మహారాష్ట్రలో నూతన ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం అక్టోబర్ 31 తేదిన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అక్టోబర్ 31న మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు?
Oct 27 2014 4:10 PM | Updated on Oct 8 2018 6:22 PM
ముంబై: మహారాష్ట్రలో నూతన ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం అక్టోబర్ 31 తేదిన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో నిర్వహించే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు.
బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశం మంగళవారం జరుగుతుందని, ఆ భేటిలోనే శాసనసభ నాయకుడిని ఎన్నుకుంటారన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ సి. విద్యసాగర్ రావును కొత్త నేత కలుసుకుంటారని, అయితే ఎప్పుడు భేటి అవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ శాసన సభ్యుల సమావేశానికి కేంద్ర పరిశీలకులు రాజ్ నాత్ సింగ్, జేపీ నద్దా, ఓం ప్రకాశ్ మాథూర్, రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరవుతారు.
Advertisement
Advertisement