ప్రజలందరిపై పరమశివుడి అనుగ్రహం ఉండాలి | YS Jagan wishes Telugu people on Mahashivratri | Sakshi
Sakshi News home page

ప్రజలందరిపై పరమశివుడి అనుగ్రహం ఉండాలి

Feb 15 2026 3:33 AM | Updated on Feb 15 2026 3:33 AM

YS Jagan wishes Telugu people on Mahashivratri

తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలు­గు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. '

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement