'గోపాల మిత్రలకు కనీస వేతనం ఇవ్వాలి' | gopala mitra sangam deeksha in karimnagar | Sakshi
Sakshi News home page

'గోపాల మిత్రలకు కనీస వేతనం ఇవ్వాలి'

Jan 14 2016 12:27 PM | Updated on Sep 3 2017 3:41 PM

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గోపాల మిత్రుల సంఘం సభ్యులు గురువారం రిలే నిరాహార దీక్షలకు దిగారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గోపాల మిత్రుల సంఘం సభ్యులు గురువారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.13,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద భీమా పథకాన్ని గోపాల మిత్రలకు వర్తింపజేయాలని కోరారు. పశుసంవర్థక శాఖలో పనిచేసే గోపాల మిత్రలకు విద్యార్హతల ఆధారంగా ఆఫీసు సబార్డినేట్ లుగా నియమించాలని నినదించారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘం సభ్యులకు సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement