తిరుపతి జిల్లా: అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మామ | Tirupati District: Uncle Pours Petrol On Son In Law And Sets Her On Fire | Sakshi
Sakshi News home page

తిరుపతి జిల్లా: అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మామ

Dec 31 2025 7:11 PM | Updated on Dec 31 2025 7:18 PM

Tirupati District: Uncle Pours Petrol On Son In Law And Sets Her On Fire

సాక్షి, తిరుపతి జిల్లా: వెంకటగిరిలో దారుణం జరిగింది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. భర్త హరిప్రసాద్‌పై  భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది.

భార్య, పిల్లల కోసం హరిప్రసాద్‌.. ఇవాళ అత్తింటికి వెళ్లగా.. అల్లుడిపై మామ దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో బాధితుడ్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 70 శాతం శరీరం కాలిపోగా.. మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement