-
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..
హుజూర్నగర్ రూరల్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హుజూర్నగర్ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన గొట్టెముక్కల గోపయ్యకు 35ఏళ్ల క్రితం గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మ(50)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. గతంలో ఓ కుమారుడు మృతిచెందగా మరో కుమారుడు జానకిరామయ్య లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా, గోపయ్య ఏడాదిలో కొంతకాలం పాటు చెన్నై వెళ్లి భిక్షాటన చేసేవాడు. భార్య వెంకటమ్మ గ్రామంలో కూలి పనులు చేస్తూండేది. పది రోజుల క్రితమే గ్రామానికి వచ్చిన గోపయ్య భిక్షాటన చేయ గా వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ.. భార్య ను వేధిస్తూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి డబ్బులు కావాలని వెంకట మ్మను అడగ్గా..ఆమె డబ్బుల్లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఇంటికి చేరుకున్న గోపయ్య మంచంపై నిద్రిస్తున్న భార్యపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో ఆమె పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
‘నిర్భయ’ మెక్కడ!?
ఢిల్లీ రేప్ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. నిర్భయకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు జరిగాయి. మహిళలపై దాడులను అరికట్టేందుకు నిర్భయ చట్టాన్నీ తీసుకువచ్చింది. కానీ... మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకోమన్నందుకు నల్లగొండలో మంగళవారం ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడు కిరోసిన్ పోసి నిప్పంటిస్తే.. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై అదేవిధంగా దాడి జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఆరేళ్లు, ‘ప్రకాశం’లో ఎనిమిదేళ్లు, హైదరాబాద్లో పదో తరగతి చదువుతున్న బాలికలపై లైంగికదాడులు జరిగాయి. కిరోసిన్ పోసి.. నిప్పంటించి.. పిఠాపురం, న్యూస్లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కీర్తి రేవతి (17)పై ఎం. నవీన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు 75 శాతం కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసిస్తున్న కీర్తి శంకర్బాబు కుమార్తె రేవతి పదో తరగతి చదువుతోంది. కత్తులగూడెంనకు చెందిన నవీన్ ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. కుమార్తె నుంచి విషయం తెలుసుకున్న శంకర్బాబు అతడ్ని మందలించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేస్తానని బెదిరించాడు. దీనికి నవీన్ భయపడకపోగా మరింత రెచ్చిపోయాడు. పోలీస్స్టేషన్కు వెళ్తే పరువు పోతుందని భావించిన శంకర్బాబు నెల రోజులుగా కూతురును బడి మాన్పించి అనపర్తికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించాడు. ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. వివాహ సమయం దగ్గరపడడంతో రేవతి తల్లి నాగరత్నం బుధవారం ఉదయం పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు రాజమండ్రి వెళ్లగా, తండ్రి పత్రికలు పంచేందుకు కాకినాడ వెళ్లాడు. రేవతి ఒంటరిగా ఉండడం గమనించిన నవీన్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన శంకర్బాబు నిందితుడ్ని పట్టుకునేందుకు యత్నించాడు. పెనుగులాటలో నవీన్ ఫోన్ కిందపడిపోగా, అతడు పరారయ్యాడు. 75 శాతం గాయాలైన రేవతి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
‘నిర్భయ’ మెక్కడ!?
ఢిల్లీ రేప్ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. నిర్భయకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు జరిగాయి. మహిళలపై దాడులను అరికట్టేందుకు నిర్భయ చట్టాన్నీ తీసుకువచ్చింది. కానీ... మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకోమన్నందుకు నల్లగొండలో మంగళవారం ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడు కిరోసిన్ పోసి నిప్పంటిస్తే.. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై అదేవిధంగా దాడి జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఆరేళ్లు, ‘ప్రకాశం’లో ఎనిమిదేళ్లు, హైదరాబాద్లో పదో తరగతి చదువుతున్న బాలికలపై లైంగికదాడులు జరిగాయి. కిరోసిన్ పోసి.. నిప్పంటించి.. పిఠాపురం, న్యూస్లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కీర్తి రేవతి (17)పై ఎం. నవీన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు 75 శాతం కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసిస్తున్న కీర్తి శంకర్బాబు కుమార్తె రేవతి పదో తరగతి చదువుతోంది. కత్తులగూడెంనకు చెందిన నవీన్ ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. కుమార్తె నుంచి విషయం తెలుసుకున్న శంకర్బాబు అతడ్ని మందలించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేస్తానని బెదిరించాడు. దీనికి నవీన్ భయపడకపోగా మరింత రెచ్చిపోయాడు. పోలీస్స్టేషన్కు వెళ్తే పరువు పోతుందని భావించిన శంకర్బాబు నెల రోజులుగా కూతురును బడి మాన్పించి అనపర్తికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించాడు. ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. వివాహ సమయం దగ్గరపడడంతో రేవతి తల్లి నాగరత్నం బుధవారం ఉదయం పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు రాజమండ్రి వెళ్లగా, తండ్రి పత్రికలు పంచేందుకు కాకినాడ వెళ్లాడు. రేవతి ఒంటరిగా ఉండడం గమనించిన నవీన్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన శంకర్బాబు నిందితుడ్ని పట్టుకునేందుకు యత్నించాడు. పెనుగులాటలో నవీన్ ఫోన్ కిందపడిపోగా, అతడు పరారయ్యాడు. 75 శాతం గాయాలైన రేవతి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రెస్ కొనిస్తానని ఆశచూపి... హైదరాబాద్, న్యూస్లైన్: డ్రెస్ కొనిస్తానని ఆశ చూపించి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఎస్ఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన వాసుదేవరాజు (34) అదే కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు కొత్త దుస్తులు కొనిస్తానని కేపీహెచ్బీ కాలనీ నాల్గవ ఫేజ్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చిన్నారిని చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు. హోంగార్డుపై ‘నిర్భయ’ కేసు అదృశ్యమైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై వనస్థలిపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం... హయత్నగర్ మండలం రాగన్నగూడ గ్రామ పంచాయితీ టీచర్స్కాలనీకి చెందిన మహ్మద్ మౌలానా కూతురు (17) స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో మంగళవారం మౌలానా వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఇంటికి చేరుకున్న బాలిక మంగళవారం రాత్రి తనపై రాహుల్ అనే హోంగార్డు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. మధు అనే స్నేహితుడు తనను బైక్పై తుర్కయంజాల్ వద్ద వదిలిపెట్టాలని రాహుల్ బైక్పై పంపించాడని, అతడు రాత్రి 11.30 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్లాడని తెలిపింది. హోంగార్డుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. ఐస్క్రీమ్ ఇప్పిస్తానని... మహబూబ్నగర్, న్యూస్లైన్: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం మహ బూబ్నగర్ పట్టణానికి వలసవచ్చింది. పదేళ్లుగా గప్చుప్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. వారి ఆరేళ్ల కూతురు ఇంటిముందు ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన మోహిద్(20) ఐస్క్రీం ఇప్పిస్తానని ఎర్రగుంట్ల ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై ఆత్యాచారం చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక తీవ్రంగా గాయపడిందని, భయంతో తీవ్రజ్వరం వచ్చిందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి... హనుమంతునిపాడు: ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో మంగళవారం ఓ యువకుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన మహిళ తన కూతురు(8)ను తీసుకుని మంగళవారం వేములపాడు గ్రామానికి వెళ్లింది. సాయంత్రం పొద్దుపోయాక ఇంటికి తిరిగివస్తూ కూతుర్ని అదే గ్రామానికి చెందిన బ్రహ్మయ్య అలియాస్ బ్రహ్మనాయుడు(18)తో పంపించింది. అతడు బాలికకు మాయమాటలు చెప్పి దారిలో ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నొప్పితో బాధపడుతుండగా బుధవారం ఉదయం తల్లి విచారించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అరెస్టు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement