-
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. -
టిప్పర్ యూటర్న్ తీసుకుంటుండగా..
కరీంనగర్: మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట శివారు వరదకాల్వ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైంది. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన వెలుమల దీక్ష(23) నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని తన అక్క వద్దకు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. తన అక్క భర్త దిలీప్ ద్విచక్రవాహనంపై మెట్పల్లి వైపు వస్తుండగా.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ వైపు నుంచి వరదకాల్వ మీదుగా బండరాళ్ల లోడుతో వస్తున్న టిప్పర్ రాజేశ్వర్రావుపేట బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దీక్ష, ఆమె బావ తప్పించుకునే క్రమంలో దీక్ష టిప్పర్ టైర్ కింద పడిపోయింది. టైర్ ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు టిప్పర్ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. దిలీప్ ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్కు చెందిన టిప్పర్ డ్రైవర్ ప్రియాంకసింగ్పై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. ఇవి చదవండి: డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య.. -
Diksha Singhi: భారీ సక్సెస్
ఢిల్లీ కేంద్రంగా వ్యాపార సంస్థను స్థాపించింది దీక్షా సింఘి. ఆమె స్థాపించిన స్టార్టప్ పేరు ‘ఎ లిటిల్ ఎక్స్ట్రా’. వినడానికి తేలికగానే ఉంది. కానీ ఈ పేరు వెనక చాలా బరువైన కథ ఉంది. అంతకంటే బరువైన ఆవేదన ఉంది. బాల్యం నుంచి ఎదుర్కొన్న అవహేళనలే ఆమెలో అక్షరవాహినికి విషయాంశాలయ్యాయి. ఆ తర్వాత రోజూ ఏదో ఒకటి రాయకపోతే తోచని స్థితికి చేరింది. అచ్చంగా స్వచ్ఛంగా సాగే ఆమె అక్షరాలకు అభిమానులు లక్షలకు మించిపోయారు. బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందింది దీక్ష. ఆ తర్వాత ఆమె స్థాపించిన అంకుర సంస్థ అనతి కాలంలోనే విజయపథంలో దూసుకుపోవడానికి ఆమెకు ఆమే బ్రాండ్ అంబాసిడర్. ఇంతకీ ఎ లిటిల్ ఎక్స్ట్రా పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తి ఏమిటంటే... ఫ్యాషన్ ఆభరణాలు. ఇరవై తొమ్మిదేళ్ల దీక్షా సింఘి తన విజయగాథను ఇలా వివరించారు. ‘‘మాది అస్సాం రాష్ట్రం, గువాహటి. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉండేదాన్ని. తోటి పిల్లలు వేళాకోళం చేసేవారు. బోర్డింగ్ స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. లావుగా ఉండడంతో పరుగెత్తలేనని వాళ్లే నిర్ణయించి ఆటల్లో కలుపుకునే వాళ్లు కాదు. పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల్లో కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. దుస్తులు కూడా ఆడవాళ్ల సెక్షన్లో నా సైజువి ఉండేవి కాదు. మగవాళ్ల సెక్షన్లో దొరికేవి. అబ్బాయిల దుస్తులు... పైగా వదులుగా ఉన్నవి «ధరించేదాన్ని. దాంతో స్కూలు పిల్లలతోపాటు బంధువులు కూడా అల్లరి చేస్తూ టామ్బాయ్ అనేవాళ్లు. ఇదిలా ఉంటే లావు తగ్గడం కోసం స్విమ్మింగ్ కెళ్లాను. అక్కడి కోచ్ నా స్విమ్ సూట్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అప్పటి నుంచి స్విమ్మింగ్ మీద కూడా విరక్తి కలిగింది. ఇలాంటి అనుభవాలతో స్కూలు ముగించుకుని కాలేజ్లో చేరాను. కొత్త శకం మొదలైంది! కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం 2013లో ఢిల్లీకి వచ్చాను. కాలేజ్లో కొత్త స్నేహితులు కలిసే లోపు బ్లాగ్ నా తొలి స్నేహితురాలయింది. బ్లాగ్ రాయడం మొదలు పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే నన్ను కదిలించిన ఒక్కో సంఘటన అక్షరరూపం దాల్చింది. అందులో మానవీయ కోణాల కోసం నేను ప్రయత్నం చేసిందేమీ లేదు. కానీ నా బాల్యపు ఆవేదన నా బ్లాగ్ చదువరులను కదిలించివేసింది. నన్ను అభిమానించడం మొదలైంది. క్రమంగా బ్లాగ్లో నా ఆవేదనలే కాకుండా ఆలోచనలు, సమాజం గురించిన ఆందోళనలు, నా పర్యటన వివరాలను కూడా పంచుకోవడం మొదలుపెట్టాను. బాడీ షేమింగ్ ఒక వ్యక్తిని ఎంతగా బాధిస్తుందో తెలిసి వాళ్ల మనసు ద్రవించేది. కొంతమంది మహిళలు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పంచుకునేవారు. ఈ క్రమంలో నా రచనలు దేహాకృతి కారణంగా ఎదురయ్యే మానసిక సమస్యల నుంచి సాంత్వన పొందేవిధంగా ధైర్యం చెబుతూ సాగాయి. బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా నా రచనలను ఆదరించేవారు పెరిగారు. ఇన్స్టాగ్రామ్లో నాకు లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారిప్పుడు. వ్యాపార కుటుంబ నేపథ్యం చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో చూసుకోవాల్సిన సమయంలో నేను వ్యాపారాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే మాది వ్యాపార కుటుంబం. ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ‘ఎ లిటిల్ ఎక్స్ట్రా’ పేరుతో ఆభరణాల తయారీ ప్రారంభించాను. మొదట ఇదే టైటిల్తో దుస్తుల వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ దుస్తులకు సైజ్ పరిమితులుంటాయి. ఆభరణాలకు ఆ పరిమితి ఉండదు కదా! అందుకే ఆభరణాలతో మొదలుపెట్టాను. ఆభరణాలనగానే ఖరీదైన వ్యాపారం అనుకోవద్దు. చంకీ ఆభరణాలే ఎక్కువ. ఇప్పటికే మార్కెట్లో వందలాది ఆభరణాల తయారీదారులున్నారు. నా ఆభరణాలనే ఎందుకు కొనాలి? అంటే... నా ఆభరణాలు సందర్భాన్ని బట్టి ధరించేవిధంగా ఉంటాయి. ఉదాహరణకు నవరాత్రి సందర్భంగా పూసలతో చేసిన దుర్గాదేవి చెవి జూకాలు ధరిస్తే అందరి దృష్టి మీ చెవుల మీదే ఉంటాయి. కాదంటారా? అలాగే ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లేటప్పుడు ఫుట్బాల్ చెవి రింగులు, క్రికెట్ బ్యాట్ లాకెట్తో దండలు... ఇలాగన్నమాట. ఈ ప్రయోగాన్ని 2020 ఆగస్టులో ఐదు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. ఇప్పుడు ఐదు వందల డిజైన్లతో అరవై లక్షల టర్నోవర్తో వ్యాపారం సాగుతోంది. దేశంలో ఉన్న రకరకాల ఆభరణాల తయారీదారులు (కారీగారీ) నాతో కలిసి పని చేస్తున్నారు. నేను ఇచ్చిన డిజైన్ని ఆభరణం రూపంలో తీసుకువచ్చే అద్భుతమైన కళ వారి చేతిలో ఉంది. సందర్భానుసారంగా సేల్ అయ్యే డిజైన్లను రూపొందించే చురుకైన ఆలోచనలు నా బుర్రలో ఉన్నాయి. ఇదే నా సక్సెస్’’ అన్నారు దీక్షా సింఘి. -
మోదీ కఠోర దీక్ష విరమణ
-
23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నవంబర్ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం ఆరో అంతస్తులో ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలు 27 వరకు స్వీకరించవచ్చన్నారు. 23న మూలవిరాట్కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు. అర్ధమండల దీక్షలు డిసెంబర్ 13–17 వరకు స్వీకరించవచ్చన్నారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 3–7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు. 14 నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement