతెల్ (సి) తిలక్ (బి) దూబే 0; జాక్స్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 257. వికెట్ల పతనం: 1–8, 2–241, 3–241. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–33–0, ప్రసిధ్ 4–0–38–1, ప్రిన్స్ యాదవ్ 4–0–60–0, అక్షర్ 4–0–63–0, సూర్యాంశ్ 3–0–39–0, శివమ్ దూబే 1–0–22–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బెతెల్ (బి) కరన్ 27; అభిషేక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 3; ఇషాన్ కిషన్ (సి) సాల్ట్ (బి) రషీద్ 56; అయ్యర్ (సి) కరన్ (బి) డాసన్ 28; తిలక్ (సి) బట్లర్ (బి) టంగ్ 53; దూబే (సి) ఆర్చర్ (బి) కరన్ 14; సూర్యాంశ్ (సి) బట్లర్ (బి) కరన్ 7; అక్షర్ (సి) జాక్స్ (బి) రషీద్ 3; అర్ష్ దీప్ (నాటౌట్) 4; ప్రసిధ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–55, 3–110, 4–131, 5–162, 6–189, 7–193, 8–199. బౌలింగ్: ఆర్చర్ 4–0–41–1, టంగ్ 4–0–53–1, జాక్స్ 3–0–32–0, స్యామ్ కరన్ 4–0–36–3, డాసన్ 2–0–14–1, రషీద్ 3–0–24–2. -
క్రాంతి 'కమాల్'
లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మహిళల తొలి టెస్టులో భారత జట్టు అదరగొడుతోంది. ఇటీవల టి20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... ఇంగ్లండ్తో ఏకైక టెస్టులో సమష్టిగా సత్తాచాటుతోంది. 142 ఏళ్ల చరిత్ర గల లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇదే తొలి మహిళల టెస్టు మ్యాచ్ కాగా... చారిత్రక మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఓవర్నైట్ స్కోరు 21/1తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 59.1 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఎమీ జోన్స్ (62 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ శతకం సాధించగా... కెప్టెన్ సివర్ బ్రంట్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో యువ పేసర్ క్రాంతి గౌడ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... సయాలి సత్గరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి 42 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (124 బంతుల్లో 69 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (73 బంతుల్లో 39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత జట్టు... ప్రస్తుతం 269 పరుగుల ఆధిక్యంలో ఉంది. పాంచ్ పటాకా... సొంతగడ్డపై అనుకూల వాతావరణంలో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. క్రాంతి ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మైయా (23), హీతర్ నైట్ (6), కాప్సీ (9) ఒకరి వెంటక ఒకరు పెవిలియన్కు చేరడంతో ఇంగ్లండ్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సివర్ బ్రంట్తో కలిసి అమీ జోన్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. బ్రంట్ క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తే... జోన్స్ వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జోన్స్ అర్ధశతకం పూర్తి చేసుకుంది. ఐదో వికెట్కు 119 బంతుల్లో 84 పరుగులు జోడించిన అనంతరం జోన్స్ అవుటైంది. ఇక అక్కడి నుంచి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టుకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. స్మృతి సూపర్... తొలి ఇన్నింగ్స్లో భారీ అర్ధశతకంతో రాణించిన ఓపెనర్ స్మృతి మంధాన... రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఫామ్ కొనసాగించింది. ప్రత్యర్థి బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోవడంతో స్మృతి ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. మరో ఎండ్ నుంచి షఫాలీ వర్మ (55 బంతుల్లో 33; 7 ఫోర్లు) కూడా చక్కటి షాట్లు ఆడటంతో భారత జట్టు చకచకా పరుగులు రాబట్టింది. తొలి వికెట్కు 88 పరుగులు జోడించిన అనంతరం షఫాలీ అవుట్ కాగా... క్లాసిక్ షాట్లతో ఆకట్టుకున్న మంధాన 89 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకుంది. షఫాలీ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా కూడా స్మృతికి అండగా నిలవడంతో భారత జట్టుకు ఇబ్బందులు ఎదురు కాలేదు. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: 285; ఇంగ్లండ్ మహిళల తొలి ఇన్నింగ్స్: మైయా (బి) యస్తికా (బి) క్రాంతి 23; బ్యూమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 2; నైట్ (ఎల్బీ) (బి) సయాలీ 6; సీవర్ (ఎల్బీ) (బి) క్రాంతి 44; కాప్సీ (బి) క్రాంతి 9; జోన్స్ (సి) రిచా (బి) స్నేహ్ 52; మ్యాడీ (బి) స్నేహ్ 10; ఎకిల్స్టోన్ (సి) యస్తిక (బి) సయాలీ 11; ఇస్సీ వాంగ్ (నాటౌట్) 7; లారెన్ బెల్ (సి) షఫాలీ (బి) క్రాంతి 3; ఫిలెర్ (ఎల్బీ) (బి) దీప్తి 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–9, 2–32, 3–32, 4–47, 5–131, 6–142, 7–159, 8–159, 9–162, 10–170. బౌలింగ్: సయాలీ 13–3–40–2; క్రాంతి 17–7–37–5; స్నేహ్ 14–3–41–2; శ్రీచరణి 8–0–41–0; దీప్తి 7.1–2–10–1. భారత మహిళల రెండో ఇన్నింగ్స్: స్మృతి (నాటౌట్) 69; షఫాలీ (సి) (సబ్) లాంబ్ (బి) ఎకిల్స్టోన్ 33; యస్తిక (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 13; మొత్తం (42 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 154. వికెట్ల పతనం: 1–88. బౌలింగ్: లౌరెన్ బెల్ 11–5–16–0; ఫిలెర్ 4–1–19–0; ఎకిల్స్టోన్ 12–1–46–1; ఇస్సీ వాంగ్ 7–3–30–0; మ్యాడీ 8–0–31–0. -
మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి, మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంలో (117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది) కొనసాగుతోంది. షఫాలీ వర్మ (33) ఔట్ కాగా.. స్మృతి మంధాన (69), యస్తికా భాటియా (39) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది.స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
బట్లర్ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమి
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ గెలుపు లేకుండానే ముగించింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఇంగ్లండే గెలుపొందింది. తద్వారా 4-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.నేటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0), సూర్యాంశ్ షేడ్గే (3-0-39-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-0), ప్రసిద్ద్ కృష్ణ (4-0-38-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ చేయాల్సిన ప్రయత్నమంతా చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. తద్వారా 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో సంజూ శాంసన్ (27), శ్రేయస్ అయ్యర్ (28), శివమ్ దూబే (14) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్ 2, ఆర్చర్, టంగ్, డాసన్ తలో వికెట్ తీశారు. -
టీమిండియా ఓటమి
ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిఐదో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సిరీస్ను 0-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇషాన్ కిషన్ (56) ఔట్12.4వ ఓవర్- ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు). స్కోర్ 131-4. మూడో వికెట్ కోల్పోయిన భారత్10.1వ ఓవర్- శ్రేయస్ అయ్యర్ (28) ఔట్సంజూ శాంసన్ ఔట్5.1వ ఓవర్- 55 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో జేకబ్ బేతెల్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (27) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3వ ఓవర్- 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (3) ఔటయ్యాడు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోర్సౌతాంప్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లను చీల్చిచెండాతున్న బ్రూక్బ్రూక్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 నాటౌట్బట్లర్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 నాటౌట్14 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 168-1అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రూక్, బట్లర్హ్యారీ బ్రూక్ (56), జోస్ బట్లర్ (72) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 146-1గా ఉంది.ధాటిగా ఆడుతున్న బ్రూక్వన్డౌన్లో వచ్చిన హ్యారీ బ్రూక్ ధాటిగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 40 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 73-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.4వ ఓవర్- ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సూర్యాంశ్ షేడ్గేకు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (6) ఔటయ్యాడు.మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఈసారైనా మ్యాచ్ గెలిచేనా..?శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్లో టాస్ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్7:15 గంటలకు టాస్భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్ పడుతుంది. టాస్ ఆలస్యం.. కారణమిదే..!భారత్, ఇంగ్లండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్డేట్. మరికొద్ది నిమిషాల్లో టాస్ పడే అవకాశం ఉంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్ జరుగనుంది. -
నేడు భారత్ ఇంగ్లాండ్ 5వ T20 మ్యాచ్
-
భారత్ 285 ఆలౌట్
లండన్: మహిళల టి20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వైదొలిగిన భారత క్రికెట్ జట్టు... ఇంగ్లండ్తో ఏకైక టెస్టులో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. సుదీర్ఘ చరిత్ర గల లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మహిళల తొలి టెస్టులో హర్మన్ప్రీత్ సారథ్యంలోని టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (108 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (121 బంతుల్లో 58; 7 ఫోర్లు), ఆల్రౌండర్ దీప్తి శర్మ (87 బంతుల్లో 57; 7 ఫోర్లు) ఆర్ధశతకాలతో రాణించారు. ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు ఆచితూచి ఆడగా... మిగిలినవాళ్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా... యస్తిక భాటియా (12), రిచా ఘోష్ (13), స్నేహ్ రాణా (13) విఫలమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 35; 5 ఫోర్లు) వేగంగా ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లౌరన్ ఫిలెర్, ఇస్సీ వాంగ్, మ్యాడీ విలియర్స్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు... టీమిండియా స్కోరుకు ఇంకా 264 పరుగులు వెనుకబడి ఉంది. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న టామీ బ్యూమాంట్ (2) విఫలం కాగా... మైయా (17 బ్యాటింగ్), హీతర్ నైట్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ ఒక వికెట్ తీసింది. ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసింది. మ్యాచ్ ఆరంభానికి ముందు శ్రీచరణికి వైస్ కెప్టెన్ స్మృతి మంధాన టెస్టు క్యాప్ అందజేసింది. -
చివరిదైనా గెలుస్తారా?
సౌతాంప్టన్: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న భారత క్రికెట్ జట్టు నేడు ఇంగ్లండ్తో ఆఖరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టి20 వర్షంతో రద్దు కాగా... ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 3–0తో సిరీస్ సొంతం చేసుకుంది. మరి శనివారం నామమాత్రమైన చివరి మ్యాచ్లోనైనా మనవాళ్లకు ఊరట విజయం దక్కుతుందా చూడాలి. ఈ ఏడాది టి20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచిన భారత జట్టు... ఇప్పుడు కనీస ప్రతిఘటన కనబర్చలేని స్థాయికి చేరింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో మనవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్ ప్రదర్శనతో జట్టులోకి వస్తున్న ఆటగాళ్లెవరూ... అంతర్జాతీయ స్థాయిలో అదే దూకుడు కనబర్చలేకపోతున్నారు. ఫ్లాట్ పిచ్లు, చిన్న బౌండరీలు, బ్యాటింగ్కు అనుకూలమైన నిబంధనల మధ్య ఐపీఎల్లో పరుగుల వరద పారించిన ప్లేయర్లంతా... ఇప్పుడు అనామకులుగా దర్శనమిస్తున్నారు. . నిలకడగా... మరోవైపు ఇంగ్లండ్ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. పేసర్లు ఆర్చర్, టంగ్, స్యామ్ కరన్... భారత బ్యాటర్ల బలహీనతలను పసిగట్టి వారిని సులువుగా బుట్టులో వేసుకుంటున్నారు. ఇక బ్యాటింగ్లో ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉండటం ఇంగ్లండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు ఒకటి కంటే ఎక్కువ టి20 మ్యాచ్ల సిరీస్ల్లో ఇంగ్లండ్ చేతిలో సిరీస్ కోల్పోని టీమిండియా... ఇప్పుడు ‘క్లీన్ స్వీప్’ ప్రమాదం అంచున ఉంది. -
సెమీఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
మయామి: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ తుది అంకానికి చేరువైంది. రెండు సెమీఫైనల్ బెర్త్ల కోసం నార్వే జట్టుతో ఇంగ్లండ్; స్విట్జర్లాండ్ జట్టుతో అర్జెంటీనా తలపడనున్నాయి. నార్వే, స్విట్జర్లాండ్ జట్లు ఇప్పటి వరకు ప్రపంచకప్లో ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరుకోలేకపోయాయి. మరోవైపు ఇంగ్లండ్ 1966లో... అర్జెంటీనా 1978లో, 1986లో, 2022లో ప్రపంచకప్ టైటిల్స్ సాధించాయి. ఈ టోర్నీలో నార్వే అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ముఖ్యంగా నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ కళ్లు చెదిరే ఆటతీరుతో అలరిస్తున్నాడు. 4 మ్యాచ్ల్లో ఎర్లింగ్ 7 గోల్స్ చేసి నార్వే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్హమ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. హ్యారీ కేన్ 6 గోల్స్, బెలింగ్హమ్ 4 గోల్స్ సాధించారు. ఇక డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు అజేయంగా నిలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. అర్జెంటీనాపై స్విట్జర్లాండ్పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచి మ్యాచ్ను పెనాల్టీ షూటౌట్ వరకు రప్పించ గలిగితే తుది ఫలితం ఎలాగైనా ఉండవచ్చు. -
లార్డ్స్లో లేడీస్ టెస్టు
లండన్: మహిళల టి20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వైదొలిగిన భారత క్రికెట్ జట్టు... ఇప్పుడు చారిత్రక టెస్టు మ్యాచ్కు సిద్ధమైంది. ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో హర్మన్ప్రీత్ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది. 142 ఏళ్ల చరిత్రగల ఈ మైదానంలో జరగనున్న మహిళల తొలి టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం. 1787లో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) స్థాపించగా... అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం అది పురుషులకే పరిమితమైంది. 1986లో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీని లార్డ్స్ పెవిలియన్లోకి అనుమతించకపోవడం అప్పట్లో పెద్ద వివాదాన్ని రేపింది. అలాంటి చోట ఇప్పుడు మహిళల టెస్టు మ్యాచ్ జరగనుండటం విశేషం. టి20 వరల్డ్కప్లో ఆకట్టుకోలేక పోయినప్పటికీ... సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయి. 1995 తర్వాత ఇంగ్లండ్లో జరిగిన ఏ టెస్టులోనూ భారత్ ఓడిపోలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్టుల్లో మూడింట టీమిండియా గెలుపొందింది.కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. వీరంతా సమష్టిగా సత్తాచాటితో భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. ఇంగ్లండ్ పిచ్లపై పేసర్ల ప్రభావం ఎక్కువ కాగా... రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, నందని శర్మ ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఆసక్తికరం. ప్రతీక రావత్ గాయపడటంతో ఆమె స్థానంలో... ప్రియా పూనియాను ఎంపిక చేశారు. మరి యస్తిక భాటియా, ప్రియా పునియా, రిచా ఘోష్లలో తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి టెస్టు అరంగేట్రం చేయనుంది. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించే ఏ క్రికెటర్ అయినా లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడాలని కలలు కంటారు. ఇప్పుడు మన మహిళల జట్టుకు అలాంటి అవకాశం దక్కింది. ఈ క్షణాలను ఆస్వాదించాలి’ అని భారత మహిళల జట్టు కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. » ఇంగ్లండ్ జట్టు కొత్త కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ సారథ్యంలో బరిలోకి దిగనుండగా.. ఐదుగురు ఇంగ్లండ్ ప్లేయర్లు ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనున్నారు. » మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ టామీ బ్యూమాంట్ ఈ మ్యాచ్ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలకనుంది. » పురుషుల విభాగంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజులపాటు జరుగుతుంది. అదే మహిళల విభాగంలో టెస్టు మ్యాచ్ నాలుగు రోజులే నిర్వహిస్తున్నారు. అయితే ఐదు రోజులవి రెండు టెస్టులు జరిగాయి. ఒక రోజు కనీసం 100 ఓవర్లు వేయాలి. ఫాలోఆన్ ఇన్నింగ్స్ ఆడించేందుకు ఆధిక్యం 150 పరుగులకు పైగా ఉండాలి. » మెల్బోర్న్లో జరిగిన మహిళల యాషెస్ సిరీస్ టెస్టుకు 35 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఇప్పుడు ఆ సంఖ్యను మించి అభిమానులు మైదానానికి పోటెత్తనున్నారు. టి20 ప్రపంచకప్ బాధను మర్చిపోవడానికి ఇదో చక్కటి అవకాశం. వరల్డ్కప్లో మేము ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. గ్రూప్ దశలోనే వెనుదిరగడం చాలా బాధించింది. కానీ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ద్వారా తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలబడతామనే నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్ ఆడాలనేది కల అయితే అందులో లార్డ్స్లో ఆడాలనేది అత్యున్నతమైంది. ఇప్పటి వరకు ఇక్కడ మహిళల టెస్టు మ్యాచ్ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయా. అలాంటి చారిత్రక సందర్భంలో భాగస్వామి కానుండటం గర్వంగా ఉంది. టి20 వరల్డ్ కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ఈ మ్యాచ్తో టెస్టు అరంగేట్రం చేయబోతోంది. తను కీలకమైన బౌలర్. జట్టుకు అవసరమైన ప్రతిసారీ శ్రీచరణి వికెట్లు తీస్తోంది. –హర్మన్ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ 15 ఇప్పటి వరకు భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మొత్తం టెస్టులు. భారత జట్టు 3 టెస్టుల్లో గెలుపొందగా... ఒక టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. మిగతా 11 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఇంగ్లండ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. రెండింటిలో భారత్ నెగ్గగా... మిగతా ఏడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. -
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన
భారత్తో జరగనున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇంగ్లండ్ మహిళల సీనియర్ బ్యాటర్ టామీ బ్యూమాంట్ ప్రకటించింది. దీంతో దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన ఆమె అంతర్జాతీయ కెరీర్కు తెరపడనుంది.35 ఏళ్ల బ్యూమాంట్ 2009లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి 260 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 7000 పైచిలుకు పరుగులు చేసింది. వన్డేల్లో అత్యధికంగా 12 సెంచరీలు బాది, ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచింది. అలాగే టెస్ట్ల్లో, టీ20ల్లో తలో సెంచరీ చేసి, ఓవరాల్గా 37 అర్ద సెంచరీలు నమోదు చేసింది.2017లో స్వదేశంలో జరిగిన మహిళల ప్రపంచకప్లో ఇంగ్లండ్ టైటిల్ గెలవడంలో బ్యూమాంట్ కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నీలో అత్యధికంగా 410 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకుంది.2023 మహిళల యాషెస్ సందర్భంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాపై 208 పరుగులు చేసి మహిళల టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున తొలి డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. అలాగే మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఇద్దరు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లలో ఒకరిగా, మొత్తం ఇంగ్లండ్ క్రికెటర్లలో ఐదుగురిలో ఒకరిగా నిలిచింది.రిటైర్మెంట్ నిర్ణయంపై స్పందించిన బ్యూమాంట్, "దాదాపు 17 ఏళ్ల పాటు ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. చిన్నప్పుడు క్రికెట్పై ప్రేమ పెరిగినప్పుడు ఇంగ్లండ్ తరఫున ఆడతానని కూడా ఊహించలేదు. ఇప్పుడు ఎంతోమంది బాలికలు, బాలురకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. తర్వాతి తరం ఆటగాళ్లకు ఈ బాధ్యతను అప్పగించే సమయం ఆసన్నమైంది" అని తెలిపింది."లార్డ్స్లో జరగనున్న ఈ టెస్టు మహిళల తొలి టెస్టు కావడం మరింత ప్రత్యేకం. ఇలాంటి చారిత్రాత్మక వేదికపై నా అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకడం ఆనందంగా ఉంది. ఇకపై దేశవాళీ క్రికెట్లో కొనసాగుతాను. ఇన్నేళ్లుగా నన్ను ప్రోత్సహించిన అభిమానులు, కోచ్లు, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు" అని పేర్కొంది.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య ఏకైక టెస్ట్ జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇదే తొలి మహిళల టెస్ట్ మ్యాచ్. -
మన ఆట (రాత) మారుతుందా!
బ్రిస్టల్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టి20 మ్యాచ్లు ముగిశాయి. నాలుగు మ్యాచ్లలో ఓటమి దక్కగా, ఒక దాంట్లో ఫలితం రాలేదు. టీమ్తో పాటు కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ కూడా తన సారథ్యంలో తొలి గెలుపు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. 2018–19లో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో టి20 సిరీస్లు కోల్పోయిన తర్వాత భారత్ మళ్లీ వరుసగా రెండు సిరీస్లు చేజార్చుకోలేదు. అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదం జట్టుకు పొంచి ఉంది. ఇలాంటి స్థితిలో నేడు ఇంగ్లండ్తో నాలుగో టి20 మ్యాచ్లో భారత్ తలపడనుంది. ఇక్కడ ఓడితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ చేజారుతుంది. టీమిండియా తమ స్థాయికి తగినట్లు సత్తా చాటి మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే సిరీస్ సమంగా ముగుస్తుంది.వైభవ్ చెలరేగుతాడా... గత మ్యాచ్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. అలాంటి భారీ పరాజయం నుంచి కోలుకొని జట్టు ఎలాంటి జవాబు ఇస్తుందనేది ఆసక్తికరం. మూడో టి20లో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. అభిషేక్, ఇషాన్ నుంచి జట్టు మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. వైభవ్ సూర్యవంశీని అప్పుడే విమర్శించడం సరైంది కాదు అలా రెండు సిక్స్లు కొట్టి నిష్క్రమించే ఆట మాత్రం సరి కాదు. కుదురుకుంటే అతడిని ఆపడం ఇంగ్లండ్కు కష్టం కావచ్చు. వైస్ కెప్టెన్ తిలక్వర్మ వరుసగా చెత్త షాట్లతో విఫలం కావడం కలవరపరుస్తున్న అంశం కాగా, శివమ్ దూబే మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్ను మెరుగుపర్చుకోకపోతే కెప్టెన్గా తొలి పర్యటన అతనికి ఎప్పటికీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మార్పుల్లేకుండా... ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ సిరీస్ కోసం టీమ్తో పాటు ఉన్న ఇద్దరు ఆటగాళ్లు జేమ్స్ కోల్స్, రేహన్ అహ్మద్లను దేశవాళీ మ్యాచ్ల కోసం వెనక్కి పంపించింది. కాబట్టి గత మ్యాచ్లో ఘన విజయం అందించిన తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఇంగ్లండ్ బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. బౌలింగ్లో ఆర్చర్, టంగ్ పదునైన బౌలింగ్ భారత్ను ఇబ్బంది పెట్టవచ్చు. బ్రిస్టల్ కౌంటీ మైదానం బ్యాటింగ్కు బాగా అనుకూలం. రెండు వైపులా చిన్న బౌండరీలు కూడా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షసూచన లేదు. -
‘సామ్సన్కు పూర్తిగా స్పష్టతనిచ్చాం’
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో రెండో టి20 నుంచి సంజు సామ్సన్ను తప్పించడం తీవ్ర చర్చకు దారి తీసింది. టి20 ప్రపంచకప్లో వరుసగా 97, 89, 89 స్కోర్లతో భారత్ను గెలిపించడంతో పాటు సామ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. అయితే ఐర్లాండ్తో తొలి రెండు మ్యాచ్లు, ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టి20లో అతను వరుసగా 5, 0, 1 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. అయితే కేవలం మూడు మ్యాచ్లలో విఫలం కావడంతోనే ఒక అగ్రశ్రేణి బ్యాటర్ను పక్కన పెట్టడంతో మేనేజ్మెంట్పై విమర్శలు వచ్చాయి. దీనిపై మొదటిసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ విషయంలో తాను స్వయంగా సామ్సన్కు అన్ని అంశాలు వివరించానని అతను వెల్లడించాడు. ‘సంజు సామ్సన్కు ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వాలో అదంతా చెప్పాం. ఇది ఒక ఆటగాడికి, హెడ్ కోచ్కు మధ్య జరిగిన సంభాషణ. కాబట్టి వాటి వివరాలు సహజంగానే మేం బయటకు చెప్పం. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రపంచ కప్లో సామ్సన్ ఎంత అద్భుతంగా ఆడాడో మాకూ బాగా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల తాజా ఫామ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.అయినా ఈ సిరీస్లో అతను మళ్లీ ఆడలేడనే నిబంధన ఏమీ లేదు కదా. అంతర్జాతీయ క్రికెట్లో అన్నింటికంటే ఫలితాలు ముఖ్యం. ఏ 11 మంది అత్యుత్తమ ఆటగాళ్ల బృందం మాకు ఫలితాలు అందిస్తుందనే నమ్ముతామో వారినే ఆడిస్తాం. భారత్ తరఫున ఆడగల హక్కును జట్టులోని ప్రతీ ఒక్కరు తమంతట తామే సంపాదించుకోవాలనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను’ అని గంభీర్ వివరించాడు. ఇంగ్లండ్తో మూడో టి20లో చిత్తుగా ఓడిన తర్వాత తమ పరాజయానికి కారణాలను కోచ్ విశ్లేషించాడు. టి20ల్లో భారత జట్టు సుదీర్ఘ కాలంగా ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు జట్టు మారిందని, కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని హెడ్ కోచ్ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంగ్లండ్లో పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సి అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఇటీవల టీమ్లో పలు మార్పుచేర్పులు జరిగాయి. వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీమ్ నుంచి కొందరు మాత్రమే ఇక్కడున్నారు. కెప్టెన్ మారాడు, ఓపెనర్ మారాడు. పాండ్యా, బుమ్రా ఆడటం లేదు. కాబట్టి ఇంకా టీమ్ పూర్తిగా కుదురుకోలేదు. జట్టులోకి పలువురు ఆటగాళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమయం పడుతుంది. మా ఆటగాళ్లంతా రిస్్కతో కూడిన క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలూ వస్తాయి. ప్రపంచకప్లోనూ మా టాపార్డర్ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. అయితే అప్పుడు మిడిలార్డర్ నిలకడగా ఆడి ఆదుకుంది. ఈసారి అది కనిపించలేదు’ అని భారత మాజీ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. నాలుగు మ్యాచ్లు ఓడినంత మాత్రం భారత్ చెత్త టీమ్గా మారిపోదని కూడా అతను అన్నాడు. -
ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. ఇక్కడి నుంచి మ్యాచ్లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. లీగ్ దశలో 48 జట్లు పోటీపడితే అందులో నుంచి 32 జట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి 16 జట్లు ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో 8 జట్లు (అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, బెల్జియం, ఇంగ్లండ్, మొరాకో, స్విట్జర్లాండ్) అమీతుమీకి సిద్ధమ వుతున్నాయి. ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీ (అర్జెంటీనా)ఈ ఫిఫాలో భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వరకు నిష్క్రమించడం గమనార్హం. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి జట్లు ప్రిక్వార్టర్స్లోనే తమ ఆటను ముగించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్లే వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ 5 మ్యాచ్ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం కైలియన్ ఎంబాపె 5 మ్యాచ్ల్లో ఏడు గోల్స్తో మెస్సీని అనుసరిస్తున్నాడు. ఎర్లింగ్ హాలండ్ (నార్వే), లామినే యమాల్ (స్పెయిన్)అన్నీ కుదిరితే 2022 ఫిఫాలో ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్లు ఈసారి సెమీస్ లేదా మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. మరోవైపు మాజీ చాంపియన్లు స్పెయిన్, ఇంగ్లండ్తో పాటు బెల్జియం తమ స్థాయి ఆటతీరుతో క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఇక ఎవరూ ఊహించని రీతిలో మొరాకో నార్వే, స్విట్జర్లాండ్ కూడా ప్రిక్వార్టర్స్లో అదరగొట్టి క్వార్టర్స్లో ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్ దశలో ఏ జట్టు ఎవరితో తలపడనుంది, ఏ సమయానికి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం.లుకాకు (బెల్జియం), హ్యారీకేన్ (ఇంగ్లండ్)క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్:👉ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో, జూలై 10, తెల్లవారుజామున 1.30 గంటలకు, వేదిక: బోస్టన్👉స్పెయిన్ వర్సెస్ బెల్జియం, జూలై 11, అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: లాస్ ఏంజెలెస్👉నార్వే వర్సెస్ ఇంగ్లండ్, జూలై 12, తెల్లవారుజామున 2.30 గంటలకు, వేదిక: మియామి స్టేడియం👉అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్, జూలై 12, ఉదయం 6.30 గంటలకు, వేదిక: కాన్సాస్ సిటీక్వార్టర్ ఫైనల్లో గెలిచిన నాలుగు జట్లు జూలై 15, 16వ తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్లో తలపడనున్నాయి. ఇక ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ జూలై 19 (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు జరగనుంది.Read: టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్కు ఇదే నా సవాల్’ -
టీమిండియాపై ఇంగ్లండ్ భారీ విజయం
నేడు ఇంగ్లండ్కు భారత్కు మధ్య జరిగిన మూడో టి20లో టీమిండియాపై 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి భారత భ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. జోష్ టంగ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్ రెండు, విల్ జాక్స్ ఒక వికెట్టు తీశారు. కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. భారత భ్యాట్స్మెన్స్లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. -
భారత్ కు సవాల్ బుడ్డాడు గెలిపిస్తాడా!
-
తొలి విజయం దక్కేనా!
నాటింగ్హామ్: టి20 ప్రపంచ చాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతోంది. ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్లలో ఓడి సిరీస్ కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్తో గత మ్యాచ్లో పరాజయం పాలైంది. శ్రేయస్ అయ్యర్ ఇంకా కెప్టెన్గా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో మరో పోరుకు భారత్ సిద్ధమైంది. నేడు ఇంగ్లండ్తో జరిగే మూడో టి20లోనైనా పైచేయి సాధించి ఈ టూర్లో తొలి విజయాన్ని అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. భారత బ్యాటింగ్కు సంబంధించి మరోసారి అభిõÙక్ శర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. అరంగేట్రంపై చర్చ ముగిసింది కాబట్టి ఇక వైభవ్ సూర్యవంశీ నుంచి అంచనాలకు తగినట్లుగా భారత్ ఒక చక్కటి ఇన్నింగ్స్ను ఆశిస్తోంది. ఇషాన్ కిషన్ తన వైఫల్యాల నుంచి బయటకు రావాల్సి ఉండగా... మిడిలార్డర్లో అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే చెలరేగడం అవసరం. ముఖ్యంగా కెపె్టన్ అయ్యర్ ఇంకా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్ విషయంలో ఒక మార్పు ఖాయమైంది. గత మ్యాచ్లో చెత్త ప్రదర్శనలో భారత్ ఓటమికి కారణంగా నిలిచిన లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో మరో పేసర్కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కాబట్టి ప్రిన్స్ యాదవ్ తుది జట్టులో రావచ్చు. అర్‡్షదీప్ విఫలమైనా.. మరో తగిన ప్రత్యామ్నాయం జట్టుకు లేదు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ పరిస్థితిని బట్టి ప్రభావం చూపించగలరు. ఇంగ్లండ్ మాత్రం గత మ్యాచ్లో ఆడిన టీమ్లో ఎలాంటి మార్పూ చేయకుండా ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ భారం ప్రధానంగా కెపె్టన్ బ్రూక్, బెతెల్లపై ఉంది. రెండో టి20లో బెతెల్ జోరు చూస్తే అతడిని నిలువరించడం అంత సులువు కాదని అర్థమవుతోంది. అయితే గత పోరులో డకౌటైన ఓపెనర్లు సాల్ట్, బట్లర్ ఈ సారి ఎలాంటి ప్రభావితం చూపిస్తారనేది ఆసక్తికరం.ఆ తర్వాత కూడా బ్యాటింగ్ ఆర్డర్లో బాంటన్, జాక్స్, స్యామ్ కరన్లతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్లు ఆర్చర్, టంగ్ భారత్ను ఎంత వరకు నిలువరిస్తారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ట్రెంట్బ్రిడ్జ్ మైదానం అటు బ్యాటింగ్కు, ఇటు బౌలింగ్లో సమంగా సహకరిస్తుంది. గత కొంత కాలంగా ఇక్కడి పిచ్పై భారీ స్కోర్లు నమోదు కాలేదు. మ్యాచ్ రోజున ఎలాంటి వర్షసూచన లేదు. -
బెల్లింగ్హామ్ డబుల్.. క్వార్టర్ ఫైనల్కు ఇంగ్లండ్
ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-16లో ఇంగ్లండ్ అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది. సహ ఆతిథ్య దేశమైన మెక్సికోపై 3-2తో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. స్టార్ మిడ్ఫీల్డర్ జూడ్ బెల్లింగ్హామ్ రెండు నిమిషాల్లో (36, 38) రెండు గోల్స్ చేసి జట్టుకు బలమైన పునాది వేయగా, కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా మరో గోల్ (60) సాధించాడు. రెండో అర్ధభాగంలో జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్తో బయటకు వెళ్లినా, ఇంగ్లండ్ పది మంది ఆటగాళ్లతో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంది.రెండు నిమిషాల్లో మ్యాచ్ను మార్చేసిన బెల్లింగ్హామ్మెక్సికో అభిమానుల హోరాహోరీ మద్దతు మధ్య ప్రారంభమైన ఈ నాకౌట్ పోరులో తొలి అర్ధభాగం వరకు ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి.36వ నిమిషంలో బెల్లింగ్హామ్ తొలి గోల్తో ఇంగ్లండ్కు ఆధిక్యం అందించాడు. ఆ గోల్కు కేవలం 98 సెకన్ల వ్యవధిలోనే మరోసారి గోల్ చేసి స్కోరును 2-0కు చేర్చాడు. అతని వేగవంతమైన డబుల్తో మెక్సికో ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది.వెనకడుగు వేయని మెక్సికోరెండు గోల్స్ వెనుకబడినా మెక్సికో ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. 42వ నిమిషంలో జూలియన్ క్విన్యోనెస్ గోల్ చేసి స్కోరును 2-1కు తగ్గించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి మ్యాచ్ మళ్లీ ఆసక్తికరంగా మారింది.కేన్ గోల్.. క్వాన్సా రెడ్ కార్డ్రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లండ్కు పెనాల్టీ లభించింది. 60వ నిమిషంలో కెప్టెన్ హ్యారీ కేన్ దాన్ని గోల్గా మలిచి జట్టుకు 3-1 ఆధిక్యం అందించాడు.అయితే మ్యాచ్ మలుపు తిరిగింది జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్తో. ప్రత్యర్థి దాడిని అడ్డుకునే క్రమంలో అతడు నేరుగా రెడ్ కార్డ్ అందుకోవడంతో ఇంగ్లండ్ పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ను కొనసాగించాల్సి వచ్చింది.చివరి వరకు ఉత్కంఠసంఖ్యా బలాన్ని ఉపయోగించుకుంటూ మెక్సికో వరుస దాడులు చేసింది. రౌల్ జిమెనెజ్ మరో గోల్ చేసి స్కోరును 3-2కు తీసుకువచ్చాడు. చివరి నిమిషాల్లో మెక్సికో సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, ఇంగ్లండ్ రక్షణ ఆటగాళ్లు అసాధారణ పోరాటాన్ని ప్రదిర్శించి మ్యాచ్ను కాపాడుకున్నారు.క్వార్టర్ ఫైనల్లో నార్వేతో పోరుఈ విజయంతో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. రౌండ్ ఆఫ్-16లో బ్రెజిల్ను ఓడించిన నార్వేతో త్రీ లయన్స్ తలపడనున్నాయి. హాలాండ్ సారథ్యంలోని నార్వేను ఎదుర్కోవడం ఇంగ్లండ్కు కఠిన సవాలుగా మారనుంది. -
ఇంగ్లండ్ X ఆ్రస్టేలియా
లండన్: మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య... లార్డ్స్ వేదికగా నేడు తుదిపోరు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టి20 ప్రపంచకప్లలో ఆ్రస్టేలియా ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) చాంపియన్గా నిలవగా... 2009 ఆరంభ సీజన్లో ట్రోఫీ చేజిక్కించుకున్న ఇంగ్లండ్ రెండో కప్పు కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఈ మధ్యలో మూడుసార్లు (2012, 2014, 2018) ఫైనల్కు చేరిన ఇంగ్లండ్... ఆసీస్ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ సారి సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటంతో అభిమానుల మద్దతుతో ముందంజ వేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. గ్రూప్–1లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా... సెమీఫైనల్లో వెస్టిండీస్ను చిత్తుచేయగా... గ్రూప్–2లో ఐదు విజయాలు సాధించిన ఇంగ్లండ్... సెమీస్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. మూనీ, వాల్, లిచ్ఫీల్డ్, గార్డ్నర్, సదర్లాండ్తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. బౌలింగ్లో కెప్టెన్ మొలినెక్స్, గార్త్, అలానా కింగ్ కీలకం కానున్నారు. మరోవైపు కెప్టెన్ సీవర్ బ్రంట్, వ్యాట్, జోన్స్, నైట్, కాప్సీతో ఇంగ్లండ్ బ్యాటింగ్ కూడా శత్రుదుర్బేధ్యంగా ఉంది. ఎకిల్స్టోన్, కెంప్, లిన్సే బౌలింగ్ను కంగారూలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పిచ్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు. -
ఇంగ్లాండ్ తో పోరుకు సిద్ధమైన భారత్
-
వైభవ్కు చాన్స్ దక్కేనా!
మాంచెస్టర్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఇంకా గెలుపు బోణీ చేయని భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే రెండో టి20లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. వర్షంతో రద్దయిన గత మ్యాచ్లో భారత్ 189 పరుగులు చేసినా... ఇంకా అంచనాలకు తగిన రీతిలో ఆడలేదనేది వాస్తవం. ఆరంభంలో జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సామ్సన్, ఇషాన్ కిషన్ వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమయ్యారు. అయినా సరే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారత్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చంటూ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీమ్ మేనేజ్మెంట్ వైభవ్ విషయంలో నిర్ణయం తీసుకోలేదని అర్థమవుతోంది. అయితే నాయకుడిగా వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ కెపె్టన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయిన స్థితిని బట్టి చూస్తే సామ్సన్ ఇంకా ఎంతో కాలం తన వరల్డ్ కప్ మెరుపులతోనే జట్టులో కొనసాగలేడు. కాబట్టి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను నిలిచాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు సానుకూలాంశం. ఇంగ్లండ్పై ఆడిన గత ఏడు మ్యాచ్లలో 220 స్ట్రయిక్రేట్తో అభిషేక్ శర్మ 3 అర్ధసెంచరీలు చేయడం ఈ జట్టుపై అతని జోరుకు ఉదాహరణ. కెపె్టన్ శ్రేయస్ అర్ధ సెంచరీ చేసినా అతని బ్యాటింగ్లో తగిన ధాటి కనిపించలేదు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత తనదంటూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని తిలక్ వర్మపై రాణించాల్సిన ఒత్తిడి ఉందనేది వాస్తవం. గత మ్యాచ్లో ఎవరికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కాబట్టి బౌలర్ల బృందంలోనూ ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.మరోవైపు ఆర్చర్ రాకతో ఇంగ్లండ్ పేస్ పదును పెరిగింది. జోష్ టంగ్ కూడా ఈ మ్యాచ్తో టి20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. మహమూద్, ల్యూక్వుడ్ స్థానాల్లో వీరిద్దరు బరిలోకి దిగుతారు. బట్లర్, బ్రూక్, బెతెల్, జాక్స్లతో పదునైన బ్యాటింగ్ లైనప్ జట్టు సొంతం. ఫిల్ సాల్ట్ తన సొంత స్టేడియంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఓల్డ్ట్రఫోర్డ్ మైదానంలో అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా బాగా ప్రభావం చూపగలరు. అయితే మంచి బౌన్స్తో చక్కటి షాట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. గత ఏడాది ఇక్కడి పిచ్పై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో ఇంగ్లండ్ 300కు పైగా స్కోరు నమోదు చేసింది. -
ప్రాక్టీస్ మొదలు పెట్టిన కోహ్లి.. ఇంగ్లాండ్ కు వణుకుపుట్టేలా చేస్తున్న వీడియో
-
నేడు ప్రపంచకప్ రెండో సెమీఫైనల్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జులై 2) రెండో సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్.. అండర్ డాగ్ సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.జట్ల వివరాలు..ఇంగ్లండ్: నాట్ స్కివర్-బ్రంట్ (సి), లారెన్ బెల్, అలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్స్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్, లిన్సే స్మిత్, ఇస్సీ వాంగ్, డానీ వ్యాట్-హాడ్జ్సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (సి), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజాన్నె కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనెక్, టుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్, డేన్ వాన్ నికెర్క్పిచ్ వివరాలుకెన్నింగ్టన్ ఓవల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండవచ్చు. ఇక్కడ నిలకడగా బౌన్స్కు అవకాశం ఉంటుంది. ఇక్కడ స్ట్రయిట్ బౌండరీలు చిన్నగా ఉంటాయి. స్క్వేర్ బౌండరీలు కాస్త పెద్దగా ఉంటాయి. ఈ దశలో షాట్లు ఆడితే వికెట్ల మధ్య పరుగెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వేదికపై ఛేజింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు. -
అభిషేక్, దూబే మెరుపులు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్తో తొలి టి20 మ్యాచ్లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఐర్లాండ్ చేతిలో రెండు టి20ల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయిన టీమ్... ఇంగ్లండ్తో పోరును సాధికారికంగా మొదలు పెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా...శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) చివర్లో భారీ షాట్లు ఆడాడు. అభిషేక్, అయ్యర్ మూడో వికెట్కు 38 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ మహమూద్కు 3 వికెట్లు దక్కాయి. మ్యాచ్ రద్దుఇంగ్లండ్ ఛేదన సమయానికి భారీ వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. కీలక భాగస్వామ్యం... భారత తుది జట్టులో టీనేజర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కలేదు. సంజు సామ్సన్ (1) వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలం కాగా, ఇషాన్ కిషన్ (0) మళ్లీ రనౌట్ కావడంతో 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్, అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అభిషేక్ తనదైన శైలిలో ధాటిగా చెలరేగగా, కెప్టెన్గా తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన అయ్యర్ ఈ సారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. డాసన్ ఓవర్లో సిక్స్ కొట్టిన అభిషేక్ మహమూద్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ల్యూక్వుడ్ ఓవర్లోనూ వరుసగా 3 ఫోర్లు కొట్టిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ అవుటైన తర్వాత భారత్ జోరును నిలువరించడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 87/2 కాగా...తర్వాతి 6 ఓవర్లలో జట్టు 38 పరుగులే చేయగలిగింది. తిలక్వర్మ (13) ప్రభావం చూపలేకపోగా, 38 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయ్యర్ వెనుదిరిగాక దూబే దూకుడుతో భారత్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. రషీద్ బౌలింగ్లో అతను కొట్టిన 2 సిక్స్లు హైలైట్గా నిలిచాయి.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బాంటన్ (బి) మహమూద్ 1; అభిషేక్ (ఎల్బీ) (బి) కరన్ 59; ఇషాన్ కిషన్ (రనౌట్) 0; అయ్యర్ (ఎల్బీ) (బి) మహమూద్ 68; తిలక్ (సి) డాసన్ (బి) మహమూద్ 13; దూబే (నాటౌట్) 42; హర్షిత్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 0; అక్షర్ (రనౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–88, 4–124, 5–165, 6–174, 7–189. బౌలింగ్: ల్యూక్వుడ్ 3–0–35–0, మహమూద్ 4–0–33–3, డాసన్ 3–0–26–0, జాక్స్ 3–0–30–0, రషీద్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–25–1. -
ఇంగ్లండ్... రెండో ఇల్లులాంటిది
న్యూఢిల్లీ: ఆ్రస్టేలియా పిచ్లపై అసమాన ప్రదర్శన కనబర్చినప్పటికీ... తనకు ఇంగ్లండ్లో ఆడుతున్నప్పుడు రెండో ఇంట్లో ఉన్న భావన కలుగుతుందని టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. టీమిండియా తరఫున 103 మ్యాచ్లాడిన పుజారా... మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో శాశ్వత సభ్యత్వం దక్కించుకున్నాడు. భారత జట్టు తరఫున మూడు పర్యాయాలు ఇంగ్లండ్లో పర్యటించిన పుజారా... కౌంటీ క్రికెట్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా టెస్టు సిరీస్లు ఆడని సమయంలో ఎక్కువ శాతం కౌంటీల్లోనే ఆడిన చతేశ్వర్... ఇంగ్లండ్పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నాడు. ‘బ్రిటన్లో చాలాకాలం పాటు కౌంటీ క్రికెట్ ఆడాను. ఎక్కువ రోజులు ఆడినప్పుడు మన ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఎంసీసీలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావవిస్తున్నా. ఈ సభ్యత్వం లభించడం చాలా గొప్ప విషయం. ఒక ప్లేయర్గా కెరీర్ మొత్తం కష్టపడి పనిచేసినప్పుడు దానికి తగిన గుర్తింపు లభించినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకమైనది’ అని పుజారా పేర్కొన్నాడు. లార్డ్స్ ఎంతో ప్రత్యేకం... ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన పుజారా... టీమిండియా తరఫున ఇక్కడ శతకం నమోదు చేయలేకపోయాడు. అయితే కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ తరఫున ఈ మైదానంలో పుజారా డబుల్ సెంచరీ బాదాడు. ‘కెరీర్ ఆరంభంలో లార్డ్స్లో మ్యాచ్ చూస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది 2011లో ఒకసారి శస్త్రచికిత్స కోసం లండన్కు వచ్చా. అప్పుడు తొలిసారి లార్డ్స్లో అడుగుపెట్టా. ఇదో ప్రత్యేక ప్రదేశంగా అనిపించింది. అలాంటి చోట ఎంసీసీ శాశ్వత సభ్యత్వం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఎన్నో మైదానాల్లో మ్యాచ్లు ఆడాను. కానీ లార్డ్స్ మాత్రం వేరు. ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా లార్డ్స్ బాల్కానీకి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్నో ఏళ్లుగా అది అలాగే ఉంది. లార్డ్స్ మైదానంలో లాంగ్ రూమ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కలిగే భావన మాటల్లో చెప్పలేను. మీరు ఏ జట్టు ప్లేయర్ అనేదానితో సంబంధం లేకుండా మీ ప్రదర్శనకు ఇక్కడ ప్రశంసలు దక్కుతాయి. లార్డ్స్ పిచ్ టెస్టు క్రికెటర్లకు అసలైన పరీక్ష పెడుతుంది. ముందు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి... ఒక్కసారి పిచ్ను అర్థం చేసుకొని ముందుకు సాగితే... ఇక్కడ బ్యాటింగ్ను ఎంతగానో ఆస్వాదించవచ్చు. లార్డ్స్ బోర్డుపై తమ పేరు చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంతో అదనపు ఒత్తిడి సహజం. నా కెరీర్లో ఏదైనా వెలితి ఉండిపోయిందంటే అది లార్డ్స్ బోర్డులో సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో నా పేరు లేకపోవడమే’ అని పుజారా చెప్పుకొచ్చాడు. ఆ్రస్టేలియాలో బ్యాటింగ్ సులువే... ఆ్రస్టేలియా పిచ్లపై పరుగులు వరద పారించి రికార్డులు సృష్టించిన పుజారా... ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ మైదానంలో మాత్రమే సెంచరీ చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ బ్యాటింగ్ చేయడాన్ని కూడా ఆస్వాదిస్తా. ఎందుకటే ఒక్కసారి కుదురుకుంటే ఆసీస్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం సులువే. అదే ఇంగ్లండ్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు పరీక్షిస్తుంటాయి. ఇంగ్లండ్ పిచ్లు కాస్త భిన్నమైనవి. వాటిని ముందు అర్థం చేసుకోగలగాలి’ అని పుజారా వివరించాడు. ఇంగ్లండ్లో తాను ఎదుర్కొన్న బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రత్యేకమైన వాళ్లని పుజారా అన్నాడు. -
హ్యారికేన్ విధ్వంసం.. ప్రిక్వార్టర్స్లో ఇంగ్లండ్
ఫిఫా ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 2-1 తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారికేన్ డబుల్ గోల్స్ (75, 86వ నిమిషం) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కాంగో తరఫున 7వ నిమిషంలో బ్రియాన్ సిపెంగా గోల్ కొట్టాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్పై కాంగో ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. మ్యాచ్ మొదలైన కాసేపటికే కాంగో తరఫున బ్రియాన్ గోల్ చేయడం ఇంగ్లండ్ జట్టును షాక్కు గురి చేసింది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లండ్ గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలోనూ మూడో క్వార్టర్ వరకు ఇంగ్లండ్ గోల్ చేయకపోవడం గమనార్హం. ఇక ఓటమి తప్పదనుకున్న దశలో హ్యారికేన్ విజృంభించాడు. తనలోని విన్యాసాలను బయటకు తీసిన హ్యారికేన్ 75వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరో 11 నిమిషాల వ్యవధిలో రెండో గోల్ కొట్టి ఇంగ్లండ్ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. తద్వారా నిర్ణీత సమయంలో కాంగో మరో గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్కు చేరుకుంది.ఇక హ్యారికేన్ టోర్నీలో ఐదు గోల్స్ కొట్టడం ద్వారా గోల్డెన్ బూట్ రేసులో కొనసాగుతున్నాడు. మెస్సీ, ఎంబాపె చెరో ఆరు గోల్స్తో సంయుక్తంగా ఉండగా, హాలండ్, హ్యారికేన్లు చెరో 5 గోల్స్తో రెండో స్థానంలో ఉన్నారు.🌎🏴 ENGLAND BEAT RD CONGO AND FLY TO WORLD CUP ROUND 16!Brace for Harry Kane beating Pele’s goals record with 12 👑Proud Congo performance once again 👏🏽🇨🇩 pic.twitter.com/4GALURPta8— Fabrizio Romano (@FabrizioRomano) July 1, 2026 -
నేటి నుంచే భారత్-ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్
ఐర్లాండ్తో టీ20 సిరీస్ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా.. ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ పర్యటనలో వైట్బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారల వివరాలను ఇక్కడ చూద్దాం.ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ లివ్, జియో హాట్స్టార్లో స్ట్రిమింగ్ జరుగనుంది.పూర్తి షెడ్యూల్జులై 1: తొలి టీ20- రివర్సైడ్ గ్రౌండ్, చెస్టర్ లీ స్ట్రీట్ రా. 10:00 గంటలకు)జులై 4: రెండో టీ20 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (సా. 7:00 గంటలకు)జులై 7: మూడో టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ (రా. 10:00 గంటలకు)జులై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్ (రా. 10:00 గంటలకు)జులై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్ (సా. 7:00 గంటలకు)వన్డే సిరీస్జులై 14: తొలి వన్డే – ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ (సా. 5:30 గంటలకు)జులై 16: రెండో వన్డే – కార్డిఫ్ (సా. 5:30 గంటలకు)జులై 19: మూడో వన్డే – లార్డ్స్, లండన్ (మ. 3:30 గంటలకు)జట్లు..భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), ష్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ఇంగ్లండ్ వన్డే జట్టును ప్రకటించాల్సి ఉందిప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్-ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్ల ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో అందుబాటులో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ను సోనీ లివ్, జియో హాట్స్టార్ యాప్లలో వీక్షించవచ్చు. -
గెలుపు బాట పడతారా!
మూడు రోజుల క్రితం బెల్ఫాస్ట్లో వరుసగా రెండు ఓటముల పరాభవం... ఆ తర్వాత మూడున్నర గంటల ప్రయాణం తర్వాత మారిన దేశం, మారిన వేదిక, మారిన ప్రత్యర్థి... ఇక్కడైనా భారత జట్టు రాత మారుతుందా... గత సిరీస్లోని ప్రత్యర్థితో పోలిస్తే మరింత బలమైన జట్టు ఎదురుగా ఉండగా టీమిండియా గెలుపు బాట పడుతుందా అనేదే ప్రశ్న... సొంతగడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ను నిలువరించి భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఎలాంటి ఫలితం రాబడుతుందనేది ఆసక్తికరం.చెస్టర్ లీ స్ట్రీట్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టి20 మ్యాచ్ల సిరీస్కు ఈరోజు తెర లేవనుంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్ల తలపడనున్నాయి. ఐర్లాండ్ చేతిలో 0–2తో సిరీస్ ఓడిన భారత్ ఇక్కడైనా సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ సహా పలువురు కీలక ఆటగాళ్లు సోమవారం కివీస్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత తక్కువ వ్యవధిలో టి20 సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై ఆడుతున్న ప్రత్యరి్థతో పోలిస్తే భారత్పై తీవ్ర ఒత్తిడి ఉంది. దాదాపు ఐర్లాండ్ తరహాలోనే ఇక్కడి రివర్సైడ్ గ్రౌండ్ పిచ్ ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమానంగా అనుకూలిస్తుంది. శ్రేయస్ అయ్యర్కు కీలకంఐర్లాండ్ చేతిలో ఓడిన తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులు, విశ్లేషకుల నుంచి ఒకే ప్రశ్న ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని ఆడించే ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో అని అంతా అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే వైభవ్తో మాత్రమే పరిష్కారం లభించేలా లేదు. రెండు మ్యాచ్లలోనూ విఫలమైన సామ్సన్, ఇషాన్ కిషన్లలో ఒకరిని పక్కన పెట్టి ముందుగా వైభవ్ను ఆడిస్తారా అనేది చర్చనీయాంశం. ఒకవేళ అతను బరిలోకి దిగినా... ఇతర బ్యాటర్లు కూడా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్లో తొలి బంతికే అవుటైన అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ కూడా ధాటిని ప్రదర్శించాలి. శివమ్ దూబే చాలా కాలంగా బ్యాటింగ్లో ప్రభావం చూపించడం లేదు. గత టి20లో ఆడిన సూర్యాంశ్కు మరో అవకాశం ఇస్తారా చూడాలి. అయితే వరుణ్ చక్రవర్తి రాకతో స్పిన్ బలం కాస్త పెరిగింది. పేసర్ ప్రిన్స్ యాదవ్ను తప్పించి వరుణ్ను ఆడించడం దాదాపు ఖాయం. అన్నింటికి మించి ఈ సిరీస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కీలకం కానుంది. రెండేళ్ల తర్వాత టి20 టీమ్లోకి అదీ సారథిగా అవకాశం దక్కించుకున్న అతను అటు బ్యాటర్గా, ఇటు నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. మున్ముందు తీవ్ర విమర్శల నుంచి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్లో అతను చాలా ప్రభావం చూపించాల్సి ఉంటుంది. బట్లర్పై దృష్టి... టి20 ప్రపంచకప్కు ముందు భారత్తో తలపడిన టి20 సిరీస్లో ఇంగ్లండ్ 1–4తో చిత్తుగా ఓడింది. ఇప్పుడు దానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ భావిస్తోంది. ఈ సిరీస్లో, ఆ తర్వాత వరల్డ్కప్లోనూ విఫలమైనా... బట్లర్ తన స్థానం నిలబెట్టుకున్నాడు. అతని కెరీర్ భవిష్యత్తుకు సంబంధించి ఇది కీలక సిరీస్ కానుంది. టెస్టు మ్యాచ్ తర్వాత ఎలాంటి సాధన లేకుండా నేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన కెప్టెన్ ఎలా ఆడతాడనేది చూడాలి. పేసర్ ఆర్చర్కు కూడా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి లభించింది. అయితే విధ్వంసక బ్యాటర్లు సాల్ట్, జాక్స్, బెతెల్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. ఆల్రౌండర్ స్యామ్ కరన్ కీలకం కాగా... ప్రధాన స్పిన్నర్గా ఆదిల్ రషీద్పై జట్టు ఆధారపడుతోంది.80 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మొత్తం టి20 మ్యాచ్లు. 18 మ్యాచ్ల్లో భారత్... 12 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఇంగ్లండ్లో ఈ రెండు జట్లు 9 టి20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 4 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. -
న్యూజిలాండ్ సిరీస్ విజయం
నాటింగ్హామ్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన న్యూజిలాండ్ తమ టెస్టు క్రికెట్లో మరో అరుదైన ఘనతను సాధించింది. సోమవారం మగిసిన మూడో టెస్టులో టామ్ లాథమ్ సారథ్యంలోని కివీస్ 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 టెస్టుల సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 103/4తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సోమవారం 36.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 109 పరుగులే జత చేసి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ (60) అర్ధసెంచరీ సాధించగా...ఇతర ప్రధాన బ్యాటర్లు రూట్ (18), ఎమీలియో గే (10) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో ఫోక్స్ 3 వికెట్లు పడగొట్టగా ...సాంట్నర్, స్మిత్ చెరో 2 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ గడ్డపై న్యూజి లాండ్ టెస్టు సిరీస్ గెలవడం ఇది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1986, 1999, 2021లలో ఇక్కడ సిరీస్ విజేతగా నిలిచింది. బెన్ స్టోక్స్ రిటైర్... దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఆటకు గుడ్బై చెప్పాడు. ఇంతకుముందే టి20లు, వన్డేల నుంచి తప్పుకున్న 35 ఏళ్ల స్టోక్స్ ఇప్పుడు టెస్టు క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. గత ఏడాది కాలంలో జట్టుకు వరుస పరాజయాలు, తన పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణాచర్యలు ఎదుర్కోవడంతో అతను ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. 122 టెస్టుల్లో 7273 పరుగులు చేయడంతో పాటు 252 వికెట్లు కూడా తీసిన స్టోక్స్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సారథ్యంలో 44 టెస్టులు ఆడిన ఇంగ్లండ్... 24 గెలిచి, 18 మ్యాచ్ల్లో ఓడింది. దక్షిణాఫ్రికాపై ఆడిన 258 పరుగుల ఇన్నింగ్స్, ఆ్రస్టేలియాపై హెడింగ్లీ మైదానంలో అసాధారణంగా ఆడి గెలిపించిన 135 నాటౌట్ ఇన్నింగ్స్ అతని బ్యాటింగ్ కెరీర్లో హైలైట్గా నిలిచాయి. -
స్టోక్స్ కెరీర్లో ఆణిముత్యాలు
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ నిన్న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ తరఫున దశాబ్దన్నర కాలంపాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటిన అతడి కెరీర్లో ఎన్నో చారిత్రక క్షణాలు ఉన్నాయి. స్టోక్స్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి కెరీర్లో ఆణిముత్యాలపై ఓ లుక్కేద్దాం.5) వెస్టిండీస్పై 2020లో ఆల్రౌండ్ షోవెస్టిండీస్తో జరిగిన టెస్ట్లో స్టోక్స్ 176 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు 8 గంటలు క్రీజ్లో నిలిచి ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం అందించాడు. రెండో ఇన్నింగ్స్లో 78* (57 బంతుల్లో) వేగంగా ఆడి మ్యాచ్ను డిక్లేర్ చేయించాడు. బౌలింగ్లో కూడా 3 వికెట్లు తీశాడు. మొత్తం ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.4) సౌతాఫ్రికాపై 2016లో 258-రన్ భాగస్వామ్యంకేప్ టౌన్ టెస్ట్లో స్టోక్స్ 198 బంతుల్లో 258 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది టెస్ట్ క్రికెట్లో అత్యంత విధ్వంసకర డబుల్ సెంచరీల్లో ఒకటి. ఆ మ్యాచ్లో అతడు జానీ బెయర్స్టోతో కలిసి 399 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.3) టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్పాకిస్థాన్పై 138 లక్ష్య ఛేదనలో స్టోక్స్ (52* పరుగులతో) ఇంగ్లండ్ను విజేతగా నిలిపాడు. ఆ మ్యాచ్లో స్టోక్స్ పాటించిన సంయమనం ఇంగ్లండ్ను పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిపింది.2) యాషెస్ 2023లో 155 vs ఆస్ట్రేలియాలార్డ్స్లో 371 లక్ష్య ఛేదనలో స్టోక్స్ 155 పరుగుల ఒంటరి పోరాటం చేశాడు. 9 ఫోర్లు, 9 సిక్సులతో ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని ఎదుర్కొన్నా, ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓడింది. కానీ ఆ ఇన్నింగ్స్ స్టోక్స్ కెరీర్ అత్యుత్తమాల్లో ఒకటిగా నిలిచింది.1) హెడింగ్లీ 2019 – 135* vs ఆస్ట్రేలియాఇది స్టోక్స్ కెరీర్లోనే అత్యంత ఐకానిక్ ఇన్నింగ్స్గా చెప్పబడుతోంది. ఆ మ్యాచ్లో 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 286 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో ఉండింది. అయితే స్టోక్స్ జాక్ లీచ్తో కలిసి ఒంటరిపోరాటం (135 నాటౌట్; 8 సిక్సులు, 11 ఫోర్లు) చేసి ఇంగ్లండ్కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమైన వాటిలో ఒకటిగా నిలిచింది. -
ఇంగ్లండ్ వరల్డ్కప్ హీరో సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ విజేత (2019) లియామ్ ప్లంకెట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత మరో క్రీడలో కెరీర్ ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 41 ఏళ్ల ప్లంకెట్ అమెరికాలోని ఓక్ల్యాండ్ బాలర్స్ తరఫున ప్రొఫెషనల్ బేస్బాల్లో అరంగేట్రం చేశాడు. తద్వారా ప్రొఫెషనల్ బేస్బాల్ ఆడిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.2021లో క్రికెట్కు వీడ్కోలు పలికిన ప్లంకెట్, అమెరికన్ మహిళను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో ఆటగాడిగా, కోచ్గా సేవలందించాడు.తాజాగా పయనీర్ బేస్బాల్ లీగ్లోని ఓక్ల్యాండ్ బాలర్స్ జట్టు ప్రత్యేక "మార్కెటింగ్ ప్లేయర్" నిబంధన కింద ప్లంకెట్ను ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలర్గా ఉన్న అనుభవం కారణంగా బేస్బాల్లో పిచ్చర్ పాత్రకు అతడు సులభంగా అలవాటు పడ్డాడు.2019 వరల్డ్కప్ హీరో2005లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్లంకెట్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 89 వన్డేలు, 22 టీ20లు ఆడి 130కిపైగా వికెట్లు తీశాడు. 2019 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ వికెట్లు తీసి ఇంగ్లండ్ తొలి ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఇతర క్రీడల్లోకి వెళ్లిన పలువురు క్రికెటర్లుఆండ్రూ ఫ్లింటాఫ్ – ప్రొఫెషనల్ బాక్సింగ్నాథన్ ఆస్టిల్ – మోటార్ స్పోర్ట్స్ఆడమ్ హోలియోక్ – మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), బాక్సింగ్ -
శతక్కొట్టిన డకెట్.. కివీస్కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
నాటింగ్హమ్లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుంది. తొలి రోజు 317/0తో బలంగా కనిపించిన న్యూజిలాండ్ను రెండో రోజు ఇంగ్లండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని 438 పరుగులకు ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్లోనూ దూకుడు చూపిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 215 పరుగులు వెనుకబడి ఉంది.స్టోక్స్ అద్భుత స్పెల్రెండో రోజు తొలి సెషన్లో వికెట్ కోసం ఇబ్బంది పడిన ఇంగ్లండ్కు కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్రేక్ ఇచ్చాడు. ఎనిమిది ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. మొత్తంగా 4 వికెట్లతో మెరిశాడు. మిగతా బౌలర్లలో షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్ తలో రెండు.. రూట్, అట్కిన్సన్ చెరో వికెట్ తీశారు. 361/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన కివీస్ చివరి ఆరు వికెట్లను కేవలం 77 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.డకెట్ దూకుడుఅతి భారీ స్కోర్ చేయకుండా న్యూజిలాండ్ను కట్టడి చేసిన ఆనందంలో ఉన్న ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఎమిలియో గే డకౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో బెన్ డకెట్, జేకబ్ బేతెల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. డకెట్ 113 పరుగులతో అద్భుత సెంచరీ సాధించగా, బేతెల్ 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 179 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ను పటిష్ట స్థితిలో నిలిపారు. బేతెల్కు జతగా జో రూట్ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు.డకెట్కు ఊరటనిచ్చిన సెంచరీగత 14 టెస్టు ఇన్నింగ్స్లుగా అర్ధసెంచరీ కూడా చేయలేకపోయిన డకెట్కు ఈ శతకం ఎంతో ప్రత్యేకం. గతేడాది జూన్ తర్వాత ఇదే అతని తొలి టెస్టు సెంచరీ. కేవలం 88 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన డకెట్కు ఇది టెస్టుల్లో సంయుక్తంగా అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా.స్కోర్ వివరాలు..న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (డెవాన్ కాన్వే 157, టామ్ లాథమ్ 151)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 223/2 (బెన్ డకెట్ 113, జాకబ్ బెతెల్ 74*, జో రూట్ 21*)ఇంగ్లండ్ ఇంకా 215 పరుగులు వెనుకబడి ఉంది.కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ గెలవగా.. న్యూజిలాండ్ రెండో టెస్ట్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
‘వైభవ్ కోసం ఎదురు చూస్తున్నారు’
బెల్ఫాస్టట్: భారత్, ఇంగ్లండ్ మధ్య రేపు తొలి టి20 మ్యాచ్ సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ (స్టోర్మోంట్)లో జరగనుంది. ఈ మైదానం సామర్థ్యం దాదాపు 7 వేలు మాత్రమే! అయితే సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో తాత్కాలిక ఏర్పాట్లతోనైనా సీట్ల సంఖ్యను పెంచాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. వైభవ్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తే అది కొత్త చరిత్ర అవుతుందని భారత్–ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎంవీ నరసింహారావు (బాబ్జీ) అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో వైభవ్ గురించే చర్చ సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘బెల్ఫాస్ట్లో వైభవ్ మేనియా మొదలైంది. అతను తొలి మ్యాచ్ బరిలోకి దిగితే కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఇంతటి ఆసక్తిని మేం ఊహించలేదు. గత కొద్ది రోజులుగా మ్యాచ్ గురించి చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. యూరోప్లోని పారిస్ తదితర ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది మ్యాచ్ను చూడాలని భావిస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేయడం నిర్వాహకుల బాధ్యత. అయితే మ్యాచ్ జరిగే స్టేడియం సామర్థ్యం 7 వేలు మాత్రమే. చాలా మంది టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కాబట్టి ఏదో రకంగా అదనపు సీట్లు ఏర్పాటు చేయాల్సిందే’ అని నరసింహారావు అన్నారు. వైభవ్ ఆటపై ప్రశంసలు కురిపించిన ఆయన... ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘వైభవ్ అద్భుతమైన బ్యాటర్. ఐపీఎల్లో అతను ప్రదర్శనను చూశాను. కాస్త నెమ్మదిగా ఉండే ఐర్లాండ్ పిచ్లపై కూడా అతను ప్రభావం చూపించగలడు. అయితే బంతి బాగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్లో అతనికి అసలు సవాల్ ఎదురవుతుంది. అతని కొన్ని షాట్లు చూస్తే గ్యారీ సోబర్స్ను కూడా గుర్తుకు తెస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అన్ని రకాల షాట్లు ఆడగలుగుతున్నాడు. ఆ ప్రతిభ దేవుడు ఇచ్చిన బహుమతి. సచిన్ టెండూల్కర్ తరహాలోనే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాలతో పాటు తీవ్ర సాధన, ఫిట్నెస్, క్రమశిక్షణను కొనసాగించాలనేది నా సలహా’ అని నరసింహారావు సూచించారు. మైదానంలో గంట మోగించనున్న ‘బాబ్జీ’... సన్నిహితుల ద్వారా ‘బాబ్జీ’గా గుర్తింపు పొందిన హైదరాబాద్ క్రికెటర్ ఎంవీ నరసింహారావు 1978–79లో భారత్ తరఫున 4 టెస్టులు ఆడారు. అయితే ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆయనకు మంచి రికార్డు ఉంది. 108 మ్యాచ్లలో 9 సెంచరీలు సహా 4845 పరుగులు చేసిన బాబ్జీ...లెగ్స్పిన్నర్గా 245 వికెట్లు కూడా పడగొట్టారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1986–87 సీజన్లో హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. బాబ్జీ కెప్టెన్సీలోనే జట్టు ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ మళ్లీ రంజీ టైటిల్ గెలవలేకపోయింది. హైదరాబాద్లో తొలి క్రికెట్ కోచింగ్ అకాడమీ (సెయింట్ జాన్స్) పెట్టి వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్లాంటి స్టార్ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఐర్లాండ్కు వెళ్లి అక్కడే స్థిరపడిన నరసింహారావు ఆ దేశం తరఫున కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. అక్కడే కోచ్గా పలువురు ఐర్లాండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, కెవిన్ ఓబ్రైన్, పోర్టర్ఫీల్డ్, బల్బర్నీలను తీర్చిదిద్దడంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. ఈ సేవలకుగాను ఐర్లాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎంబీఈ పురస్కారంతో సత్కరించింది. ఈ నెల 28న భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్కు ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గంట (రాయ్ టారెన్స్ బెల్)ను బాబ్జీ మోగించనున్నారు. ఇరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. -
కొలంబియా ముందుకు...
గ్వాడలహారా (మెక్సికో): ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయకుండా ఆడిన కొలంబియా జట్టు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘కె’లో భాగంగా కాంగో జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 76వ నిమిషంలో డేనియల్ మునోజ్ ఏకైక గోల్ చేసి కొలంబియా జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో కొలంబియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పటిష్టమైన పోర్చుగల్ జట్టును తొలి మ్యాచ్లో 1–1తో నిలువరించిన కాంగో జట్టు ఈ మ్యాచ్లోనూ కొలంబియాకు గట్టిపోటీ ఇచ్చింది. తొలి 20 నిమిషాల్లో కొలంబియా ఐదుసార్లు గోల్ చేసేందుకు అవకాశాలు సృష్టించుకున్నా కాంగో గోల్కీపర్ లియోనెల్ ఎంపాసి అడ్డుగోడలా నిలబడ్డాడు. ఎట్టకేలకు 76వ నిమిషంలో కొలంబియా ఖాతా తెరిచింది. యువాన్ క్వింటెరో అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో అడ్డుకోవడంలో కాంగో డిఫెండర్లు విఫలమయ్యారు. అక్కడే ఉన్న మునోజ్ కాంగో గోల్కీపర్కు అవకాశం ఇవ్వకుండా బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. 52 ఏళ్ల తర్వాత ప్రపంచకప్లో మళ్లీ ఆడుతున్న కాంగో జట్టుకు ఈ ఓటమితో నాకౌట్ దశ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఘనా 0–0 ఇంగ్లండ్ బోస్టన్: గత నాలుగు ప్రపంచకప్లలో ఘనా జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్లో ఓడిపోలేదు. అదే రికార్డును ఐదో ప్రపంచకప్లోనూ కొనసాగించింది. గ్రూప్ ‘ఎల్’లో భాగంగా మాజీ చాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ను ఘనా 0–0తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్తో సహా ఇతర ఆటగాళ్లు 19 సార్లు ఘనా గోల్పోస్ట్ లక్ష్యంగా షాట్లు సంధించినా గోల్ మాత్రం చేయలేకపోయారు. మరోవైపు ఘనా జట్టు రక్షణాత్మక ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆ జట్టు రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్పోస్ట్పై దాడులు చేసింది. తమ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 4–2తో క్రొయేషియాపై, ఘనా 1–0తో పనామాపై గెలిచాయి. ప్రస్తుతం ఇంగ్లండ్, ఘనా జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.గెలిచి నిలిచిన క్రొయేషియాటొరంటో: గత రెండు ప్రపంచకప్లలో సెమీఫైనల్ చేరిన క్రొయేషియా జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్ ‘ఎల్’లో భాగంగా పనామా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో క్రొయేషియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 54వ నిమిషంలో కుడి వైపు నుంచి జోసిప్ స్టానిసిక్ అందించిన క్రాస్ పాస్ను ‘డి’ ఏరియా లోపల యాంటె బుడిమిర్ లక్ష్యానికి చేర్చాడు. ఈ విజయంతో క్రొయేషియా మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాకౌట్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. -
సిరీస్ డిసైడర్కు ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్
ఇంగ్లండ్తో సిరీస్ డిసైడర్ టెస్ట్ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ కైల్ జేమీసన్ ఈ మ్యాచ్కు దూరం కానున్నాడని తెలుస్తోంది. జేమీసన్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతున్నాడు.అతడి పనిభారాన్ని నియంత్రించేందుకు జట్టు యాజమాన్యం ముందుగానే మూడో టెస్ట్కు విశ్రాంతినివ్వాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ ఇదివరకే వెల్లడించాడు.జేమీసన్ ఈ సిరీస్లో న్యూజిలాండ్కు కీలక బౌలర్గా నిలిచాడు. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి, మ్యాచ్ మొత్తం ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ, అతడి బౌలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తర్వాత ఓవల్లో జరిగిన రెండో టెస్టులో కూడా అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ 253 పరుగుల భారీ విజయానికి బాటలు వేశాడు. రెండు టెస్టుల్లో మొత్తం 10 వికెట్లు తీసిన జేమీసన్ సగటు 24.20గా ఉండటం అతడి ప్రభావాన్ని తెలియజేస్తోంది.జేమీసన్ స్థానంలో వైట్బాల్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడో టెస్ట్ నాటింగ్హమ్ వేదికగా రేపటి నుంచి (జూన్ 25) ప్రారంభం కానుంది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది.తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుతంగా పునరాగమనం చేసి సిరీస్ను సమం చేసింది. దీంతో మూడో టెస్టు విజేతే సిరీస్ను కైవసం చేసుకోనుంది.ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల దృష్ట్యా కూడా ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 66.67 శాతం పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సిరీస్తో పాటు డబ్ల్యూటీసీ రేసులోనూ ముందంజ వేయాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఇంగ్లాండ్ భారీ స్కెచ్.. వైభవ్ కు పోటీగా 16 ఏళ్లు కుర్రాడు
-
ఇంగ్లండ్కు ఘనా షాక్.. క్రొయేషియా బోణీ
ఫిఫా ప్రపంచకప్లో గ్రూప్-ఎల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇంగ్లండ్తో మ్యాచ్ను ఘనా డ్రా చేసుకోగా, మరో మ్యాచ్లో క్రొయేషియా 1-0 తేడాతో పనామాను చిత్తు చేసి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్, ఘనా మ్యాచ్ విషయానికొస్తే నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. 2024లో నుంచి వరుసగా 12 విజయాలతో అదరగొట్టిన ఇంగ్లండ్ జోరుకు ఘనా డ్రా రూపంలో అడ్డుకట్ట వేసింది. ఘనా గోల్ కీపర్ బెంజమిన్ విన్యాసం2024లో గ్రీస్పై విజయం తర్వాత ఇంగ్లండ్ తాను ఆడిన 12 అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. అయితే మ్యాచ్ ఆద్యంతం ఘనాపై ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 19 సార్లు ఘనా గోల్ పోస్ట్పై దాడులు చేసినప్పటికీ ఆ జట్టు గోల్కీపర్ బెంజమిన్ అసారే అడ్డుగోడలో నిలబడి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు.దీంతో చెరో పాయింట్ దక్కించుకున్న ఇంగ్లండ్, ఘనాలు చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ పనామాతో, ఘనా క్రొయేషియాతో తమ చివరి మ్యాచ్లు ఆడనున్నాయి.ఘనా గోల్ కీపర్ బెంజమిన్ Benjamin Asare is the real Man of the Match 🇬🇭🔥 pic.twitter.com/3pjKrnigHw— ZITO 🇬🇭 (@kwesi_zitojnr) June 23, 2026 లూకా మోడ్రిక్ 200వ మ్యాచ్..తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన క్రొయేషియా పనామాపై జూలు విదిల్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి 1-0తో నిలిచింది. క్రొయేషియా తరఫున ఆట 54వ నిమిషంలో ఆంటే బుడిమిర్ గోల్ కొట్టాడు. ఇక క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్కు ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. అంతర్జాతీయ ఫుట్బాల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా లూకా మోడ్రిక్ నిలిచాడు. క్రొయేషియా ఆటగాడు ఆంటే బుడిమిర్, 200వ మ్యాచ్ ఆడుతున్న లూకా మోడ్రిక్గతంలో క్రిస్టియానో రొనాల్డో (230), బాదర్ అహ్మద్ (202), లియోనల్ మెస్సీ (201) ఈ ఫీట్ సాధించారు. ఇక పనామా జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. క్రొయేషియా చేతిలో ఓటమితో ఆడిన ఐదే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసిన జట్టుగా నిలిచింది. ఇంతకముందు ఎల్ సాల్వడార్ జట్టు ఆరు ఫిఫా మ్యాచ్లు ఆడితే ఆరింటిలోనూ ఓడిపోయి 100 శాతం ఓటమి రికార్డుతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: పోర్చుగల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డో -
బ్రిటన్కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!
లండన్లోని ప్రతిష్ఠాత్మక 10 డౌనింగ్ స్ట్రీట్.. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం, కార్యాలయంల కూడా. బయటకు చూస్తే అది కేవలం ఒక ప్రభుత్వ భవనం. కానీ ఆ చారిత్రక గోడల మధ్య మాత్రం ఒక ప్రత్యేకమైన ఉనికి ఎప్పటినుంచో కొనసాగుతోంది. పదేళ్లలో ఆరుగురు ప్రధానమంత్రులు మారినా, ఆ వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించదు. అదే భవనంలో.. దశాబ్దంపైగా అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ల్యారీ.. “నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. అప్పుడు ఒక ప్రధాని ఉన్నాడు. తర్వాత ఇంకొకరు. కొంతకాలానికి ఇంకొకరు. ఇప్పుడే ఇంకొకరు రాజీనామా చేశారు. రేపు ఇంకెవరో?.. నేను మాత్రం నా సోఫాలో అలాగే ఉంటూ వస్తున్నా..” అంటూ ల్యారీగాడు ఓ వెక్కిరింపు చూస్తున్నాడు. ల్యారీ.. 11 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చాడు. అప్పట్లో బ్రిటన్కు నాయకత్వం వహిస్తున్నది డేవిడ్ కామెరూన్. యూరప్తో బ్రిటన్ సంబంధాలపై, ఆర్థిక సంక్షోభం ప్రభావాలపై చర్చల్లో మునిగిపోయి ఉన్న సమయం అది. కానీ ల్యారీకి అవేం పట్టింపు లేదు. వాడికి అర్థమైంది ఒక్కటే.. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, మంచి తిండి.. అలాగే రొటీన్ లైఫ్లో కాస్త చేంజ్.ఆ తర్వాత మార్పుల ప్రవాహం మొదలైంది. థెరెసా మే వచ్చారు. బ్రెగ్జిట్ గందరగోళం మధ్య దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, పార్లమెంటులో మద్దతు తగ్గడం, ఒప్పందాలపై విభేదాలు ఆమెను పదవికి రాజీనామా చేసేలా చేశాయి. ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. డౌనింగ్ స్ట్రీట్ను వీడుతుంటే ల్యారీ మాత్రం అదే హాలులో నిద్రపోతూనే ఉన్నాడు.తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చారు. దేశాన్ని బ్రెగ్జిట్ తర్వాత కొత్త దారిలో నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీల్లో వివాదాలు, కరోనా సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఆచరణాత్మక తప్పిదాల ఆరోపణలు ఆయనను కూడా పదవికి దూరం చేశాయి. ఆయన బయటకు వెళ్తున్న టైంలోనూ.. ల్యారీగాడు సోఫాలో మాంచి కునుకు తీస్తున్నాడు.తరువాత లిజ్ ట్రస్ వచ్చారు. అయితే ఆర్థిక విధానాల్లో ఆమె చేసిన భారీ ప్రకటనలు మార్కెట్లను కుదిపేశాయి. ప్రజల్లో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె పాలన అయితే బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత తక్కువకాలంలో ముగిసిన అధ్యాయంగా నిలిచింది. “లెట్యూస్(ఆ రకం ఆకుకూర..) తాజాదనం కంటే ఆమె ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయింది అంటూ సెటైర్లు వినిపించాయి. కానీ, అవేవీ పట్టించుకునే స్థితిలో ల్యారీగాడు లేడు..తర్వాత రిషి సునాక్ వచ్చారు. ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ అనిశ్చితి ఆయన ప్రభుత్వాన్ని నిరంతరం పరీక్షించాయి. చివరకు 2024 సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు లేబర్ పార్టీ చేతికి మారాయి. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో సునాక్ ప్రధానమంత్రి పదవికి వీడ్కోలు పలికారు. 10 డౌనింగ్ స్ట్రీట్లో మరోసారి అధికార మార్పిడి జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ల్యారీగాడు తనదైన నిశ్శబ్దంతో గమనిస్తూ ఉండిపోయాడు.తరువాత బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్ పాలన కూడా బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది. దేశ ఆర్థిక ఒత్తిళ్లు, విధాన నిర్ణయాలపై పెరిగిన విమర్శల మధ్య ఆయన నాయకత్వంపై కూడా అనిశ్చితి కొనసాగింది. చివరికి ఆయన కూడా పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో, 10 డౌనింగ్ స్ట్రీట్లో తాజాగా మరోసారి నాయకత్వ మార్పు తప్పలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నా, ఆ చారిత్రక భవనంలోని నిశ్శబ్ద సాక్షి మాత్రం ఎప్పటిలాగే తన స్థానంలో నిలిచే ఉంది.లారీకి రాజకీయాలు అర్థం కావు. కానీ ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు.. ఈ ఇంట్లో మనుషులు శాశ్వతం కాదు. వారు వస్తారు, కెమెరాల ముందు నిలుస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, కొన్నిసార్లు దేశాన్ని ప్రశంసిస్తారు, కొన్నిసార్లు విమర్శల్లో మునిగిపోతారు. ఆ తర్వాత ఒక రోజు నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కానీ లారీ మాత్రం ఎప్పటికీ అదే చోట ఉంటాడు. అదే కిటికీ దగ్గర కూర్చుంటాడు. అదే హాలులో నిద్రపోతాడు. అతనికి పదవులు లేవు, ఎన్నికలు లేవు, రాజీనామాలు లేవు. అతని ప్రపంచంలో ఒకే ఒక నిజం ఉంది.. ఆ ఇల్లు, ఆ సోఫా బతికి ఉన్నంత దాకా తనదేనని. ల్యారీ ది క్యాట్ (Larry the Cat).. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లోని బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసంలో నివసిస్తున్న ప్రసిద్ధ పిల్లి. ఎలుకల్ని పట్టుకునేందుకు “Chief Mouser to the Cabinet Office” అనే అధికారిక హోదాను దానికి కట్టబెట్టారు. అలాగని ఈ పదవి కొత్తది కాదు. అక్కడి ప్రభుత్వ భవనాల్లో ఎలుకల సమస్యను నియంత్రించేందుకు దశాబ్దాలుగా ఇలాంటి ‘మౌసర్ క్యాట్’లను నియమించే సంప్రదాయం ఉంది. ఈ బాధ్యతలను సాధారణంగా క్యాబినెట్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది చూసుకుంటారు, అయితే ఈ పిల్లుల సంరక్షణ, ఆహారం, వైద్య సదుపాయాలు వంటి విషయాలను అక్కడి సిబ్బందే నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా ల్యారీ 2011 నుంచి ఈ భవనంలో ఉంటూ, అనేక ప్రధానమంత్రుల కాలాన్ని సాక్షిగా చూసిన ఒక నిశ్శబ్ద అధికారిగా గుర్తింపు పొందాడు. -
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టోక్స్ రీఎంట్రీ
న్యూజిలాండ్పై తొలి టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం ఉట్టిదేనని తేలిపోయింది. న్యూజిలాండ్తో మూడో టెస్ట్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్కు చోటు దక్కింది. స్టోక్స్తో పాటుగస్ అట్కిన్సన్ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. జేమ్స్ రూ స్థానాన్ని స్టోక్స్, సోనీ బేకర్ స్థానాన్ని అట్కిన్సన్ భర్తీ చేశారు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. మూడో టెస్ట్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జూన్ 25 నుంచి మొదలుకానుంది.కాగా, నిన్ననే ముగిసిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. అంతకుముందు తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.తిరిగి పగ్గాలు చేపట్టనున్న స్టోక్స్రెండో టెస్ట్లో భారీ ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. జో రూట్ నాయకత్వంలో ఆడిన ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ తేడాతో ఓడిపోవడం జట్టుపై ఒత్తిడిని పెంచింది. దీంతో అనుభవజ్ఞుడైన స్టోక్స్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.స్టోక్స్, అట్కిన్సన్కు క్లీన్ చిట్స్టోక్స్, అట్కిన్సన్లను రెండో టెస్ట్ నుంచి తప్పించడానికి కారణం ఒక వివాదాస్పద సంఘటన. న్యూజిలాండ్పై తొలి టెస్ట్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు స్టోక్స్, అట్కిన్సన్ లండన్లోని చెల్సీ ప్రాంతంలోని రెక్స్ రూమ్స్ నైట్క్లబ్కు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ రగ్బీ ఆటగాడితో వాగ్వాదం చోటుచేసుకుందని, ఇందులో ఒక ECB సెక్యూరిటీ గార్డ్ గాయపడ్డాడని నివేదికలు తెలిపాయి. అలాగే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దేశించిన మిడ్నైట్ కర్ఫ్యూ నిబంధనను సైతం వీరు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ECB వెంటనే విచారణ ప్రారంభించి, స్టోక్స్ మరియు అట్కిన్సన్లను రెండో టెస్ట్ నుంచి తప్పించింది.అయితే తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్టోక్స్, అట్కిన్సన్కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరికి ఆ గొడవతో సంబంధం లేదని పేర్కొంది. -
హడలెత్తించిన హెన్రీ
లండన్: ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్... రెండో టెస్టులో ఘనవిజయంతో సిరీస్ను 1–1తో సమం చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 253 పరుగుల తేడాతో నెగ్గింది. 463 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 182/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 58.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (145 బంతుల్లో 77; 8 ఫోర్లు) పోరాడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాట్ హెన్రీ 29 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 291 పరుగులకు పరిమితమైంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. -
బుమ్రా పునరాగమనం
న్యూఢిల్లీ: పనిభారం నేపథ్యంలో గత కొంతకాలంగా వన్డే క్రికెట్కు దూరంగా ఉంటున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతడిని... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా గాయపడి అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు అందుబాటులో లేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కూడా ఇంగ్లండ్ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే దానికి ముందు అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. వచ్చే నెలలో ఇంగ్లండ్తో టీమిండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం శుబ్మన్ గిల్ సారథ్యంలో... 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అఫ్గాన్తో చివరి వన్డేలో సెంచరీతో చెలరేగినప్పటికీ యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కలేదు. గాయం నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పేరును పరిశీలించలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై 14న తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్), 16న రెండో వన్డే (సోఫీ గార్డెన్స్), 19న మూడో వన్డే (లార్డ్స్) ఆడనుంది. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, అక్షర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిధ్, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, గుర్నూర్ బ్రార్. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ప్లేయర్గా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. లండన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో అతడు ఈ భారీ రికార్డును నమోదు చేశాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి సచిన్కు 171 మ్యాచ్లు పట్టగా.. రూట్ కేవలం 164 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ల పరంగా అయితే రూట్(302) కంటే సచిన్(279) ముందున్నారు. ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టే దిశగా జో రూట్ శరవేగంగా దూసుకుపోతున్నాడు. ఈ ఇంగ్లండ్ దిగ్గజం ఇప్పటివరకు టెస్ట్ల్లో 14052 పరుగులు చేశాడు. ప్రస్తుత అతని ఫామ్ చూస్తుంటే, రెండు మూడేళ్లలో సచిన్ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రూట్నే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రూట్ 76 మ్యాచ్లలో 51.78 సగటుతో 6577 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(4,564) ఉన్నాడు.ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీతో కివీస్ను ఆదుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బ్లాక్ క్యాప్స్ జట్టు అద్భుతంగా ఆడి 362 పరుగులు చేసింది. మొత్తంగా ఆతిథ్య జట్టు ముందు కివీస్ 463 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 326 పరుగులు కావాలి. హ్యారీ బ్రూక్(58), రూట్(57) పోరాడుతున్నారు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)
-
వైభవ్కు తోడుగా తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: భారత సీనియర్ జట్టులోకి తొలిసారి ఎంపికైన సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే 15 ఏళ్ల వైభవ్కు తోడుగా అతని తల్లిదండ్రులను పంపాలని బోర్డు నిర్ణయించింది. ఈ వయసులో అమ్మానాన్న తన పక్కన ఉండటం వైభవ్కు మేలు చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయ పడ్డారు. తనకంటే వయసులో పెద్దవారైన క్రికెటర్లతో కలిసి ఉండటంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా వెల్లడించారు. ‘సాధారణంగా ఏదైనా సీనియర్ టీమ్లలో ఇంత చిన్న వయసు ఆటగాళ్లు ఉండరు. ఎప్పుడో సచిన్ టెండూల్కర్ చిన్న వయసులో జాతీయ జట్టులోకి వచ్చాక ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ వైభవ్లాంటి కుర్రాడు వచ్చాడు. సహజంగానే 15 ఏళ్ల అబ్బాయికి సీనియర్లతో కలిసి ఉండటంలో సమస్యలు వస్తాయి. మిగతా ఆటగాళ్లంతా 18 ఏళ్లకు పైగా వయసు ఉన్నవారే. అలాంటి వాతావరణంలో అలవాటు పడేందుకు తల్లిదండ్రులు తోడుగా ఉండటం మేలు చేస్తుంది. స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లినప్పుడు కూడా పెద్దవాళ్లు తోడుగా ఉంటారు. ఇదీ అలాంటిదే. వైభవ్ ఇంకా స్కూల్ కుర్రాడే. అతను రాబోయే కొన్నేళ్ల పాటు భారత క్రికెట్కు పెద్ద ఆస్తిలాంటివాడు’ అని సైకియా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల శ్రీలంకలో ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించిన అంశంపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ‘ఇదంతా ఆటలో భాగంగానే జరిగింది. ఇలాంటి అంశాల్లో మ్యాచ్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఏం చేయాలనేది వారిష్టం. బీసీసీఐకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. మేం మ్యాచ్ రిఫరీ పాత్ర పోషించలేం కదా’ అని సైకియా స్పందించారు. -
కేన్ డబుల్ ధమాకా.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ
2026 ఫిఫా ప్రపంచకప్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎల్లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో క్రొయేషియాపై 4-2తో విజయం సాధించింది. స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ రెండు గోల్స్తో మెరిసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు.మ్యాచ్ 12వ నిమిషంలో పెనాల్టీ ద్వారా కేన్ ఇంగ్లండ్కు ఆధిక్యం అందించాడు. తొలి ప్రయత్నాన్ని క్రొయేషియా గోల్కీపర్ అడ్డుకున్నప్పటికీ, వీడియో రివ్యూ అనంతరం రిఫరీ పెనాల్టీని మళ్లీ తీసుకోవాలని ఆదేశించడంతో రెండోసారి కేన్ గోల్ చేశాడు.అయితే 36వ నిమిషంలో మార్టిన్ బటురినా గోల్తో క్రొయేషియా స్కోరును సమం చేసింది. ఆరు నిమిషాలకే కేన్ మరోసారి హెడర్తో గోల్ చేసి ఇంగ్లండ్ను మళ్లీ ముందంజలో నిలిపాడు. దీంతో ప్రపంచకప్ల్లో అతని గోల్స్ సంఖ్య 10కు చేరి ఇంగ్లండ్ దిగ్గజం గ్యారీ లింకర్ రికార్డును సమం చేశాడు.మొదటి అర్థం అదనపు సమయంలో పీటర్ ముసా గోల్ చేయడంతో క్రొయేషియా మరోసారి స్కోర్ను సమం చేసింది (2-2).రెండో అర్థ భాగం ప్రారంభమైన రెండో నిమిషానికే జూడ్ బెల్లింగ్హమ్ అద్భుత గోల్తో ఇంగ్లండ్ను 3-2తో ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం ఇంగ్లండ్ పలు అవకాశాలను వృథా చేసుకున్నప్పటికీ, మ్యాచ్ ముగియడానికి ఐదు నిమిషాల ముందు ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన మార్కస్ రూథర్ఫోర్డ్ నాలుగో గోల్ చేసి ఇంగ్లండ్ విజయం ఖాయం చేశాడు.2018 ప్రపంచకప్ సెమీఫైనల్లో తమను ఓడించిన క్రొయేషియాపై ఇంగ్లండ్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. 1966 తర్వాత తొలి ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. -
న్యూజిలాండ్ 291/7
లండన్: ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టు రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ బుధవారం ఆట ముగిసే సమయానికి 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బ్లండెల్ (51; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... గ్లెన్ ఫిలిప్స్ (49 బ్యాటింగ్; 9 ఫోర్లు), మిచెల్ (44; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర (33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్, సోనీ బకెర్ చెరో 2 వికెట్లు తీశారు. ఫిలిప్స్తో పాటు కైల్ జేమీసన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
‘గుర్రాల స్నానం’ 300 ఏళ్ల పాత పండగ గురించి తెలుసా?
పిల్లలూ... మన ఊర్లో ‘ఎడ్ల పందాలు’, ‘కోడి పందాలు’ లాగే ఇంగ్లాండ్లో గుర్రాల పండగ జరుగుతుంది. ఇంగ్లాండ్లో ‘యాపిల్బై’ అనే చిన్న ఊరులో మొన్న జూన్ 6న ‘గుర్రాల స్నానం పండుగ’ జరిగింది. ప్రతి వేసవిలో ఈ పండగ చేస్తారు. ఇది 300 ఏళ్ల పాత పండగ!పండుగ రోజు ‘జిప్సీ’ అనే సంచార జాతి వాళ్లు ఎక్కడెక్కడి నుంచో అందమైన గుర్రాలు, రంగురంగుల బండ్లతో యాపిల్ బైకి వచ్చేస్తారు. తాము ప్రయాణం చేసి వచ్చిన గుర్రాలకి అక్కడి ‘ఈడెన్’ నదిలో స్నానం చేయిస్తారు. చల్లటి నీళ్లలో గుర్రాలు హాయిగా ఈదుతాయి. స్నానం చేసి, జూలు దువ్వుకున్న గుర్రాలు మెరిసిపోతాయి. అప్పుడు వాటిని కొనడానికి, అమ్మడానికి బేరాలు జరుగుతాయి.గుర్రాలే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కలుసుకుని ఆడతారు, పాడతారు, కథలు చెప్పుకుంటారు. గుర్రాలు నదిలో ‘టప్ టప్’ అని నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. కొందరు గుర్రాల మీద కూర్చునే నదిలోకి దిగుతారు. భలే థ్రిల్లింగ్గా ఉంటుంది! ఈ జాతరలో ‘బౌ–టాప్ వాగన్’ అనే గుండ్రని పైకప్పు ఉన్న బండ్లు స్పెషల్. ఇవి జిప్సీల తిరుగాడే ఇళ్లు. మనం ప్రతి సంస్కృతిని గౌరవించాలి. -
ఆడేద్దాం... ధనాధన్
ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్ ఫీవర్లో మునిగి తేలుతుంటే... మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళల మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకొని జోరుమీదున్న టీమిండియా... టి20 ఫార్మాట్లోనూ విశ్వ విజేత అనిపించుకోవాలని తహతహలాడుతుంటే... గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తాపడ్డ దక్షిణాఫ్రికా ఈసారైనా కప్పును ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో ఉంది!మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు టైటిల్ నెగ్గిన ఆ్రస్టేలియా ఏడో కప్పు ఖాతాలో వేసుకోవాలనుకుంటుంటే... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ తమ పట్టు కొనసాగించాలని చూస్తోంది! సంచలన ప్రదర్శనతో రెండోసారి చాంపియన్గా నిలవాలని వెస్టిండీస్ భావిస్తుంటే... అప్పుడెప్పుడో ఈ ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్కప్లో ట్రోఫీ నెగ్గిన ఇంగ్లండ్... ఇప్పుడు ఆతిథ్య హోదాలో రెండోసారి టైటిల్ హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది! మరెందుకు ఆలస్యం... అటు ‘ఫిఫా’ ప్రపంచకప్తో పాటు ఇటు... టి20 మెరుపులు చూసేందుకు సిద్ధమైపోదాం. –సాక్షి, క్రీడావిభాగంరెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ మరోసారి సందడి చేసేందుకు మన ముందుకు వచ్చేసింది. తొలి ప్రపంచకప్ తర్వాత ఇప్పుడు పదో టోర్నీకి మరోసారి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుండగా... 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 12 జట్లు ట్రోఫీ కోసం అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా... వచ్చే నెల 5న విఖ్యాత లార్డ్స్ మైదానంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది వరల్డ్కప్లలో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా... తమ ఆధిపత్యం కనబర్చాలని చూస్తుంటే... ఇప్పటి వరకు ఒక్కోసారి ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్... రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఇక ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా వరల్డ్కప్ గెలవని భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)తో రాటుదేలిన భారత అమ్మాయిలు... విశ్వ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్తో టి20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ... ప్రధాన టోర్నీలో దూకుడే మంత్రంగా ఆడుతామని హర్మన్ వెల్లడించింది. ఇక గత రెండు (2023, 2024) వరల్డ్కప్లలో ఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా బలమైన బృందంతో బరిలోకి దిగనుంది. సొంతగడ్డ ఇంగ్లండ్కు అనుకూలం కానుండగా... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్కు ఆల్రౌండర్ల బలగం దండిగా ఉంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుండగా... టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఎంపిక ఇలా... బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చి న 2024 టి20 ప్రపంచకప్లో 10 జట్లు పాల్గొనగా... ఇప్పుడా సంఖ్యను 12కు పెంచారు. ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్ నేరుగా వరల్డ్కప్నకు అర్హత సాధించగా... 2024 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదు జట్లతో పాటు... ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్లో అత్యుత్తమ రెండు జట్లను కూడా నేరుగా మెగా టోర్నీకి ఎంపిక చేశారు. ఇక మిగిలిన నాలుగు జట్లను క్వాలిఫయర్ టోర్నీల ద్వారా నిర్ణయించారు. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్లోని మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ప్రైజ్మనీ ఎంతంటే... ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 8 లక్షల 76 వేల డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు). విజేతకు 23 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు) లభించనుండగా... రన్నరప్ జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) దక్కనున్నాయి. సెమీస్లో ఓడిన జట్లకు 6 లక్షల డాలర్ల (రూ. 6 కోట్లు) చొప్పున లభించనున్నాయి. 10 ఇది పదో మహిళల టి20 ప్రపంచకప్. 2009లో తొలిసారి ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగగా... మళ్లీ ఇప్పుడు పదో ఎడిషన్ వరల్డ్కప్నకు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది. తొలి టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఎప్పుడూ ట్రోఫీని అందుకోలేదు. 6 ఆ్రస్టేలియా గెలిచిన టి20 వరల్డ్కప్ ట్రోఫీలు. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ్రస్టేలియా చాంపియన్గా నిలవగా... ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2016), న్యూజిలాండ్ (2024) ఒక్కోసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. భారత్ అత్యుత్తమంగా 2020లో రన్నరప్గా నిలిచింది. -
T20 WC: జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
గతేడాది సొంతగడ్డపై భారత మహిళ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో చాంపియన్గా అవతరించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.ఆ తర్వాత టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ స్వదేశంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 టీ20 మహిళా ప్రపంచకప్-2026 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని హర్మన్ బృందం పట్టుదలగా ఉంది. పురుషుల మాదిరే ఈసారి తామూ ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలో దిగనుండగా.. గతేడాది రన్నరప్ సౌతాఫ్రికా కూడా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఇక భారత జట్టు 2024లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి లోపాలు సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.ఇంతకీ ఈ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? సారథులు ఎవరు?.. వేదికలు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా?!షెడ్యూల్👉రౌండ్- రాబిన్ ఫార్మాట్👉జూన్ 12న వరల్డ్కప్ టోర్నీ మొదలు (ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక)👉భారత్ వర్సెస్ పాకిస్తాన్- జూన్ 14👉సెమీ ఫైనల్-1: జూన్ 30👉సెమీ ఫైనల్-2: జూలై 2👉జూలై 5న ఫైనల్తో ముగింపు.వేదికలు👉గ్రూప్, సూపర్-8 దశ: ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్, హెడింగ్లీ, లీడ్స్, హాంప్షైర్ బౌల్, సౌతాంప్టన్, ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్.👉సెమీ ఫైనల్- ది ఓవల్, ఫైనల్- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జట్లుఆస్ట్రేలియాసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), నికోలా క్యారీ, ఆష్లే గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, తాహ్లియా మెక్గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.బంగ్లాదేశ్నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్తర్ (వైస్ కెప్టెన్), షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్, రీతు మోని, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, శంజిదా అక్తేర్ మఘ్లా, సుల్తానా ఖాతున్, దిలారా అక్తర్, జుయేరియా ఫిర్దోస్, తాజ్ నెహర్.ఇండియాహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్నెదర్లాండ్స్బాబెట్ డి లీడే (కెప్టెన్), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్హూయిస్, మైర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్బోయర్, రోసాలీ లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, స్టెరె కాలిస్పాకిస్తాన్ఫాతిమా సనా (కెప్టెన్), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఇమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనేకే, టుమీ సెఖుఖునేర్, చ్లోవాన్ నికెర్కెర్ఇంగ్లండ్నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హీథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్.ఐర్లాండ్గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రైలీ, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సీ, అమీ హంటర్, ఆర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగ్వైర్, లారా మెక్బ్రైడ్, కారా ముర్రే, లియా పాల్, ఓర్లా ప్రెండర్గాస్ట్, రెబెక్కా స్టోకెల్, ఆలిస్ టెక్టర్న్యూజిలాండ్మెలీ కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు.స్కాట్లాండ్కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), క్లో అబెల్, ఒలివియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియనాజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, కాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డాన్, ఐల్సా లిస్టర్, మైసీ మాసీరా, అబ్తాహా మక్సూద్, మేగన్ మెక్కోల్, రేచల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్శ్రీలంకచమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలక్షిక సిల్వా, కవీషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషిణి నుత్యాంగన, సుగందిక దాసనాయక, నిమాషా మదుషాని, కావ్య మదుషాని, కావ్య మదుషాని, మల్కి మదర, మిథాలి అయోధ్య, చేతన విముక్తి.వెస్టిండీస్హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్లే హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అలీన్, షెమైన్ క్యాంప్బెల్లే, అష్మిని మునిసార్, కరిష్మా రామ్హారక్, జన్నీలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, మాన్షా హేగ్రుక్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిష హెక్టార్.ప్రత్యక్ష ప్రసారం👉స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియోహాట్స్టార్ (డిజిటల్).మ్యాచ్ ఆరంభ సమయాలుభారత కాలమానం ప్రకారం: మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి ఏడు గంటలు, పదకొండు గంటలకు ఆరంభం.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు! -
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్ కెరీర్కు ఎండ్ కార్డ్..?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై సంచలన ప్రచారం జరుగుతోంది. తాజాగా న్యూజిలాండ్పై లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత స్టోక్స్, సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ నైట్క్లబ్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వారు ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ వివాదం తర్వాత స్టోక్స్ తన కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ది క్రికెటర్' సీనియర్ జర్నలిస్ట్ జార్జ్ దోబెల్ ప్రకారం.. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.ఇదిలా ఉంటే, నైట్క్లబ్ ఘటనలో స్టోక్స్, అట్కిన్సన్ ఎవరిపై దాడికి పాల్పడలేదని ECB వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్కు ముందు వెల్లింగ్టన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లిన బ్రూక్, అక్కడ బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ భవిష్యత్తు ఆశాకిరణం జేకబ్ బెథెల్తో కలిసి సదరు బౌన్సర్పై దాడి చేశాడు. అయితే దాడి పెద్దది కాకపోవడంతో ఈసీబీ వారిద్దరిని మందలింపుతో సరిపెట్టింది. -
ఒక్క మ్యాచ్ ఆడకుండానే.. ఇంగ్లాండ్ లో బుడ్డోడి ప్రకంపనలు
-
WTC పాయింట్ల పట్టికలో మార్పులు
ఇవాళ ముగిసిన లార్డ్స్ టెస్ట్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్పై గెలిచినా ఇంగ్లండ్ స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు. వారి PCT (పాయింట్ల శాతం) 31.67 నుంచి 37.88కి పెరిగినప్పటికీ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోవడంతో సౌతాఫ్రికా, శ్రీలంక రెండు, మూడు స్థానాలకు ఎగబాకాయి.భారత్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల పాక్ను రెండు మ్యాచ్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (9), పాకిస్తాన్ (8) జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.లార్డ్స్ టెస్ట్ విషయానికొస్తే.. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పూర్తిగా చేతులెత్తేసింది. 138 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది. -
చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్దే గెలుపు
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన చారిత్రక టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో లార్డ్స్లో జరిగిన 150వ మ్యాచ్ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్ క్రికెట్ మైదానం.పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది. -
వైభవ్ వచ్చేశాడు...
టి20 ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలిపినా సరే... బ్యాటింగ్ ఫామ్ సూర్యకుమార్ యాదవ్కు ప్రతికూలంగా మారింది. ఊహించినట్లే సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సెలక్టర్లు అంతటితో ఆగకుండా జట్టునుంచే తీసేశారు. విన్నింగ్ టీమ్లో సభ్యులైన మరో ఇద్దరిపై కూడా వేటు పడగా... అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ టీమ్లోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో చక్కటి బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన శ్రేయస్ కొత్త సారథిగా బాధ్యతలు చేపడుతుండగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ సాధించాడు. ముంబై: టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న మూడు నెలల తర్వాత భారత క్రికెట్ జట్టు పలు మార్పులతో కొత్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే టి20 సిరీస్ల కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దీంతో పాటు జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్ను కూడా సెలక్టర్లు ప్రకటించారు. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో 2 టి20ల్లో తలపడిన అనంతరం భారత జట్టు జులై 2 నుంచి 11 మధ్య ఇంగ్లండ్తో 5 టి20లు ఆడుతుంది. శ్రేయస్పై నమ్మకం... టి20 ప్రపంచకప్ ప్రస్తుత విజేత 2028లో జరిగే తర్వాతి టోర్నీకి సిద్ధమయ్యేందుకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. అదే ఏడాది లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కూడా భారత్ బరిలోకి దిగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ టీమ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ బృందంలో 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ నాయకుడిగా సరైన వ్యక్తి అని సెలక్టర్లు భావించారు. నిజానికి అయ్యర్ రెగ్యులర్గా టి20 జట్టులో సభ్యుడు కాదు. 2023 డిసెంబర్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో భారత్కు ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రదర్శన అతడిని అందరికంటే ముందు నిలిపింది. మూడు వేర్వేరు టీమ్లు (ఢిల్లీ, కోల్తా, పంజాబ్)లను లీగ్లో ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా గుర్తింపు పొందిన శ్రేయస్ నాయకత్వంలో 2024లో కోల్కతా టైటిల్ నెగ్గింది. బ్యాటర్గా కూడా గత ఏడాది విధ్వంసకర ప్రదర్శన కనబర్చిన అతను ఈ సీజన్లో కూడా మెరుగ్గా ఆడాడు. బ్యాటర్గా సూర్యకుమార్కు బదులుగా నాలుగో స్థానానికి అతను సరిగ్గా సరిపోతాడు కూడా. తిలక్కు అరుదైన చాన్స్... భారత టి20 జట్టులో రెగ్యులర్గా మారిన తిలక్వర్మకు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైస్ కెప్టెన్సీ పదవి దక్కింది. తిలక్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఎ టీమ్కు సారథిగా ఉన్నాడు. భారత్ తరఫున 49 మ్యాచ్లలో 145.54 స్టైక్రేట్తో 1390 పరుగులు సాధించిన తిలక్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శన కూడా అతనికి తగినంత గుర్తింపు తెచి్చంది. అక్షర్ స్థానంలో అతను వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వైభవ్పై విశ్వాసం... అంచనాలకు తగినట్లుగానే కుర్రాడు వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు టీమ్లోకి ఎంపిక చేశారు. గత ఐపీఎల్ సీజన్లోనే ఆకట్టుకున్నా... ఈసారి మరింతగా విజృంభించి వైభవ్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్రేట్తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా అంతా భావించారు. అందుకే సెలక్టర్లు కూడా అతనిపై విశ్వాసం ఉంచారు. వైభవ్ ఐర్లాండ్తో తొలి టి20లో బరిలోకి దిగితే...భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 92 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బద్దలు కొడతాడు. స్థానం కోల్పోయిన రింకూ, కుల్దీప్... వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులైనవారిలో సూర్యతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటర్ రింకూ సింగ్ టీమ్లో చోటు దక్కించుకోలేకపోయారు. రింకూ చాలా కాలంగా ఫామ్లో లేకపోగా... ఇటీవలి ఐపీఎల్ ఘోర వైఫల్యం కూడా కుల్దీప్పై వేటుకు ప్రధాన కారణం. ఆల్రౌండర్ హార్దిక్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్లనుంచి విశ్రాంతి కల్పించారు. నితీశ్ రెడ్డి పునరాగమనం... టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి టీమ్లోకి పునరాగమనం చేశాడు. అతను భారత్ తరఫున జనవరి, 2025లో ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. ఇదే తరహాలో లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఇప్పటికే ఎంపిక అయిన ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్కు ఇప్పుడు టి20 టీమ్లో స్థానం లభించింది. ఆసియా క్రీడలకు బుమ్రా.... విశ్రాంతి అనంతరం పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొంటాడు. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన 15 మంది టీమ్లో అతనికి స్థానం కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ఎంపిక చేసిన జట్లలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా వస్తాడు. 16వ ఆటగాడు ప్రిన్స్కు కూడా ఆసియా క్రీడల టీమ్లో చోటు దక్కలేదు.పాపం సూర్యకుమార్!గత ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత కూడా తర్వాతి సిరీస్కు రోహిత్ శర్మ తన వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇంకా బాధాకరం. వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్సీతో పాటు అతనికి జట్టులో కూడా చోటు పోయింది. నిజానికి ప్రపంచ కప్కు ముందు చాలా కాలం పాటు అతని ఫామ్ పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్పై మంచి ప్రదర్శనే ఇచ్చినా... ఆ తర్వాత మళ్లీ తడబాటు కనిపించింది. అయితే కీలకమైన టోర్నీకి ముందు కొత్త కెప్టెన్ వస్తే కష్టమని సెలక్టర్లు వెనక్కి తగ్గారు. మెగా టోర్నీలో అమెరికాపై మ్యాచ్ మినహా అతను అన్నింటా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా అంతే స్థాయిలో మళ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో సెలక్టర్లకు మరో ఆలోచన లేకపోయింది. పైగా 36 ఏళ్లకు చేరువవుతున్న ప్రస్తుత స్థితిలో మరో రెండేళ్ల తర్వాత జరిగే వరల్డ్ కప్కు కొనసాగించే అవకాశం ఎలాగూ లేదనేది వాస్తవం. ప్రపంచకప్, ఆసియా కప్లు గెలవడంతో పాటు తన సారథ్యంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోని రికార్డు సూర్య సొంతం. టి20 క్రికెట్లో విధ్వంసక ఆటగాడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. అతని పేలవ ఫామ్ కొంత కారణమే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టు అవసరాల కోసం తప్పలేదు. ప్రపంచ కప్ను గెలిపించిన తర్వాత జట్టునుంచి తప్పించడంపై చాలానే చర్చ జరిగింది. నేను కూడా అతనితో మాట్లాడి అంతా వివరించా’ అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టుశ్రేయస్ (కెప్టెన్), తిలక్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, వైభవ్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్ దీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్. (ఆసియా క్రీడలకు సిరాజ్ స్థానంలో బుమ్రా ఎంపిక కాగా...ప్రిన్స్కు చోటు లేదు). -
చరిత్ర సృష్టించిన లార్డ్స్ మైదానం
క్రికెట్కు మక్కాగా పేరొందిన ఇంగ్లండ్లోని లార్డ్స్ క్రికెట్ మైదానం మరో అరుదైన ఘనత సాధించింది. 1884లో తొలి టెస్టు మ్యాచ్కు వేదికైన ఈ చారిత్రక మైదానం.. ఇవాళ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన టెస్టుతో 150 టెస్టు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది.లార్డ్స్ తర్వాత అత్యధిక టెస్ట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన మైదానంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 118 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఆతర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ మైదానం ఇప్పటివరకు 114 టెస్ట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఆతర్వాతి స్థానంలో ఇంగ్లండ్లోని ద ఓవల్ గ్రౌండ్ ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 108 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి.కాగా, లార్డ్స్లో ఇప్పటివరకు జరిగిన 150 టెస్ట్ల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఏకంగా 146 మ్యాచ్లు ఆడింది. ఇందులో 60 విజయాలు, 35 పరాజయాలు, 51 డ్రాలు నమోదు చేసింది. ముఖ్యంగా యాషెస్ సిరీస్లో ఎన్నో క్లాసిక్ మ్యాచ్లు ఈ మైదానంలో జరిగాయి.దాదాపు 2.5 మీటర్ల వంపు (Slope) కలిగిన ప్రత్యేకత లార్డ్స్కు మాత్రమే ఉంది. మ్యాచ్ ప్రారంభ రోజున పేసర్లకు అనుకూలించే ఈ పిచ్ క్రమంగా ఎండిపోతూ స్పిన్నర్లు, బ్యాటర్లకు కూడా సహకరిస్తుంది.ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే 8 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11.2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 31-1గా ఉంది.బెన్ డకెట్ 19, జేకబ్ బెతెల్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, విలియం ఓ'రూర్క్ఇంగ్లండ్: ఎమిలియో గే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), గస్ అట్కిన్సన్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. టీమిండియాకు భంగపాటు
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ వేదికగా నిన్న (మే 30) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 26 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఫ్రేయా కెంప్ (39 నాటౌట్), డ్యానీ వాట్ హాడ్జ్ (29), అమీ జోన్స్ (28), అలైస్ క్యాప్సీ (28), డానియెలా గిబ్సన్ (11 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. సోఫీ డంక్లీ (10), హీథర్ నైట్ (18) తక్కువ స్కోర్లతో ఔటయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి (4-025-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ (4-0-29-1), నందిని శర్మ (4-0-26-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. లారెన్ బెల్, ఛార్లోట్ డీన్, ఫ్రేయా కెంప్ తలో 2 వికెట్లు, సోఫీ ఎక్లెస్టోన్ ఓ వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. భారత ఇన్నింగ్స్లో 33 పరుగులు చేసిన యస్తికా భాటియా టాప్ స్కోరర్ కాగా.. స్మృతి మంధన 32, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 28, షఫాలీ వర్మ 22 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ 1, రిచా ఘోష్ 8, దీప్తి శర్మ 2, శ్రేయాంక 6, శ్రీచరణి 1, అరుంధతి రెడ్డి 4 (నాటౌట్), నందిని శర్మ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో బోణీ కొట్టింది. టాంటన్ వేదికగా జూన్ 2న జరిగే మూడో టీ20తో సిరీస్ డిసైడ్ అవుతుంది. తొలి టీ20లో భారత్ 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. మూడో టీ20 తర్వాత ఇరు జట్ల మధ్య జూన్ 10 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. -
మెరిసిన జెమీమా, యస్తిక
చెమ్స్ఫోర్డ్: బ్యాటింగ్లో జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (40 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్)... బౌలింగ్లో నందని శర్మ (3/34) రాణించడంతో... ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 38 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్కు దూరం కావడంతో... వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్లో టీమిండియాకు సారథ్యం వహించింది. ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ (3/34) తొలి ఓవర్లోనే భారత ఓపెనర్లు స్మృతి (0), షఫాలీ వర్మ (2)లను అవుట్ చేసింది. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ను జెమీమా, యస్తిక ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 76 బంతుల్లో 126 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే మూడు బంతుల తేడాలో జెమీమా, యస్తిక నిష్క్రమించారు. చివర్లో దీప్తి శర్మ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్కు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. అమీ జోన్స్ (48 బంతుల్లో 67; 9 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన చండీగఢ్ పేస్ బౌలర్ నందని శర్మ మూడు వికెట్లతో ఆకట్టుకుంది. క్రాంతి గౌడ్ రెండు వికెట్లు తీయగా... శ్రీచరణి, దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్లోని రెండో టి20 మ్యాచ్ ఈరోజు బ్రిస్టల్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ చానెల్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఎండలో చల్లదనం కోసం వెళ్లి 9 మంది మృతి
-
న్యూజిలాండ్ను కుప్పకూల్చిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్కప్కు (జూన్ 12) ముందు ఇంగ్లండ్ మహిళల జట్టుకు మంచి బూస్టప్ లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. హోవ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను చేజిక్కించుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్దిని 19.1 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్.. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.ఇంగ్లండ్ బౌలర్లలో డేనియల్ గిబ్సన్, కెప్టెన్ ఛార్లెట్ డీన్ తలో 3, లిన్సే స్మిత్ 2, ఇస్సీ వాంగ్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను మట్టుబెట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసిన జెస్ కెర్ టాప్ స్కోరర్ కాగా.. ఇసబెల్లా గేజ్ (17), మ్యాడీ గ్రీన్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూజీ బేట్స్ (3), కెప్టెన్ అమేలియా కెర్ (5), బ్రూక్ హ్యాలిడే (2), నెన్సీ పటేల్ (2), బ్రీ ఇల్లింగ్ (3) సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. సోఫీ డివైన్, ఇజ్జీ షార్ప్ డకౌట్ అయ్యారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో సోఫీ డంక్లీ 22, హీథర్ నైట్ 18, అలైస్ క్యాప్సీ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. మియా బౌచియర్ (19 నాటౌట్), ఫ్రేయా కెంప్ (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్, నెన్సీ పటేల్, అమేలియా కెర్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి వన్డే ఇంగ్లండ్, మూడో వన్డే న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే డ్రాగా ముగిసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించింది. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా-ఏ జట్టు ఘన విజయం సాధించింది. అరండల్ (ఇంగ్లండ్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పెద్దగా అనుభవం లేని లయన్స్ను ప్రొటీస్-ఏ టీమ్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 157, రెండో ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లోనే (331 ఆలౌట్) భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకొని, రెండు ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని (214) కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో సెనోక్వానే (55), జోర్డన్ హెర్మన్ (70 నాటౌట్), జుబేర్ హంజా (54 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ మార్కస్ అకెర్మన్ (173) భారీ సెంచరీతో కదంతొక్కాడు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. కనీసం ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. 25 పరుగులు చేసిన ఏకాన్ష్ సింగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జేసన్ స్మిత్ 4, మొకోయెనా 3, డేన్ పీటర్సన్ 2, బార్ట్మన్ ఓ వికెట్తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైన లయన్స్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్నారు. ఓపెనర్ ఆసా ట్రైబ్ (135), బెన్ మేస్ (105) సెంచరీలతో సత్తా చాటారు. అయినా వారు సౌతాఫ్రికా ముందు సరిపడా లక్ష్యాన్ని ఉంచలేకపోయారు. దీంతో స్వదేశంలో లయన్స్కు ఓటమి తప్పలేదు. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మే 29న మొదలవుతుంది. -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది. డెర్బీ వేదికగా నిన్న (మే 20) జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (45) ఓ మోస్తరు స్కోర్తో రాణించింది. మిగతా ప్లేయర్లలో ఇజ్జీ షార్ప్ 26 (నాటౌట్), మ్యాడీ గ్రీన్ 23, ఇసబెల్లా గేజ్ 12, బ్రూక్ హ్యాలిడే 14, కెప్టెన్ అమేలియా కెర్ 8, జెస్ కెర్ 5, జార్జియా ప్లిమ్మర్ డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఛార్లోట్ డీన్ తలో 2 వికెట్లు తీయగా.. లిన్సే స్మిత్, డేనియెలా గిబ్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అలైస్ క్యాప్సీ (74 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను గెలిపించింది. ఆమెకుయ ఫ్రేయా కెంప్ (31 నాటౌట్) సహకరించింది. మిగతా ప్లేయర్లలో హీథర్ నైట్ 19, సోఫీ డంక్లీ 8, మియా బౌచర్ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్ 2, జెస్ కెర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో రెండో టీ20 మే 23న జరుగనుంది. -
ఇంగ్లండ్-న్యూజిలాండ్ సిరీస్ సమం
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ సిరీస్లో తొలి వన్డే ఇంగ్లండ్, మూడో వన్డే న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.కార్డిఫ్ వేదికగా తాజాగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడి ఆటంకాల నడుమ 33 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అలిస్ క్యాప్సీ 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. హీథర్ నైట్ 28, యామీ జోన్స్ 27, ఫ్రేయా కెంప్ 20, ఎమ్మా లాంబ్ 7, జోడీ గ్రూకాక్ 10, డానియెల్లా గిబ్సన్ 2, కెప్టెన్ ఛార్లెట్ డీన్ 16 (నాటౌట్), సోఫీ ఎక్లెస్టోన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్, రోస్మేరీ మైర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, అమేలియా కెర్, నెన్సీ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదన సమయంలో వరుణుడు మళ్లీ ఆటంకాలు కలిగించడంతో న్యూజిలాండ్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా ప్రకటించారు. 24.4 ఓవర్ల వద్ద భారీ వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రూక్ హల్లీడే 42, ఇసబెల్లా గేజ్ 22 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మ్యాడీ గ్రీన్ 37 పరుగులతో రాణించింది. మిగతా బ్యాటర్లలో సూజీ బేట్స్ 12, జార్జియా ప్లిమ్మర్ 7, అమేలియా కెర్ 1 పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, డేనియెలా గిబ్సన్ ఓ వికెట్ తీసింది. మే 20 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ డెర్బీ వేదికగా జరుగనుంది. -
ఒక చీకటి సందర్భం.. పాఠాలు నేర్పిన 1991 సంక్షోభం
-
10,000 రన్స్.. 380 వికెట్లు! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ డాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు డాసన్ ప్రకటించాడు. 36 ఏళ్ల డాసన్.. తన వైట్ బాల్ కెరీర్ను మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డాసన్ తన 19 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200 మ్యాచ్లు హాంప్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు.2026 కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా హాంప్షైర్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్ల్లో నాలుగింటిలో డాసన్ పాల్గోన్నాడు. కానీ టోర్నమెంట్ మధ్యలోనే అతడు తప్పుకోని అందరికి షాకిచ్చాడు. అయితే న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే డాసన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.వైట్ బాల్ క్రికెట్పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డాసన్ చెబుతున్నప్పటికి, టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతోనే రెడ్ బాల్ క్రికెట్కు అతడు వీడ్కోలు పలికాడని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది."నేను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు.వైట్-బాల్ క్రికెట్లో నా కెరీర్ను మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. హాంప్షైర్ తరపున 200కు పైగా మ్యాచ్లు ఆడటం నాకు ఎంతో గర్వకారణం. ఈ క్రికెట్ క్లబ్తో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 19 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని డాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో 218 మ్యాచ్లు ఆడిన డాసన్.. 10828 పరుగులతో పాటు 380 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట 18 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 4 టెస్టులు ఆడిన డాసన్.. కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్య ఓవర్లలో జట్టుకు కీలకంగా మారిన.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ స్వదేశానికి పయనమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్-2026 టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.స్పందించిన ఫ్రాంఛైజీఈ విషయంపై చెన్నై యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘జేమీ ఓవర్టన్ (Jamie Overton) కుడి తొడకు గాయమైంది. అతడు యూకేకు వెళ్లిపోతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గాయంపై స్పష్టత వస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న చెన్నై జట్టు.. ఆరింట గెలిచింది.కీలక ఆల్రౌండర్గాతద్వారా 12 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కీలక ఆల్రౌండర్ అయిన ఓవర్టన్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికి 10 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్.. 14 వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. 136 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. సీజన్ ఆరంభం నుంచి చెన్నైని గాయాల బెడద వేధిస్తోంది. జట్టు దిగ్గజ సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ సమస్యల వల్ల ఇప్పటికి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక పేసర్ రామకృష్ణ ఘోష్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన వేళ.. భారీ షాక్!అంతకు ముందే పేసర్ ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే, నాథన్ ఎల్లిస్.. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యారు. కాగా టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై.. అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది. ఇలాంటి కీలక సమయంలో ఓవర్టన్ జట్టుకు దూరం కావడంతో భారీ షాక్ తగిలినట్లయింది.ఇక ఇప్పటికి 11 మ్యాచ్లలో 430 పరుగులు సాధించి సంజూ శాంసన్ చెన్నై తరఫున టాప్ రన్ స్కోరర్గా ఉండగా.. పేసర్ అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లు కూల్చి టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
సారా టేలర్కు అరుదైన అవకాశం
లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ సారా టేలర్అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్ పురుషుల టెస్టు జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఆమె ఎంపికైంది. న్యూజిలాండ్తో త్వరలో జరిగే టెస్టు సిరీస్లో ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ఒక మహిళా కోచ్ పని చేయనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. 37 ఏళ్ల సారా టేలర్ తన 13 ఏళ్ల కెరీర్లో 226 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి అత్యుత్తమ వికెట్ కీపర్గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లండ్ టీమ్లో ఆమె కీలక పాత్ర పోషించింది. రిటైర్మెంట్ అనంతరం కోచింగ్ వైపు మళ్లిన సారా...ఆండ్రూ ఫ్లింటాఫ్తో కలిసి ఇంగ్లండ్ యువ జట్టుకు పని చేసింది. -
ఇంగ్లండ్ జట్టులో ఇటలీ క్రికెటర్ 'గే'
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ జాక్ క్రాలీపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎమిలియో గేను రంగంలోకి దించాలని సెలక్టర్లు నిర్ణయించారు. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా కివీస్తో జరగనున్న తొలి టెస్టులో గే ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేయనున్నాడు.ఇటలీ నుంచి ఇంగ్లండ్కుఅయితే 26 ఏళ్ల ఎమిలియో గే ఇప్పటికే ఇటలీ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గే ఇంగ్లండ్లోని బెడ్ఫోర్డ్లో జన్మించినప్పటికీ.. అతడి తల్లి ఇటలీ దేశస్థురాలు కావడంతో ఆ దేశం తరఫున ఆడే అవకాశం లభించింది. 2025లో ఇటలీ తరపున మూడు టీ20 మ్యాచ్లు అతడు ఆడాడు. 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్లో స్కాట్లాండ్పై అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి గే అందరి దృష్టిని ఆకర్షించాడు.పొట్టి ప్రపంచకప్నకు ఇటలీ అర్హత సాధించడంలో అతడిది కీలక పాత్ర. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్కు తన మకాంను మార్చిన గే.. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో డర్హామ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2026 కౌంటీ సీజన్లో అతడు కేవలం మ్యాచ్ల్లోనే 92 సగటుతో 554 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. దీంతో అతడికి ఇంగ్లండ్ టెస్టు జట్టులో తొలిసారి అతడికి చోటు దక్కింది. అంతకుముందు ఇయాన్ మోర్గాన్ కూడా ఐర్లాండ్ నుంచి వచ్చి ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 ప్రపంచకప్ను గెలుచుకుంది. -
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు
మహిళల క్రికెట్లో భాగంగా నిన్న (మే 10) జరిగిన వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ వికెట్ తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో బోణీ కొట్టింది. న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్లోని రెండో మ్యాచ్ మే 13న నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.రాణించిన గ్రీన్, కెర్చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు మ్యాడీ గ్రీన్ (88), కెప్టెన్ అమేలియా కెర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా జట్టులో ఎవ్వరూ ఓ మోస్తరు స్కోర్లైనా చేయలేదు. దీంతో న్యూజిలాండ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. మిగతా ప్లేయర్లలో జార్జియా ప్లిమ్మర్ (20), ఇసబెల్లా గేజ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. సూజీ బేట్స్ (6), బ్రూక్ హాల్లీడే (6), ఇజ్జీ షార్ప్ (6), జెస్ కెర్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నెన్సి పటేల్, బ్రీ ల్లింగ్ డకౌట్ కాగా.. రోస్మేరీ 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, కోల్మన్, ఛార్లోట్ డీన్ తలో 2 వికెట్లు తయగా.. లారన్ ఫైలర్, గిబ్సన్, గ్రివ్కాక్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఇంగ్లండ్ను గెలిపించిన డీన్స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడినప్పటికీ.. చివరికి విజయం సాధించింది. కెప్టెన్ డీన్ 31 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మియా బౌచర్ (59), కెంప్ (30), గిబ్సన్ (19), లారెన్ బెల్ (12), కోల్మన్ (3 నాటౌట్) సహకరించారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ 3, అమేలియా కెర్ 2, జెస్ కెర్, ఇల్లింగ్, నెన్సి పటేల్ తలో వికెట్ తీసి ఇంగ్లండ్ను ఇబ్బంది పెట్టారు. -
స్టార్మర్కు గట్టి షాక్
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ ఊహించని షాక్కు గురైంది. తాజాగా జరిగిన ప్రాంతీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంగ్లండ్లోని వెయ్యి సీట్లు సహా మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 1,400కుపైగా స్థానాలను కోల్పోయింది. అనూహ్యంగా రిఫార్మ్ యూకే తెరపైకి వచి్చంది. సీనియర్ రాజకీయ నేత నిగెల్ ఫరేజ్ సారథ్యంలోని వలస వ్యతిరేక అజెండా కలిగిన ఈ పార్టీ ఇప్పటి వరకు 1,440 కౌన్సిల్ స్థానాలకు గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్పై అసమ్మతి స్వరం మరింతగా పెరిగింది. ఆయన పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రధాని కియర్ స్టార్మర్ పాలనపై అనధికారిక ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన పార్టీని అధికారం దిశగా నడిపించిన స్టార్మర్ ప్రజాదరణ ఆ తర్వాత వేగంగా తగ్గిపోతూ వచి్చంది. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఆయన పదవికి ఇప్పటికిప్పుడు వచి్చన ముప్పేమీ లేదని విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోవడం, ఆర్థిక పురోగతి మందగించడం, సంక్షేమ వ్యయం తగ్గించడం వంటివి లేబర్ పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. లేబర్ పార్టీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో దెబ్బతింది. అధికార లేబర్ పార్టీకి 50 ఏళ్లుగా కంచుకోటలుగా ఉన్న సుండర్లాండ్, బార్న్స్లే వంటి చోట్ల రిఫార్మ్ పార్టీ జెండా ఎగురవేసింది. కన్జర్వేటివ్లకు మంచిపట్టున్న న్యూకాజిల్–అండర్–లైమ్, సఫోక్, ఎస్సెక్స్ ప్రాంతాలు కూడా ఈ పార్టీ వశమయ్యాయి. ఎసెక్స్ నుంచే అరడజను మంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. కన్జర్వేటివ్ పార్టీకి సంప్రదాయబద్ధంగా పట్టున్న ప్రాంతాల్లో రిఫార్మ్ పార్టీ ఓట్లను చీల్చడం, నేరుగా గెలవడం ద్వారా ప్రభావాన్ని చాటుకుంది. ఇంతేకాదు, మొట్ట మొదటిసారిగా లండన్ పరిధిలో ఉన్న హవెరింగ్నూ రిఫార్మ్ యూకే పార్టీ గెల్చుకుంది. వేల్స్లో 27 ఏళ్ల తర్వాత ఓటమి అధికార లేబర్ పార్టీ వేల్స్లో 27 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయింది. వేల్స్ జాతీయ పార్లమెంట్(సెనెడ్)లో ప్లాయిడ్ కమ్రీ పార్టీ ఘన విజయం సాధించింది. సెనేడ్లోని 96 స్థానాలకు గాను ప్లాయిడ్ కమ్రీ 43 సీట్లను గెల్చుకుంది. అయితే, మెజారిటీకి కొద్దిదూరంలో నిలిచింది. ఇక్కడా రిఫార్మ్ యూకే పార్టీ దూకుడు కొనసాగింది. ఎవరూ ఊహించని రీతిలో సెనేడ్లో ఈ పార్టీ 34 సీట్లు కైవసం చేసుకోగా లేబర్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. లేబర్ ఫస్ట్ మినిస్టర్గా ఉన్న ఎల్యునెడ్ మోర్గాన్ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటిదాకా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 22 మంది సభ్యులుండగా, తాజాగా ఏడుగురు మాత్రమే విజయతీరాలకు చేరారు. ఇంగ్లండ్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే లండన్లో మాత్రం లేబర్ మంచి ఫలితాలనే సాధించుకుంది. ప్రధాని స్టార్మర్ సొంత నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్కు పొరుగునున్న కామ్డెన్లో 16 సీట్లను కోల్పోయినప్పటికీ లేబర్ పార్టీ పట్టునిలుపుకుంది. ఇక్కడ గ్రీన్ పార్టీకి 10 సీట్లు దక్కాయి. ఈ ఫలితాలు స్టార్మర్కు కొంత ఊరట కలిగించాయని చెప్పవచ్చు.పదవి నుంచి వైదొలగను: స్టార్మర్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలంటూ వెలుపలి నుంచి విని్పస్తున్న డిమాండ్లపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ‘ఈ పరిస్థితుల్లో నేను పదవి నుంచి తప్పుకోను. దేశాన్ని అస్థిరతలోకి నెట్టివేయబోను’అని స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనవసరమైన కొన్ని తప్పిదాలు చేసిందని, మొదటి రెండేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందని అంగీకరించారు. మంత్రివర్గ సహచరులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎవ్వరూ వ్యతిరేక గళం వినిపించలేదు. గట్టి పోటీదారులుగా భావించే లేబర్ పార్టీ నేతలెవరూ ఆయన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో స్టార్మర్ తర్వాతి స్థానంలో ఉండే అండీ బర్న్ హామ్, ఏంజెలా రేనర్ వంటి వారు సైతం మౌనంగా ఉన్నారు.స్కాట్లాండ్లో ఎస్ఎన్పీకి ఆధిక్యం స్కాట్లాండ్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) వరుసగా ఐదోసారి విజయం సాధించింది. అయితే, పూర్తి మెజారిటీ సాధనలో వెనుకబడిపోయింది. మొత్తం 129 సీట్లకుగాను ఎస్ఎన్పీ 58 స్థానాలను మాత్రమే సాధించింది. ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పెర్త్షైర్ నార్త్ సీటును నిలబెట్టుకున్నారు. అయితే, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆయన ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రిఫార్మ్ పార్టీ కూడా లేబర్ పార్టీతో సమానంగా 17 సీట్లు గెల్చుకోగా, గ్రీన్స్ పార్టీకి 15 సీట్లు దక్కాయి. స్వతంత్ర స్కాట్లాండ్ నినాదానికి మద్దతిచ్చే పార్టీ కావడంతో ఎస్ఎన్పీ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయి. స్కాట్లాండ్ను బ్రిటన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చడం ఎస్ఎన్పీ ప్రధాన అజెండా. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం వల్ల రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కష్టం కానుంది. -
భారత్ లేకుండా టోర్నీ.. పాక్ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం
అంతర్జాతీయ వేదికపై భారత్కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్తో వన్డే ట్రై సిరీస్ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం పాక్తో క్రికెట్ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. పాక్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్-నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్ చేసుకున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పాక్లో ట్రై సిరీస్ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగనుంది. ట్రై సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్లో జరిగే అవకాశం ఉంది.బంగ్లాదేశ్లో పర్యటించనున్న పాక్రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా జరుగనుంది.బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ, సల్మాన అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది -
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. పసికూన జర్మనీ.. ఇంగ్లండ్, భారత్ను సైతం వెనక్కు నెట్టి మూడో అత్యధిక టీమ్ స్కోర్ను నమోదు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రియాతో ఇవాళ (మే 1) జరిగిన తొలి టీ20లో జర్మనీ రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 308 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది.అంతర్జాతీయ టీ20ల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియా కూడా ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న జర్మనీ ఈ ఘనత సాధించడం చరిత్రాత్మకం.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఐసీసీ ఫుల్ మెంబర్ జట్లలో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకింది. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జర్మనీ ఈ రికార్డును సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.భారత్కు పలు మార్లు 300 పరుగుల మార్కును తాకే అవకాశం వచ్చినా, ఒక్కసారి కూడా తాకలేదు. 2024లో బంగ్లాదేశ్పై చేసిన 297 పరుగులే టీ20ల్లో టీమిండియాకు అత్యధికం. ఈ విభాగంలో అత్యధిక స్కోర్ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2024లో ఈ జట్టు గాంబియాపై ఏకంగా 344 పరుగులు చేసింది. జింబాబ్వే తర్వాత అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్ పేరిట ఉంది. నేపాల్ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు* జింబాబ్వే – 344* నేపాల్ – 314* జర్మనీ – 308* ఇంగ్లండ్ – 304* భారత్ – 297మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జర్మనీ.. ఓపెనర్లు బెన్ కొహ్లెర్ కాడ్మోర్ (58 బంతుల్లో 133 నాటౌట్; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), ముసద్దిక్ అహ్మద్ (48 బంతుల్లో 122; 11 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 308 పరుగులు చేసింది. ముసద్దిక్ ఔటయ్యాక వచ్చిన షాహిద్ అఫ్రిది (34 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రియా 15.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై, 162 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆ జట్టు తరఫున ఓపెనర్ కరణ్బీర్ సింగ్ (84) ఒక్కడే రాణించాడు. యూరప్లో కొత్త శక్తిఅంతర్జాతీయ టీ20ల్లో 300 పరుగుల మార్క్ తాకిన తొలి జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇది కేవలం జర్మనీ క్రికెట్కే కాదు, యావత్ యూరోపియన్ క్రికెట్ అభివృద్ధికి గొప్ప సంకేతం.బెన్ ఎవరు..?ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన బెన్ కొహ్లెర్ కాడ్మోర్, ఇంగ్లండ్ క్రికెటర్ టామ్ కొహ్లెర్ కాడ్మోర్కు సోదరుడు. తల్లి జర్మనీ దేశస్థురాలు కావడం చేత బెన్ ఆ దేశం తరఫున ఆడే అర్హత సాధించాడు. -
ఇంగ్లండ్ సిరీస్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన
త్వరలో ఇంగ్లండ్ లయన్స్తో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా మార్క్వెస్ అకెర్మన్ ఎంపిక కాగా.. పలువురు జాతీయ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా-ఏ జట్టు మే 22 నుంచి జూన్ 9 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు అనధికారిక వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టు మే 16న ఇంగ్లండ్కు బయల్దేరనుంది.ఈ పర్యటనలో తొలుత నాలుగు రోజుల మ్యాచ్లు జరుగనున్నాయి. మే 22-25 వరకు అరండల్ వేదికగా తొలి మ్యాచ్, మే 29-జూన్ 1 వరకు బెకెన్హమ్ వేదికగా రెండో మ్యాచ్ జరుగనున్నాయి.అనంతరం జూన్ 5న లీసెస్టర్ వేదికగా తొలి వన్డే, జూన్ 7న వార్సెస్టర్ వేదికగా రెండో వన్డే, జూన్ 9న వార్సెస్టర్ వేదికగా మూడో వన్డే జరుగనున్నాయి.నాలుగు రోజుల మ్యాచ్లకు సౌతాఫ్రికా-ఏ జట్టు..మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, జుబైర్ హమ్జా, జోర్డన్ హెర్మన్, రూబిన్ హెర్మన్, న్కోబాని మొకోయెనా, డేన్ ప్యాటర్సన్, సినేతెంబా క్వెషిలే, లెసెగో సెనోక్వానే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్, టియాన్ వాన్ వూరెన్, కోడి యూసఫ్.వన్డే సిరీస్కు సౌతాఫ్రికా-ఏ జట్టు..మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, Gerald Coetzee, టోనీ డి జోర్జి, కానర్ ఎస్టర్హుయిజెన్, డియాన్ ఫోరెస్టర్, బ్జోర్న్ ఫోర్టుయిన్, రూబిన్ హెర్మన్, క్వేనా మఫాకా, న్కోబాని మొకోయెనా, న్కాబా పీటర్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, సినేతెంబా క్వెషిలే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్. -
టీ20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు మరో నెలన్నర సమయం ఉండగానే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా నాట్ స్కీవర్ బ్రంట్ ఎంపిక కాగా.. ఆమెకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఛార్లీ డీన్ ఎంపికైంది.ఈ జట్టుకు ఓ సంచలన ఎంపిక జరిగింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండానే 18 ఏళ్ల టిల్లీ కార్టీన్-కోల్మన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన టిల్లీ, సర్రే తరఫున అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి కీలక బలంగా మారే సామర్థ్యం ఆమెకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ జట్టుకు ఇస్సీ వాంగ్, లారెన్ ఫైలర్ కూడా ఎంపికయ్యారు. వీరికి ఇదే తొలి టీ20 ప్రపంచకప్. మొత్తంగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టు కొత్త వారు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ఈ జట్టు ఎంపికపై హెడ్ కోచ్ ఛార్లోట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక చాలా కఠినమైన ప్రక్రియగా మారిందన్నారు. ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటం ఇంగ్లండ్ మహిళా క్రికెట్ బలాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న ఈ ప్రపంచకప్ తమకు ప్రత్యేకమని, అభిమానుల మద్దతుతో గొప్ప ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.కాగా, జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ 2026 జరుగనుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టు ఇదేనాట్ సైవర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, ఏమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హెథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వైట్-హాడ్జ్. -
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
31 ఏళ్ల పాకిస్తాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే బ్రిటిష్ పౌరసత్వం పొందిన అ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.లాహోర్లో జన్మించిన గోహర్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం 2021లో న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టు అవకాశాలు రాలేదు. దీంతో విరక్తి చెందిన గోహర్ పాక్ నుంచి ఇంగ్లండ్కు మాకం మార్చేశాడు. స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో 2 వికెట్లు తీసి, 86 పరుగులు చేసిన గోహర్.. దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 343 వికెట్లు తీసి, 3000కుపైగా పరుగులు సాధించాడు.దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు తనను పట్టించుకోలేదని గోహర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని బోర్డు, సెలక్షన్ కమిటీ తన ప్రతిభను గుర్తించలేదని బహిరంగ ఆరోపణలు చేశాడు.గోహర్ దేశీయ దేశవాలీ క్రికెట్తో పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. అయితే పాక్ సెలెక్టర్లు గోహర్ కౌంటీ ప్రదర్శనలను విస్మరించారు. ఓ సెలెక్టర్ ఏకంగా గోహర్ కౌంటీ ప్రదర్శనలను చిత్తు కాగితాలపై లెక్కలుగా అభివర్ణించాడు. దీంతో విసిగిపోయిన అతను ఇంగ్లండ్కు మకాం మార్చి, అక్కడ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.ఇంగ్లండ్లో నాలుగు సీజన్లు గడిపిన గోహర్, ప్రస్తుతం మిడిల్సెక్స్ తరఫున స్థానిక ఆటగాడిగా ఆడుతున్నాడు. కౌంటీ చాంపియన్షిప్లో బ్యాట్, బాల్తో రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్ బౌలర్ల కొరత ఉంది. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన ఎడమచేతి స్పిన్నర్ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గోహర్కు అవకాశం లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జాక్ లీచ్ స్థానాన్ని భర్తీ చేసే దీర్ఘకాలిక ఎంపికగా గోహర్ను ఇంగ్లండ్ పరిశీలించే అవకాశం ఉంది. అవకాశం వస్తే సిద్ధంగా ఉంటానని గోహర్ స్పష్టం చేశాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ సమిత్ పటేల్ దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. భారత్లో నిర్వహించిన అనుమతి లేని లీగ్లో పాల్గొనడం కారణంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై 12 నెలల నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 41 ఏళ్ల సమిత్ 2008 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ తరఫున 60 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అయితే అతనికి అసలైన గుర్తింపు కౌంటీ క్రికెట్లోనే దక్కింది. ముఖ్యంగా నాటింగ్హమ్షైర్ కౌంటీ క్లబ్కు అతను రెండు దశాబ్దాలకు పైగా సేవలందించాడు.తన కౌంటీ కెరీర్లో 25 వేలకుపైగా పరుగులు, 800కుపైగా వికెట్లు సాధించి అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ సత్తా చాటి తన జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.ఇటీవల గోవాలో జరిగిన వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్లో పాల్గొనడం సమిత్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈసీబీ నిబంధనల ప్రకారం, అనుమతి లేని టోర్నమెంట్లలో ఆడిన ఆటగాళ్లు ఏడాది పాటు ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో ఆడటానికి అనర్హులు అవుతారు.ఈ నిషేధంతో తన దేశీయ కెరీర్కు ముగింపు పలకక తప్పలేదని సమిత్ వెల్లడించాడు. ఈ పరిణామాలు ముందే తెలిసి ఉంటే ఆ లీగ్లో ఆడేవాడిని కాదు. ఇంకా ఒక సీజన్ ఆడే అవకాశం ఉండేదని సమిత్ బాధపడ్డాడు. ఇంగ్లండ్ దేశీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సమిత్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్లలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.రిటైర్మెంట్ ప్రకటన అనంతరం నాటింగ్హమ్షైర్ కౌంటీ సమిత్ సేవలను ఘనంగా కొనియాడింది. క్లబ్ డైరెక్టర్ మిక్ న్యూవెల్ మాట్లాడుతూ.. సమిత్ సాధించిన విజయాలు నాటింగ్హమ్షైర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. అతని నిబద్ధత, పోరాట పటిమ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయని ప్రశంసించారు. -
పాకిస్తాన్ క్రికెటర్లకు సువర్ణావకాశం
నలుగురు పాకిస్తాన్ క్రికెటర్లు లక్కీ ఛాన్స్ కొట్టారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ దేశవాలీ సీజన్ కోసం వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు. మొహమ్మద్ అబ్బాస్, సుఫియాన్ ముఖీమ్ను డెర్బీషైర్.. ఉసామా మిర్ను వార్సెస్టర్షైర్ జట్లు ఎంపిక చేసుకున్నాయి. మొహమ్మద్ నవాజ్ టీ20 బ్లాస్ట్ (జట్టు ఖరారు కాలేదు) ఆడేందుకు అనుమతి పొందాడు. వీరందరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు NOCలు జారీ చేసింది. వీరిలో నవాజ్, ఉసామా మిర్కు దీర్ఘకాలిక అనుమతి లభించగా.. సుఫియాన్ ముఖీమ్ జూన్ 7 వరకు మాత్రమే అనుమతి పొందాడు. మరో క్రికెటర్ అబ్బాస్కు సీజన్ మొత్తానికి అనుమతి లభించింది.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన మొహమ్మద్ నవాజ్, స్పిన్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ T20 బ్లాస్ట్లో మాత్రమే ఆడనుండగా.. ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ కౌంటీ ఛాంపియన్షిప్తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఉసామా మిర్ విషయానికొస్తే.. ఈ వైవిధ్యభరితమైన స్పిన్ బౌలర్ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతి పొందాడు. నవాజ్, ముఖీమ్, ఉసామా మిర్ T20 బ్లాస్ట్లో ప్రతిభను చూపి, పాకిస్తాన్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు వీరికి ఇది సువర్ణావకాశం. -
ఇంగ్లండ్ క్రికెట్కు భారీ దెబ్బ
ఇంగ్లండ్ క్రికెట్కు భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కొంతకాలం ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉండనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్కు ముందు ఈ వార్త వెలువడింది. స్టోక్స్ కౌంటీ జట్టు (డర్హమ్) కోచ్ ర్యాన్ క్యాంప్బెల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.అతని మాటల్లో.. స్టోక్స్ త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్కు అందుబాటులో ఉండాల్సింది. కానీ వైద్యులు అతనికి అనుమతి ఇవ్వలేదు. జూన్లో న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా అతను అందుబాటులో ఉండవపోవచ్చు.క్యాంప్బెల్ ఇచ్చిన ఈ సమాచారం మేరకు స్టోక్స్ సమీప భవిష్యత్తులో క్రికెట్ ఆడటం కష్టమేనని స్పష్టమవుతుంది. స్టోక్స్ ఇటీవల నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బంతి ముఖానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీని వల్ల అతని ముఖానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. గాయమైన ముఖంతో స్టోక్స్ పెట్టిన పోస్ట్ సోషల్మీడియాలో వైరలైంది.స్టోక్స్ చివరిగా జనవరి 8న సిడ్నీలో జరిగిన యాషెస్ టెస్ట్లో ఆడాడు. ఆ మ్యాచ్కు ముందు కూడా అతను గాయపడ్డాడు. వరుస గాయాలు అతని కెరీర్ను సందిగ్దంలో పడేశాయి. స్టోక్స్ వ్యక్తిగతంగా, నాయకుడిగా విఫలం కావడంతో ఇంగ్లండ్ ఇటీవలి యాషెస్ సిరీస్ను 1-4తో కోల్పోయింది. ఈ దారుణ పరాభవం తర్వాత కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్ను టెస్ట్ కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజా గాయం స్టోక్స్ కెరీర్ను ప్రశ్నార్థకంగా మర్చేసింది.ఆటకు దూరంగా ఉన్నా, స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్కు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు అతను కోచ్గా సేవలందిస్తున్నాడు. -
సారీ... ఈ సీజన్ ఆడలేను: డకెట్
లండన్: ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఈ సీజన్ ఐపీఎల్ బరిలోకి దిగడం లేదని చావుకబురు చల్లగా చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాల్సిన అతను చాలా ఆలస్యంగా తన గైర్హాజరు నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ తప్పలేదు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెబుతున్నా. వేలంలో నాపై నమ్మకముంచి ఐపీఎల్ ఆడే అవకాశమిచి్చన ఫ్రాంచైజీ తరఫున ఆడలేకపోవడం విచారకరం’ అని డకెట్ పోస్ట్ చేశాడు. దీంతో ఐపీఎల్ నియమావళి ప్రకారం అతను రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశముంది. లీగ్ నిబంధన ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్నాక సహేతుక కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్నెస్ సమస్యలు, పితృత్వపు సెలవులకు మినహాయింపు ఉంటుంది. డకెట్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎక్కువసేపు గడిపేందుకు భారత్కు రావడం లేదని చెప్పాడు. దీంతో అతనికి నిషేధం తప్పదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో... ఈ సీజన్కు ముందు ఫ్రాంచైజీలన్నీ గాయాల బెడదను ఎదుర్కొంటున్నాయి. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో సీజన్ మొత్తానికి దూరమయ్యారు. తాజాగా వారి స్థానాలను ఆయా ఫ్రాంచైజీలు భర్తీ చేసుకున్నాయి. » కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేసర్ ఆకాశ్దీప్ స్థానంలో రూ. 30 లక్షలతో సౌరభ్ దూబేను తీసుకుంది. » సన్రైజర్స్ హైదరాబాద్ జాక్ ఎడ్వర్డ్స్ (ఆ్రస్టేలియా) స్థానాన్ని డేవిడ్ పైన్ (ఇంగ్లండ్; రూ.1.5 కోట్లు)తో భర్తీ చేసుకుంది. » చెన్నై సూపర్ కింగ్స్ గాయపడిన నాథన్ ఎలీస్ స్థానంలో ఆసీస్కే చెందిన సహచరుడు స్పెన్సర్ జాన్సన్ (రూ. 1.5 కోట్లు)ను తీసుకుంది. -
నీలం రంగులోకి మారిపోయిన మనిషి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..!
లండన్: ఇటీవల యూకేలోని డెర్బిషైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్ విషయం బయటపడింది.అసలేం జరిగిందంటే..?42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే బర్టన్-ఆన్-ట్రెంట్లోని క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు.అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ సంఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు.విషయం తెలిసి నవ్వుకున్నారు..!ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా పక్కున నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆతర్వాత నవ్వించిన ఈ ఘటన సోషల్మీడియాలో వైరలైంది. -
రన్నరప్గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తరఫున 13వ నిమిషంలో గ్రేస్ బాల్స్డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ గోల్స్ సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంనుంచి భారత్ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ సఫలమైంది. తొలి క్వార్టర్ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్లో భారత్ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్ నుంచి ఇంగ్లండ్కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్కు బాల్స్డన్ గోల్ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్ వాడుకోలేకపోయింది.అయితే మూడో క్వార్టర్ చివర్లో భారత డిఫెన్స్ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్ గోల్ కీపర్ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్ సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్కు చెందిన నవనీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. -
జాక్పాట్ కొట్టిన ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్
తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ లీగ్ వేలంలో ఓ అనామక ఆటగాడు జాక్పాట్ కొట్టాడు. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ససెక్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ను లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ఏకంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 4.8 కోట్లు) సొంతం చేసుకుంది. 75 వేల పౌండ్ల బేస్ప్రైజ్ విభాగంలో వేలంలో బరిలోకి దిగిన 21 ఏళ్ల కోల్స్ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు (బర్మింగ్హామ్ ఫీనిక్స్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ట్రెంట్ రాకెట్స్, సన్రైజర్స్ లీడ్స్) తీవ్రంగా పోటీపడ్డాయి. 35 బిడ్డింగ్ రౌండ్ల అనంతరం లండన్ స్పిరిట్ అతన్ని ఊహించని ధరకు దక్కించుకుంది.లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కమ్ డాషింగ్ బ్యాటర్ అయిన కోల్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో అతను టైటిల్ గెలిచిన సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 16 ఏళ్లకే ససెక్స్ తరఫున అరంగేట్రం చేసిన కోల్స్.. ఈ కౌంటీ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.చిన్న వయసులోనే 51 మ్యాచ్ల ఫస్ట్క్లాస్ కెరీర్ కలిగిన కోల్స్.. 82 ఇన్నింగ్స్ల్లో 38.42 సగటున పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 3.75 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు కలిగిన కోల్స్.. ఈ ఫార్మాట్లో 21 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీశాడు. హండ్రెడ్ లీగ్లో ఇంతకుముందే ప్రవేశమున్న కోల్స్.. ఈ లీగ్లో 16 మ్యాచ్లు ఆడి ఓ మోస్తరు ప్రభావం చూపించాడు. గత ఎడిషన్ సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ తరఫున ఆడిన కోల్స్.. 152 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. 2024-25లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున భారత్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన కోల్స్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. హండ్రెడ్ లీగ్లో జాక్పాట్ కొట్టడంతో, విదేశీ లీగ్ ఫ్రాంచైజీల కన్ను కోల్స్పై పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో కోల్స్ తన పేరు నమోదు చేసుకోలేదు. త్వరలో జరుగబోయే హండ్రెడ్ లీగ్లో కోల్స్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తే ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. హండ్రెడ్ వేలంలో కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.హెండ్రెడ్ లీగ్ వేలంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ లీగ్లోని తమ సిస్టర్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను (1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది.ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. -
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్–ఇంగ్లండ్ సెమీఫైనల్
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ చిచ్చరపిడుగు
నిన్న (మార్చి 5) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో, ఓవరాల్గా నాలుగోసారి ఫైనల్కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందే భారత్కు బ్రేక్ దొరకింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది. చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు, ముఖ్యంగా జేకబ్ బేతెల్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను.. విల్ జాక్స్, సామ్ కర్రన్ సహకారాలతో గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 18,19 ఓవర్లు బుమ్రా, హార్దిక్ కంట్రోల్ చేయకపోయుంటే పరిస్థితి వేరే ఉండేది. ఈ వీరోచిత శతకంతో బేతెల్ పలు భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ (105) చేసిన ఆటగాడిగా, నిన్ననే ఫిన్ అలెన్ (100) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బేతెల్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇదే తొలి సెంచరీ. ప్రపంచంలో ఏ క్రికెటర్ తన తొలి ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్ సెంచరీని అంతర్జాతీయ స్థాయిలో సాధించలేదు. చరిత్రలో జేకబ్ మొదటివాడు. ఇంగ్లండ్ తరఫున ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీలు చేసిన వారిలో జేకబ్ నాలుగో వాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్ జేకబ్దే. ఇంగ్లండ్ తరఫున టీ20 ప్రపంచకప్ల్లో అత్యధిక స్కోర్ రికార్డు అలెక్స్ హేల్స్ (116 నాటౌట్) పేరిట ఉంది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్ను ఫైనల్కు చేర్చింది. టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా బెతెల్కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్లో ఆటగాళ్లంతా ఏ బౌలర్ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్తో బ్రూక్ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్లో భారత్ నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.105 టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 5) అత్యంత కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్ ఉన్నా, ఇంగ్లండ్ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇరు జట్లు సెమీస్లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్ను కూడా సొంతం చేసుకుంది. గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.అత్యధిక టీమ్ టోటల్నేటి మ్యాచ్లో భారత్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లో అత్యధిక టీమ్ టోటల్ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్లో వాంఖడే మైదానంలోనే విండీస్పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.డేంజర్లో విరాట్ రికార్డునేటి మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్కప్ నాకౌట్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్ సెమీఫైనల్లో విండీస్పై విరాట్ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్, నాటౌట్) నేటి వరకు టీ20 ప్రపంచకప్ నాకౌట్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. నేటి మ్యాచ్లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.ఎవరు గెలిచినా రికార్డేనేటి మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్కు చేరాయి. నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్కు చేరగా.. ఇంగ్లండ్ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది. -
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
-
భారత్ ఫైనల్ గురి
3-2 టి20 వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్కు చేరింది. టి20 వరల్డ్ కప్ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్పై గత మ్యాచ్లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్కు కత్తి మీద సామే. ఇంగ్లండ్పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్ కీలకం విల్ జాక్స్... ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్రౌండర్గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్తో పాటు రెండో పేసర్గా ఒవర్టన్పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్. -
ఇండియాకు అగ్ని పరీక్ష..!
-
భారత జట్టు ముమ్మర సాధన
టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ పర్యవేక్షణలో అభిషేక్ శర్మ ప్రత్యేకంగా ఆఫ్ స్పిన్ను ఎదుర్కొంటూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అటు స్పిన్, ఇటు పేస్ బౌలింగ్లో సాధన చేశారు. కుల్దీప్ బౌలింగ్లో స్లాగ్స్వీప్లపై తిలక్ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్ సింగ్ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్ లేకుండా తనదైన శైలిలో స్పాట్ బౌలింగ్కే ప్రాధాన్యతనిచ్చాడు. హార్దిక్ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్కు రెండు రోజుల మాత్రం పిచ్పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది. -
మధ్యప్రాచ్యంలో యుద్దం.. ఆపదలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎక్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.For those writing that I’m with the England Lions team… I am not. I am with my young family in Dubai…sure the England Lions security staff will be doing all they can to get them out of Abu Dhabi but I am trying to keep my family safe and get us out of here!!— Jonny Bairstow (@jbairstow21) March 2, 2026ముందుగా బెయిర్స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ లయన్స్ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని బెయిర్స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్లో చిక్కుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్ లయన్స్ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్లోనే ఇరుక్కుపోయింది. -
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్ షాహీన్స్తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ లయన్స్ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్ దాడులతో అట్టుడికిపోతుంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ అమెరికా ఎయిర్బేస్ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్తో పాటు మిగతా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్ కోచింగ్ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సహా విధ్వంసకర వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్ 3-0 తేడాతో ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది. -
సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
-
ఉప ఎన్నికలో స్టార్మర్ పార్టీకి షాక్
లండన్: ఇంగ్ల్లండ్లో జరి గిన ఉప ఎన్నికలో అధికార లేబర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గోర్టన్ డెంటన్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గ్రీన్ పార్టీ అభ్యర్థి అనూహ్యంగా గెలుపొందారు. వృత్తిరీత్యా ప్లంబర్ అయిన హన్నా స్పెన్సర్(34) 4,402 ఓట్ల మెజారిటీ సాధించారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఈమెకు 14,980 ఓట్లు దక్కగా, రిఫార్మ్ యూకే పార్టీకి చెందిన మాథ్యూ గుడ్విన్కు 10,758 ఓట్లు, అధికార లేబర్ పార్టీ అభ్యర్థి ఏంజెలికి స్టోగియాకు 9,364 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో పార్లమెంట్లో గ్రీన్ పార్టీ ప్రాతినిధ్యం ఐదు స్థానాలకు పెరిగింది. గోర్టన్ డెంటన్ సీటు 1931 తర్వాత లేబర్ పార్టీ నుంచి చేజారడం ఇదే మొదటిసారి. తాజా ఓటమిపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ఇది చాలా నిరుత్సాహం కలిగించిన పరిణామమన్నారు. మధ్యంతర ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు సాధారణమేనంటూ సమరి్థంచుకున్నారు. అయితే, ఎన్నికల వేళ భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలతో స్టార్మర్ ఉన్న చిత్రాల కరపత్రాలను, ఉర్దూ వీడియోలను విడుదల చేయడం వంటి చర్యలతో అక్కడి అత్యధిక సంఖ్యలో ఉన్న బ్రిటిష్ పాకిస్తానీ ఓటర్లను గ్రీన్పార్టీ ప్రభావితం చేసిందన్న విమర్శలున్నాయి. 2024 ఎన్నికల్లో గోర్టన్డెంటన్ స్థానాన్ని లేబర్ పార్టీకి చెందిన అండ్రూ గ్విన్ 13,413 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. వేధింపుల ఆరోపణల కారణంగా ఆండ్రూ రాజీనామా చేయగా, తాజాగా ఉప ఎన్నిక నిర్వహించారు. -
టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ 'హ్యాట్రిక్'
కొలంబో: న్యూజిలాండ్తో ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్కు కష్టంగా మారిన పిచ్పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్ను ముగించారు. దాంతో ‘సూపర్ ఎయిట్స్’లో ఆడిన మూడు మ్యాచ్లూ గెలిచి ఇంగ్లండ్ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశాన్ని కివీస్ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), టీమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్ అలెన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్లు) కివీస్కు శుభారంభం అందించారు. ఆర్చర్ ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన రేహన్ అహ్మద్ తన తొలి బంతికే రచిన్ రవీంద్ర (11)ను అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్ మిడిలార్డర్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (2), బట్లర్ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), బెతెల్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్ బాధ్యత తీసుకోగా, స్యామ్ కరన్ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్ చేసి కివీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్ ప్రధాన పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ తర్వాత అతను న్యూజిలాండ్కు బయల్దేరాడు. జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత కివీస్ సెమీస్కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 35; అలెన్ (సి) బెతెల్ (బి) జాక్స్ 29; రచిన్ (సి) బెతెల్ (బి) రేహన్ 11; ఫిలిప్స్ (బి) జాక్స్ 39; చాప్మన్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 15; మిచెల్ (సి) జాక్స్ (బి) డాసన్ 3; సాంట్నర్ (నాటౌట్) 9; మెక్కోన్కీ (బి) రేహన్ 14; హెన్రీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్: ఆర్చర్ 3–1–24–0, డాసన్ 4–0–32–1, కరన్ 1–0–10–0, రషీద్ 4–0–28–2, జాక్స్ 4–0–23–2, బెతెల్ 1–0–13–0, రేహన్ 3–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సీఫెర్ట్ (బి) హెన్రీ 2; బట్లర్ (సి) సీఫెర్ట్ (బి) ఫెర్గూసన్ 0; బ్రూక్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 26; బెతెల్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 21; బాంటన్ (సి) చాప్మన్ (బి) రచిన్ 33; కరన్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 24; జాక్స్ (నాటౌట్) 32; రేహన్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్ 2–0–14–1, సాంట్నర్ 4–0–29–0, మెక్కోన్కీ 1–0–13–0, ఫిలిప్స్ 4–0–43–1, రచిన్ 4–0–19–3, సోధి 2–0–21–0. -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో కీలక సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్-2 నుంచి ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్.. మరో బెర్త్ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. తద్వారా పాక్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్, న్యూజిలాండ్ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ రన్ రేట్ 3.050గా ఉంది. అదే పాక్ రన్రేట్ -0.461గా ఉంది. పాక్ మైనస్ నుంచి ప్లస్ రన్రేట్లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్ రన్రేట్ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా, న్యూజిలాండ్కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్ జరిగి ఉంటే, న్యూజిలాండ్ సునాయాసంగా పాక్ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమతూకంగా కనిపించినా ఎడ్జ్ న్యూజిలాండ్వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్లో ఉన్నారు. అదే ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఓపెనర్ జోస్ బట్లర్, జేకబ్ బేతెల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్లో ఆదిల్ రషీద్ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ టీమ్
ఇంగ్లండ్ టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో సెమీస్కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది. వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో ఫైనల్-4కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్కు చేరింది. శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.తాజాగా ఎడిషన్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్.. తమ మూడో టైటిల్ దిశగా దూసుకుపోతుంది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. తాజాగా పాక్పై సూపర్-8 మ్యాచ్లో గెలుపుతో గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలిచింది. చివరి సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంది.మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఈ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్ల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్లతో తలపడాల్సి ఉంది.ఇదిలా ఉంటే, పల్లెకెలె వేదికగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్లో పాక్పై ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కనులపండుగగా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).అంతకుముందు సాహిబ్జాదా ఫర్హాన్ (63) రాణించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పాక్పై మ్యాచ్ విన్నింగ్ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్
టీ20 వరల్డ్కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీహ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్లో)అలెక్స్ హేల్స్- 60జోస్ బట్లర్- 67టీ20 వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లుబ్రూక్- 100 (తాజా మ్యాచ్లో)క్రిస్ గేల్- 98 లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్రోహిత్ శర్మ- 92ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ను సంక్లిష్టం చేసుకుంది. -
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్కు
టి20 వరల్డ్ కప్లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్ను సెమీఫైనల్కు చేర్చాడు. బ్యాటింగ్లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్ను ఆపలేక మ్యాచ్ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్రేట్లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్పై ఇంగ్లండ్ విజయం
టీ 20 ప్రపంచకప్ సూపర్-8లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం, బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో పాక్పై విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విరవిహారం సృష్టించాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో సూపర్ ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ప్రదర్శించాడు. 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. ఇక పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ 4 వికెట్లు,మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ చెరో రెండు వికెట్లు తీశారు. -
మళ్లీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక జట్టు తలపడనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తమ స్ధానాలను ఖాయం చేసుకున్నాయి.భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో ఉన్న భారత్-పాకిస్తాన్ జట్లు జూన్ 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. భారత్కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. గ్రూపు-ఎలో భారత్, పాక్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుందిభారత్ మ్యాచ్ల షెడ్యూల్ జూన్ 14 - పాకిస్తాన్తో.. ఎడ్జ్బాస్టన్జూన్ 17- నెదర్లాండ్స్తో.. లీడ్స్జూన్ 21-సౌతాఫ్రికాతో.. మాంచెస్టర్జూన్ 25- బంగ్లాదేశ్తో.. మాంచెస్టర్జూన్ 28- ఆస్ట్రేలియాతో.. లార్డ్స్ -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో ఆసక్తికర సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్కు చేరాలనుకుంటే ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్లో గెలిచిన ఇంగ్లండ్ గ్రూప్-2 టాపర్గా ఉంది. ఆ మ్యాచ్లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్ రన్రేట్ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్ నుంచి తొలి సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్రేట్తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులుపాకిస్తాన్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 21, పాక్ కేవలం 9 మ్యాచ్ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్ ఫైనల్ కూడా ఉంది.పిచ్ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్ జరుగనున్న పల్లెకెలె పిచ్ కూడా ఇంగ్లండ్కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్-8 మ్యాచ్లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్లో టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్లో ఇంగ్లండే హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది.. పాక్తో పోలిస్తే ఇంగ్లండ్ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్లో ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్పై విజయాలు సాధించి సూపర్-8లోకి అడుగుపెట్టింది. పాక్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్ దశలో 3 విజయాలు సాధించి, సూపర్-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
T20 World Cup: ఇంగ్లండ్ దెబ్బకు చేతులెత్తేసిన శ్రీలంక
పల్లెకెలె: టీ 20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. సూపర్-8లో భాగంగా గ్రూప్-2లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్.. ఆపై శ్రీలంకను 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి విజయాన్ని అందుకుంది. శ్రీలంక ఆటగాళ్లలో దసునా షనాకా(30) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో సొంత గడ్డపై శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్, డావ్సన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీసి.. శ్రీలంక పతనాన్ని శాసించారు. ఫలితంగా శ్రీలంకకు ఘోర పరాజయం తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(62) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇంగ్లండ్ వికెట్లు ఓ వైపు పడుతున్నా సాల్ట్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ కొనసాగించాడు. దాంతో ఇంగ్లండ్ మూడంకెల స్కోరును దాట కల్గింది. -
శ్రీలంకతో సూపర్-8 సమరానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 సమరాలు నిన్నటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభమయ్యాయి. పాక్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సమరం వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) సూపర్-8లో మరో రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి.మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలె వేదికగా శ్రీలంక-ఇంగ్లండ్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్లో జరుగబోయే మ్యాచ్లో భారత్-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.కాగా, శ్రీలంకతో కీలక సమరానికి ముందు మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ, స్టార్ ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ గాయపడ్డాడు. బేతెల్ ఎడమ చేతి ఉంగరం వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను వేళ్లకు బ్యాండ్ ఎయిడ్ (protective strapping) వేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బేతెల్ శ్రీలంక మ్యాచ్లో బౌలింగ్కు అందుబాటులో ఉండటంపై అనిశ్చితి నెలకొంది.ఐసీసీ నియమాలు ప్రకారం, బౌలర్ చేతికి ఏ రకమైన రక్షణ ఉండాలన్నా మైదానంలోకి దిగే ముందు దాన్ని అంపైర్లు ఆమోదించాలి. ఇంగ్లండ్ ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని రెండు సార్లు ఎదుర్కొంది. కాబట్టి బేతెల్కి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.బేతెల్ ప్రాధాన్యంపల్లెకెలెలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే బేతెల్ గతంలో శ్రీలంకపై 4/11తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో అతని బౌలింగ్ ఇంగ్లండ్ విజయానికి కీలకమైంది. ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడుతున్న సందర్భంలో బేతెల్ బౌలింగ్ సేవలు అందుబాటులో లేకపోతే ఇంగ్లండ్ స్పిన్ విభాగం బలహీనపడే అవకాశం ఉంది.వ్యూహంపై ప్రభావంబేతెల్ గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టు వ్యూహంలో మార్పులు తప్పనిసరి కావచ్చు. అతని బౌలింగ్ అందుబాటులో లేకపోతే, ఆ జట్టు ఇతర స్పిన్ ఎంపికలపై ఆధారపడాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే బేతెల్ బౌలింగ్ చేయలేకపోవడం ఇంగ్లండ్కు పెద్ద లోటు అవుతుంది. శ్రీలంక జట్టు స్పిన్ విభాగంలో బలంగా ఉండటంతో ఇంగ్లండ్పై ఒత్తిడి మరింత పెంచుతుంది. మ్యాచ్కు ముందు అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఇంగ్లండ్ దర్జాగా...
కోల్కతా: టి20 ప్రపంచకప్లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది. చివరకు మాజీ చాంపియన్ చేతిలో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో గ్రూప్ ‘సి’ నుంచి ఇప్పటికే ‘సూపర్–8’కు చేరిన వెస్టిండీస్ సరసన ఇంగ్లండ్ చేరింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హ్యారీ బ్రూక్ బృందం నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు మెరిపించినా... బట్లర్ (3) మళ్లీ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో నాలుగో మ్యాచ్ ఆడిన బట్లర్ ఇప్పటివరకు కనీసం మూడు పదుల స్కోరైనా చేయలేకపోయాడు. జాకబ్ బెథెల్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ బ్రూక్ (14), స్యామ్ కరన్ (25; 2 సిక్స్లు) ఇలా టాప్–6 బ్యాటర్లు ఇటలీ బౌలింగ్కు ఇబ్బంది పడితే... ఏడో వరుస బ్యాటర్ విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ సిక్స్లతో తేలికపడింది. అతను 21 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. జాక్స్ మెరుపుల వల్లే ఇంగ్లండ్ 200 పైచిలుకు స్కోరు చేసింది. గ్రాంట్ స్టివార్ట్, కలుగమగే చెరో 2 వికెట్లు తీశారు. ‘సిక్స్’ల పిడుగు మనెంటి కొండంత లక్ష్యం ఎదురైనా... టాప్–3 బ్యాటర్లలో ఆంథోని మోస్కా (0), స్మట్స్ (0) డకౌటైనా... ఇటలీ ఆందోళన చెందలేదు. పోరాటం వీడలేదు. లక్ష్యఛేదన కోసం కడదాకా పోరాడి 20 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జస్టిన్ మోస్కా (34 బంతుల్లో 43; 7 ఫోర్లు), బెన్ మనెంటి (25 బంతుల్లో 60; 4 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగారు. జస్టిన్ బౌండరీలతో ధాటిగా ఆడితే... మనెంటి భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బెన్ 22 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. దీంతో ఇటలీ 22/3 దయనీయ స్థితి నుంచి 114/4 స్కోరుతో రేసులో పడింది. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో లక్ష్యానికి దూరమైంది. అయినా సరే ఇటలీ ఆట ఆగిపోలేదు. గ్రాంట్ స్టివార్ట్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్స్లు) సైతం ఇంగ్లండ్ శిబిరంపై విరుచుకుపడటంతో ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతిదాకా చెమటోడ్చింది. కరన్, ఓవర్టన్ చెరో 3 వికెట్లు తీయగా... ఆర్చర్కు 2 వికెట్లు దక్కాయి. -
T20 WC 2026: ఇంగ్లండ్ను భయపెట్టిన మరో పసికూన
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్కు ప్రతి మ్యాచ్ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్ టీమ్ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్లో నేపాల్ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఇటలీ, క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు ఎంచుకున్న ఇంగ్లండ్ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్ గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఇంగ్లండ్ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సాల్ట్ 28, బట్లర్ 3, బేతెల్ 23, బాంటన్ 30, బ్రూక్ 14, సామ్ కర్రన్ 25, ఓవర్టన్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్, కలుగమగే చెరో 2, స్మట్స్, అలీ హసన్, బెన్ మనెంటి తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్ మనెంటి (60), జస్టిన్ మోస్కా (43), గ్రాంట్ స్టివర్ట్ (45) ఇంగ్లండ్ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్ను భయపెట్టాడు. బెన్ మనెంటి క్రీజ్లో ఉన్నంతసేపు ఇంగ్లండ్ ఫ్యాన్స్ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకొని మ్యాచ్పై పట్టు సాధించారు. ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్ను దడదడలాడించాడు. స్టీవర్ట్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్కు జస్ప్రీత్ సింగ్తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్ కర్రన్ స్టీవర్ట్ వికెట్ తీసి ఇంగ్లండ్ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 19 ఓవర్లో కర్రన్ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్ వికెట్ తీశాడు. అక్కడే ఇంగ్లండ్కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్లో ఓవర్టన్ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్ చేశాడు. తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్పై సంచలన విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. -
T20 WC 2026: స్కాట్లాండ్పై ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం కోల్కతా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోరర్గా నిలవగా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్చర్, డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడినప్పటికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజయాన్ని అందుకుంది.టామ్ బాంటన్(41 బంతుల్లో 63 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ముల్లన్, బ్రాడ్ వీల్, కుర్రీ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
T20 WC 2026: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ వికెట్కీపింగ్ బ్యాటర్ జోస్ బట్లర్ తన అసమాన క్యాచింగ్ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ప్రవేశించాడు. బట్లర్కు ముందు ఈ ఫీట్ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.బట్లర్ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్-ఐ కమ్యూనికేషన్తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్కీపర్ బ్యాటర్ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ప్రవేశించాడు. Jos Buttler Breaks World Record For Highest Cricket Catch! 🤯 pic.twitter.com/AZaZQtY0v2— The Switch | Kevin Pietersen (@kptheswitch) February 11, 2026ఈ ఫీట్కు క్రికెట్తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్కు ఆన్ ఫీల్డ్ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్ తప్పక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్లర్ ఇప్పటికే ఆన్ ఫీల్డ్లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నాడు. వికెట్కీపర్గానే కాకుండా ఫీల్డర్గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్ రికార్డు) మాత్రం బట్లర్ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్ రికార్డు ఫీట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, బట్లర్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ ఇటీవలికాలంలో ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్తో మ్యాచ్లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్ల్లో బట్లర్కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.బట్లర్ ఫామ్లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్, స్కాట్లాండ్, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. -
రూథర్ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్ను షిమ్రోన్ హెట్మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్ను 200 దరికి చేర్చారు. రూథర్ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి. -
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
-
ఇంగ్లండ్ను వణికించిన నేపాల్
ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్పై నెదర్లాండ్స్ గెలిచినంత పనిచేయగా... స్టార్లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టును నేపాల్ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్ బామ్... స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్లు), కెపె్టన్ హ్యారీ బ్రూక్ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) ఆఖర్లో మెరుపు షాట్లు ఆడగా... జోస్ బట్లర్ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్ సాల్ట్ (1), టామ్ బాంటన్ (2), స్యామ్ కరన్ (2) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రోహిత్ పౌడెల్ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు), లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ (29; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. నేపాల్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లోకేశ్ రెండు సిక్స్లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్లో మరో రెండు ఫోర్లతో లోకేశ్ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్ కరన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నేపాల్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. టి20 ప్రపంచకప్లో నేడుస్కాట్లాండ్ X ఇటలీవేదిక: కోల్కతా; ఉదయం 11 గంటల నుంచిజింబాబ్వే X ఒమన్వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచిదక్షిణాఫ్రికా X కెనడా వేదిక: అహ్మదాబాద్; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచకప్లో తృటిలో మిస్ అయిన పెను సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో ఓ పెను సంచలనం తృటిలో మిస్ అయ్యింది. ఇంగ్లండ్తో ఇవాళ (ఫిబ్రవరి 8) జరిగిన మ్యాచ్లో నేపాల్ రెప్పపాటులో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో నేపాల్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. నేపాల్ ఓడినా, ఇంగ్లండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన వైనం క్రికెట్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో నేపాల్కు ఆది నుంచి మంచి ఆదరణ లభించింది. హాట్ ఫేవరెట్ ఇంగ్లండే అయినా, వాంఖడే స్టేడియంలోని (ముంబై) ప్రేక్షకులు నేపాల్ ఆటగాళ్లకు బ్రహ్మారథం పట్టారు. ఆ జనాలను చూసి, ఇది ఖాట్మండునా (నేపాల్ రాజధాని) లేక ముంబైనా అన్న అనుమానం వచ్చింది. ప్రేక్షకులు వేల సంఖ్యలో నేపాల్కు మద్దతిచ్చేందుకు తరలివచ్చారు. ఇందుకు నేపాల్ ఆటగాళ్లు తగిన న్యాయం చేశారు. వారి అభిమానులకు కావాల్సినంత మజాను అందించారు. ఇంగ్లండ్పై దాదాపు గెలిచినంత పని చేశారు. చివరి ఓవర్లో ఒక్క బౌండరీ నమోదై ఉంటే నేపాల్ పెను సంచలన సృష్టించేదే. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్కు చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ను సామ్ కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పర్ఫెక్ట్ యార్కర్లు వేసి నేపాల్ బ్యాటర్లు కరణ్, లోకేశ్ బామ్ను ఇబ్బంది పెట్టాడు. కర్రన్ కట్టడి చేయడంతో నేపాల్ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే చేయగలిగింది. అప్పటిదాకా మెరుపులు మెరిపించిన లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో ఏమీ చేయలేకపోయాడు. కర్రన్ అతన్ని అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. లోకేశ్ సిక్సర్ బాది తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కర్రన్ ముందు లోకేశ్ పప్పులు ఉడకలేదు. కర్రన్ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన యార్కర్లు సంధించాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 18వ ఓవర్ నేపాల్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అప్పటివరకు ఆచితూచి ఆడిన నేపాల్ బ్యాటర్లు.. ఆ ఓవర్లో చెలరేగిపోయారు. ఆసిఫ్ షేక్, లోకేశ్ బామ్ రెండు సిక్సర్లు సహా 22 పరుగులు పిండుకొని ఇంగ్లండ్వైపు నుంచి మ్యాచ్ను తమవైపు మళ్లించుకున్నారు. ఆతర్వాత 19 ఓవర్లోనూ 14 పరుగులు రావడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. పసికూన అయినా, నేపాల్ను తక్కువ అంచనా వేయడం తప్పని అప్పుడు వారికి అర్దమైంది. కొంచెం అటుఇటు అయి ఉంటే, ఇంగ్లండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. నేపాల్ బ్యాటర్లు ఆది నుంచే అద్భుతంగా ఆడారు. ఓపెనర్ కుషాల్ భుర్టెల్ (29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ ఎయిరీ (44), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39) మూడో వికెట్కు 54 బంతుల్లో 82 పరుగులు జోడించి అప్పుడే ఇంగ్లండ్ను భయపెట్టారు. ఆఖర్లో లోకేశ్ బామ్ ఇంగ్లండ్ను కంగారు పెట్టాడు. ఈ మ్యాచ్లో నేపాల్ ఓడినా, యావత్ క్రికెట్ ప్రపంచం అభిమానాన్ని చూరగొంది. అంతకుముందు నేపాల్ బౌలింగ్లో అంచనాలకు మించి రాణించింది. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను ఇబ్బందులకు గురి చేసింది. జేకబ్ బేతెల్ (55), హ్యారీ బ్రూక్ (53), విల్ జాక్స్ (39 నాటౌట్) సత్తా చాటకపోయుంటే బౌలింగ్కు దిగకముందే మ్యాచ్ ఓడిపోయి ఉండేది. వారు ముగ్గురు రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నందన్ యాదవ్, దీపేంద్ర సింగ్ తలో 2, షేర్ మల్లా, సందీప్ లామిచ్చేన్ చెరో వికెట్ తీసి సత్తా చాటారు. నేపాల్ తమ తదుపరి మ్యాచ్లో (ఫిబ్రవరి 12) ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్లో నేపాల్ తప్పక గెలిచే అవకాశం ఉంది.


