టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలి వన్డే జరుగుతోంది. ఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.
ఏడు మ్యాచ్లలో ఇంగ్లండ్దే గెలుపు!
👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది.
బట్లర్ @ 200
👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్వాష్ చేసింది.
తుదిజట్లు
ఇంగ్లండ్
జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్
ఇండియా
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.


