Andhra Pradesh
-
‘ముగ్గురొచ్చి తంబిరెడ్డిని కిడ్నాప్ చేశారు’
తిరుపతి: తుమ్మలగుంట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంబిరెడ్డిని ముగ్గురొచ్చి కిడ్నాప్ చేశారని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తెలిపారు. ‘31న రాత్రి ముగ్గురొచ్చి తంబిరెడ్డిని గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులను అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో హైకోర్టులో కేసు వేశాం. నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇలా చేయడం దారుణం. .60 సంవత్సరాల వయస్సులో ఉన్న తంబిరెడ్డిని ఇలా కిడ్నాప్ చేయడం దారునం. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని తెలిపారుకారులో బలవంతంగా తీసుకెళ్లారు‘నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పలు పోలీస్ స్టేషన్లలో తిప్పారు. ఫేస్బుక్లో పోస్టుకు కామెంట్ పెట్టినందుకే అరెస్ట్ చేశారు. పోస్ట్ పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశనించారు. -
డప్పు కొట్టాడని దళితుడిపై స్పీకర్ అయ్యన్న దాడి
-
‘వైఎస్ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’
తాడేపల్లి : తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ నాయుడిని తొలగించాలంటూ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఈ రోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. రాజధానిపై మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది..‘రాజధాని అంశానికి సంబంధించి మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు గ్రోత్ కారిడార్గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాన్-బీ ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. అమరావతి అప్పులు రాష్ట్రంపై భారంగా మారుతున్నాయి. వైఎస్ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ అని సజ్జల సూచించారు.ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి..ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ‘ పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది. 18 లక్షల క్రియాశీల సభ్యత్వం మా లక్ష్యం. ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా అందింది. త్వరలో వారందరికీ ఐడీ కార్డులను పంపిణీ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో క్యాంపెయినింగ్ పెంచాలి’ అని పేర్కొన్నారు. -
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. -
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటున్నారు. -
‘నిన్నటి వరకూ గ్రాఫిక్స్ కథలు.. ఇప్పుడేమో..’
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడిన మాటలు అంతా మోసపూరితం, అసత్యాలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యద్భుత రాజధాని అని నిన్నటి వరకు గ్రాఫిక్స్ కథలు చెప్పారని, రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తా అని చంద్రబాబే చెప్పారని, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ అంటూ మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ‘రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు మారిపోయాయి అని టీడీపీ హడావుడి చేస్తోంది. ఈ రోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు మోసపూరితం, అసత్యాలే. మొన్న రెండేళ్లలో రాజధాని పూర్తి అని చెప్పారు.. ఈ రోజు ఇది నిరంతర ప్రక్రియ, కొంత భాగం మాత్రమే పూర్తి చేస్తా అంటున్నారు. లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో అప్పులు తీసుకుని నామమాత్రపు పనులు చేశారు. విభజన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతి రాజధాని అని చెప్పాయని అబద్ధపు మాటలు చెప్పారు. మేధావులు ఆ కమిటీల రిపోర్ట్ ఇప్పటికీ చూడవచ్చూ. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కమిటీల పేర్లు చెప్తున్నారు. 44 శాతం మంది అమరావతికి ఒకే చెప్పారు అంటున్నారు...మరి మిగిలిన 56 శాతం గురించి మాట్లాడు. నువ్వు ఎప్పుడూ రైతు గురించి మాట్లాడటం లేదు...కేవలం అక్కడున్న రియల్ ఎస్టేట్ కోసమే మాట్లాడతావు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోరాం...తుంగలో తొక్కారు. పోలవరం ఈయనే చేసాడట...వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ప్రజలకి తెలియదా..?అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది?విభజన సమయంలో 7 మండలాల విలీనం చేస్తామని కేంద్రం చెప్పింది. దాన్ని తీసుకుని ఆ మండలాలు ఇచ్చే వరకు నేను ప్రమాణం చేయను అని నాటకాలు ఆడాడు. జపాన్ సంస్థ మకీ బిహార్ కంటే ఇక్కడ దారుణ ప్రస్తుతులు ఉన్నాయని చెప్పింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నీ వల్ల నాశనమై పోయాడు. నువ్వు విట్, srm వంటి ప్రైవేటు సంస్థలు తెచ్చి ఏదో చేసినట్లు చెప్తున్నారు. వాళ్ళు పిల్లల వద్ద లక్షలకు లక్షలు పిండేస్తున్నారు. అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది..?వైజాగ్ అంటే నానా యాగీ చేశారు..మిగతా రాజధానుల్లాగానే మనకూ ఒక మంచి నగరం ఉండాలని వైజాగ్ అంటే నానా యాగీ చేశారు. అన్నీ బాగుండాలనే జగన్కి పిచ్చా...ఏమీ లేని చోట గ్రాఫిక్స్ చూపే నీకు పిచ్చా...?, జగన్ ఇప్పుడు చెప్తున్నట్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చేస్తే ఎంత బాగుండేది..?, తక్కువ ఖర్చుతో వాటిని అభివృద్ధి చేస్తే ఎంత అభివృద్ధి జరిగేది..?, కొత్త నగరం నిరంతర ప్రక్రియ అంటూ నువ్వే చెప్తున్నావు. పార్లమెంట్ భవనం చదరపు అడుగు 4 వేలకు కడితే...నువ్వు అమరావతి 12వేలుతో కడతావా...?, ఆర్ధిక పరిస్థితి చూసుకుని వెళ్దాం అంటే నువ్వు దుర్మార్గుడివి అని ఎదురు దాడి చేస్తున్నారు..నువ్వు అక్కడ పెడుతున్న ఖర్చు ఉన్న నగరాల్లో పెట్టీ ఉంటే ఎంత సంపద సృష్టించే వాళ్ళం..?, ఇవన్నీ చెబితే ప్రతిపక్ష నేతను హేళన చేస్తూ మాట్లాడుతున్నారునేను చెప్పిందే వేదం అంటూ మేధావిలా ఫోజులు కొడుతున్నారు. చట్టబద్ధత పేరుతో అమరావతిని కేంద్రం చేతుల్లో పెట్టాడు. ఏ రాష్ట్ర రాజధానికి ఇలా చట్టబద్ధత తీసుకోలేదు. రాయలసీమకు ఏం చేశావో ఒక్కటి చెప్పు.. నీ నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏమీ చేశావో ఒక్కటన్నా చెప్పు. కర్నూలు హైకోర్టు మొదలుపెడితే దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లావు. మేము మనుషులం కాదా...మాకు సెంటిమెంట్లు ఉండవా...?, అమరావతి దేవతల రాజధాని అయితే..కర్నూలు పరమ శివుడి తిరుగాడిన ప్రాంతం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మాకు లేదు...నువ్వే వాటిని రాజేస్తున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు, నేడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టావు. నీకు తెలంగాణపై ఉన్నంత ప్రేమ రాయలసీమపై లేదా..?, నీలా ఒక ప్రాంతాన్ని కాకుండా రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్తో సంబంధం లేదని మొన్న చట్టం చేశారు...మరి ఉమ్మడి ఆస్తులు సంగతి ఏమిటి..?, తెలంగాణలో నిన్ను తరిమేస్తే వచ్చి...కట్టుబట్టలతో వచ్చానని చెప్పడం దేనికీ..?జగన్ చేపట్టిన పోర్ట్, మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రజల జీవితాలను మార్చేశారు. రాయచోటి జిల్లా కేంద్రం తీసేసిన నీకు అక్కడి ప్రజలకు సెంటిమెంట్లు ఉంటాయని తెలియదా...?, అమరావతిలో ఏదో జరిగితే మా రాయలసీమ ప్రాంతపు వాదులు అమాయకంగా కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అలా ఆదేశాలు ఇచ్చి మరీ పండగ అంటూ హడావుడి చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడంలో దిట్ట. రాజ్యసభలో అమరావతి అని మాట్లాడించి కులాల కుంపట్లు రాజేస్తూ ఇతరులను విమర్శిస్తున్నారు. రేణుకా చౌదరీ మాటలను మీలో ఎవరైనా ఖండించారా...?, ఆనాడు జలయజ్ఞం నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకూ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని కులాల పరంగా చిచ్చులు పెట్టీ రాజకీయ లబ్ది పొందుతూ మమ్మల్ని అంటే ఎలా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమరావతి టైం లైన్పై చేతులెత్తేసిన చంద్రబాబు
సాక్షి,అమరాతి: రాజధాని భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి నిర్మాణం టైమ్లైన్పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించారు. అమరావతి పూర్తికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన వెల్లడించలేదు.పైగా, రాజధాని నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భవనాల నిర్మాణంపై పన్నుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుందని చెప్పారు. మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. అభివృద్ధి చేసిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. -
అమరావతికి కాదు.. బిల్లుకు వ్యతిరేకం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్కి వివరించాము. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. మాకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకన్నా చిన్న పార్టీలైన బీఆర్ఎస్, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు. మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు మేము వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమే. కోల్కత్తా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్కి వివరించాము. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు. -
ఉద్యోగుల జీతాల్లో కమీషన్లు దండుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల జీతాల్లో టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడికి పాల్పడ్డారు. కొలిమిగుండ్లలోని ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల జీతాలు ఏజెన్సీ నిర్వాహకులు తగ్గించి ఇస్తున్నారు. కంపెనీ చెల్లిస్తున్న పూర్తి జీతాన్ని ఉద్యోగులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారు.సెక్యూరిటీ సూపర్వైజర్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ను గతంలో ప్రశ్నించినందుకు టీడీపీ నాయకుడు రాజగోపాల్.. ఆయన్ని ఉద్యోగం నుంచి తీయించివేయించాడు. నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ సిబ్బందికి మద్దతు తెలిపిన శ్రీనివాస్ యాదవ్, సెక్యూరిటీ గార్డులపై టీడీపీ నేత రాజగోపాల్ దాడి చేశారు.26,330 ఏజెన్సీ వారు సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లిస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం 13,270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. -
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకొంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నానంటూ 2014లో మొదలు పెట్టారు. చంద్రబాబు భూ దోపీడీకి పాల్పడుతున్నారు. 50 వేల ఎకరాలు భూమి కావాలని బంగారు పండించే భూములను రైతుల వద్దనుండి దుర్మార్గంగా లాక్కున్నారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన బాబు.. ఇప్పటికి 80 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు అయినా పడుతుంది. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు.. 47 వేల కోట్లు రాజధానికి అప్పు చేశారు.. ఇప్పటికి 13 వేల కోట్లు అప్పుచేశారు.భవన నిర్మాణం చదరపు అడుగు 4 వేలు ఉంటే 14 వేలు ఖర్చు చేస్తూన్నారు.. 22 నెలల్లో 3 లక్షల 41 వేల కోట్లు ఇప్పటివరకు ప్రజల పేరుతో అప్పు చేశారు. అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం. చంద్రబాబు ఉన్నన్నిరోజులు రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరు’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
చావడానికైనా సిద్దం.. శ్రీధర్ ప్లాన్తోనే దాడి: హర్ష వీణ
సాక్షి, తిరుపతి: జనసేన నేతల దాడి ఘటన నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా స్పందించారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తన పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు.జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సహకారం లేదు. మాపై దాడి జరిగినప్పుడు అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. నేను ఎందుకు అని అడిగినందుకు నాపై దాడి చేశారు. తాతంశెట్టి నాగేంద్ర నాపై రెండు దెబ్బలు వేశారు. పది మంది వచ్చి చావు దెబ్బలు కొట్టారు. ప్లాన్ ప్రకారమే మాపై దాడి చేశారు. శ్రీధరే జనసేన వాళ్లను నాపైకి ఉసిగొల్పాడు.నేను చావడానికైనా సిద్ధమే. కానీ, పోరాటం ఆపను. అరవ శ్రీధర్ వ్యవహారం పవన్ కల్యాణ్కు తెలియకుండా ఉంటుందా?. పోలీసుల విచారణకు నేను సహకరిస్తున్నా. తాతంశెట్టి దాడి చేసేలా ప్రేరేపించింది శ్రీధరే. నన్ను నమ్మించి శ్రీధర్ నట్టేట ముంచాడు. జనసేన నేతలే నాపై దాడి చేసి చంపేందుకు చూశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ నాకు న్యాయం చేయాలి. అరవ శ్రీధర్కు శిక్ష పడాల్సిందే.. అందుకే నా పోరాటం’ అని చెప్పుకొచ్చారు.అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు.అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?...డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్ను విడుదల చేయండి...ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్మెన్లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు...నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం..
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తలుపు కొట్టి దాహమని నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)
-
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
-
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సాక్షి,అమరావతి/రైల్వే కోడూరు/ఓబులవారిపల్లె /విశాఖపట్నం: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. బాబు ఏం చేస్తున్నారు? : వరుదు కళ్యాణి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన నేతల దాడిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనపడవా.. అని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది
సాక్షి, అమరావతి/టాస్క్ ఫోర్స్: తిరుపతిలో కలకలం రేపిన వైఎస్సార్సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ, ఈ విధానాన్ని ‘‘హైడ్ అండ్ సీక్’’ ఆటతో పోలి్చంది. ఇది ఒక్క కేసుకు పరిమితం కాకుండా అనేక కేసుల్లో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు తేదీని దాచిపెట్టి నిన్ననే అరెస్టు చేశాం.. అంటారా? అంటూ తంబిరెడ్డి అరెస్ట్ విషయంలో ప్రశి్నంచింది. ఇది వ్యక్తిగత హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ వేసినప్పుడు మాత్రమే.. కేసులు పెట్టి అరెస్ట్లు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు, 60 ఏళ్ళ వృద్ధుడు తంబి రెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి , జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం.. ఆయన అరెస్ట్పై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తంబిరెడ్డి విడుదల.. పోలీసులకే మంచిది ‘తంబిరెడ్డిని విడుదల చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడం లేదు. మౌఖికంగా ఈ విషయాన్ని చెబుతున్నాం. తంబిరెడ్డిని విడుదల చేయడం పోలీసులకే మంచిది. ఏం జరిగిందన్న దానిపై చాలా స్పష్టత ఉంది. ఇలాంటి విషయాల్లో మొండిగా వెళితే ఇబ్బంది పడేది పోలీసులే. పిటిషనర్ వాదనలు తన తండ్రి తంబిరెడ్డిని గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని , ఇప్పటి వరకు ఆయన జాడ తెలియలేదని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నితిన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకటేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, ‘పోలీసులు తంబిరెడ్డి ని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై తాము తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. హైకోర్టులో తాము ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత గుంటూరు అరండల్ పేట పోలీసులు ఫోన్ చేసి తంబి రెడ్డిని సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్ట్ చేశామని పిటిషనర్ నితిన్ రెడ్డికి చెప్పారు. సోషల్ మీడియా కేసుల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షే ఉన్నప్పటికీ, పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని వివరించారు. వివరాలను తెలపడానికి సమయం ఇవ్వాలని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశించినా మారని పోలీసుల తీరు తంబిరెడ్డి అరెస్టును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి, విడుదల చేయాలని చెప్పినా.. గుంటూరు పోలీసుల తీరు మారలేదు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించి, రిమాండ్ను తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన వద్దకు నిందితుడిని తీసుకురావడం పట్ల సదరు న్యాయమూర్తి పోలీసులను మందలించినట్టు సమాచారం. -
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
పట్నంబజారు/నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకొచ్చారు. రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. తంబిరెడ్డి ఏమయ్యాడో అర్థంకాక కుటుంబ సభ్యులు తిరుపతిలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అతడి జాడకోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటకు చెందిన తంబిరెడ్డి తుమ్మలగుంట గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మార్చి 31న మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తిరుపతిలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద ఉండగా కొందరు వ్యక్తులు తంబిరెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎత్తుకెళ్లిపోయారు. అదే రోజు రాత్రి గుంటూరు తీసుకొచి్చ.. అజ్ఞాతంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. తంబిరెడ్డి ఏమయ్యాడో అర్థం కాక కుటుంబ సభ్యులు తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. రిమాండ్ తిరస్కరణతంబిరెడ్డి జాడ తెలియని కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ లీగల్ విభాగం సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అవ్వడంతో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు లాలాపేట స్టేషన్కు చేరుకుని అధికారులతో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత తంబిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. 2024లో టీడీపీ కూటమి నాయకులపైన, తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, కిరాక్ ఆరీ్పలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ టీడీపీ సోషల్ మీడియా కు చెందిన పానకాల లక్ష్మీహేమంత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంబిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. మొత్తం ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది చెప్పకుండా రహస్యంగా ఉంచారు. పోలీసులు తంబిరెడ్డిని తీవ్ర వేధింపులకు గురిచేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం వైఎస్సార్సీపీ నాయకుడనే కారణంగా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. తంబిరెడ్డిని గురువా రం రాత్రి గుంటూరు శ్యామలానగర్లోని నాలుగో అదన పు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శోభారాణి వద్ద హాజరుపరిచారు. రిమాండ్ను తిరస్కరిస్తూ 41ఏ నోటీసులు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. -
ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదని 90 ఏళ్ల వృద్ధురాలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమైంది. సీఆర్డీఏ అధికారులు తనకున్న కాస్త భూమిని లాక్కుని జీవిత చరమాంకంలో అధోగతి పాల్జేస్తున్నారని గోడువెళ్లబోసుకుంది. మతిస్థిమితం లేని మనుమరాలితో అష్టకష్టాలు పడుతుంటే.. తన భూమిని వెనక్కి ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందని వాపోయింది. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ కలిసి తన ఆవేదనను వెళ్లబోసుకుంది. శేషగిరమ్మ దీనగాథను పరికిస్తే..చంద్రబాబు భూ దాహం 90 ఏళ్ల వృద్ధురాలిని రోడ్డున పడేస్తే.. బలవంతపు భూదోపిడీ ఆమె భర్తను మృత్యు ఒడిలోకి నెట్టేసింది. నెల్లూరి శేషగిరమ్మ కుటుంబం రాయపూడిలో తమకున్న ఐదు సెంట్ల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంటిలో నివసిస్తోంది. 2015లో సీఆర్డీఏ అధికారులు ఆ స్థలం మీదుగా రోడ్డు వెళ్తుందని.. భూమికి భూమి ఇచ్చి, ఇంటికి పరిహారం ఇస్తామని చెప్పి నమ్మబలికారు. శేషగిరమ్మ భర్త శేషగిరి రావు (100ఏళ్లు)తో తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారు.రెండేళ్ల తర్వాత శేషగిరమ్మ బ్యాంకు ఖాతాలో అత్యంత హీనంగా రూ.2,500 కౌలు వేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి భర్త శేషగిరిరావు తన భూమిని ప్రభుత్వం తీసేసుకుందని గ్రహించి 2017లో తమకు కౌలు వద్దని, భూమిని వెనక్కి ఇవ్వాలని సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగి అలిసిపోయాడు. కేన్సర్తో బాధపడుతున్న అతడు మృతి చెందారు. కొంతకాలానికే కుమార్తె సైతం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. అప్పటినుంచి మతిస్థిమితం లేని 40 ఏళ్ల మనుమరాలితో బిక్కబిక్కుమంటూ శేషగిరమ్మ ఒంటరి జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ దుర్నీతిపై కోర్టుకు వెళ్లిన వృద్ధురాలు తన భూమి తిరిగి ఇప్పించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేసూ్తనే తనకు సాయం చేయాలని వైఎస్ జగన్ను కలుసుకుని గోడు వెళ్లబోసుకుంది. గతేడాది అక్టోబర్లో తన స్థలంలోని ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతి కాగా.. ఫైర్ అధికారులు సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదని వాపోయింది. స్వశక్తి, ఆత్మాభిమానంతో జీవించే శేషగిరమ్మ ఈ వయసులోనూ ఎవరి ఆర్థిక సహాయాలను కోరుకోవట్లేదు. కొంతమంది దాతలు, ఎన్నారైలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినా వద్దని.. తన భూమి తిరిగి వస్తే చాలని తిరస్కరించింది. ఇంతటి విలువలు కలిగిన వృద్ధురాలి నుంచి ప్రభుత్వం భూమి లాక్కోవడం సిగ్గుచేటని, వైఎస్సార్సీపీ తరఫున పూర్తిగా అండగా నిలుస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఏపీ నూతన బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించండి∙ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు వైఎస్ జగన్ సూచన∙కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. నూతనంగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని వైఎస్ జగన్ అభినందించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి, నూతన బార్ కౌన్సిల్ సభ్యులు కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి(హైకోర్టు), రోళ్ల మాధవి(హైకోర్టు), కొవ్వూరి వెంకట్రావిురెడ్డి(హైకోర్టు), ఆలూరు రామిరెడ్డి(అనంతపురం), వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి(గుంటూరు), కృష్ణారెడ్డి బి.వి (ఏలూరు) పాల్గొన్నారు. -
అమరావతి బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026 గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, బీఆర్ఎస్, బీజేడీ, ఆప్, జేడీయూ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రెండు గంటల చర్చ అనంతరం ఈ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం దక్కినట్లయింది. లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక ప్రవేశపెట్టారు. బిల్లుపై మొత్తం 19 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదంటూ, బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటన్న విపక్షాలు... బిల్లుపై మాట్లాడిన అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం అందించే సాయం, ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునే ప్రక్రియ, పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయాలని కోరాయి. తన అవసరానికి ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. విభజన జరిగి పదేళ్లయినా ఇంతవరకు ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయలేదని ఎంపీలు పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమరావతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ‘బిహార్లో జేడీయూ నితీశ్కుమార్కు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఏమి జరుగుతుందో చూస్తున్నారు. వాడుకొని వదిలేయడం (యూజ్ అండ్ త్రో పాలసీ) బీజేపీ విధానం. కావున టీడీపీ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఆప్ ఎంపీ సంజయ్సింగ్ మాట్లాడుతూ, ‘కేంద్రంలోని బీజేపీ వైఎస్సార్సీపీకి మూడు రాజధానులు చేయమని ప్రోత్సహించింది.అమరావతిని రాజధాని చేయమని టీడీపీకి చెబుతోంది. బీజేపీతో జాగ్రత్త..చాలా పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కావున జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. బీజేడీ తరఫున మాట్లాడిన నిరంజన్ బిషీ..పోలవరంతో ఒడిశాలో ముంపుపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిరాశ్రయులకు సరైన పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. ఇక ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ‘అమరావతిని మేమెన్నడూ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికే 50వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు. అలాంటి రాజధానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమయ్యే రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపై స్పష్టత లేదు’ అని వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడిన పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి పరిశీలనకు బిల్లు..బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి ఆమోదానికి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. -
పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతి!
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. గురువారం రాజ్యసభలో ‘ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు–2026’పై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కంటితుడుపు మాత్రమే.. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’ అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.. క్షేత్రస్థాయిలో ఏమీ మారలేదు. 12 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని అని ప్రభుత్వం నిర్ణయిస్తే.. మేము వారిని మెచ్చుకోవాలా? కృతజ్ఞతలు చెప్పాలా? ఇది జాతీయ అవమానం. విభజన చట్టంలోని హామీలైన కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? 1.42 లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ ఎందుకు తేలలేదు? ఈ సభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దశాబ్దంపైగా సమయం తీసుకోవడం మీ వైఫల్యం కాదా?‘ అని రేణుక చౌదరి కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు. ‘గుజరాత్లో రాజధాని అభివృద్ధికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు.. కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కించపరుస్తున్నారు’ అని మండిపడ్డారు. ఆ ఐదు మండలాలు.. తెలంగాణలో కలపాలి..భద్రాచలం రామాలయ ఆస్తులు ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం మండలాల ప్రజలు ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అందక వారు నరకం చూస్తున్నారు. ఆ మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలి‘ అని డిమాండ్ చేశారు. విభజన హామీల అమలుపై పార్లమెంటులో ‘స్టేటస్ పేపర్’ విడుదల చేయాలని, ప్రతి హామీకి సంబంధించి కాలపరిమితితో కూడిన ‘రోడ్ మ్యాప్’ ప్రకటించాలని కోరారు. -
నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవిపై విచారణ జరపండి
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పలు ఆర్థిక అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి ఎన్.రాంసుందర్రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని నిర్దేశించింది. నాగమాధవి ఎన్నికల ఖర్చు విషయంలో అధికారికంగా చూపించిన లెక్కలకు, వాస్తవాలకు తేడా ఉందంటూ ఎమ్మెల్యేకు చెందిన మిరాకల్ సాఫ్ట్వేర్ సిస్టం సంస్థలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.వేతనాల రౌండ్ ట్రిప్పింగ్ తీరిది ఫిర్యాదు ప్రకారం.. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతినెలా ఇచ్చే జీతం కాకుండా అదనంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు జమ అయ్యేది. తిరిగి ఆ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి వెనక్కి తీసుకుని ఎన్నికల్లో ఖర్చు చేశారు. నిజానికి ఈ వ్యవహారంపై సదరు మాజీ ఉద్యోగి తొలుత భోగాపురం పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అయితే ఆర్థిక అక్రమాలు జరిగాయనేందుకు ఆధారాలు లేవంటూ కేసును మూసివేశారు. అనంతరం ఆయన ఇదే అంశంమీద విజయనగరం డీఎస్పీ, ఏఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ డీఐజీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మార్చి 31న రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పకడ్బందీగా మనీ లాండరింగ్కు పాల్పడిన ఎమ్మెల్యే నాగమాధవి, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కూటమి ఎమ్మెల్యేగా మున్ముందు మరిన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఎల్ఓసీ పేరుతో సజ్జల భార్గవ్రెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఎల్ఓసీ పేరుతో పిటిషనర్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. కేసుల పేరుతో పౌరులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. బాధితులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తాము ప్రాథమిక హక్కులను కాపాడుతామని స్పష్టం చేసింది. ధిక్కార స్వరాలను సహించేదే లేదు.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ, సీఐడీ సహా పలు జిల్లాల ఎస్పీలను కౌంటర్లు దాఖలు చేయాలని గత నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్.. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ ఎస్పీ మినహా మరెవరూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓసీ కోరింది ఎవరు? ఎందుకు కోరారు? ఏ కేసులో కోరారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే, ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆక్షేపించారు. డీజీపీనే కౌంటర్ వేయనప్పుడు.. ఎస్పీలు ఎలా వేస్తారు? అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ జస్టిస్ దేవానంద్ మండిపడ్డారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు వెనుకాడటం లేదన్నారు. డీజీపీనే కౌంటర్ వేయలేదని, అలాంటప్పుడు ఎస్పీలు కౌంటర్లు వేస్తారని ఎలా ఆశించగలమని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీతో సహా అందరినీ కోర్టుకు పిలిస్తేనే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయన్నారు. సీఐడీ ఎస్పీ ప్రతివాదిగా ఉంటే, సీఐడీ ఇన్స్పెక్టర్ కౌంటర్లు దాఖలు చేయడాన్ని సైతం న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. భార్గవ్రెడ్డికి ఎల్ఓసీ జారీ చేసిన వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను, రాష్ట్ర డీజీపీ, సీఐడీ ఎస్పీ, విజయవాడ, పల్నాడు, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తూ.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. తదుపరి విచారణకు కౌంటర్లు దాఖలు చేయకుంటే, డీజీపీతో సహా ఎస్పీలందరూ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. పరస్పర విరుద్ధ వైఖరులపై అసంతృప్తి విచారణ సమయంలో భార్గవ్రెడ్డి తరఫు న్యాయవాది యల్లారెడ్డి స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్లో భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను తాము కోరలేదని పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, అలా అయితే ఎవరు కోరితే ఎల్ఓసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయను ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరితేనే భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిన్నింటినీ కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచుతామని చెప్పారు. అయితే ఎల్ఓసీ జారీ చేయాలని తామెవ్వరినీ కోరలేదని ఎస్పీ తరఫు న్యాయవాది, అలాగే సీఐడీ అదనపు డీజీ తరఫు న్యాయవాది పాణిని సోమయాజి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరులపై జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఇలాంటి నాటకాలు ఆడతారనే అందరి కౌంటర్లకు ఆదేశించామని పేర్కొన్నారు. అధికారుల ధిక్కార స్వరానికి ముగింపు పలికే సమయం వచి్చందన్న న్యాయమూర్తి, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతామని స్పష్టం చేశారు. -
అందరి నోట 'మావిగన్ మాటే'
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. రాజధాని సంగతి దేవుడెరుగు.. 12 ఏళ్లలో కనీసం రోడ్లయినా వేయలేని పరిస్థితులలో రోడ్లు, కరెంటు, నీటివసతి, డ్రైనేజీ లకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడమంటే సాధ్యమయ్యే పనేనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12 ఏళ్లుగా కనీసం రోడ్లు వేయలేకపోవడం, ప్లాట్లు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ జరిగే పనేనా అని జనం చర్చించుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రోడ్లు కూడా లేవు. మరో 20 ఏళ్లలో కూడా పూర్తి చేసే పరిస్థితులు లేవు. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలను కలుపుతూ హైవే ఉంది. ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. కనుక రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేయనక్కరలేదని ఆర్థికవేత్తలంటున్నారు. అందులో 10శాతం చాలు ఈ ప్రాంతాన్ని మహానగరంలా అభివృద్ధి చేయడానికి అని వారు పేర్కొంటున్నారు. అందువల్ల జగన్ ప్రస్తావించిన ప్లాన్ బీ మంచిదే కదా అని ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చేది అప్పులు, వడ్డీలకే చాలడం లేదని చంద్రబాబే చెబుతున్న నేపథ్యంలో రాజధానికి రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పటికి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేయడమంటే భ్రమల్లో ముంచడమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమం ఆగిపోయి ప్రజలు విలవిల్లాడుతున్నారు..సూ్కళ్లు, హాస్పిటల్స్ను పట్టించుకునే నాథుడే లేడు. పథకాలన్నీ ఆగిపోయాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణసాధ్యం కాని ఆలోచనలు చేయడం సబబేనా! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది బూటకమే..రాజధాని అమరావతికి తొలి విడత రైతుల నుంచి సమీకరించిన భూమి.. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53,748 ఎకరాలని.. వాటిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దానితో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచే సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వల్లె వేస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవని.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో రైతుల నుంచి 44,676.64 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మరో 50 వేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే 20,494.57 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన, తేవాలని నిర్ణయించిన అప్పులే రూ.47,387 కోట్లు. రాజధానిలో నివాస స్థలం చదరపు గజం రూ.50 వేల చొప్పున పలుకుతోందని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. రాజధాని ప్రధాన ప్రాంతం(కోర్ కేపిటల్ ఏరియా)లో అంటే రాజధాని నడిబొడ్డున.. వెలగపూడిలో సచివాలయం సమీపంలో సర్వే నెంబరు 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను(25 వేల చదరపు గజాలు) కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసి 2025, ఏప్రిల్ 2న మంగళగిరి సబ్ రిజిష్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోనే నివాసం నిర్మిస్తున్నారు. ఈలెక్కన గజం ధర రూ.7,500 చొప్పున కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే ఎకరం ధర రూ.3.63 కోట్లే. దీన్ని బట్టి చూస్తే.. లక్ష ఎకరాల్లో రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఖర్చు చేసే రూ.2 లక్షల కోట్లను వడ్డీతో కలిసి చెల్లించాలంటే ఎన్ని వేల ఎకరాలను విక్రయించాల్సి ఉంటుంది..మహానగరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా అనుకూలం..మచిలీపట్నం వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడ ఆరు వరుసల జాతీయ రహదారి.. విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 20 లక్షలు.. గుంటూరు చుట్టుపక్కల 10 లక్షలు.. మచిలీపట్నం చుట్టుపక్కల 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం. ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడటం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని, వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్కు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.. (చంద్రబాబు సమీకరించిన భూముల్లో సదుపాయాల కోసం అంచనా వేసిన రూ. 2 లక్షల కోట్లలో ఇది కేవలం 10శాతమే) ఆ పదేళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచిచూడక్కరలేకుండా.. ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు.స్కామ్ల కోసం భ్రమలు కల్పిస్తారా?రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాల కాంట్రాక్టు విలువను పరిశీలిస్తే చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకూ చెల్లిస్తున్నారు. పైగా ఇసుక ఉచితం. కూతవేటు దూరంలో పుష్కలంగా ఇసుక దొరుకుతుంది. కానీ.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇసుక కొనుగోలు చేసి.. జీఎస్టీ వంటి పన్నులు చెల్లిస్తూ ఫైవ్ స్టార్ సదుపాయాలతో.. ఇటాలియన్ మార్బుల్స్తో చదరపు అడుగు కేవలం రూ.4,500కే నిర్మిస్తున్నారని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ఆరు వరసల జాతీయ రహదారి కిమీకు సగటున రూ.20 కోట్లకు నిర్మిస్తుంటే.. అమరావతిలో అదే రోడ్లకు రూ.53 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణం సమీప భవిష్యత్తులో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా.. ప్రజలకు భ్రమలు కల్పిస్తూ.. స్కామ్ల కోసం అమరావతికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చెందడానికే వందేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు సర్కారే చెప్పడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తుండటం గమనార్హం.మావిగన్ ప్రతిపాదన ఓ అద్భుతంరాష్ట్ర రాజధాని ప్రాంతం, దాని అభివృద్ధి విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సూచన అద్భుతం. రాష్ట్ర రాజధాని ప్రాంతం అభివృద్ధిపై కీలక ప్రభావం చూపుతుంది. కనీస వనరులు లేని ప్రాంతంలో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని అభివృద్ధి చేయటం సాధ్యం కాని పని. అదే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ రాజధాని ప్రాంతంగా ఆలోచిస్తే జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉన్న ప్రాంతాలు సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తాయి. రియల్ వ్యాపారం పుంజుకుంటుంది. పోర్టు ద్వారా నిత్యం వస్తు రవాణా సాగుతుంది. ఈప్రాంతానికి తగిన ప్రాధాన్యం దక్కుతుంది. – నర్రా రమేష్బాబు, రియల్ వ్యాపారి, కంకిపాడు, కృష్ణాజిల్లాతీర ప్రాంత రాజధానులే మహానగరాలుగా ఎదిగాయిసముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న రాజధాని నగరాలే మెట్రో నగరాలుగా అభివద్ధి చెందాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన విధంగా పలు జాతీయ రహదారుల కలయికతో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మచిలీపట్నంలో ఉన్న నౌకాశ్రయం, విజయవాడ విమానాశ్రయం జాతీయ రహదారులు ఈ ప్రాంతం పెద్ద నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జగన్ ముందుచూపుతో ప్రకటించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా సానుకూలంగా స్పందించి అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. – బందెల డేవిడ్ థామస్ నోబుల్, రైల్వే సలహా మండలి సభ్యుడు, మచిలీటప్నంమావిగన్తో సమన్యాయంరాజధాని లేని రాష్ట్రానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ సమన్యాయం చేస్తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలను కలుపుతూ రాజధానిగా ప్రకటించడం వలన ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేకుండా పరిపాలన సాగించవచ్చు. రాష్ట్రానికి మధ్య ప్రాంతం కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. – జి.శాంతమూర్తి, ఇంటిలెక్చు్యవల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరురాష్ట్రానికి సరైన రాజధాని మావిగన్మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ జాతీయ రహదారితో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఉండటంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రాజధానికి భూములు ఇచ్చి, తీవ్ర నిర్వేదంతో ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరం. ప్రతిపాదిత మావిగన్ను రాజధానిగా విస్తరించేందుకు లక్షల కోట్ల నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు, గుంటూరు -
ఆరోగ్యశ్రీ క్షో‘బిల్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు రెండో రోజూ స్తంభించాయి. చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి నిరసన తెలిపాయి. ఉచిత వైద్య సేవలు అందించడం లేదని రోగులను ఆస్పత్రుల నుంచి వెనక్కు పంపేశాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే గానీ ఉచిత సేవలు పునరుద్ధరించలేమని ఆస్పత్రుల ముందు యజమానులు పోస్టర్లు ప్రదర్శించారు. ఆస్పత్రుల మూకుమ్మడి సమ్మె నేపథ్యంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల రోగ పీడితులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొక్కుబడి చర్చలతో సరినెట్వర్క్ ఆస్పత్రులు బుధవారం నుంచి సమ్మెకు పిలవడంతో తొలి రోజు హడావుడిగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆశ) ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు కేవలం మొక్కుబడిగా నిర్వహించినవేనని రుజువైంది. సమ్మెను వెంటనే విరమింపజేసి, ప్రజలు అవస్థలు పడకుండా సేవలు పునరుద్ధరించేలా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ‘రూ. మూడు వేల కోట్ల బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఈ అరకొర నిధుల విడుదలపైనా వచ్చే సోమవారం స్పష్టత ఇస్తాం.’ అంటూ ప్రభుత్వం బీద అరుపులు పలికింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం చేతిలో పలు సందర్భాల్లో మోసపోయిన నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు నిధుల విడుదలపై స్పష్టత వచ్చాకే సమ్మె విరమిస్తామని తెగేసి చెప్పారు. యథావిధిగా రెండో రోజు సమ్మె కొనసాగించారు. ఈ క్రమంలో ఆస్పత్రుల మొర ఆలకించి పెండింగ్ నిధులు విడుదల చేసి, సేవలు పునరుద్ధరించేలా కనీసం చంద్రబాబు సర్కార్ చొరవ చూపలేదు. మురిగిపోయిన దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు2025–26 ఆర్థిక సంవత్సరం మంగళవారంతో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల కోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల బిల్లులను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం ముందు ప్రభుత్వానికి ఆశ సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న రూ.వెయ్యి కోట్ల బిల్లులను చెల్లించి ఉంటే ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి కావు. సమ్మె నోటీసు ఇచ్చి సేవలు ఆపేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.వెయ్యి కోట్ల నిధులు ముగిపోయినట్టేనని వెల్లడవుతోంది. -
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
సాక్షి,నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఐదవ వీధిలో ఓ మహిళపై భర్త దారుణ హత్య జరిపిన ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల జర్సీ అనే యువతిని ఆమె భర్త వంశీ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో అధిక కట్నం తేవాలని వాదనలతో భార్యపై వంశీ దాడి చేశాడు.అనంతరం సాయంత్రం సమయంలో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. -
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి
రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడికి పాల్పడ్డారు జనసేన పార్టీ కార్యకర్తలు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు టోల్గేట్ సమీపంలో ఆమెపై దాడి చేశారు జనసేన కార్యకర్తలు. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపీ అనే వ్యక్తిని చితకబాదారు. ఆపై హర్షవీణను మూకుమ్మడిగా ఎటాక్ చేశాయి ఆ మూకలు. తనపై దాడి జరిగిన విషయన్ని రైల్వేకోడూరు పీఎస్లో ఫిర్యాదు చేశారు అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ.కాగా, నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సూటిగా ప్రశ్నించారు. తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్ కళ్యాణ్ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు.తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు.మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?, మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్ను నిలదీశారు. -
రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, రికార్డు స్థాయిలో మద్యం వినియోగం జరుగుతోంది. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.గత ఏడాదిలో బీర్ వినియోగం 70.29 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు రూ. 31,237 కోట్లకు చేరాయి. మొత్తంగా ప్రభుత్వం 414 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. గతంలో 362 లక్షల కేసులు ఉండగా, ఇప్పుడు 414 లక్షలకు పెరిగింది.బీర్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి, మొత్తం 232 లక్షల కేసుల బీర్ను ప్రజలు వినియోగించారు.ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం నియంత్రణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్ జగన్ను కలిసిన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
తాడేపల్లి: నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ ఎన్నికపై వైఎస్ జగన్ నాయకత్వం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.వైఎస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో బార్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. -
వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా వైఎస్ జగన్కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు.కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
సాక్షి, తాడేపల్లి: గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం ఇచ్చారు. ‘‘మానవాళి కోసం జీసస్ మహాత్యాగం చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు....మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Christ’s crucifixion stands as the ultimate example of love, compassion, and sacrifice. On this Good Friday, let us pause to reflect, look within, and renew our values, guided by His simple yet profound teaching: to love one another as we love ourselves.#GoodFriday— YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2026వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలువైఎస్ జగన్ను క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జగన్కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
‘అసెంబ్లీలో చంద్రబాబు తుగ్లక్ తీర్మానం చేశారు’
హైదరాబాద్: అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తుగ్లక్ తీర్మానం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిభ్రమించే అమరావతి రాజధాని బిల్లును శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 2వ తేదీ) హైదరాబాద్లోని ప్రెస్క్లబ్ నుంచి మీడియాతో మాట్లాడారు ఎస్వీ సతీష్రెడ్డి. ‘అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. అమరావతిపై మండలిలో చంద్రబాబు ఎందుకు తీర్మానం పెట్టలేదో చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు ఎందుకు హైప్ చూపిస్తున్నారో చెప్పాలి. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది.అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు ఏం అవసరం ఉంది. తెలంగాణ సచివాలయం కట్టడానికి రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కమీషన్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పనులు చేయిస్తున్నారు. అమరావతి, పోలవరంను చంద్రబాబు, లోకేష్ ఏటీఎంల వాడుతున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 సంవత్సరాల్లో అమరావతి నుంచి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. చంద్రబాబుకు దమ్ము ధైర్మం ఉంటే ఆల్ పార్టీ సమావేశం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు..అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీ, అవినీతికే తాము వ్యతిరేకమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సతీష్రెడ్డి. ‘చంద్రబాబు పిలుస్తున్న టెండర్లలో పారదర్శకత లేదు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తే చూస్తూ ఊరుకోం. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండటం లేదో చెప్పాలి?, అమరావతిలో చంద్రబాబు చేసే దోపిడీకి వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్(MAVIGUN)పై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. -
‘వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్రెడ్డి వివరించారు.‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు...వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది...అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్రెడ్డి దుయ్యబట్టారు. -
‘కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా...అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్ను మీడియాకు విడుదల చేయండి...బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు : వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు. శాసన ప్రక్రియను పాటించలేదు. ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.మండలిలో చర్చించకుండా తీర్మానం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది.ఇప్పుడెలా రాజధానిపై బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు శాశ్వత నిర్మాణాలు జరగలేదు. ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?. ఇప్పటికే వడ్డీలకు రూ.20వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అమరావతి కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలోనే రూ.3.40లక్షల కోట్లు అప్పు చేశారు.అమరావతి వరదలతో మునిగిపోతుందని ఆధారాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మేం మూడు రాజధానులు చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా పెట్టాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కర్నూల్ను జ్యూడీషియల్ క్యాపిటల్గా పెట్టాం. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు.. రూ.12వేలకు పైగా ఖర్చుపెడుతున్నారు. అమరావతి పేరుతో.. కుంభకోణాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యాసభ నుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేశారు. -
ముత్తూట్ ఫైనాన్స్ వద్ద టెన్షన్.. ఖాతాదారుల గుండెల్లో రైళ్లు
అన్నమయ్య జిల్లా: రాయచోటిలోని ముత్తూట్ ఫైనా న్స్ బ్యాంకు మేనేజర్ ఖాతాదారుల బంగారు నగలతో వెళ్లిపోయారన్న ప్రచారం బంగారు పె ట్టిన ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా యి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్ వచ్చేవరకు బ్యాంకు తాళాలను తెరవడానికి వీ లులేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయా న్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాతాదారులకు సర్దిచెప్పి అనుమానాలు ఉంటే బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని, నగలు చూపించకపోతే అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్ చేయడానికి సమ్మతించారు. ముత్తూట్ ఫైనాన్స్ ఖాతాల్లో సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్ల బంగారం అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంబేపల్లి మండలం, గున్నికుంట్ల గ్రామం, కత్తివాండ్లపల్లికి చెందిన ఉమా మహేశ్వర్ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి రూ. 11.36 లక్షల మొత్తం రుణంగా పొందారు. రెన్యువల్ నిమిత్తం బ్యాంకు మేనేజర్కు 073170 నంబరు ఉన్న ఖాళీ చెక్కును అందజేశానన్నారు. ఈ చెక్కుతో గోల్డ్లోన్కు జమ చేయకుండా మేనేజర్ పసుపులేటి నరేష్ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున రూ. 9,50,000లు డ్రా చేసినట్లు బ్యాంకు ఎదుట మీడియాకు వివరించారు. రెండు రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై బ్యాంక్ మేనేజర్ నరేష్ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఉమా మహేశ్వర్ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా రూ. 6 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారన్నారు. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్ ద్వారా రుణం పొందిన డబ్బులకు, నాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా తాను వ్యక్తిగత కారణాలు వల్ల సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో ఉమా మహేశ్వర్ బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇదే విషయం ఖాతాదారుల్లో గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటనపై రాయచోటి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.ముత్తూట్, మణప్పురం ఇతర ఫైనాన్స్ బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పెట్టిన నగలను తిరిగి పొందటానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని ప్రైవేట్ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముత్తూట్ బ్యాంకులో వచ్చిన ఆరోపణలపై భీతిల్లిన ఖాతాదారులు బుధవారం ఒక్కరోజు రూ. 40 లక్షలు చెల్లించి బంగారాన్ని పొందినట్లు సమాచారం. -
రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. రాజ్యసభ జీరో అవర్లో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. 33 ఏళ్ల సర్వీస్కే కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధనపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో అభద్రత ఏర్పడిందన్నారు. దీంతో ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా ఉద్యోగులు నాలుగేళ్ల ముందుగానే సర్వీసు, ఆర్థిక ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజనాలు కోల్పోతున్నారని సుభాష్ చంద్రబోస్ వివరించారు.‘‘ఇప్పటికే పే రివిజన్ కమిషన్ బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టారు. డీఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేలకోట్ల రూపాయలు చెల్లించడం లేదు. పెన్షన్ సెటిల్మెంట్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు రెండేళ్లపాటు వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అలవికాని సర్వే టార్గెట్లు పెడుతున్నారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు’’ అని సుభాష్ చంద్రబోస్ తెలిపారు.‘‘గత వైఎస్సార్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 కు పెంచాం. పీఆర్సీని అమలు చేశాం. డీఏ పెంచి బకాయిలను క్లియర్ చేశాం. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అన్ని రకాల సహకారం అందించాం. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్స్ అమలయేలా చర్యలు తీసుకోవాలి’’ అని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. -
విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది. మరో భారీ ఎల్పీజీ నౌక.. విశాఖ పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చిన 'పైన్ గ్యాస్' ఎల్పీజీ నౌక.. 47 వేల టన్నుల గ్యాస్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ డిమాండ్, నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్టు సమాచారం.కాగా, వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్ వెసల్స్ రాకతో విశాఖ పోర్టు కళకళలాడుతోంది. ఐదు రోజుల క్రితం(శుక్రవారం) కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చింది. మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి బీడబ్ల్యూ బిర్చ్ వెసల్ 24,000 మెట్రిక్ టన్నుల భారీ ఎల్పీజీ నౌక వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎమ్టీ సెంచూరియన్–1 వెసల్లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్లోడ్ చేశారు. కాగా, అమెరికా నుంచి మరిన్ని గ్యాస్ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.యుద్ధ సంక్షోభం తరువాత నాలుగు ఎల్పీజీ నౌకలు విశాఖ వచ్చాయని విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. లక్ష టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని.. మరో 3 గ్యాస్ నౌకలు రానున్నాయని తెలిపారు. 13 క్రూడ్ ఆయిల్ నౌకలు వచ్చాయని.. మరో 4-5 క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖ పోర్టు.. ముంబై పోర్టుతో సమానంగా కార్గో హ్యాండిలింగ్ చేస్తుందన్నారు. -
మచిలీపట్నం: పేర్ని కిట్టును అడ్డుకున్న సీఐ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆరో వార్డులో అధికారులు.. అక్రమంగా ఇల్లును కూల్చేసిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మచిలీపట్నం వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టును సీఐ అడ్డుకున్నారు. పేర్ని కిట్టుపై పరుష పదజాలంతో సీఐ పరమేశ్వర్ రెచ్చిపోయారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఐ వ్యాఖ్యలపై పేర్ని కిట్టు అభ్యంతరం వ్యక్తం చేశారు.సీఐ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఇంటి కూల్చివేతపై ఆదేశాలను చూపాలంటూ కార్పొరేషన్ అధికారులను పేర్ని కిట్టు నిలదీశారు. మున్సిపల్ అధికారులు.. పొంతనలేని సమాధానాలను చెబుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కాగా, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో నగరపాలక సంస్థ అధికారులు నిన్న (బుధవారం) మరో కూల్చివేతల పర్వానికి తెరలేపారు.నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్తో కూల్చివేశారు. తమ గృహాన్ని కూల్చివేయవద్దని బాధితులు అడ్డుపడినా పోలీసులు ఈడ్చిపారేశారు. జనసేన పార్టీ సానుభూతిపరులైన గృహనిర్మాణదారులను పోలీసులు నిర్భందించి ఈ కూల్చివేత పర్వం నిర్వహించటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికి కట్టి ఉన్న జనసేన జెండాలు సైతం ఊడబెరికి కూలగొట్టడం గమనార్హం.నిర్మాణాలకు సంబంధించి ఇటీవలే కోర్టు స్టే వెకేట్ కావటంతో నిర్మాణదారులు భవన శ్లాబు పనులు చేపట్టారు. శ్లాబ్ పనులు పూర్తయిన అనంతరం టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మునిసిపల్, పోలీస్ యంత్రాంగం బుధవారం ఒక్కసారిగా యుద్ధానికి వెళ్లినట్లుగా పొక్లయినర్తో చుట్టుముట్టి బాధితులను నిర్బంధించి ఈ చర్యకు పాల్పడటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.తమకు ముందస్తు సమాచారం లేకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న గృహాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. పెట్రోల్ పోసుకుని చనిపోవటం తప్ప తమకు వేరే దారిలేదని బాధితుడు పెట్రోల్ పోసుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు పేర్కొన్నారు. తమ గృహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఎందుకు కూలుస్తారంటూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నిర్భందించారు. దీనిపై మునిసిపల్ అధికారులను మీడియా ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. -
ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగుల ఇబ్బందులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం (ఏప్రిల్ 1న) హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) ప్రతినిధుల చర్చలు జరిగాయి. ప్రభుత్వ హామీని విశ్వసించలేమని ఆషా ప్రతినిధులు చెప్పారు. ప్రతిసారి చర్చల్లో నోటిమాట తప్ప ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇవ్వడం లేదని అన్నారు. జనరల్ బాడీ సమావేశంలో సైతం సమ్మె కొనసాగించాలి నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు పూర్తి స్థాయిలో విడుదల అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని ఆషా ప్రతినిధులు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆషా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీని బంద్ చేసింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటి కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ఆషా నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని అల్టిమేటం జారీ చేసింది. ఏపీలో గతంలోనూ ఇటువంటి హెచ్చరికలు వచ్చాయి. మళ్లీ ఇటువంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఈ స్కీమ్లో భాగస్వామ్యం కాబోమని గతంలోనూ పలు ఆసుపత్రులు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. -
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. `రామ కార్యమే నా ధర్మం` అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన. మనోధైర్యంతోనే ఏ కార్యాన్ని అయినా సాధించవచ్చని హనుమంతుడు చూపిన మార్గం మనకు ఆదర్శం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. `రామ కార్యమే నా ధర్మం` అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన. మనోధైర్యంతోనే ఏ కార్యాన్ని అయినా సాధించవచ్చని హనుమంతుడు చూపిన మార్గం మనకు ఆదర్శం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2026 -
అయ్యన్నపాత్రుడి సృష్టి క్షేత్రంపై స్టే
సాక్షి, అమరావతి/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువును ఆక్రమించి ‘సృష్టి క్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణ పనులు నిర్వహించవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే సుందరీకరణ పనులు చేపట్టే ముందు అందుకు సంబంధించిన కార్యాచరణను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న అయ్యన్న పాత్రుడికి సైతం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. చెరువు ఆక్రమణ దారుణం: పొన్నవోలు వాదనలుస్పీకర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పెద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దారుణమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉమా శంకర గణేష్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పెద చెరువు కింద 345.25 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి నేతృత్వంలోని ఈ చెరువు మధ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువును కొంత మేర పూడ్చి ఇక్కడ భారీ శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. శివ పార్వతుల విగ్రహాల ఏర్పాటునకు పిటిషనర్ వ్యతిరేకం కాదు. చెరువు సమీపంలో ఉన్న చారిత్రక దేవస్థానంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. పంటలకు ప్రాణాధారంగా ఉన్న చెరువును పూడ్చేసి విగ్రహాలను ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం. గతంలో ఇదే చెరువు సమీపంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు లేఖ రాసి మరీ అడ్డుకున్న అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు తానే తన కుమారుడితో కలిసి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం దారుణం. ఈ నేపథ్యంలో అయ్యన్న నేతృత్వంలో జరుగుతున్న చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి’ అని అభ్యర్థించారు. నీటి వనరులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టులు చాలా తీర్పులు వెలువరించాయని తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు తప్పని ఆధారాలతో నిరూపణఅనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. కేవలం చెరువు కట్టల బలోపేతం, పూడికతీత, సుందరీకరణ పనులను మాత్రమే చేపడుతున్నామన్నారు. ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో సుధాకర్రెడ్డి స్పందిస్తూ, చెరువు మధ్యలో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్న భూమి పూజ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, పెద చెరువులో చేస్తున్న నిర్మాణాలపై స్టే విధించింది. రైతుల హర్షం: ఉమా శంకర గణేష్ స్పీకర్ తలపెట్టిన అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మమ్మల్ని çకలిశారు. దీంతో వారికి అండగా నిలిచాం. హైకోర్టు తాజా ఆదేశాలతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
ఎస్సై కొట్టాడని విషం తాగిన యువకుడు
ఏలూరు జిల్లా: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగు మందు తాగిన ఘటన ఏలూరు జిల్లా నిడమర్రులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమర్రుకు చెందిన నండూరి శివకార్తికేయ (33) తన మేనకోడలు బంగారు గొలుసుపోవడానికి అదే గ్రామానికి చెందిన వట్టి వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో గత నెల 29న ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. రెండువర్గాలు 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు కాగా.. మంగళవారం నిడమర్రు బాలవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీసు సిబ్బందితో బాధితుడు శివకార్తికేయ వాగ్వాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో బాలాజీ అనే వ్యక్తి కత్తి తిప్పి పరారయ్యాడు. దీంతో శివకార్తికేయను ఎస్సై జీపులో స్టేషన్కు తీసుకువెళ్లి చితకబాదినట్టు శివకార్తికేయ కుటుంబసభ్యులు చెబుతున్నారు. శివకార్తికేయ మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పగా రాత్రికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే కల్యాణోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్లోనూ కొట్టాడని బాధితుడు శివకార్తికేయ బుధవారం పురుగు మందు తాగాడు. అతడిని తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. పోలీసుల దౌర్జన్యంతో శివకార్తికేయ ఆత్యహత్యకు పాల్పడ్డాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం శివకార్తికేయ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బుధవారం రాత్రి ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలను తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్లు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదో గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ వెంట నిడమర్రు సీఐ రజనీకుమార్, కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నారు. nidamarru incident youth consumes poison over -
ఐస్క్రీమ్ అమ్మితే రూ.3,000 జరిమానా!
కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామస్తులు వేసవి నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం కాపాడుకునే దిశగా తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది. ఐస్క్రీమ్లు తిని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, దీంతో తమ గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లు రాకూడదంటూ గ్రామ సరిహద్దులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిబంధనను మీరి ఎవరైనా ఐస్క్రీమ్ అమ్మితే రూ.3 వేలు, ఐస్క్రీమ్ కొన్న వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. డోలీ మోత.. గర్భిణుల వ్యథ!గర్భిణులకు డోలీ కష్టాలు తప్పట్లేదు. అల్లూరి జిల్లా, డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలోని డొకిరిపాడుకి చెందిన పాంగి డొమినికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గత్యంతరం లేక 3 కి.మీ. డోలీలోనే మోసుకెళ్లారు. బూసిపుట్టుకు చేరుకున్న అనంతరం అంబులెన్స్కు ఫోన్ చేసినా రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో అరకులోయ ప్రాంతీయాస్పత్రికి తరలించారు. కాగా, డొకిరిపాడు రహదారి నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.5 కోట్లు నిధులు మంజురయ్యాయి. నిలిచిపోయిన పనులు కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేక పోతోందంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – డుంబ్రిగుడ -
టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ మహిళా నేత ఆవేదన
ఉదయగిరి: రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచించాడని, ఈ వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం వడ్డీపాళెంకు చెందిన టీడీపీ మహిళ నేత చల్లా వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుండా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నారని తెలిసి, సమాజానికి సేవ చేయాలనే తపనతో తన ఆలోచనలను పంచుకోవాలని బెంగళూరులో ఉన్న తాను వచ్చానన్నారు. అయితే.. పోలీసులు కారు చెక్ చేయాలని తనను కిందకు దించి బలవంతంగా మరో కారులో తన కారు డ్రైవర్ను, తన సోదరుడిని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తమ సెల్ఫోన్లు తీసుకుని సీఎం సభ అయి ఆయన వెళ్లేంత వరకు తమను నిర్బంధించి సాయంత్రం వదిలి పెట్టారని ఆరోపించారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో సయోధ్య చేసుకోవాలని ఓ మహిళ ఎస్సై తనతో చెప్పడాన్ని చూస్తే.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యే తనతో వ్యçవహరించిన వైఖరిని చంద్రబాబుకు చెబుతాననే భయంతోనే తనను కిడ్నాప్ చేయించాడని మండిపడ్డారు. తమను ఇక్కడ కాకుండా విజయవాడలో వదిలిపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ఎమ్మెల్యే తనను ఇంకా వదలకుండా ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృíష్టికి తీసుకెళతానని చెప్పారు. -
ఆగిన ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీ ఆర్వైద్యసేవలు)పథకం కింద ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. ఆరోగ్యశ్రీ కార్డులతో ఉచిత చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన రోగులకు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పేస్తున్నాయి. దీంతో తొలి రోజే నిరుపేద, మధ్య తరగతి అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులు చేసేదేమీ లేక డబ్బులు కట్టి ఆస్పత్రుల్లో చేరారు. గత్యంతరం లేకనే... ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో గత్యంతరం లేకనే సమ్మె చేస్తున్నామని యాజమాన్యాలు ఆస్పత్రుల ముందు పోస్టర్లను ఏర్పాటు చేశాయి. ఆస్పత్రులు దివాళా తీయకుండా..రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి.ఇంకా మోసపోలేం... ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో బుధవారం ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా) ప్రతినిధులతో మంగళగిరిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ భేటీ అయ్యారు. సమ్మె విరమించి సేవలు పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తరఫున సౌరభ్గౌర్ చేసిన ప్రతిపాదనను ఆశా ప్రతినిధులు తిరస్కరించారు. దీంతో ‘రెండు వారాల్లో రూ.వెయ్యి కోట్లు, అనంతరం మూడు నెలల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తాం. కొత్త బీమా విధానం అమలును వాయిదా వేసి, ప్యాకేజీ ధరలు, ఇతర అంశాలపై ‘ఆశా’ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సౌరభ్ గౌర్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ‘ఇప్పటికే ఈ ప్రభుత్వం అనేక హామీలిచ్చి దగా చేసింది. చాలాసార్లు మోసపోయాం. ఇక మోసపోలేం..’ అని ఆశా ప్రతినిధులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. గతేడాది సమ్మె చేసినప్పుడు డిసెంబర్లోగా బకాయిలన్నీ తీర్చేస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగినట్టు సమాచారం. ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘అధికారురులు నోటి మాటల ద్వారా ఇచ్చిన హామీలను నమ్మి సమ్మె విరమించబోం. ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనలపై బుధవారం రాత్రి ఆశా సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ప్రతిపానలపై విముఖ వ్యక్తం చేస్తూ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. రూ.1,000 కోట్లు బిల్లులు విడుదల చేసే వరకు సమ్మె కొనసాగించాలని తీర్మానించారు. -
వీళ్ళు బయట మనల్ని ఎలా చూపుతున్నారు?
తెలుగు ప్రజలు రెండుగా విడిపోయి పదేళ్ళు అయింది. ఈ అనుభవం తర్వాత కూడా ఇంకా మనగురించి మనం చెప్పు కునేప్పుడు; ‘నేను’ అనాలా, లేక ‘మేము’ అనాలా అనే మీమాంస అలాగే ఉంది. ఇది ‘జీఐ’ (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ) అనే మన భౌగోళిక గుర్తింపు దృష్టి నుంచి అంటున్న మాట. సీఎం అంటేనే ‘ప్రభుత్వం’ అయినప్పుడు, రాష్ట్ర ‘ప్రజలు’, ‘ప్రాంతము’– ఈ రెండింటికి ఆయన ప్రతినిధి. అటువంటిది, ఏపీ గురించి ముఖ్యమంత్రి బయట మాట్లాడేటప్పుడు, ఆయన రాష్ట్ర ప్రజలైన మనల్ని కూడా కలుపుకుని ‘మన’ అంటున్నారా, లేక తనమట్టుకు మాత్రమే పరిమితం చేసుకుని ‘నేను’ అంటున్నారా? ఇటీవల పార్లమెంట్లో జరిగింది చూసినప్పుడు, ఈ అంశం చర్చించకుండా ఉండలేకపోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ చారిత్రక వైభవాన్ని పరిరక్షించి మన ‘హెరిటేజ్’ని కొత్త తరాలకు చేర్చే ‘ఆర్కియాలజీ’ శాఖ పనితీరు గురించి, దానికి నిధుల కేటాయింపు గురించి చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు (కూటమి) ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. ‘అందుకు కారణం కేంద్రం వద్ద నిధులు లేకపోవడం కాదు, మీ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి రానందున, మీ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు’ అని మంత్రి అన్నారు. తరుచూ ‘టూరిజం’ చుట్టూ పెరిగే వృద్ధి గురించి, దాని విస్తరణ గురించి మాట్లాడే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇటువంటి లోపానికి కారణం ఏమిటి అని చూస్తే, మళ్ళీ అది మరొక ‘అకడమిక్’ అంశం అవుతున్నది. సామాజిక శాస్త్రాలకు తల్లి వంటి చరిత్ర కనుక ఈ ప్రభుత్వానికి గుర్తు ఉండివుంటే, పురావస్తు శాస్త్రం (ఆర్కియాలజీ) దానితో జంటగా కలిసే ఉంటుంది కనుక, అది కూడా వారికి గుర్తు ఉండి ఉండేది. మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదు అనే వైఖరి ఈ ప్రభుత్వం తీసుకుంది కనుక; ఇక ఇప్పుడు వారికి ‘టూరిజం’ అంటే హోటళ్లు, కాటేజీలు, ‘ఫుడ్’, వినోదం, విలాసం మాత్రమే ‘టూరిజం’ అవుతుంది. అందుకే గడచిన పదేళ్ళలో ఇంకా దొరకాల్సిన చరిత్ర కోసం ఇక్కడ వెతకాలని, అందుకు ‘ఆర్కియాలజీ’ కార్యకలాపాలు అవసరం అని ఈ ప్రభుత్వం అనుకోలేదు. ఢిల్లీలో మార్చి 5–7 మధ్య ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ జరిపిన పదకొండవ ‘రైసీనా డైలాగ్– 26’ సదస్సులో మన తీరు కూడా అటువంటిదే. పైగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ దీనికి స్పాన్సర్ కూడా. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సుకు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. బీజేపీ తన ముద్రకోసం దాన్ని – ‘సంస్కార’ అనే బ్యానర్ కింద జరిపినా ‘ధ్రువీకరణ, వసతి, పురోగతి’ అనే మూడు అంశాల దృష్టితో ఇది జరిగింది. కానీ కొత్త రాష్ట్రానికి ప్రతినిధిగా మాట్లాడిన ఏపీ సీఎం బాబు వెయ్యి కిలోమీటర్ల తీరం ఉన్న ఈ రాష్ట్రం ఉనికిని ఇతరులకు అదొక భౌగోళిక అవకాశంగా ఆ వేదికపై చూపలేదు. దీని పర్యాటక ప్రాధాన్యం గురించి అక్కడ చెప్పకుండా పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని చేజేతులా వదిలివేశారు. ఆ వేదికమీద నుంచి ‘ప్రపంచం అంతా ఇండియన్స్ ఉన్నారు, సిలికాన్ వ్యాలీ, అమరావతి ‘టెక్నాలజీ హబ్’, ‘ఏఐ’, ‘డేటా సెంటర్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘వరల్డ్ క్లాస్ ఎకో సిస్టం’ అంటూ చెప్పాక, చివరికి ఈ మధ్య మన జిల్లాల్లో ఎక్కువ పిల్లల్ని కనండి అని చెబుతున్నట్టుగా, అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు 25 వేలు ఇస్తాము అని చెప్పేశారు. పైగా దీన్ని– ఫైవ్ పిల్లర్ మోడల్’ అని వెల్లడించారు. అంటే– అమ్మా నాన్న, ముగ్గురు పిల్లలు కలిసి ‘ఐదు స్తంభాలు నమూనా’ అని. పైగా ఇది ‘పాపులేషన్ కేర్’ కార్యక్రమం అని కూడా అన్నారు. అయితే, ఇందులో ఎక్కడ ‘మనం’ ఉన్నామో వెతకడం ఎలా?జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
భ్రమలు కల్పిస్తూ.. రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నావ్
ఆచరణాత్మక ఆలోచన.. మావిగన్చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు. ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి రెండు అక్షరాలు ఎంఏ, విజయవాడలోంచి తొలి రెండు అక్షరాలు వీఐ, గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకుని ‘మావిగన్’ (MAVIGUN) అని పేరుపెట్టండి. గన్ అంటే బాగుండదు.. జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేకానీ రూ.2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఎంత వరకు కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు (మానస పుత్రిక) అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? చంద్రబాబు డబ్బా కొట్టినట్టు అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయ్యిందా? ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి అదిగో.. ఇదే అమరావతి అంటారు. ఇప్పుడు అమరావతి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయా?కనీసం భూములు ఇచ్చిన రైతులకు హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి సౌకర్యాల కల్పనకు ఎకరానికి కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. ఇలా అమరావతి బడ్జెట్ను ఎందుకు పెంచాల్సి వస్తోంది? నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంత సుదీర్ఘ సమయంలో రూ.2 లక్షల కోట్ల వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది.భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మార్చలేరా? చట్టాలు చేసిన తర్వాత చట్ట సవరణలు చేయలేరా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, తన అవినీతిని కప్పిపుచ్చుకునే డ్రామా చేస్తున్నారు.2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇక్కడ కాపురం పెట్టారా? ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయి? 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీసు చేశారు. ఒకవైపు సీఎంగా ఉంటూ హైదరాబాద్కు వెళ్లి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా 2024 ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్ మొత్తం హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు అక్కడే. అదీ చంద్రబాబు తీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకైతే వారానికి నాలుగు రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ ఎప్పుడుంటాడో తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం. మమ్మల్ని తిట్టడానికే అసెంబ్లీ. నిజానికి మా ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేసేవి. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానిది.. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి క్యాపిటల్(రాజధాని)ను సీఎం చంద్రబాబు దేశంలో అతి పెద్ద స్కామ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్ల రాజధాని అని అభివర్ణించారు. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రాజధానికి చట్టబద్ధత పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించి నాణానికి రెండో పార్శ్వాన్ని సాక్ష్యాధారాలతో ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 12 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం రూ.8 వేల కోట్లే రాజధాని కోసం ఖర్చు చేశారని.. ఈ లెక్కన కనీస సదుపాయాలు కల్పించడానికే దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పుటికి ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతోందో.. లేక రూ.10 లక్షల కోట్లకు చేరుతుందో అన్నారు. అప్పు తెచ్చిన నిధులు.. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు ఒక్క అమరావతికే ఖర్చు పెడితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని, ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, మంచి మాటేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో.. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వివరించారు. సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం మేం ప్రతిపాదించిన ప్లాన్ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు బట్టబయలవుతాయని.. దేవుడు, ప్రజలు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అప్పుడు బెస్ట్ కేపిటల్.. ఇప్పుడు మున్సిపాలిటీనా? ⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన (బెస్ట్), బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ అని ఊదరగొట్టిన వ్యక్తి, ఈ రోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలు కావాలని చెప్పడం స్కాములు చేయడానికే!⇒ ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది. వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పారా చంద్రబాబు? ఐదున్నర గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో వీటికి సమాధానం చెప్పలేదు. ⇒ కేవలం జగన్ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరుతో పట్టపగలు చేస్తున్న దోపిడీపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు డ్రామా చేశారు. ఒకవైపు అసెంబ్లీని పిలుస్తారు.. మరోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్(శాసనమండలి)ను పిలవరు. కౌన్సిల్ను పిలిస్తే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని మా సభ్యులు బయట పెడతారని, చంద్రబాబు బండారాన్ని కడిగి పారేస్తారని భయం.రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం డ్రామా⇒ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నిజాయితీ లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే కేవలం దోపిడీ, అవినీతి చేయడమే. రకరకాలుగా దోపిడీ కోసం డ్రామా చేస్తాడు. విజన్, సంపద సృష్టి అంటాడు. కొత్త కొత్త పేర్లతో డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించి స్కాము(కుంభకోణం)లతో దోచేస్తున్నారు. అమరావతిలో గత వారం శాసనసభ తీర్మానం డ్రామాలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి.⇒ వాస్తవానికి రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాజధానిపై ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొంది.⇒ మన కళ్ల ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది. ఎందుకీ డ్రామా? రాజధానిపై రాష్ట్రాలకే హక్కు ఉన్నప్పుడు చంద్రబాబు డ్రామా చేస్తూ రైతులను, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.స్కాముల కోసం చట్ట సభలనూ వదలట్లేదు⇒ చంద్రబాబు హైకోర్టు, అసెంబ్లీని కూడా స్కాముల కోసం వదలట్లేదు. దుబారా, విచ్చలవిడి దోపిడీ కోసం చట్టసభలను వాడేస్తున్నారు. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు పరిమితం చేయలేదు. ఏ పని చూసినా దోపిడీ కనిపిస్తోంది. రోడ్లు, మురుగు నీటి కాలువలు, సీవరేజీ ప్లాంట్, కొండవీటి వాగు వరద మళ్లింపు, లే అవుట్ డెవలప్మెంట్, అర్కిటెక్చర్ డిజైన్ల ఫీజుల్లో అవినీతికి పాల్పడ్డారు.రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?⇒ రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్లు కాకుండా భవనాల నిర్మాణానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్క అమరావతిలో కేవలం మౌలిక వసతులకే ఇంత ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై అప్పులు తెచ్చి.. స్కాములు చేయడంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.⇒ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు, హాస్పిటళ్లను పట్టించుకునే నాథుడు లేదు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాదితో కలిపితే రూ.10 వేల కోట్లు అవసరం అయితే బడ్జెట్లో విదిల్చింది స్వల్పమే. ప్రభుత్వంపై నెట్వర్క్ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం నిలిపివేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ను పట్టించుకోవట్లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను నిలిపేశారు.⇒ మా హయాంలోని పథకాలు రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే కార్యక్రమాలన్నీ గతించాయి. చివరికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు మోసాలుగా తేలాయి. ఉద్యోగులకు రూ.36 వేల కోట్లు బకాయిలున్నాయి. చంద్రబాబు తన జీవితాంతం అమరావతిలోనే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రెయిన్లు కడతారా? వాటిని కట్టడానికి జీవితాంతం అప్పులు చేస్తారా? అంత వరకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఇవన్నీ అడుగుతామనే అసెంబ్లీలో తీర్మానం అంటూ కౌన్సిల్ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్టు డ్రామాలు చేశారు. నాయకులుగా ఆచరణాత్మక ఆలోచన చేయాల్సిన ధర్మం మనపై ఉంది. అంతేగానీ స్కాములకు స్టాంపు వేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు.ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లే!⇒ వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఈ ప్రాంతానికే కాదు.. ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే అమరావతిలో ఒక ఎకరా అభివృద్ధికి (రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి వసతి) మాత్రమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక భవనాల ఖర్చు అదనం. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికే దిక్కులేదు. రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.⇒ చంద్రబాబు 12 ఏళ్ల కిందట చెప్పిన లెక్క ప్రకారం రాజధానిలో లక్ష ఎకరాల్లో సాధారణ మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.2 లక్షల కోట్లు రూ.4 లక్షల కోట్లు అవుతుందో.. రూ.10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు.⇒ విడిపోయిన రాష్ట్రానికి ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? 2014–19 మధ్య కేవలం రూ.5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అప్పుల ద్వారా తెచ్చిందే. ఈ రెండేళ్లలో ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ (మొత్తం చేసిన, చేయడానికి నిర్ణయించిన) అప్పులు రూ.47 వేల కోట్లు. ఇందులో డ్రా చేసింది రూ.13 వేల కోట్లు. వీటిల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చింది రూ.5,500 కోట్లు. ఇక్కడ 10 శాతం అడ్వాన్సులుగా ఇవ్వడం.. అందులో 8 శాతం కమీషన్లు తీసుకోవడం.⇒ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు పెట్టారు. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం కిలోమీటరుకు రూ.170 కోట్లు పెడుతున్నారు. మా హయాంలో బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లైవర్ పూర్తిగా నిర్మించాం. దీనికి కిలోమీటరకు రూ.35 కోట్లు ఖర్చు అయ్యింది. చంద్రబాబు ఏమైనా బంగారు బిస్కెట్లు పెట్టి కడుతున్నారా?⇒ అమరావతిలో మిగిలిపోయిన ఆరు లేన్ల రోడ్లు వేయడానికి కిలోమీటర్కు రూ.53 కోట్లు వెచ్చిస్తున్నారు. అదే జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరుకు రూ.20 కోట్లు సగటు ఖర్చు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ఎదురుదాడి చేసి అమరావతికి వ్యతిరేకం అంటారు.⇒ మా హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. పని చేసి బిల్లు పెడితే డబ్బులిచ్చాం. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మార్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చారు. ముందే డబ్బులిచ్చి అందులో కమీషన్లు ఎత్తేస్తున్నారు. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. మరో రూ.960 కోట్లు దారి మళ్లించారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది రూ.2,500 కోట్లు, రూ,5,335 కోట్లు. మొత్తంగా దాదాపు రూ.8 వేల కోట్లు మాత్రమే. కేవలం రోడ్లు, కరెంట్, నీళ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట ఇప్పటి వరకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలింది ఎప్పటికి చేస్తారు?⇒ అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లీడర్లుగా ఉంటూ స్కాముల కోసం.. సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు అవసరం అని తెలిసినా, అసాధ్యమని కళ్లముందే కనిపిస్తున్నా.. రైతులను, ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు అప్పులు తెచ్చి, అమరావతి పేరు చెప్పి.. స్కాములు చేసి దోచేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ దోపిడీ డైవర్షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పేరుతో డ్రామాలు చేశారు.రాజధాని అమరావతి నిర్మాణాలకు అనూహ్యంగా రేట్లు పెంచడంపై ది హిందూ పత్రికలో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ జగన్ 2018లో ఇచ్చిన వాళ్లకే ఇప్పుడు మళ్లీ పనులు⇒ రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో.. 2024లో ఆ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ ఆ పనులకు టెండర్లు నిర్వహించి.. అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్లలో చంద్రబాబు గూడుపుఠాణి, మాఫియా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి, మళ్లీ రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్లీ పాత వాళ్లకే కట్టబెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్కు ఇసుక ఫ్రీ, కరెంటు చార్జీల్లో రాయితీలు, జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ మినహాయింపులు అన్నీ ఇస్తున్నా సరే చదరపు అడుగుకు ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?⇒ కేపిటల్గా అమరావతి రియాల్టీ సంగతి పక్కన పెడితే.. దేశంలో అతిపెద్ద స్కాముకు చంద్రబాబు నిజంగా కేపిటల్గా మార్చేశారు. ఇక్కడ వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్) అవినీతి సాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన రెసిడెన్షియల్ ప్లాట్స్ చదరపు అడుగుకు రూ.4,500 మించట్లేదు. ఇందులో ఇసుక ఉచితం లేదు.. ఎటువంటి రాయితీలు లేవు. కానీ, రాజధానిలో అన్ని రకాల రాయితీలు ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తున్నారు.⇒ అమరావతిలో చంద్రబాబు సాగిస్తున్న దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు. సచివాలయంలో టవర్–1, 2లకు బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో ఖరారు చేసిన కాంట్రాక్టు విలువ రూ.932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ రూ.1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో పెంచిన రేటుకు 4.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్కు నజరానా రూపంలో జీఎస్టీ, పన్నుల వంటి మినహాయింపుల ద్వారా రూ.257 కోట్లు లబ్ధి. మొత్తంగా రెండు టవర్ల నిర్మాణ వ్యయం రూ.1,762 కోట్లకు చేరింది. గతంలో కంటే ఏకంగా రూ.830 కోట్లు పెరిగింది. పైగా అçప్పటి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీనే ఇప్పుడు పనులు చేసేది.⇒ ఇక టవర్ 3, 4 పనులను 2018లో రూ.784 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.1,247 కోట్లకు పెంచేశారు. దానిపై మళ్లీ 4.5 శాతం అదనంగా కాంట్రాక్టర్కు ఇస్తున్నారు. రాయితీలు మరో రూ.241 కోట్లు. మొత్తంగా చూస్తే రూ.1,545 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ ఎల్అండ్టీ. ఇప్పుడూ వాళ్లే. ఈ పనులు అన్నింటికీ ఇసుక ఫ్రీ.⇒ జీఏడీ టవర్ చూస్తే బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు 49 అంతస్తుల నిర్మాణానికి 2018లో రూ.554 కోట్లు కాంట్రాక్టు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.844 కోట్లకు పెంచేశారు. ఆ పెంచిన టెండర్ల రేటుపై 4.53 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. రాయితీల రూపంలో మరో రూ.163 కోట్లు లబ్ధి. మొత్తం రూ.1,046 కోట్లకు చేరింది. అప్పుడు కాంట్రాక్టర్ ఎన్సీసీ. ఇప్పుడూ వాళ్లే.⇒ ఈ ఐదు టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఇస్తే.. మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లిఫ్టులు, ఫైర్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అన్నీ కలుపుకుంటే ఐదు టవర్లకు రూ.6,671 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్లో మౌలిక వసతుల (డ్రెయినేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) కోసం రూ.1,053 కోట్లు చెల్లిస్తోంది. ఎక్కడైనా ప్లాట్లు కట్టే సమయంలో ఇవన్నీ అందిస్తేనే ప్రజలు అందులో చేరతారు. ఇక్కడ కాంట్రాక్ట్ విలువ కంటే వీటికి అదనంగా ఖర్చు చేస్తున్నారు.⇒ దీని బిల్డప్ ఏరియా 52.20 లక్షల ఎస్ఎఫ్టీ. అంటే ఎస్ఎఫ్టీకి రూ.14,795 ఖర్చు చేసింది. ఇందులో అదనపు మౌలిక వసుతులు తీసేస్తే ఎస్ఎఫ్టీకి రూ.12,779 అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అన్నీ కలుపుకుని ఎస్ఎఫ్టీ రూ.4,500కు చేస్తుంటే ఇక్కడ రూ.వందల కోట్ల మినహాయింపులు, ఇసుక ఉచితంగా ఇచ్చినా నిర్మాణాలకు రూ.14 వేల కోట్లకుపైగా అవుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.⇒ ఒకవైపు ఇంత డబ్బులు ఖర్చు చేసి టవర్లు కడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో రూ.1,100 కోట్లు వృథా చేశారు. అవి ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ డబ్బులన్నీ గంగలో పోసినట్టే కదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 10 లక్షల ఎస్ఎఫ్టీలో రూ.615 కోట్లతో సచివాలయం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.970 కోట్లు మాత్రమే అయ్యింది. అందులో 1,272 మంది కూర్చునేలా కట్టారు. పార్లమెంట్ను దేశం మొత్తం చూస్తోంది. ఆ స్థాయిలో వాళ్లు కడితే.. ఇప్పుడు కట్టే మన అసెంబ్లీ రూ.1,449 కోట్లు అవుతుంది. అంటే, పార్లమెంట్ను దాటేశాం.. కేసీఆర్ నంబర్కు డబుల్ చేసేశాం. ఇక హైకోర్టు కోసం మరో రూ.1,480 కోట్లు. ఐదు టవర్లు కాకుండా ఈ రెండూ అదనంగా కట్టేవి. -
ఈడుపుగల్లులో అధికారుల చర్యలపై వివాదం
సాక్షి, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు చేపట్టిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఘటన వివరాలు.. NHAI అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వైసీపీ సానుభూతిపరుల షాపుల ముందు JCB తో గండ్లు పెట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ధ్వంసం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. రహదారి పక్కన ఉన్న ఇతర షాపులను మాత్రం తొలగించకపోవడం వివక్షత ఆరోపణలకు దారితీసింది. దాంతో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పడేస్తారు? అని ప్రశ్నించారు. మచిలీపట్నం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఇలాగే పడేస్తారా? అంటూ నిలదీశారు. రహదారి అటువైపు ఉన్న షాపులు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చెందిన షాపులపై అధికారులు జంకుతున్నారా అని కూడా ప్రశ్నించారు. వైసీపీ నేత చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. -
బాబు హయాంలో లక్షన్నర మంది విద్యార్థుల డ్రాపౌట్లు..!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుందని కేంద్రం వెల్లడించింది. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర విద్యార్థులు డ్రాపౌట్లు అయినట్ల తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమాధానం ఇచ్చారు.ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని.. 12 తరగతి వరుకు విద్యార్థుల గణాంకాలు కేంద్రం వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 36,43,083 విద్యార్థులు కాగా.. 2025-26 విద్యా సంవత్సరంలో 34,93,449కి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఏడాది వ్యవధిలో 1,49,634 విద్యార్థులు స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు.గవర్నమెంట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తొలగించడం, సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు, విద్యావ్యవస్థను సరిగా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు గుడ్ బై చెబుతున్నారు. -
లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.అమరావతి పేరుతో దోపిడీ.. అమరావతి బిల్లుపై లోక్సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.చర్చలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. -
‘ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే కుదరదు’
సాక్షి, కష్ణా: జిల్లా డీఆర్సీ మీటింగ్లో కలెక్టర్ వర్సెస్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మధ్య మాటల యుద్ధం చర్చాంశనీయంగా మారింది. మాకు చెప్పకుండా మా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తామంటూ కలెక్టర్పై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైరయ్యారు. ఆకస్మిక తనిఖీలు మీకు చెప్పి రాలేమంటూ కలెక్టర్ బాలాజీ సమాధానం ఇచ్చారు. ప్రతిదీ మీకు చెప్పి రావడం కుదరదని తేల్చి చెప్పారు. ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో డైలాగ్ వార్ జరగడంతో.. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొన్న అధికారులు గుసగుసలాడుకున్నారు. -
అమరావతిపై లోక్సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్సభలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్ను మోసం చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన ప్రశ్నించారు. -
‘టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’
సాక్షి,విజయవాడ: టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వం తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4న (శనివారం) వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలు పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ నాయుడు అసాంఘిక , అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నెలరోజులైనా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ ఛైర్మన్ ఎంత నిష్టగా ఉండాలి. బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా?. లేదంటే చంద్రబాబు చెబితే బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకూ ఒత్తిడి తెస్తాం. టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు కొనసాగడాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతోందన్నారు. -
అమరావతి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు.అమరావతి బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారుబీజేపీ మాట మార్చింది.. చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. అనంతరం, లోక్సభలో సమాజ్వాదీపార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..‘ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి, ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదు. విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేది. అమరావతి పేరుతో భారీ ఎత్తున రైతుల నుంచి భూమి తీసుకున్నారు. రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చారా?. రైతులకు న్యాయం జరగాలి’ అని అన్నారు. -
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు.. స్కామ్ల రాజధాని. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాసరే ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకు రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు. కాంట్రాక్టర్కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు. టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు. ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు. జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు. ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.ఐదు టవర్లకు చదరపు అడుగుకు రూ.14795 ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారు. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ రూ.615 కోట్లతో కట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం రూ.970 కోట్లతో కట్టారు. మళ్లీ అసెంబ్లీ అంటూ రూ.1149 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ హైకోర్టు అంటూ రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కామ్ల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలడం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వల నుంచి వరదల వరకు ప్రతీచోటా బాబు అవినీతి జరిగింది. కొండవీటి వాగు-వారధి వరకు ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 170 కోట్లా?. మా హయాంలో ఫ్లైఓవర్ల కోసం కిలోమీటర్కి రూ.35 కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో కి.మీకి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు’ అని అన్నారు. -
లోకేష్, పవన్ ఇప్పటికీ షటిల్ సర్వీసులే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్కు షటిల్ సర్వీసే చేస్తున్నారు. పవన్, లోకేష్ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండటం లేదు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. -
అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా? అని వైఎస్ జగన్ అడిగారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా మూడు ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదు.శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?.అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి. 2019కి ముందు మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు. ఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు. చదరపు అడుగుకు 11వేల నుంచి 14వేలు అవుతుందని చెబుతున్నారు. ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై ఏం చెప్పారు?. రాజధాని పేరుతో పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల్లో చర్చ లేదు. కౌన్సిల్ సభ్యులు అవినీతిని బయటపెడతారని బాబు భయం. సభలు చట్టాలు చేస్తాయి. సవరణలూ చేయగలుగుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు. -
సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్లో క్షణాల్లో డెలివరీ
సాక్షి, రాజమహేంద్రవరం: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొందరికి వంటింటి కష్టాలు తెచ్చి పెడుతోంటే.. కొంతమంది గ్యాస్ సరఫరా డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గ్యాస్ కొరతను బూచిగా చూపుతూ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసిన 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 45 రోజులకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి ధర గృహ వినియోగానికి అవసరమయ్యే ఒక్కో సిలిండర్ సాధారణ ధర రూ.900 ఉంటే.. ప్రస్తుతం అవసరాన్ని బట్టి రూ.2,000ల నుంచి రూ.2,500లకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.3,500కు పైగా పలుకుతోంది. అధిక ధరలైనా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా డీలర్లు బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొన్ని ఏజెన్సీలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చిన్నపాటి హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు వంటివి నిర్వహించే చిరు వ్యాపారులపై వంట గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్ద హోటళ్లు, కేఫ్లు 1.20 లక్షలు ఉంటాయి. వీటిపై సుమారుగా 3 లక్షలకు పైగా శ్రామికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు మూసివేశారు. మరికొన్ని హోటళ్లు కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నాయి. వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయంతోనే బతుకుబండి లాగుతుంటారు. ప్రస్తుతం గ్యాస్ లభించకపోవడం, దొరికినా.. అధిక ధర వెచ్చించాల్సి వస్తుండటంతో ఆహార పదార్థాల ధరలను ఆ మేరకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వ్యాపారాలు ఆపేస్తే పస్తులు ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు చెల్లించే వారికి గ్యాస్ క్షణాల్లో ప్రత్యక్షం అవుతోంది. సాధారణ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం రోజుల సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్లు పెట్టుకుని బ్లాక్లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొందరు అధికారులు గ్యాస్ బ్లాక్ దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫారసుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. దొంగ బుకింగ్లు వినియోగదారుల పేరుతో అక్రమంగా బుకింగ్లు చేసి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో గ్యాస్ సరఫరా దారులు అడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.23 రోజులుగా అవస్థలు జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉండగా.. 18.32 లక్షల జనాభా ఉంది. 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. 8.67 లక్షల వివిధ రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 23 రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా బుకింగ్లు ఇప్పటికే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అధికారుల గణాంకాల మేరకు సాధారణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు 11,500 గ్యాస్ సిలిండర్లు బుక్ అవుతాయి. యుద్ధం ఆందోళనల నేపథ్యంలో రోజుకు 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్లు నమోదవుతున్నాయి. ఒక్కో సిలిండర్కు సగటున రూ.1,000 అధికంగా వసూలు చేస్తున్నారని భావించినా.. రోజుకు రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు అడ్వాన్స్గా బుక్ చేసి పెట్టుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ క్షణాల్లో ముగిసేది. ప్రస్తుం సర్వర్లు బిజీగా మారిపోవడంతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
చంద్రబాబుకు ఆచరణాత్మక ధోరణి లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ (ఏప్రిల్ 1) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అవినీతిని ఆయన ఎండగట్టారు. తాము అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్గా మారిందని ఆరోపించారు. చంద్రబాబు కేవలం తన స్కాముల కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబులో ఆచరణాత్మక ధోరణి, ప్రాక్టికాలిటీ అనేది కనిపించదని.. అది ఉండి ఉంటే, ఇప్పటికే రాజధాని అనేది పూర్తయ్యేదన్నారు. రాజధానిలో చంద్రబాబు దోపిడీ మొత్తం బయటకు వస్తుందని, ప్రతి పనిలో ఎంత మెక్కిందీ కూడా బహిర్గతం అవుతుందన్నారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలోని హైలైట్స్ ఇవే..ప్రశ్నించకూడదట, అడగకూడదట..అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లోనూ చంద్రబాబు హైలెవల్ కరప్షన్అమరావతిలో రోడ్లైనా, మురుగునీటి కాల్వలైనా, సీవరేజీ ప్లాంట్లైనా.. కొండవాటి వరద మళ్లింపు పనైనా ఇలా ఏది చూసినా అవినీతేకేవలం సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకోసమే రూ.401 కోట్లు పెడుతున్నారుఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు రూ.170 కోట్లు పెడుతున్నారుమా హయాంలో విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కి.మీ.రూ.35 కోట్లు పెట్టారుమిగిలిపోయిన సిక్స్ లేన్ రోడ్డుకు అమరావతిలో రూ.53 కోట్లు పెడుతున్నారునేషనల్ హైవేల్లో సిక్స్ లేన్ కోసం సగటు ఖర్చు రూ.20 కోట్లు మాత్రమేఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట అడిగితే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడుఅమరావతికి వ్యతిరేకం అని ఎదురుదాడి చేస్తున్నారు ఇక మంచి ఎలా జరుగుతుంది? చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మోసాలుగా మిగిలిపోయాయి ఇక చంద్రబాబు లక్ష ఎకరాల అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు?ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా, బాధ్యతగా చేయాల్సిన మంచి ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు రూ.36 వేల కోట్ల బకాయిలు ఉన్నాయిఅమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది2018 లో ఏ పనులు, ఎవరు చేశారో.. 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులుఅమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారుఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారుల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపుసీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు.. అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు మా పథకాలన్నీ ఆగిపోయాయి..స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు అప్పులుఅప్పులు తెచ్చి కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే స్టార్ట్ అయ్యిందినాడు-నేడు ఆగిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఆగిపోయాయిఆరోగ్య శ్రీ ఆగిపోయింది, వ్యవసాయం దెబ్బతిందిమెడికల్ కాలేజీలు ఆగిపోయాయి, మా పథకాలన్నీ ఆగిపోయాయిరాష్ట్రానికి అవసరమైన ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆగిపోయాయి వైఎస్సార్సీపీ ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదుచంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా ౩ ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారువైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, ఏ ప్రాంతానికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదుప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు బిల్డప్50 వేల ఎకరాల్లో వరల్డ్లోనే బెస్ట్ క్యాపిటల్ అన్నారుఇప్పుడు మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?ఎక్కడా లేని విధంగా కాస్ట్ పేర్ స్క్వేర్ ఫీట్ పెరిగిందిఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఎందుకు పెరిగింది?వీటికి అసెంబ్లీలో చంద్రబాబు సమాధానం చెప్పాడా?కేవలం జగన్ను, వైఎస్సార్సీపీ దుమ్మెత్తి పోయడానికి అసెంబ్లీని వాడుకున్నారుచట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవలేదుచంద్రబాబు అవినీతి బాగోతాన్ని కౌన్సిల్లో బయటపెడతారని పిలవలేదుఏ చట్టాన్నైనా చట్టసభలు తయారు చేయగలవుఆ చట్టాలను చట్టసభలు సవరించగలవు.. ఇది వాస్తవంప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నారుఅవినీతి నుంచి డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలుఎన్ని దశాబ్దాలు పడుతుంది?భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కు లేదుఇందులో రోడ్లు, కరెంటు, వాటర్, డ్రైనేజీ కల్పనకే ఖర్చు రూ.లక్ష కోట్లుఇప్పుడు సడన్గా మరో 50 వేల ఎకరాలు ఎందుకు పెంచారు?సడన్గా మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు?దీనివల్ల అదనంగా మరో రూ.లక్ష కోట్లు పెరిగిందిమరి ఈ డబ్బు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది..రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదన్నారుస్వయంగా మంత్రి పార్థసారథి ఈ విషయం చెప్పారుఅమరావతిపై శాసనసభలో తీర్మానం చేశారురాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి పక్కదోవ పట్టించడానికే తీర్మానంరాజధాని పేరిట పట్టపగలు దోపిడీ: అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇదిరాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదుసీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉందిఈ వాస్తవాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దులక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత?నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా?రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందిచంద్రబాబు లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయిఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలిరూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?ఈ రూ.2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి2019 ముందు మాస్టర్ప్లాన్ ఎందుకు మార్చుతున్నారుఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారుఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లుఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదుఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయిఏడేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో చంద్రబాబు చేసిందేంటి?భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?అమరావతిపై వాస్తవాలు తెలియాలిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టంశాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామారాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదుచంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతిఅమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి -
గోల్డ్ చీటీ స్కామ్.. కోట్ల రూపాయలు మాయం!
అన్నమయ్య జిల్లా: మదనపల్లె పట్టణంలోని మణప్పురం రితి జువెలర్స్లో రూ.కోట్లలో మోసాలు జరగిన విషయం సోమవారం సాక్షి దినపత్రిక ద్వారా వెలుగు చూడటం పాఠకులకు తెలిసిందే. తరుగు, కూలి లేకుండా తక్కువ ధరకే బంగారు నగలు ఇస్తామని నమ్మబలికి, అమాయక ప్రజల దగ్గర రూ.కోట్లలో చీటీలు కట్టించుకున్న ఆ సంస్థ మేనేజర్ సూరజ్ పరారీలో ఉంటడంతో.. తాము కూడా మోసపోయామంటూ బాధితులు బయటికి వస్తున్నారు. రెండవ రోజు మంగళవారం కూడా పలువురు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న మణప్పురం రితి జువెలరీ షాపు వద్దకు క్యూ కట్టారు. మేనేజర్ ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించడంతో కంపెనీ నిర్వాహకులపైనా బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము అడ్వాన్స్ బుకింగ్ పేరుతో బంగారు నగలు కొనుగోలు చేసేందుకు పెట్టుబడులు పెట్టామని పట్టణానికి చెందిన షేక్ గౌష్, అలీ, బీఎస్ బాబుసాహేబ్ తదితరులు తెలిపారు. నిరీ్ణత గడువు తరువాత తాము పెట్టిన సమయానికి ఉన్న బంగారు ధరతో ఏ ఆభరణమైనా కొనుక్కోవచ్చునని సంస్థ నమ్మబలికిందని చెప్పారు.కొనుగోలు సమయంలో తరుగు, కూలి లేకుండా ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతోనే తాము లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపించారు. మేనేజర్ సూరజ్ తాము కట్టిన నగదును తన ఖాతాకు బదిలీ చేసుకుని 20 రోజుల క్రితం పరారైనట్లు సిబ్బంది పేర్కొనడం, దానికి తోడు తమ పేర్లు కంపెనీ వద్ద లేవని చెప్పడం చూస్తుంటే దీని వెనుక కంపెనీలోనే ఇంటి దొంగల బాగోతం ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. -
తిరుమలలో వైభవంగా వార్షిక వసంతోత్సవాలు
తిరుమల: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఏప్రిల్ 1న పౌర్ణమి గరుడసేవ రద్దుశ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. -
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
-
హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు
సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు. మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్డీడ్ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్డీడ్ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్డీడ్ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో.. తహసీల్దార్ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందు రివిజన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్డీడ్ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
చల్లపల్లి పోలీస్స్టేషన్లో భారీ విస్ఫోటనం
సమయం: ఉదయం 10.05 గంటలు, రోజు: మంగళవారంకృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్టేషన్ సిబ్బంది విధుల్లో భాగంగా మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. స్టేషన్ రిసెప్షన్లో సిబ్బంది వారి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే విస్ఫోటనం సంభవించింది. ఏం జరిగిందని తేరుకొనేలోపే బాంబుల మోత మోగింది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ పేలుడు శబ్దంతోపాటు దట్టంగా కమ్మేసిన పొగ ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించింది.దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.చల్లపల్లి: దీపావళి సందర్భంగా 2025 అక్టోబర్లో అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారుల నుంచి చల్లపల్లి పోలీసులు టపాసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ కేసు ఇటీవల కొట్టివేయడంతో కోర్టు ఆదేశాల ప్రకారం మందుగుండు సామగ్రిని నిరీ్వర్యం చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10.05 గంటల సమయంలో ఎస్ఐ డి.దుర్గాంజనేయులు పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్ఐ వాహనం డ్రైవర్ డి.నాగరాజు మందుగుండును వాహనంలోకి ఎక్కించే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఉలిక్కిపడ్డ వారు ఏమి జరిగిందో తెలుసుకునేలోపే ఎస్ఐ దుర్గాంజనేయులు, కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. రిసెప్షన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కె.శివపార్వతికి, హెడ్ కానిస్టేబుల్ కేటీడీవీ ప్రసాద్(తేజ)కు కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్ కిటికీలు, దర్వాజాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. పోలీస్జీపు దెబ్బతింది.చొచ్చుకుపోయిన రాళ్ల పిక్కలు.. ధ్వంసమైన స్టేషన్ ముందుగుండు సామగ్రిలో ఉపయోగించిన చిన్న రాళ్లపిక్కలు శరీరం లోపలికి చొచ్చుకుపోవడంతో కానిస్టేబుళ్లు షేక్ అబ్దుల్లా, నాగరాజుల శరీరాలు రక్తపు ముద్దలా మారిపోయాయి. ఎస్ఐ దుర్గాంజనేయులుకు వెనుక భాగం, జుట్టు బాగా కాలిపోయాయి. తొలుత ఎస్ఐతోపాటు మిగిలిన వారిని చికిత్స నిమిత్తం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా, నాగరాజు, ఎస్ఐ దుర్గాంజనేయులు, కేటీడీవీ ప్రసాద్ వినికిడి శక్తి, కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. శభాష్ శివపార్వతి తనకు గాయాలైనా రక్తమోడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సహోద్యోగిని ఆస్పత్రికి తరలించేందుకు ఆమె చేయి అందించింది. స్టేషన్లో సంభవించిన బాణసంచా ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ కె.శివపార్వతి గాయాలయ్యాయి. అయినా పట్టించుకోకుండా తీవ్రగాయాలతో నేలకొరుగుతున్న అబ్దుల్లాను వాహనం ఎక్కించింది. తర్వాత ఆమె కూడా చల్లపల్లి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీంతో శివపార్వతికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అట్టపెట్టెలో నుంచి జారి పడడంతో పేలుడు మందుగుండు సామగ్రి వాహనంలోకి ఎక్కించే సమయంలో అట్టపెట్టె అడుగు భాగం నుంచి మందుగుండు జారి కింద పడడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సీసీఫుటేజీలో ఈ విషయం వెల్లడైందన్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి ఎస్ఐ డి. దుర్గ ఆంజనేయులుతోపాటు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజును మంత్రులు వాసంశెట్టి సుభా‹Ù, కొల్లు రవీంద్ర, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. కోర్టుకానిస్టేబుల్ అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. -
దుర్గగుడి సిబ్బంది మాయాజాలం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మలగన్న అమ్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కానుకలకు రెక్కలొచ్చాయి. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను తరలిస్తున్న ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ పేరిట రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని ఆలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు.ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఘటనకు కారణమైన ఉద్యోగితోపాటు మరికొందరికి ఆలయ అధికారులు మెమోలు జారీ చేశారు. మంగళవారం దేవదాయ శాఖ గోల్డ్ వెరిఫికేషన్ అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మహా మండపం ఆరో అంతస్తులోని కానుకల లెక్కింపు ప్రాంతంతో పాటు సోమవారం నాటి సీసీ కెమెరా ఫుటేజీని సైతం పరిశీలించారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 20 రోజులకు ఒకసారి లెక్కింపు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 20 రోజులకొకసారి కానుకల లెక్కింపు జరుగుతుంది. హుండీలలో నగదుతో పాటు భక్తులు బంగారు, వెండి వస్తువులను కానుకగా సమరి్పస్తుంటారు. వీటిలో గ్రాము బరువు గల మంగళ సూత్రాలు, నాణేలు హుండీలో వస్తుంటాయి. కానుకల లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది వాటిని వేరుచేసి దేవస్థానం లాకర్లో భద్రపరుస్తుంటారు. కొందరు రోల్డ్గోల్డ్ ఆభరణాలను సైతం హుండీలో వేస్తుంటారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది వాటిని గుర్తించి దగ్ధం చేస్తుంటారు. గోల్డ్ను రోల్డ్గోల్డ్లో కలిపేసి సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రోల్డ్గోల్డ్ వస్తువులతో పాటు బంగారు రేకుతో తయారు చేసిన మంగళసూత్రాలు, నాణేలను ఆలయ సిబ్బంది గుర్తించారు. అధికారులెవరికి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను రోల్డ్గోల్డ్ వస్తువుల్లో కలిపివేయడాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుర్తించారు. కొన్ని దఫాలుగా కానుకల లెక్కింపులో సదరు ఉద్యోగి తీరుపై అనుమానంతో నిఘా పెట్టారు. సోమవారం రోల్డ్గోల్డ్ వస్తువులలో బంగారు ఆభరణాలు, వస్తువులను వేయడంతో పక్కా ఆధారాలతో ఆ ఉద్యోగిని పట్టుకున్నారు.ఈ వ్యవహారం బయటకు రాకుండా కొందరు ఉద్యోగులు ప్రయత్నించినట్టు సమాచారం. మంగళవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ వర్గాలు కలవరపడ్డాయి. కొన్ని నెలల క్రితం భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాల్లో డైమండ్స్, విలువ కలిగిన రాళ్లను సైతం ఆలయ సిబ్బంది మాయం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. బంగారాన్ని కరిగించే సమయంలో రాళ్లను పగులగొట్టి బంగారాన్ని వేరు చేశామని చెప్పడం గమనార్హం. మట్టీ మాయమవుతోంది ప్రతి 20 రోజులకు ఒకసారి జరిగే కానుకల లెక్కింపులో వచ్చిన రోల్డ్గోల్డ్ వస్తువులను మహా మండపం దిగువన ఆలయ సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో పెట్రోల్ పోసి దగ్ధం చేస్తారు. అయితే.. రోల్డ్గోల్డ్ వస్తువులను దగ్ధం చేసిన మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లారేసరికి మాయం చేస్తున్నారు. ఈ మట్టి బంగారం శుద్ధిచేసే వారి వద్దకు చేరుతోంది. అంటే రోల్డ్గోల్డ్ ముసుగులో అసలైన బంగారు వస్తువుల్ని కూడా దగ్ధం చేసి.. మట్టిలో కరిగిపోయిన బంగారాన్ని మాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రైజర్పై చర్యలు దుర్గగుడి గోల్డ్ అప్రైజర్ డి.షమ్మీపై చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా తొలగించినట్లు పేర్కొన్నారు. విధుల్లో అలసత్వంగా కారణంగా దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ]సీసీ కెమెరాలు, అధికారులు ఉన్నా..దుర్గగుడిలో కానుకల లెక్కింపును 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. లెక్కింపు జరుగుతున్నంత సేపు ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్నా చాకచక్యంగా బంగారు వస్తువులను రోల్డ్గోల్డ్ పేరిట బయటకు తరలించడం వెనుక ఆలయ అధికారుల పాత్ర, భద్రతా సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘గుంజు’కొని డబ్బులు ఎగ్గొట్టారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అరకొర ధరకు మామిడిని కొన్న చెర్లోపల్లి గుజ్జు ఫ్యాక్టరీ ఏడాది అవుతున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంపై కర్షకులు కదంతొక్కారు. బకాయి బిల్లులు తక్షణం చెల్లించాలని నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు మంగళవారం తరలివచ్చి ఫ్యాక్టరీని చుట్టిముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి వంటావార్పు చేపట్టారు. బిల్లులు చెల్లించే వరకు కదిలేది లేదంటూ భీషి్మంచారు. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టామని.. వడ్డీలు పెరుగుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం కనికరించడం లేదని, చెల్లింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని బిల్లులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. రూ.3 కోట్ల బకాయిలు ఏడాది క్రితం చిత్తూరుతో పాటు తవణంపల్లి, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల తదితర మండలాల నుంచి రైతులు వేలాది టన్నుల మామిడి పంటను ఫ్యాక్టరీకి తరలించారు. కానీ ఇప్పటికీ వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.3 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై ఆగస్టు నుంచి పోరాడుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే 90 శాతం మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేసిందని, అయినా తమకు రావాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని రైతులు విమర్శించారు. గుజ్జును తరలించే కంటైనర్ల అడ్డగింత ఫ్యాక్టరీ నుంచి గుజ్జును తరలించేందుకు వచ్చిన మూడు కంటైనర్లను రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మరో రెండు కంటైనర్లను వెంబడిస్తూ నిరసనను మరింత ఉధృతం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు యతి్నంచారు. డబ్బులు చేతికి అందే వరకు కదలబోమని రైతులు భీషి్మంచడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. దీంతో రైతులు అక్కడే వంటావార్పు చేపట్టి దీక్షను కొనసాగిస్తున్నారు. పిల్లలు, మహిళలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు సర్కారుకు పట్టదా? ‘రైతు సమస్యలను పట్టించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది’ అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఫ్యాక్టరీ చెల్లింపులు చేయలేదని, దీనిపై తాము ఆగస్టు నుంచి ఆందోళనలు చేస్తున్నా బాబు సర్కారుకు పట్టడం లేదని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు ఏ ఒక్కరూ మామిడి రైతు సమస్యలపై నోరెత్తకపోవడంపై మండిపడ్డారు.ఎన్నాళ్లు తిరగాలి ?నేను ఫ్యాక్టరీకి 50 టన్నుల కాయలు పంపించాను. రూ.3 లక్షల వరకు బిల్లులు రావాలి. ఎన్నాళ్లని తిరిగేది..?. ఇది చాలా దారుణం. మా కష్టాలను కూడా పట్టించుకోవాలి. బిల్లులు ఇచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తాం. – శరత్బాబు, తెల్లగుండ్లపల్లి, యాదమరి మండలం బిల్లులు ఇవ్వకుంటే కదలం బిల్లులు అడిగితే అదిగో.. ఇదిగో అంటూ ఏడాదిగా నెట్టుకొచ్చారు. ఇప్పుడు గుజ్జు మొత్తం ఖాళీ చేసేశారు. 90శాతం గుజ్జు మొత్తం ఎత్తికెళ్లిపోయారు. మా డబ్బులు ఇవ్వకుండానే గుజ్జు తరలిస్తే ఎలా? బిల్లులు ఇవ్వకుండా మేము గేటు తీయం. దీక్ష వదలం. బిల్లులు ఇవ్వకుంటే దీక్షను ఇంకా ఉధృతం చేస్తాం. – జనార్దన్, తవణంపల్లి మండలం -
బతుకులతో బాబు చధరంగం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మోసాలపై మొక్కజొన్న రైతులు కన్నెర్రచేశారు. బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కారు. తమ బతుకులతో చంద్రబాబు చదరంగమాడుతున్నారంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్చేశారు. విజయవాడలోని ఏపీ మార్క్ఫెడ్ కార్యాలయాన్ని మంగళవారం మొక్కజొన్న రైతులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పొగాకు వేయొద్దన్నారని.. మొక్కజొన్న వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని, కొనేవారూ లేక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు పంటను కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు మొక్కజొన్న రైతులు క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య మాట్లాడుతూ బాబు పాలనలో ఉల్లి మొదలు టమాటా వరకు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి రైతులు నిండా మునిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. కనీసం రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కని పంటలను కొనాలని డిమాండ్ చేశారు. దళారుల మాటున కూటమి నేతలే రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, ఏపీæ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, పలు జిల్లాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ జీఎంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.రూ.1.25 లక్షలు నష్టపోతున్నా ఐదెకరాల్లో మినుము, ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా, 3 క్వింటాళ్లకు మించి రాలేదు. మొక్కజొన్న మాత్రం 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచి్చంది. మినుము మద్దతు ధర రూ.8,575 కాగా, మార్కెట్లో రూ.7వేలకు మించి కొనేవారు లేరు. క్వింటాకు రూ.1600కుపైగా నష్టపోయాను. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్లో రూ.1500–రూ.1700 మధ్య పలుకుతోంది. దీంతో ఐదెకరాలకు రూ.1.25 లక్షలు నష్టపోతున్నా. – ఎ.రాజశేఖర్, లింగాల, నంద్యాల జిల్లాపెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు ఐదెకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 30–35 క్వింటాళ్ల మధ్య దిగుబడులొచ్చాయి. మార్కెట్లో క్వింటా రూ.1600 నుంచి రూ.1700 మధ్య కొంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. – మద్దిరెడ్డి వెంకటరెడ్డి, అనుమల్లంక, గంపలగూడెం, ఎన్టీఆర్ జిల్లా -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సు సోమవారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజయవాడ బస్టాండ్ సమీపానికి చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ టెరి్మనల్స్ వద్ద మంటలు చెలరేగాయి.క్షణాల్లోనే మంటలు బస్సులోకి వ్యాపించి పొగ దట్టంగా కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేశారు. సమీపంలోనే ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే, బస్సులో మంటలు చేలరేగుతుండగా... హైదరాబాద్కు చెందిన ఓ మహిళ బస్సులో చెప్పులు మర్చిపోయానని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి తెచ్చుకోవడంతో అంతా ఆందోళన చెందారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
మనుబోలు: విజయవాడ డివిజన్ నెల్లూరు–గూడూరు సెక్షన్ పరిధిలో మనుబోలు మండలంలోని కొమ్మరపూడి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పాల ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న గూడ్స్ రైలు కొమ్మలపూడి సమీపంలోని 152/11 కి.మీ. వద్ద పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరో మార్గంలో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. మధ్యాహ్నం 2 గంటలకు రాకపోకలను పునరుద్ధరించారు. -
ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు
సాక్షి, టాస్క్ ఫోర్స్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మంగళవారం బరితెగించి ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడమేగాక లోపల తలుపులు వేసుకుని గంటలపాటు హంగామా చేశారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలంటూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు జిల్లా ఎస్పీని బెదిరించడంతోపాటు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. చివరికి పోలీసులు తలుపులు బద్దలుగొట్టి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.నరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ వచ్చారు. ఎస్పీ బి.కృష్ణారావును కలిసి జిల్లా పోలీసు కార్యాలయ న్యాయ సలహాదారుడి నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకు న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ను సిఫారసు చేస్తూ ఎనిమిది నెలల కిందట తాను లెటర్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని ఎస్పీని ప్రశి్నంచినట్టు తెలిసింది. సిఫారసు లెటర్ను ఉన్నతాధికారులకు పంపామని, వారే ఈ నియామకాలు చేపడతారని ఎస్పీ చెప్పినట్టు సమాచారం.తనకు ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలంటూ ఎస్పీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఒకదశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నేనేంటో ఈ రోజు నీకు చూపిస్తా.. అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తుండటంతో ఎస్పీ అసహనంతో బయటకు వెళ్లిపోయారు. ఎస్పీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఎస్పీ బయటకు వెళ్లడంతో చాంబర్లోనే ఉండిపోయిన ఎమ్మెల్యే తనకు ఎస్పీ క్షమాపణలు చెప్పే వరకు బయటకు రానంటూ తలుపులు వేసుకున్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారులపై చిందులు తొక్కారు. తలుపు గడియ తీయకుండా గంటల కొద్దీ చాంబర్లోనే ఉండిపోయారు. తరువాత కార్యాలయానికి వచి్చన ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే స్పందించ లేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్లో ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్సైదా, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరవిందబాబును బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఐజీతో మాట్లాడేందుకూ నిరాకరణ ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారన్న సమాచారం అందటంతో రాత్రి ఏడుగంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఎస్పీ చాంబర్లో ఉన్న ఎమ్మెల్యే.. ఐజీ రాకతో బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్దీ వేచిచూసిన ఐజీ.. సమస్య పరిష్కరిస్తానని స్థానిక టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పారు.తాను సిఫారసు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తానని ఎమ్మెల్యే భీషి్మంచారు. దీంతో పోలీసులు ఎస్పీ చాంబర్ తలుపులను, బాత్రూమ్ తలుపులను బద్దలుగొట్టి ఎమ్మెల్యే చదలవాడను బయటకు తీసుకొచ్చారు. తరువాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చర్చించారు. బుధవారం సాయంత్రానికి సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు అందజేస్తానని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవిందబాబు ఇంటికి వెళ్లిపోయారు. గతంలోనూ ఇంతే.. అధికారులను బెదిరించడం ఎమ్మెల్యే చదలవాడకు ఇదే మొదటిసారి కాదు. నరసరావుపేట లిక్కర్ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలివ్వాలంటూ 2025 మార్చి 7వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్ కమిషనరేట్లో బైఠాయించారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడంతో ఆయన మళ్లీ అదేపంథాలో బైఠాయించారు. ఒక ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అయితే విధులు నిర్వర్తించలేమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు ఐపీఎస్ సంఘాలు సిద్ధమైనట్టు సమాచారం. -
చంద్రబాబు సర్కారు.. కిక్కు బాక్సింగ్
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.చివరి రోజు ఆపసోపాలుఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
అమరావతి నాటకం.. చట్టబద్ధత బూటకం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతిని కప్పిపుచ్చుకోవడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా రాజధాని అమరావతికి ‘చట్టబద్ధత’ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో మరో అంకానికి తెరతీశారు. శనివారం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014కు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇక రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరంటూ తనకు తానుగా ఛాంపియన్గా చిత్రీకరించుకోవడానికి సీఎం చంద్రబాబు సినీఫక్కీలో డైలాగ్లతో చెలరేగిపోయారు.కేంద్రానికి సంబంధం లేకపోయినా..రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర, సంబంధం ఉండదు. ఇదే అంశాన్ని తేల్చిచెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది. టీడీపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన తీర్మానం మేరకు.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరణ చేసే బిల్లును పార్లమెంటులో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టనుంది.భవిష్యత్లో రాష్ట్ర రాజధాని అమరావతికి బదులుగా మరో నగరాన్ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి పంపితే.. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అమరావతికి చట్టబద్ధత అంటూ సీఎం చంద్రబాబు ఆడుతున్నది నాటకం తప్ప దానికి ఎలాంటి ప్రామాణికత లేదని తేల్చిచెబుతున్నారు. ‘డబ్బుల్’ ధమాకా..రాజధాని ప్రాంతంలో 2015లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరకే చంద్రబాబు బినావీులు, వందిమాగధులు భారీఎత్తున భూములు కాజేశారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ«దాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నాబార్డు, హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు ఇప్పటికే రూ.47,387 కోట్ల రుణం తెచ్చారు. ఆ రుణంతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టారు. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారు. రెండో విడత భూ సమీకరణకు సిద్ధమై..రాజధాని 29 గ్రామాలు.. 53,748 ఎకరాలకు (217 చ.కి.మీ.) పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు వెరసి ఏడు గ్రామాల్లో రెండో విడత 20,494 ఎకరాల్లో (82.9 చ.కి.మీ.) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వాటితోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు(626.67 చ.కి.మీ.) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూములను స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో అస్మదీయులకు కట్టబెట్టి భారీగా కాజేయాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.దీన్ని గ్రహించే రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు రావడం లేదు. తొలి విడత 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అమరావతికి చట్టబద్ధత డ్రామాకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రంరాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లుకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో గూండా రాజ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అండతో పాలకులు గూండా రాజ్యం నడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులను దీటుగా ఎదుర్కొందామని, వైఎస్సార్సీపీ కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా దాచేపల్లి మండలం రామాపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నం గురించి వైఎస్ జగన్కు వివరించారు.అలాగే చర్లగుడిపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలైన బీసీ సామాజికవర్గానికి(పద్మశాలి) చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావును ఫిబ్రవరిలో టీడీపీ గూండాలు హత్య చేశారని వారి కుటుంబసభ్యులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. వైఎస్సార్సీపీ కేడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, ఆకూరి వెంకటరెడ్డి, కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావుల కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, వేముల చలమయ్య, జంజనం తిరుపతి రావు, సైదయ్య, చెన్నారెడ్డి, షేక్ ఇమాం వలీ తదితరులున్నారు.భగవాన్ మహావీర్కు జగన్ ఘన నివాళిసాక్షి, అమరావతి: భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, ఏఎస్ఆర్ జేఎస్టీ సెక్రటరీ కుందన్ గాం«దీ, కరస్పాండెంట్ ప్రవీణ్ ఫౌలాముతా, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మహావీర్ మార్గం సదా ఆచరణీయం.. ‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం.. అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్. ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. మంగళవారం జైనుల ఆధ్యాతి్మక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యం పాలవుతోందని, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తన స్వతంత్రతను, నిజాయితీని కోల్పోయి అవినీతిమయంగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీఎన్ శేషన్ లాంటి అధికారుల ఆధ్వర్యంలో అత్యంత నిష్పక్షపాతంగా నడిచిన ఈసీ.. నేడు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మంగళవారం ‘భారత్ జోడో అభియాన్’ ఆధ్వర్యంలో ‘ఎన్నికల సమగ్రతకు సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల పారదర్శకతకు అత్యంత కీలకమైన ఫామ్ 17సీ విషయంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ డేటాను వెబ్సైట్లో ఉంచడానికి ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పైగా, ఈ ఫారం–17సీకి, ఓట్ల లెక్కింపు తర్వాత ఇచ్చే ఫారం–20కి మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయని, ఓటరు జాబితాల సవరణలో ఈసీ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని ఆరోపించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని, కానీ ఈసీ ఉద్దేశపూర్వకంగా ప్రజలను వేధిస్తోందని ఆయన విమర్శించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ప్రజల్లో 90 శాతం అపనమ్మకం ఉందని సర్వేలు చెబుతున్నాయని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ‘ఈవీఎం బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను కంట్రోల్ యూనిట్తో అనుసంధానం చేసే సాఫ్ట్వేర్ను ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోడ్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్లో ఏముందో ఎవరికీ తెలియ దు. అందులో మాలీషియస్ (హానికరమైన) కోడ్ ఉంటే పరిస్థితి ఏంటి? దీన్ని టైమ్ బేస్డ్గా కూడా సెట్ చేస్తున్నారు. మాక్ పోలింగ్ సమయంలో, ఉదయం 10 గంటల వరకు యంత్రం పక్కాగా పని చేస్తుంది. ఆ తర్వాత ఏ బటన్ నొక్కినా ఓటు మాత్రం వాళ్లు సెట్ చేసిన పార్టీకే వెళ్లేలా మ్యానిప్యులేట్ చేస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీ చెబుతున్న సాకులు విడ్డూరంగా ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా ఇప్పటి వరకు విచారణ జరగకపోవడం శోచనీయం. దేశంలో న్యాయవ్యవస్థ పరిస్థితి కూడా దయనీయంగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఇంకా పలువురి వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.అంధ్రప్రదేశ్ ఫలితాలు అత్యంత సందేహాస్పదంమే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దీన్ని బట్టి గంటకు సగటున 6.8 శాతం పోలింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. పోలింగ్ శాతం రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో పోలింగ్ శాతం పెరుగుదల కేవలం 0.08 శాతం మాత్రమే. కానీ.. అదే రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్ శాతం 76.50 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకూ పోలింగ్ శాతం 8.38 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 80.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే.. మే 13న రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 2.15 గంటల్లో 4.16 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 3.33 కోట్లు. ఇందులో 4.16 శాతం అంటే 17,19,482 ఓట్లు కేవలం 2.15 గంటల వ్యవధిలో పోలైనట్ల స్పష్టమవుతోంది. ఈ ఓట్లు మొత్తం 3,500 పోలింగ్ బూత్లలో పోలయ్యాయి. ఒక్కో బూత్లో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. 2.15 గంటలు అంటే 135 నిముషాల్లో 491 ఓట్లు.. అంటే ఒక నిముషానికి ముగ్గురు ఓటు వేశారు. అంటే ఒక వోటరు వోటు వేయడానికి తీసుకున్న సమయం 20 సెకన్లు. శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్మెంట్లో ఓటు వేశాక వీవీ ప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకన్లు.. లోక్సభ అభ్యర్థికి మరో కంపార్ట్మెంట్లో ఓటు వేశాక వీవీ ప్యాట్ రావడానికి 7 సెకన్లు మొత్తం 14 సెకన్లు సమయం పడుతుంది. అంటే.. మిగతా 6 సెకన్లలో ఓటరు గుర్తింపు కార్డు చూపడం, దాన్ని పోలింగ్ అధికారి తనిఖీ చేయడం, ఓటరు జాబితాలో ఆయన పేరు టిక్ చేయడం, సంతకం లేదా వేలిముద్ర తీసుకోవడం, ఓటరు చేతి వేలిపై ఇంక్ పెట్టడం ఇలా 6 సెకన్లలో రెండు ఓట్లు వేయడం సాధ్యమమ్యే పనేనా? పైగా మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నమోదైన తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టిడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మే 13 పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన శాతం నుంచి మే 17న ప్రకటించిన తుది శాతం వరకు మొత్తం 12.62 శాతం పెరుగుదల ప్రకారం చూస్తే అర్థరాత్రి అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంచితే, ఒక్కో నియోజకవర్గానికి సగటున 29,618 అదనపు ఓట్లు వస్తాయి. ఈ పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉండే అవకాశం లేదు. ఈ పెరుగుదల కొన్ని లకి‡్ష్యత నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే జరిగి ఉంటే, అది కొంత మంది అభ్యర్థులు లేదా పార్టీలకు భారీ విజయాన్ని ఇవ్వగలదు, మరికొంత మందిని పూర్తిగా ఓడించగలదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పు తీవ్ర అనుమానాస్పదంగా మారింది.– డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రముఖ ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తఈవీఎంలపై అనుమానాలు తీర్చాల్సిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై ప్రజలు, రాజకీయ పార్టీల్లో తలెత్తుతున్న అనుమానాలను ఏమాత్రం తీసిపారేయలేం. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఈసీపై ఉంది. పోలైన వీవీప్యాట్ స్లిప్పులను కచ్చితంగా వంద శాతం లెక్కించాలి. దీనిపై ఈసీ చెబుతున్న సాకులు సరికాదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ (కొలీజియం)లో ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత ఉంటే అది 2ః1 నిష్పత్తిలో అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది. అందువల్ల సీజేఐ కచ్చితంగా ఉండి తీరాలి. జమిలి ఎన్నికల విధానం ఆచరణలో ఎండమావి లాంటిదే.– ఎస్.వై ఖురేషీ, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ఏపీ తరహాలోనే ఒడిశాలోనూ సందేహాలు2024లో జరిగిన సాధారణ ఎన్నికల తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలే ఒడిశాలో కూడా పలు అనుమానాలను రేకితిస్తోంది. మొదట ప్రాథమికంగా ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతం మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలుత 62.02 శాతం పోలింగ్ నమోదయ్యిందని ప్రకటించగా ఆ తర్వాత ఏకంగా 12.48 శాతం పెంచేశారు. అంటే 42 లక్షల అదనపు ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల జాబితా, ఈవీఎం, అర్థరాత్రి ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా సమాధానం చెప్పాలి. – సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ మహాపాత్రశాశ్వతంగా అధికారంలో ఉండేలా డీలిమిటేషన్ గతంలో ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరిగేవి. ప్రస్తుతం ఎన్నికల అక్రమాలను ఎలా ఆపాలన్న దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. అధికార పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ఎన్నికల చర్యలున్నాయి. నియోజకవర్గాల్లో అనుకూలతలను బట్టి ఓట్లను కలపడం (ప్యాకింగ్), ఓట్లను విడగొట్టడం (క్రాకింగ్), వివిధ ప్రాంతాల్లోని అనుకూల ఓట్లను కట్టగట్టడం (స్టాకింగ్) వంటి పనులు చేస్తున్నారు.– యోగేంద్ర యాదవ్, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ -
ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్ టీచర్ల సేవలు రద్దు
సాక్షి, అమరావతి: ఏపీ మోడల్ స్కూళ్లలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తోన్న ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లు, కంప్యూటర్ టీచర్ల సేవలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో పనిచేస్తోన్న వారి సేవలను మే1 నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
మదనపల్లె: నాలుగుసార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించిన చిత్తూరు జిల్లా ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని రైతులను ప్రశ్నించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ లిఫ్ట్ రౌండ్టేబుల్ సమావేశంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా గోదావరి జలాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం ద్వారా కృష్ణా జలాలు రాయలసీమ రైతులకు అందకుండా చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం తప్ప ప్రేమ లేదన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి 40 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకునేలా కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టుపెట్టి అన్యాయం చేస్తుంటే రైతులు చూస్తూ ఊరుకుంటే ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి రైతులు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందన్నారు. లిఫ్ట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని వీటిని స్వయంగా తాము పరిశీలించినట్టు చెప్పారు. మిగిలిన పనులు పూర్తయితే రాయలసీమకు సాగు కష్టాలు తీరుతాయన్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తరలించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని, ఈ విషయం అక్కడ ప్రజలే చెబుతున్నారని అన్నారు. రాయలసీమ నిధులను ఎవరబ్బ సొత్తని అమరావతి రాజధాని కోసం తరలిస్తున్నారని ప్రశ్నించారు. చదరపు అడుగు నిర్మాణ ధర రూ.6,500 ఉంటే.. ఏ ధరలు పెరిగాయని రూ.11,500 పెంచి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.సీమకు ప్రమాద ఘంటికలురాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు సాధన కో–ఆర్డినేటర్ సాకే శైలజానా«థ్ మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అల్మట్టితో 200 టీఎంసీలు నిలిచిపోతాయని, కృష్ణాకు అందాల్సిన 100 టీఎంసీలు దక్కవన్నారు. అప్పర్ భద్ర, తుంగ ద్వారా 30 టిఎంసీల నీళ్లు ఆగిపోతాయన్నారు. ఈ జలాలు ఆగిపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిరాక ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. నీటి సమస్యపై మాట్లాడితే చంద్రబాబు నోరుమెదపరన్నారు. శ్రీశైలంలో మిగిలే 21 టీఎంసీల బురద నీళ్లే అంటున్న చంద్రబాబుకు ఆ బురదనీటి విలువ ఏమిటో తంబళ్లపల్లె, అనంతపురం ప్రాంతాల రైతులను అడిగితే తెలుస్తుందన్నారు. రాయలసీమకు నీళ్లు రావడం, పొలాలు పండటం చంద్రబాబుకు ఇష్టముండదన్నారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆర్.రమేష్కుమార్రెడ్డి, తిప్పారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ ఆహ్మద్ మాట్లాడుతూ.. రాయలసీమ పథకాన్ని పూర్తి చేయించుకునేందుకు చంద్రబాబు దిగివచ్చేలా పోరాటం సాగించాలన్నారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన పలు అంశాలపై మాట్లాడనున్నారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.40 కోట్లకుపైగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లు తిరక్కుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు మూడోసారి సమ్మె బాట పట్టాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పడింది. రోజు రోజుకూ పేరుకుపోతున్న బకాయిలతో ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతోందని కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే ఏప్రిల్ 1వ తేదీ (బుధవారం) నుంచి సేవలు నిలిపేసి, సమ్మెలోకి వెళతామని వారం కిందటే ‘ఆశ’ అల్టిమేటం జారీ చేసింది. వారితో చర్చలు జరిపి, సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. వెరసి పేద, మధ్య తరగతి ప్రజల ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. దగా చేసిన ప్రభుత్వం2024లో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేయడం మొదలెట్టారు. ఈ పథకాన్ని రూపుమాపే ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కేంద్రం అమలు చేసే పీఎంజేఏవై పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని లాంటి వారి ద్వారా ప్రకటనలు చేయిస్తూ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, విలాసాలు, యోగా డే వంటి ఈవెంట్స్ కోసం మాత్రం రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రులు నిర్వహించలేకపోతున్నామని గతేడాది యజమానులు రోడ్లెక్కారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రైవేట్ వైద్యులు ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం.. బకాయిలన్నింటినీ వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని నమ్మబలికింది. ఆశ ప్రతినిధులతో చర్చల అనంతరం ఓటీఎస్పై వైద్య శాఖ మంత్రి సైతం ప్రకటనలు చేశారు. డిసెంబర్లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం దగా చేసింది. బకాయిలు చెల్లించకుండానే బీమా విధానం అమలుకు వైద్య శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో బకాయిలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు సిద్ధం అయ్యాయి. దీనావస్థలో పేదలు⇒ చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అత్యధిక శాతం అనధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను ఎత్తేశాయి. జబ్బు బారినపడిన పేదలు చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళితే ఉచిత వైద్య సేవలు అందించలేమని చెప్పేస్తున్నాయి. దీంతో సొంతంగా డబ్బు కట్టి వైద్యం చేయించుకోవడానికి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ⇒ 2014–19 మధ్య కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పట్లో చంద్రబాబు అటకెక్కించారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయి పెట్టారు.⇒ అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాబు పెట్టిన బకాయిలను చెల్లించింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్ జగన్ ఊపిరిలూదారు. రూ.25 లక్షల వరకు వైద్య సేవల పరిమితితో పథకాన్ని బలోపేతం చేసి, 325 ప్రొసీజర్లను పథకం పరిధిలోకి తెచ్చారు. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో వారికి ఇల్లు గడిచేలా రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.ఐదు వేల చొప్పున ఆరోగ్య ఆసరా సాయం అందించారు. ఈ సాయాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా ఎత్తేయడంతో పాటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. -
మీరే పరిష్కరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో నదీ యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఇకపై నీటి తరలింపు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలను మీకు మీరే పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తేల్చిచెప్పింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ విషయంలో రెండు రాష్ట్రాలు ప్రస్తుతం అమల్లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు లోబడి నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖలకు మార్చి 30న లేఖ రాసింది. ఏపీ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ కిందికి నీళ్లను విడుదల చేస్తుండడంతో జలాశయం ఖాళీ అవుతోందని, తమ సాగునీటి అవసరాలతో పాటు వేసవి తాగునీటి అవసరాలకి నిల్వలను పరిరక్షించడం కోసం జల విద్యుదుత్పత్తి జరపకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కోరుతూ తెలంగాణ మార్చి 25న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖకు స్పందిస్తూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు తాజాగా లేఖ రాసింది. పెండింగ్ అంశాలతో బోర్డుకు ప్రాథమిక పరిమితులు.. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా పునః కేటాయింపులు జరపడంతో పాటు ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్స్ను జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఖరారు చేయాల్సి ఉంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు రెండు రాష్ట్రాలు ఉమ్మడి జలాశయాలను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయాలు తేలకపోవడం.. తమ విధులకు సంబంధించి ప్రాథమిక పరిమితులుగా మారిందని కృష్ణా బోర్డు పేర్కొంది. ఇవన్నీ తేలేవరకు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇకనైనా ఏపీని కట్టడి చేయాలి – కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపకుండా ఏపీ జెన్కోను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మార్చి 25న లేఖ రాసింది. ‘శ్రీశైలం జలాశయంలో నిల్వలు గత మార్చి 20 నాటికి 839.9 అడుగులకు పడిపోవడంతో కనీస నిల్వ మట్టానికి ఎగువన 7.824 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాష్ట్రానికి తాగునీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వలను పరిరక్షించాల్సి ఉంది. నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ఆయకట్టు అవసరాలను తీర్చడానికే ఏపీ.. శ్రీశైలం నుంచి సాగర్కు విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. సాగర్ కుడి ప్రధాన కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఏపీ ఇప్పటికే 178.06 టీఎంసీలను తరలించుకుంది..’ అని తెలంగాణ వివరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఏకంగా 738.25 టీఎంసీల (76.19శాతం) కృష్ణా జలాలను వాడుకోగా, తాము 230.76 టీఎంసీలు (23.18శాతం) మాత్రమే వాడుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ ఇంకా నీళ్లు తీసుకోకుండా కట్టడి చేయాలని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా బోర్డు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఏపీని కట్టడి చేయాలని కోరింది. లెక్కలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండికేంద్ర జలశక్తి శాఖ 2015 జూన్ 18, 19న ఏపీ, తెలంగాణతో నిర్వహించిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపకాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఇటీవల కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ, సీడబ్ల్యూసీ కమిటీతో పాటు ఇతర వేదికలను జల వివాదాల పరిష్కారానికి వినియోగించుకోవాలని సూచించింది. మరోవైపు ఒక్కో మేజర్, మీడియం ప్రాజెక్టుతో పాటు స్థూలంగా అన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ప్రతినెలా వాడుకుంటున్న కృష్ణా జలాల లెక్కలను రెండు రాష్ట్రాలు క్రమం తప్పకుండా తమ వెబ్పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కృష్ణా బోర్డు కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం త్రిసభ్య కమిటీ సమావేశమైనప్పుడు ఈ గణాంకాలు అవసరం అవుతాయని తెలిపింది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, ఏప్రిల్ 1వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్లో ఆయన మాట్లాడనున్నారు.ఏపీలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
కులాలు, మతాలతో డేంజరస్ గేమ్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. కొంతమంది మూర్ఖుల ద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కారణమవుతోందని ఆరోపించారు. కులాలు, మతాలతో కూటమి ప్రభుత్వం డేంజరస్ గేమ్ ఆడుతోందన్నారు. కులాలు, మతాల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లేసి గద్దెనెక్కించిన ప్రజలపై ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం ఆశించి కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ''2014- 19 , 2019-24 మధ్య ప్రభుత్వాల్లో ఏపీలో ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీలో కుల, మత ఘర్షణలు మొదలయ్యాయి. రెండు కులాలు, రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలనే దుర్మార్గకరమైన ప్రయోగం చేస్తున్నారు. కులాలు, మతాలను ముడిపెట్టి రాజకీయం చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. ఒక కులం వారు ఓటేయడం వల్లే మీకు 164 సీట్లు వచ్చాయా? ఆకువీడు ఘటన అత్యంత దురదృష్టకరం. అంతకంటే దురదృష్టకరమైన ఘటన తిరుపతి లడ్డూపై కల్తీ ప్రచారం. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని 6 నెలల పాటు చేసిన యాగీ ఎవరూ మర్చిపోలేదు. నిజమైన వెంకటేశ్వరస్వామి భక్తుడైతే చంద్రబాబు ఇలా చేసేవాడు కాదు. కానీ చంద్రబాబు భక్తుడి కంటే పొలిటీషియన్గానే వ్యవహరించారు. లడ్డూ ప్రసాదంపై, హిందూ సమాజంపై చంద్రబాబు తీవ్రమైన దాడి చేశారు. లడ్డూపై ప్రచారం చేస్తూనే క్రిస్టియన్లు, ముస్లింలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆత్మ గౌరవంతో మొదలైన టీడీపీని చంద్రబాబు అధోగతి పాలు చేసే స్థాయికి తెచ్చారు. డిప్యూటీ స్పీకర్లు, స్పీకర్ల స్థానంలో ఉన్న వ్యక్తులు.. క్రిస్టియానిటీ, ఎస్సీలపై వ్యవస్థీకృతమైన దాడి చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చేస్తున్న దాడికి టీడీపీ సమాధానం చెప్పాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన అలుసు కారణంగానే రఘురామ కృష్ణంరాజు రెచ్చిపోతున్నారని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మీరు ఇచ్చిన అలుసు కారణంగానే పోలీసులు రఘురామ కృష్ణంరాజుకు ఊడిగం చేస్తున్నారు. కుల మతాలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆద్యులు. క్రిస్టియన్లు, ముస్లింలు ఓటేయకుండానే మీకు 164 సీట్లు వచ్చాయా? మీకు ఓట్లేసిన పాపానికి క్రిస్టియన్లు, ముస్లింలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా?నన్ను విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుకు సంస్కారం లేదు. నీ ల్యాంగ్వేజ్లో మాట్లాడటానికి నాకు రెండు నిమిషాలు పట్టదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శకుని పాత్రకు సరిగా సరిపోతాడు. ఆకువీడులో రఘురామకృష్ణంరాజు మొదలుపెట్టిన డేంజరస్ క్రీడ టీడీపీ పునాదులను కదిలించడానికే. ఉండి నియోజకవర్గంలో ఎస్సీలు, క్రిస్టియన్లు ఓటేయకుండానే నువ్వు గెలిచావా? ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ , బీసీలు ఓటేయకుండానే మీకు భారీ మెజారిటీలు వచ్చాయా? రఘురామ కృష్ణంరాజు ఒక మతంపై దాడి చేస్తుంటే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏం చేస్తున్నారు? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి దళితుడు కాబట్టి నోటీసులిచ్చారు. రఘు రామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కాబట్టి అతను ఏం చేసినా వంత పాడుతున్నారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగిపోయిందని చంద్రబాబు, పవన్ హడావిడిగా ఖండించారు. మరి దళితులపై జరిగిన దాడులు మీకు కనిపించవా? పి.గన్నవరంలో ఒక శవాన్ని అడ్డుకుంటే ఖండించడం మీకు చేతకాదా? కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ మునిగిపోవడం ఖాయం. హిందూత్వ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని దుర్మార్గపు ఆలోచన మీది. మీరు ఎన్ని కుట్రలు చేసినా హిందు, ముస్లిం, మైనార్టీలు ఒక్కటే. కులమతాల మధ్య గొడవలు పెట్టే మిమ్మల్ని ప్రజలు నమ్మర''ని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. -
‘ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటేయడం ఎలా సాధ్యం?’
ఢిల్లీ: ఏపీ-2024 ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏపీలో 3,500 పోలింగ్ బూత్ల్లో తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి? అనే సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్లో ‘ఎన్నికల సమగత్రకు సవాళ్లు’ అనే అంశంపై భారత్ జోడో అభియాన్ సదస్సు నిర్వహించారు పరకాల ప్రభాకర్. ఈ మేరకు ఏపీ ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆధారాలతో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఏపీ-2024 ఎన్నికల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి?, 3,500 పోలింగ్ బూత్లలో తెల్లవారుజాము రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడం వెనుక అనుమానాలున్నాయి. రాత్రి గం. 11. 45ని నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటు వేయడం ఎలా సాధ్యం. ఇది ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది’ అని తన ప్రజెంటేషన్లో పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఆషా ప్రతినిధుల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చినా, మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన గురజాల నియోజకవర్గ నేతలు
తాడేపల్లి : తమపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నంకు సంబంధించి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు. టీడీపీ గూండాలు చేసిన దాడుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. జగన్ను కలిసిన వారిలో రామాపురం, చర్లగుడిపాడు గ్రామాల వైఎస్సార్సీపీ స్థానిక నేతలు ఉన్నారు. చర్లగుడిపాడులో బీసీ వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు పార్టీ కార్యకర్తలను హతమార్చారు టీడీపీ గూండాలు. తమ వారి హత్యలతో తామంతా రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులు. బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ ఓదార్చారు. న్యాయపరమైన సహాయం అందిస్తామని, కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ల్నాడులో గూండారాజ్యం నడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. -
‘మీరు రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్మెన్ అని..’
కాకినాడ: ఎల్లో మీడియా అసత్య వార్తలను పదే పదే డ్రైవ్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తన వద్ద గన్మెన్గా పని చేసి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి గొడవలను తనపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వద్ద గన్మెన్గా పనిచేసిన వ్యక్తి.. గత 20 నెలలుగా పవన్ కళ్యాణ్ వద్ద గన్మెన్గా చేస్తున్నారని, కానీ ఇంకా తన మాజీ గన్మెన్ అని ఎల్లోమీడియా వార్తలు రాయడంపై దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈనాడు పత్రిక రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్మెన్ అని రాయాలని సవాల్ చేశారు. తనపై వార్తలు రాసిన వాళ్లు నోటికి అన్నం తింటే తన కౌంటర్ను కూడా ప్రచురించాలని చాలెంజ్ చేశారు. ఏదో రకంగా తప్పుడు వార్తలను రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. -
‘సీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు’
సాక్షి,అన్నమయ్య: భవిష్యత్లో రాయలసీమకు సాగునీరు,తాగునీరు తీవ్ర ఇబ్బందులు రాబోతున్నాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి నీళ్లు రావడమే కష్టంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లో 1996 ఆలమట్టి రిజర్వాయర్గా ప్రారంభమై 200 టీఎంసీ వరద నీరు నిల్వ స్థాయికి చేరింది.అప్పర్ భద్ర, తుంగ భద్ర నీళ్ళు 30 టీఎంసీ నిల్వ చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులది. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు తీసుకుని వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేస్తూ, శిష్యుడుకు తాకట్టు పెట్టాడు.90 శాతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయి.840 అడుగులు దగ్గర పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నది నుండి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పూర్తి చేయాలి.రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.వైఎస్సార్సీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది.పోలవరం ఎడమ పనులు పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు ఆన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.15 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అమరావతిలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టులో కాలువలు ఎత్తు తగ్గించాడు.రాయలసీమ నుంచి కర్నూలు హైకోర్టు తీసుకుపోయారు, ఎయిమ్స్ ను తరలించుకుపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను వెంటనే పూర్తి చేయాలి’అని డిమాండ్ చేశారు. -
ఓటరు లిస్టుపై అప్రమత్తంగా ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు: వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా బలోపేతం అయ్యేలా ముందుకు వెళ్లాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి హింసించారని చెప్పారు.గుంటూరులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ లిస్టు పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనకు అనుకూలమైన ఓట్లను తీసివేసే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసి, ఎంత హింసించినా మన కార్యకర్తలు నాయకులు ఎక్కడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ధైర్యంగా నిలబడిన ప్రతి నాయకుడికి, పార్టీ కార్యకర్తకు అభినందనలు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేశారు. కూటమి నాయకుల దాడులకు బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరు.కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించాలి. గత ఏడాది రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. వైఎస్ జగనన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని ఆదుకున్నాం.రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. 2028 కల్లా రాజధాని పూర్తయితే ఇంకా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు? రాజధాని తీర్మానం పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా ఆడింది. ఇదో రకమైన డైవర్షన్ పాలిటిక్స్. రాజధాని పేరుతో మొదట్లో 50 వేల ఎకరాలకు పైగా భూమిని తీసుకున్నారు. రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను ఎక్కడ అభివృద్ధి చేశారు? అమరావతిలో రోడ్లు ఎక్కడ పూర్తి చేశారు? ఇవేమీ జరగకుండానే మరోసారి 50వేల ఎకరాలు రెండో దశలో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అంత ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా? అమరావతి పేరుతో టెండర్లు పిలిచి ఏటీఎంలా వాడుకున్నారు. అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.. దానికోసమే అసెంబ్లీలో తీర్మానం’ అని చెప్పారు. -
ఎమ్మిగనూరులో టెన్షన్.. టెన్షన్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్ సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు.ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహవీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) ఘనంగా నిర్వహించారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.‘‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ (సెక్రటరీ, ఎస్ఎస్ఆర్ జేఎస్టీ), ప్రవీణ్ ఫౌలాముతా (కరస్పాండెంట్, ఎస్ఎస్ఆర్ జేఎస్టీ), ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.#MahavirJayanti pic.twitter.com/2Z5deOnCA1— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2026 -
వీటి ధరలు దారుణంగా పడిపోయాయి: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ (మార్చి 31) వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో పర్యటించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 ఉంటే రేటు రూ.1400కి అమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.పక్క రాష్ట్రం తెలంగాణలో మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోనూ వెంటనే ఏర్పాటు చేయాలి. అరటి ధర కూడా దారుణంగా పడిపోయింది. టన్నుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కూడా రావడం లేదు. ఇరాన్ యుద్ధం, ముంబై మార్కెట్లో అరటి అధికంగా రావడంతో ధర దారుణంగా పడిపోయింది. అరటి పంటను కనీసం టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేల ధర వచ్చేలా కొనుగోలు చేయాలి. లేదంటే రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతోంది. రేపు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు సమస్యను తీసుకువెళ్లాలి, మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి’ అని అన్నారు. -
చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు సంభవించింది. మందుగుండు సామాగ్రి పేలడంతో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సీజ్ చేసిన టపాసులు కోర్టుకు తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసమైంది. గాయపడిన పోలీసులను చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుపతికి పాలు నింపుకునేందుకు వెళ్తుండగా.. వెంకటాచలం-మనుబోలు మధ్య కొమ్మలపూడి జంక్షన్ వద్ద ఘటన జరిగింది. గూడ్స్ రైలుకు ఉన్న పాల ట్యాంకర్ ట్రాక్పై అడ్డంగా పడిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు చర్యలు చేపట్టారు. -
వేసవిలో వర్షాలు.. బాబోయ్ దంచికొట్టేస్తున్నాయ్..
హైదరాబాద్: వేసవికాలంలో వర్షాలు దంచికొడుతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారు. ఇక, ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాలలో వర్షాలు కురుస్తాయని అన్నారు.తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. గత అర్ధరాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి, చింత, వరి పంటలు నేలరాలాయి. అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం (మార్చి 31) ఉదయం తెల్లవారుజామున గంటపాటు భారీ వర్షం పడింది. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కాయ నేల రాలడంతో ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులకు నష్ట పరిహారమందించాలని కోరుతున్నారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న పంటలను కూడా దెబ్బతీసింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, దొంకేశ్వర్ మాక్లూర్ ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేలరాలిపోగా, కలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. -
అందుకే చంపేశా.. రూమ్ 102లో ఏం జరిగింది..?
విశాఖపట్నం: రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎల్వీనగర్లోని కీర్తి ఎన్క్లేవ్లో ఉంటున్నాడు. రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్షిప్కు దారితీసింది. పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మికి షేర్ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తో పాశవిక హత్య.. ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ వేశాడు. ఇన్స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూమ్లో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్కేసులోను పెట్టాడు. కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్స్టేషన్కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ సేకరించారు. కవర్లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్కు తరలించారు. -
ఏడాదంతా పందేల జోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి మూడు రోజులు సందడి చేసే కోడిపందేలు కూటమి నేతల వల్ల 365 రోజులు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలో ఏదోక ప్రాంతంలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అప్పడప్పుడు పోలీసులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు. కేసులు మినహా ఎలాంటి హడావుడీ లేకపోవడంతో జోరు పెరిగింది. సంక్రాంతి సరదా క్రీడను నిత్యం ఆడేలా పందెంరాయుళ్లు బరితెగించారు. గతేడాది వరకూ పండుగ మూడు రోజులూ అన్ని నియోజకవర్గాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేసేవారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350కుపైగా బరుల్లో రూ.150 కోట్ల నుంచి రూ.180 కోట్ల మేర పందేలు నిర్వహించేవారు. కూటమి పాలకులు సంక్రాంతి క్రీడను ఇప్పుడు ఏడాది మొత్తం క్రీడగా మార్చేశారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలోని పినకడిమి, పెదకడిమి, దుగ్గిరాల మరికొన్ని ప్రాంతాల్లో, అలాగే కృష్ణా– ఏలూరు జిల్లా సరిహద్దులోని కలిదిండి మండలంలోని ఒక గ్రామంలో, ఉండి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వారాంతాల్లో, కొన్నిసార్లు వారంలో ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు.చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీ ఎత్తున పందేలు తరచూ నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల కూటమి నేతలే నిర్వాహకులు కావడం, ప్రజాప్రతినిధుల సహకారం ఉండటంతో మొక్కుబడి కేసులకే పోలీసులు పరిమితమవుతున్నారు. ప్రధానంగా 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అనేక ప్రాంతాల్లో పందేల హడావుడి మొదలైంది. పందెంరాయుళ్లకు ముందస్తు సమాచారం కూటమి నేతల కనుసన్నల్లో జరిగే శిబిరాలకు సంబంధించి పందెంరాయుళ్లకు ముందస్తు సమాచారం అందుతోంది. అందరూ కాకుండా ఎంపిక చేసుకున్న 30–40 మందితో పెద్ద పందేలు నిర్వహించేలా శిబిరాలను కొనసాగిస్తున్నారు. వరుస సెలవులు, పండుగ, ప్రత్యేక దినాల్లో, అదే విధంగా రాజకీయ నేతల జన్మదినోత్సవాల్లో కూడా జిల్లాలో పందేలు నిర్వహిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లోనూ.. ఇక జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు కూడా ఏడాది పొడవునా పందేల నిర్వహణ పాకింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ద్వారకాతిరుమల, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పెద్ద ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలోని ఓ పామాయిల్ తోటలో ఉదయాన్నే సుమారు 200 మందితో కోడిపందేల నిర్వహణ ప్రారంభించారు. పండగ హడావుడి కావడంతో ఎవరూ పట్టించుకోరని కోడిపందేలకు తెరతీయగా స్థానికులు సోషల్ మీడియాలో పందేల వీడియో పోస్టు చేయడం పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పందెంరాయుళ్లు పరారయ్యారు. చింతలపూడి మండలంలోని శివాపురం, చింతలపూడి, తీగలవంచ, కొమ్ముగూడెం ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు దాడి చేయగా 32 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30,180 నగదు, 20 ద్విచక్రవాహనాలు, 14 కోళ్ళు స్వా«దీనం చేసుకున్నారు. నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడిపందేల నిర్వహణపై పోలీసులు సమాచారం అందుకుని 3 కోళ్లు, 2 కత్తులు, రూ.6480 నగదు, 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
పీజీ.. నో క్రేజీ!
హమ్మయ్యా..పరీక్షలు పూర్తయ్యాయి.. కొన్ని రోజులు విరామం.. ఆ తరువాత పోటీలో మళ్లీ పరుగు తప్పదు..డిగ్రీ పరీక్షలు రాసేశాం..ఇక ఇప్పుడేం చేయాలి.. ఉన్నత విద్యా.. ఇక చదివే ఓపిక లేదు.. ఏదో ఉద్యోగం చూసుకుంటే సరిపోద్దీ.. మళ్లీ పీజీ అంటే పీజీ సెట్ రాయాలి.. మరో రెండేళ్లు చదవాలి.. అంత కష్టం ఎక్కడబ్బా.. వద్దులే అన్నట్లుగా యువత ఉపాధి వైపు చూస్తుండడంతో పోస్ట్రుగాడ్యుయేన్ చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లు భర్తీ కాక మిగిలిపోతున్నాయి. తిరుపతి సిటీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటేనే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. విద్యలోనే ఉన్నత చదువుగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ తగ్గడంతో యూనివర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది. క్రమక్రమంగా సాధారణ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లాంటి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత మూడేళ్లుగా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్తోపాటు త్వరగా ఉపాధిని అందించే ఏఐ, మిషన్ లెర్నింగ్, కోడింగ్, క్యాంటమ్ టెక్నాలజీ అంటూ పలు ప్రొఫెషనల్ కోర్సులపై మొగ్గు చూపడంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీల్లో ఉన్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీ కోర్సులకు ఆదరణ తగ్గడానికి నూతన విద్యావిధానం, కామన్ పీజీసెట్ సైతం ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భారీ స్థాయిలో తగ్గిన దరఖాస్తులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ సెట్–2026కు దరఖాస్తులు గత ఏడాది కంటే సుమారు 7 వేలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సుమారు 17 యూనివర్సిటీల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన పీజీ సెట్కు 18 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 30 పాఠ్యాంశాలకు సంబంధించిన కోర్సుల్లో సుమారు 24 వేలకు పైగా సీట్లు ఉన్న నేపథ్యంలో 1:1 ప్రాతిపదికన సైతం దరఖాస్తులు అందకపోవడంతో పీజీ కోర్సుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది పీజీ సెట్ పరీక్ష అర్హత సాధించిన ప్రతి విద్యారి్థకీ కచ్చితంగా సంబంధింత కోర్సులో సీటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. పలుసార్లు గడువు పొడిగించినా... పీజీసెట్కు దరఖాసులు పెంచాలని ఉన్నత విద్యామండలి విశ్వ ప్రయత్నం చేసినా దరఖాస్తులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలుసార్లు దరఖాస్తుల గడువును పెంచుతూ ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు.మూడేళ్లుగా ఏపీపీజీ సెట్ దరఖాస్తుల పరిస్థితి ఇదీ... 2024లో... ఏపీపీజీసెట్కు అందిన దరఖాస్తులు – 33,149 మొత్తం భర్తీ కావాల్సిన పీజీ సీట్లు (31 విభాగాల్లో) – 25 వేలు పీజీసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు – 30, 207 భర్తీ అయిన సీట్లు – 22,4382025లో... పీజీ సెట్కు వచ్చిన దరఖాస్తులు – 25,688 మొత్తం భర్తీ కావాల్సిన సీట్లు – 25 వేలు గత ఏడాది పీజీసెట్ రాసిన అభ్యర్థులు –21,995 భర్తీ అయిన సీట్లు – దాదాపు 19,500పీజీ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వర్సిటీల్లో పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎన్ఈపీ ద్వారా విద్యారంగంలో పలు నూతన సంస్కరణలకు బీజం పడింది. ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పీజీ కోర్సులతో పాటు స్కిల్డెవలప్మెంట్ పెంపొందించుకోవాల్సి అవసరం ఉంది. ఈ మేరకు ప్రతి పీజీ కోర్సుల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. డిగ్రీలో ప్రవేశాలు తగ్గడంతో పాటు డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల వైపు యువత వెళ్లడమే పీజీలో అడ్మిషన్లు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. –ప్రొఫెసర్ బి దేవప్రసాద్రాజు, పీజీసెట్–2026 కోకన్వీనర్, ఎస్వీయూ డిగ్రీలో ప్రవేశాలు తగ్గడం ఒక కారణమే ప్రస్తుతం యువత తొందరగా లైఫ్ సెటిల్మెంట్ కోసం చూస్తున్నారు. సాధారణ డిగ్రీ పూర్తి చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపనమ్మకం ఇటు తల్లిదండ్రులలోనూ, అటు విద్యార్థులలోనూ పాకిపోయింది. దీంతో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి యూజీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి. ఆ ఎఫెక్ట్ పీజీ కోర్సులపై పడుతోంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులలోనూ ప్రధాన సబ్జెక్ట్తో పాటు ఏఐ, మిషన్ లరి్నంగ్, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్య లక్ష్యంగా విద్యార్థి అడుగులు పడాలి. –ప్రొఫెసర్ కే సురేంద్రబాబు, ఎగ్జామినేషన్ డీన్, ఎస్వీయూ నేరుగా ప్రవేశాలు కలి్పంచడం ఉత్తమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీలకు కామన్ పీజీసెట్ను నిర్వహించడంతో అడ్మిషన్లపై ప్రభావం పడుతోంది. ఆయా వర్సిటీలకు పీజీ అడ్మిషన్ల బాధ్యతను అప్పగించాలి. ఉన్నత విద్యామండలి ఈ విషయంపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. పీజీ కోర్సులకు గత వైభవం రావాలంటే పీజీసెట్ను రద్దు చేసి నేరుగా విద్యార్థి మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించడం ఉత్తమం. అప్పుడే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీలు మనుగడకు ఎటువంటి ప్రమాదం ఉండదు. –రాజేశ్వరీదేవి, ప్రైవేటు పీజీ కళాశాల అధ్యాపకురాలు, తిరుపతి మే 5 నుంచి పరీక్షలు ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ పీజీసెట్–2026 ప్రవేశ పరీక్షకు గడువు ముగిసింది. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పీజీసెట్ పరీక్షలు నిర్వహించనున్నాం. –ప్రొఫెసర్ పద్మావతి, పీజీసెట్ కన్వినర్, ఎస్వీయూ -
ఫలప్రదం
విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న అవకాడో (బటర్ ఫ్రూట్) సాగుపై చింతపల్లి ఉద్యానవన పరిశోధనా స్థానం ప్రత్యేక దృష్టి సారించింది. కాఫీ, మిరియాలు తరహాలోనే ఏజెన్సీలో అవకాడోను ఒక ప్రధాన వాణిజ్య పంటగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. మెరుగైన రకాలను గుర్తించి, రైతులకు మేలైన గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా ఇక్కడ పరిశోధనలు ముమ్మరం చేశారు.చింతపల్లి: అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం విదేశీ పంటలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు ఇక్కడ విజయవంతం కాగా, తాజాగా ఆ జాబితాలో అవకాడో (వెన్న పండు) వచ్చి చేరింది. గిరిజన రైతులకు ఈ పంటను మరింత చేరువ చేసేందుకు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టారు. రకాల గుర్తింపు: సుమారు ఎకరా విస్తీర్ణంలో ఆరు రకాల దేశీ, విదేశీ అవకాడో రకాలను దిగుమతి చేసుకుని శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. ఏజెన్సీ వాతావరణానికి తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను గుర్తించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. ⇒ ఐటీడీఏ ద్వారా గతంలోనే యాపిల్, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ వంటి మొక్కలను రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఈ మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ⇒ రెండు దశాబ్దాల క్రితం కాఫీ తోటల్లో నీడ కోసం కాఫీ బోర్డు అధికారులు గొందిపాకల పంచాయతీలోని పలు గ్రామాల్లో ఈ మొక్కలను పంపిణీ చేశారు. అప్పట్లో రైతులకు వీటి విశిష్టత తెలియక, పండ్లు నేలరాలినా పట్టించుకోకుండా వృథాగా వదిలేసేవారు. అయితే, కొన్ని ఏళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈ పండ్ల విలువను, మార్కెట్ డిమాండ్ను వివరించడంతో రైతులు వీటి అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారులు నేరుగా గ్రామాలకు వచ్చి రైతుల వద్ద నుంచి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. పోషకాల పండు.. : అవకాడోలో అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.క్యాన్సర్ కారకాలను నిరోధించడంతో పాటు కంటి చూపు మెరుగుదలకు, మధుమేహం, స్థూలకాయం తగ్గడానికి ఈ పండు ఎంతో తోడ్పడుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.మంచి గిరాకీ చింతపల్లి ఉద్యానవన పరిశోధనా కేంద్రంలో అవకాడో సాగుపై విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న కేడీ–1, హోస్ రకాలతో పాటు పింకిర్టన్, ప్యూర్డ్ వంటి కొత్త రకాలను పరిశీలిస్తున్నాం. గిరిజన రైతులు పండించే పంటకు శాస్త్రీయ గుర్తింపు కల్పించి, మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా కృషి జరుగుతోంది. భవిష్యత్తులో కాఫీ, మిరియాల తరహాలోనే అవకాడోను కూడా ఏజెన్సీలో ప్రధాన పంటగా మార్చేందుకు ఈ పరిశోధనలు కీలకం కానున్నాయి. – రమణ, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యానవన పరిశోధనా స్థానం, చింతపల్లి -
నెల్లూరు జిల్లాలో జంట హత్యలు
కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో జరిగిన జంట హత్యలు సోమవారం కలకలం రేపాయి. జిల్లాలోని దగదర్తి మండలం పెద పుత్తేడుకు చెందిన కుందుర్తి వెంకటేష్ (29), సంగం మండలం వెంగారెడ్డిపాళెంకు చెందిన కొప్పోలు బాలవెంకయ్య (26) గండవరం మజరా వడ్డిపాళెం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరూ వరిగడ్డి కట్ట కట్టే యంత్రాన్ని తీసుకొని ఆదివారం వడ్డిపాళెం సమీపంలోని పొలాల్లోకి వచ్చారు. యంత్రానికి డీజల్ అయిపోవడంతో సాయంత్రం ఇద్దరూ కలిసి బైక్పై వచ్చి డీజల్ తీసుకొని పొలాల్లోకి వెళ్లారు.రాత్రి ఇద్దరూ ఇంటికి రాలేదు. దీంతో వెంకటేష్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి సోమవారం ఉదయం ఇద్దరూ పనికి వెళ్లిన పొలాల వైపు వెతుక్కొంటూ వస్తుండగా వడ్డిపాళెం వద్ద రోడ్డు పక్కనే తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.మృతుడి బంధువులతో మాట్లాడి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. వెంకటేష్ కు ఓ వివాహితతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. వివాహిత తరఫు బంధువులే హతమార్చారని ప్రాథమికంగా నిర్థారించారు. వెంకటేష్ ను హత్య చేసేందుకు వచ్చి పక్కనే ఉన్న బాలవెంకయ్యను కూడా హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. పెదపుత్తేడుకు చెందిన బత్తల కళ్యాణ్, బత్తల ప్రశాంత్, బత్తల విజయభాస్కర్ను అనుమానితులుగా గుర్తించి ఐదు ప్రత్యేక బృందాలతో ఎస్పీ గాలింపు చర్యలు చేపట్టారు. -
‘తోలు వలిచేస్తా.. లం..కొ..’
పిఠాపురం/సాక్షి, అమరావతి: ఓ దళిత శానిటరీ ఉద్యోగిపై కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోనులో తిట్ల దండకం అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వలిచేస్తానంటూ వారి్నంగ్ ఇచ్చారు. రాయడానికి వీలు లేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వివరాలివీ.. పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక వాలీబాల్ కోర్టులో మట్టిని తొలగించలేదంటూ స్థానిక నాయకుడొకరు మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఫిర్యాదు చేశారు.పిఠాపురం రథాలపేట సచివాలయ పరిధిలో పని చేస్తున్న సు«దీర్ అనే దళిత శానిటరీ ఉద్యోగితో కమిషనర్ వద్ద నుంచే ఆ నాయకుడు ఫోనులో మాట్లాడారు. తమ ఇంటి ఎదురుగా వాలీబాల్ కోర్టులో మట్టి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఆ పనిని శానిటరీ ఇన్స్పెక్టర్ చూస్తున్నారని, ఆయనకు చెప్పి చేస్తానని బాధిత ఉద్యోగి సు«దీర్ చెబుతూండగానే ‘సార్ మాట్లాడతారు’ అంటూ ఆ నాయకుడు కమిషనర్కు ఫోన్ ఇచ్చారు. ఫోన్ అందుకున్న కమిషనర్... ‘ఏం చెప్పాలి శానిటరీ ఇన్స్పెక్టర్ నీకు? వార్డులో నుంచి డబ్బులు తీసుకు రమ్మని చెప్పాలా? లేదంటే ఎగ... ఎల్లండిరా అని చెప్పాలా? ఇప్పటి వరకూ మీరంతా కలిసి చేసిన దందాగిరీ చాలదంటరా వెధవా? మండపేటను నాశనం చేసి వచ్చావు. మళ్లా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? ల..ట్ నాయాలా.. అతను చెప్తే నేను చెప్పినట్టే అని మస్తర్లకు వచి్చనప్పుడు చెప్పాను. అందరితో నేను మొ... గు... వాలంటే నా నోరు కూడా నొప్పేస్తది కదా. మీయమ్మ లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది కదా.. మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్కి ఎలుతుంది. నా ఊరు వెళ్లలేదు పెంట తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా లం..కొ.. మండపేట నుంచి నువ్వు పనికిరావనే కదా వాడు గెంటేశాడు రంగారావు. అవునా? కాదా? మరి! ఇక్కడ రాజకీయాలు దెం..న్నావా ల..ట్ నాయాలా! ఒక గంటలో అది క్లీన్ కాలేదనుకో.. తోలు వలిచేస్తాను’ అంటూ తీవ్ర పదజాలం, బూతులతో దుర్భాషలాడారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి శానిటేషన్ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన మున్సిపల్ కమిషనర్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీ, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ఎస్కే బాషా, జనరల్ సెక్రటరీ జాన్, వైస్ ప్రెసిడెంట్ కన్నారావు డిమాండ్ చేశారు. -
నెల రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమరి్పంచేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) హైకోర్టు నెల రోజుల గడువునిచి్చంది. నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటుతోపాటు 2018 గ్రూప్–1లో ఉత్తీర్ణత సాధించిన అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘నాన్ ఫోకల్’ అమలు తీరుపై అసహనం కాగా, 2018 గ్రూప్–1లో ఉద్యోగం సాధించి డీఎస్పీలు, ఆర్డీవోలు తదితర హోదాల్లో కొనసాగుతున్న వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాల అమలు తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కొందరు డీఎస్పీలకు సీఐడీలో పోస్టింగులు ఇచ్చారని, వారే ఇకపై ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను తీసుకెళుతుంటారంది. ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో వారినే సీఐడీలోకి తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని ఆక్షేపించింది. చేతకాకపోతే చెప్పండి: సిట్పై అసంతృప్తి కాగా సిట్ పంపిన జవాబు పత్రాలన్నింటిని పరిశీలించడం తమకు సాధ్యం కాదని తెలిపిన హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్, 167 పత్రాలు మాత్రమే ఉంచుకుని మిగతావి తిరిగి పంపిందని అంతకుముందు సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను సిట్ అమలు చేయాలని లేదా సాధ్యం కాదని చెబితే, తాము ప్రత్యామ్నాయంగా మరో దర్యాప్తు సంస్థకు ఈ బాధ్యతలను అప్పజెబుతామని స్పష్టం చేసింది. అనంతరం సిట్ అధిపతితో మాట్లాడిన సోమయాజీ, దర్యాప్తును తామే కొనసాగిస్తామని ఆయన తెలిపినట్లు ధర్మాసనానికి నివేదించారు. -
‘ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు లంచం ఇచ్చా’
ఆదోని అర్బన్: ‘ఓపెన్గా చెబుతున్నా.. నేను బిల్డింగ్ కట్టేందుకు ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు ఇచ్చాను. అది కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి పచ్చి బట్టలతో నెత్తిన పెట్టుకుని ఆయా సన్నిధిల్లో, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెబుతా’ అని టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు.కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు రోడ్డులోని ట్రెండ్స్ సమీపంలో సౌదీ రవూఫ్ భవన నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని నిర్మాణాన్ని అడ్డుకోవడంతో సౌదీ రవూఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తన భవన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి రెండు దఫాలుగా రూ.10 లక్షలు, మధ్యవర్తికి రూ.లక్ష ఇచ్చానని పేర్కొన్నారు. -
నైట్కి ఎంత తీసుకుంటావు!
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు రోజురోజుకూ మరింత బరితెగిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దానిని మరువకముందే తాజాగా బిగ్బాస్–8 మహిళా కంటెస్టెంట్ను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో ఐటీడీపీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బిజ్జవరపు ప్రవీణ్కుమార్ ఓ అసభ్యకర పోస్టు పెట్టారు. గత ఆదివారం రాత్రి 11.21 గంటల సమయంలో ‘నైట్కి ఎంత తీసుకుంటావు? సుఖంతోపాటు డబ్బులు కూడా ఇస్తా’ అంటూ బిజ్జవరపు ప్రవీణ్కుమార్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే బావమరిదినని చెప్పుకొంటున్న ఐటీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్కుమార్ తీరుపట్ల ప్రజలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కింది స్థాయి నాయకులు కూడా మరింత బరితెగించి రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. -
తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/టెక్కలి/ సంతబొమ్మాళి/నందిగాం/ టెక్కలిరూరల్: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.జగన్ హయాంలోనే 70 శాతం పూర్తి మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్ క్లోజర్ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామస్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్ నుంచి పాలనాయుడుపేట జంక్షన్ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ నేతలకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తురామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్రాజ్, గొర్లె కిరణ్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమావతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జగన్కు పేరొస్తుందన్న కక్షతోనే..ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత టీడీపీ నేతలను తరిమికొట్టాలి..ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువచ్చారు. టీడీపీ పాతికేళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్ జగన్కే దక్కింది. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదుకూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్నా..? – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారుమూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్ జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో వైఎస్ జగన్ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడురెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్ జగన్ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు. – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎంవాస్తవ రూపంలోకి తెచ్చింది జగనేచాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ది. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళంమాట మీద నిలబడని బాబు‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్ జగన్కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యేబాబాయి, అబ్బాయ్లదే పాపంవలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్ జగన్కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధికిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేఅన్నీ అబద్ధాలే..కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్తబాబు చేసింది శూన్యంశ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్ జగన్ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.– చింతాడ రవికుమార్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టుజిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్ హార్బర్స్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..? – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుమూలపేట కీలకంమూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ -
డబ్బులు డిమాండ్తోనే దారుణ హత్య
గాజువాక: రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎలీ్వనగర్లోని కీర్తి ఎన్క్లేవ్లో ఉంటున్నాడు.రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మీతో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్షిప్కు దారితీసింది.పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మి కి షేర్ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తో పాశవిక హత్య.. ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ వేశాడు. ఇన్స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూమ్లో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్కేసులోను పెట్టాడు.కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్స్టేషన్కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ సేకరించారు. కవర్లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్కు తరలించారు. -
దేవుడి భూములను దోచి పెడతారా?.. ధ్వజమెత్తిన బీజేపీ
సాక్షి, అమరావతి: దేవాలయాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూటమిలో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే తూర్పారపట్టింది. ప్రస్తుతం దేవాలయాల భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయంటూ బీజేపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రైవేటు వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి అనే పేరుతో దేవాలయాలకు చెందిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములను సరైన దర్యాప్తు, సర్వే చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.ఇది హిందూ సమాజానికి, ఆలయాల రక్షణకు తీవ్ర ప్రమాదకరం. ఈ చర్యలతో ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి’ అని స్పష్టం చేసింది. 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా తప్పు అని చెప్పింది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టింది. ఆలయాల భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచి పెట్టాలి అనే ధోరణి హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోందని, ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని పేర్కొంది.ఇది అత్యంత ప్రమాదకరంహిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అభివృద్ధి పేరుతో హిందూ ఆలయ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు. ఈ భూములు ఆలయాలకే చెందాలి. ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం.ఆలయాల భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది’ అని పేర్కొంది. ఈ భూములపై నిష్పక్షపాత, పూర్తి స్థాయి సర్వే చేసి, ప్రైవేటు సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములను, ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలని, అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములను దీర్ఘకాలిక లీజులివ్వడం కాకుండా స్వల్పకాలిక లీజులకు ఇవ్వాలని చెప్పింది.గుళ్ల ద్వారా భారీ ఆదాయమొస్తున్నాపండుగలు జరిపేది ఇలాగేనా? దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని బీజేపీ తెలిపింది. ఆలయాల ఆదాయం నుంచి ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ తీసుకుంటుందని గుర్తు చేసింది. దేవాలయాల ఆదాయం పూర్తిగా అవే ఆలయాల అభివృద్ధికి వినియోగించేలా చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్లలో వినతిపత్రాలు హిందూ దేవాలయ భూముల రక్షణ – ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై సోమవారం బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో వినతిపత్రాలు సమరి్పంచినట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. ‘ఇది వినతిపత్రం కాదు.. హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది’ అని పేర్కొంది. -
ఒంటరి మహిళలే లక్ష్యం
బంజారాహిల్స్: బెట్టింగ్లకు బానిసై ఒంటరి మహిళలను మాయమాటలతో తన కారులో ఎక్కించుకుని దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించిన యువకుడిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసై తీవ్రంగా నష్టపోతున్న అతను ఈజీ మనీ కోసం పథకం వేశాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని గత ఐదు వారాల నుంచి ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించసాగాడు. ఓఆర్ఆర్ సర్విస్ రోడ్డుకు తీసుకెళ్లి.. ఫిలింనగర్ రోడ్డునెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని వాసు పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి తనకారులో ఎక్కించుకున్నాడు. మధ్యాహ్నం నేరుగా నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధి లోని ఓఆర్ఆర్ సర్విసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి నెట్టేసి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మంగతాయారమ్మ (60)ని వాసు టార్గెట్ చేశాడు. ఈనెల 17న ఆమె పని ముగించుకుని మధ్యాహ్నం బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్నగర్లో దింపుతానని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. పట్టపగలు కారు కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. అలాగే వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టి మోకిళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో పడే సి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు అటు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో యాదమ్మ మిస్సింగ్ కేసు, ఇటు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగతాయరమ్మ మిస్సింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకుని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది.దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు సీరియల్ సైకో కిల్లర్ వాసును అరెస్టు చేశారు. మంగతాయారమ్మ ఒంటిపై ఉన్న నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా బెట్టింగ్ల్లో పెట్టాడు. ఒకవేళ నిందితుడు పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 14 ఏళ్ల కిందట జరిగిన నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు విధిస్తూ నంద్యాల మూడో అదనపు న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. వైఎస్సార్సీపీ నాయకుడు ఇంజేటి క్రిష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జునరెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు (దుబ్బె)లను హత్యచేసిన ఈ కేసులో 19 మందిపై హత్యానేరం నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే ఏడుగురు మరణించారు. నేరం రుజువు కావడంతో మిగిలిన 12 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పుచెప్పారు.దోషులంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అనుచరులే. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 2012 ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు ఇంజేటి క్రిష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి ఇంట్లో ఉండగా.. నిందితులు జీపులో వచ్చి గేటును బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. క్రిష్ణారెడ్డిపై కారంపొడి చల్లి కత్తులతో దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్య గోవిందమ్మ, కొడుకు మల్లికార్జునరెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు (దుబ్బె)లను అతి కిరాతకంగా నరికి చంపేశారు.ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి 19 మందిపై చార్జిషిటు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు నాగిరెడ్డి (ఏ1) హత్యకు గురికాగా, ఇంజేటి వెంకట్రామిరెడ్డి (ఏ3), క్రిష్టిపాడు పెద్దదస్తగిరిరెడ్డి (ఏ5), గొల్ల శేషు (ఏ6), కుందూరు వెంకట్రామిరెడ్డి (ఏ7), మాల పెద్దన్న (ఏ17), కొప్పు తిరుపాలు (ఏ19) కేసు విచారణ జరుగుతుండగానే మరణించారు. మిగిలిన 12 మందిపై తుది విచారణ సాగగా హత్యానేరం రుజువైంది. దీంతో 12 మందికి జీవితఖైదు పడింది. అఖిలప్రియ అనుచరులు వీరే.. ఇంజేటి శివకుమార్రెడ్డి (ఏ2), కుందూరు రామిరెడ్డి (ఏ4), బాస్సాగారి హుస్సేన్ వలి (ఏ8), కమ్ముబాయిగారి కమల్ (ఏ9), కమ్ముబాయిగారి మహబూబ్ బాషా (ఏ10), కమ్ముబాయిగారి బాబు బాషా (ఏ11), కమ్ముబాయిగారి చిన్న మాబు (ఏ12), పక్కీర్ వలి (ఏ13), ఉయ్యలవాడ చాంద్బాషా (ఏ14), మాగిగ పెద్ద అంకాలు (ఏ15), మాల సూరబోయిన తిరుపాలు (ఏ16), మాల లక్కు శ్రీను (ఏ18).దోషులకు టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ నలుగురిని దారుణంగా హత్యచేసిన నేరానికి 12 మందికి జీవితఖైదు విధించారని తెలియడంతో ఒక్కసారిగా నంద్యాల కోర్టు ఆవరణలో దోషుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు వినిపించాయి. హత్యకేసులో 12 మందికి శిక్షపడిన విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ టీగీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోర్టు ఆవరణకు చేరుకుని దోషుల్ని పరామర్శించారు. జీవితఖైదు పడినవారిని పోలీసులు కడప జైలుకు తరలించారు. -
వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
సాక్షి, అమరావతి: అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసియేషన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రాట్యూటీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్లైన్స్ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.మార్చి 2న వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
టిడ్కో ఇళ్లల్లోనూ కీర్తి చోరుడు.. బాబు ‘హోం’కరింపులు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై ‘2019–20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గతేడాది నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు.రెండో విడతలో భాగంగా నాయుడుపేట మండలం, పుదూరు నుంచి లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలుపోవడంపై నివ్వెరబోయారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ‘కట్టు’కథల కనికట్టు 2015–16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్టగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017–18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 పూర్తిచేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.అయినప్పటికీ మంజూరైన ఇళ్లల్లో ఐదు శాతం కూడా నిర్మాణం పూర్తిచేయనేలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావుడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20 వేల ఇళ్లు మాత్రమే అందులోనూ 60 శాతం పనులే చేశారు. జగన్ ప్రభుత్వంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలా లేదు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.ఆ 1.5 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో నిర్మించినవే రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో పూర్తయితే బాబు షో వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021–22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది.అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దు్రష్పచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు. -
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ’
తాడేపల్లి. తమ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జున. చివరకు టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ చేస్తుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మేరుగు నాగార్జున. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు.ప్రెస్మీట్లో మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే..:ప్రజలు వాస్తవాలు చెబుతున్నా పట్టని బాబు సీఎం చంద్రబాబు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలే బయటకు వచ్చి, తమకు గత ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చారని చూపుతున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదు. క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్లు కనిపిస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 నెలల్లో 5,50,314 ఇళ్లు నిర్మించామని, ఈరోజు 2,50,893 ఇళ్లకు గృహ ప్రవేశం చేశామని చెబుతున్నారు. కానీ 2014–2019 మధ్య గానీ, 2024 నుంచి ఇప్పటి వరకు గానీ ఒక నిరుపేద కుటుంబానికి ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? వారి కోసం కనీసం గజం భూమి అయినా చంద్రబాబు కొన్నారా? గత ప్రభుత్వంలో జగన్గారు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి, 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, వాటిలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల ఇళ్ల కోసం 17,005 వైయస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆ కాలనీలు ఒక ఊరు మాదిరిగా ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఆ కాలనీల పేరు మార్చి, ఇప్పుడు వాటినే తామే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.అదీ గత ప్రభుత్వ చిత్తశుద్ధిరాష్ట్రంలో సొంత ఇల్లు లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండకూడదన్న లక్ష్యంతో, గత ప్రభుత్వం వ్యవహరించింది. పేదలందరికీ పక్కా ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాలను సేకరించి, అందులో 25,374 ఎకరాలను కొనుగోలు చేసి దాదాపు రూ.11,343 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో కాలనీలు మాత్రమే కాదుం ఊర్లకు ఊర్లే నిర్మించారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి. దివంగత మహానేత వైయస్సార్గారి వారసుడిగా జగన్ నిరుపేదలకు గూడు కల్పించిన విధానం అది.ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.75 వేల కోట్లుగత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో జంగిల్ క్లియరెన్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యాల కోసం మాత్రమే దాదాపు రూ.32,900 కోట్లు ఖర్చు చేశారు. నాడు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.75 వేల కోట్లు ఉంటుంది. ఇక లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల దాదాపు రూ.20 లక్షలు. అవేవీ చేయని కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. ఎకరికో పుట్టిన బిడ్డను మా బిడ్డగా చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. టిడ్కో ఇళ్లన్నీ తామే నిర్మించామని చెప్పుకోవడం దారుణం.గత ప్రభుత్వంలో 1.24 లక్షల టిడ్కో ఇళ్లు పంపిణీటిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని 66 ప్రాంతాల్లో లక్షకు పైగా ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. సాలూరు, విజయనగరం, చిత్తూరు వంటి పట్టణాల్లో కూడా టిడ్కో ఇళ్లు పంపిణీ చేశాం. మొత్తంగా 1,24,680 ఇళ్లు అన్ని వసతులతో జీ+3 విధానంలో నిర్మించి ఇచ్చాం.గతంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరీఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి కూటమి ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉన్నవారు కొత్త కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ వైఎస్ జగన్ గారు చేసిన మేలును మీరు క్రెడిట్గా తీసుకోవడం అన్యాయం. అందుకే ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి మీ మాయను, భూంరాంగ్ వ్యవహారాలను బట్టబయలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడం, టిడ్కో ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయడం..ఈ చరిత్ర మొత్తం గత ప్రభుత్వానిది. ఆ ఘనత అంతా జగన్కే దక్కుతుంది.ఒక్క ఇంటి పట్టా ఇవ్వకుండా మసిపూసి మారేడుకాయ చేసిన చరిత్ర చంద్రబాబుగారిది. అందుకే ఇకనైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తమ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మేరుగు నాగార్జున హెచ్చరించారు. -
‘రైతుల జోలికొస్తే సహించేది లేదు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టిపీడుస్తున్నారన్నారు. ఈ రోజు(సోమవారం, మార్చి 30వ తేదీ) ఆక్వారైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా అనంతరం మీడియాతో మాట్లాడారు పేర్ని నాని. ‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు. వందల ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా రెండు ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవిన్యూ సిబ్బంది పాల్పడుతున్నారు. ఎకరం రిపేరుకు 50,000 బోరు వేసేందుకు మరో 50 వేలు వసూలు చేస్తూ ఆక్వా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెదపట్నం కానూరు గ్రామాలలో యథేచ్ఛగా మడ అడవులను చెరువులుగా తవ్వుకుంటుంటే పట్టించుకోవడం లేదు. కోన గ్రామంలో 83 సెంట్ల రైతును రికార్డులు చూపించమంటూ ఆర్డీవో నా నా హైరానా చేశారు. రైతు చెరువును పూడ్చమని ఆదేశించడం ఏంటి?, ముడుపుల మాయలో బందరు ఆర్డిఓ ఎమ్మార్వోలు రైతులపై అగత్యాలకు పాల్పడితే సహించబోం’ అని హెచ్చరించారు. -
చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్ ఫ్లాప్
నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్ఫ్లాప్ అయ్యింది. -
మావోయిస్టు కీలక నేత చెల్లూరి లొంగుబాటు
ఏపీ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు లొంగిపోయారు. మరో ఏడుగురు మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నారాయణరావు పనిచేశారు. మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.కాగా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ, జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను అణిచి వేసేందుకు భారత ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి.ఛత్తీస్గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్లో భధ్రతా బలగాలు విజయం సాధించారు. మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర సర్కారు పెట్టుకున్న గడువు రేపటితో ముగియనుండడంతో తదుపరి ఏం జరుగుతుందో చూడాలి. -
ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
-
మైక్ లాక్కొని హంగామా.. టీడీపీలో పెరిగిన విభేదాలు!
నెల్లూరు జిల్లా: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న తమకు అన్యాయం జరుగుతోందంటూ ఒక్కసారిగా వ్యాఖ్యానించడంతో పరిస్థితులు హీటెక్కాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే దీనికి వేదికైంది. సముదాయించకుండా.. అడ్డుకొని..! పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత బొమ్మ సుబ్బారెడ్డి మైక్ పట్టుకొని తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారనీ.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి వరకు పార్టీ కోసం రక్తాన్ని ధారపోస్తే, ఇప్పుడు కనీస మర్యాద కరువైందంటూ కంటతడి పెట్టారు. ఈ తరుణంలో అక్కడే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆయన్ను సముదాయించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పలువురు విస్తుపోయారు. స్టేజీపై అలా మాట్లాడొద్దంటూ నోరు నొక్కేందుకు యతి్నంచారు. మైక్ లాక్కొని.. సీనియర్లను తోసేసి అసమ్మతి గళాన్ని వినిపిస్తే తట్టుకోలేని తమ్ముళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. సుబ్బారెడ్డి తన బాధ చెప్పుకొంటుండగానే, నేత కోడూరు కమలాకర్రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పెద్దాయన చేతిలోని మైక్ను బలవంతంగా లాక్కున్నారు. అనామకుడినా నేను..? ఇంత అవమానిస్తారా అంటూ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. మరో సీనియర్ నేత బషీర్ సైతం వేదికపైనే అసంతృప్తిని వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను ఏ కార్యక్రమానికీ పిలవడం లేదని, పార్టీలో సీనియర్లను ఏ మాత్రం లెక్కచేయడంలేదంటూ బాహాటంగానే విమర్శించారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉంటే బయట నుంచి వచ్చిన నేతలు తమపై పెత్తనం చేయడమేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బుచ్చిరెడ్డిపాళెం సాక్షిగా జరిగిన ఈ రచ్చ, టీడీపీలో ఐక్యత లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. -
ఆరు నెలల్లోనే కలెక్టర్పై బదిలీ వేటు
గుంటూరు: ఇప్పటి వరకు గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఎ.తమీమ్ అన్సారియా ఆకస్మికంగా ఆదివారం బదిలీ అయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆమెను ఆరు నెలల్లోనే ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల రేటింగ్లో గుంటూరు వెస్ట్ 175వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారులతోపాటు కలెక్టర్ కూడా తమ మాట వినడం లేదని జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతోపాటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మొదటి నుంచి అధికారులపై తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తమీమ్ అన్సారియాను హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సయోధ్యతో మెలగాలని సున్నితంగా హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన తమీమ్ అన్సారియాకు ఆంధ్రాలో పెద్దగా గాడ్ ఫాదర్స్ లేకపోవడం, మైనారిటీ కావడం కూడా బదిలీకి కారణంగా కనిపిస్తోంది. మానవతా వాదిగా గుర్తింపు తమీమ్ అన్సారియా గత ఏడాది సెపె్టంబర్ 13న గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించే సమయానికి జిల్లాలో అనేక సమస్యలున్నాయి. వాటిని దాదాపు విజయవంతంగానే పరిష్కరించారు. తుపాను నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, పెద్దగా నష్టం లేకపోవడం అప్పట్లో మంచి పేరు తెచ్చాయి. వరదల్లోనూ ట్రాక్టర్లపై గ్రామాలకు వెళ్లి బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకుని సాయం అందించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవారు. విజయం మనదే పేరిట ఆ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన సరస్ మేళా విజయవంతం చేశారు. గత నాలుగు రోజులుగా తమీమ్ అన్సారియా బదిలీ వార్త చక్కర్లు కొడుతుండడంతో ఎస్సీ. ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..?
సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ⇒ కడప టీడీపీలో జోష్ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టుడుగు స్థానానికి వచ్చిందని గతంలో సీనియర్ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టేసిందని ఆరోపించారు. దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచీ టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు. కనుమరుగవుతున్న పాతతరం నేతలు... సాక్షాత్తు టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకొండారెడ్డిపై ప్రత్యక్ష దాడి చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వారు ఓ డివిజన్ టీడీపీ ఇంఛార్జి వెంకటేషపై మూకుమ్మడి దాడి చేశారు. కీలక నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనం అంటూ పాత తరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఎమ్మెల్యే కోవర్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో..పాత తరం వారే కోవర్టులని సర్దిచెప్పుకుంటుంటే...పాత తరం వారు మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కోవర్టులంటూ చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ను విస్మరించిన తమ్ముళ్లు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున దివంగత ఎన్టీఆర్ను తెలుగుతమ్ముళ్లు విస్మరించారు. కడప నగరంలోని కొండాయపల్లె (చిన్నచౌక్ పోలీసుస్టేషన్ ఎదురుగా) వద్ద ఉన్న ఎనీ్టఆర్ విగ్రహం కనీసం ఒక పూలదండకు కూడా నోచుకోలేదంటే పార్టీ నేతల చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. కాగా, కడప నగరంలో 15 డివిజన్లు మినహా తక్కిన డివిజన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టలేదని సమాచారం. -
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. గ్రామం మొత్తం షాక్!
శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైనా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. అది సృష్టి ధర్మం కూడా. కానీ ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో మాత్రం కోడిపుంజు గుడ్డు పెట్టడం విశేషం. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్తో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జన్యుపరమైన లోపాలతో ఇటువంటివి జరుగుతుంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఉగాదులు వెళ్లినా.. ఉషస్సులేవీ?
సాక్షి, విశాఖపట్నం: పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మారుస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీవితాల్లో వెలుగులు నింపకుండానే సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి 2 లక్షలకు పైగా కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం.. మళ్లీ అందులో వడపోత కోసం రీ–సర్వే పేరుతో పేదోడి ఇంటిపై బంగారు కత్తి వేలాడదీసింది. ఫలితంగా ఆ సంఖ్యను లక్షకు కుదించేసింది. 2024 అక్టోబర్లో పీ–4 ప్రారంభించినప్పుడు.. ‘వచ్చే ఉగాది నాటికి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారు. ఇప్పటికి రెండు ఉగాదులు గడిచిపోయినా ఆ కుటుంబాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. సర్కారుపై నమ్మకం లేని సంపన్న వర్గాలు మొహం చాటేస్తున్నాయి. దీంతో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులైనా మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతూ మార్గదర్శులను ఎంపిక చేసినా.. ఈ పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరిట హడావుడి చేస్తుండటం కొసమెరుపు. పేదలను ఆదుకునేందుకే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్(పీ–4) విధానాన్ని తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు, మొదటి 20 శాతం ఉన్న సంపన్న కుటుంబాల ద్వారా సాయమందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీనిపై మంత్రులు, అధికారులు సమీక్షల పేరిట మొదట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే సచివాలయాల వారీగా సర్వేలు నిర్వహించి, జిల్లాలో లక్షకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరికి సంపన్నుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామంటూ 2024 ఆగస్టులోనే మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా భరోసా దక్కలేదు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరకపోవడంతో పేద వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది. స్క్రిప్ట్డ్ సక్సెస్ స్టోరీలు విఫలమైన పథకాన్ని విజయవంతమైనట్లు చూపడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని కుటుంబాలకు.. వేదికపై ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? అనే అంశాలపై ముందుగానే శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల మంది మార్గదర్శులు ఉంటే, కేవలం 20 మందికి మాత్రమే అవార్డులు ఇస్తుండటం చూస్తుంటే.. అసలు ఆ కుటుంబాలకు ఎంతమేర సాయం అందుతుందో అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా పీ–4 విఫలమైందని స్పష్టమవుతున్నా, సంబరాలు చేసుకోవడంపై జిల్లా అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని భావించిన నిరుపేదలకు నిరాశే మిగులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహిస్తే ప్రజల ముందు అభాసుపాలవుతామని కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వడపోతలతో పేదల సంఖ్య తగ్గింపు2024 అక్టోబర్ 2న పీ–4ను ప్రారంభిస్తూ, 2025 ఉగాది నాటికి బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వం పునఃసర్వే పేరుతో పదే పదే వడపోతలు చేస్తూ లబి్ధదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. ఫలితంగా మొదట గుర్తించిన భారీ సంఖ్య కాస్త ప్రస్తుతం 1,05,126 కుటుంబాలకు పడిపోయింది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శులుగా సంపన్నులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై నెట్టింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 7 వేల మంది మార్గదర్శులను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సాయం చేసే విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సంపన్నుల నుంచి స్పందన లేకపోవడంతో.. కనీసం ప్రజాప్రతినిధులైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. విఫల పథకానికి విజయోత్సవాలా? పీ–4 పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా, కాగితాలపై కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అధికారులే ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని చేతులెత్తేసినా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. జిల్లాలో గుర్తించిన 1,05,126 కుటుంబాల్లో కేవలం 66 వేల కుటుంబాలనే దత్తత తీసుకోవడం పథకం డొల్లతనాన్ని చాటుతోంది. పోనీ వారి జీవితాల్లో అయినా.. మార్పులు తీసుకొచ్చారా అంటే అదీ లేదు. లక్షకు పైగా కుటుంబాలకు కేవలం 7 వేల మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. ఇందులోనూ కొందరు వ్యాపారవేత్తలను బలవంతంగా మార్గదర్శులుగా చేర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శుభం భూయాత్.. సిలిండర్ దేహి
విశాఖపట్నం జిల్లా: వేల రూపాయలు ఖర్చు చేసి కల్యాణ మండపాలు బుక్ చేసుకుని, బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపి పెళ్లి పనుల్లో మునిగిపోయిన వారికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. అదే ‘వంట గ్యాస్’ కొరత. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో దాని సెగ కాస్తా మన వంటింట్లో గ్యాస్ సిలిండర్కు తగిలింది. దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు రెట్టింపు అవుతుండటంతో, విశాఖలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో, కేటరింగ్ వ్యాపారులు ఇప్పుడు కఠినమైన షరతులు విధిస్తున్నారు. ‘మీరు సిలిండర్లు ఇస్తేనే మేము వంట చేస్తాం, లేదంటే మా వల్ల కాదు’ అని కేటరింగ్ సిబ్బంది, వంట బ్రాహ్మణులు తెగేసి చెబుతుండటంతో పెళ్లి బృందాలు బెంబేలెత్తిపోతున్నాయి. నగరంలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు ఒక లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్ బుక్ చేసుకోగా, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో మొబైల్కు ఓటీపీ వచ్చిన వెంటనే సిలిండర్ డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు ఓటీపీ వచ్చి పది రోజులు గడుస్తున్నా గ్యాస్ రాని పరిస్థితి నెలకొంది. బుక్ చేసిన 25 రోజుల తర్వాత గానీ సిలిండర్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతుండటం, నిరీక్షణ కాలం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ మార్కెట్దే హవా.. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్కు తెరలేపారు. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల వినియోగంపై ఆంక్షలు విధించడంతో, గృహ అవసరాలకు వాడే సిలిండర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఒక్కో సిలిండర్పై రూ. 300 నుంచి రూ. 600 వరకు అదనంగా వసూలు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిశ్చయించుకున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత ధరైనా వెచ్చించి సిలిండర్లను సమకూర్చుకుంటు న్నారు. యుద్ధ మేఘాలు తొలగి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ గ్యాస్ గండం తప్పేలా లేదని వినియోగదారులు వాపోతున్నారు. -
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్డేట్స్.. వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు. ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు. బొత్స సత్యనారాయణ కామెంట్స్..మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చామురామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..కాంట్రాక్టర్కు మీకు సెట్టింగ్ కుదరలేదా?పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?. శ్రీకాకుళం..ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారుమూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారుచదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్.. మూలపేట పోర్టు దశాబ్దల కల.ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు.. పోలీసుల ఆంక్షలు..మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.వైఎస్సార్సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర. విశాఖ:కురసాల కన్నబాబు కామెంట్స్...క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..వైఎస్ జగన్కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు.. విశాఖ..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..70 శాతం పనులు మా హయాంలో చేసాం..30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే.. మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు..జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు. మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. -
భర్త గ్యాస్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. తొండపాడులో హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో సిలిండర్ తేవాలని మహాలక్ష్మి మూడు నెలలుగా భర్తకు చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్ తీసుకురాలేదు. కట్టెల పొయ్యిపై వంట చేస్తోంది. అయితే డబ్బులు అందడంతో హరికృష్ణ గ్యాస్ కోసం గుత్తి పట్టణానికి వెళ్లాడు. అక్కడ సిలిండర్ దొరకలేదు. తాను ఎంత చెప్పినా భర్త గ్యాస్ సిలిండర్ తేవడం లేదన్న మనస్తాపంతో మహాలక్ష్మి ఆదివారం ఇంట్లో ఫినాయిల్ తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త, కుటుంబసభ్యులు గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉంది. -
అత్తను కత్తితో పొడిచి చంపిన అల్లుడు
బండి ఆత్మకూరు: నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం కడమలకాల్వలో ఆదివారం అర్ధరాత్రి అత్తను అల్లుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడమలకాల్వ గ్రామానికి చెందిన సునీల్ అదే గ్రామానికి చెందిన కళావతి(40) కుమార్తె ఎస్తేరును ఐదేళ్ల కిందట ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెయింటింగ్ పనిచేసే సునీల్ మద్యం తాగుతూ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భయంతో ఎస్తేరు తన తల్లి కళావతి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన సునీల్ కత్తి తీసుకుని అత్తారింటికి వెళ్లి భార్యపై దాడికి యతి్నంచాడు. ఈ సమయంలో అడ్డుగా వచ్చిన అత్త కళావతి గుండె, కడుపు పైభాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
ప్రియురాల్ని హత్య చేసి.. ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్లో దాచేసి
విశాఖ: ప్రశాంతమైన విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డబ్బు కోసం నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో విసిగి, తన ప్రియురాల్ని హత్య చేశాడు. ఆపై ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్లో దాచేశాడు నిందితుడు చింతాడ రవీంద్ర (35). ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు..విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35) విశాఖలోని ఎల్.వి.నగర్లో నివాసం ఉంటున్నాడు. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు మౌనిక(29)ను ఇంటికి పిలిపించుకున్న రవీంద్ర ఆమెను దారుణంగా హతమార్చాడు. మౌనికను హత్య చేశాననే విషయాన్ని రవీంద్ర తన స్నేహితుడికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రవీంద్ర స్నేహితుడి ఫిర్యాదుతో మౌనిక హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేవీలో పనిచేస్తున్న రవీంద్రకు గతంలో ఓ డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి, మూడేళ్ల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో రవీంద్ర పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం మౌనికను దూరం పెట్టడంతో, ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి.ఈ క్రమంలో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను ఇంటికి పిలిచాడు. అక్కడే ఆమెను హత్య చేసి, శరీరాన్ని మూడు భాగాలుగా విభజించాడు. కొన్ని భాగాలను ఇంట్లోని ఫ్రిజ్లో ఉంచి, మరికొన్ని భాగాలను అడవివరం సమీపంలో కాల్చేశాడు. హత్య అనంతరం భయాందోళనకు గురైన రవీంద్ర తన స్నేహితుడికి ఈ విషయం చెప్పాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది.దర్యాప్తులో హత్యకు ముందు రవీంద్ర–మౌనిక మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మౌనిక తన నుంచి డబ్బులు డిమాండ్ చేసిందని, ఇప్పటికే రూ. 3.5 లక్షలు తీసుకున్నదని, ఐడి కార్డు విషయంలో ఇబ్బంది పెట్టిందని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. డబ్బుల సమస్యలతో విసిగి హత్య చేశానని ఒప్పుకున్నాడు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.ముందుగానే కత్తులు కొనుగోలు చేసి, మౌనికను హత్య చేసినట్లు రవీంద్ర విచారణలో వెల్లడించాడు. మౌనిక గతంలో బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో, అనంతరం ఎంవీపీలోని ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నా కుమార్తెకు ఎలాంటి చావు తెచ్చాడో.. బాధితురాలు మౌనిక హత్యపై ఆమె తండ్రి గోపాలరావు మీడియాతో మాట్లాడారు. నా కుమార్తెను అన్యాయంగా చంపేశారు. నిందితుడు రవీంద్ర ప్రేమ పేరుతో నా కుమార్తెను ట్రాప్ చేశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు నా కుమార్తె డబ్బులు డిమాండ్ చేసిందని అంటున్నారు. డబ్బులు డిమాండ్ చేసే అవసరం నా కుమార్తెకు లేదు. ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగం చేసేది. నా కుమార్తెకు ఎలాంటి చావు తెచ్చాడో.. అలాంటి చావే అతడికీ రావాలి’ అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆరోగ్య బీమాలో కమీషన్ల స్కామ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ బీమా కార్యక్రమాల అమలులో అక్రమాలకు తెగబడుతోంది. బీమా కంపెనీల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పాతరేస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య బీమా పథకంలో కీలక ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి కమీషన్లు దండుకునేలా అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా హౌసింగ్ బోర్డు ఆమోదం లేకుండానే ఓ బ్రోకింగ్ ఏజెన్సీని గుట్టుచప్పుడు కాకుండా ఎంపానెల్ చేసుకున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో మరో ఏజెన్సీని సైతం ఎంపానెల్ చేయడానికి ప్రయత్నాలు సాగుతుండగా ఈ అడ్డగోలు వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అస్మదీయ ఏజెన్సీకి అడ్డగోలు కేటాయింపుహౌసింగ్ కార్పొరేషన్ సుమారు 1,700 కుటుంబాలు, 4 వేల మందికిపైగా వ్యక్తుల ఆరోగ్య బీమా కోసం ఏటా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తుంటుంది. 2025–26 హెల్త్ పాలసీ గడువు వచ్చే నెలలో ముగియనుంది. దీంతో 2026–27 పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కమీషన్లు పొందడానికి అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీల ద్వారా పావులు కదుపుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. 2021 నుంచి ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచేది.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) విధానంలో ముందుకొచ్చిన బ్రోకింగ్ ఏజెన్సీలను వడపోసి అనుభవం ఉన్న రెండు ఏజెన్సీలను గుర్తించేవారు. అనంతరం బోర్డు అనుమతించిన ఓ సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపికకు సాంకేతిక షరతులు రూపొందించేవారు. ఈ విధానానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఓ బ్రోకింగ్ ఏజెన్సీని ఎంపానెల్ చేయడమే కాకుండా సదరు సంస్థలో పనిచేసే ఉన్నతాధికారికి సన్నిహితుడైన వ్యక్తికి ఉద్యోగులు, వారి కుటుంబాల వైద్య సేవల వినియోగం డేటాను ఇచ్చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని సదరు వ్యక్తే ఇన్సూరెన్స్ కంపెనీ వర్గాలతో పంచుకున్నాడని వెల్లడైంది. -
దిగజారిన వేరుశనగ ధర
సాక్షి, అమరావతి: వేరుశనగ పంట చేతికొచ్చేవేళ పతనమైన ధరలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల్లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ ప్ర«ధానంగా ఖరీఫ్ పంట. ఖరీఫ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25–30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15–20 క్వింటాళ్లకు మించటంలేదు. ఓ వైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న రైతులకు పతనమైన ధరలు అశనిపాతంగా మారాయి. క్వింటా వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట రూ.5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. నాణ్యత లేదనే వంకలతో కోతలుకాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతులను బెదరగొడుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపులేని దళారులు, వ్యాపారులు ప్రస్తుతం నాణ్యత, పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కళ్లాల వద్దకు రాశుల్లో వందగ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలను తూకం వేసి నాణ్యత పర్సంటేజ్ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు.పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంటున్నారు.నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు రాష్ట్రంలో వేరుశనగ రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కనీసం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పంటలకు మార్కెట్లో ధరల్లేనప్పుడల్లా ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వేరుశనగను కనీస మద్దతు ధరకు కొనాలి.– పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఇదేంది సామీ.. సర్కారే ‘రియల్’ దందా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా దోచి పెడుతోంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పర్యాటక విధానం 2024–29 పేరిట ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కోరినంత భూమిని.. అడిగిన రేటుకు మారు మాట్లాడకుండా కట్టబెడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ, పర్యాటక భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు కోసం తిరుపతి రూరల్ మండలంలోని దామినీడులో ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.కారుచౌకగా కట్టబెట్టేలా స్కెచ్పర్యాటక ప్రాజెక్టుల పేరుతో నచ్చినోళ్లకు నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటి వరకు 99 ఏళ్లకు లీజు పేరుతో శాశ్వతంగా భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న సర్కార్.. తాజాగా మరో అడుగు ముందుకేసి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్వో) ప్రకారం రేటుకట్టి.. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాదాక్రాంతం చేస్తోంది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ రూ.వెయ్యి కోట్లు పైమాటే. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం దామినీడులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు అత్యంత డిమాండ్ నెలకొంది. అలాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎస్ఆర్వో రేటుకు అమ్మేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భూములు కేటాయించడంతో పాటు పలు రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రైవేటు సంస్థ కోరితే.. భూమి అమ్మేస్తారా?దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రెండూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు.. భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయవిక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటళ్ల నిర్వహణ, హాస్పటాలిటీలో ఎటువంటి అనుభవం లేదని తెలుస్తోంది. అలాంటి ఈ సంస్థలు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,226.32 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా, అందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. పెట్టుబడిదారు అభ్యర్థన మేరకు ప్రభుత్వం సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం అప్పనంగా భూములు కట్టబెట్టడంపై ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా ఏడు ఎకరాల్లో ఎంఐసీఈ కాంప్లెక్స్, మరో ఏడు ఎకరాల్లో 300 గదుల వెల్నెస్ జోన్, 250 గదులతో టైమ్ షేర్ సదుపాయం, 4 ఎకరాల్లో రెండు హోటళ్లతో హాస్పటాలిటీ జోన్ (5స్టార్ 200 గదులు, 3 స్టార్ 150 గదులు), 2 ఎకరాల్లో మల్టీప్లెక్స్ జోన్, 2 ఎకరాల్లో కల్చరల్ థీమ్ పార్కు నిర్మిస్తామని చెబుతోంది.రూ.300–400 కోట్ల ప్రోత్సాహకాలు⇒ చంద్రబాబు సర్కార్ తిరుపతి వన్ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహకాల కింద రూ.వందల కోట్లు తిరిగి చెల్లించనుంది. కేపిటల్ సబ్సిడీ కింద రూ.40 కోట్లు ప్రభుత్వమే సంస్థకు ముట్టజెప్పుతోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్ సుంకం రీయింబర్స్.. ఇలా ప్రోత్సాహకాలన్నీ కలిపి ఏకంగా రూ.300–400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తోంది. ⇒ వాస్తవంగా ఈ ప్రోత్సాహక మొత్తాన్ని చూస్తే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎస్ఆర్వో విలువ ప్రకారం విక్రయించే భూమి రేటు కంటే అధికంగా ఉండటం గమనార్హం. రూ.1,226.32 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.వెయ్యి కోట్ల భూమి ఇవ్వడమే కాకుండా రూ.300–400 కోట్లు విలువైన ప్రోత్సాహకాలతో కలుపుకుని రూ.1,300–1,400 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది.⇒ పైగా పెట్టుబడిదారులకు ఆస్తి భరోసా కల్పించడం ద్వారా ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన భూమిని కేటాయించడంతో వాళ్లకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను పొందడానికి, అంతర్జాతీయ హాస్పిటాలిటీ, వెల్నెస్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సహా ప్రపంచ వ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుందని ఉచిత సలహా ఇస్తోంది. రేపో మాపో అధికారిక సర్వే నిర్వహించి 22 ఎకరాల భూమిని తిరుపతి వన్ ప్రాజెక్టు కోసం అప్పగిస్తామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు వేలం వేయలేదు?రాష్ట్రంలో ఎక్కడైనా సరే విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విషయంలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. పొరుగునే ఉన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వేలం నిర్వహించి, ఎక్కువ రేటు ఇచ్చే సంస్థలకు ఆయా ప్రభుత్వాలు భూములను అప్పగిస్తున్నాయి. తద్వారా పోటీ పెరిగి మంచి ధర వస్తుంది. తిరుపతి లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో హోటళ్లకు గానీ, భక్తులకు సంబంధించిన వసతుల కోసం గానీ.. ఏ ప్రాజెక్టుల కోసమైనా సరే ఇచ్చే భూములకు వేలం నిర్వహిస్తే మంచి ధర వస్తుందనే విషయం తెలిసీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా, కారుచౌకగా భూములు కట్టబెట్టడం వెనుక అవినీతి, బినామీ బాగోతం దాగి ఉందని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. -
మూలపేట పోర్టు ఘనత జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
బాలుడి దారుణ హత్య
నందివాడ: ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ, మనవడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి బాలుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో శనివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. వివరాలు.. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో గండికోట లక్ష్మి(70) ఒంటరిగా నివాసం ఉంటూ బెల్టుషాప్ నిర్వహిస్తోంది. ఆమె కొడుకు గండికోట రామసుబ్బారావు, కోడలు రమాదేవి స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ రాత్రివేళ పనికి వెళ్తారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారావు తన కొడుకు బాలాజీ(10)ని నానమ్మ లక్ష్మి దగ్గర రాత్రి వదిలేసి వెళ్తాడు. ఉదయం ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. బాలుడు చిన్నలింగాలలో ప్రభుత్వ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజువారీ లాగే శనివారం రాత్రి వృద్ధురాలు లక్ష్మి, మనవడు బాలాజీతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు బాలాజీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని తొలుత గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. నందివాడ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు స్థానికంగా బెల్టుషాప్ నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. డాగ్స్క్వాడ్ రొయ్యల చెరువు వరకు వెళ్లి పోలీస్ జాగిలం ఆగిపోయింది. పోలీసులు పలువురి అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. వారి పనేనా ! ఇటీవల మండలవ్యాప్తంగా రొయ్యల చెరువుల వద్ద పని కోసం అస్సాం, బిహార్ రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యక్తులు వచ్చారు. వీరు వృద్ధురాలు లక్ష్మి దగ్గర తరచూ మద్యం కొనుగోలు చేస్తారు. దీనికితోడు వారు నిత్యం గంజాయి సేవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వారిపైనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో బాలుడి హత్య, వృద్ధురాలిపై దాడి ఘటన గ్రామస్తులను ఉలికిపాటుకు గురిచేసింది. -
వైద్యుడి కుటుంబం అఘాయిత్యం
నరసరావుపేట టౌన్/నాదెండ్ల: మూడేళ్ల కుమార్తెతో కలిసి ఓ వైద్యుడి కుటుంబం అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. భార్య శంకరకుమారి (30), కుమార్తె మౌనిక (3) ప్రాణాలు కోల్పోగా.. భర్త గోపి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నరసరావుపేట వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన డాక్టర్ కుంభా గోపి భోపాల్ ఎయిమ్స్ వైద్యశాలలో మత్తు వైద్యుడుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన శంకరకుమారి(30)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపి పనిచేస్తున్న ఆస్పత్రిలోనే భార్య శంకరకుమారి కూడా నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప మౌనిక ఉంది. బాలిక మానసిక ఆరోగ్య సమస్యతో జన్మించింది. శనివారం రాత్రి డాక్టర్ గోపి నరసరావుపేట రైల్వేస్టేషన్ సమీపంలోని దినేష్ గ్రాండ్ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వెళ్లిన శంకరకుమారి ధర్మవరం నుంచి ఆదివారం ఉదయం కుమార్తె మౌనికతో భర్త బస చేసిన లాడ్జికి వచ్చింది. కాగా.. కుమార్తెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యాభర్తలు కూడా ఆ ఇంజెక్షన్లు తీసుకున్నారు. అనంతరం చేతికి నీడిల్తో ఉన్న వీడియోలు, లొకేషన్ను బంధువుల ఫోన్కు పంపారు. అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన లాడ్జికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి పరిశీలించగా ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆటోలో చిలకలూరిపేట రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మౌనిక మృతి చెందినట్టు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత శంకరకుమారి కూడా మృతి చెందింది. డాక్టర్ గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగనున్నారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవం నిర్వహిస్తారు. 1న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రోజూ సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. ఈ సందర్భంగా మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. -
ఆవిర్భావ సభలో... అంతులేని అబద్ధాలు
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే.. » మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు. » అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. » దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు. » సూపర్సిక్స్తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్హిట్ చేశామని చెప్పుకున్నారు.» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.రాజధాని రైతులపై కపట ప్రేమ.. మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ జగన్పై మళ్లీ విషం.. మరోవైపు.. వైఎస్ జగన్పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు. -
పునర్విభజనలో 50 శాతం సీట్లుపెరుగుతాయి
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను అమలుచేయలేరని అనుకున్నారని.. కానీ, తాను చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 21 నెలల్లో కొత్తగా ఐదు లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారుచేశామన్నారు. ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని తమ విధానమని.. త్వరలో అమరావతి రాజధానిపై కేంద్రం చట్టం చేస్తుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కావడంవల్లే కొందరికి నచ్చలేదని విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రధాని మోదీని తీసుకొచ్చి ప్రారంబోత్సవం చేస్తామన్నారు. నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలి పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలని, లేకపోతే వారికి పార్టీలో స్థానం ఉండదని.. భవిష్యత్తులో బాగా చేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతారని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గాల పునరి్వభజనతో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయన్నారు. సీట్లు పెరిగితే కొత్తవారికి పదవులు లభిస్తాయన్నారు. పదవుల్లో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించి, ఇప్పుడు ఆవిర్భావ వేడుకల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు క్రెడిట్ చోర్ అని దుయ్యబట్టారు. టీడీపీ, ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా తుంగలోకి తొక్కి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని క్రమశిక్షణ లేని పార్టీగా, నైతిక విలువలు లేని పార్టీగా మార్చింది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించవద్దని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనతో చంద్రబాబు ఎక్కడా, ఏ విషయంలోనూ సరితూగరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వేడుకలు చేసే అర్హత లేదు.. కామపిశాచుల్లా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతలను ఒక్కరినైనా సస్పెండ్ చేశారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు. పొత్తుల కోసం అంటకాగిన పార్టీగా టీడీపీని మార్చేసిన చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనులు లేవని, బాబు జీవితమంతా అబద్ధాలతోనే బతుకీడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వ పనితీరు మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును తాను మనిషిగా కూడా గుర్తించటం లేదని, జీవిత చరమాంకంలో ఉన్న బాబు ఇకనైనా మారాలని హితవు పలికారు. -
‘చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరు’
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అరుణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరని చెప్పారు.‘పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందా? గతంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎందుకు కలిశారు? చంద్రబాబు గతంలో ప్రధాని మోదీని ఏమన్నారో గుర్తు చేసుకోవాలి. ప్రధాని మోదీని చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శించారు. దేశ సంపదను మోదీ ఖూనీ చేస్తున్నారని, మోదీకి కుటుంబ విలువ తెలియదని కామెంట్ చేయలేదా?ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు ఐటీకి చేసిన కృషి ఏంటో చెప్పగలరా? ఐటీకి షౌండేషన్ కూడా నేదురమల్లి జనార్దన్ వేశారు. చంద్రబాబు ఐటీకి పీతమహుడిలా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరు.టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నారు. టీడీపీపై పోటీ చేశారు. అవసరమైతే ఎన్టీఆర్ను ఓడిస్తానని, సినిమావాళ్లకు రాజకీయాలు ఎందుకు? అని మాట్లాడింది చంద్రబాబే. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కుంది చంద్రబాబే. పార్టీని, పార్టీ జెండాను, పార్టీ కార్యాలయాలను, పార్టీ అకౌంట్స్ ను లాక్కుంది చంద్రబాబే. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు.ఆశయాలతో పెట్టిన ఎన్టీఆర్ పార్టీని వెన్నుపోటు పోడవడమే కాదు. పథకాలన్నీ తొలగించారు. పథకాలన్నీ కాపీనే కదా? కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోంది. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. కానీ, ఎంత లెక్క వేసిన 40వేల ఉద్యోగాలే వస్తుంది. 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి’ అని అరుణ్కుమార్ విమర్శించారు. -
విశాఖలో భారీ అగ్నిప్రమాదం..
విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టౌన్ కొత్తరోడ్డు సమీపంలో స్క్రాప్ షాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు ఎగిసి పడుతున్నాయి. దాని పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముందే వేసవికాలం కావడంతో మంటలు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు భావిస్తున్నారు.కాగా, రెండు వారాల ముందే విశాఖ గోపాలపట్నంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. చంద్రనగర్లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ఆ ఘటనను మరవకముందే ఇప్పుడు మళ్లీ విశాఖలోనే భారీ అగ్ని ప్రమాదం సంభవించడం గమనార్హం. -
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం
సాక్షి,పల్నాడు జిల్లా: నరసరావుపేటలోదినేష్ గ్రాండ్ లాడ్జిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఐదేళ్లు, మూడేళ్ళ కూతురుతో సహా దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో తల్లి శంకర కుమారితో పాటు ఐదేళ్ల చిన్నారి మౌనిక ఇద్దరూ మృతి చెందారు. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉండటం నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తలది నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో భర్త గోపీ డాక్టర్గా విధులు నిర్వహిస్తుండగా.. అదే ఆస్పత్రిలో భార్య శంకర కుమారి నర్సుగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకి వచ్చిన కుటుంబం అగాయిత్యానికి పాల్పడింది. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దంపతుల ఆత్మహత్యకు గల కారణాల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దంపతులు మత్తు ఇంజెక్షన్ చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
సాక్షి, శ్రీకాకుళం: ‘‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’’ కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రేపు(మార్చి 30 సోమవారం) చలో మూలపేట పోర్టు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.మూలపేట పోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అడ్డుకుంటోంది. అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్ల ద్వారా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ దేవుడైనా జాలిచూపలేదే.. తండ్రి ఒడిలో చిన్నారి మృతి
చిత్తూరు జిల్లా: మండలంలోని పాలమాకులపల్లె వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. బెంగళూరులోని సింగసంద్రలో ఉంటున్న దాపు శ్రీధర్ కుమార్(46), అతని భార్య లక్షి్మ(42), కుమారై అధ్విక(3)తో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు ముందు సీటులో శ్రీధర్కుమార్ తన కుమార్తె అధ్వికను ఒడిలో కూర్చుని పెట్టుకున్నాడు. భార్య లక్ష్మీ వెనుక సీటులో కూర్చుంది. కారు బస్సు కిందకు దూసుకెళ్లినప్పుడు తండ్రి ఒడిలో చిన్నారి మృతి చెందిన దృశ్యం చూసిన ప్రయాణికులు, స్థానికుల కంట తడిపెట్టారు. ఆ దేవుడైనా కనికరించలేదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభించిన ట్రాఫిక్ పాలమాకులపల్లె వద్ద హైవేపై ప్రమాదం చోటు చేసుకోవడంతో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సుమారు రెండు గంటలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇది మూడో ప్రమాదం పాలమాకులపల్లె వద్ద హైవేపై ఇది మూడో ప్రమాదమని స్థానికులు, వాహనదారులు తెలిపారు. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే పల్లెవెలుగు బస్సులు పాలమాకులపల్లె వద్ద సర్వీసు రోడ్డు వీదుగా వెళ్లాల్సి ఉందని, డ్రైవర్లు బస్సులను హైవేపై నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత నెల ఇక్కడే ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు గాయపడినట్లు చెప్పారు. అంతకు మునుపు ఆర్టీసీ బస్సు కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. -
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
లక్ష జీతం, కారు, ఫ్లాట్.. వరుడికి కొత్త రూల్స్!
మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఒకటిగా మారేది పెళ్లి. ఇది కొత్త జీవితానికి అంకురార్పణ. అగి్నసాక్షిగా ఏడు అడుగులతో మొదలయ్యే ఈ కొత్త పయనం జీవితాంతం తోడుంటాననే మధుర వాగ్దానంతో ముందుకు సాగుతుంది. ఈ అపురూపమైన పెళ్లి బంధాన్ని ప్రస్తుతం యువతీ యువకులు ఒక వ్యాపారంగా మార్చేశారు. గతంలో పెళ్లిని పెద్దలు కుదిర్చేవారు. ఇప్పుడు యువతీయువకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. చివరకు ఒంటరితనమనే శిక్షను చేతులారా తమకు తామే వేసుకుంటున్నారు. వయసు ముదురుతున్న కొద్దీ కనిపించిన వారంతా ఏంబా ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నారు. దీంతో మళ్లీ పెద్దలకు చెప్పి ఏ సంబంధమైనా సరే నేను రెడీ అంటున్నారు. ఈ వయసు వారికి పెళ్లి కావడం కష్టంగా పరిణమించింది. చిత్తూరు: నేటితరం అబ్బాయిలు పెళ్లితో ఆర్థికంగా ఎదగాలని భావిస్తున్నారు. తాను ఎలాగున్నా అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి. కచ్చితంగా తాను చేసే ఉద్యోగమే అయి ఉండాలి. భారీగా కట్నకానుకలు ఇవ్వాలని భావిస్తున్నారు. జీవితాంతం కలిలి ఉండే భార్యని డబ్బులు తెచ్చే అందమైన యంత్రంగా.. అదో ఫ్యాకేజీగా మార్చేశారు. దీంతో అలాంటి అమ్మాయిల కోసం వేటాడుతూ ఉన్న జీవితాన్ని కోల్పోతున్నారు. 30 ఏళ్లు దాటాక కనువిప్పు కలిగి ఏదో ఒక సంబంధమైనా సరే అని సాగిలపడుతున్నారు. ఎలాంటి సంబంధమైనా ఓకే అన్నా కష్టమే వయసు ముదిరాకగాని అనేక మంచి సంబంధాలను వదులుకున్నామనే బాధ తెలిసి వస్తోంది. అప్పటికీ పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకురాని పరిస్థితి కలుగుతోంది. ఇదే సమయంలో బంధువులు, స్నేహితుల నుంచి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న మాటలు వినిపిస్తాయి. ఆపై తల్లిదండ్రుల మాట వింటూ ఏ సంబంధమైనా చూడడండనే మాటలు వస్తున్నాయి. మొత్తానికి అప్పటికి పెళ్లి కష్టంగా మారిపోతుంది. మొత్తం మీద పెళ్లి అనేది జీవితం కాదని, అదో జీతాల లెక్కని అనుకునే వారికి చివరికి తనకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు దాటి పెళ్లికాని యువతీ యువకుల సంఖ్య 16 వేల వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పటికైనా యువత మేలుకుని తన పంథాను మార్చుకుని సరైన వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి.లేని ఆశలు నింపుతున్న మ్యారేజీ బ్రోకర్లు ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యారేజీ బ్రోకర్లు, మ్యారేజి బ్యూరోలే పెళ్లి సంబంధాలను చూస్తున్నాయి. వారిని ఆశ్రయించిన వారికి పలు ఆశలు పెట్టి కళ్ల ముందు స్వర్గాన్ని చూపుతున్నారు. తాను సెట్ చేసిన వారంతా కోట్లకు పడగలెత్తారని, కట్నకానులు భారీగా ఇప్పిస్తామంటూ ఢాంబికాలు పలికి యువతీ యువకుల్లో లేనిపోనీ ఆశలు కలి్పస్తున్నారు. తద్వారా వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నారు. వారి మాటలను నమ్మిన యువతీ యువకులు పెళ్లి తర్వాత తాను పెద్ద పొజిషన్లోకి చేరుకుంటానంటూ కలల ప్రపంచంలో ఊగిసలాడుతూ చివరికి మూడు పదలు దాటాక గాని వాస్తవంలోకి రాలేకపోతున్నారు. ఇదంతా ఒట్టి మాటలనే నిజం చెవికెక్కించుకుంటున్నారు. అప్పటికే పుణ్యకాలం దాటిపోయి పెళ్లి కావడం కష్టంగా మారుతోందిఅమ్మాయిలేం తక్కువ కాదు గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పిన సంబంధాన్ని చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువమంది భాగస్వామి ఎంపికను వారే చూసుకుంటున్నారు. అబ్బాయి అందంగా ఉండాలి. నెలకు లక్షకు పైగా జీతం రావాలి. అపార్ట్మెంట్ ఉండాలి. కారు ఉండాలి. అత్తమామలు, ఆడపడుచులు గోల ఉండకూడదు. పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టాలి అని పలు కండీషన్లు పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వీరికి భర్త కంటే వారు సెటిల్ అయ్యే ఓ ప్యాకేజీలా మార్చుకున్నారు. ఇలా మంచి మ్యాచ్ వస్తుందేమోనని చూసి చూసి ఆఖరుకు మూడు పదులు దాటాక ఒంటరితనమే మేలని భావిస్తున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)
-
అఖిలప్రియ Vs ఏవీ సుబ్బారెడ్డి: ముదిరిన కేబుల్ వార్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వార్ ముదిరింది. ఆళ్లగడ్డలోని ఏవీ సుబ్బారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్ను అఖిలప్రియ లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. సుబ్బారెడ్డి కేబుల్ వైర్లను అఖిలప్రియ వర్గీయులు కట్ చేశారు. అఖిలప్రియపై కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీ అంటూ ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందంటూ పత్రాల పంపిణీ చేస్తున్నారు. ఆళ్లగడ్డలో దాదాపు 2000 పైగా ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందంటూ పత్రాల పంపిణీ చేశారు.


