-
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన హ్యారీ బ్రూక్
కౌంటీ ఛాంపియన్షిప్ 2024లో (డివిజన్ 2) భాగంగా లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, యార్క్షైర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ప్రస్తుత సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను 4 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల చేత బ్రూక్ ప్రస్తుత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బ్రూక్ స్థానాన్ని డీసీ యాజమాన్యం సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్తో భర్తీ చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బ్రూక్ ఐపీఎల్ నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుని వ్యక్తిగత కారణాలను సాకుగా చూపాడంటూ ప్రచారం జరుగుతుంది. బ్రూక్ను 2023 వేలంలో సన్రైజర్స్ 13.25 కోట్లకు సొంతం చేసుకోగా.. తాజాగా సీజన్లో అతనికి ఆ స్థాయి మొత్తం లభించలేదు. ఈ కారణంగానే బ్రూక్ ఐపీఎల్ను స్కిప్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. బ్రూక్తో పాటు ఆడమ్ లిత్ (101) కూడా సెంచరీతో కదంతొక్కడంతో యార్క్షైర్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అంతకుముందు లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 354 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ హ్యారిస్ (56), బెన్ మైక్ (90), టామ్ స్క్రీవెన్ (56) అర్దసెంచరీలతో రాణించారు. యార్క్షైర్ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన తర్వాత లీసెస్టర్షైర్ సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. 26/0 స్కోర్ వద్ద భారీ వర్షం కురువడంతో మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్లోకి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్లో కొత్తగా మరో ఫాస్ట్ బౌలర్ చేరాడు. వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. విలియమ్స్ను డీసీ 50 లక్షల బేస్ ప్రైజ్కు సొంతం చేసుకుంది. కాగా, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ దారుణ ప్రదర్శనకు ఆ జట్టు బౌలింగే ప్రధాన కారణం. ఈ జట్టులోని బౌలర్లు ప్రతి మ్యాచ్లో పోటాపోటీపడి పరుగులు సమర్పించుకుంటూ వరుస ఓటములకు కారకులవుతున్నారు. ముఖ్యంగా పేసర్ అన్రిచ్ నోర్జే చాలా దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. డీసీ యాజమాన్యం ఈ సఫారీ పేసర్పై భారీ అంచనాలు పెట్టుకుంటే, అతను మాత్రం సాధారణ బౌలర్ కంటే హీనంగా బౌలింగ్ చేస్తూ తుస్సుమనిపిస్తున్నాడు. నోర్జే ప్రతి మ్యాచ్లో 12కు పైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకుంటున్నాడు. డీసీ మేనేజ్మెంట్ లిజాడ్ విలియమ్స్ను ఎంపిక చేసుకోవడానికి నోర్జే వరుస వైఫల్యాలే కారణమని తెలుస్తుంది. నోర్జే స్థానాన్ని లిజాడ్ విలియమ్స్తో భర్తీ చేయాలని డీసీ భావిస్తుంది. ఈ సీజన్లో నోర్జే ప్రదర్శనలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్పై 4-0-48-1 సీఎస్కేపై 4-0-43-0 కేకేఆర్పై 4-0-59-3 ముంబై ఇండియన్స్పై 4-0-65-2 ఇదిలా ఉంటే, నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే?
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు హ్యారీ బ్రూక్ రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది సీజన్ మొత్తానికి బ్రూక్ దూరమయ్యాడు. గత నెలలో తన బామ్మ కన్నుమూసిన నేపథ్యంలో కుటుంబసభ్యులతో ఉండాలని బ్రూక్ నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 4 కోట్లకు బ్రూక్ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ పేరును ఢిల్లీ ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడితో ఢిల్లీ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఇటీవల కాలంలో మెక్గర్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు తన పవర్ హిట్టింగ్ స్కిల్స్తో అందరిని అకట్టుకుంటున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత బిగ్బాష్లీగ్ సీజన్లో కూడా మెక్గర్క్ అదరగొట్టాడు. మెల్బోర్న్ రెనగాడ్స్కు ప్రాతినిథ్యం వహించిన మెక్గర్క్.. 257 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిపై ఢిల్లీ కన్నేసింది. చదవండి: #Rachin Ravindra: రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్గా -
ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2024 నుంచి బ్రూక్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీకి బ్రూక్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియాతో టెస్టు సిరీస్ నుంచి సైతం బ్రూక్ ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. కాగా గతేడాది సీజన్తో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ.13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. కానీ ఎస్ఆర్హెచ్ నమ్మకాన్ని బ్రూక్ వమ్ము చేశాడు. 11 మ్యాచ్ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఐపీఎల్-2024కు ముందు ఆరెంజ్ ఆర్మీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన హ్యారీని రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఈ ఏడాది సీజన్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడికి బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది. చదవండి: Happy Birthday Siraj: బ్యాటర్ టూ బౌలర్.. తండ్రి మరణాన్ని సైతం తట్టుకుని! ఎంతో మందికి -
టెస్టు సిరీస్కు బ్రూక్ దూరం
లండన్: భారత్తో గురువారం నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సిరీస్కు ముందు ఇంగ్లండ్కు పెద్ద దెబ్బ తగిలింది. జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్, అద్భుతమైన ఫామ్లో ఉన్న హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను జట్టును వదిలి వెళ్లాడని, సిరీస్ మొత్తానికి అతను అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. తొలి టెస్టు కోసం ఆదివారమే ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్కు చేరుకుంది. బ్రూక్ స్థానంలో డాన్ లారెన్స్ను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తరఫున 11 టెస్టులు ఆడిన లారెన్స్ 551 పరుగులు చేశాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement