తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌ | IND VS ENG 2nd ODI Updates and Highlights | Sakshi
Sakshi News home page

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

Jul 16 2026 5:05 PM | Updated on Jul 16 2026 6:10 PM

IND VS ENG 2nd ODI Updates and Highlights

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
7.4వ ఓవర్‌- 44 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అట్కిన్సన్‌ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (31) ఔటయ్యాడు. 

ఆచితూచి ఆడుతున్న రోహిత్‌, గిల్‌
భారత్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ (9), శుభ్‌మన్‌ గిల్‌ (19) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 30-0గా ఉంది. 

టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌
కార్డిఫ్‌ వేదికగా భారత్‌తో జరుగనున్న రెండో వన్డేలో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్‌ రాహుల్‌ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో, అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను బరిలోకి దించారు. 

ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. ఆ జట్టు రెండు మార్పులు చేసింది. టంగ్‌, డాసన్‌ స్థానాల్లో సాకిబ్‌ మహమూద్‌, అట్కిన్సన్‌ జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

తుది జట్టు..
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement