ప్రాణాలు తీసిన సరదా | Father and son died while making roosters swim in a water | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన సరదా

Dec 29 2025 4:13 AM | Updated on Dec 29 2025 4:13 AM

Father and son died while making roosters swim in a water

కోడిపుంజులను ఈత కొట్టించే క్రమంలో ప్రమాదం

కాలుజారి నీటికుంటలో పడిపోయిన కొడుకు, రక్షించబోయిన తండ్రీ మృతి

కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూన­వరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్‌(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడి­పుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్‌ కాలుజారి కుంటలో పడిపోయాడు. 

కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేక­పోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు. 

ఇంటర్‌ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతు­లగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. బహిర్భూ­మికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్‌ మర్రి­గూడెం హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement