తొలి వికెట్ కోల్పోయిన భారత్
7.4వ ఓవర్- 44 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అట్కిన్సన్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (31) ఔటయ్యాడు.
ఆచితూచి ఆడుతున్న రోహిత్, గిల్
భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శుభ్మన్ గిల్ (19) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 30-0గా ఉంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
కార్డిఫ్ వేదికగా భారత్తో జరుగనున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో, అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను బరిలోకి దించారు.
ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆ జట్టు రెండు మార్పులు చేసింది. టంగ్, డాసన్ స్థానాల్లో సాకిబ్ మహమూద్, అట్కిన్సన్ జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
తుది జట్టు..
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్


