ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట | ENG VS IND 5th Test Day 4: Bad Light Stops The Play | Sakshi
Sakshi News home page

ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట

Aug 3 2025 10:24 PM | Updated on Aug 3 2025 10:24 PM

ENG VS IND 5th Test Day 4: Bad Light Stops The Play

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్‌ గెలుపుకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్‌ నిలిచిపోయింది. ఆతర్వాత  భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌ల్లో సేద తీరుతున్నారు.

ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్‌ (54), ఓలీ పోప్‌ (27), బ్రూక్‌ (111), జో రూట్‌ (105), జేకబ్‌ బేతెల్‌ (5() ఔట్‌ కాగా.. జేమీ స్మిత్‌ (2), జేమీ ఓవర్టన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్‌ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్‌ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్‌ సుందర్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు తీశాడు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (64), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement