చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్‌ | Women's CWC 2025: England Restricted New Zealand For 168 Runs | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్‌

Oct 26 2025 3:04 PM | Updated on Oct 26 2025 5:23 PM

Women's CWC 2025: England Restricted New Zealand For 168 Runs

మహిళల వన్డే ‍ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్‌ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ​్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో లిండ్సే స్మిత్‌ 3, కెప్టెన్‌ నాట్‌ సీవర్‌  బ్రంట్‌, అలైస్‌ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జార్జియా ప్లిమ్మర్‌ (43) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్‌ (35), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

సూజీ బేట్స్‌ 10, బ్రూక్‌ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్‌, ఇసబెల్లా గేజ్‌, జెస్‌ కెర్‌ 10, రోస్‌మేరీ మైర్‌ డకౌట్‌, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ త్వరగా మ్యాచ్‌ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్‌ (20), ట్యామీ బేమౌంట్‌ (26) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది.

చదవండి: హ్యారీ బ్రూక్‌ ఐకానిక్‌ శతకం వృధా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement