అట్లాంటాలో శంకర నేత్రాలయ సేవా దీక్ష.. | Sankara Nethralaya Seva Deeksha In Atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో శంకర నేత్రాలయ సేవా దీక్ష..

Aug 16 2025 9:21 PM | Updated on Aug 16 2025 9:30 PM

Sankara Nethralaya Seva Deeksha In Atlanta

గ్రామీణ భారత్‌లో అంధత్వ నిర్మూలన లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జార్జియాలోని కమ్మింగ్ వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలో MESU (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) “అడాప్ట్-ఎ-విలేజ్” నేత్ర శస్త్ర చికిత్స శిబిరాలకు మద్దతుగా $1.25 మిలియన్ (రూ.10.4 కోట్లు) నిధులు సమీకరించారు.

అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమల్ల మాట్లాడుతూ.. సేవ కోసం అట్లాంటా ప్రజా హృదయం స్పందించిందన్నారు. ఈ సాయంత్రం జీవితాలకు వెలుగునిచ్చే లక్ష్యం కోసం అంతా ఐక్యంగా కృషి చేశామన్నారు. కోశాధికారి మూర్తి రేకపల్లి మాట్లాడుతూ.. ప్రజలు మంచి ఉద్దేశ్యంతో కలిసి వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుందన్నారు. ఈ సాయంత్రం దాతృత్వం, సంస్కృతి చేయి చేయి కలిపి నడవగలవని రుజువు చేసిందన్నారు.

శాంతి మెడిచెర్ల, సందీప్ కౌతా, ఉషా మోచెర్ల, జనార్ధన్ పన్నెల, స్రవంతి కెటి, శిల్పా ఉప్పులూరి, శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల వంటి ప్రతిభావంతులైన గాయకులకు ఇదొక గొప్ప వేదికయ్యింది. నీలిమ గడ్డమణుగు సమన్వయం చేసి, వారి కళాత్మకత, సాయంత్రారానికి  లోతైన, చిరస్మరణీయమైన కోణాన్ని జోడించి, హాజరైన వారందరి నుండి హృదయపూర్వక  ప్రశంసలను పొందారు.

ప్రారంభోపన్యాసం  తర్వాత, వేదిక అద్భుతమైన శాస్త్రీయ భారతీయ నృత్య ప్రదర్శనలతో సజీవంగా మారింది. అట్లాంటా ప్రాంతం అంతటా నృత్య అకాడమీలు - లాస్య స్కూల్ ఆఫ్ డ్యాన్స్ కు చెందిన గురు.శ్రీదేవి రంజిత్-మోహినీయాట్టం,  నాట్యవేద నృత్య అకాడమీకి చెందిన గురు.సోబియా సుదీప్ కిషన్-భరతనాట్యం, కళాక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (KIPA) నుండి గురు. మిటల్ పటేల్-కథక్, మరియు నటరాజ నాట్యాంజలికి చెందిన గురు. నీలిమా గడ్డమణుగు-కూచిపూడి సంప్రదాయం నృత్య ప్రదర్శనలో పాతుకుపోయిన నేపథ్య భాగాలను ప్రదర్శించారు. 

అధ్యక్షులు బాలరెడ్డి, మాధవి ఇందుర్తి దంపతులు శ్రీ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, సలహాదారులు SV ఆచార్య, శ్రీమతి నిర్మలా ఆచార్య, శ్రీమతి లీలా కృష్ణమూర్తి, శ్రీమతి నాట్ కృష్ణమూర్తి, డాక్టర్ కిషోర్ చివుకుల, మరియు శంకర నేత్రాలయ అట్లాంటాలోని ప్రధాన బృందం - మూర్తి రేకపల్లి, శ్రీని వంగిమల్ల, రాజ్ ఐలా, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లులను సత్కరించి విందును నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement