ఢిల్లీ రేప్ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. నిర్భయకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు జరిగాయి. మహిళలపై దాడులను అరికట్టేందుకు నిర్భయ చట్టాన్నీ తీసుకువచ్చింది. కానీ... మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకోమన్నందుకు నల్లగొండలో మంగళవారం ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడు కిరోసిన్ పోసి నిప్పంటిస్తే.. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై అదేవిధంగా దాడి జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఆరేళ్లు, ‘ప్రకాశం’లో ఎనిమిదేళ్లు, హైదరాబాద్లో పదో తరగతి చదువుతున్న బాలికలపై లైంగికదాడులు జరిగాయి.
కిరోసిన్ పోసి.. నిప్పంటించి..
పిఠాపురం, న్యూస్లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కీర్తి రేవతి (17)పై ఎం. నవీన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు 75 శాతం కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసిస్తున్న కీర్తి శంకర్బాబు కుమార్తె రేవతి పదో తరగతి చదువుతోంది. కత్తులగూడెంనకు చెందిన నవీన్ ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.
కుమార్తె నుంచి విషయం తెలుసుకున్న శంకర్బాబు అతడ్ని మందలించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేస్తానని బెదిరించాడు. దీనికి నవీన్ భయపడకపోగా మరింత రెచ్చిపోయాడు. పోలీస్స్టేషన్కు వెళ్తే పరువు పోతుందని భావించిన శంకర్బాబు నెల రోజులుగా కూతురును బడి మాన్పించి అనపర్తికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించాడు.
ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. వివాహ సమయం దగ్గరపడడంతో రేవతి తల్లి నాగరత్నం బుధవారం ఉదయం పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు రాజమండ్రి వెళ్లగా, తండ్రి పత్రికలు పంచేందుకు కాకినాడ వెళ్లాడు. రేవతి ఒంటరిగా ఉండడం గమనించిన నవీన్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన శంకర్బాబు నిందితుడ్ని పట్టుకునేందుకు యత్నించాడు. పెనుగులాటలో నవీన్ ఫోన్ కిందపడిపోగా, అతడు పరారయ్యాడు. 75 శాతం గాయాలైన రేవతి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.
‘నిర్భయ’ మెక్కడ!?
Published Thu, Dec 19 2013 9:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement