breaking news
Hyderabad
-
నాంపల్లి రైల్వేస్టేషన్కు ఇక కొత్తరూపు!
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంనాటి చారిత్రక నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలతో స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేవిధంగా నాంపల్లి స్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా రూ.327 కోట్ల అంచనాలతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. నాంపల్లి స్టేషన్ నుంచి ప్రతి రోజు 65 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 25 వేల మందికి పైగా ప్రయాణం చేస్తారు.స్టేషన్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు, సమగ్రమైన రవాణా సదుపాయాలను అందజేసేందుకు గతంలోనే మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. ఇందుకనుగుణంగా ప్రస్తుతం అభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ తరహాలోనే నాంపల్లికి చేరుకొనే రైళ్లు, బయలుదేరే రైళ్ల కోసం వేర్వేరుగా ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు సీమ్లెస్ జర్నీ సదుపాయాన్ని కలుగజేసేవిధంగా పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్ చారిత్రక, వారసత్వ కట్టడాలను ప్రతిబింబించేవిధంగా, పర్యాటక ప్రాంతాలకు అద్దంపట్టేలా నాంపల్లి స్టేషన్ను ఒక అందమైన భవనంగా తీర్చిదిద్దనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.పునరాభివృద్ధి ఇలా... ⇒ నవాబు కుటుంబాలకు రైల్వేసేవల కోసం అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్అలీఖాన్ 1907లో దక్కన్ రైల్వేస్టేషన్ను నిర్మించారు. కాలక్రమంలో ఇది నాంపల్లి స్టేషన్గా స్థిరపడింది. సికింద్రాబాద్ తరువాత నాంపల్లి స్టేషన్ రెండవ స్థానంలో నిలిచింది. చార్మినార్, శబరి, నర్సాపూర్, గోదావరి తదితర ప్రధాన రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి.⇒ సుమారు 9,245 చ.మీ.ల పరిధిలో స్టేషన్ భవనాలను, మౌలిక సదుపాయాలను పునరాభివృద్ధి చేయనున్నారు. పర్యావరణహితమైన భవనాలుగా నిర్మిస్తారు. అలాగే విద్యుత్ సదుపాయం కోసం సోలాస్ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తారు.⇒ స్టేషన్ చుట్టూ ఉన్న 13,550 చ.మీ. పరిధిలో పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని, రెండో ద్వారాన్ని ఎత్తైన స్కై కాంకోర్స్తో కనెక్ట్ చేస్తారు. ⇒ నాంపల్లి మెట్రో స్టేషన్ (Nampally Metro Station) నుంచి ప్రయాణికులు నేరుగా రైల్వేస్టేషన్కు చేరుకొనేవిధంగా 9 మీటర్ల పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.⇒ సుమారు 1450 చ.మీ.వెయిటింగ్ హాళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఏసీ డార్మెటరీతో పాటు 14 విశ్రాంతి గదులను నిర్మిస్తారు. ⇒ సుమారు 23,146 చ.మీ. విస్తీర్ణాన్ని హోటళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కేటాయించనున్నారు. అలాగే స్టేషన్లో బుకింగ్ కౌంటర్లను పునర్మించనున్నారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు.⇒ నాంపల్లిస్టేషన్లో కొత్తగా 16 లిఫ్టులు, 8 ఎస్కలేటర్లు, టికెట్ కౌంటర్లు, దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే అగ్నిమాపక యంత్రాలు, వైఫై సదుపాయం, ల్యాప్టాప్, మొబైల్చార్జింగ్ పాయింట్లు, ఫార్మసీ, వైద్య సదుపాయాలు, ఫుడ్కోర్ట్, షాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.⇒ సీసీటీవీలతో పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుంది. ⇒ వాన నీటి సంరక్షణకు భారీ ఎత్తున ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నారు. ⇒ మార్చి 2027 నాటికి నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ⇒ కాగా సికింద్రాబాద్, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి.నాంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో జీఎం పర్యటన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్ దక్కన్ (నాంపల్లి), చర్లపల్లి రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి స్టేషన్లో అందుబాటులో ఉన్న ప్రయాణికుల సౌకర్యాలు, వసతులను ఆయన సమీక్షించారు. బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, స్టేషన్లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నాంపల్లి స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ పనుల పురోగతిపై డివిజనల్ అధికారులు సమగ్ర నివేదికను ఆయనకు అందజేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లి పర్యటనకు ముందు ఆయన చర్లపల్లి రైల్వే స్టేషన్లో పర్యటించారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాళ్లు, స్లీపింగ్ పాడ్లు, కెఫెటేరియా, టికెట్ బుకింగ్ కౌంటర్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, తదితర ఆధునిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుకింగ్ క్లర్క్, ‘సఫాయ్ మిత్ర’ సిబ్బందితో ఆయన సంభాషించారు. వారి డ్యూటీ వేళలు, పని వాతావరణం, వాళ్లకు అందజేసే సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.చదవండి: హైదరాబాద్లో వానాకాలంలోనూ నీటి కోసం తిప్పలు -
రేవంత్ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025 -
వానాకాలంలోనూ నీటి కోసం విలవిల
సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్గా నలు దిక్కులా విస్తరిస్తున్న నగరాన్ని జలఘోష వెంటాడుతోంది. వేసవిలోనే కాదు.. వానా కాలంలో సైతం నిత్యావసరాలకు వినియోగించే నీటి కోసం విలవిలలాడే దుస్థితి నెలకొంది. అడుగడుగునా కాంక్రీట్ జంగిల్గా మారడంతో భూమిలో వర్షపు నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. విచ్చలవిడిగా వందల మీటర్ల లోతుతో బోర్ల తవ్వకాలు నీటి మట్టాన్ని పాతాళంలోకి నెట్టేశాయి. తాజాగా తక్కువ వర్షాలతో భూగర్భజలాలు పైకి రాని పరిస్థితి నెలకొనడంతో ట్యాంకర్లపై ఆధారపడక తప్పడం లేదు. బహుళ అంతస్తు భవన సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీల నుంచి ట్యాంకర్లకు తాకిడి పెరిగింది. జలమండలి శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు శుద్ధి చేయని నీటిని సరఫరా చర్మ వ్యాధులకు గురి చేస్తోంది. బావురుమంటున్న బోర్లు.. బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో బోరుబావులు బావురుమంటున్నాయి. నగరంలో సుమారు 3.29 లక్షల వరకు చిన్నా.. పెద్దా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలుండగా ఇందులో సుమారు 72 వేల సముదాయాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కేవలం నిత్యావసర నీటికి డిమాండ్ పెరగడంతో వేసవి మాదిరిగానే రోడ్లపై ట్యాంకర్ల పరుగులు కనిపస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో వేలాది సముదాయలకు వాటర్ బోర్డు నల్లా కనెక్షన్లు లేవు. బోరు బావుల్లో నీటి మట్టం పెరగకపోవడంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. 36 శాతం పెరిగిన బుకింగ్ జలమండలికి ఈ నెలలో ట్యాంకర్ తాకిడి బాగా పెరిగింది. గతేడాది జూలై మొదటి రెండు వారాలతో పోల్చితే 36 శాతం బుకింగ్ పెరిగినట్లు కనిపిస్తోంది. మొత్తం 22 డివిజన్ పరిధిలో గతేడాది 63,724 ట్యాంకర్లు బుకింగ్ జరిగితే ఈసారి 86,520 ట్యాంకర్లు బుకింగ్ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శివారు ప్రాంతల్లో 23 నుంచి 51 శాతం పెరగగా, ఎల్బీనగర్ పరిధిలో మాత్రం ఐదింతల ట్యాంకర్ల తాకిడి పెరిగింది. నారాయణగూడ డివిజన్లో 51 శాతం, పాత బస్తీలోని చార్మినార్, రియాసత్ నగర్ డివిజన్ పరిధిలో గతేడాది కంటే 117 నుంచి 257 శాతం పెరగడాన్ని బట్టి భూగర్భ జలాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోజువారీగా 5 వేల నుంచి 6 వేల ట్యాంకర్లు బుకింగ్ జరుగుతోంది. మొత్తమ్మీద దాదాపు 14.06 లక్షలకు పైగా కనెక్షన్లు ఉండగా.. అందులో కేవలం 42 వేల గృహ సముదాయాల నుంచి మాత్రమే వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఉంటుందని జలమండలి పేర్కొంటోంది. సుమారు 500 గృహ సముదాయాలు వేసవిలో 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు బుక్ చేయగా, మిగిలిన 41,500 వేల సముదాయాలు 90 శాతం అంటే.. 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ట్యాంకర్లకు కాసుల పంట ప్రజల నీటి అత్యవసరం ప్రైవేట్ జల వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. వాటర్బోర్డు ట్యాంకర్ల ధర తక్కువగా ఉన్నప్పటికీ.. సరఫరాలో కొద్ది జాప్యం ప్రైవేట్ ఆపరేటర్లకు కలిసి వస్తోంది. ఖాళీ ప్లాట్లతో పాటు చెరువుల సమీప స్థలాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేసి పగలు, రాత్రి అనే తేడా లేకుండా దందా కొనసాగిస్తున్నారు. నీరు నిత్యావసరం కావడం.. ట్యాంకర్ దొరికితే చాలన్న గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ఎంత ధరయినా పెట్టి ట్యాంకర్లు తెప్పించుకోవడం సర్వసాధారణమైంది. వాటర్బోర్డు కస్టమర్ అకౌంట్ నంబర్ (సీఏఎన్) ద్వారా 5000 లీటర్ల వాటర్ ట్యాంకర్ను బుక్ చేసిన వారికి రూ.500కు లభిస్తోంది. సీఏఎన్ లేనివారికి అదే ట్యాంకర్ను రూ.850కు సరఫరా చేస్తోంది. అదే ట్యాంకర్ను ప్రైవేటులో తెప్పించుకోవాలంటే ప్రాంతాన్ని బట్టి, అత్యవసరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.వర్షాభావ పరిస్థితులతో.. ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. సాధారణ వర్షపాతం సగటున సగం కూడా నమోదు కాకపోవడంతో భూగర్భజలాల పెరుగుదల లేకుండా పోయింది. గత నెలలో సాధారణ వర్షపాతం 40 శాతం మించకపోగా, ఈ నెలలో సైతం అదే పరిస్థితి పునరావృతమతోంది. వేసవి కంటే ముందు అడుగంటిన నీటి మట్టంలో వృద్ధి కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 8.3 సెంటీ మీటర్లకు మించలేదు. రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా.. నగర శివారులోని ఎనిమిది అర్బన్ మండలాల్లో 30 నుంచి 40 శాతం కూడా నమోదు కాలేదు. మేుడ్చల్– మల్కాజిగిరి జిల్లా సాధారణ వర్షపాతం (Rainfall) 56 శాతం తక్కువగా నమోదైంది. వేసవిలో సుమారు 10 నుంచి 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు చేరాయి. తాజా వర్షాభావ పరిస్థితులతో పలు ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉన్న బోర్ల నుంచి సైతం నీటి చుక్కనీరూ పైకి రావడం లేదు.ఇంకుడు గుంతలు తప్పనిసరి.. భూగర్భ జలాల పెంపునకు 300 గజాలపైగా ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి. ఇప్పటికే సర్వే నిర్వహించి ఇంకుడు గుంతలు లేని సుమారు 16 వేల గృహ సముదాయాలకు నోటీసులు జారీ చేశాం. వర్షాకాలంలో 90 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తున్నాం. జలయజ్ఞంలో అందరి భాగస్వామ్యం అవసరం. – అశోక్ రెడ్డి, ఎండీ, జలమండలిచదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ క్రేజ్.. త్వరపడండి -
తెలంగాణకు అలర్ట్.. రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వర్షాలు లేక రైతాంగం ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే.. ఎల్లుండి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో పడొచ్చని హెచ్చరించింది.రాజధాని హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 340 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జిల్లాలుఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లిభూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెంనల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండరంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ఈదురుగాలులు: గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.⚠️ హెచ్చరికలు:పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని సూచనచెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు -
గండికోట బాలిక కేసులో మరో కొత్త మలుపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.లోకేష్ని ఎన్కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లితన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్ని ఎన్కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు. -
ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌజ్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది.కీలక అధికారుల్లో మొదలైన గుబులు..వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. -
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం, బోనాలు ఊరేగింపుల్లో పోకిరీలు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా, అనుచితంగా తాకుతూ మహిళలు, యువతులను వేధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ షీ–టీమ్స్ నిఘాలో మొత్తం 478 మంది పట్టుబడినట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం ప్రకటించారు. దీనికోసం షీ–టీమ్స్ రహస్య కెమెరాలు వినియోగించాయి. చిక్కిన పోకిరీల్లో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారు. ఈ ఆకతాయిల్లో నలుగురిపై పెట్టీ కేసులు, నగంలోని వివిధ ఠాణాల్లో ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. మిగిలిన వారిని మందలించి పంపారు. #WomenSafety - #HyderabadSHE Teams caught a total of 478 people red-handed for Misbehaving with Women Devotees during #Bonalu , including 386 majors and 92 minors in Hyderabad#SHETeams of @hydcitypolice apprehended several individuals red-handed for #misbehaving with #women… pic.twitter.com/7EDBUgo4JN— Surya Reddy (@jsuryareddy) July 15, 2025 -
మైనర్ డ్రైవింగ్ అని ఆపితే... చోరీ అయిన బైకు తేలింది
బంజారాహిల్స్: ఓ మైనర్ హెల్మెట్ లేకుండా వస్తున్నాడని హోండా యాక్టివాను ఆపి చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులకు..అది చోరీ బైకు అని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ముగ్గురు యువకులు హోండా యాక్టివాపై నెంబర్ ప్లేట్ లేకుండా వస్తూ కనిపించారు. హెల్మెట్ కూడా ధరించకపోవడంతో వారిని ఆపారు. బైక్ నడిపిస్తున్న వ్యక్తి మైనర్ అని తేలింది. బైక్ ధ్రువ పత్రాలు అడగ్గా చూపించలేదు. బైక్ నెంబర్ కూడా చెప్పకపోవడంతో చాసిస్ నెంబర్ ఆధారంగా టీఎస్09 ఈ జెడ్ 1525 అనే రిజి్రస్టేషన్ నెంబర్ కలిగిన బైక్ అని గుర్తించారు. దీంతో ఈ నెంబర్ మీద మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చలానా విధించారు. బైక్ నెంబర్తో పాటు ఫోటోను ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆన్లైన్లో బండి నెంబర్ నమోదైన వెంటనే యజమానికి మెసేజ్ వెళ్ళింది. నిమిషాల వ్యవధిలోనే వాహన యజమాని లియాండర్ టెర్రస్ స్మిత్ అనే వ్యక్తి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు ఉరుకులు పరుగులతో వచ్చాడు. కాసేపటి క్రితం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించిన బండి తనదేనని, ఏప్రిల్ 2వ తేదీన తన బైక్ చోరీకి గురికాగా అదే రోజు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తదితరులకు తెలిపారు. అప్పటికీ యాక్టివా మీద వచి్చన ముగ్గురు అక్కడే ఉండడంతో వారిని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యవహారాన్ని మీర్పేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమ పీఎస్ పరిధిలో యాక్టివా బైక్ చోరీ అయిన మాట వాస్తవమేనని ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో బైక్ మీద వచ్చిన ముగ్గురితో పాటు బైక్ను కూడా మీర్పేట పోలీసులకు అప్పగించారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చోరీ బైక్ను పట్టించడంతో మీర్పేట్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
ENC మురళీధర్రావు.. చంచల్గూడ జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మురళీధర్రావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం, ఏసీబీ అధికారులు.. మురళీధర్ రావును న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. ఈ క్రమంలో మురళీధర్ రావుకు న్యాయమూర్తి .. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో, ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా.. నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, నాలుగు ఇళ్ల స్థలాలు, మోకిలలో 6,500గజాల స్థలం గుర్తించారు.కొండాపూర్లో విల్లా.. బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్లో బిజినెస్, జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది. -
బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా... ఏం చేసుకుంటావో చేసుకో
హైదరాబాద్: ‘ఇన్స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్తోపాటు ఇన్స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హసన్పర్తి పోలీస్స్టేషన్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్పర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసుల సుపుత్రులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు వారి కొడుకులే డ్రగ్స్ పెడ్లర్లుగా దందా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఓ డీసీపీ కుమారుడు మోహన్ను డ్రగ్స్ కేసులో సైబరాబాద్ ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ (ఎస్ఐబీ) ఓఎస్డీ కొడుకు రాహుల్తేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల అరెస్టయిన కొంపల్లిలోని మల్నాడు కిచెన్ యజమాని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సూర్య అమ్మినేని సెల్ఫోన్ కాల్ డేటా, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా.. వీరికి సూర్యతో సత్సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల సెల్ఫోన్లు, ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్న ఈగల్ బృందం వాటిని విశ్లేíÙస్తోంది. వీరికి ఎంతమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో లింక్లు ఉన్నాయో ఈగల్ పోలీసులు రట్టు చేసే పనిలో పడ్డారు.గుట్టు రట్టయిందిలా.. డ్రగ్స్ కేసులో సూర్యతో సహా అరుగురిని అరెస్టు తర్వాత పోలీసులు వారి నెట్వర్క్పై దృష్టి పెట్టారు. సాంకేతిక ఆధారాలను ముమ్మరం చేయగా ఈ క్రమంలో ఎస్ఐబీ అధికారి కొడుకు రాహుల్తేజ పాత్ర తెరపైకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో తేజ పాత్రపై లోతుగా దర్యాప్తు చేయగా, మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గతేడాది జనవరిలో డ్రగ్స్ కేసులో నిజామాబాద్ పోలీసులు నాగ్పూర్–హైదరాబాద్ మార్గంలో కొకైన్, ఎండీఎంఏ రవాణా చేస్తుండగా విక్రం, ఖాజా మొహిద్దీన్లను పట్టుకున్నారు. వీరిని విచారించగా.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన ప్రధాన మాదక ద్రవ్యాల సరఫరాదారులకు తేజనే నిందితులకు పరిచయం చేశాడని ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్లోనూ ఏ–3గా తేజ పేరును చేర్చారు. కానీ, ఎప్పుడూ అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. తేజ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ను సైతం నడుపుతున్నాడు. ముందస్తు బెయిల్ కూడా లేదు.. రాహుల్తేజ ఎస్ఐబీ ఓఎస్డీ కొడుకు కావడంతోనే గతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారనే విషయాన్ని సైబరాబాద్ ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులపై న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేసిన నిజామాబాద్ పోలీసులు.. తేజపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ఏ–3గా తేజ ఉన్నా, కనీసం బెయిల్ లేదా ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదంటే నిందితుడికి పోలీసులు ఎలా సహకరించారో స్పష్టమవుతుందని ఈగల్ అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే, తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
రూ.10 లక్షల ఖర్చు దాటితే.. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అ«దీనంలోని దేవాలయాల వార్షిక బడ్జెట్కు ఆమోదముద్ర వేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాల బడ్జెట్ ప్రతిపాదనలన్నీ కచి్చతంగా ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సిందేనని తాజాగా ఆదేశించింది. ఇక దేవాలయాల్లో రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయాల్సిన ప్రతి పనికి ప్రభు త్వ ఆమోదం కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం డిప్యూటీ కమిషనర్లు, రీజినల్ జాయింట్ కమిషనర్లు, కమిషనర్ స్థాయిలో బడ్జెట్లను ఆమోదిస్తున్నా రు. అయితే, కొందరు అధికారులు బడ్జెట్కు ఆమోదముద్ర వేయాలంటే ఆలయ కార్యనిర్వహణాధికారులను కమీషన్ల కోసం వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి డబ్బులివ్వకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను పెండింగులో ఉంచుతున్నారని కొన్ని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు చేస్తే వేధిస్తారన్న భయంతో ఎక్కడా లిఖితపూర్వక ఫిర్యాదులు చేయట్లేదు. దీన్ని ఆసరా చేసుకుని అలాంటి అధికారులు మరింత చెలరేగిపోతున్నారు. అవినీతి అధికారుల వల్ల దేవాదాయశాఖకు చెడ్డపేరు వస్తోంది. ఈ తీరుపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరాలు ఆరాతీసి చర్యలకు ఉపక్రమించారు. శాఖను అప్రదిష్టపాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించారు. వెంటనే తీరు మారాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి రాకుండా ఆలయాల బడ్జెట్లను అధికారులే మంజూరు చేయటం కూడా సరికాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈమేరకు తాజాగా దేవాదాయ శాఖ ప్రత్యేక సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆమోదిస్తేనే నిధులు.. ప్రస్తుతం దేవాదాయ శాఖలో 6ఏ, 6బీ, 6 సీలుగా దేవాలయాలను వాటి ఆదాయం ప్రకారం విభజించారు. ఇందులో తక్కువ ఆదాయం ఉన్నవాటిని 6సీలో ఉంచారు. ఆదాయం ఎక్కువ ఉండే దేవాలయాల్లో 6బీ కేటగిరీలోని దేవాలయాల బడ్జెట్లను డిప్యూటీ కమిషనర్లు ఆమోదిస్తున్నారు. 6ఏ కేట గిరీ దేవాలయాల్లో రూ.25 లక్షల వరకు ఉండే బడ్జెట్లను రీజినల్ జాయింట్ కమిషనర్ ఆమోదిస్తున్నారు. అంతకంటే ఎక్కువుండే జాయింట్ కమిషనర్ స్థాయి దేవాలయాల బడ్జెట్లను కమిషనర్ ఆమోదిస్తున్నారు. ఇకపై అన్ని దేవాలయా ల బడ్జెట్లను తొలుత నేరుగా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం ఆమోదిస్తేనే అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసే అంశాలను తిరిగి మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారుల ఇష్టారాజ్యానికి కళ్లెం వేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అలాగే రూ.10 లక్షలను మించి ఖర్చయ్యే ప్రతి పనికి ఇక ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ (కనీ్వనర్) కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ బుధవారం (16వ తేదీ) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఈ నెల 25 సాయంత్రం 6 గంటలు.అభ్యర్థులు https:// tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ యూజీ –2025లో అర్హత సాధించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలలోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీఓ నంబర్ 114) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 85 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు. కటాఫ్ మార్కులు ఇలా: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి వివిధ కేటగిరీల కింద నిర్దేశించిన కటాఫ్ మార్కులను యూనివర్సిటీ వెల్లడించింది. ఓసీ, ఈడబ్లు్యఎస్ కేటగిరీ విద్యార్థులకు 144 మార్కులు (50 శాతం పైగా పర్సంటైల్), బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113 మార్కులు (40 శాతం పైగా), దివ్యాంగులకు 127 (45 శాతం పైగా) మార్కులు కటాఫ్గా నిర్ణయించారు. అర్హతలు ఇవే⇒ అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి. పీఐఓ/ఓసీఐ కార్డు కలిగి వుండొచ్చు. ⇒ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 4 సంవత్సరాలు చదువుకున్న లేదా నివసించినవారు మాత్రమే అర్హులు. ⇒ ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ/జువాలజీ లేదా బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ ⇒ నీట్లో ఓసీలు 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీలు 40%, ఓసీ– పీడబ్ల్యూడీలు 45% మార్కులు సాధించటం తప్పనిసరి. ⇒ 2025 డిసెంబర్ 31 నాటికి కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. ⇒ రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.4,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,200. ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ⇒ అవసరమైన సర్టిఫికెట్లు: నీట్ ర్యాంక్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఇంటర్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికేట్లు (9వ తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, సంతకం వంటి పత్రాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ⇒ ప్రవేశాలకు సంబంధించి మెరిట్ జాబితా జారీ చేయడమే అర్హత అని భావించరాదు. ఒరిజినల్ సర్టీఫికేట్లు పరిశీలించిన తర్వాతే ప్రవేశం ఖరారు అవుతుందని యూనివర్సిటీ తెలిపింది. వెబ్ ఆప్షన్ల తేదీలను విశ్వవిద్యాలయం తర్వాత ప్రకటించనుంది. -
కళ్లలో కారం చల్లి కాల్చి చంపారు
సాక్షి, హైదరాబాద్/మలక్పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మలక్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. ఈ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. పరోక్షంగా సహకరించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, హతుడి కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వసూళ్లు అడ్డుకోవడంతో వివాదాలు నాగర్కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్సుఖ్నగర్ సమీపంలోని విద్యుత్నగర్లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా... సింధు గ్రూప్స్కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, కారి్మక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు. 2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్ తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాకింగ్ చేసిన పార్కు బయటే... రాజేశ్తోపాటు మరికొందరు సోమవారం రాత్రి కారులో చందు ఇంటి సమీపంలో సంచరించడాన్ని నారీబాయి గమనించి చందును హెచ్చరించారు. మంగళవారం ఉదయం భార్య, కుమార్తెతో కలిసి చందు శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేశారు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు రాగా.. అక్కడే కారులో రాజేష్ కనిపించడంతో నారీబాయి హెచ్చరించారు. ‘నాకేం కాదు. ఏం భయం లేదు. మీరు ఇంటికి వెళ్లండి’అంటూ భార్య, కుమార్తెను పంపేశాడు. పార్కు వెస్ట్ గేట్ నుంచి కుడి వైపు రోడ్డులో కారు వద్దకు వెళ్తుండగా అందులోంచి దిగిన ఇద్దరు చందు కళ్లలో కారం కొట్టారు. అప్రమత్తమైన ఆయన తప్పించుకోవడానికి వెనక్కు పరిగెత్తగా.. పార్కు గేటు వద్ద ఉన్న ఇసుకలో కాలు జారి పడిపోయారు. సమీపంలోకి వచ్చిన ఇద్దరు పిస్టల్తో అతని ఛాతీ, పొట్ట భాగాల్లో కాల్చారు. రక్తం మడుగులో ఉన్న అతడిని కాలుతో వెనక్కు తిప్పి తలపై మరో రౌండ్ కాల్చి కారులో పారిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని... ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ (టీఎస్ 08 హెచ్డబ్ల్యూ 0875) కారులో వచి్చనట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. సోమవారం ఆన్లైన్లో ఆ కారును బుక్ చేసుకున్న ఏడుకొండలు అనే వ్యక్తి తీసుకుని వెళ్లారు.అతడితోపాటు రాజేష్ , ప్రశాంత్, మరొకరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు కారు తీసుకెళ్లి అద్దెకు ఇచ్చిన సంస్థకు అప్పగించి పారిపోయారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో మూడు ఖాళీ క్యాట్రిడ్జ్లు, రెండు పేలని తూటాలను స్వాధీనం చేసుకుంది. పేలింది నాటు తుపాకీ అని, తూటాలు 7.65 ఎంఎం క్యాలిబర్కు చెందినవిగా తేల్చారు. భానుచందర్ హత్య కేసులో నిందితుడు... చందు 2022లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిర భానుచందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. భూ వివాదాల నేపథ్యంలో నాగోలుకు చెందిన భాను చందర్ను, మన్సూరాబాద్కు చెందిన సీపీఐ నాయకుడు కందుల సుధాకర్, చందు తదితరులు ఆ ఏడాది ఏప్రిల్ 16న కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి వద్ద అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులు చందుతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. రంగంలోకి పది ప్రత్యేక బృందాలు హత్య విషయం తెలిసిన వెంటనే సౌత్ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చారు. సీపీఐ నాయకులు అజీజ్పాషా, ఈటీ నర్సింహా, ఛాయాదేవి తదితరులు ఘటనాస్థలికి తరలివచ్చారు. చందు భార్య, కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఏడాదిన్నర నుంచి చందుకు ప్రాణహాని ఉందని రాజేష్ తదితరులే చంపారని ఆమె ఆరోపించారు. చందు మృతితో నాగర్కర్నూల్ జిల్లాలోని స్వగ్రామం నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ చెప్పారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెంటల్ ఏజెన్సీ నుంచి నిందితులు వాడిన కారును స్వా«దీనం చేసుకున్నారు. -
పరస్పర అంగీకారంతోనే కలిసి ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలసి ఉన్నప్పుడు ఒక్కరిపై ఆరోపణలు చేయడం సరికాదని, అవి నిరాధారమైనవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు(మహిళ) గతంలోనూ ఇలా మరొకరిపై ఫిర్యాదు చేయగా, అతనిపై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. 21 ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్తో ఉన్నారని అభిప్రాయపడింది. దీనికి పిటిషనర్ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెబుతూ.. రంజిత్పై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఫిర్యాదుదారు మేరకు.. ‘2017లో నేను హాస్టల్లో ఉండి ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించి.. ఇంటి నుంచి గెంటివేశారు’. ఈ ఫిర్యాదు ఆధారంగా, 2019లో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ట్రయల్కోర్టులో చార్జిïÙట్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. అన్నీ తెలిసే పిటిషనర్తో ఉన్నారు..: పిటిషనర్ తరపు న్యాయవాది వాదన లు వినిపిస్తూ..‘పిటిషనర్ నిర్దోషి. ఫిర్యాదుదారు ఆరోపణలతో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదు. రెండేళ్లు గడిచిన తర్వాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇంత ఆలస్యానికి కారణం చెప్పలేదు. ఫిర్యాదుదారుకు బ్లాక్మెయిల్ చేసే అలవాటు ఉంది. కేశవ్కుమార్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదులో తేదీలు, సమయం, స్థలం సరిగా వివరించలేదు. పిటిషనర్పై నేరాలు ఆమోదయోగ్యం కాదు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలి’అని కోరారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నా యి. అతనిపై ఆరోపణలలో నిజానిజాలు ట్రయల్కోర్టు తేలుస్తుంది. పిటిషన్ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2019, జనవరి 16న ఇంటి నుంచి గెంటివేశారని చెబుతున్న మహిళ ఫిర్యాదు చేయడానికి 23 వరకు ఎందుకు ఆగాల్సి వచి్చందో పేర్కొనలేదన్నారు. ఆమెకు ఇలా ఫిర్యాదు చేసే అలవాటు ఉందని గత వివరాలు పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. పిటిషనర్, మహిళ.. ఇద్దరూ మేజర్లు. వారి మధ్య సంబంధం ఏకభిప్రాయంతోనే జరిగినట్టు అవగతమవుతోందని స్పష్టం చేశారు. 21ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్తో ఉన్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి పిటిషనర్ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెప్పారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిటిషనర్పై కేసును కొట్టివేస్తున్నామని తీర్పునిచ్చారు. -
పాలిసెట్లో 65.5 శాతం సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ కౌన్సెలింగ్లో ఎట్టకేలకు సాంకేతిక విద్యావిభాగం విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు కేటాయించింది. వెబ్సైట్లో కౌన్సెలింగ్ డేటా ఎరేజ్ అవ్వడం, దాన్ని వారం రోజుల తర్వాత రికవరీ చేయడంతో ముందుగా ప్రక టించిన తేదీకంటే పది రోజులు ఆలస్యంగా మంగళవారం సీట్లు కేటాయించారు. తొలివిడతలో 65.5 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిచ్చారు. వీటిల్లోని మొత్తం సీట్లలో 82 శాతం నిండగా, ప్రైవేట్ కాలేజీల్లో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే నిండాయి. మొదటి విడత సీట్ల భర్తీ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 10,012 సీట్లు మిగిలాయి. అయితే, వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నా.. రెండు వేలమందికి సీట్లు రాకపోవటం గమనార్హం. ⇒ మొదటి విడతలో 6 కాలేజీల్లోని వందశాతం సీట్లు నిండాయి. వీటిలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, ఒక ప్రైవేట్ కాలేజీ ఉంది. ⇒ ఈడబ్ల్యూఎస్ కోటాలో 713 సీట్లు నిండాయి. ఎన్సీసీ, స్పోర్ట్స్కోటాను తుదివిడత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. ⇒ సీట్లు పొందినవారు ఈ నెల 18లోగా ఫీజు చెల్లించి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలి. ⇒ తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ నెల 28 నుంచి 30 లోపు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలి. ఇలా రిపోర్ట్ చేయకపోతే సీటు కోల్పోతారు. ⇒ ఈ నెల 28 నుంచి 30 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు. 31 నుంచి పాలిటెక్నిక్ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి. ⇒ ఆగస్టు 2, 3 తేదీల్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్లో సీటు వచ్చిన కాలేజీలోని మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే ఈ స్లైడింగ్ విధానంలో మార్చుకోవచ్చు. -
19న సీజే ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో శనివారం మధ్యాహ్నం 12.30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆయన ఏడో సీజేగా బాధ్యతలు చేపడతారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది.సీజే నియామకానికి గత మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇదిలాఉండగా, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ఏసీజే జస్టిస్ సుజోయ్పాల్కు బుధవారం ఫుల్కోర్టు ఘన వీడ్కోలు పలకనుంది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఫస్ట్కోర్టు హాల్లో జరిగే వీడ్కోలు సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొననున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ సుజోయ్పాల్ 2024, మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై కోల్కతా హైకోర్టుకు వెళ్లనున్నారు. -
పంటల బీమా వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా... పంటల బీమా పథకం అమలుపై ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదు. బీఆర్ఎస్ హయాంలో రద్దయిన పంటల బీమా పథకాన్ని 2024 వానకాలం సీజన్లోనే పునః ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా.. గత రెండు సీజన్లలో పంటల బీమాపై అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో వానకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈసారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారా లేదా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల బీమాకు సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలా లేక సొంతంగా రాష్ట్రంలో బీమా పథకాన్ని రూపొందించాలా? అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. మూడు నెలలైనా ముందుకు పడని అడుగు పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని ఏప్రిల్ 23వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ దానిని పట్టించుకోనే లేదు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో మంత్రి సమావేశమైనప్పటికీ బ్యాంకర్లు పంటల బీమాపై ఆసక్తి చూపలేదు. దీంతో ప్రధాని ఫసల్ బీమా పథకంలోనే చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని గతంలో అమలు చేశారు. 2018–19 సీజన్ తరువాత ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది. 11 క్లస్టర్లుగా రాష్ట్రం రాష్ట్రంలో పంటల బీమాను పునరుద్ధరించాలంటే ఫసల్ బీమా ఒక్కటే సరైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచి్చంది. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి బీమా అమలు చేయాలని నిర్ణయించారు. వానకాలం సీజన్లో సుమారు 132 లక్షల ఎకరాల్లో పంటలు, యాసంగిలో 78 లక్షల ఎకరాల్లో వేస్తారని లెక్క కట్టారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానకాలానికి మొత్తం ప్రీమియంలో రైతు వాటా కింద 2 శాతం, యాసంగిలో 1.5 శాతం.. వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతు వాటాగా తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన ప్రీమియంలో రాష్ట్రం, కేంద్రం 50:50 చొప్పన భరిస్తాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈసారి వరి సాగు మందగించింది. కాగా, పంటలు వేసిన తరువాత క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ చేపడతారు. అంటే ఏ పంటను ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే లెక్కలను రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే పంటల బీమా పథకం అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖలోని ఒక కీలక అధికారి తెలిపారు. -
ఆదాయం ఉన్న చోటే విలువల సవరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్న జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లో మాత్రమే భూముల విలువలను పెంచాలని, తద్వారా అటు ఆదాయం పెరగడమే కాకుండా, రాష్ట్ర ప్రజలందరిపై భారం పడకుండా ఉంటుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రతి ఏటా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతూ రెవెన్యూ ఎక్కువగా వచ్చే రాష్ట్రంలోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వం విలువల సవరణ ప్రతిపాదనలు తెప్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సవరణను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆదాయం పెరగాల్సి ఉండటంతో..: గత ఏడాదిలోనే భూముల విలువల సవరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నుంచి ప్రతిపాదనలు తెప్పించింది. క్షేత్రస్థాయి కమిటీల మదింపు మేరకు వచి్చన ఈ ప్రతిపాదనలపై థర్డ్ పార్టీ చేత కూడా పరిశీలన చేయించింది. అనంతరం థర్డ్పార్టీ కూడా ప్రభుత్వానికి అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. కానీ రాష్ట్రంలో రియల్ బూమ్ సరిగా లేని నేపథ్యంలో భూముల విలువలు సవరిస్తే ఆ రంగం మరింత దెబ్బతింటుందేమోననే ఆలోచనతో సవరణ ప్రతిపాదనను పక్కన పెట్టింది.అయితే గత నెలలో మళ్లీ ఈ ఫైలును ప్రభుత్వం కదిలించింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఖచ్చితంగా పెరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భూముల విలువల సవరణ అనివార్యమని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో థర్డ్ పార్టీ నివేదికలను మళ్లీ క్షేత్రస్థాయికి పంపిన ప్రభుత్వం.. ఆదాయం ఎక్కువగా వచ్చే 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు కోరింది. హైదరాబాద్, రంగారెడ్డి నుంచే ఎక్కువ ఆదాయం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా వస్తుంటుంది. మొత్తం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60–70 శాతం ఆదాయం ఇక్కడినుంచే వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి (ఆర్వో), గండిపేట, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, వరంగల్, మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఎస్సార్నగర్, చంపాపేట, ఆజంపుర. నారపల్లి, సరూర్నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభనగర్, కీసర, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల సహా 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు అడిగినట్టు సమాచారం.త్వరలోనే మంత్రి పొంగులేటి సమీక్ష రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువల సవరణ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడెక్కడ, ఏమేరకు విలువలు పెంచాలనే అంశంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. థర్డ్పార్టీ నివేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అటు స్టాంపుల శాఖ, ఇటు థర్డ్పార్టీ నివేదికను మదింపు చేసిన మంత్రి.. తాజా ప్రతిపాదనల కోసం ప్రత్యేక ఫార్మాట్ను పంపినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందగానే స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భూముల విలువల సవరణ ఫైలును సీఎం ఆమోదానికి పంపుతారని, ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే సవరించిన భూముల విలువలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రపంచ దేశాలతోనే పోటీ
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇందుకోసం అధునాతన పారిశ్రామిక విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని, దేశంలో నే 33% టీకాలు, బల్క్ డ్రగ్స్లో 43% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3 లక్షల 28 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. మంగళవారం శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న కొత్త ప్లాంట్కు మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జీనోమ్ వ్యాలీతో మంచి గుర్తింపు దేశంలో జీనోమ్ వ్యాలీలోనే టీకాల ఉత్తత్తి జరుగుతోందని, జీనోమ్ వ్యాలీ తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకొచి్చందని రేవంత్రెడ్డి చెప్పారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచి ప్రపంచ దేశాలకు టీకాను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తోందని, నూతన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోందని, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భూమిపూజ చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రులు వివేక్, శ్రీధర్బాబు తదితరులు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా తెలంగాణ: మంత్రి శ్రీధర్బాబు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ఐకార్ రూపంలో మరో అడుగు ముందుకు పడిందని, కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. హైదరాబాద్–నాగ్పూర్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజెస్ను అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి వివేక్ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. అధిక ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగాన్ని తగ్గించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కువ పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
విమానం ఇంజన్ల షట్డౌన్ ఘటనలు.. ఐదేళ్లలో 65
హైదరాబాద్: అహ్మదాబాద్ ఘటన అనంతరం విమాన ప్రమాదాలకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో విమానాల ఇంజన్లు షట్డౌన్ అయిన ఘటనలు 65 నమోదవగా, ప్రమాదంలో ఉన్నామంటూ పైలట్లు కేవలం 17 నెలల వ్యవధిలోనే 11సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. ఇందులో అహ్మదాబాద్ ఘటన, ఇండిగో విమానాన్ని దారి మళ్లించిన ఘటనలను మినహాయించారు.సమాచార హక్కు చట్టం కింద టైమ్స్ ఆఫ్ ఇండియా పంపిన దరఖాస్తుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అందజేసిన సమాధానంలో ఈ వివరాలుండటం గమనార్హం. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం దుర్ఘటనకు ఇంజన్ ఫ్యూయల్ షట్డౌన్ కారణం కావచ్చునంటూ ప్రాథమిక నివేదిక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ వివరాలు విమాన ప్రయాణికులకు భయం పుట్టించేలా ఉన్నాయి. మెరుగ్గా లేని భారత్ రికార్డు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానయాన సంస్థల్లో ఇంజిన్ లోపాల ఘటనలు నెలకు కనీసం ఒకటి చొప్పున నమోదవుతున్నాయి. ఎయిరిండియా డ్రీమ్లైనర్ ఘటన ఇందుకు తాజా ఉదాహరణగా డీజీసీఏ పేర్కొంది. గడిచిన ఐదేళ్లు 2020–2025 మధ్య కాలంలో సంభవించిన ఇంజన్ షట్డౌన్ ఘటనల్లో టేకాఫ్తోపాటు ఆకాశంలో ఉన్న సమయంలోనూ జరిగినవి ఉన్నాయంది. అయితే, చాలా సందర్భాల్లో పైలట్లు పనిచేసే ఒక్క ఇంజన్తోనే విమానాలను దగ్గర్లోని ఎయిర్పోర్టుల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారని తెలిపింది.టర్బయిన్ పనిచేయకపోవడం నుంచి ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాల్లో లోపాల వరకు అన్ని సాంకేతిక అంశాలను కలిపి నిపుణులు ఇంజన్ షట్డౌన్గా పేర్కొంటున్నారని డీజీసీఏ వివరించింది. 2024 జనవరి 1–2025 మే 31 మధ్య కాలంలో ప్రమాదంలో ఉన్నామంటూ పైలట్లు కాల్ చేసిన ఘటనలు 11 నమోదయ్యాయని, ఇందులో సాంకేతికలోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్కు సాయం కోరడం వంటివి ఉన్నాయని డీజీసీఏ పేర్కొంది.ఈ 11 విమానాల్లో నాలుగు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండయ్యాయంది. ప్ర మాదంలో ఉన్నామంటూ పంపే సంకేతాలు (మేడే కాల్స్) సర్వసాధారణంగా జరుగుతుండేవేనని నిపుణులు అంటున్నారు. అయి తే, ఇందులో భారత్కు ఏమంత సంతృప్తికరమైన రికార్డులేదని పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన జాబితాలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. -
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్గా, జెడ్పీపీ చైర్మన్ రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. స్థానాల సంఖ్యపై స్పష్టత! రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్లు 566, జిల్లా పరిషత్లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)–(మేడ్చల్ జిల్లా పరిషత్ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం. -
బనకచర్ల వద్దు.. తెలంగాణ సర్కారు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్ ప్రస్తావించారు. బనకచర్లే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణా బేసిన్లోని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది.. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే.. ⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి క్లియరెన్స్లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు. ⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది. ⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు? ⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది. అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి ⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి. ⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980 ఏప్రిల్ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ⇒ గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది. చర్చకు పెడితే బాయ్కాట్! కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు పంపిన రామచందర్రావు
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన అంశంపై తనపై వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్కపై లీగల్గా చర్యలు తీసుకునే క్రమంలో నోటీసులు పంపించారు రామచందర్రావు. తన అడ్వకేట్ విజయ్ కాంత్తో నోటీసుల పంపించారు రామచందర్రావు. బేషరుతగా మూడు రోజుల్లో భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రోజల్లో క్షమాపణ చెప్పని పక్షంలో రూ. 25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటీసుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు.హెచ్సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణమంటూ వ్యాఖ్యానించారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారని. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించారు. -
వివాదంలో బరాజ్ల పునరుద్ధరణ డిజైన్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ చర్యలకి అవసరమైన డిజైన్ల తయారీకి నైపుణ్యం తమకు లేదని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్(సీఈసీడీఓ) విభాగం చేతులెత్తేయడం పట్ల ఆ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘బరాజ్ల నిర్మాణానికి డిజైన్లను సీఈ సీడీఓనే తయారు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకి శాఖలో సర్వోన్నత విభాగం సీఈ సీడీఓ. విభాగం సేవలు అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోకుండా బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్ల తయారీని నిపుణులు/అత్యుత్తమ సంస్థలు/పరిశోధన విభాగాలకు అప్పగించాలని ఎలా కోరుతుంది?’ అని నీటిపారుదల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫారసుల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్లను తయారు చేసే బాధ్యతకు సీఈ సీడీఓ విభాగం కట్టుబడి ఉండాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. శాఖలో డిజైన్ల తయారీకి నోడల్ ఏజెన్సీ కావడంతో ఈ బాధ్యతల నుంచి సీఈ సీడీఓ తప్పించుకోలేదని స్పష్టం చేసింది. అవసరమైతే సంబంధిత అంశాల నిపుణులు, సాంకేతిక సంస్థలను సంప్రదించి డిజైన్లు సరిగ్గానే ఉన్నట్టు ధ్రువీకరించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) తాజాగా సీఈఓ సీడీఓకు లేఖ రాశారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడిన విషయం తెలిసిందే. బరాజ్లలోని లోపాలపై అధ్యయనం జరిపిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదికను గత ఏప్రిల్ 24న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా బరాజ్లలోని లోపాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించి వాటి ద్వారా అందే సమాచారం ఆధారంగా ఆయా బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్ను రూపొందించాల్సి ఉంది.నిపుణుల కమిటీ నివేదిక అంది రెండు నెలలు గడిచినా బరాజ్ల పునరుద్ధరణ చర్యల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీఈ సీడీఓ తమ ఇంజనీర్లతో లేదా అత్యున్నత సంస్థల సహాయంతో బరాజ్ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తాజాగా ఈఎన్సీ(జనరల్) లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకి అవసరమైన డిజైన్ల ఆమోదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా నిర్దిష్ట గడువులు విధించుకుని ఈ పనులు పూర్తి చేయాలని సీఈ సీడీఓను ఆదేశించారు. డిజైన్ల తయారీకి అవసరమైన సాంకేతికసహాయం కోసం మరింత జాప్యం చేయకుండా తక్షణమే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించాలని స్పష్టం చేశారు.బరాజ్ల డిజైన్లలో లోపాలను ఎత్తిచూపి వాటికి పరిష్కారాలను ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన నేపథ్యంలో ఆలోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత సీఈ సీడీఓ విభాగానికే ఉందని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఇతర సంస్థలపై డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీ బాధ్యతను తోసేయడానికి సీఈ సీడీఓ విభాగం కన్సల్టెంట్ కాదని, నీటిపారుదల శాఖలో అంతర్భాగమని గుర్తు చేసింది.అలా అనడం అనుచితం..బరాజ్ల డిజైన్లలో లోపాలను సరిదిద్దడానికి/ వాటి పునరుద్ధరణకి అవసరమైన ఇన్వెస్టిగేషన్లు నిర్వహణ, డిజైన్ల తయారీకి తమ సొంత నైపుణాన్ని వాడడానికి బదులుగా ఇలాంటి చర్యల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన అత్యున్నత సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహా్వనించాలని కోరుతూ సీఈ సీడీఓ లేఖ రాయడాన్ని నీటిపారుదల శాఖ అనుచితమని అభివర్ణించింది. ఒక వేళ నిపుణుల సహాయం అవసరమని భావిస్తే స్వయంగా చొరవ తీసుకుని ప్రపంచ స్థాయి నైపుణ్యం గల సంస్థలను నేరుగా సంప్రదించి తగిన సిఫారసులతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన బాధ్యత సీఈ సీడీఓపై ఉందని గుర్తు చేసింది. బరాజ్ల పునరుద్ధరణ విషయంలో సంస్థల నైపుణ్యాన్ని నిర్థారించే పరిజ్ఞానం సీఈ సీడీఓకే ఉంటుందని స్పష్టం చేసింది. ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానించి డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేయడం, వాటికి డిజైన్ల తయారీ అప్పగించడం, ఆ సంస్థలు ఇచ్చే డిజైన్లను ఆమోదించడం కోసం ఎంత సమయం పడుతుందో సీఈ సీడీఓ తెలియజేయలేదని తప్పుబట్టింది.ఏడాదిగా కోరుతున్నా నామమాత్రంగా స్పందనబరాజ్లలోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకి డిజైన్లు తయారు చేయాలని 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ 9 లేఖలు రాయగా, వాటికి సీఈ సీడీఓ నామమాత్రంగానే స్పందించిందని నీటిపారుదల శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఈ సీడీఓతో శాఖ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన 20కి పైగా లేఖలను రిఫరెన్స్గా పొందుపరిచింది. ఒక్కో లేఖలో శాఖ ఏం కోరింది? సీఈ సీడీఓ ఏం సమాధానం ఇచ్చింది? అనే విషయాలను తాజా లేఖలో పొందుపరిచి సీఈ సీడీఓ స్పందించిన తీరు బాగా లేదని తప్పుబట్టింది. -
TG: గవర్నర్ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి సంబంధించిన ఫైల్ను గవర్నర్ వద్దక పంపింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆర్డెనెన్స్ ఫైల్ను మంగళవారం(జూలై 15వ తేదీ) మంత్రి, సీఎం సంతకం చేసి రాజ్భవన్కు పంపింది ప్రభుత్వం. 285(A) సెక్షన్ లో సవరణ చేస్తూ ముసాయిదాను రాజ్ భవన్కు పంపారు. ఎటువంటి లీగల్ చిక్కులు రాకండా ముసాయిదా డ్రాఫ్డ్ను గవర్నర్కు పంపించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు డెడ్లైన్ విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకు రావడానికి యత్నాలు చేస్తోంది ప్రభుత్వం. -
హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో చోటు చేసుకున్న పరిణామాలపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్సీఏ అవినీతి సర్వసాధారణం అయ్యిందన్న ఆయన.. తాను ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేనని అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..‘‘రూల్స్ పాటించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయ్. హెచ్సీఏలో చాలా సమస్యలున్నాయ్. అసోషియేషన్ అనేది ఎప్పుడూ స్వలాభంతో నడవకూడదు. ఫోర్జరీ చేసినందుకే ప్రస్తుత ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యాడు. కాబట్టి, ఇప్పటివరకు జరిగిన అవకతవకలు బయటకి తీయాలి. హెచ్సీఏలో జరుగుతున్న పరిణామాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి. హెచ్సీఏ సభ్యులు, కోచ్ల పిల్లలనే క్రికెట్ ఆడిస్తున్నారు. సెలక్టర్లలో కూడా అవినీతి ఉంది. మొత్తంగా అవినీతి అనేది కామన్గా మారింది. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తా. జూబ్లీహిల్స్ రేసులో నేను కూడా ఉన్నాను. హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పోటీ చేయడమే నా ముఖ్య లక్ష్యం’’ అని అజారుద్దీన్ కుండబద్ధలు కొట్టారు. -
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. -
జాతీయ రహదారిపై యువ జంట హల్చల్
హైదరాబాద్: రాజేంద్రనగర్ బెంగుళూర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి యువ జంట హల్చల్ చేసింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను వెనుక వెళుతున్న ఓ వాహనదారుడు చిత్రీకరించి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్.రాజు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆదివారం అర్ధరాత్రి బెంగుళూర్ జాతీయ రహదారి అయిన ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ప్రాంతంలోని ప్లై ఓవర్ గుండా ద్విచక్ర వాహనంపై యువతీ, యువకుడు ఆరాంఘర్ చౌరస్తా మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వాహన నంబర్ ఆధారంగా మోటార్ రవాణా చట్టం నిబంధన మేరకు ఫైన్ విధించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... వాహన నంబర్ ఆధారంగా సదరు యువకుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అతడిని స్టేషన్కు రప్పించి వాహనం ఎవరిది.. వాహనం నడిపిన యువకుడికి లైసెన్స్ ఉందా తదితర విషయాలను విచారించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్స్కి ఏమైంది..?
సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి.సాధారణంగా స్పోర్ట్స్ స్టార్స్కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్ స్టార్ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.నాటి ఒక యువ టాలీవుడ్ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్ అజారుద్దీన్ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. -
ఏసీబీ అదుపులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్లోని ఆయన నివాసంలొ ఏసీబీ అదుపులోకి తీసుకుంది.ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ కరీంనగర్, జహీరాబాద్.. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. -
హైదరాబాద్: పార్క్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాకర్స్పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్ చేస్తున్న సమయంలో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.చందు నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్లో ఉన్న బుల్లెట్స్ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు. -
తాళం వేసిన ఇంట్లో అస్థిపంజరం
నాంపల్లి: తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం లభ్యమైన సంఘటన హబీబ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చాంశనీయంగా మారింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా బాల్ తాళం వేసి ఉన్న ఇంట్లో పడింది. దీంతో ఓ యువకుడు బాల్ తీసుకువచ్చేందుకు ఇంటి వెనుకవైపు ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన అతడికి రిఫ్రిజిరేటర్ ఎదుట అస్థి పంజరం కనిపించిది. అస్థి పంజరం చుట్టూ ఉన్న వస్తువులకు బూజు పట్టి ఉన్నాయి.ఈ దృశ్యాన్ని అతను సెల్ఫోన్లో రికార్డు చేయడమేగాక సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. దీనిపై సమాచారం అందడంతో ఆసిఫ్నగర్ ఏసీపీ బి.కిరణ్కుమార్, హబీబ్నగర్ ఇన్స్పెక్టర్ టి.పురుషోత్తమ్ రావు తదితరులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. అస్థిపంజరం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొన్నేళ్ల క్రితమే అతను మృతి చెంది ఉండవచ్చున భాస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సదరు ఇంటికి సంబంధించిన వ్యక్తులను ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కు రప్పించే ప్రయత్నంలో చేశారు. కుటుంబ సభ్యుల లెక్క తేలితేనే.. సదరు ఇంట్లో మునీర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. ఆయనకు పది మంది సంతానం. వీరిలో ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెలు. కరోనా కంటే ముందు అందరూ కలిసే ఉన్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడంతో వారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముర్గీ మార్కెట్లోని సదరు ఇంట్లో పెళ్లికాని సోదరుడు అమీర్ ఉన్నట్లుగా పోలీసులు చెబున్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మాటలు లేకపోవడంతో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని నెలకొంది. ఆ తర్వాత ఏవరూ నాంపల్లికి వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కేసును చేధించేందుకు పోలీసులు కుటుంబ సభ్యులందరినీ స్టేషన్కు రప్పించే ప్రయత్నం చేయగా కేవలం ఇద్దరు మాత్రమే పీఎస్కు వచ్చారు. మిగతా వారందరూ పోలీసులకు సహకరించడం లేదని తెలిసింది. మరికొరందరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రావడం లేదు. దీంతో అస్థి పంజరం ఎవరనేది తేల్చడం పోలీసులకు కష్టంగా మారింది. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటాడని స్థానికులు చెబుతుండగా..పాత బస్తీలోనే ఉన్నారంటూ బంధువులు, పోలీసులు చెబుతున్నారు. పెళ్లి, ఆస్తి కోసం గొడవ పడిన అమీర్ ఖాన్ను ఎవరైనా హత్య చేసి తాళం వేశారా? లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మునీర్ కుటుంబ సభ్యులందరూ ఒకే చోటకు వస్తే కానీ ఈ కేసు చిక్కు ముడి వీడేలా లేదు. -
జల వివాదాలపై కేంద్రం దృష్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ నెల 16న మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు.. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ భేటీలో చర్చించడానికి రెండు రాష్ట్రాలూ తమ ఎజెండా అంశాలను తక్షణమే పంపించాలని కోరారు. సీఎంలతో పాటు సమావేశానికి రానున్న ప్రతినిధి బృందాల వివరాలను కూడా పంపించాలని సూచించారు. తెలంగాణ వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడికృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. కృష్ణా బేసిన్లోని రాష్ట్ర ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్సు ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. 16న ఢిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్ర నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ‘కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటి వాటాల సాధించడంలో దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడింది. కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది..’ అని సీఎం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. -
హ్యామ్ పద్ధతిలో ఉత్తర రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం రోడ్డు నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. తొలుత దీన్ని ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా హ్యామ్ వైపు మొగ్గు చూపింది. ఈ పద్ధతిలో ప్రభుత్వం నిర్మాణానికయ్యే ఖర్చును ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన అవ సరం ఉండదు. నిర్మాణ సంస్థకు విడతల వారీగా చెల్లించే వీలుంటుంది. ఖజానాపై భారం పడకుండా వెసులుబాటు లభిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉంటుందని తేలడంతో.. ఉత్తర భాగాన్ని (162 కి.మీ) చేపట్టేందుకు మూడు నెలల క్రితం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. మొత్తం 8 లేన్లకు గాను తొలివిడతలో 4 వరసలుగా నిర్మించాలని టెండర్ డాక్యుమెంటులో పేర్కొంది. ఈ రోడ్డు మీద టోల్ ఆదాయం తక్కువగా ఉంటుందనే అంచనాతో కాంట్రాక్టర్లు ఈపీసీ పద్ధతిలో పని చేపట్టేందుకే ముందుకొస్తారని ఎన్హెచ్ఏఐ భావించింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. పనులు జరిగేకొద్దీ ఎప్పటికప్పుడు అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థకు విడుదల చేయాల్సి ఉంటుంది. నిధుల విడుదల నిలిచిపోతే పనులు కూడా ఆగిపోతాయి. అయితే పీఎం గతిశక్తిలోని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఈ ప్రాజెక్టుపై సమీక్షించి ఆర్ఆర్ఆర్ వల్ల ఆయా ప్రాంతాల్లో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నందున, ఆ రోడ్డుపై వాహనాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని, దీనివల్ల టోల్ ఆదాయం కూడా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. రోడ్డును 4 వరసలుగా కాకుండా, తొలి దశలోనే 6 వరసలతో నిర్మించాలని సూచించింది. ఈ మేరకు మరోసారి ట్రాఫిక్ స్టడీ నిర్వహించాలని పేర్కొంది. కాగా భవిష్యత్తులో వాహనాల సంఖ్య భారీగా ఉండనుందని ట్రాఫిక్ స్టడీ తేల్చింది. దీంతో 6 వరసల రోడ్డు, 8 వరసలతో వంతెనలు నిర్మించాలని కేంద్రానికి ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. తాజాగా దానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపింది. ఈపీసీ పద్ధతిలో కాకుండా, హ్యామ్ మోడల్లో రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం చేసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో పాత టెండర్ డాక్యుమెంట్ను మార్చి ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశించింది. హ్యామ్తో ఇదీ వెసులుబాటు.. హ్యామ్ మోడల్లో ప్రభుత్వం మొత్తం నిర్మాణ వ్యయంలో తొలుత 40 శాతం మాత్రమే భరిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ బ్యాంకుల నుంచి రుణం ద్వారా సమకూర్చుకుంటుంది. సొంత ఆర్థిక వనరులుంటే రుణంతో సంబంధం లేకుండా కూడా ఖర్చు చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 15 ఏళ్ల సమయం (ఒప్పందంలో పేర్కొనే గడువు)లో ప్రభుత్వం వడ్దీతో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తుంది. అంతకాలం రోడ్డు నిర్వహణ బాధ్యతను ఆ సంస్థనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇక రోడ్డుపై టోల్వసూలు చేసే బాధ్యతను మరో టెండర్ ద్వారా ఇంకో సంస్థకు అప్పగిస్తుంది. త్వరలో రోడ్డుకు నంబర్.. ఈ రోడ్డును చేపట్టాలంటే దానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర అవసరం. రోడ్డు పనులకు ఆయ్యే వ్యయం వివరాలను సమీక్షించి, ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కమిటీ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అప్పుడే ఆ రోడ్డుకు జాతీయ రహదారి నంబరు కేటాయిస్తుంది. ఆ తర్వాత టెండర్ తెరిచి నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుంటారు. ఈ వారంలో కమిటీ సమావేశం జరగనున్నట్టు తెలిసింది. అందుకు వీలుగా ఎన్హెచ్ఏఐ నివేదిక సిద్ధం చేస్తోంది. -
‘ఇచ్చంపల్లి’కి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాల్సిందిగా గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సైతం కేంద్రం నిధులు సమకూర్చాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ ఈ మేరకు లేఖ రాశారు. జాతీయ నదుల అనుసంధానం విధానంలో భాగంగా ప్రతిపాదించిన గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి 148 టీఎంసీలను బదిలీ చేయాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనను ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం తెలంగాణకు కేటాయించాలని ఎన్డబ్ల్యూడీఏ 2024 మార్చిలో లేఖ రాసిందని తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడంతో పాటు అనుమతులు జారీ చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని వివాదాలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ⇒ శ్రీశైలం జలాశయం అట్టడుగు స్థాయి నుంచి బేసిన్ వెలుపలి ప్రాంతాలకు రోజుకు 10 టీఎంసీలు చొప్పున 20 రోజుల్లో 200 టీఎంసీల జలాలను అక్రమంగా మళ్లించేందుకు ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో జల విద్యుదుత్పత్తిపై దుష్ప్రభావం పడటంతో పాటు తెలంగాణలోని నాగార్జునసాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు అనుసంధానమై ఉన్న శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 89 వేల క్యూసెక్కులకు పెంచుకున్న ఏపీ.. తాజాగా దానిని 1.5 లక్షలకు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శ్రీశైలం 841 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలను మళ్లించేలా కాల్వల నిర్మాణాలు చేపట్టింది. ఎన్జీటీ స్టేను ఉల్లంఘించి 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లేందుకు రాయలసీమ ఎత్తిపోతలు, ముచ్చుమర్రి, మల్యాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ త్వరగా పూర్తి చేయాలి ⇒ 1979లో ఎస్ఎల్బీసీ, 1984లో కల్వకుర్తి, 1997లో నెట్టెంపాడు, 2013లో పాలమూరు–రంగారెడ్డి, 2007లో డిండి, 2005లో కొల్లాపూర్, 2014లో నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం చేపట్టిన ఈ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ త్వరగా పూర్తి కావాలి. ⇒ నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసీన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్ఎంబీ అడ్డుకోవాలి. ⇒ శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రమాదకరంగా మారింది. డ్యామ్ భద్రత, నిరంతర కార్యకలాపాలు, జల విద్యుత్తు ఉత్పత్తి, నీటిపారుదల అవసరాలు, తాగునీటి సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలి. ⇒ గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాలో నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీలను సర్దుబాటు చేయాలి. ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలి. జాతీయ ప్రాజెక్టుగా డిండి ⇒ పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల డీపీఆర్లకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) క్లియరెన్సుతో పాటు పర్యావరణ అనుమతులు జారీ చేయాలి. ⇒ 2007లోనే డిండి ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని పీఎంఓ 2010 డిసెంబర్ 10వ తేదీన ప్రతిపాదించింది. ⇒ 2021 సెపె్టంబర్ 21న సీడబ్ల్యూసీకి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ సమరి్పంచాం. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్వోసీ లేక అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతోంది. ఛత్తీస్గఢ్ నిబంధనల ప్రకారం అక్కడి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తాం. ముంపుపై ఖరగ్పూర్ ఐఐటీ సిఫారసుల అమలుకు కట్టుబడి ఉన్నాం. -
2050 నాటికి 640 కి.మీ. మెట్రో
సాక్షి, హైదరాబాద్: వచ్చే 25 ఏళ్లలో అంటే 2050 నాటికి 640 కి.మీ. వరకు మెట్రోరైల్ విస్తరణ చేపట్టాలని లీ అసోసియేట్స్ అధ్యయన సంస్థ ప్రతిపాదించింది. అప్పటివరకు హైదరాబాద్ మహానగర జనాభా 3.5 కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీంతో సుమారు 65 లక్షల మందికి పైగా మెట్రోసేవలను వినియోగించుకుంటారని పేర్కొంది. భవిష్యత్ ప్రజారవాణా అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణ ఎంతో కీలకమని ఈ సంస్థ స్పష్టం చేసింది. 2050 నాటికి నాలుగు దశలుగా విస్తరణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది.రీజనల్ రింగ్రోడ్డు వరకు హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించిన నేపథ్యంలో ఇందుకనుగుణంగా అన్నివైపులా కనెక్టివిటీని పెంచాల్సి ఉంది. సమగ్ర మాస్టర్ప్లాన్–2050లో భాగంగా ప్రభుత్వం సమగ్ర రవాణా ప్రణాళికపై లీ అసోసియేట్స్ను కన్సల్టెన్సీగా నియమించింది. రోడ్లు, రవాణా సదుపాయాలు, ఎంఎంటీఎస్తోపాటు మెట్రో సేవల విస్తరణపై ఈ సంస్థ ప్రధానంగా అధ్యయనం చేస్తోంది. ఇప్పుడు రెండో దశలో 8 మార్గాల్లో మెట్రో విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇది 2030 నాటికి వినియోగంలోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు చేరనుంది.మూడో దశలో 2040 నాటికి పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 340 కి.మీ. వరకు విస్తరించాల్సి ఉందని అంచనా వేసింది. మూడో దశ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికులు 35 లక్షలు దాటొచ్చునని అంచనా. ఇలా 2050 నాటికి 640కి.మీ వరకు మెట్రో మార్గాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంస్థ సెప్టెంబర్లో తుది నివేదికను సమరి్పంచనుంది. రెండో దశ పూర్తయితే 231.5 కి.మీ. ప్రస్తుతం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ వల్ల కొత్తగా 162.5 కి.మీ. వరకు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రజారవాణాలో మెట్రోరైల్ మాత్రమే కీలకమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వి కారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేసేందుకు ప్రభుత్వం క్రిసిల్ ప్రైవే ట్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. ఈ సంస్థ త్వరలో దీనిపై నివేదికను అందజేయనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 35ఆర్థిక మండ లాలు, లాజిస్టిక్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. ప్రపంచంలోని టాప్–10 నగరాల సరసన హైదరాబాద్ను నిలబెట్టేందుకు అమలు చేయాల్సిన భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై క్రిసిల్ నివేదికను ఇవ్వనుంది. -
ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు.. ఇటు
సాక్షి, హైదరాబాద్: మాక్ సీట్ల కేటాయింపు తర్వాత ఇంజనీరింగ్ ఆప్షన్లు వేగంగా కదులుతున్నాయి. ఆప్షన్ల జోడింపు.. తొలగింపుతో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాక్ కేటాయింపునకు ముందు విద్యార్థుల నుంచి 56,63,308 వెబ్ ఆప్షన్లు రాగా.. సోమవారం మరో లక్ష పెరిగాయి. మళ్లీ మధ్యాహా్ననికి 30 వేలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్లు ఇవ్వడంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురవుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆప్షన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఉన్న ఆప్షన్లు తీసేయడం, కొత్తవి పెట్టడం చేస్తున్నారు.మరోవైపు మంచి ర్యాంకు ఉండీ సీటు రాని విద్యార్థులు కూడా అప్రమత్తమయ్యారు. ఆప్షన్లు ఇచ్చినా సీటు రాని వారు 16,905 మంది ఉన్నారు. వీళ్లంతా మాక్ కేటాయింపునకు ముందు ఐదుకు మించి బ్రాంచీలను సెలెక్ట్ చేయలేదు. పది కాలేజీలకు మించి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో మాక్లో సీటు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం వీళ్లంతా పెద్దఎత్తున ఆప్షన్లు ఇచ్చారు. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాక్లో 5 వేల ర్యాంకు కటాఫ్ ఉన్న కాలేజీల్లో రెండు, మూడు బ్రాంచీలకు ఆప్షన్లు ఇస్తున్నారు. రెండో ప్రాధాన్యత కీలకం మంచి కాలేజీ, మంచి బ్రాంచీ వచ్చిన విద్యార్థులు కొంత అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 18న వెల్లడించే సీట్ల కేటాయింపునకు ర్యాంకర్లు రంగంలోకి వచ్చే వీలుంది. సీట్లు రాని 16,905 మంది 10 వేల లోపు వచ్చిన అన్ని కాలేజీలపైనా ప్రభావం చూపిస్తారు. దీంతో 25 వేల ర్యాంకుతో సీటు వచ్చిన విద్యార్థి సీటు మారే అవకాశం ఉంది. కాబట్టి 20 వేలపైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండో ఆప్షన్ను జాగ్రత్తగా చూసిపెట్టాలి. తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనేది గుర్తించాలి. దీనికోసం గత ఏడాది సీట్ల కేటాయింపును కొలమానంగా తీసుకోవాలి. పోటీ లేకుంటే మాక్లో వచ్చిన సీటే రావచ్చు. ఒకవేళ మంచి ర్యాంకర్లు పోటీకి వస్తే రెండో ప్రాధాన్యత ఇచ్చిన కాలేజీ, బ్రాంచీలో సీటు పొందే వీలుందని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ర్యాంకు ఉండే విద్యార్థులు ఇప్పుడున్న బ్రాంచీ, కాలేజీ కన్నా బెస్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటారు. కాబట్టి టాప్ 20 కాలేజీల్లో మార్పులు అనివార్యం. ఈ కారణంగా రెండో ప్రాధాన్యతకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రాంచీలైతే మార్పు అక్కర్లేదు సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో పెద్దగా ఆప్షన్లు మా ర్చాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. సివిల్లో 3,129 సీట్లున్నాయి. మాక్ తర్వాత ఈ బ్రాంచీ విద్యార్థుల్లో కొంతమంది కాలేజీ, బ్రాంచీ మార్చుకుంటారు. కాబట్టి ఇదే బ్రాంచీలో ఆసక్తి ఉంటే, మంచికాలేజీ వచ్చినప్పుడు మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఐటీ బ్రాంచీలోనూ 3,681 సీట్లు ఉన్నాయి. మాక్ కేటాయింపులో వచ్చిన సీటు పక్కాగా వచ్చే వీలుందని అధికారులు అంటున్నారు. ఈఈఈ, మెకానికల్లోనూ పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే, సీఎస్సీ, ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లో పోటీ ఎక్కువగా ఉంది. మంచి ర్యాంకు లేకున్నా, ఈ కోర్సుల్లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీ, బ్రాంచీల ప్రాధాన్యతకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.ఆప్షన్లు పెంచుకున్నానునాకు ఎప్సెట్లో 2 వేల ర్యాంకు వచ్చింది. పక్కా గా సీటు వస్తుందని తక్కువ ఆప్షన్లు ఇచ్చాను. కానీ మాక్ కేటాయింపులో సీటు రాలేదు. దీంతో ఇప్పుడు 35 కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చాను. మాక్ వల్ల మేలే జరిగింది. నేను ఇచ్చిన ఆప్షన్లన్నీ సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులకే. టాప్ కాలేజీలో కోరుకున్న సీటు వస్తుందనే నమ్మకం ఉంది. – సి.సంజన సుప్రియ (హైదరాబాద్ విద్యార్థిని) అయినా... అప్రమత్తమయ్యామాక్ కేటాయింపులో టాప్ 20 కాలేజీల్లో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. గత ఏడాది కేటాయింపును పరిశీలిస్తే టాప్ 22లో ఉన్న కాలేజీలో నాకొచ్చిన ర్యాంకుకు సీటు వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు, మూడో ప్రాధాన్యతలు మార్చుకున్నా. ఇప్పుడొచ్చిన కాలేజీలో రాకున్నా, వేరే కాలేజీలో సీటు వస్తుందని భావిస్తున్నాను. – వి.శివ నాగేశ్వర్ (ఖమ్మం విద్యార్థి) -
ఆచితూచి 42% ఉత్తర్వులు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి ముందుకెళుతోంది. ఇటీవల మంత్రిమండలి ఆమోదించి పంపిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న అంచనాతో.. తదుపరి ప్రక్రియలో భాగంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశలో అడుగులు వేస్తోంది. ఈ జీవో రూపకల్పన కోసం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ చట్టం–2018కి చేసిన సవరణ, ఈ మేరకు ఆమోదించిన ఆర్డినెన్స్, నూతన మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ సమర్పించే నివేదికలను ఆధారంగా చేసుకోనుంది. ఆర్డినెన్స్కు మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త విధివిధానాలతో మరో నివేదిక ఇవ్వాలని డెడికేటెడ్ కమిషన్ను కోరిన ప్రభుత్వం.. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా జీవో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆర్డినెన్స్ను, కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285 (ఏ)కు చేసిన సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చు అని మాత్రమే ఆర్డినెన్సులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్డినెన్సుతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంటారని చెబుతున్నాయి. ఈ జీవో మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దఖలు పడతాయని వివరిన్నాయి. చట్టానికి చేసిన సవరణే ప్రాతిపదికగా జీవో ప్రభుత్వం జీవో విడుదల చేసే జీవో న్యాయ సమీక్షలోనూ నిలబడే విధంగా అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వివరణాత్మకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేందుకు పంచాయతీ రాజ్ చట్టానికి చేసిన సవరణనే ఈ జీవోకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు స్థాయి, జనాభాకు తగిన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికన చట్టాన్ని సవరించామని, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పేర్కొంటూ రిజర్వేషన్ల పెంపును సమర్థించే కోణంలో జీవోకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. -
తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ ఏకే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇందులోభాగంగా తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఎన్న డూ లేనివిధంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తోనే 6 నెలలుగా తెలంగాణ హైకోర్టు కొనసాగింది. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన విషయం తెలిసిందే. నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది. ఎట్టకేలకు పూర్తిస్థాయి సీజేను నియమించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఏకే సింగ్.. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్ర రావుని త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దేశంలో ఐదుగురు న్యాయమూర్తులు సీజేలుగా నియమితులవగా, నలుగురు సీజేలను ఇతర హైకోర్టులకు బదిలీ చేశారు. ఈ మేరకు మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఏడో సీజేగా..: జస్టిస్ ఏకే సింగ్ 1965, జూలై 7న జన్మించారు. బీఏ ఆనర్స్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 వరకు అక్కడ న్యాయవాదిగా పనిచేసి.. 2001లో జార్ఖండ్ హైకోర్టుకు మారారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2023, ఏప్రిల్ 17న ప్రధాన న్యాయమూర్తి పదోన్నతితో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ వారంలో తెలంగాణ హైకోర్టు 7వ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. కోల్కతాకు జస్టిస్ సుజోయ్పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సుజోయ్పాల్ను కోల్కతాకు, జస్టిస్ తడకమళ్ల వినోద్కుమార్ను మద్రాస్కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ఇద్దరి బదిలీ, ఒకరి రాకతో ఈ సంఖ్య 25కు చేరనుంది. మొత్తం 42 మందికిగాను ఇంకా 17 ఖాళీలుంటాయి. సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అభిõÙక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. అలాగే న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్ నియామకాలకు కూడా కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. -
పల్లె బడిలో ఏఐ పాఠాలు
పట్టణాలు, నగరాలకు దీటుగా కృత్రిమ మేధస్సు (ఏఐ –ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సాంకేతిక బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు సమానస్థాయిలో ఆధునిక బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ టీ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడంతో ఉపాధ్యాయులు ఏఐ ఆధారంగా చదువు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు అదనపు సమాచారం అందించి వారి మేధకు పదును పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ ఇందుకు వేదికైంది. – ముత్తారం (మంథని)మద్రాస్–ఐఐటీ నుంచి కోర్సు!స్థానిక ఉపాధ్యాయులకు గూగుల్తో ఏఐ బోధనలో శిక్షణకు ఇప్పించేందుకు టీ–ఫైబర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మద్రాస్ ఐఐటీ కళాశాల నుంచి కోర్సు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. టీ ఫైబర్ బృందం సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రచారం చేయడంతో అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పర్ఫ్లెక్సిటీ ఏఐ కో–¸ûండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ఉచిత ఏఐ టూల్ను వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం మెరుగుపర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ మార్పురావడం గొప్పవిషయమని చెప్పారు.పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాలు.. టీ–ఫైబర్, పయనీర్ ఈల్యాబ్స్ కంపెనీ భాగస్వామ్యంతో పల్లెల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు జెడ్పీ హైస్కూళ్లను దీని కింద ఎంపిక చేసింది. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో టీ–ఫైబర్ నెట్ నిర్వాహకులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి రెండు మానిటర్లు ఇవ్వగా.. ప్రభుత్వం ఇటీవల మరోమూడు కేటాయించింది. గత జూన్లో ఏఐ ఆధారిత పర్ప్లెక్సిటీ టూల్స్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక బోధన ప్రారంభించారు. కార్పొరేట్కు దీటుగాఏఐ, పర్ప్లెక్సిటీ టూల్ సాయంతో బోధన ప్రారంభించాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పల్లె పాఠశాలలో ఆధునిక విద్య ఇస్తుండటంతో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఏఐ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మరో 20 కంప్యూటర్లు, మైక్రోఫోన్స్ అందిస్తే ఏఐ బోధన మరింత సులువవుతుంది. – ఇరుగురాల ఓదెలు, హెచ్ఎం, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్రక్తం ఎందుకు గడ్డ కట్టదుపర్ఫ్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకు గడ్డ కట్టదనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతంగా తెలుసుకున్నా. బయాలజీలో ఎర్ర, తెల్లరక్త కణాలు, కణ ఫలదీకరణ, నిర్మాణం, వాటి విధుల గురించి వివరంగా తెలుసుకున్నా. టీచర్ల బోధన తర్వాత అర్థం కాని విషయాలు, సందేహాలను పర్ప్లెక్సిటీ టూల్ నివృత్తి చేస్తోంది. – ఉప్పు మన్విత, తొమ్మిదో తరగతిగణితంలో అన్ని పద్ధతులుఏఐ టూల్తో విద్యార్థి శక్తిని అంచనావేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ యాప్లో గణితంలోని అన్ని పద్ధతులు పొందుపర్చడాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. చిత్రపటాలతో అర్థమయ్యే రీతిలో ఏఐ వివరిస్తోంది. – మార్త కోమలత, పదోతరగతిఉపయోగం తెలుసుకున్నాఏఐ పర్ప్లెక్సిటీలో నిక్ (ఆ్రస్టేలియాకు చెందిన ఈయన అరుదైన వ్యాధితో జని్మంచారు) గురించి సార్ను అడిగా. అంగవైకల్యం ఉన్నా.. విధిరాతను కూడా ఎలా మార్చుకోవచ్చో ఏఐ టూల్తో తెలుసుకున్నా. నిక్ చికెన్ లెగ్ను ఉపయోగించి నీటి గ్రావిటి బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి కూడా నేర్చుకున్నా. – చిగురు మధులాస్య, పదోతరగతి -
గ్రేటర్లో డెత్ జోన్లుగా మారుతున్న పైవంతెనలు
సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లు డెత్ జోన్లుగా మారుతున్నాయి. వాహనదారుల ప్రయాణ సమయాన్ని తగ్గించే పైవంతెనలు ప్రాణాలను తీసే ప్రమాదకారకాలుగా మారుతున్నాయి. 2023 జనవరి నుంచి 2025 మే మధ్య 28 నెలల కాలంలో గ్రేటర్లోని ఫ్లైఓవర్లపై 656 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో 126 మంది మృత్యువాత పడ్డారు. 504 మందికి గాయాలయ్యాయి.ఇంజినీరింగ్ లోపాలతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70కు పైగా ఫ్లైఓవర్లు (flyovers) ఉన్నాయి. రద్దీ లేని సమయాల్లో పైవంతెనలపై వాహనాల వేగం పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ.. ఫ్లైఓవర్లపై సరైన వీధిలైట్లు లేకపోవడం, రంబుల్డ్ స్ట్రిప్స్, బాటిల్ నెక్, వంపులు ఎక్కువగా ఉండటం వంటి ఇంజినీరింగ్ లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. అతివేగం, లైన్ క్రమశిక్షణ లేకపోవడం, పరధ్యానంలో వాహనాలు నడపటం వంటివి కూడా కారణాలేనని పేర్కొంటున్నారు.సీసీటీవీ కెమెరాలెక్కడ? ఫ్లైఓవర్లపై సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదాల కారణాలను విశ్లేషించలేకపోతున్నామని, కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సీసీటీవీ కెమెరాలు (CC Cameras) లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందో నిర్ధారించడం, ఎవరి తప్పు అనేది తేల్చడం పోలీసులకు సవాల్గా మారింది. వాహనం డ్యామేజ్, రోడ్డు స్కిడ్ అయిన తీరు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, క్షతగాత్రులకు గాయాలైన తీరు వంటి సంప్రదాయ పద్ధతులపై ఆధారపడాల్సి వస్తోంది. 2019లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై జరిగిన ఘోరమైన కారు ప్రమాద సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు హడావుడి చేశారు. ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనదారుల భద్రత దృష్ట్యా ఫ్లైఓవర్లపై సీసీటీవీ కెమెరాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.అత్యధికంగా సిటీ కమిషనరేట్లో.. గ్రేటర్లోని మూడు పోలీసు కమిషనరేట్లలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఫ్లై ఓవర్లపై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిటీ పరిధిలో 291 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 46 మంది మరణించగా, 234 మంది గాయాలపాలయ్యారు. సైబరాబాద్లో జరిగిన 228 ప్రమాదాల్లో 54 మంది మృత్యువాత పడగా, 162 మంది గాయపడ్డారు. రాచకొండలో జరిగిన 137 ప్రమాదాల్లో 26 మంది మరణించగా, 107 మందికి గాయాలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి నుంచి మే మధ్యకాలంలో సైబరాబాద్లో 56, హైదరాబాద్లో 49, రాచకొండలో 22 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.చదవండి: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ -
మరో కీలక నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి టాస్క్ఫోర్స్ను పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై టాస్్కఫోర్స్కు డీసీపీతో పాటు ఇద్దరు అదనపు డీసీపీలు ఉండనున్నారు. కొత్త అదనపు డీసీపీగా సీరియర్ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీని నియమించిన కొత్వాల్ ఆయనకు వెస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల బాధ్యతలు అప్పగించారు. ఒకప్పుడు నాలుగు.. ఇప్పుడు ఐదు. నగర కమిషనరేట్లో ఒకప్పుడు కేవలం నాలుగు జోన్లే ఉండేవి. ఆపై వీటి సంఖ్య ఐదుకు పెరిగింది. ప్రతి జోన్కు బాధ్యత వహిస్తూ ఓ టాస్్కఫోర్స్ బృందం ఉంటుంది. వీటన్నింటినికీ నాన్ క్యాడర్ లేదా అదనపు ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి డీసీపీగా నేతృత్వం వహిస్తుంటారు. ఈయనకు సహకరించడానికి ఓ అదనపు డీసీపీ పని చేస్తుండే వారు. అప్పట్లో జోన్ల సంఖ్య ఐదుకు పెరిగినప్పుడూ ఇదే విధానం కొనసాగించారు. డీసీపీపై ఉన్న పని ఒత్తిడిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు జోన్లను విభజించారు. వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లకు డీసీపీ నేతృత్వం వహించేలా, ఈస్ట్, సౌత్ జోన్లకు అదనపు డీసీపీ నేతృత్వం వహించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీసీపీ కార్యాలయం సికింద్రాబాద్లోనే కొనసాగిస్తూ అదనపు డీసీపీకి పాతబస్తీలోని పురానీ హవేలీలో ఏర్పాటు చేశారు. నగరంలో మాదకద్రవ్యాల వ్యతిరేక విభాగం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఏర్పడటంతో పాటు జోన్ల సంఖ్య ఏడుకు చేరింది. అయినప్పటికీ కొన్నాళ్లు సౌత్ ఈస్ట్, హెచ్–న్యూలు టాస్్కఫోర్స్ డీసీపీ అ«దీనంలోనే పని చేశాయి. ఆపై డీసీపీకి హెచ్–న్యూతో పాటు వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లను అప్పగించారు. సాంకేతిక కారణాలతో సౌత్ వెస్ట్ జోన్ను అదనపు డీసీపీగా అప్పటిస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టాస్్కఫోర్స్కు మరో అదనపు డీసీపీగా నియమించిన సీపీ ఆనంద్.. ఆయనకు వెస్ట్, సౌత్ వెస్ట్ టీమ్స్ను అప్పగించారు. కొత్త అదనపు డీసీపీగా సీసీఎస్ అదనపు డీసీపీగా ఉన్న ఇక్బాల్ సిద్ధిఖీని నియమించారు. కీలక బాధ్యతల్లో పని చేసిన సిద్ధిఖీ... నగర టాస్్కఫోర్స్ అదనపు డీసీపీగా నియమితులైన మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ ఇప్పటి వరకు అనేక కీలక బాధ్యతల్లో పని చేశారు. సిద్ధిఖీ ఎన్నికల ముందు వరకు పశి్చమ మండల అదనపు డీసీపీగా, ఎన్నికల తర్వాత సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీగా పని చేశారు. దీనికి ముందు ఆయన బంజారాహిల్స్ సహా కీలక ఠాణాలకు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించారు. ‘షోయబ్ మాలిక్–సానియా మీర్జా’ ఉదంతం చోటు చేసుకున్నప్పుడు సిద్ధఖీనే బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా ఉండి ఆ వ్యవహారాన్ని సమర్థంగా పర్యవేక్షించారు. ఈయనకు ఈస్ట్జోన్ టాస్్కఫోర్స్ టీమ్ సబ్–ఇన్స్పెక్టర్గా, సౌత్ జోన్ టాస్్కఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్గా పని చేసిన అనుభవం ఉంది. పాకిస్థాన్లో ముద్రితమైన రూ.500, రూ.1000 నకిలీ నోట్లు ఒకేసారి రూ.2.5 కోట్ల విలువైనవి చిక్కడం నగర పోలీసు చరిత్రలో రికార్డు. 2007 ఆగస్టు 25న పాతబస్తీలో ఈ నకిలీ నోట్లను టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో జరిగిన ఈ భారీ ఆపరేషన్కు సిద్ధిఖీనే నేతృత్వం వహించారు. అదే ఏడాది నగరంలో చోటు చేసుకున్న మక్కా మసీదులో బాంబు పేలుడు, గోకుల్చాట్– లుంబినీ పార్క్ల్లో జంట పేలుళ్ల కేసుల దర్యాప్తులోనూ ఇక్బాల్ సిద్ధిఖీ కీలకపాత్ర పోషించారు. సైబరాబాద్లో క్రైమ్స్–2 అదనపు డీసీపీగానూ సిద్ధిఖీ పని చేశారు. -
మహమ్మారి వస్తుంది.. అగ్ని ప్రమాదాలు ఎక్కువే: స్వర్ణలత భవిష్యవాణి
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. తన బిడ్డలను కాపాడుకుంటానని తెలిపారు. అలాగే.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా పుష్పలత..‘బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతీ ఏడాది జరిగనట్టే ఈ ఏడాది కూడా ఆటంకం కలిగించారు. ప్రతీ సంవత్సరం చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయడం లేదు. నా కోరికను ప్రతీ ఏడాది పక్కన పెడుతున్నారు. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. పూజలు జరిపించకపోతే.. నా కోపానికి మీరు బలి అవుతారు. నా బిడ్డలే కాబట్టి నేను కోపం చూపించడం లేదు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను.నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారు. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి’ అని చెప్పారు. -
వ్యక్తి దారుణ హత్య
మేడ్చల్రూరల్: భార్యాభర్తలు ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహ అలియాస్ చిన్న, తన భార్య అనితతో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్పోస్ట్లో ఉంటూ రోడ్డు పక్కన కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.మెదక్ జిల్లా, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్ చెక్పోస్ట్లోని వెంటకరమణ లిక్కర్ ల్యాండ్ వద్ద మద్యం తాగుతుండగా చిన్న, అతడి భార్య అనితతో స్క్రాప్ విషయమై గొడవ జరిగింది. దీంతో వారిద్దరూ కలిసి నర్సింహులును కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి దీనిని గుర్తించిన వైన్ షాప్ నిర్వాహుకుడు మహేష్ మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
టాప్ – 8 గోల్కొండ కోట
దేశంలో ఇప్పటికీ అత్యధికులకు సందర్శనకు ఇష్టమైన ప్రదేశం తాజ్మహల్. 2025 జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించింది తాజ్నే. దాని దరిదాపుల్లో మరేవీ లేవు.దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్ – 10 ప్రదేశాల జాబితాలో హైదరాబాద్లోని గోల్కొండ కోట 8వ స్థానంలో నిలిచింది. -
తిరుపతి – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆగస్టులో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018), ప్రతి శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017) రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్న గర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడి పత్రి, ఎరగ్రుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపే ట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి రైలు (07251), ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు (07252) రైళ్లు నడువను న్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
సీపీఐ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం హిమాయత్నగర్లోని రాజ్ బహదూర్ హాల్లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సీపీఐ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరిస్తూ, చందాలను సేకరించాలన్నారు.సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహ, కలవేణి శంకర్, శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్ పావని, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఈ. ఉమామహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్యుటెక్ కంపెనీల కట్టడి ఎలా?
సాక్షి, హైదరాబాద్: చట్ట విరుద్ధంగా కోచింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలను నియంత్రించటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిని దారికి తెచ్చేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది. ఇంజనీరింగ్లో నైపుణ్యం పేరుతో కొన్ని సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల్లోకి స్కిల్ పేరుతో చొరబడుతున్న ఈ కంపెనీల వల్ల జరిగే నష్టాలను మండలి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. స్కిల్ కోసం షార్ట్కట్స్లో ఇవి బోధిస్తున్నాయి. సబ్జెక్టు ఫ్యాకలీ్టలో నాణ్యత పాటించడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ కోచింగ్ కేంద్రాలకు వెళ్లడం వల్ల నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి మండలి తెలిపింది. ఏం చేస్తారో చేసుకోండి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ కేంద్రాలు నడుపుతున్న సంస్థలకు గత నెలలో ఉన్నత విద్యా మండలి నోటీసులు ఇచి్చంది. అయితే, నోటీసులు పొందిన సంస్థలు మండలికి ఘాటుగా సమాధానం ఇచ్చాయి. తామెక్కడా చట్ట వి రుద్ధంగా బోధన చేయడం లేదని, విద్యార్థులు స్కిల్ కోసం తమ దగ్గరకు వస్తున్నారని పేర్కొన్నాయి. అసలు తమను నియంత్రించడం, నోటీసులు ఇచ్చే అధికారం ఉన్నత విద్యా మండలికి లేదని న్యాయవాదులతో సమాధానం ఇవ్వడంతో మండలి వర్గాలు నివ్వెరబోయాయి.ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు ఆ సంస్థల్లో చేరిన విద్యార్థులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, మండలి అధికారులను తప్పుబడుతూ విద్యార్థులు మెయిల్స్ ఇవ్వడంతో సమస్య తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో చెప్పాలని మండలి అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సీఎం కార్యాలయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల దీనిపై చర్చించింది. కట్టడి చేయకుంటే కష్టమే ఇంజనీరింగ్ పూర్తవ్వగానే ఉద్యోగం పొందడం ఒక్కటే లక్ష్యంగా భావిస్తున్న విద్యార్థుల బలహీనతను కోచింగ్ కేంద్రాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇందులో డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలు ప్రధానంగా భాగస్వామ్యం అయ్యాయి. సబ్జెక్టులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, కేవలం ఉద్యోగం పొందేందుకు కొత్తగా వస్తున్న చాట్ జీపీటీ, ఏఐ సంబంధిత టెక్నాలజీపైనే షార్ట్ కట్స్ బోధిస్తున్నాయి. ఈ క్రమంలో కీలకమైన ఫ్యాకలీ్టని కూడా తగ్గిస్తున్నాయి. హైదరాబాద్లోని రెండు డీమ్డ్ వర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల ఆఫ్ క్యాంపస్లపై గత ఏడాది కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీల్లో కాకుండా, స్కిల్ కేంద్రాల్లో బోధిస్తున్నారు.పరీక్షలు నిర్వహించి, డిగ్రీలు ఇవ్వడం మాత్రం కాలేజీల్లోనే జరుగుతోంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని మండలి పేర్కొంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో బేసిక్స్ నేర్పుతారు. రెండు, మూడు సంవత్సరాల్లో కీలకమైన కోడింగ్పై సబ్జెక్టులు ఉంటాయి. ఇదే క్రమంలో ఎమర్జింగ్ కోర్సులకు పారిశ్రామిక భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి కోడింగ్పై పట్టు సాధిస్తాడు. ఏఐ చేసే కోడింగ్, డీ–కోడింగ్ కచి్చతమైనదేనా? కాదా? అనేది సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పుడే తెలుస్తుంది. ప్రైవేటు కాలేజీలు దీన్ని విస్మరించి ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్స్ను మాత్రమే నేర్పుతుండటంతో ఉద్యోగం వచి్చనా, పనిలో పురోగతి సాధించలేకపోతున్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీ కంపెనీల్లో అనేక మంది కోడింగ్పై పట్టు లేకపోవడం వల్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం చట్ట విరుద్ధంగా నడుపుతున్న కోచింగ్ కేంద్రాలకు నోటీసులు ఇచ్చాం. సమాధానం వచ్చింది. అయితే, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో దీనిపై విధాన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
నిరసన తెలిపితే కాల్పులా?: కవిత
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఆదివారం కలిసిన కవిత.. మల్లన్న సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని విన్నవించారు. మల్లన్నపై డీజీపీ కార్యాలయంలో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఆయా చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు కోపం వచ్చి కొందరు నిరసన వ్యక్తం చేశారని, అంతమాత్రానికే ల్పులు జరిపి చంపేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆయనతో అలా మాట్లాడించింది ప్రభుత్వమే అని భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాల్పులపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని వ్యాఖ్యానించారు. మల్లన్న వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. తన పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కవిత అన్నారు. తనను అగౌరవ పరిచిన తీన్మార్ మల్లన్నపై బీఎన్ఎస్ 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని అదనపు ఐజీ రమణకుమార్కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే చెల్లదని స్పష్టంచేశారు.కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తుతీన్మార్ మల్లన్న క్యూన్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె ఇంటికి వెళ్లే మార్గాల్లో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సుమారు 50 మంది పోలీసులతో నాలుగు చోట్ల పికెటింగ్లు ఏర్పాటుచేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ‘జాగృతి’ దాడి..
మేడిపల్లి/ఘట్కేసర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని క్యూన్యూస్ ఆఫీస్లోకి ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 20 మంది కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి చానల్ సిబ్బందిపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న మల్లన్నపై కూడా దాడికి ప్రయతి్నంచారు. కార్యాలయంలోని ఫరి్నచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.వారిని అదుపుచేసేందుకు మల్లన్న గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ లోపుగా మల్లన్న మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన ఆఫీస్ సిబ్బందిని, మల్లన్నను చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లన్న చేతికి స్వల్ప గాయం కావడంతో చికిత్స అందించి ఆస్పత్రి నుంచి పంపించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఈ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాడులకు భయపడను: మల్లన్న తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడిని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘20 మంది వరకు కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి నాతోపాటు మా కార్యాలయం సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. దాడి తీవ్రతను చూసి వెంటనే గన్మెన్ గాల్లోకి ఐదు రౌడ్లు కాల్పులు జరిపారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు బయపడేది లేదు. కంచం–మంచం అనే పదం తెలంగాణలో ఊతపదం. నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా.రౌడీల్లా నాపై దాడి చేయడమే కాకుండా మళ్లీ నాపైనే కేసు పెట్టారు. నా ఆఫీస్లో నా రక్తాన్ని కళ్లచూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళతాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఆందోళనకారులు రాంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మేడిపల్లి పోలీసుల అదుపులో జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్రావు, ఓయూ జాగృతి అధ్యక్షుడు ఆశోక్ యాదవ్తోపాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. -
రయ్రయ్ లారీ.. చల్లచల్లని కేబిన్
సాక్షి, హైదరాబాద్: భగభగమండే ఎండ వేడి.. బాగా వేడెక్కే ఇంజిన్ సెగ.. ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయినా అలాగే ముందుకు సాగుతుంటారు లారీ డ్రైవర్లు. రోజులు, నెలల తరబడి వేడి సెగతో పోరాటం చేస్తూ విపరీతమైన అలసటకు గురవుతుంటారు. ఈ పరిస్థితి కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లారీ కేబిన్లలో కూడా ఎయిర్ కండిషన్ (ఏసీ) వసతి కల్పించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏసీ కేబిన్తో కూడిన లారీలనే విక్రయించాలని కేంద్రం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రధాన లారీ తయారీ కంపెనీలు ఏసీలతో కూడిన ట్రక్కులను ఇప్పటికే అందుబాటులోకి తెస్తున్నాయి. అవి లారీ డ్రైవర్లకు కొత్త అనుభవనాన్ని పంచుతున్నాయి. ముందుగానే మొదలుఅక్టోబర్ ఒకటి నుంచి విక్రయించే ప్రతి సరుకు రవాణా ట్రక్కు కేబిన్లో ఏసీ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఏసీ కేబిన్ ఉన్న ట్రక్కులకే రోడ్డెక్కే అనుమతి ఉంటుంది. దీంతో ప్రధాన కంపెనీలు గడువు కంటే ముందే కొత్త ట్రక్కులను ఏసీ వసతితో అమ్మటం ప్రారంభించాయి. టాటా, అశోక్ లేలాండ్, భారత్ బెంజ్, ఐషర్ లాంటి ప్రధాన కంపెనీల ట్రక్కులు ఏసీతోనే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు కోటి టన్నుల సరుకు వివిధ ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా రవాణా అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆరు లక్షల టన్నుల వరకు ఉంటోందని అంచనా. తెలంగాణలో 5.8 లక్షల సరుకు రవాణా వాహనాలుంటే వీటిల్లో మూడు లక్షల వరకు లారీలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రక్కుల సంఖ్య దాదాపు ఏడు లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలో పాత లారీలకు కూడా ఏసీ వసతి కల్పించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. భిన్న వాదనలుమన దేశంలో వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ దాటుతాయి. మరోవైపు భారీ లోడ్ను మోయాల్సి రావటంతో ట్రక్కుల ఇంజిన్లు ప్రయాణంలో విపరీతంగా వేడెక్కుతాయి. ఆ వేడి ట్రక్కు కేబిన్లోకి చేరుతుంది. అటు ఎండ, ఇటు ఇంజిన్ వేడితో డ్రైవర్లు అతలాకుతలం అవుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలు డ్రైవర్లలో అలసట, డీహైడ్రేషన్, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతోంది. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. కేబిన్లో ఏసీ అమర్చితే వేడి ప్రభావం తగ్గటంలో డ్రైవర్లు త్వరగా అలసిపోరు. డ్రైవింగ్పై వారికి నియంత్రణ పెరుగుతుందని నిపుణలు చెబుతున్నారు. ఏసీల వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతాయని కొందరు వాదిస్తున్నారు. రోజుల తరబడి వాహనం నడిపే ట్రక్కు డ్రైవర్లు ఏసీ ద్వారా వచ్చే చల్లదనం వల్ల తొందరగా నిద్రలోకి జారుకునే ప్రమాదం ఉందని, ఇది ట్రక్కు ప్రమాదాలను మరింత పెంచుతుందని పేర్కొంటున్నారు. -
ఎగువ గోదారి వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడిచిపోయినా వరద ప్రవాహం లేక ఎగువ గోదావరి వెలవెలబోతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగి దిగువ గోదావరి పోటెత్తింది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్కి దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్లోకి 2.21 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్లోకి 2.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 5.92 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ గేట్లను ఎత్తివేయడంతో ఇప్పటికే ఈ ఏడాది 175 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోయాయి.ఎగువన అన్ని రిజర్వాయర్లూ వెలవెలనే..గోదావరిపై మహారాష్ట్రంలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 83.48 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జైక్వాడ్ ప్రాజెక్టు నిండితేనే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వరద ప్రవాహం ప్రారంభమవుతుంది. మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో నిల్వలు 4.71 టీఎంసీలకు పడిపోయాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, కేవలం 2,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, జలాశయంలో 20.77 టీఎంసీల నీరే ఉంది. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 602 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 3.47 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 431 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండడంతో నిల్వలు 8.9 టీఎంసీలకు పరిమితమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి ప్రధాన పాయపై నిర్మించిన సుందిళ్ల, అన్నారం బరాజ్లకు సైతం నామమాత్రంగా 293 క్యూసెక్కులు, 450 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించింది. దీంతో మేడిగడ్డ బరాజ్కి భారీ వరద వస్తున్నా నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.నాగార్జున సాగర్లో 551 అడుగులకు నీటి మట్టంనాగార్జునసాగర్: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో ఒక గేటు ద్వారా దిగువన నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 69,382 క్యూసెక్కులు, ఒక గేటు ద్వారా 27,295 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 551.10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయానికి గడిచిన 24 గంటల్లో 70,320 క్యూసెక్కుల నీరు రాగా, 9,552 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
చేదెక్కిన చెరకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి సరిపోను దిగుబడి కూడా ఉండటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వరిసాగుకు సై అనడంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరగడం లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు, చెరకు విభాగం అధికారులు చెబుతున్నారు. చెరకు పరిశ్రమ ద్వారా ఒక్కో మెట్రిక్ టన్నుపై ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ.250 వరకు సమకూరుతోంది. చెరకు ఏడాది పంట కావడంతో టన్నుకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. చెరకు ఫ్యాక్టరీలకు అవసరమైన ముడి సరుకుతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్న చెరకు పరిశ్రమను ప్రోత్సహించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతులకు బోనస్ ప్రకటించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెరకు విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. మూడోవంతు విస్తీర్ణంలోనే సాగు ! రాష్ట్రంలో 12 చక్కెర కర్మాగారాలు ఉండగా, ఐదు కర్మాగారాలు మూత పడ్డాయి. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 24,700 మెట్రిక్ టన్నులు. 130 రోజుల క్రషింగ్ సీజన్ను పరిగణనలోకి తీసుకొని లెక్క వేస్తే మొత్తంగా ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా 32.11 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరం. రాష్ట్రంలో 40వేలకు పైగా హెక్టార్లలో చెరుకు సాగు చేస్తేనే ఈ ఏడు ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా దిగుబడి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 21వేల హెక్టార్లలో మాత్రమే రైతులు చెరకును సాగు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీలకు నష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి మూతపడిన బోధన్, మెదక్, మెట్పల్లిలోని నిజాం డెక్కన్ షుగర్స్ యూనిట్లు తెరుచుకుంటే చెరకు పంట సాగు విస్తీర్ణం 61వేల హెక్టార్లకు చేరాలి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో కేవలం మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగవుతోంది. తమిళనాడు తరహాలో బోనస్ ఇవ్వాలి తమిళనాడులో చెరకు రైతులకు టన్నుకు రూ.1,000 చొప్పున బోనస్ ఇస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెరకు రైతులకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. – రచ్చ నరసింహారావు, చెన్నారం, ఖమ్మం జిల్లాచెరకు రైతులను ఆదుకోవాలిచెరకు సాగులో ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారం మూతపడటంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కనీస మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సన్న వడ్లకు ఇచ్చినట్టుగా చెరకు రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. చెరకు సాగులో యాంత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. – ఈదులపల్లి ఈరన్న, హద్నూర్, సంగారెడ్డి జిల్లా -
డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ చేపట్టాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని సూర్యాపేట, నాగర్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేటలాంటి కీలక ప్రాంతాలకు ఇప్పటి వరకు రైలుమార్గం లేదు. ఈ మార్గాలను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన రైల్వేలైన్కు భారీ వ్యయం అవుతున్నందున రైల్వేబోర్డు ఎటూ తేల్చుకోలేకబోతోంది. దాదాపు రూ.5,500 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉన్నందున.. ఈ మార్గాన్ని నిర్మిస్తే రైల్వేకు వచ్చే ఆదాయం ఎంతో లెక్కలేసుకుంటోంది. ఆదాయం అంతగా ఉండదని భావిస్తే ఈ కీలక మార్గం మంజూరయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టును సాధించాలంటే రాజకీయ ఒత్తిడి కీలకంగా మారబోతోంది. నేతలు గట్టిగా ఒత్తిడి చేస్తే తప్ప ఇది సాకారం అయ్యే సూచనలు కనిపించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏంటా ప్రాజెక్టు.. ఎందుకు టెన్షన్ తెలంగాణలో ఆది నుంచి రైల్వే అనుసంధానం తక్కువ. అందులోనూ దక్షిణ తెలంగాణలోని కీలక ప్రాంతాలకు రైల్వే భాగ్యం లేకుండా పోయింది. ఉన్న ప్రధాన లైన్లు తప్ప, వాటిని అనుసంధానించే కొత్త లైన్లు లేవు. ఈ తరుణంలో రైల్వే శాఖ సికింద్రాబాద్–విజయవాడ గ్రాండ్ ట్రంక్ రూట్లో ఉన్న డోర్నకల్ నుంచి కాచిగూడ–బెంగుళూరు ప్రధాన లైన్లో ఉన్న గద్వాలను అనుసంధానిస్తూ కొత్త రైలు మార్గం నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఇటీవల ఫైనల్ లొకేషన్ సర్వేను పూర్తి చేసింది. ఇప్పుడు అందులో కీలకమైన డీపీఆర్ తయారీ దాదాపు పూర్తయ్యింది. ఇప్పుడు దీనిపై రైల్వేబోర్డు నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. డోర్నకల్లో ప్రారంభమయ్యే కొత్త లైన్ ఖమ్మంలోని కూసుమంచి, పాలేరు మీదుగా దక్షిణ తెలంగాణలో కీలక పట్టణాలైన సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్కర్నూలు, వనపర్తి, భూత్పూర్ల మీదుగా సాగి గద్వాల వద్ద ముగుస్తుంది. దీని నిడివి దాదాపు 300 కి.మీ. ఈ ప్రాంతాల్లో చాలా వాటికి ఇప్పటి వరకు రైలు వసతి లేదు. రైల్వేలైన్ ఏర్పడితే ఆ ప్రాంతాల్లో పురోగతి వేగం అందుకుంటుంది. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది. దీంతో ఈ రైలు మార్గం దక్షిణ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మార్చే కీలక ప్రాజెక్టు. నిడివి ఎక్కువగా ఉండటంతో ఈ రైలు మార్గం నిర్మాణానికి దాదాపు రూ.5,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని డీపీఆర్ ప్రాథమిక కసరత్తు చెబుతోంది. అధికారిక అంచనా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతానికి జరుగుతున్న కసరత్తు మేరకు, ఇది భారీ ఖర్చుతో కూడుకున్నందున దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయం అంతగా రాదని.. ప్రయాణికుల రైళ్లతో పెద్దగా ఆదాయం ఉండదు. సరుకు రవాణా రైళ్లతోనే ఆ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. సిమెంటు పరిశ్రమలు, బొగ్గు గనులు, భారీ వ్యవసాయ మార్కెట్లు ఉన్న ప్రాంతాల మీదుగా సరుకు రవాణా రైళ్ల అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త మార్గంలో సిమెంటు పరిశ్రమలు పెద్దగా లేవు. ఉమ్మడి ఖమ్మం ప్రాంతం మీదుగా సాగనున్నందుకు బొగ్గు తరలింపునకు అవకాశం ఉంది. రూ.ఐదున్నర వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నందున రేట్ ఆఫ్ రిటర్న్స్ బ్రేక్ ఈవెన్ను మించేలా ఉంటే ఈ ప్రాజెక్టును చేపట్టే వీలుంది. బ్రేక్ఈవెన్కు చేరుకోకుంటే నష్టం తెచ్చే ప్రాజెక్టుగా ముద్ర వేసి దాన్ని పక్కనపెట్టేస్తారు. దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే తరుణం అయినందున, ఇప్పుడే రాజకీయ ఒత్తిడి ఉండాలన్న సూచనలు వస్తున్నాయి. -
‘మాక్’తో మేల్కొలుపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది. ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. 2 వేల ర్యాంకుకూ సీటు రాలే..మాక్ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్సెట్కు దరఖాస్తు చేశారు. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్సెట్లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలిఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్సెట్ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు. మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రిజర్వేషన్ల చుట్టూ ‘రాజకీయం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. స్థానిక సంస్థలకు మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఊపందుకున్న రిజర్వేషన్ల రగడను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో అధికార కాంగ్రెస్ ఓ అడుగు ముందుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీల మన్ననలు పొందేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నాయి. అయితే, పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుకాకుండా ఎక్కడ ఆగిపోతాయేమోననే ఆందోళన బీసీ సంఘాలు, ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశంలో రాజకీయ కౌంటర్లు, ఎన్కౌంటర్లు, కోర్టు కేసు వ్యవహారంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో అసలు ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకుండానే రాష్ట్రంలో ‘స్థానిక’వేడి మొదలుకావడం గమనార్హం. అధికార పార్టీ ఏమనుకుంటోందంటే.. ఎవరెంతో.. వారికంత అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అందిపుచ్చుకున్న దేశవ్యాప్త నినాదంతో సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎస్సీల వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణతోపాటు తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్తో అన్ని వర్గాలకు తాము న్యాయం చేస్తున్నామని చెబుతోంది. అంతకంటే ముందు అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు కూడా కామారెడ్డి డిక్లరేషన్ను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామనేందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలంటున్నారు. తాము మాత్రమే బీసీలకు న్యాయం చేయగలమని, అందుకే చేశామని ఆ పార్టీ నేతలంటుండగా సీఎం రేవంత్రెడ్డి మరో అడుగు ముందుకేసి రాహుల్గాంధీ ప్రధాని అయి ఉంటే 48 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయించేవాడినన్నారు. కేబినెట్ ఆర్డినెన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించి తామే బీసీల చాంపియన్నని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ పార్టీ వర్గాల్లో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆగం చేస్తుందా అనే మీమాంస కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదం కోసం పెండింగ్లో ఉండగా, ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై ఆ పార్టీ నేతల్లోనూ సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. విపక్షాలు ఏమనుకుంటున్నాయంటే... కర్ర విరగకుండా పాము చావకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్న పార్టీగా చేయాల్సింది చేయకుండా బీసీ వర్గాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తానని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పుడే చెప్పారని, అయితే ఇప్పటివరకు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీస్తున్నాయి. అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చిన ఆయన కనీసం ఒక్కసారి కూడా ఎందుకు బీసీ బిల్లు ఆమోదం గురించి వినతిపత్రం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి వద్దకు వెళ్లిన బిల్లును ఆమోదింపజేసి పార్లమెంటు ఆమోదం కోసం తీసుకురావడంలో కాంగ్రెస్ చేసిన కృషి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ను వినిపిస్తున్న బీఆర్ఎస్ ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతోంది. బీసీలను మోసం చేసేందుకే ఆర్డినెన్స్ అంటున్నారని, ఏకసభ్య కమిషన్ పేరుతో ఇచ్చిన నివేదిక లొసుగులతో ఉందని, ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని అంటోంది. ఇక, బీజేపీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతోంది. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా, ఆర్డినెన్స్ తేవడం బీసీలను ఏమార్చడానికేనని అంటోంది. తాము బహిరంగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతిస్తున్నా.. అటు రాష్ట్రపతితోపాటు ఇటు పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం పొందకపోతే తమకు ‘స్థానిక’ంగా పట్టురాదేమోననే ఆందోళన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు ఏమంటున్నాయి... ఆర్డినెన్స్ ఆధారంగా ప్రభుత్వం జారీ చేయాలనుకుంటున్న రిజర్వేషన్ల జీవోకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై బీసీ సంఘాల్లో, ఆయా వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవో కోర్టులో నిలబడుతుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టులో సవాల్ చేస్తే నిలబడదని కొందరు, కొన్ని ప్రాతిపదికల మీద నిలబడుతుందని మరికొందరు అంటున్నారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతానికి పరిమితం అవుతుందని, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన కల్పించే రిజర్వేషన్లు పోను 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయడం సుప్రీంతీర్పు అమల్లో ఉన్నంతవరకు సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోను సవాల్ చేస్తే వెంటనే కోర్టు కొట్టి వేస్తుందనేది వారి వాదన. అయితే, గతంలో బీసీల జనాభా లెక్కలు అందుబాటులో లేనందున కోర్టులు కొట్టివేశాయని, ఇప్పుడు ప్రభుత్వం చేసిన కుల సర్వేలో బీసీల జనాభా 56 శాతంగా తేలిందని, బీసీలకు తగినంత రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులోనే పేర్కొన్నందున 42 శాతం కోటా న్యాయ సమీక్షలో నిలబడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. అలాగే, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు అంశం కూడా ఈ వాదనకు బలాన్నిస్తుందని అంటున్నారు. మరోవైపు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసే క్రమంలోనే 50 శాతం సీలింగ్ చాలా రాష్ట్రాల్లో దాటిపోయిందని, తెలంగాణలోనూ ఇబ్బంది ఉండదని వారంటున్నారు. మరోవైపు బీసీ వర్గాలకు న్యాయం జరుగుతున్నందున దాన్ని అడ్డుకోవద్దని, కోర్టులో కేసులు వేయొద్దని అటు రాజకీయ పార్టీలకు, ఇటు ప్రజలకు బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా ఏ క్షణంలో కోర్టులో కేసు పడుతుందోననే గుబులు మాత్రం కనిపిస్తోంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టు కూడా జోక్యం చేసుకోదనే వాదన సముచితం కాదనే భిన్నమైన అంశాన్ని బీసీ సంఘాల నిపుణులు తెరపైకి తెచ్చారు. గతంలో మహారాష్ట్రలో ఇదే జరిగిందని, మరాఠాలను బీసీల్లో చేర్చి, వారికి రిజర్వేషన్లు కల్పించి పంచాయతీ ఎన్నికలకు వెళ్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మరీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జీవోలు, ఆర్డినెన్స్ల కంటే పార్లమెంటు ఆమోదం ద్వారా 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడమే రక్షణ కవచమని, ఆ కోణంలోనే అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్లోని గుత్తా నివాసంలొ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందన్నారు. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత.. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.‘‘తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రనికే గన్ఫైర్ చేసి చంపేస్తారా!??. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా !?. నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.‘‘ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి.. మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు.. నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, ఇవాళ ఉదయం(ఆదివారం) తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా, 3.30 గంటలకు డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
ఈ చిరునవ్వులిక కానరావు
హైదరాబాద్: ఇంటి ఆవరణలోని సంప్లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిలాఘన్పూర్ మండలానికి చెందిన సభావత్ శ్రీను, నీల దంపతులకు ఓ కూతురు అఖిల, కుమారుడు అభి (4) ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం వలస వచ్చి నగరంలో మియాపూర్ హఫీజ్పేట్ సుభాష్చంద్రబోస్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు. స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీను, నీల దంపతులు కూలిపనుల నిమిత్తం వెళ్లగా కూతురు అఖిల, కుమారుడు అభి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో బాలుడు అభి ఇంటి ఆవరణంలో ఉన్న సంపులో నుంచి నీటిని తీసుకునేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమీపంలో ఆడుకుంటూ ఉన్న అఖిల చూసి స్థానికులకు చెప్పడంతో అభిని సంపులోంచి బయటకు తీసి సమీపంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. సంపుపై మూత ఏర్పాటు చేయా లని ఇంటి యజమానికి పలుమార్లు చెప్పి నా పట్టించుకోలేదని.. దీంతో తమ కుమారుడు మృత్యువాత పడినట్లు అభి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఇల్లు కొంటున్నారా?.. ఇలాంటి లొసుగులతో జాగ్రత్త!
మనకు నచ్చే ఫ్లాట్ దొరికేంత వరకూ నగరం నలుమూలలా తిరుగుతాం. రుణమెంత వస్తుందో ముందే బ్యాంకర్లతో చర్చించి, ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతాం. కోరుకున్న ఫ్లాట్ దొరికితే చాలు.. అడ్వాన్స్ అందజేసి బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో.. ఏయే అంశాల్ని పేర్కొన్నారో తెలుసుకోవాలి. లేదంటే సొంతింటి ఆనందనానికి దూరమైనట్లే. – సాక్షి, సిటీబ్యూరోస్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారుడితో కుదుర్చుకునే ఒప్పందమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇళ్ల విషయంలో బిల్డర్తో జాగ్రత్తగా ఉండాలి. జీవిత కాలపు కష్టార్జితానికి తోడు, బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తాం. తీరా కొనుగోలు చేశాక, న్యాయపరమైన చిక్కులున్నాయనో, ఇంటిపై అప్పు ఉందనో తేలితే.. ఎంత నష్టం? ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా పక్కగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి. హక్కుల చిక్కులు, ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి కొన్ని సూత్రాలివి..మొత్తం విలువెంత? ఇంటి విలువ ఎంతన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కలుస్తాయి. విద్యుత్, తాగునీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో కలిసి ఉండొచ్చు. లేదంటే విడిగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఖర్చులన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోండి. ఏం చేయాలి? ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే.. బిల్డర్ను సంప్రదించడం ద్వారా ఆ విషయాల్ని సరిదిద్దుకోవచ్చు. వాస్తవ ప్లాన్కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే.. అదనపు రుసుములు చెల్లించారా? సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి అవసరమా.. వంటి విషయాల్ని బిల్డర్తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి.నిర్మాణం జాప్యమైతే? నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు..? ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మాంద్యం దెబ్బ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటి అద్దె చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి అవుతుంది, ఎప్పటిలోగా ఫ్లాటను అప్పగించే విషయంపై బిల్డర్తో పత్రంలో రాయించుకోండి.ఏం చేయాలి? పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్ను కలిసి మాట్లాడండి. పనుల పురోగతికిది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. ఫలితంగా బిల్డర్ వైపు నుంచి ఆలస్యం జరిగితే, గట్టిగా అడగడానికి వీలవుతుంది. -
వైభవంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 4 గంటలకు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ద్వారాలు తెరిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిపూజ చేసి బోనం సమర్పించారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. అనాదిగా హైదరాబాద్లో బోనాల పరంపర కొనసాగుతుందన్నారు.ఈ నెల 13, 14 తేదీల్లో అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి ఉంటుంది. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు క్యూలైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, ఒకటి వీఐపీ పాస్లతో వచ్చే వారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు. బోనాలతో వచ్చే మహిళలతోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. దేవదాయ శాఖ అధికారులు దేవాలయం మొత్తం రంగులు, పువ్వులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు 24 గంటలు పారిశుధ్య పనులు నిర్వహించేలా సిబ్బందిని నిమించారు.మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. జలమండలి అధికారులు ఐదు ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసి వాటర్బాటిళ్లు, మంచినీటి ప్యాకెట్లు అందించనున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డీఎంఅండ్హెచ్వో ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్లను సిద్ధంగా పెట్టారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భక్తులను అలరించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.శివసత్తులు, జోగినుల కోసం అధికారులు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వారికి ప్రత్యేకంగా అనుమతిస్తారు. ఆ సమయంలో తమ సంప్రదాయ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. బాటా వైపు నుంచి క్యూలైన్లలో కాకుండా నేరుగా ఆర్చ్ గేటు వరకు అనుమతిస్తారు. -
హైదరాబాద్లో కల్లుపై నిషేధం?
సాక్షి, హైదరాబాద్: కల్తీ కల్లుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హైదరాబాద్లో కల్లు విక్రయాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. నిషేధం విధించడానికి ముందు సంబంధిత వర్గాలన్నింటితో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. కల్లుపై నిషేధం రాజకీయపరమైన సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా డీల్ చేయాలని యోచిస్తోంది. నగరంలోని కల్లు సొసైటీల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. కల్లుపై నిషేధం గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న కల్లులో 90 శాతం కృత్రిమంగా తయారుచేసినదే ఉంటోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. చెట్ల నుంచి సహజంగా తీసిన కల్లు 10 శాతమేనని అంటున్నారు. హైదరాబాద్లో మొత్తం 97 కల్లు సొసైటీలు ఉన్నాయి. ఒక్కో సొసైటీ పరిధిలో రోజూ 10 నుంచి 20 పెట్టెల (ఒక్కో పెట్టెలో 10 – 12 సీసాలు) కల్లు విక్రయాలు జరుగుతుంటాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 90 శాతం ఆ్రల్ఫాజోలం వంటి రసాయనాలతో తయారుచేసినదే ఉంటోందని సమాచారం. ఈ ఆల్ప్రాజోలం ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. ఒక కిలో ఆల్ప్రాజోలం ధర దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు గత మూడేళ్లలో అడపాదడపా నిర్వహించిన దాడుల్లోనే దాదాపు 64 కిలోల ఆ్రల్పాజోలంను స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో నిషేధం.. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నగరంలో కల్లు అమ్మకాలను నిషేధించారు. దాదాపు 12 సంవత్సరాలపాటు కల్లు విక్రయాలు బంద్ అయ్యాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ కల్లు విక్రయాలు ప్రారంభం అయ్యాయి. నగర శివార్లలో అప్పట్లో తాటి చెట్లు పెద్ద ఎత్తున ఉన్నా.. అవి స్థానిక అవసరాలకే పరిపోవడం లేదని, అక్కడ నుంచి నగరానికి కల్లు సరఫరా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ హయాంలో నిషేధం విధించారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రియల్ఎస్టేట్ కారణంగా ఉన్న చెట్లన్నీ నరికేశారని, హైదరాబాద్కు నిజామాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని చెట్లను కేటాయించినా.. అక్కడి నుంచి కల్లు గీసి తీసుకురావడం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్టవ్యాప్తంగా కల్లు సొసైటీలు 4,064 ఉంటే 4,697 దుకాణాలు ఉన్నాయి. అందులో సభ్యులుగా 1,95,391 మంది లైసెన్స్ విక్రయదారులు ఉన్నారు. 3,541 టీఎఫ్టీ (ట్రీ ఫర్ ట్రేడింగ్) కమిటీల కింద మరో 29,279 మంది ఉన్నారు. 2014 నుంచి 2025 వరకు కల్తీ కల్లు విక్రయాలపై నమోదైన కేసుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. 2014లో 9,562 కేసులు నమోదైతే, 2025లో 516 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. -
ఒకే రాజ్యం.. ఒకే రాజ్యాంగం..
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో రాష్ట్రంలో ఒకటి.. దేశంలో మరొకటి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందని.. మన దేశం (రాజ్యం)లో అది సాధ్యం కాదని.. ఒకే దేశం–ఒకే రాజ్యాంగం మనదని బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎలా పనిచేయాలో ఆయన రోడ్మ్యాప్ వేశారన్నారు. 75 ఏళ్లుగా ఇలా చెక్కుచెదరకుండా ఉన్నామంటే అందుకు దృఢమైన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భవిష్యత్ అవసరాల మేరకు రాజ్యాంగ సవరణ అనివార్యమంటూనే ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు అప్పగించారని వెల్లడించారు. భారత రాజ్యాంగం: అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేడ్కర్ ఆలోచనా సరళిని లోతుగా విశ్లేషిచారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేరాలని.. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎన్ని వచ్చినా మన రాజ్యాంగం వల్లే బలంగా తట్టుకొని నిలబడగలిగామని చెప్పారు. నేరుగా ‘సుప్రీం’ను ఆశ్రయించే వెసులుబాటు.. ‘భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణకు అంబేడ్కర్ అనుమతించారు. ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆరి్టకల్ 32 పౌర హక్కులకు భంగం కలగకుండా కాపాడుతోంది. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. అమెరికాలో ద్వంద పౌరసత్వం అమల్లో ఉన్నా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతోపాటు సమాఖ్య పౌరసత్వం ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అమల్లోకి తీసుకురావడం గరి్వంచదగిన విషయం. 1973లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులపై ఘర్షణ వచ్చింది. దీనిపై 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసే పనిచేస్తాయని తేల్చిచెప్పింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా రోడ్మ్యాప్ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర ఎనలేనిది’అని సీజేఐ జస్టిస్ గవాయ్ వివరించారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రసంగాన్ని ముగించారు. అంబేడ్కర్కు హైకోర్టు సీజేగా ఆఫర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ప్రసంగిస్తూ ‘హైదరాబాద్ నా సొంత నగరం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నా సొంత నగరంలో నా వర్సిటీకి సీజీఐ రావడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం హర్షణీయం. అంబేడ్కర్కు హైదరాబాద్తో అనుబంధం ఉంది. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్ భాగ్యనగరాన్ని సందర్శించారు. నిజాం నవాబ్ ఆయన్ను కలసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారు. అయితే ఆ ఆఫర్ను అంబేడ్కర్ సున్నితంగా తిరస్కరించారు. మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది.. ఔన్యతమైనది’అని వెల్లడించారు. అంబేడ్కర్తో హైదరాబాద్కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారన్నారు. అంబేడ్కర్ తన ఆత్మకథలో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ ప్రసంగిస్తూ 1947 అక్టోబర్లో రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైందని.. రెండున్నరేళ్ల చర్చలు, భేటీల తర్వాత 1949 నవంబర్లో తుదిరూపు వచ్చిందన్నారు. బీఆర్ గవాయ్ తండ్రి అంబేడ్కర్కు సన్నిహితుడు.. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి ప్రసంగిస్తూ 1953 జనవరి 12న అంబేడ్కర్కు ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. ఇది ఓ భారతీయ విశ్వవిద్యాలయం ఆయనకు ప్రదానం చేసిన తొలి డాక్టరేట్ అని చెప్పారు. బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేడ్కర్కు అత్యంత సన్నిహితుడని.. దాదా సాహెబ్ గవాయ్గా ఆయన సుపరిచితుడన్నారు. విద్యావేత్త, రాజకీయ నేత, సామాజిక కార్యకర్తగానే కాకుండా పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ... 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పీపీ పల్లె నాగేశ్వర్రావు, రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్ఏసీ) గోవర్దన్రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్ఖాన్, తేరా రజనీకాంత్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య నరేశ్రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ కుమార్ నాయక్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పోస్టల్ కవర్ను జస్టిస్ బీఆర్ గవాయ్ విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. -
పదేళ్ల తర్వాత.. కొత్త రేషన్కార్డులు
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత అధికారికంగా సోమవారం కొత్త రేషన్కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్కార్డులు జారీ చేయనున్నారు. మంత్రులు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ జనవరి 26 తర్వాత మొదలైన కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా జారీ చేసిన, చేస్తున్న కార్డుల సంఖ్య 5,61,343. పాత కార్డుల్లోని డూప్లికేట్ పేర్లు తొలగించిన తర్వాత..ప్రస్తుతం కార్డుల్లో సభ్యుల సంఖ్య 3,09,30,911గా తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడే... పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రేషన్కార్డుల స్థానంలో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అప్పట్లో రాష్ట్రంలో సుమారు 55 లక్షల కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జారీ చేయగా, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడప్పుడు జారీ చేసిన కార్డులు, తొలగించిన కార్డులు పోగా 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి కొత్త కార్డుల జారీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత 24 మే నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్లైన్లో జారీ చేశారు.దీంతో ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సభ్యులను చేర్చుకుంటూ, పాత రేషన్కార్డుల్లోని ఉమ్మడి కుటుంబాల్లో పెళ్లిళ్లు అయిన వారిని, ఇళ్లల్లో లేని వారిని తొలగించగా, రాష్ట్రంలో రేషన్ పొందేందుకు అర్హులుగా 3.09 కోట్లుగా నిర్ధారించినట్టు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. పది జిల్లాల్లో అత్యధిక కార్డులు పది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో 31,772 కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా 6,67,778 రేషన్కార్డులు ఉన్న జిల్లాగా హైదరాబాద్, అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా 96,982 కార్డులతో ములుగు ఉంది. 5,61,343 కార్డుదారులకు ప్రయోజనం : మంత్రి ఉత్తమ్రాష్ట్రంలో కొత్తగా 5,61343 రేషన్కార్డులు అందజేస్తున్నామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. తద్వారా 45,34,430 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. పాతకార్డుల్లో పేర్ల చేర్పు ద్వారా మరో 28,32,719మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.మొత్తంగా కార్డుల సంఖ్య 95,56,625 సన్నబియ్యం ఇచ్చేది 3,09,30,911 మందికి 13 ఏళ్ల తర్వాత కార్డు నాకు వివాహమై 13 ఏళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఇరవై ముప్పై సార్లు మీసేవ కేంద్రంలో, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు కార్డు వస్తోంది. – బూరి రేణుక, మొల్కపట్నం, నల్లగొండసంతోషంగా ఉంది చేనేత కార్మికులుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. నాలుగైదేళ్లుగా కార్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గతంలోనూ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాం. కార్డు అప్రూవ్ అయ్యింది. – చెరుపల్లి నవీన, గట్టుప్పల్, నల్లగొండఇప్పటికొచ్చింది నాకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం రెండుసార్లు దరఖాస్తు చేశా. అయినా రాలేదు. మొత్తానికి ఇప్పుడు అప్రూవ్ అయ్యింది. – బొందల విక్రం, తుమ్మల పెన్పహాడ్, సూర్యాపేట -
రాహులే ప్రధానిగా ఉంటే.. 48 గంటల్లో బీసీ రిజర్వేషన్లు!
సాక్షి, హైదరాబాద్: ‘బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి లేనిది బీజేపీకి. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య దీన్ని సాధించాలి. మోదీ స్థానంలో రాహుల్గాంధీ ప్రధానిగా ఉండి ఉంటే 48 గంటల్లో నేను బీసీ రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడిని. ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు నిబద్ధతను చూపించాలి’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించినందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు శనివారం సీఎం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి ధన్యావాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. బీసీల వందేళ్ల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని తెలిపారు. ‘కులగణన చేస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ ప్రకటించారు. ఆయన మాట మాకు శిలాశాసనం. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది . ఏడాదిలో పక్కాగా కులగణన పూర్తి చేశాం. రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ మోడల్లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారు. కులగణనకు వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయి. మనం తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది’అని సీఎం పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే సామాజిక బహిష్కరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించేవారికి సామాజిక బహిష్కరణ శిక్ష విధించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం. అర్ధరాత్రి కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తా. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంతకాలం ఈ ఎన్నికలు వాయిదా వేశాం. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా బీసీలైన గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు వాళ్లను మాపైకి ఉసిగొల్పుతున్నారు. ఆ చట్టంలో పేర్కొన్న 50 శాతం నిబంధనను సవరిస్తూ మేం ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను నియమిస్తా. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్లని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
సైబర్ నేర దర్యాప్తులో పెరగనున్న సమన్వయం
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంక మధ్య చట్టాల అమలుతోపాటు సైబర్–భద్రతా రంగంలో సామర్థ్య పెంపు, దర్యాప్తులో సమన్వయం పెంచేందుకు ఐటీఈసీ (ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) కోర్సు ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్’అంశంపై శ్రీలంక సీనియర్ పోలీస్ అధికారులకు ఐటీఈసీ కోర్సులో శిక్షణ ఇచ్చారు. జూన్ 30 నుంచి జూలై 11 వరకు రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (సీడీటీఐ)లో శిక్షణ నిర్వహించారు.ఈ కోర్సు ముగింపు సందర్భంగా శనివారం నిర్వ హించిన వాలెడిక్టరీ వేడుకకు ముఖ్యఅతిథిగా రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు, గౌరవ అతిథిగా ఉత్తరాఖండ్ హోంగార్డ్స్ డీజీ డాక్టర్ పీ.వీ.కే.ప్రసాద్ హాజరయ్యారు. సీడీటీఐ డైరెక్టర్ సల్మంతాజ్ పాటిల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కార్తికేయన్ ఈ కోర్సు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. కోర్సు కోఆర్డినేటర్, సీడీఐటీ డీఎస్పీ కేకేవీరెడ్డి కోర్సు నివేదికను సమర్పించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ, శ్రీలంక పోలీసు అధికారులు ఈ కోర్సు నుంచి పొందిన జ్ఞానం వారి దేశంలో పోలీసు వ్యవస్థను మెరుగ–శ్రీలంకల మధ్య లా ఎన్ఫోర్స్మెంట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సామర్థ్య నిర్మాణం, సమాచార వినిమయంలో బలమైన సహకారాన్ని ఏర్పరుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా అధికారుల వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడడమే కాకుండా, ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు విశ్వాసం, బలమైన బంధాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. కోర్సులో పాల్గొన్న శ్రీలంక అధికారులకు సరి్టఫికెట్లు, స్మారక చిహ్నాల పంపిణీతో కార్యక్రమం ముగిసింది. -
ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన డైరెక్టర్గా సందీప్శుక్లా
రాయదుర్గం: ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన డైరెక్టర్గా సందీప్శుక్లా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పీజే నారాయణన్ తన స్నాతకోత్సవ ఉపన్యాసంలో మాట్లాడుతూ త్వరలో డైరెక్టర్ పదవిని వదిలి అధ్యాపకుడిగా కొనసాగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ కాన్పూర్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్, ఐఈఈఈఫెలో అయిన సందీప్ కె.శుక్లా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా గుర్తింపు పొందారు.అమెరికాలోని ఎస్యూఎన్వై అల్బనీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సందీప్శుక్లా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్ లాంటి అగ్రగామి సంస్థకు నూతన నాయకత్వ బా«ధ్యతలు చేపట్టే అవకాశం రావడం గర్వంగా ఉందని, ఇదొక సవాలుతో కూడిన అవకాశంగా పేర్కొన్నారు. వచ్చే నెలలో ఆయన ట్రిపుల్ఐటీ హైదరాబాద్ డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. -
21 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లోప్రవేశం కోసం నీట్ యూజీ– 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన కౌన్సెలింగ్ తేదీలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆలిండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21 నుంచి 30వతేదీ వరకు జరుగు తుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ వరకు సాగనుంది.స్టేట్ కౌన్సెలింగ్ మొ దటి దశను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 వరకు మూడు రౌండ్లలో ఈ కౌన్సెలింగ్ సాగనుందని ఎంసీసీ తెలిపింది. సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. తెలంగాణ నుంచి నీట్ యూజీ –2025 పరీక్ష 70,259 మంది రాయగా, 43,400 మంది కౌన్సెలింగ్కు అర్హత సాధించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్ సీట్లురాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా , 26 ప్రైవేటు కాలేజీలు. మల్లారెడ్డి డ్రీమ్డ్ యూనివర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్ఐ, బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ కళాశాలలన్నింటిలో కలిపి 9,065 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో 34 ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి. మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి.అలాగే 26 ప్రైవేట్ కళాశాలల్లో 4,350 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్ కాలేజీలు (ఒకటి మహిళా కాలేజ్) డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి. ఈ రెండు కళాశాలల్లో కలిపి 400 సీట్లు ఉండగా, డీమ్డ్ యూనివర్సిటీ విభాగంలో వీటికి కౌన్సెలింగ్ జరుగనుంది. కాగా ప్రైవేటు కాలేజీల్లోని 4,350 సీట్లలో 50 శాతం కనీ్వనర్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. మరో 35 శాతం సీట్లు బీ – కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు లు చెల్లించే స్తోమత ఉన్నవారికే కేటాయిస్తారు. ఇవి కాకుండా ఈఎస్ఐ కాలేజీలో 125 సీట్లు, బీబీనగర్ ఎయిమ్స్లోని 100 సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. -
‘ఆర్టీజన్ల’ నిరవధిక సమ్మె వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ భద్రత కల్పించాలని..అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి చేపట్టాలని భావించిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఆ సంఘం చైర్మన్ ఈశ్వర్రావు, కనీ్వనర్ వజీర్, కోచైర్మన్ గాంబో నాగరాజులు మింట్కాంపౌండ్లో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి సానుకూల ప్రకటన రావడం, విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు సృష్టించొద్దనే ఆలోచనతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడబోదన్నారు. అయితే తమ సమ్మె నోటీసులపై విద్యుత్ సంస్థల సీఎండీలు స్పందించి, ప్రభుత్వంతో మాట్లాడేందుకు 15 రోజుల సమయం కావాలని కార్మికశాఖను కోరినట్టు తెలిపారు. కార్మికశాఖ అధికారి హామీ మేరకు తాత్కాలికంగా నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో నరేందర్, లింగం, కోటి పాల్గొన్నారు. -
రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.హైదరాబాద్తోపాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవ ల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉద్యోగులకు సముచిత అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తాం. రీజినల్ రింగ్ రోడ్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నాం’అని వివరించారు.ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అంశంపై చర్చ జరిగింది. అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి చెల్లింపులు కష్టం అవుతోందని సీఎం తెలిపారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
సృజనాత్మకతతోనే ఉన్నత శిఖరాలకు..
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద వృత్తిలో నైపుణ్యంతోపాటు సృజనాత్మకత అవసరమని, అవి పాటించినవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. వర్ణ వివక్ష, సామాజిక వివక్షపై పోరాడిన న్యాయవాదుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. న్యాయవాద వృత్తిలో అడ్డంకులుంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు.న్యాయవ్యవస్థలో విశ్వాసం, నిబద్ధత, ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బీఆర్ గవాయ్, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, నల్సార్ చాన్స్లర్, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజేఐ పలుసూచనలు, సలహాలు ఇచ్చారు.విదేశీ విద్యపై మోజు వద్దు..‘నల్సార్ అంటే విద్యా నైపుణ్యం మాత్రమే కాదు.. చట్ట విలువల పట్ల దాని లోతైన నిబద్ధత. దేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థల కంటే మెరుగ్గా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొత్త ప్రపంచం, సాంకేతిక పరిణామాలకు ప్రతిస్పందనగా వృత్తి అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా బలమైన పునాదులు అవసరం. సహచరుల ఒత్తిడి కారణంగా విదేశీ విద్యపై మోజు పెంచుకోవద్దు. అంతర్జాతీయ అర్హతతోనే ఎదుగుదల సాధ్యమన్నది అవాస్తవం.దేశంలో నాణ్యమైన విద్యకు కొదవలేదు. కొందరు ఆర్థిక భారమైనా విదేశాలకు వెళ్లాలని భావించడం సరికాదు. అది ఆ కుటుంబాలను అప్పుల్లో మునిగేలా చేస్తుంది. ఎల్ఎల్బీతోనే ఆగిపోకుండా ఎల్ఎల్ఎం సహా ఉన్నత చదువులపై దృష్టి సారించాలి. కోర్టు, కక్షిదారుల ముందు న్యాయవాదులు తమను తాము నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడాలి. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమర్థవంతమైన న్యాయవాదిగా నిలబడగలుగుతారు’ అని సూచించారు.విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తున్న సుప్రీంకోర్టు సీజే గవాయ్, జస్టిస్ పీఎస్.నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్పాల్, సీఎం రేవంత్రెడ్డి నిబద్ధతతో ముందుకు సాగాలి..విద్యా నైపుణ్యం, రాజ్యాంగ విలువలు, సమ్మిళిత వృద్ధికి నల్సార్ కట్టుబడి ఉందని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద ప్రత్యేక కోర్టుల ఆధునీకరణపై కేంద్రంతో కలిసి పని చేశామని చెప్పారు. డిగ్రీలు అందుకుని వెళ్తున్న విద్యార్థులు నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసుకున్న పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ (పన్ను చట్టాలు), ఎంఏ (క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్), బీఏ ఎల్ఎల్బీ(హానర్స్), బీబీఏ (హానర్స్), బీబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బీఆర్ గవాయ్, రేవంత్రెడ్డి పసిడి పతకాలు ప్రదానం చేశారు. అత్యధికంగా ఇషికా గార్గ్ 8, ఖండేకర్ సుకృత్ శైలేంద్ర 7, అర్చిత సతీశ్ 6 పతకాలు సాధించారు. రెండు వీసీ మెడల్స్తో కలిపి మొత్తం 58 బంగారు పతాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి, వర్సిటీ రిజి్రస్టార్ కె. విద్యుల్లతారెడ్డి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐతో సీఎం రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.ఏఐతో సత్వర న్యాయం సాధ్యమే..‘ఏటా న్యాయవాద విద్యలోకి వచ్చే వారు పెరుగుతున్నారు. అయితే, వృత్తిలో నైపుణ్యం పెంచుకున్నవారే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. దేశానికి ఉత్తమ న్యాయవాదుల అవసరం ఎంతో ఉంది. మనదేశం ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. సరై న పద్ధతిలో ఉపయోగిస్తే సత్వర న్యాయం అందించేందుకు దోహదం చేస్తుంది. స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ.. ఈ ఐదు అంశాలు ఎప్పు డూ చెక్కుచెదరకుండా చూసుకోవాలి’అని ఉద్బోధించారు. -
రైతునేస్తం–2025 పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రైతు నేస్తం(Rythunestam) పురస్కారాలకు వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నొవేషన్స్, రైతు ల నుంచి రైతు నేస్తం మాసపత్రిక దరఖాస్తులకు ఆహా్వనించింది. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్లో రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఐ.వి.సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష సేవ లందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నొవే షన్స్ను అవార్డులతో ఘనంగా సత్కరించనుందని నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.రైతునేస్తం వెబ్సైట్ https://rythunestham.in/awards నుంచి అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి ‘ఎడిటర్, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్–500004, ఫోన్: 9676797777 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం.8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్–522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపాలని సూచించారు. లేదంటే editor@rythunestham. in కు ఇ–మెయిల్ చేయవచ్చని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని తెలిపారు. -
పారిపోయి రైలెక్కేస్తున్నారు!
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఆగింది. అక్కడ 26 మంది చిన్నారులతో ఎనిమిది మంది వ్యక్తులు రైలెక్కారు. వారు సికింద్రాబాద్లో దిగాల్సి ఉంది. సాధారణంగా రైలెక్కినప్పుడు చిన్నారుల్లో ఓ సంబరం కనిపిస్తుంది, కిటికీల్లోంచి చూస్తూ కేరింతలు కొట్టడం సహజం. కానీ, ఈ చిన్నారుల్లో ఎక్కడా చలాకీతనం లేదు, దిగాలుగా కూర్చున్నారు. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాడు. రైలు సికింద్రాబాద్లో ఆగగానే, రైల్వే భద్రతా దళ సిబ్బంది కోచ్లోకి వచ్చి వారందరినీ అదుపులోకి తీసుకుంది. ఆరా తీస్తే.. ఆ 26 మందిని హైదరాబాద్ శివారులోని పరిశ్రమల్లో బాలకార్మికులుగా వెట్టి చేయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. పిల్లలను తరలిస్తున్న వారిని అరెస్టు చేసి.. ఆ బాలలకు స్వేచ్ఛ కల్పించారు. - సాక్షి, హైదరాబాద్ముంబై వెళ్లే రైలు జనరల్ కోచ్ ఎక్కిన ఇద్దరు 13 ఏళ్ల బాలికలు, రాత్రి వేళ స్లీపర్ కోచ్లోకి చేరుకున్నారు. వారి వద్ద అన్ రిజర్వ్డ్ టికెట్లు మాత్రమే ఉండటంతో టీసీ నిలదీశాడు. పొంతనలేని సమాధానం చెప్పటంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన సమాచారమిచ్చాడు. వారు బాలికలను అదుపులోకి తీసుకుని విచారిస్తే, చదవడం ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించారు. దీంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.బడికి వెళ్లటం ఇష్టం లేక కొందరు.. తల్లిదండ్రుల మధ్య తరచూ జరిగే గొడవలతో విసిగిపోయి మరికొందరు.. సినిమాల్లో నటించాలని ఇంకొందరు.. కిడ్నాప్నకు గురై మరికొందరు.. ఇలా అనేక కారణాలతో తరచూ రైళ్లలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తు్తన్న బాలలను రైల్వే రక్షక దళం సిబ్బంది కాపాడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గత రెండున్నరేళ్లలో 3,433 మంది ఇలాంటి చిన్నారులను రక్షించారు. ఇది పెద్ద సంఖ్య కావటంతో మరింత అప్రమత్తంగా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తోంది.రైళ్లెక్కేస్తున్నారుఇళ్ల నుంచి పారిపోయే చిన్నారుల్లో అత్యధికులు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. రోడ్డు మార్గాన వెళ్తే పోలీసు తనిఖీలు ఉంటాయన్న ఉద్దేశంతో, పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు కూడా రైళ్లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. వీరిని గుర్తించేందుకు ఇప్పుడు రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) సిబ్బంది మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, తిరుపతి, విజయవాడ, నాందేడ్ డివిజన్హెడ్క్వార్టర్స్లో ప్రత్యేకంగా చైల్డ్ హెల్ప్ డెస్్కలు ఏర్పాటు చేశారు.ఇళ్లనుంచి పారిపోయి రైలెక్కుతున్న చిన్నారులు, అక్రమ రవాణాలో భాగంగా తరలిస్తున్న పిల్లలను గుర్తించి రక్షించటమే ఈ డెస్క్ల పని. రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచడం, సంబంధిత విభాగాలతో సమన్వయం చేయడం, కోచ్లూ స్టేషన్లలో గుర్తించిన పిల్లలకు తక్షణ సంరక్షణ క ల్పించటం, ప్రజలలో అవగాహన క ల్పించడం ద్వారా ఈ డెస్్కలు అలాంటి చిన్నారులు ఆపదల్లో చిక్కుకోకుండా చూడగలుగుతున్నాయి. ఈ పిల్లలను గుర్తించేందుకు రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల సంఖ్య కూడా పెంచుతున్నారు.ప్రత్యేక కార్యక్రమాలురైల్వే భద్రతా విభాగం ‘ఆపరేషన్ నన్హే ఫరిõÙ్త’, ‘ఆపరేషన్ – యాక్షన్ అగైనస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్’వంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఒంటరిగా రైళ్లలో సంచరించే చిన్నారులు, బలవంతంగా వారిని తరలించేవారిని గుర్తించి వివరాలు వాకబు చేసి ప్రమాదంలో ఉన్న చిన్నారులను రక్షించి తిరిగి ఇళ్లకు తరలిస్తున్నారు. ఇళ్లకు వెళ్లేందుకు నిరాకరించే వారిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలకుగాను పోలీసులకు అప్పగిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పనిచేసే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులకు ఇప్పుడు ఇలాంటి చిన్నారులను గుర్తించి కాపాడే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ‘బచ్పన్ బచావో ఆందోళ¯న్’అనే సంస్థతో కలిసి జోనల్ స్థాయిలో సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి.దేశవ్యాప్తంగా 16వేల మంది⇒ 2024 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 16వేల మంది చిన్నారులను కాపాడింది. వీరిలో 3,000 మంది అమ్మాయిలే. నన్హే ఫరిõÙ్త కార్యక్రమం ద్వారా ఒక్క 2024లోనే 10వేలకుపైగా కుర్రాళ్లను కాపాడారు. ఈ ఏడాది జూన్ వరకు 6వేలకుపైగా చిన్నారులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చారు.⇒ రైల్వే కోచ్లు, స్టేషన్లలో అనుమానాస్పదంగా తిరిగే చిన్నారులు; ఆందోళనగా కనిపించే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు @RailMinIndia, @SCRailwayIndia, @Gmscrailway తదితర ఎక్స్ హ్యాండిల్స్లో కూడా పోస్ట్ చేయవచ్చు.139కి సమాచారమివ్వండి‘ఇళ్ల నుంచి పారిపోయే చిన్నారులు, చైల్డ్ ట్రాఫికింగ్కు బలయ్యే బాలలను రక్షించే సామాజిక బాధ్యతతో రైల్వే శాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ విషయంలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి వేలాది బాధిత చిన్నారులను రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. రైల్వే చొరవకు ప్రజల సహకారం తోడైతే మరింత మందిని రక్షించవచ్చు. రైలు ప్రయాణికులు పరిసరాలను గమనిస్తూ అనుమానం ఉన్న చిన్నారుల విషయాన్ని 139 ద్వారా గాని, రైలు మద్దతు పోర్టల్ ద్వారా గాని సమాచారం అందిస్తే రైల్వే సిబ్బంది వెంటనే స్పందిస్తారు’. – ఎ.శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి -
హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు నాజర్ పెట్టారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.శేరిలింగంపల్లి సిద్ధిక్ నగర్లో కల్లు కాంపౌండ్పై దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టారు.కల్లు కాంపౌండ్లలో సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపించిన ఎక్సైజ్ అధికారులు.. తనిఖీల సమయంలో కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలన్నారు. కల్లులో ఎలాంటివి కలిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్ప్రోజలం లాంటివి మత్తు కోసం కలిపితే నేరమన్న పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఒక్కసారి ఇలాంటివి చేసి పట్టుపడితే పర్మినెంట్గా లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. -
ఒక్క ఏడాదిలో భారీగా పెరిగిన లీజులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(హెచ్1)లో 2.68 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన 1.90 కోట్ల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం లీజులు పెరిగాయి.అలాగే 2025 హెచ్1లో టాప్–7 నగరాలలో కొత్తగా 2.45 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది హెచ్1లో సప్లయి అయిన 1.96 కోట్ల చ.అ.తో పోలిస్తే ఏడాది కాలంలో 25 శాతం సరఫరా పెరిగిందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఐటీ హబ్గా పేరొందిన హైదరాబాద్లో 2025 హెచ్1లో 42 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది.గతేడాది హెచ్1లో 31.2 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే 35 శాతం లావాదేవీలు పెరిగాయి. ఇక, ఇదే సమయంలో గ్రేటర్లో కొత్తగా 47 లక్షల చ.అ. ఆఫీసు స్థలం సరఫరా అయింది. 2024 హెచ్1లో సప్లయి అయిన 56.8 లక్షల చ.అ. స్పేస్తో పోలిస్తే ఏడాది కాలంలో సరఫరా 17 శాతం మేర తగ్గింది. -
హైదరాబాద్లో సొంతింటి కోసం రాజీ పడాల్సిందేనా?
విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీపడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. - సాక్షి, సిటీబ్యూరోప్రాంతమెక్కడ? ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్తోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది. సదుపాయాల సంగతేంటి? నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్కు మంచి పేరుందా? స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణమెలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు. పరిసరాలెలా ఉన్నాయి? ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదభరిత వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. -
‘కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదు’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మక నిర్ణయమని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సామాజిక విప్లవానికి నాంది పలికిన ఈ సందర్భంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం జీవితంలో తాను చేసుకున్న అదృష్టమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.బీసీ రిజర్వేషన్ల పట్ల తమకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ కనీసం హర్షించే స్థితిలో లేకపోవడం దౌర్బగ్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ వారి హయాంలో మద్దతు ప్రకటించిందన్నారు. బీసీల పట్ల బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదుప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉందనే విషయం అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయా? లేదా?, దెయ్యాల పీడ వదిలిందా?, కవిత ఎందుకు స్పందించడం లేదు? అని టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. -
వీధి పోటుతో ఆటుపోట్లు, అసలేంటీ వీధిపోటు!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి. ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు. ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది. వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి. వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.నోట్ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్! -
ప్రేమ, పట్టుదల, బాధ్యతల నడుమసాగే ప్రేమకథ ‘జయం’ జీ తెలుగులో!
హైదరాబాద్, 11 జులై 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం, జులై 14న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, మీ జీ తెలుగులో!జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్ (శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే. ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ప్రముఖ నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, "జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం," అన్నారు.జయం సీరియల్ జులై 14 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభంతో ఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి, చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి. ఈ విషయాన్ని జీ తెలుగు ప్రేక్షకులు గమనించాలని జీ తెలుగు విజ్ఞప్తి చేసింది. -
రూకల్లోతు కష్టాల్లో మెట్రో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. ఆదినుంచీ నష్టాల బాటలోనే పరుగులు తీస్తోంది. ఇప్పటివరకు మొత్తం రూ.6,605.51 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.625.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం ఆదాయం రూ.1,108.54 కోట్లు కాగా, మొత్తం నిర్వహణ ఖర్చు రూ.1,734.45 కోట్ల వరకు నమోదైంది. పన్ను చెల్లింపుల అనంతరం వార్షిక నష్టం రూ.625.88 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నగరంలో నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, ఎంజీబీఎస్–జేబీఎస్ల మధ్య ప్రస్తుతం 57 రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. గతేడాది వరకు సుమారు 4.85 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఈ ఏడాది మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్– రాయదుర్గం, ఎల్బీ నగర్– మియాపూర్ రూట్లలోనే ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. -
రాజాసింగ్కు బీజేపీ రాంరాం
సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శకం ముగిసింది. ఆయన రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది. అధిష్టానంపై తనదైన శైలిలో విమర్శనా్రస్తాలను సంధించడంతో కొంత కాలంగా కంటిలో నలుసులా తయారయ్యారని సొంత పార్టీ నేతలు భావించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని వ్యతిరేకిస్తూ వచి్చన ఎమ్మెల్యే తాజాగా నూతన అధ్యక్షుడి ఎన్నికనూ విడిచిపెట్టలేదు. రాంచందర్రావుపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం దిగి వస్తుంది, బుజ్జగిస్తుందని భావించిన రాజాసింగ్కు నేతలు షాకిచ్చారు. ఆయన రాజీనామాను అధిష్టానం ఆమోదించారు. దీంతో జీహెచ్ఎంసీలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ దూరమవడంతో ఆ పారీ్టకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. హిందుత్వంతో దూకుడు.. రాజాసింగ్ హిందుత్వ వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన పెట్టింది పేరు. దూకుడుగా ప్రవర్తించి కొన్ని సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకోవడం అలవాటుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ను ఏడాదికిపైగా బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎన్నికల ముందు పారీ్టలోకి తీసుకుని, టికెట్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని వ్యతిరేకించిన రాజాసింగ్.. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా కనిపించింది లేదు. రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసినా కొంత వరకు ఓపికపడుతూ వచ్చారు. ఆ మధ్య ఎంపీ బండి సంజయ్ వచ్చి సముదాయించిన తర్వాత కాస్త తగ్గిన రాజాసింగ్.. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్రావును ప్రకటించడంతో మరోసారి నోటికి పని చెప్పారు. ఈ సమయంలో పార్టీ అగ్రనాయకులను సైతం విడిచిపెట్టలేదు. దీంతో రాజాసింగ్ వ్యవహారాన్ని పార్టీ సీనియర్గా తీసుకుంది. ఆయన రాజీనామా చేసినా గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లలో ఏ ఒక్కరూ ఆయన వెంటరాలేదు.భవిష్యత్ ప్రయాణం ఎటు? పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో తదుపరి రాజాసింగ్ దారి ఎటు అని చర్చ సాగుతోంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ వరుసగా మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు బీజేపీకి దూరం కావడంతో ఆయన మద్దతుదారులు, కొంతమంది అనుచరులు మాత్రం ఆయన శివసేన పారీ్టలో చేరుతారని చెబుతున్నారు. మరో వైపు హిందూ ఎజెండాపై కొత్త పార్టీ పెడతారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Bike Taxi: కొనసాగింపు సరే... పర్యవేక్షణ ఎలా..?
సాక్షి,హైదరాబాద్: క్యాబ్ల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీలను కొసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ని విడుదల చేసింది. బైక్ ట్యాక్సీలు వైట్ నెంబర్ ప్లేట్పై పని చేసేందుకు అనుమతి ఇచి్చంది. అయితే ఈ సేవలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అనుమతుల విధానం, నియంత్రణ లేదు. కేవలం ఆయా సంస్థల యాప్ల ఆధారంగా ఇవి పని చేస్తున్నాయి. బైక్ ట్యాక్సీలను అవసరమైన స్థాయిలో నిర్వాహకులు పర్యవేక్షించలేకపోతున్నారు. ఈ విధానంలో లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులో ప్రయాణికుల భద్రతకు పెను సవాల్ ఎదురుకానుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి ‘ప్రత్యేకతలు’ అవసరం లేదు... రాజధానిలో ఆటోలు , ట్యాక్సీలు నడపాలంటే ఆ డ్రైవర్లకు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బ్యాడ్జ్ తప్పనిసరి. సదరు వాహనాలకు సైతం కచ్చితంగా ఎల్లో నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. బైక్ ట్యాక్సీల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవీ ప్రస్తుతం అమలులో లేవు. వైట్ నెంబర్ ప్లేట్లతోనే, సాధారణ డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన వారే ఆయా సంస్థల వద్ద యాప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకుని బైక్ ట్యాక్సీలు నడిపేస్తున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సైతం క్యాబ్ల మాదిరిగా... ఏది బైక్ ట్యాక్సీనో, ఏది సొంత బైకో గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం వైట్ ప్లేట్కు ఓకే చెప్పేయడం గమనార్హం. ప్రయాణికుడి భద్రత ఎవరి బాధ్యత? బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. మోటారు వాహనాల చట్టం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో దీనిని కచి్చతంగా అమలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైబరాబాద్లోనూ తప్పనిసరి చేశారు. వాణిజ్య సేవలు అందించేటప్పుడు పిలియన్ రైడర్ బాధ్యత బైక్ రైడర్దే అవుతుంది. దీని ప్రకారం చూస్తే బైక్ ట్యాక్సీ డ్రైవర్ వద్ద కచి్చతంగా రెండు హెల్మెట్లు ఉండాలి. ఒకటి తాను ధరించి రెండోది రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడికి అందించాలి. అయితే ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్లలో ఒక హెల్మెట్ మాత్రమే కనిపిస్తుంటుంది. రెండు హెల్మెట్లు కలిగి ఉండాలంటూ ఈ డ్రైవర్లకు రిజి్రస్టేషన్ చేసే సంస్థలు చెబుతున్నా అమలు కావడం లేదు. కొన్ని సంస్థలు అందించినవి సైతం డ్రైవర్లు తమ వెంట తీసుకురావట్లేదు. పత్తాలేని పని గంటల విధానం... కిరాయికి ప్రయాణికుల్ని చేరవేస్తూ సంచరించే బైక్ ట్యాక్సీలు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచి్చతంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే బైక్ ట్యాక్సీ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ టార్గెట్లను తట్టకోలేక కొందరు డ్రైవర్లు ఈ పని మానుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడో నెంబరు... ఇక్కడో నెంబరు... బైక్ ట్యాక్సీల నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజి్రస్టేషన్ను (ఎటాచ్మెంట్) పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్ను వినియోగించి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, నెంబర్తో పాటు అతడి రేటింగ్ సైతం కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో బైక్ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉంటే... వాటిని డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. -
త్వరలో రోహిత్ వేముల చట్టం
సాక్షి, న్యూఢిల్లీ: పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్దపీట వేసి, ఉన్నత పదవులను కట్టబెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హెచ్సీయూ ఎదుట ఆందోళన చేశారని గుర్తు చేశారు. రాంచందర్రావు ఒత్తిడి కారణంగా ఆ సమయంలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్లో ఉన్న విద్యార్థులపై యూనివర్సిటీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంతటి ఘటనకు కారకుడైన రాంచందర్రావుపై చర్యలు తీసుకోకుండా అధ్యక్ష పదవి ఇచ్చి న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు భట్టి చెప్పారు. అతని మృతికి కారకులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్య వంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగా రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు. పదవులు కట్టబెడతారా? ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తోపాటు ఇంత విషం, ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అప్పట్లో ఈ సూసైడ్ నోట్ దేశ ప్రజల మనసులను కలచివేసింది. వర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై వీసీకి వినతి పత్రం ఇచ్చి ంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్.. రోహిత్తోపాటు మరో నలుగురు అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారు.ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రాంచందర్రావు ఒత్తిడి తేవడంతో పోలీసులు యూనియన్ సభ్యులపై కేసులు నమోదు చేశారు. నలుమూలల నుంచి వచ్చి న ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్తోపాటు మరో నలుగురిని సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేక రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు’అని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రాంచందర్రావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఇబ్బందుల్లేవు పవర్ షేరింగ్ అనేది లేదు.. అందరం కలిసి పనిచేస్తున్నాం బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరాయి: భట్టి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలు మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటనేది వారికే తెలియదన్నారు. వీటిపై తాము ప్రశి్నస్తే.. మితిమీరిన మాటలు మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో భట్టి మీడియాతో చిట్చాట్ చేశారు.‘మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పవర్ షేరింగ్ అనేది ఏమీ లేదు. అందరం కలిసి టీం వర్క్గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం బాగుంది. ఎన్నికల్లో ఇచ్చి న హామీలను ఒక్కోటి పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు క్లిక్ అయ్యింది.. ఎంచక్కా మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఫోర్త్సిటీ పనులు జరుగుతున్నాయి, మూసీ సుందరీకరణను కచ్చితంగా ఈ హయాంలోనే పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాదు. బీజేపీ వాళ్ల మాటలు వినడం ప్రజలు ఎప్పుడో మానేశారు’అని భట్టి అన్నారు. -
కోటాకు కాపు కాద్దాం!
సాక్షి, హైదరాబాద్/హిమాయత్నగర్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేంతవరకు అందరం కలిసి కాపలా కాద్దామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ‘మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మా పక్షం నుంచి పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటాం. ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉంటాం. మీరు కూడా కాపలా కాయాలి. బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి’అని బీసీ సంఘాల నేతలతో సీఎం అన్నట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీచేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలు బీసీ సంఘాల నేతలు శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారితో సీఎం దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆర్డినెన్స్ అనంతరం అటు రాష్ట్ర ప్రభుత్వం పరంగా, ఇటు న్యాయపరంగా చిక్కులు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు బీసీ వర్గాలు సమన్వయంతో ఉండాలని, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. న్యాయస్థానాల్లో కేసులు పడకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా వాటి ప్రభావంతో నష్టం జరగకుండా ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ కేవియట్ పిటిషన్లు వేయాలని సీఎంను ఆర్.కృష్ణయ్య కోరినట్లు తెలిసింది. కోర్టుకెళ్లినా గెలిచేది బీసీలే: ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ను కలిసిన అనంతరం ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధమైన వాటా 75 ఏళ్ల తర్వాత బీసీలకు అందుతోందని.. దీనికి ఎవరూ అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘బీసీల జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాసైనందున చట్టబద్ధత వచ్చింది. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా గెలిచేది బీసీలే. కానీ ఎవరినీ కేసులు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా కోర్టుల్లో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచి న్యాయవాదులను పెట్టాలి.బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేసేందుకు పార్టీల పరంగా ఎవరైనా ప్రోత్సహించినట్టు తెలిస్తే వారిని బయటకు లాగుతాం. బీసీ ప్రజల కోర్టులో నిలబెట్టి ఆ పార్టీల భరతం పడతాం’అని హెచ్చరించారు. సీఎం రేవంత్ను కలిసిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులున్నారు. అంతకుముందు బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయం బీసీల పోరాట విజయమని పేర్కొన్నారు. -
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు సవాల్ చేశారు. తాము పూర్తి సమాచారంతో వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో ఆరుసార్లు నిర్ణయాలు జరిగాయని, శాసనసభలో మూడుమార్లు ఆమోదం పొందాయని తెలిపారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాల తేదీలు, అందులో జరిగిన చర్చ, ఇతర అంశాల వివరాలను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ‘పీసీ ఘోష్ కమిషన్’కు అందజేసినట్లు చెప్పారు. కేబినెట్ నిర్ణయాల కంటే శాసనసభ ఆమోదం మరింత ఉత్తమం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు సి.లక్ష్మారెడ్డి, సు«దీర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని హరీశ్రావు అందజేశారు. అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘కమిషన్కు మా వద్ద ఉన్న అదనపు సమాచారం అందజేశాం. ఈ అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నందున గతంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు, కేబినెట్ నోట్ తదితర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖలు రాసినా స్పందన లేదు. దీంతో మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్ అందజేశాం. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్నా కమిషన్కు అందజేసిన సమాచారం మాకు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలు ఇస్తోందని మాకు అనుమానాలు ఉన్నాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ‘సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్ వేదికగా 50 ఏండ్ల ద్రోహ చరిత్రపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు. అది ‘కవర్ పాయింట్ ప్రజెంటేషన్’. కృష్ణా నదీ జలాల్లో గత ప్రభుత్వం 299ః512 నిష్పత్తిలో వినియోగానికి శాశ్వత ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టిందని రేవంత్ పదేపదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి చేతగాని నాయకుల వల్లే తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని సాధించి 763 టీఎంసీల వాటా కోసం పోరాటానికి బాటలు వేశారు.కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 299 టీఎంసీలు చాలు అంటూ రేవంత్, ఉత్తమ్ సంతకాలు చేసి వచ్చారు. నదుల బేసిన్స్ గురించి బేసిక్స్ తెలియని సీఎం రేవంత్.. అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే రీతిలో నడుచుకోవాలి. కాకతీయులు, నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులను కూడా రేవంత్ కాంగ్రెస్ ఖాతాలో వేసి 54 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే అంతకు మునుపు పదేళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు లక్షల ఎకరాలకు మాత్రమే’అని హరీశ్రావు వివరించారు. తమ్మిడిహెట్టిపైనా అబద్ధాలే.. ‘తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే మేడిగడ్డకు బరాజ్ మారిందని చెప్తున్నా సీఎం రేవంత్ పదేపదే అబద్ధాలు చెప్తున్నారు. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరగడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. గత ఏడాది తెలంగాణ వాటాలో కేవలం 28 శాతం కృష్ణా జలాలను వాడుకుని, చంద్రబాబుకు గురుదక్షిణగా 65 టీఎంసీలు ఆంధ్రాకు మళ్లించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో వస్తాం. దమ్ముంటే సీఎం రేవంత్కు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కానీ ఒక్కటే షరతు.. మైక్ కట్ చేసి అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు’అని హరీశ్రావు సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా హరీశ్రావు నివాళి అర్పించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ పార్టీలోకి? ఆయనేమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరుతున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేసిన రాజాసింగ్.. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.కాగా, రాజీనామాపై మరోసారి స్పందించిన రాజాసింగ్.. పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదన్నారు. హిందుత్వ భావజాలంతో ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలోకి చేరానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. -
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్: రోడ్ల పక్కన స్థలం ఖాళీగా ఉంది కదా అని.. జీహెచ్ఎంసీ పార్కుల ముందు పార్కింగ్ సదుపాయం ఉంది కదా..! అని ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తే జీహెచ్ఎంసీ ఇంటికే చలాన్లు పంపిస్తుంది. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, ఫట్పాత్లపై, పార్కు ల పక్కన అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తూ జారుకుంటే జీహెచ్ఎంసీ (GHMC) ఇక నుంచి చూస్తూ ఊరుకోదు. ఇందుకోసం స్మార్ట్ పార్కింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకు వస్తుంది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ పరిధి కిందికి వచ్చే ఖైరతాబాద్ సర్కిల్–17, జూబ్లీహిల్స్ సర్కిల్–18, గోషామహల్, కార్వాన్, మెహిదీపట్నం తదితర ఐదు సర్కిళ్ల పరిధిలో స్మార్ట్ పార్కింగ్లను అందుబాటులోకి తీసుకురానుంది.30 చోట్ల ఏర్పాటు ఒక్కో సర్కిల్ పరిధిలో 30 చోట్ల స్మార్ట్ పార్కింగ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సింగపూర్ సిటీ తరహా ఇక్కడ కూడా స్మార్ట్ పార్కింగ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఇందుకోసం అనుభవం ఉన్న రెండ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఈ రెండు ఏజెన్సీలు ఖైరతాబాద్లోని జోనల్ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్మార్ట్ పార్కింగ్లు ఎలా ఉండబోతున్నాయో, ఛార్జీలు ఎలా వసూలు చేస్తారో, చలానాలు ఎలా పంపిస్తారో అధికారులకు వివరించాయి.ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎస్ఈ రత్నాకర్, ఐటీ జాయింట్ కమిషనర్, ఆయా సర్కిళ్ల ఇంజినీర్లతో సమావేశమై స్మార్ట్ పార్కింగ్ వల్ల ప్రయోజనాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేట, ఎస్సార్నగర్ (SR Nagar) ప్రధాన రోడ్డులో గంటల తరబడి అక్రమ పార్కింగ్ల చేయడం వల్ల ఏర్పడుతున్న నష్టాలను చర్చించారు. ఈ జాతీయ రహదారిలో ఫుట్పాత్లతో పాటు రోడ్ల పక్కన, జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాల్లో అక్రమ పార్కింగ్లు చేయడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నట్ల గుర్తించారు.సమయాన్ని బట్టి చార్జీలు.. జీహెచ్ఎంసీ గుర్తించిన 30 స్మార్ట్ పార్కింగ్లలో వాహనాలు పార్కింగ్ చేసే వారి నుంచి గంటకు రూ.25 చొప్పున వసూలు చేస్తారు. వాహనం నెంబర్ ఆధారంగా ఇంటికే చలానా వెళ్తుంది. సదరు వాహనదారుడు ఆన్లైన్లో ఛార్జీలు చెల్లించుకోవడానికి అవకాశం కల్పించారు. సంబంధిత ఏజెన్సీలు తమకు అనుసంధానమై ఉన్న స్మార్ట్ పార్కింగ్ యాప్ ద్వారా ఏ వాహనం ఎక్కడ పార్కింగ్ చేసి ఉందో గుర్తించి సమయాన్ని బట్టి ఛార్జీలు పంపిస్తారు. స్మార్ట్ పార్కింగ్స్లో సోలార్ ప్యానెళ్ల ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జీంగ్ పాయింట్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. సీసీ కెమెరాలు (CC Cameras) కూడా ఏర్పాటు చేస్తారు.చదవండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా? అక్రమంగా పార్కింగ్ చేసిన వారికి ఆన్లైన్లో చలానాలు పంపించనున్నారు. కొన్నిచోట్ల రోడ్ల పక్కన ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాల్లో కూడా జీహెచ్ఎంసీ అద్దెకు తీసుకుని స్మార్ట్ పార్కింగ్ను ఏర్పాటు చేయనుంది. వసూలు చేసిన ఛార్జీల్లోనే ప్రైవేటు వ్యక్తులకు అద్దెలు చెల్లిస్తారు. ఒక వాహనం ఏ సమయం నుంచి ఏ సమయం దాకా పార్కింగ్ చేశారో ఏఐ ద్వారా తెలుసుకోనున్నారు. సదరు ఏజెన్సీలే ఈ పార్కింగ్ను నిర్వహించనున్నాయి. -
TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసిన సర్కార్.. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. -
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చదవండి!
దూర ప్రయాణాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. శుభకార్యాలు, పండగలు, పనుల నిమిత్తం ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు సాధారణంగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటాం. అయితే ట్రైన్ జర్నీ చేయాలంటే ముందుగా టికెట్ రిజర్వు చేసుకోవాలి. పండగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్లో రైలు టికెట్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో వెయిటింగ్ లిస్టులు చాంతాడంత పేరుకుపోయి ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే వెయిటింగ్ లిస్ట్లోని వారికి ప్రాధాన్యతా క్రమంలో టికెట్ దొరుకుతుంది. ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్లోని టికెట్ కన్ఫామ్ కాకపోయినా డబ్బులు తిరిగి చెల్లిస్తుంది రైల్వే శాఖ. నిబంధనల మేరకు కొంత మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మాత్రమే ప్రయాణికులకు రిఫండ్ చేస్తుంది. టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వేకు భారీగానే ఆదాయం వస్తోందని తాజాగా వెల్లడైంది.టికెట్ల రద్దు.. పెద్ద పద్దే!సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. టికెట్ క్యాన్సిలేషన్స్ (ticket cancellations) ద్వారా గత నాలుగున్నరేళ్లలో దాదాపు రూ. 700 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. దక్షిణమధ్య రైల్వే వార్షిక ఆదాయంలో ఇది 3.5 శాతం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ వివరాలు రాబట్టింది. ప్రయాణికుల ద్వారా 2024-25లో దక్షిణమధ్య రైల్వేకు వచ్చిన ఆదాయం రూ. 5,710 కోట్లు. 2024లో 1.4 కోట్ల టికెట్లు క్యాన్సిల్ కాగా, ఇందులో 65 లక్షలు వెయిటింగ్లిస్ట్లోనివే. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెయిటింగ్లిస్ట్ ప్రయాణికుల సంఖ్య గత 4 ఏళ్లలో నాలుగింతలు పెరగడం గమనార్హం. 2021లో 15.96 లక్షల టికెట్లు క్యాన్సిల్ కాగా, 2024లో ఈ సంఖ్య 65.62 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు 31.52 లక్షల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. రిఫండ్ ఎంత?రైల్వే నిబంధనల ప్రకారం.. కన్ఫామైన టిక్కెట్ను.. ప్రయాణానికి 12 నుంచి 48 గంటల ముందు రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగతా మొత్తం జమ అవుతుంది. ప్రయాణానికి 4 నుంచి 12 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే సగం మొత్తం మాత్రమే రిఫండ్ వస్తుంది. వెయిటింగ్లిస్ట్లోని టికెట్ కన్ఫామ్ కాకుంటే క్లరికల్ చార్జి కింద రూ. 60 తీసుకుని మిగతా మొత్తం తిరిగిచ్చేస్తారు.'రద్దు'డే రుద్దుడు!కాగా, రైల్వే శాఖ క్యాన్సిలేషన్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. కన్ఫార్మడ్ టికెట్ బుక్ చేసినప్పుడు నామినల్ చార్జీలు తీసుకుంటున్నారని, మరి వెయిటింగ్లిస్ట్లోని టికెట్ కన్ఫామ్ కాకపోయినా క్లరికల్ చార్జి ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకేసారి ఎక్కువ టికెట్లు తీసుకోకుండా ఉండేందుకే క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. తమ జోన్ వార్షికాదాయంలో క్యాన్సిలేషన్ చార్జీల ద్వారా వచ్చే మొత్తం చాలా స్వల్పమని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.చదవండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా?2024-25లో దక్షిణమధ్య రైల్వే ఆదాయ గణాంకాలుమొత్తం ఆదాయం: రూ.20,569 కోట్లుసరకు రవాణా: రూ.13,864 కోట్లుప్రయాణికులు: రూ. 5,710 కోట్లుపార్శిల్, టికెట్ చెకింగ్: రూ.513.6 కోట్లుపార్కింగ్, కేటరింగ్, యాడ్స్: 402.7 కోట్లు -
రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
సాక్షి,న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్కు లేఖ రూపంలో తెలియజేశారు. మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ పని విధానం , సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. మీరు లేవనెత్తి అంశాలు అసందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం అని అరుణ్ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి జూన్ 30వ తేదీన రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్ కోరితే అందుకు తాను సిద్ధమని చెప్పారాయన. కానీ, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలపడం గమనార్హం. -
ఆటో.. రూట్ ఎటో!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో ఆటోపర్మిట్ల దోపిడీ పర్వం మొదలైంది. వారం రోజులుగా ఆటోరిక్షాల షోరూంలలో డ్రైవర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు (ఫస్ట్ టూ ఫస్ట్ కమ్) పద్ధతిలో జరుగుతున్న ఈ నమోదు వల్ల డ్రైవర్లు షోరూమ్లకు పరుగులు తీస్తున్నారు. కేవలం డ్రైవర్ల వివరాలను నమోదు చేసేందుకే సుమారు రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో రిక్షాల ధరలను బహిరంగంగా ప్రకటించకుండా డ్రైవర్లను నమోదు చేసుకోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఆటో సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈవీలకు ప్రోత్సాహం ఏమైనట్టో..? . నగరంలోని ఆటోల స్థానంలో ఔటర్ వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలోనే ప్రకటించారు. కేంద్రం రూపొందించిన ఈవీ పాలసీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఆటోలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 65 వేల ఆటో పర్మిట్లకు అనుమతులను ఇవ్వడంలో మతలబు ఏంటని ఆటో సంఘాలు, పర్యావరణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఈవీల ముసుగులో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను విక్రయించేందుకే ప్రభుత్వం ఈ పర్మిట్లను విడుదల చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎడాపెడా డ్రైవర్లను నమోదు చేసుకొన్న అనంతరం కొత్త ఆటోలకు కృత్రిమ కొరతను సృష్టించి భారీ ఎత్తున ధరలు పెంచేందుకు కొందరు డీలర్లు, ఫైనాన్షియర్లు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆటో సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రిట్రోఫిట్మెంట్..ఎందుకో అక్రమార్కులకు కొమ్ముకాసే విధంగా ఉన్న కొత్త పర్మిట్ల విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 20 వేల ఈవీలతో పాటు మరో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు అనుమతులను ఇచ్చారు. ఇవి కాకుండా 25 వేల పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు రిట్రోఫిట్మెంట్ అనుమతులను ఇచ్చారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ విడుదల చేసిన ఆటోరిక్షా పర్మిట్ల పందేరంలో డ్రైవర్లే మరోసారి సమిధలుగా మారనున్నారు. నమోదైన చోట కొనేందుకేనా... ఆటోడ్రైవర్లు తెలంగాణలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చని ఆర్టీఏ విధివిధానాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు షోరూమ్లలో రవాణాశాఖ లాగిన్ సౌకర్యం కల్పించారు. షోరూమ్ల వద్ద నుంచి వచ్చే డ్రైవర్ల వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారులు పర్మిట్లను విడుదల చేస్తారు. ఈ పర్మిట్లపై సదరు డ్రైవర్ కొత్త ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ తమ వద్ద ఆటోను కొనుగోలు చేసే డ్రైవర్ల వివరాలను మాత్రమే షోరూమ్లలో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ముందస్తుగా రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. డీలర్ల అక్రమార్జన కోసమే 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ పర్మిట్లు ఔటర్ వరకు ఈవీలంటూనే ఎల్పీజీకి అనుమతులు పాత ఆటోలకు ఈవీ రిట్రోఫిట్మెంట్లు -
సీబీఎస్లో ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రం
సాక్షి, సిటీబ్యూరో: గౌలిగూడలోని సెంట్రల్ బస్టేషన్లో ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత గురువారం దీనిని ప్రారంభించారు. ఈ కౌంటర్ ద్వారా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు బెంగళూరు, చైన్నె, ముంబై, పుణె తదితర ప్రధాన నగరాలకు సైతం రిజర్వేషన్లు చేసుకోవచ్చని ఆమె వివరించారు. ప్రయాణికులు ఈ కొత్త కౌంటర్ ద్వారా ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకొని, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని సూచించారు. -
ఏసీబీ వలలో మహిళా పీఎస్ ఎస్ఐ
గచ్చిబౌలి: ఓ కేసులో పేరు తొలగించేందుకు డబ్బులు తీసుకుంటూ గచ్చిబౌలి ఉమెన్ పీఎస్ ఎస్ఐ వేణుగోపాల్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తతో పాటు అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడారు. గృహహింస కేసులో తల్లి పేరును తొలగించేందుకు ఎస్ఐ వేణు గోపాల్ రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ భర్త ఏసీబీ అధికారులను అశ్రయించారు. గురువారం మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేణుగోపాల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. -
డీఎన్ఏ పరీక్షలకు ఆనవాళ్లు లేవు!
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలోని అలబామాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవదహనమైన హైదరాబాదీ కుటుంబానికి సంబంధించి అక్కడి అధికారులు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరించలేకపోయారు. అగ్నికీలలు నలుగురి మృతదేహాలను పూర్తిగా కాల్చేయడంతో ఇది సాధ్యం కాలేదు. దీంతో అమెరికన్ అథారిటీస్ ఆయా పరిస్థితులతో పాటు కారు వివరాల ఆధారంగా మృతులను ధ్రువీకరించారు. వీరి అంత్యక్రియలు శుక్రవారం అమెరికాలోని అట్లాంటాలో జరుగనున్నాయి. హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్, గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్ బెజుగంకు (40), జీడిమెట్లకు చెందిన తేజస్వి చోల్లెటితో (36) 2013లో వివాహం జరిగింది. వీరికి సిద్ధార్థ్ (9), మృద (7) సంతానం. ఐటీ ప్రొఫెషనల్స్ అయిన వారు మూడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. పశుపతినాథ్ కుటుంబం ప్రస్తుతం కొంపల్లిలోని ఎన్సీఎల్లో ఉంటోంది. ఇటీవలే వీరు తమ కుమారుడి వద్దకు అమెరికా వెళ్లారు. వెంకట్ కుటుంబం డాలస్ సమీపంలోని సట్టన్ ఫీల్డ్స్ కమ్యూనిటీలో నివసిస్తోంది. అతడి సోదరి దీపిక అట్లాంటాలో ఉంటున్నారు. గత వారం తన తల్లిదండ్రులతో కలిసి వెంకట్ కుటుంబం సోదరి వద్దకు వెళ్లింది. శనివారం వీరంతా సట్టన్ ఫీల్డ్స్కు తిరుగు ప్రయాణం కాగా... వెంకట్ కుటుంబం కారులో, అతడి తల్లిదండ్రులు విమానంలో బయలుదేరారు. అక్కడి కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 10.17 గంటల ప్రాంతంలో కారు అలబామాలోని గ్రీన్ కౌంటీలో ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్కు వీరి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారుకు నిప్పంకుకోవడంతో వెంకట్ కుటుంబం సజీవ దహనమైంది. విమానంలో డాలస్ చేరుకున్న అతడి తల్లిదండ్రులు ఎంతకూ తమ కుమారుడి కుటుంబం ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ప్రమాద విషయం తెలిసింది. అలబామా అధికారులు తొలుత డీఎన్ఏ, ఆపై దంతాల నమూనాలు సేకరించడం ద్వారా వెంకట్ సహా నలుగురి గుర్తింపును ధ్రువీకరించాలని భావించారు. అయితే నమూనాలు సైతం సేకరించలేని విధంగా మృతదేహాలు కాలిపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అప్పటి పరిస్థితిలతో (సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్) పాటు కారు రిజిస్ట్రేషన్ వివరాలు, అందులో లభించిన మృతదేహాల సంఖ్య తదితరాలను పరిగణలోకి తీసుకుంటూ మృతులను గుర్తించారు. మృతదేహాలను గురువారం కుటుంబీకులకు అప్పగించారు. శుక్రవారం అట్లాంటాలో వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వెంకట్ తల్లిదండ్రులు అమెరికాలోనే ఉండగా.. తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. డాలస్ ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం మృతి శనివారం ట్రక్కు ఢీకొట్టడంతో కారులో సజీవదహనం ప్రత్యామ్నాయాల ఆధారంగా ముందుకెళ్లిన అధికారులు కారు వివరాలు, ఇతర అంశాలతో మృతుల ధ్రువీకరణ శుక్రవారం అట్లాంటాలో వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు ఏమిటీ డీఎన్ఏ పరీక్షలు..? మొన్న అహ్మదాబాద్లో విమాన ప్రమాదం... నిన్న సంగారెడ్డిలో సిగాచీ పరిశ్రమలో పేలుడు... తాజాగా అమెరికాలో సజీవదహనమైన హైదరాబాదీ కుటుంబం.... ఈ మూడు సందర్భాల్లోనూ తెరపైకి వచ్చి వాటిలో సారూప్యత కలిగిన అంశం డీఎన్ఏ పరీక్షలు. రూపు కోల్పోయిన మృతదేహాలను గుర్తించడానికి ఈ విధానాన్ని వినియోగిస్తారు. ప్రతి వ్యక్తి శరీరంలో ఉండే కణాల్లో డీఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ (డీఎన్ఏ) అనే రసాయనం ఉంటుంది. ఇది ఆ శరీర నిర్మాణం, లక్షణాలు, వంశపారంపర్య సమాచారం తదితర వివరాలు కలిగి ఉంటుంది. డీఎన్ఏ పరీక్షలు చేయడానికి ముందు ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహం నుంచి ఎముకలు, వెంట్రుకలు, దంతాలు లేదా సాఫ్ట్ టిష్యూల్లో ఏదో ఒకటి సేకరిస్తారు. దీనిని పోల్చడానికి ఒక రిఫరెన్స్ నమూనా అవసరం ఉంటుంది. దీన్ని తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు తదితరుల నుంచి సేకరిస్తారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ల్లో పరీక్షించడం ద్వారా రెండింటిలో ఉన్న డీఎన్ఏ ఒకటేనా? కాదా? అనేది తేలుస్తారు. మృతదేహాల గుర్తింపుతో పాటు పిల్లల విషయంలో భార్యాభర్తలు లేదా బంధువుల మధ్య ఏర్పడే సందేహాలను నివృత్తి చేయడానికీ డీఎన్ఏ పరీక్షలు చేయిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన ప్రతి వ్యక్తికీ సంబంధించిన డీఎన్ఏ, జినోన్ సీక్వెన్సింగ్లతో డేటా బ్యాంక్ ఏర్పాటు చేస్తుంటారు. -
రహదారి భద్రతపై ఆర్టీఏ పాఠాలు
సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని హైదరాబాద్ ఉపరవాణా కమిషనర్ ఆఫ్రిన్ సిద్ధిఖి సూచించారు. గురువారం నాంపల్లిలోని మల్లేపల్లి ఐటీఐ కళాశాలలో ఆర్టీఏ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సును ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రారంభించారు. రాష్ డ్రైవింగ్ ప్రమాదకరమని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల వాళ్లు ప్రమాదానికి గురికావడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని చెప్పారు. విద్యాసంస్థల్లో రహదారి భద్రతా క్లబ్లను ఏర్పాటు చేసి విద్యార్ధులకు అవగాహన పెంపొందించాలని ఆమె కోరారు. ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి పురుషోత్తమ్రెడ్డి రహదారి భద్రతపై పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంటా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. హిమాయత్ సాగర్ జలమండలి పార్కులో వన మహోత్సవం సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని హిమాయత్ సాగర్ జలమండలి పార్క్లో గురువారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ మొక్కలు నాటారు. అంతకుముందు గ్రీన్ హౌస్ను ప్రారంభించిన ఎండీ.. అక్కడి మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఈఎన్సీ డైరెక్టర్ ఆపరేషన్–2 వీఎల్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్లు సుదర్శన్, టీవీ శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్–1 అమరేందర్రెడ్డి, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, సీజీఎం బ్రిజేష్, ఈఓ విజయకుమారి, జలమండలి డీసీఎఫ్ వెంకటేశ్వర్లు, ఆర్.ఎఫ్.ఓ నారాయణరావు పాల్గొన్నారు. -
మత్తెక్కిస్తున్న విష రసాయనాలు
● కుదేలవుతున్న పేదల జీవితాలు ● గాల్లో అమాయకుల ప్రాణాలు ● మామూళ్ల మత్తులో అధికారులు ● ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారులు ● కుదిపేసిన కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన ● ఏడుగురికి చేరిన మృతుల సంఖ్య ● ఆస్పత్రుల్లో 45 మందికి చికిత్సలు ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నర్సమ్మ కూకట్పల్లి: కూకట్పల్లి సర్కిల్, బాలానగర్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలోని కల్లు దుకాణాలలో కల్తీ కల్లు విక్రయించటంతో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడగా నిమ్స్తో పాటు వివిధ ఆస్పత్రుల్లో సుమారు 45 మంది చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలతో, జ్వరాలతో ఆస్పత్రుల పాలైన వారు ఒక్కొక్కరుగా మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం ఆరుగురు మృత్యువాత పడగా గురువారం హైదర్నగర్ సాయిచరణ్ కాలనీకి చెందిన నర్సమ్మ (54) తీవ్ర అస్వస్థతకు గురై ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కూలిపనులు చేసుకుంటున్న వారే.. హైదర్నగర్, శంషీగూడ, నిజాంపేట్, అడ్డగుట్ట, ఇందిరా హిల్స్, నడిగడ్డ తండా, వసంత్నగర్, ఎల్లమ్మబండ తదితర కాలనీల్లో పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి కూలిపనులు చేసుకుంటున్న వారే అధికంగా నివసిస్తుంటారు. వీరు తక్కువ ధరలో కల్లు దొరకటంతో పాటు మత్తు ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో కల్లుకు అలవాటు పడ్డారు. ప్రతి రోజు ఆయా ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగుతుంటారు. వీరిని ఆసరాగా చేసుకుని కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు కల్లును కల్తీ చేస్తున్నారు. పేద, మద్య తరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోఫాం, సిట్రిక్ యాసిడ్ వంటి రసాయనాలు నగర శివారులోని పారిశ్రామికవాడ నుంచి దొంగచాటున కొనుగోలు చేసి కల్తీ కల్లులో ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు.. ప్రతి నెలా టంచన్గా దుకాణాలను సందర్శించే అధికారులు, సిబ్బంది కేవలం మామూళ్ల లెక్కలను చూసుకుని కాగితాల్లో శాంపిల్స్ సేకరించినట్లు కల్లు స్వచ్ఛత గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించటం పరిపాటిగా మారింది. బాలానగర్ ఎకై ్సజ్ అధికారులు మూడు రోజులుగా ఏ ఒక్కరికి కనీసం సమాధానం చెప్పకుండా స్థానికంగా ఎవరికీ అందుబాటులో లేకుండా మొహం చాటేస్తూ తిరుగుతున్నారు. కనీసం ప్రజాప్రతినిధులకు కూడా ఎలాంటి సమాధానం చెప్పటం లేదు. దీనిని బట్టి ఎకై ్సజ్ అధికారులకు కల్లు దుకాణ యజమానులతో బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. న కిలీ గీత కార్మికులు నగరంలోని పలు మురికివాడల్లో ఒక షాపు అనుమతి తీసుకుని అనేక బ్లాక్ అడ్డాల్లో కల్తీ కల్లును విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. మాఫియాను గుర్తించాలి.. అమాయకుల జీవితాలతో చెలగాటమాడే కల్తీ కల్లు మాఫియాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కల్లు గీత కార్మికులకు తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే పరీక్షలు పెట్టి వారిని గుర్తించాలని, వారికి మాత్రమే కల్లు అమ్ముకునేలా దుకాణాల లైసెన్స్లు మంజూరు చేయాలని పలువురు డిమాండు చేస్తున్నారు. కాంపౌండ్లోని కల్లును ఎప్పటికప్పుడు తనిఖీ చేసి చార్ట్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కల్లు దుకాణాల మూసివేతతో వింత ప్రవర్తనలు.. కల్తీ కల్లు విషాదాంతం కారణంతో అధికారులు దుకాణాలు మూసివేయించారు. దీంతో రోజూ కల్లు తాగే ప్రజలు వీటి వద్ద వేచి చూస్తున్నారు. మరికొందరు పిచ్చిగా ప్రవర్తిస్తూ పడిపోతున్నారు. ఇంకొందరు కల్లు దొరక్క వైన్ షాపుల్లో దొరికే చీప్ లిక్కర్కు తాగుతున్నారు. గురువారం పలు కల్లు దుకాణాలు మూసివేయటంతో.. ఎల్లమ్మబండలోని కల్లు కాంపౌండ్కు తాకిడి పెరిగింది. ఎకై ్సజ్ అధికారుల దాడులు.. కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనతో ఎకై ్సజ్ శాఖ అప్రమత్తమైంది. 7 బృందాలుగా ఏర్పడి బాలానగర్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్ దాని అనుబంధ హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, కేపీహెచ్బీ భాగ్యనగర్ కాలనీల్లోని కల్లు దుకాణాల్లో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఆల్ఫ్రాజోలం అనే మత్తు మందును కల్తీ చేసినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చారు. సంబంధిత కల్లు కాంపౌండ్ల యజమానులు కూన రవితేజ గౌడ్, నాగేష్ గౌడ్, కూన సాయితేజ గౌడ్, భట్టి శ్రీనివాస్ గౌడ్లను గురువారం న్యాయస్థానం ముందు హాజరుపరిచామని, దుకాణాల లైసెన్స్లను రద్దు చేసినట్లు బాలానగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎల్లమ్మబండ కల్లు కాంపౌండ్లో ఇలా.. వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదు.. సాయిచరణ్ కాలనీకి చెందిన నర్సమ్మ కల్తీ కల్లుతాగి మృత్యువాత పడింది. ఈ ప్రాంతంలో కల్లు కాంపౌండ్ నిర్వహించవద్దని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కల్తీ కల్లుకు పేదలు బలవుతున్నారు. కల్లు దుకాణాలను నగరానికి దూరంగా తరలించాలి. – చందు, సాయిచరణ్ కాలనీ వాసి కుటుంబాలు ఛిన్నాభిన్నం.. కల్తీ కల్లుతో పేద ప్రజల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. పలువురు అనారోగ్యాల బారిన పడటంతో వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. కూకట్పల్లి సర్కిల్లో గతంలో కల్తీ కల్లు తాగి కిడ్నీలు పాడై చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఎకై ్సజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు కల్తీ కల్లు దుకాణాలను కట్టడి చేయాలి. – భద్రయ్య, కూకట్పల్లి మూత్రపిండాలపై పెను ప్రభావం క్లోరో హైడ్రేట్, డైజోఫాం, సిట్రిక్ యాసిడ్ వంటి రసాయనాలను చాలా అరుదుగా వాడతారు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాలతో సహా మిగతా అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కల్లీ కల్లు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. విక్రయించటం కూడా నేరమే. – డాక్టర్ పి.వెంకటకృష్ణ, ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ అండ్ జనరల్ ఫిజీషియన్ -
నెల రోజుల్లో 25 మంది అరెస్టు
బాధితులకు రూ.3.67 కోట్లు రిఫండ్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెలలో వివిధ సైబర్ నేరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లు నిర్వహించారు. ఆయా కేసుల్లో బ్యాంకు ఖాతాలు అందించిన, సమకూర్చిన వారితో పాటు దళారులతో కలిపి మొత్తం 25 మందిని అరెస్టు చేశారు. మరోపక్క నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన మొత్తంలో రూ.3.67 కోట్లు బాధితులకు రిఫండ్ చేయించారు. పట్టుబడిన నేరగాళ్లపై దేశ వ్యాప్తంగా 453 కేసులు నమోదై ఉండగా.. రాష్ట్రంలోని వాటి సంఖ్య 66గా ఉంది. వారి నుంచి 34 మొబైల్ ఫోన్లు, 20 చెక్బుక్స్, 17 డెబిట్ కార్డులు, 8 సిమ్కార్డులు, 16 బ్యాంక్ పాస్పుస్తకాలతో పాటు రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. చైల్డ్ పోర్న్ వీడియోల కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. ఆయా నిందితులు నివసించే ప్రాంతాల్లోని ఠాణాలకు ఈ కేసులను బదిలీ చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పబ్లపై ఈగల్ నిఘా సాక్షి, సిటీబ్యూరో: కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని, డ్రగ్ పెడ్లర్ సూర్య అరెస్టుతో సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం అప్రమత్తమైంది. సూర్య అరెస్టుతో నగరంలోని పలు పబ్లలో డ్రగ్ లింకులు బయటపడటంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ నెల 7న సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డికి సూర్య తన రెస్టారెంట్కు టాటా స్కార్పియో వాహనంలో మాదకద్రవ్యాలతో వస్తున్నాడని సమాచారం అందడంతో తన బృందంతో మల్నాడు రెస్టారెంట్ సమీపంలో నిఘా పెట్టారు. అతడి వాహనాన్ని తనిఖీ చేయగా 3.2 గ్రాముల ఓజీ వీడ్, 1.6 గ్రాముల ఎక్స్టసీ మాత్రలు, 10 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో కొంత భాగాన్ని కొరియర్ ద్వారా డెలివరీ చేసిన ఒక మహిళ పాదరక్షల్లో దాచి పెట్టారు. విచారణ సమయంలో సూర్య హైదరాబాద్లోని ప్రముఖ పబ్బులలో నిర్వహించే పార్టీల ద్వారా క్రమం తప్పకుండా డ్రగ్స్ సేవించి పంపిణీ చేస్తున్నట్లు అంగీకరించాడు. వీటిల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్, జూబ్లీహిల్స్లోని ఫార్మ్ పబ్, మాదాపూర్లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22 వంటివి ఉన్నాయి. ఆయా పబ్లలో డ్రగ్స్ను ఉపయోగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, నైజీరియా, ఢిల్లీలోని ఇతర ప్రాంతాల నుంచి విదేశీ డ్రగ్ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ సేకరించి, పార్టీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో పబ్ యజమానులు రాజా శ్రీకర్, పృథ్వీ వీరమాచినేని, రోహిత్ మెడిశెట్టిల ప్రమేయం ఉన్నట్లు సూర్య పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో ఆయా పబ్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వాటి యజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణ కోసం యజమానులను సమన్లు జారీ చేశారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. చైన్ స్నాచర్ల ఆటకట్టు అమీర్పేట: వారిద్దరూ స్నేహితులు.. బీటెక్ చదువుతున్నప్పటినుంచే చైన్ స్నాచింగ్లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం నగరంలో ఉంటూ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా తమ వైఖరి మార్చుకోలేదు. ఎస్ఆర్నగర్లో స్నాచింగ్కు పాల్పడగా 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ టి.గోవర్ధన్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు లీలా కృష్ణ ప్రసాద్, కోల దినేష్ స్నేహితులు. 2021లో వారు బీటెక్ చదువుతుండగానే గుంటూరులో మూడు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ టెక్ మహీంద్రలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, దినేష్ అమీర్పేటలోని ఓ కోచింగ్ సెంటర్లో సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. ఇద్దరూ కలిసి ఎస్ఆర్నగర్లోని గౌతమి గ్రాండ్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నారు. బుధవారం ఉదయం వారు బైక్పై బంజారాహిల్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. మధ్యాహ్నం ఎస్ఆర్నగర్ బీకేగూడలోని ఓ టీ స్టాల్ వద్దకు చేరుకున్నారు. దినేష్ అక్కడే నిల్చుండగా కృష్ణ ప్రసాద్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని 5 తులాల పుస్తెల తాడు లాక్కెళ్లాడు. అనంతరం ఇద్దరు బైక్పై పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి వారి బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్లకు అలవాటు పడిన వీరు స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి,డీఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. ● తరచూ డ్రగ్స్ పార్టీల నిర్వహణ ● పెడ్లర్ సూర్య అరెస్టుతో వెలుగులోకి అనేక అంశాలు ● పలు పబ్లు, రెస్టారెంట్ల యజమానులకు నోటీసులు బీటెక్ చదువుతున్నప్పటినుంచేస్నాచింగ్లు నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
డీసీలు, జడ్సీలకు
‘ఇన్స్టంట్’ అనుమతుల రద్దు అధికారంస్టాండింగ్ కమిటీ సమావేశంలో 16 అంశాలకు ఆమోదం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అజెండాలోని 14 అంశాలు, టేబుల్ అజెండాలోని 2 అంశాలు కలిపి మొత్తం 16 అంశాలకు గురువారం ఆమోదం లభించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆమోదం పొందిన ముఖ్యాంశాలిలా.. జీహెచ్ఎంసీలో ‘ఇన్స్టంట్’ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి సర్కిళ్లలో వర్క్ కమెన్స్మెంట్ లెటర్ ఇవ్వకముందే తప్పులున్నట్లు గుర్తిస్తే అనుమతులు రద్దు చేసే అధికారం డిప్యూటీ కమిషనర్లకు అప్పగించడం. వర్క్ కమెన్స్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత అయితే రద్దు చేసే అధికారం జోన ల్ కమిషనర్లకు ఇవ్వడం. అనుమతుల్లేకుండా ని ర్మించిన భవనాలను సెక్షన్ 455–ఎ కింద రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అందిన దరఖాస్తుల పరిశీ లన అధికారం జోనల్ కమిషనర్లకు అప్పగించడం. ● సరూర్నగర్ పెద్ద చెరువు ప్రధాన కట్ట మరమ్మతులు, బలోపేతం చేసే పనుల కోసం రూ. 5.60 కోట్ల అంచనా వ్యయంతో షార్ట్ టెండర్ పిలిచేందుకు పరిపాలన అనుమతి. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు బుద్ధభవన్లో హైడ్రా కార్యాలయానికి మూడేళ్ల వరకు(19 ఆగస్ట్ 2024 నుంచి 18 ఆగస్ట్ 2027 వరకు) లీజు కిచ్చేందుకు ఆమోదం. శాస్త్రి పురం ఆర్ఓబీ నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు (మెహఫిల్ హోటల్) వరకు రూ. 4.95 కోట్ల అంచనా వ్యయంతో 100 అడుగుల రోడ్డు విస్తరణ. ● వనస్థలిపురం నుంచి వయా సాహెబ్ నగర్ మీదుగా ఓల్డ్ హయత్ నగర్ వరకు మిస్సింగ్ లింక్రోడ్ కింద రోడ్డును 24 అడుగులకు వెడల్పు చేయడంతో పాటు మాస్టర్ప్లాన్లో చేర్చేందుకు ప్రభుత్వానికి తెలియజేయడం. తద్వారా 102 ఆస్తులపై ప్రభావం పడనుంది. కమిషనర్ అధికారాల్లో కొన్ని అడ్మిన్, ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్లకు బదలాయింపు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్ పథకం ప్రారంభించేందుకు ఆమోదం. టిఫిన్ ధర రూ.19 లు కాగా, లబ్ధిదారులు చెల్లించే రూ.5లు పోను మిగతా రూ.14 జీహెచ్ఎంసీ చెల్లించనుంది. అందుకు జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ.15.33 కోట్లు ఖర్చు కానుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు (కంటైనర్లకు)రూ. 11.43 కోట్లు ఖర్చు కానుంది. దానికి కూడా ఆమోదం లభించింది. తొలుత మింట్కాంపౌండ్, గౌలిదొడ్డి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. 23 ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచేందుకు ఆమోదం. స్టాండింగ్ సమావేశంలో కమిషనర్, మేయర్ -
నీలమణిపై మక్కువ.. హైదరాబాదీ నవాబ్కు టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: కాశ్మీర్లోని కుస్తావ్ జిల్లాలోని పాడ్డర్ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల్లో దొరికే నీలమణికి ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కాశ్మీరీలు హైదరాబాద్కు చెందిన నవాబ్ మీర్ ఫిరాసత్ అలీ ఖాన్కు రూ.3 కోట్ల మేర టోకరా వేశారు. గత ఏడాది జరిగిన ఈ మోసంపై ఆయన జమ్మూలోని బహుఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని కోర్టు ద్వారా బుధవారం నవాబ్ మీర్ ఫిరాసత్కు అందించారు. అలీ ఖాన్కు విలువైన మణులు, రత్నాలు సేకరణ హాబీగా ఉంది. దీనికోసం ఆయన దేశ విదేశాలకు చెందిన వ్యాపారులను సంప్రదిస్తుంటారు. ఈ విషయం తెలిసిన జమ్మూలోని రాజౌరికి చెందిన మహ్మద్ రాయజ్, పూంచ్ వాసి మహ్మద్ తాజ్ ఖాన్ పథకం ప్రకారం ఫిరాసత్ను సంప్రదించారు. పలుమార్లు హైదరాబాద్ వచ్చిన వెళ్లిన వారు తమ వద్ద విలువైన నీలమణి, అలాంటి మణులతో చేసిన ఆభరణా లు ఉన్నాయంటూ నమ్మబలికారు. తొలుత ఓ మణి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన ఫిరాసత్ రూ.3 కోట్లు చెల్లించారు. అతడిని గత ఏడాది నవంబర్లో రాజౌరీకి పిలిపించిన వారు నకిలీ మణి అప్పగించారు. మరికొన్ని ఆభరణాల విక్రయం కోసం రూ.25 కోట్లకు బేరసారాలు చేశారు. ఆ ద్వయం అందించిన నీలమణిని పరీక్షించిన ఫిరాసత్ నకిలీదని గుర్తించారు. దీనిపై జమ్మూలోని బహు ఫోర్ట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ ద్వయం గత వారం చిక్కింది. వీరి నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో ఆ మొత్తాన్ని బాధితుడికి చేర్చారు. నిందితుల నుంచి పోలీసులు మరికొన్ని నకిలీ నీలమణులు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిరాసత్ నుంచి కాజేసిన మొత్తం వెచ్చించి వారు నిందితులు జమ్మూ, కాశ్మీర్లో ఆస్తులు ఖరీదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) 107 సెక్షన్ ప్రకారం ఇలాంటి ఆస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంది. దీంతో ఆ కోణంలో చర్యలు తీసుకుంటున్నారు. -
కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, కూకట్పల్లి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోని బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్కడ నాళాను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ నిర్మాణాలపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. కూల్చివేతలను ప్రారంభించింది. శుక్రవారం ఉదయమే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. -
‘క్యాబ్’లకు కళ్లెం?
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సర్వీసులు తొలిసారి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి రాబోతున్నాయి. ఓలా, ఉబర్, రాపిడో లాంటి క్యాబ్ అగ్రిగేటర్లు రాష్ట్రంలో దాదాపు 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయి. కానీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన నియంత్రణలోకి తీసుకోలేదు. ఫలితంగా ఇన్నేళ్లుగా అవే సొంతంగా చార్జీలను నిర్ధారించుకుంటూ, ఓ పద్ధతి అంటూ లేకుండా పీక్ డిమాండ్ పేరుతో తోచినంత చార్జీ పెంచుతూ ప్రయాణికుల జేబు లను కొల్లగొడుతున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వాటిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోబోతోంది.దీంతో వాటి బేస్ చార్జీ, పెరుగుదల, పీక్ అవర్ సర్జ్లాంటివి రాష్ట్ర రవాణాశాఖ నిర్ధారించబోతోంది. క్యాబ్ సేవలపై వచ్చే ఫిర్యాదులను కూడా రవాణాశాఖ పరిశీలించి చర్యలు తీసుకోనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పీక్ అవర్స్లో క్యాబ్ బేస్ ఫేర్ను రెట్టింపు మేర పెంచుకోవటం, డిమాండ్ లేని వేళ, బేస్ ఫేర్లో 50 శాతానికి చార్జీ వసూలు చేయటం లాంటి కీలక సవరణలు చేసింది. వీటితోపాటు క్యాబ్ డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను అగ్రిగేటర్లు కల్పించేలా అందులో పొందుపరిచింది.బుక్ చేసుకున్న క్యాబ్ ప్రయాణికుడి వరకు రావటానికి 3 కి.మీ. దూరం మించితే ఆ దూరానికి కూడా అదనపు చార్జీని లెక్కగట్టడం, సహేతుక కారణం చూపకుండా డ్రైవర్గాని, ప్రయాణికుడు గాని రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే అపరాధ రుసుము చెల్లించాల్సి రావటం లాంటి అంశాలను కూడా అందులో చేర్చింది. ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవటంతోపాటు వాటి అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకోగా, ఇప్పుడు తెలంగాణ కూడా కసరత్తు ప్రారంభించింది. ఏంటీ ఉపయోగం.. గతంలో ఆటోరిక్షా వాలాలు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేసే వీలుండేది, ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ, ప్రస్తుతం 90 శాతం మంది ఆటోవాలాలు క్యాబ్ అగ్రిగేటర్ల యాప్లతో అనుసంధానమయ్యారు. దీంతో వారు రవాణాశాఖ నిర్ధారించిన చార్జీలను పరిగణనలోకి తీసుకోవటం లేదు. పీక్ డిమాండ్ పేరుతో ఇష్టం వచ్చిన చార్జీలు వసూలు చేస్తున్నా ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేసే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటి ఆటోలతో పాటు క్యాబ్లపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. పీక్ అవర్ ఓ బ్రహ్మపదార్థం.. గతంలో ఆటోరిక్షాలకు ఉదయం, రాత్రి వేళలను పీక్ అవర్స్గా పేర్కొంటూ 1.5 శాతం ఎక్కువ చార్జీ వసూలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ, క్యాబ్ సరీ్వసులు 24 గంటలు పీక్ అవర్గా పేర్కొంటూ ఇష్టం వచ్చిన రీతిలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్ కాస్త ఎక్కువ ఉందని తెలియగానే, వాన కురవగానే, ట్రాఫిక్ జామ్ పెరగగానే, రోడ్డుమీద క్యాబ్ల సంఖ్య తక్కువ ఉన్నాయనగానే.. రెండుమూడు రెట్టు చార్జీలు పెరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని నియంత్రించే వీలుంటుంది. బుక్ అయిన రైడ్ను డ్రైవర్ రద్దు చేసుకునే వీలు కూడా ఉండదు. ప్రభుత్వానికీ ఆదాయం.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో లాంటి అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్యాబ్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రతి క్యాబ్ నుంచి రోడ్డు ట్యాక్స్ వసూలవుతుంది. జీఎస్టీ ఆదాయం సమకూరుతుంది. బైక్ ట్యాక్సీలకు ఓకే.. ప్రస్తుతం నగరంలో 1.30 లక్షల కార్లు క్యాబ్ సర్వీసుల్లో ఉన్నాయి. మరో లక్షన్నర వరకు ఆటోరిక్షాలున్నాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా బైక్ ట్యాక్సీలు భారీగా రోడ్డెక్కుతున్నాయి. వైట్ ప్లేట్తో ఉండే ఈ బైక్ ట్యాక్సీలు చట్టబద్ధం కాదని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని క్యాబ్, ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అవి యథావిధిగా నడవనున్నాయి. వాటికి పసుపు రంగు ట్యాక్సీ నంబర్ప్లేట్ తప్పనిసరి చేయకపోవటం విశేషం. దీంతో వాటి సంఖ్య మరింత పెరిగే వీలుంది. -
గూడుకట్టని బాధ
కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గోవిందాపూర్కు చెందిన కురేట్కర్ శ్రీకాంత్ ఇంటికి 600 చదరపు అడుగులకు బదులు, మేస్త్రీ 682 చదరపు అడుగులతో పునాది వేశారు. నిబంధనల ప్రకారం 82 చదరపు అడుగులు ఎక్కువగా ఉండడంతో అధికారులు బిల్లు నిలిపివేశారు. దీంతో మళ్లీ నిబంధనల మేరకే ఇల్లు కడతానని బాండ్ పేపర్ రాసిస్తూ అధికంగా ఉన్న నిర్మాణాన్ని తొలగించి పనులు మొదలు పెట్టాల్సి ఉంది. గోవిందాపూర్ పైలట్ గ్రామం కాగా, ఇక్కడ 105 మందికి ఇళ్ల నిర్మాణానికి అనుమతి వస్తే, ఏడు ఇళ్లు విస్తీర్ణం మించి ఉన్నట్లు గుర్తించి అధికారులు నిలిపివేశారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు, ఇతరత్రా కారణాలతో ఇళ్లు మంజూరై నిర్మాణాలు మొదలయ్యాక కూడా వేలాది ఇళ్లు మధ్యలో నిలిపివేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అండర్ టేకింగ్ తీసుకుని నిబంధనలకు అనుగుణంగా మార్చుతున్నారు. పైలట్ గ్రామాల్లో చాలా చోట్ల ఇప్పటికీ పునాదుల దశలోనే ఇళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఈ పథకం కింద నిర్మించే ఇల్లు 400 నుంచి 600 చదరపు అడుగులలోపే ఉండాలి.ఒక చదరపు అడుగు పెరిగినా, తగ్గినా బిల్లు ఆపేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, 1.48 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలయింది. బేస్మెంటు వరకు పూర్తయితే రూ.లక్ష సాయం అందించాలి. అయితే నిబంధనల మేర కు లేవని వేలాది ఇళ్లను రద్దు చేయడం, నిర్మాణం ఆపివేయడం, బిల్లులు నిలిపి వేయడం జరుగుతోందని బాధిత లబ్ధిదారులు వాపోతున్నారు. మంజూరయ్యాక నిలిపేస్తూ.. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో చాలామంది లబ్ధిదారులు తక్కువ విస్తీర్ణంలో నిర్మాణం నచ్చక, ఇల్లు కట్టేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కొందరు తమకు ఇల్లు వద్దని అధికారులకు చెబితే ధ్రువీకరణ తీసుకుని రద్దు చేస్తున్నారు. ఇక ముగ్గు పోసి ఇళ్లు నిర్మించడంలో ఎవరైనా నెలల తరబడి జాప్యం చేస్తే కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునాదుల దశలో.. ఇచ్చే రూ.లక్షకు అదనంగా ఖర్చు కావడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.గతంలో ఇల్లు మంజూరైనట్లు గుర్తిస్తే ఆపేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 40,867 ఇళ్లకు 30,285 మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. గత ఇందిరమ్మ ఇళ్ల కింద సర్కారు సాయం పొందారని సుమారు 1,200 మంది బిల్లులు నిలిపివేస్తూ రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమచారం. గతంలో ఇల్లు తీసుకున్న వారి పూర్తి వివరాలు వెల్లడైతే చాలాచోట్ల ఇళ్లు రద్దయ్యే అవకాశం ఉంది. -
కంప్యూటర్ కోర్సుల వైపే..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలిదశ కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరుకుంది. వెబ్ ఆప్షన్లు గురువారంతో ముగియగా ఈ నెల 13న మాక్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి మరో రెండు రోజుల గడువు లభించనుంది. ఈ నెల 18న తొలి దశ సీట్ల భర్తీ ఉంటుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చిన వారి సంఖ్య లక్ష దాటింది. దాదాపు 40 వేల ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 78 శాతం మంది కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకున్నారు. ఇందులోనూ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు ప్రాధాన్యమిచ్చారు. సివిల్, మెకానికల్, ఈసీసీ, ఈఈఈ, సీఈసీ వంటి కోర్సుల్లో మెజారిటీ విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా సీఎస్సీనే ఎంపిక చేసుకున్నారు. మిగతా కోర్ గ్రూపులకు పదవ ప్రాధాన్యతనిచ్చారు. ఓపెన్ కేటగిరీకి 10 వేల లోపే.. ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తే కంప్యూటర్ కోర్సుల్లో పోటీ కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 171 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. వాటి పరిధిలో కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉండగా అందులో 68 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్, ఐటీ కోర్సులే ఉన్నాయి. తొలి దశలో 500 ర్యాంకు వరకు విద్యార్థులు కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు. వెయ్యి ర్యాంకు దాకా విద్యార్థులు సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులతోపాటు ఇతర బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. వాళ్లంతా జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ కాలేజీలను ఎంచుకున్నారు. 2 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–10 కాలేజీలకు పోటీపడగా 5 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–20 కాలేజీలకు ప్రాధాన్యమిచ్చారు. 10 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలను, అన్ని బ్రాంచీలను ఆప్షన్లుగా పెట్టుకున్నారు. అయితే వారిలో 70 శాతం మంది కంప్యూటర్ కోర్సులకే తొలి ప్రాధాన్యమిచ్చారు. ఈసారి నాన్–లోకల్ కోటా ఎత్తేయడంతో ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. టాప్–10 కాలేజీల్లో జనరల్ కేటగిరీలో సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో 4 వేల లోపు ర్యాంకు వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర కాలేజీల్లో 10 వేలలోపు ర్యాంకు వరకు సీట్లు పొందే వీలుందని భావిస్తున్నారు. ఫీజులపై రగడ.. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఖరారైన ఫీజులను నిలిపేయడం, పాత ఫీజులనే అమలు చేయాలనే నిర్ణయాన్ని సీబీఐటీ కాలేజీ న్యాయస్థానంలో సవాల్ చేసింది. కాలేజీకి సానుకూలంగా కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే అధికారులు కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. కోర్టు దీనిపై శుక్రవారం విచారించే వీలుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇతర కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు చేపడతారా లేక వాయిదా వేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. సాంకేతిక విద్యా విభాగం అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెబుతున్నారు. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తెలంగాణ నీట్ అర్హుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 43,400 మంది జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. అయితే ఈ జాబితా కేవలం నీట్లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాల కోసం మాత్రమేనని.. మెరిట్ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. పూర్తి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేయనుంది. ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులు (ఎన్సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో–ఇండియన్, ఎస్సీసీఎల్) మెరిట్ జాబితాను విడిగా విడుదల చేస్తామని వర్సిటీ రిజి్రస్టార్ పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ బోర్డు ద్వారా పరీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈనెల చివరి వారంలో ఎంసీసీ కౌన్సెలింగ్? నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు చెందిన మెరిట్ జాబితాను ప్రకటించిన తరువాత ముందుగా జాతీయ స్థాయిలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈనెల చివరి వారంలో ప్రారంభమవుతుంది. నేషనల్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రంలో అభ్యర్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు తొలి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వర్సిటీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు. -
బచావత్కు ‘బనకచర్ల’ విరుద్ధం!
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ఆమోదయోగ్యం కాదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కుండబద్దలు కొట్టింది. గోదావరి జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ 2011లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని 108వ టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) జారీ చేసిన మార్గదర్శకాలకు ఈ ప్రాజెక్టు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టుపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. గోదావరి బోర్డు తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. జీఆర్ఎంబీ అభిప్రాయం కోరిన సీడబ్ల్యూసీ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి రోజుకు 2 టీఎంసీలు చొప్పున మొత్తం 200 టీఎంసీల గోదావరి జలాలను క్రాస్ రెగ్యులేటర్కు తరలించి 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 9.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వసతి, 80 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును సమర్పించింది. దానిని గత మే 23న గోదావరి బోర్డు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు పంపిన సీడబ్ల్యూసీ అభిప్రాయాలు కోరింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ప్రాజెక్టు విస్తరణ కుదరదన్న బోర్డు పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ టీఏసీ జారీ చేసిన ఆపరేషన్స్ ప్రొటోకాల్స్ ప్రకారం ఆ ప్రాజెక్టు విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని 14(డీ) క్లాజు ప్రకారం గోదావరిలోని వరద జలాలపై అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెలిపింది. ఒక వేళ గోదావరి జలాలను మరో నది పరీవాహక ప్రాంతానికి తరలిస్తే ఆ జలాలపై పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకూ వాటాలుంటాయని వివరించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంతానికి 80 టీఎంసీల జలాలను తరలిస్తే దానికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేసింది. ఇదే సూత్రం బనకచర్ల ప్రాజెక్టుకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గోదావరిలో వరద, మిగులు జలాల లభ్యతపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలనే తరలిస్తామని ఏపీ ప్రతిపాదించినప్పటికీ వాస్తవంగా తరలించేది వరద జలాలా? మిగులు జలాలా? నికర జలాలా? అనే అంశంపై సైతం స్పష్టత లేదని తెలిపింది. -
గిరిజన శాఖలో ‘కుర్చి’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఉన్న ఇంజనీరింగ్ విభాగం అధిపతి పోస్టు కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ఈ విభాగం చీఫ్ ఇంజనీర్ (సీఈ)గా పనిచేసిన శంకరయ్య జూన్ 30న పదవీ విరమణ చేయటంతో ఆ కుర్చిలో తదుపరి ఎవరు కూర్చుంటారోననే చర్చ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ (డీఎస్ఎస్)లో జోరుగా సాగుతోంది. విద్య, సంక్షేమ శాఖలకు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టేందుకు విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) ఉన్నప్పటికీ... గిరిజన సంక్షేమ శాఖకు మాత్రం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఈ శాఖ నిర్మాణ పనులన్నీ ఈ విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీ కావడంతో కుర్చిని దక్కించుకునేందుకు పైరవీలకు తెరలేచింది. మంత్రి అడ్లూరి వద్దకు పంచాయితీ గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగాధిపతిగా చీఫ్ ఇంజనీర్ (సీఈ) ఉంటారు. ఆ తర్వాతి స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ), ఆయన కింద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)లు ఉంటారు. వారి కింద ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. సీఈ శంకరయ్య పదవీ విరమణ చేయటంతో.. ఆ బాధ్యతలను తదుపరి కేడర్లో ఉన్న ఎస్ఈకి అర్హతలను బట్టి ఇవ్వాలి. కానీ, ఈ విభాగంలో కొంత కాలంగా ఎస్ఈ, ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల విషయంలో నెలకొన్న సీనియార్టీ వివాదంతో ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో ఈఈ పోస్టుల్లో ఇన్చార్జ్లే కొనసాగుతున్నారు.ఇప్పుడు సీఈ కుర్చీ ఖాళీ కావడంతో ఆ ఇన్చార్జ్లు విభాగాధిపతి కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకే బ్యాచ్కు చెందిన నలుగురు డీఈఈలు ఏకంగా సీఈ కుర్చీ దక్కించుకునేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వయసు, మెరిట్ ఆధారంగా తనకే సీఈ కుర్చీ దక్కుతుందని ఒక అధికారి ధీమాతో ఉండగా... ప్రభుత్వ పెద్దల అండతో అనూహ్యంగా మరో అధికారి తెరపైకి రావడంతో ఉత్కంఠకు తెరలేచింది.ప్రస్తుతం ఈ ఫైలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేషీకి చేరింది. దీంతో పోటీలో ఉన్న డీఈఈలు మంత్రి పేషీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే, పోటీలో ఉన్న నలుగురు అధికారులపైనా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. ఇద్దరిపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. మరొకరు స్థానికత అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఈ కుర్చీ ఎవరికి దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది. -
ఉప్పొంగిన ‘ప్రాణహిత’
చింతలమానెపల్లి/కాళేశ్వరం/ ఆసిఫాబాద్/ములకలపల్లి: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, ఉప నదుల వరదల కారణంగా ప్రాణహిత నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకేలా ప్రాణహిత ప్రవహిస్తోంది. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు అప్రమత్తం చేశారు. మండలంలోని దిందా వాగులో పడి కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వాగు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో నది దాటేందుకు ప్రయత్నించి పట్టు తప్పాడు. ఈ క్రమంలో గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా కొమ్మ విరిగి వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావుపేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనను ఆనుకొని పెన్గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద... భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.690 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరి«ధిలోని మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవా హం 6.36 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రూపంలో వస్తోంది. బరాజ్ 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో 6.36 లక్షల క్యూసె క్కుల నీటిని ఔట్ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గురువారం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. ఇన్ఫ్లో 850 క్యూసెక్కులు ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 880 దిగువకు వదులుతున్నారు. ‘సీతారామ’ప్ర«దానకాల్వ కట్టకు కోత సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐ) ప్రధాన కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే.రామవరంలోని సీతారామ పంప్హౌస్–2 నుంచి కమలాపురం వద్ద గల పంప్హౌస్–3 వరకు వెళ్లే ప్రధాన కాల్వకు భారీ గొయ్యి ఏర్పడింది. వర్షాల «నేపథ్యంలో వరద ఉ«ధృతికి క్రమేపీ కోత పెరుగుతోంది. -
44కు చేరిన కల్తీ కల్లు బాధితులు
సాక్షి, హైదరాబాద్/ లక్డీకాపూల్: హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కు పెరిగింది. కల్తీ కల్లు తాగి ఇప్పటికే ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్పను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మీడియాతో మాట్లాడుతూ.. నిమ్స్లో 31 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో 27 మంది కోలుకున్నట్లు తెలిపారు. వీరిని శుక్రవారం నుంచి దశలవారీగా డిశ్చార్జి చేస్తారని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో అందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. నలుగురు బాధితులకు డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారని, మరో ఏడుగురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డా.నిమ్మ సత్యనారాయణ, ఏఎంఎస్ డా.చరణ్రాజ్ తదితరులు ఉన్నారు. నెఫ్రోటాక్సిక్స్ వల్లే.. కల్లులో నెఫ్రోటాక్సిక్స్ (కొన్ని ఔషధాలు, ఇతర కెమికల్స్ కలి సి కిడ్నీలపై చెడు ప్రభావం చూపటం) కలవటం వల్లనే అది తాగినవారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. బాధితుల రక్తంలో సీరం క్రియాటినైన్ భారీగా పెరగడంలో వారి కిడ్నీల పనితీరుపై ప్రభావం పడిందని నిమ్స్ వైద్యు లు వెల్లడించారు. సాధారణంగా కల్లులో మత్తు కోసం డైజోఫాం, క్లోరోహైడ్రేట్, తీపి కోసం శాక్రిన్, నురగ కోసం అమ్మోనియం లాంటివి కలుపుతుంటారు. ఈ కల్లులో నెఫ్రోటాక్సిక్స్ కలవటం వల్లే ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు మరణించారు. కండరాలపై శ్రమ పెరిగినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రియాటినైన్ను మూత్రపిండాలు రక్తం నుంచి శుద్ధి చేసి బయటకు పంపిస్తాయి. కానీ, ఈ క్రియాటి నైన్ అసాధారణంగా పెరిగిపోయినప్పుడు కిడ్నీలే దెబ్బతింటాయి. అప్పుడు ఈ వ్యర్ధ పదార్థం గుండె, మెదడుతోపాటు ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చరణ్రాజ్ వివరించారు. అలాంటి సమయంలో వెంటనే డయాలసిస్ చేయకపోతే వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. సమగ్ర నివేదిక ఇవ్వండి: మానవ హక్కుల కమిషన్కల్తీ కల్లు సేవించి ఆరుగురు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై 20వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. న్యాయవాది ఇమ్మనేని రామరావుతోపాటు పలువురు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, సభ్యులు శివాది ప్రవీణ, బి.కిషోర్లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టి పోలీసులకు పలు ఆదేశాలిచ్చింది. -
‘ఫీజు’లపై జూన్లోగా నిర్ణయం తీసుకోలేరా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై జూన్లోగా నిర్ణయం తీసుకోలేరా? అని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏటా ఫీజుల అంశం ఓ ప్రహసనంలా మారిందని.. కౌన్సెలింగ్ ముగిసి తరగతులు మొదలయ్యే వరకు తేల్చకుండా కమిటీ వ్యవహరిస్తోందని విమర్శించింది. సీట్లు, ఫీజులు.. ఇలా ఏదో ఒక కారణంతో ఏటా కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారిందని వ్యాఖ్యానించింది. నెలలుగా జరుగుతున్న అంశంలో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు వేయడంపై కాలేజీల తీరును తప్పుబట్టింది. ఫీజుల పెంపుపై శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ 2024 డిసెంబర్లోనే ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతిపాదనలు సమర్పించాయన్నారు. మార్చిలో భేటీ అయిన కమిటీ ఆ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. దీనికి రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలే సాక్ష్యమన్నారు. దీంతో రిజిస్టర్ను వెంటనే కోర్టు ముందు ఉంచాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.అనంతరం టీఏఎఫ్ఆర్సీ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు లాభాపేక్షతో పనిచేయరాదంటూ సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కాలేజీల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవడానికి సమయంపట్టే అవకాశం ఉన్నందున బ్లాక్ పీరియడ్ (2022–23 నుంచి 2024–25)లోని ఫీజులనే 2025–26కు కమిటీ సిఫార్సు చేసిందన్నారు. మధ్యంతర ఉత్తర్వుల్లో పెంపునకు అనుమతిస్తే తీర్పు విరుద్ధంగా వచి్చనా తిరిగి విద్యార్థులకు చెల్లించబోరని పేర్కొన్నారు. 70 శాతం పెంపు కోరుతున్నారు.. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్రెడ్డి వాదనలు వినిపిస్తూ కమిటీ ప్రతిపాదనలను ఆమోదించడం మాత్రమే సర్కార్ బాధ్యతన్నారు. కొన్ని కాలేజీలు 70 శాతం వరకు పెంపును కోరుతున్నాయని.. ఆ మేరకు పెంపునకు అనుమతిస్తే విద్యార్థులపై భారీగా భారం పడుతుందని నివేదించారు. దీనివల్ల లక్షన్నర మంది విద్యార్థులు ప్రభావితం అవుతారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.డిసెంబర్లో ప్రతిపాదనలు పంపిస్తే జూన్ వరకు ఏం చేశారని టీఏఎఫ్ఆర్సీని ప్రశ్నించారు. మార్చిలో నోటిఫై చేసినప్పుడు కాలేజీలైనా తెలుసుకోవాలని కదా అని వ్యాఖ్యానించారు. కౌన్సెలింగ్, అడ్మిషన్ల సమయం దాకా కాలయాపన చేయడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ఉన్నా ప్రతిపాదనలపై ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, కేశవ్ మెమోరియల్ పిటిషన్ను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.సీబీఐటీకి గ్రీన్సిగ్నల్.. ఫీజుల పెంపునకు టీఏఎఫ్ఆర్సీ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐటీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫీజు పెంపునకు అనుమతించారు. బీఈ, బీటెక్కు రూ. 2,23,000, ఎంటెక్కు రూ. 1,51,600, ఎంబీఏ, ఎంసీఏకు రూ. 1,40,000 పెంచాలని.. ఈ మేరకు టీజీఈఏపీసీఈటీ అడ్మిషన్లలో మార్పు చేయాలని కన్వినర్ను ఆదేశించారు. 2025–26, 2027–28 బ్లాక్ పీరియడ్కు ఈ ఫీజులు వర్తిస్తాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
నిజమే.. మేం జాగీరుదారులం కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచమంతా కుల, మతాల గోడల్ని బద్దలు కొట్టి నాగరికత వైపు వెళుతుంటే..ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణ ఇంకా కులచట్రంలోనే ఇరుక్కుని మరుగుజ్జుతనంతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి మండిపడ్డారు. కొత్తపలుకు పేరిట ఇటీవల ఆంధ్రజ్యోతిలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్రెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘పోలీసులకు దొరికినప్పుడు దొంగ తత్తరపడినట్టు రాధాకృష్ణ రాతల్లోనూ అలాంటి ధోరణే కనిపిస్తోంది. భుజాలు తడుముకుని నేరాన్ని తన రాతల్లో రాధాకృష్ణ అంగీకరించాడు. హైదరాబాద్తో సహా తెలంగాణలో స్థిరపడిన వారందరూ చంద్రబాబు కంటే కేసీఆర్ పాలనలో సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నేరుగా కేసీఆర్తో ఢీకొన్నా సెటిలర్లు కేసీఆర్ వెంట నిలిచారు. 2023లోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. ఇక్కడ స్థిరపడిన ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు, నువ్వు టేకేదారులు అని చెప్పుకున్నా..తిరస్కరించిన సంగతి గుర్తు పెట్టుకోండి. మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఏపీకి చెందిన ఓ వర్గంవారు ఇక్కడి నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాళ్ల మీడియా ముసుగులు తొలగించి భరతం పడతామని నేను చెప్పాను. తమ అభిమాన నాయకుల వ్యక్తిత్వ హననంపై అభిమానులు, కార్యకర్తలు చేసిన చిన్న నిరసన మాత్రం మీకు చాలా పెద్దదిగా కనపడింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ రాతల్లో పేర్కొన్నట్టు ‘నిజమే మేము జాగీరుదారులం కాదు.. తెలంగాణతల్లి వాకిట జాగిలాలం, కాపలాదారులం’అని జగదీశ్రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ దయాగుణం వల్లే బయట ఉన్నారు ‘ఉద్యమ సందర్భంలో మీరెంత విషం చిమ్మినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రివర్గంపై, శాసనసభపై మీరు దిగజారి మాట్లాడినా ఏ విచారణ అక్కర లేకుండా, మిమ్మల్ని 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా కేసీఆర్ క్షమాభిక్ష, దయాగుణం వల్లే బయట ఉన్నావు. మీతోపాటు మీ గురువు చంద్రబాబును జైలుకు పంపే అవకాశం వచ్చినా వదిలేయడం కేసీఆర్ గొప్పతనం. మోదీ అండ, చంద్రబాబు చెంతన ఉన్నారని, తెలంగాణ సీఎం చెప్పుచేతుల్లోనే ఉన్నారని, ఉడత ఊపులకు భయపడనని హూంకరించిన మీరు వందలమంది పోలీసులను కాపలా తెచ్చుకున్నారు. వాళ్లను, వీళ్లను బతిమాలి జరగని దాడికి ఖండనలు ఇప్పించుకుంటున్న తీరు ఏ ఊపులకు మీరు భయపడుతున్నారో అర్థమవుతుంది. సాధారణంగా మరుగుజ్జు అంటే సహజత్వానికి భిన్నంగా ఉండడం, ఎదగాల్సిన స్థాయిలో ఎదగకపోవడం లేక మానసికంగా వికసించకపోవడం. తెలంగాణ వికాసం కోసం పోరాటం చేసిన నా పరిపక్వత, రాజకీయ ప్రస్థానమేంటో అందరికీ తెలుసు. రామోజీరావుతో పోల్చుకొని పోటీపడి ఆయన పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో కూర్చుందామనుకొని, ఎక్కడికో చేరుకుందామనుకొని.. అదీ చేరుకోలేకపోయావనే బాధ నీలో కనిపిస్తోంది.ఇంకా జర్నలిజం ఓనమాలలోనే ఉన్న వానికి పాపులారిటీ వస్తుందని, పోటీకొస్తున్నాడని భయపడి లేని దాడిని సృష్టించుకొని నీవు చేస్తున్న హంగామా నీ మరుగుజ్జుస్థాయికి నిదర్శనం. మీడియా అనుకొని నమ్మి బెదిరింపులు లేదా మీ బ్లాక్మెయిల్తో మీ స్టూడియోకు వచ్చిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, సినీతారలు, ఇతర ప్రముఖులతో ప్రవర్తించే తీరు, జుగుప్సాక రమైన ప్రవర్తన అహంకారానికి నిదర్శనం. చాలామంది మహిళా సెలబ్రిటీలు మీ ఇంటర్వ్యూకు రావడానికి భయపడుతున్నారనేది వాస్తవం’అని జగదీశ్రెడ్డి తన ప్రకటనలో రాధాకృష్ణ తీరును ఎండగట్టారు. -
సర్కార్బడిలో ఐఐటీ పాఠాలు
సిరిసిల్ల కల్చరల్: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అధునాతన సాంకేతిక కోర్సులు సర్కార్ బడి విద్యార్థులకు కూడా చేరువ కానున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్ తన సాంకేతిక కోర్సుల విస్తరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పనుంది. స్థానిక గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచి్చంది.ఆన్లైన్ విధానంలో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐఐటీ మద్రాస్ లేఖ రాసింది. స్కూల్ కనెక్ట్లో భాగంగా ఐఐటీ మద్రాస్ సిరిసిల్లలోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో భాగస్వామ్యమైంది. ఈ–మెయిల్ ద్వారా ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శివనగర్, గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంది. ఇవీ కోర్సులు.. డేటా సైన్స్ అండ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్, బయోలాజికల్ సిస్టమ్స్, మేథ్స్ అన్ప్లగ్డ్ గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మేథ్స్ అండ్ కంప్యూటింగ్, లా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, హ్యుమానిటీస్ వంటి పది కోర్సులను రెండు నెలలపాటు బోధిస్తారు. ముందుగానే చిత్రీకరించిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్లో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్లతో ప్రతి శనివారం ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేస్తారు. ఫలితంగా ఆయా కోర్సుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు.విద్యార్థులకు విస్తృత ప్రయోజనాలు ఐఐటీ మద్రాస్తో అనుసంధానానికి ఎంపికవడం వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుంది. అత్యాధునిక కోర్సుల మౌలికాంశాలపై శిక్షణ పిల్లల కెరీర్ నిర్మాణానికి ఉపకరిస్తుంది. డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్తతరం సాంకేతికతల్లో సర్కార్ బడి పిల్లలు సత్తా చాటుతారు. – చకినాల శ్రీనివాస్, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుపేద బిడ్డలకు టెక్నాలజీ చేరువవుతుంది ప్రభుత్వ బడిలో చదివే పేద విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు ఈ స్కూల్ కనెక్ట్ ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ తరగతులతోపాటు అక్కడి ప్రొఫెసర్లతో నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం విద్యార్థులకు వరంగా భావించాలి. ఇంజినీరింగ్ కోర్సుల్లో మాత్రమే లభ్యమయ్యే అంశాలను పాఠశాల స్థాయిలోనే నేర్చుకునే అరుదైన అవకాశం ఇది. – లోకిని శారద, హెచ్ఎం, గీతానగర్ జెడ్పీ హైస్కూల్ -
పంచాయతీల స్థలాలు ప్రైవేట్పరం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఓవైపు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పంచాయతీల్లోని భూములను 30 ఏళ్లపాటు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. ఈ మేరకు హరిత సౌభాగ్యం (తెలంగాణ) ప్రాజెక్టులో పాల్గొనడానికి ఐఓఆర్ఏ ఎకొలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతి ఇవ్వనుంది. అందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసి పంపించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీల పరిధిలోని స్థలాల్లో హరిత వనాలను అభివృద్ధి చేయడానికి 30 ఏళ్ల వరకు సదరు సంస్థకు గ్రామ సభ పూర్తి అంగీకారంతో అప్పగిస్తున్నట్లు నిరభ్యంతర పత్రాన్ని సమర్పించడానికి సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే 30 ఏళ్లపాటు కార్బన్ హక్కులను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వల్ల ఆ భూములను మరే ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి పంచాయతీలకు అధికారం లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల పాలక మండళ్లు అధికారంలో లేని సమయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పంచాయతీలు తమ భూములపై హక్కులు కోల్పోవడమే అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పంచాయతీల్లో పాలక మండళ్లు లేని కారణంగా అధికారులే ఈ తతంగం పూర్తికానిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవగాహన లేకుండా తీర్మానాలెలా? ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎలాంటి న్యాయ వివాదాలు లేని భూములనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్లు పంచాయతీలు తీర్మానంలో పేర్కొనాల్సి రానుంది. కార్బన్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో కమ్యూనిటీ అవసరాలకు సంస్థ వినియోగించాలని పేర్కొంటున్నా గ్రామ పంచాయతీలకు దీనిపై ఎలాంటి అవగాహన లేకుండా తీర్మానాలు చేసి ఇవ్వడం వల్ల పంచాయతీలకు రాబోయే 30 ఏళ్లలో ఏవైనా అవసరం కోసం భూమి కావాలంటే లభించని పరిస్థితులు నెలకొంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్బన్ క్రెడిట్స్తో వచ్చే ఆదాయంలో గ్రామ పంచాయతీలకు ఎంత చెల్లించాలి? ఎప్పుడు ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఎదురవనుంది. అనుమానాలెన్నో.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేలకుపైగా ఉన్న గ్రామ పంచాయతీల స్థలాలను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలన్న నిర్ణయంలో ఆంతర్యం ఏమిటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీల స్థలాల్లో ఎలాంటి మొక్కలు నాటుతారు? అవి స్థానిక పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయా? ఒకే రకమైన మొక్కలు నాటడం ద్వారా జీవవైవిధ్యానికి ప్రమాదం కలిగే అవకాశాలు కూడా ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒప్పంద పత్రాలు రూపొందించింది ప్రైవేటు సంస్థే.. ఈ సంస్థకు పంచాయతీ స్థలాలపై పూర్తి అజమాయిషిని కట్టబెట్టడానికి వీలుగా సదరు సంస్థనే ఈ ఒప్పంద పత్రాలను పకడ్బందీగా రూపొందించడం గమనార్హం. ఈ తీర్మానాలకు సంబంధించి గ్రామ సభ మినిట్స్, సభకు హాజరైన సభ్యుల వివరాలు, ఫొటో/వీడియో డాక్యుమెంటేషన్ చేయడం, తీర్మానంపై సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సాక్షుల సంతకాలు, వార్డు సభ్యులు, సమావేశంలో పాల్గొన్న వారి సంతకాలు, ఎన్వోసీపై సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం, పంచాయతీకి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి? తదితర వివరాలతో సర్వే నంబర్లు తీసుకోవాలని పత్రాల్లో పేర్కొన్నారు. అలాగే అంగీకార పత్రంలో రాష్ట్ర ఆదేశాల మేరకు కార్బన్ ఆదాయం, ప్రయోజనాల భాగస్వామ్య విధానం నుంచి ప్రయోజనం పొందే కమ్యూనిటీ హక్కు, ప్రాజెక్టులో పాల్గొనడానికి ఎలాంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా పాల్గొంటున్నామని పేర్కొనాల్సి రానుంది. గ్రామ సభలో చర్చించడానికి తగినంత సమయం ఇచ్చారని, తాము ముందస్తు ఉచిత సమ్మతిని స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు గ్రామ సభలో పాల్గొన్న వారు ఇచ్చేలా ఒప్పందాన్ని రూపొందించడం గమనార్హం. -
రోగులు, బోధకులు లేకున్నా అనుమతులా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీరు కంచె చేనును మేసిన చందంగా తయారైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రైవేటు మెడికల్ కాలేజీల దందాకు అడ్డుకట్ట వేసి, విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించేలా చూడాల్సిన ఎన్ఎంసీ అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత, మాజీ వైద్యాధికారులతో కుమ్మక్కై ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.కోట్లలో లంచాలుగా తీసుకున్నట్లు గుర్తించిన సీబీఐ.. ఓవైపు దేశ వ్యాప్తంగా దర్యాప్తు సాగిస్తుండగా, మరోవైపు ఇదేమీ పట్టనట్లు వైద్య కమిషన్ అధికారులు తమ లాలూచీని కొనసాగిస్తూ అధ్వాన స్థితిలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం వందశాతం మార్కులు వేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు ఆమోదముద్ర వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి, ఏ మాత్రం వసతులు లేకున్నా.. కాలేజీలకు అనుమతులు కట్టబెడుతున్నారని తెలుస్తోంది. వర్సిటీ అలా..ఎన్ఎంసీ ఇలా రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నాలుగు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరిపి వైద్య విద్యకు అనువైన కనీస మౌలిక వనరులు లేవని, రోగులు, బోధనా సిబ్బంది లేకుండా ఏదో ‘సాంఘిక శాస్త్రం’బోధించినట్లుగా వైద్య విద్య అందిస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. విచిత్రమేంటంటే హెల్త్ యూనివర్సిటీ తనిఖీలు చేసిన కళాశాలల్లో ఒకటైన పటాన్చెరులోని రాజ రాజేశ్వరి మెడికల్ కాలేజీని బుధవారం సాయంత్రం సందర్శించిన ఎన్ఎంసీ అధికారులు 100 శాతం మార్కులు వేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆకస్మిక పర్యటన చేసినప్పుడు ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలోని వార్డుల్లోని బెడ్లన్నీ రోగులు, సిబ్బందితో పాటు కనీసం స్టూడెంట్లు కూడా లేక వెలవెలబోతున్నట్లు అధికారులు తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుండగా, ఎన్ఎంసీ అధికారుల తనిఖీల సమయంలో ఇంతలోనే ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు అనుగుణంగా రోగులు, ఫ్యాకల్టీ, మౌలిక వనరులు ఎలా సమకూరాయో ఎన్ఎంసీ అధికారులే చెప్పాలని అంటున్నారు. మరో 3 కాలేజీలకు కూడా.. రాజ రాజేశ్వరి మెడికల్ కాలేజీతో పాటు హైదరాబాద్ శివార్లలోని నోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి మెడికల్ కాలేజీ, సీఎంఆర్ మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ అధికారులు తనిఖీలు జరిపి, వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నట్లుగా తేల్చినట్లు తెలిసింది. ఈ మేరకు కమిషన్కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓవైపు ప్రైవేటు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతూ, వసతులు లేని కళాశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు ఎన్ఎంసీ అధికారులు మాత్రం ఆయా కళాశాలలకు గ్రీన్సిగ్నల్ ఇస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాక్ట్రికల్స్ కోసం శవాలు కూడా సమకూర్చుకోలేని దుస్థితిరాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో చాలావరకు కాలేజీల్లో విద్యార్థుల ప్రాక్టికల్స్కు అవసరమైన రోగులు లేరు. ప్రాక్టికల్స్ కోసం కనీసం శవాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది. వార్డుల్లో పడకలు ఉన్నా, ఏ ఒక్క పడక మీద పేషెంట్ లేని పరిస్థితిని సాక్షాత్తూ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ స్వయంగా చూశారు. మరోవైపు హౌస్ సర్జన్గా సేవలు అందించే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వకపోగా, నాలుగున్నరేళ్ల కోర్సుకు గాను ఐదేళ్ల కాలానికి ఫీజు తీసుకోవడం, ఫేక్ ఫింగర్ ప్రింట్స్తో డాక్టర్ల హాజరు, ప్రాక్టికల్స్ కోసం ఫీజులు వసూలు చేయడం వంటి నిర్వాకాలను గుర్తించారు. అయినా ఎన్ఎంసీ అధికారులు వీటిని పట్టించుకోకుండా అన్నింటికీ ఆమోదముద్ర వేసి రావడానికి రూ.కోట్లు లంచాలుగా ముట్టడమే కారణమని ప్రభుత్వ వైద్యాధికారులే ఆరోపిస్తున్నారు. ఎన్ఎంసీ సమావేశాలకు మాజీ అధికారులేంటి? నీట్ అడ్మిషన్లు, కాలేజీలకు అనుమతులు, రెన్యువల్, మెడికల్ కాలేజీలకు రేటింగ్ ఇవ్వడం వంటి అంశాలపై చర్చించేందుకు గాను ఎన్ఎంసీ నిర్వహించే సమావేశాలకు ఆయా రాష్ట్రాల హెల్త్ వర్సిటీల వీసీలను, వర్సిటీల్లో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన వారిని ఆహ్వానిస్తారు. అయితే కాళోజీ నారాయణరావు వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డికి బదులుగా మాజీ వీసీ కరుణాకర్ రెడ్డిని ఎన్ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఎన్ఎంసీలో జరిగిన సమావేశానికి కూడా నందకుమార్ రెడ్డికి ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. గతంలో ఎంఏఆర్బీ (మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు)లో ఉన్న ఓ అధికారి కాలేజీలకు ర్యాంకుల కేటాయింపులో అవకతకవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ కాగా, సదరు అధికారిని కూడా ఎన్ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం గమనార్హం. ఒడిశాకు చెందిన మరో రిటైర్డ్ వీసీ కూడా ఎన్ఎంసీలో జరిగే అవకతవకల్లో కీలక వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వసతుల్లేని ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్న అధికారులు, వాటికి అనుమతులివ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీతో పాటు కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో కుల గణన నిర్వహించడాన్ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి, గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు. సీఎం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పలువురు కేంద్రమంత్రులు, సంబంధిత అధికారులతో దీనిపై అనేకసార్లు చర్చించినా కొర్రీలు వేస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీకి అడ్వొకేట్ జనరల్ను కూడా ఆహ్వానించి ఆయన సలహాలు తీసుకుని, న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలకు ఇబ్బందులు ఎదురవకుండా రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధితో సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఇప్పటికే రాష్ట్రంలో 62 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ నిబంధన దేశంలో ఎప్పుడో పోయిందని అన్నారు. కేబినెట్ నిర్ణయాలు 96% అమలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి ముందు వరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తాజాగా జరిగిన 19వ సమావేశంలో ఆ నిర్ణయాల అమలులో పురోగతిపై విస్తృతంగా చర్చించామని, 96 శాతం అంశాలకు సంబంధించి జీవోలు జారీ చేసి అమలు దశకు తీసుకెళ్లినట్టు తేలిందని చెప్పారు. కాగా ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు మళ్లీ ఈ నెల 25న మంత్రివర్గ భేటీ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఆ కాల వ్యవధిలో జరిగే ఆరు కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించాలని కూడా నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరవేసే వ్యవస్థ పనితీరును మళ్లీ కేబినెట్లోనే ఇలా సమీక్షించడం దేశంలోనే తొలిసారి అని అన్నారు. ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు రాష్ట్రంలోని అమిటీ, సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ విద్యా సంస్థలకు వర్సిటీలుగా గుర్తింపు కల్పించాలని కేబినెట్ నిర్ణయించినట్టు పొంగులేటి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 15 ఉత్తమ వర్సిటీల్లో అమిటీ 11/12వ స్థానంలో ఉందన్నారు. సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ సైతం అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వనుందని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్ చొరవతో ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించడానికి ఆ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు. మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పొన్నం చెప్పారు. ఇక కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జాబ్ కేలెండర్ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించామన్నారు. ఎస్సీల వర్గీకరణ సమస్యతో నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ⇒ రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అనంతరం ఆ ప్రాజెక్టుల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. ⇒ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 4 చోట్ల అత్యాధునిక గోశాలలు రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ వచ్చే కేబినేట్ సమావేశంలోపు తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. కగా హైదరాబాద్లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజి్రస్టేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మత్స్యకార సొసైటీలకు పర్సన్ ఇన్చార్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెరువులు, కుంటల్లో 80–110 మి.మీ. సైజు గల 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ను రూ.19 కోట్ల నుంచి రూ.122 కోట్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపునకు సంస్కరణలు ⇒ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ⇒ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమరి్పంచాలని కమిటీని ఆదేశించింది. -
బీసీ రిజర్వేషన్పై తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు(గురువారం, జూలై 10) జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ప్రతీ 15 రోజుకు ఒకసారి కేబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ మూడు నెలలకు గత కేబినెట్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై పునః సమీక్ష చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది చరిత్రాత్మక నిర్ణయంస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. 42 శాతం బిసి రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు.. ఈ రోజు ప్రభుత్వం క్యాబినెట్ లో బిసి రిజర్వేషన్లు అమలు కోసం ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నాం. 2018 చట్టాన్ని సవరించి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చేసిన డిమాండ్ ను దేశంలో మొదటగా అమలు చేస్తున్నాం.. 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్గానికి పేరు పేరునా ధన్యవాదాలు. తెలంగాణ సమాజం, ప్రధానంగా బిసిలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. -
మా చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం?: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మాత్రమే చూపించడం దారుణమన్నారు కేటీఆర్. ఇలా తమ చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం? అని నేరుగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మేరకు పలు పశ్నలు సంధించారే కేటీఆర్. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?, ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?, లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.Honourable PM @narendramodi ji,We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position - TELANGANAToday, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i— KTR (@KTRBRS) July 10, 2025 -
‘మల్నాడు’ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు
హైదరాబాద్: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. 9 పబ్లపై కేసులు నమోదు చేసింది ఈగల్ టీమ్.. పబ్ యాజమానులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చేవారం తమ ఎదుట హాజరుకావాలని పబ్ యాజమానులకు స్పష్టం చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులకు సంబంధాలను గుర్తించింది. మూడు పబ్ యజమానులు కలిసి డ్రగ్ పార్టీ నిర్వహించినట్లు ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు. ఈ కేసులో కూడా ఫ్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్ పార్టీలు నిర్వహించాయి, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు. పోలీసులు. క్వాక్ పబ్ ఓనర్ రాజా శేఖర, కోరా పబ్ ఓనర్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. అతిపెద్ద నెట్వర్క్ ను బట్టబయలు చేశారు.. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామన్నారు. దీనిలో ‘ఈగల్’ టీమ్ను ఏర్పాటు చేశారు. ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్బీ)ను ‘ఈగల్’ గా మార్చారు. ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా దాన్ని ఛేదించే పనిని ఈగల్కు అప్పగించారు. -
‘మీకు మేం ముఖ్యమో? కొండా ఫ్యామిలీ ముఖ్యమో? తేల్చుకోండి?’
సాక్షి,హైదరాబాద్: తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఇదే అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వద్ద ప్రస్తావించిన నేతలు.. మీకు మేం ముఖ్యమో? కొండా ఫ్యామిలీ ముఖ్యమో? తేల్చుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళా (జులై10) గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణా కమిటీకి తేల్చిచెప్పారు. ‘క్రమశిక్షణ కమిటి ముందుకు రావాలి అంటేనే అవమానంగా ఉంది. తిట్లు తిన్నది మేము.. కమిటి కూడా మమల్ని పిలిచింది అంటే ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కొండా మురళీపై చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తేల్చి చెప్పారు.మీకు మేము ముఖ్యమో..కొండా ఫ్యామిలీ ముఖ్యమో తేల్చాలంటూ అధిష్టానికి ఎమ్మెల్యేలు సూచించారు.మరోవైపు,క్రమశిక్షణ కమిటీ సమావేశంపై మల్లు రవి మాట్లాడారు. వరంగల్ నేతల పంచాయితీపై చర్చిచాం. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారు. వరంగల్ నేతలతో మరోసారి భేటీ అవుతామని అన్నారు. వరంగల్ కాంగ్రెస్లో చిచ్చు రాజేసిన కొండా మురళి కామెంట్స్ వివాదం వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పటికే తమను కించ పరుస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వివాదంపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళికి నోటీసులు జారీ చేశారు.దీంతో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాల్సిన కొండా మురళి ఊహించని విధంగా వ్యవహరించారు. గత నెలలో భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్కు నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్రావులతో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.ఈ క్రమంలో.. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాళ వరంగల్ నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. -
కల్తీ కల్లు కల్లోలం!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాజధాని నగరంలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. ఆరుగురి అమాయకుల ప్రాణాలను బలిగొంది. మోతాదుకు మించిన రసాయనాలు కలిపి తయారు చేసిన కల్లు తాగి నిరుపేదలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మంగళవారం నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న కల్లు కాంపౌండ్లలో హైదర్నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించగా.. బుధవారం వరకు ఆరుగురు మృతి చెందారు. మరో 32 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తనిఖీలు నామమాత్రం.. నగరం సహా శివారులోని పలు కాంపౌండ్లలో కల్లు అమ్మకాలపై తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో కల్తీ కల్లు విక్రయాలకు అడ్డే లేకుండా పోయింది. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు కల్లు కాంపౌండ్లపై నిఘా ఉంచకపోవడంతోనే వాటి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే కూకట్పల్లి విషాదాంతం జరిగినట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా కల్లు కాంపౌండ్లు.. ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ కల్లు ఉండదని చెప్పవచ్చు. డిమాండ్ మేరకు కల్లు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. మద్యం ధరలు భారీగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుతో సేదతీరుతున్నారు. వీరి బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి ప్రమాదకర రసాయపాలను వినియోగించి కల్లు తయారు చేస్తున్నారు. తయారీలో మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండటంతో.. ఈ కల్లు తాగినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గ్రేటర్తో సహా శివారుల్లోని పలు ప్రాంతాలు, బస్తీలు, పురపాలక సంఘాల్లో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లు కాంపౌండ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ çపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కల్తీ జరుగుతోందనే ఆరోపణలుతున్నాయి. ఒకే లైసెన్స్తో.. ఎన్నో కాంపౌండ్లు.. నగరంతో సహా పలు చోట్ల ఒకే కల్లు దుకాణం లైసెన్సు పొంది ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక లైసెన్స్ ఒకటే దుకాణం నడిపించాల్సి ఉంటుంది. అయినా వ్యాపారులు మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం.. డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, మానసిక విచక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. సాధ్యమైనంత వరకు ఈ కల్లు తాగకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. -
SRHను బెదిరించి టికెట్లు పొందాలని చూశారు: సీఐడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంఛైజీ మధ్య వివాదంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావును బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం కేసులో కేసు నమోదైంది. ధరం గురువరెడ్డి ఫిర్యాదుతో 465, 468, 471, 403, 409, 420 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.ఇక విచారణలో భాగంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఉన్న గౌలిగూడ క్రికెట్ క్లబ్ను అడ్డుపెట్టుకుని జగన్మోహన్రావు మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ భార్య, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితతో కలిసి క్లబ్ డాక్యుమెంట్లను అతడు ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. ఈ మేరకు ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటితోనే జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తేల్చింది.అదే విధంగా.. హెచ్సీఏలో జగన్మెహన్ రావు భారీగా నిధుల గోల్మాల్కు పాల్పడినట్లుగానూ సీఐటీ గుర్తించింది. అసోసియేషన్ సభ్యులకు, జగన్మోహన్ రావుకు మధ్య భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా విచారణలో తేలింది.అంతేకాదు.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో బ్లాక్మెయిల్ చేయడం, కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంలో బెదిరింపులకు దిగడం నిజమేనని గుర్తించింది. కార్పొరేట్ బాక్సులను తమకు కేటాయించాలని.. లేదంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగనివ్వబోమంటూ బ్లాక్మెయిల్ చేశారని తేలింది. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే జగన్మోహన్ రావు నేరపూరితంగా హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చాడని సీఐడీ గుర్తించింది.కాగా ఎస్ఆర్హెచ్తో వివాదం నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ నేపథ్యంలో హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది.అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగబోనివ్వమని జగన్మోహన్ రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఫ్రాంఛైజీ చెప్పినప్పటికీ.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని ఆయన బెదిరింపులకు దిగారు. లేకుంటే మ్యాచ్లు జరగనివ్వబోమని బ్లాక్మెయిల్ చేశారు.ఇందుకు ఎస్ఆర్హెచ్ నిరాకరించగా.. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్కు జగన్మోహన్ రావు తాళాలు కూడా వేయించారు. ఈ నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ఎస్ఆర్హెచ్ ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి.. విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. అక్రమాలు వాస్తవమేనని తేలడంతో అరెస్టులు చేసింది.ఈ విషయం గురించి సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా వివరాలు తెలియజేశారు. ‘‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.. SRH ఫ్రాంచైజీని బెదిరించి టికెట్స్ పొందాలని చూశారు.. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు’’ అని తెలిపారు. -
బాబు.. 2,45,000 కోట్ల బడ్జెట్ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లోని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?. రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత గ్యాస్ సిలిండర్ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మానవతా దృక్పథంతోనే చర్యలకు వెనుకడుగు
సాక్షి, హైదరాబాద్: ఫాతిమా కాలేజీ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఆ కళాశాల సూరం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మాట వాస్తవమే అయినా, వేల మంది మైనార్టీ విద్యారి్థనుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకునే చర్యలకు వెనుకాడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీ సంస్థ. నిరుపేద మైనార్టీ బాలికలు, యువతులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. కొన్ని కోర్సులకు మాత్రం నామమాత్రపు ఫీజు ఉంది. ఈ కాలేజీలో ఏటా 10 వేల మందికి పైగా విద్యనభ్యసిస్తుంటారు. నిరుపేద మైనార్టీ యువతులకు విద్యనందించడం ద్వారా ఈ కాలేజీ సామాజిక వెనుకబాటుతనం నుంచి వారికి విముక్తి కల్పించడానికి ప్రయత్నిస్తోంది. హైడ్రా ఎంఐఎం పట్ల ఉద్దేశపూర్వకంగా మెతకవైఖరిని అవలంబిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చేసిన కొన్ని ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పట్ల హైడ్రా కఠినంగా వ్యవహరించిందింది. గత ఏడాది ఆగస్టు 8న హైడ్రా చేపట్టిన మొదటి కూల్చివేత బమ్ రుక్ ఉద్ దౌలా చెరువులోని భవనాలే. ఇవి ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినవే. 25 ఎకరాల చెరువును ప్లాట్లుగా మార్చిన కింగ్స్ గ్రూపు విక్రయిస్తోంది. ఈ గ్రూపు యజమాని ఒవైసీ కుటుంబానికి చాలా కీలకమైన వ్యాపార భాగస్వామి. హైడ్రా ఇప్పుడు ఆ చెరువును అభివృద్ధి చేస్తోంది. చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ భూమిలో ఉన్న ఎంఐఎం కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలను తొలగించి ఆ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా ఎవరి పట్లా మెతక వైఖరిని అవలంబించదు. సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేసింది. అన్నింటికీ ఒకే మంత్రం అనే తీరుతో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తే అది సామాజిక, దేశ పురోగతికి గొడ్డలి పెట్టవుతుంది’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎఫ్–1 వీసాలు తగ్గాయ్!
యూఎస్లో చదువుకోవాలని, అక్కడ స్థిరపడాలన్న భారతీయ విద్యార్థుల కలలపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగానే భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గాయి. 2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే అభ్యర్థుల సామాజిక ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అనుమతించడం ఇందుకు ప్రధాన కారణాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలు కష్టాల్లో పడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీలు ఏటా ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు సాధారణంగా ఆగస్టు–డిసెంబర్ సెమ్నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. దీని కోసం 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. అలా సాధారణంగా ఏటా మార్చి–జూలై మధ్య వీసాల సందడి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదేకాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. కోవిడ్–19 తర్వాత 2025 మార్చి–మే నెలల్లో అత్యల్ప స్థాయిలో వీసాలు మంజూరు అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మార్చి–మే నెలల్లో 2022లో 10,894, 2023లో 14,987 వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ నాటికి యూఎస్ అధికారులు అక్కడి కనీసం 32 రాష్ట్రాల్లో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారని ఎన్బీసీ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారుల పరిశీలన కోసం యూఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది.ప్రాసెసింగ్కు సమయం.. విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం, తిరస్కరణలు పెరగడం, ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడంలో జాప్యం వీసాల తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం చెబుతోంది. ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం పడుతుందన్న అంచనాతో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల షెడ్యూలింగ్ ప్రారంభం అయిందని, దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వీసా జారీ ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలకు లోబడి ఉందని నిర్ధారించుకోవడానికి, దరఖాస్తుల పూర్తి పరిశీలనకు తగినంత సమయం ఇవ్వడానికి కాన్సులర్ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వీసా దరఖాస్తుదారులకు యూఎస్కు లేదా మా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేదని, వారు కోరిన వీసా కోసం వారి అర్హతను విశ్వసనీయంగా వెల్లడించారని నిర్ధారించుకోవడానికి అనునిత్యం పని చేస్తున్నాం’ అని యూఎస్ ఎంబసీ ప్రతినిధులు చెబుతున్నారు.మనవాళ్లే ఎక్కువ.. వీసా జారీలో ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ.. వాస్తవానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య వృద్ధి గణనీయంగా ఉంది. ఓపెన్ డోర్స్ 2024 డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో యూఎస్లో అడ్మిషన్స్ తీసుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం కావడం విశేషం. గత ఏడాది జనవరి–సెపె్టంబర్లో భారతీయ విద్యార్థులు 64,008 ఎఫ్–1 వీసాలు అందుకున్నారు. ఇదే కాలంలో 2023లో 1.03 లక్షలు, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. తనిఖీలు కఠినం ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల గురించి లోతుగా పరిశీలించడం ప్రారంభించిన తరుణంలో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులతో సహా అనేక మంది వ్యక్తులకు వీసాల రద్దు కూడా జరిగింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై మరింత కఠినమైన తనిఖీలను ప్రవేశపెట్టడానికి మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త దరఖాస్తులను నిలిపివేశారు. విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడాన్ని నిలిపివేయాలని రాయబార కార్యాలయాలు, కాన్సులర్ విభాగాలను మే నెలలో యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయాలని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్, ఎం, జే విభాగాల వీసాల స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోషల్ మీడియా ఖాతాల అయిదు సంవత్సరాల వివరాలను బహిరంగపరచాలని న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు ఆదేశించింది. -
‘ఈగల్’ దూకుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి రావాలని, తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలున్నా కనిపెట్టేలా ‘ఈగల్’రంగంలోకి దిగుతుందని అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై ఈగల్ (ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్)గా మారుస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండడంతో డ్రగ్స్ కట్టడిపై ‘ఈగల్’(ఈగల్ అంటే ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్)మరింత ఫోకస్ పెంచింది. రాష్ట్రస్థాయిలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాల కట్టడికి స్థానిక పోలీసు బృందాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. మత్తు ముఠాల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే వ్యూహాలతో ఈగల్ ముందుకు వెళ్తోంది. ఆ్రల్ఫాజోలం విక్రయ ముఠా సభ్యులకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డిలో ఆల్ఫ్రాజోలం ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులకు చెందిన రూ.30 కోట్ల విలువైన ఆస్తులను ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 68 (ఎఫ్)కింద జప్తు చేశారు. టెక్నాలజీతో డేగకన్ను ఈగల్ టీం వద్ద ఉన్న సాంకేతికత.. దేశంలోని మరే పోలీస్శాఖ విభాగం వద్ద లేదని, తాము అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్టు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేస్తున్నారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుతూ మాదకద్రవ్యాల సరఫరాదారులే లక్ష్యంగా డేటాబేస్ రూపొందిస్తున్నారు. దీంతో ఆయా మాదకద్రవ్యాల సరఫరాదారుల నెట్వర్క్ను కనుగొనే అవకాశాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, డార్క్ వెబ్తో సహా గోవా, బెంగళూరు, ముంబై లాంటి నగరాల నుంచి హైదరాబాద్కు సరఫరా అవుతున్న సింథటిక్ డ్రగ్స్పై ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ స్మగర్లు, కొరియర్ల నుంచి స్వా«దీనం చేసుకునే సెల్ఫోన్లు, ఇతర పరికరాలను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి.. ఆయా ముఠాలకు సంబంధించి స్మగ్లర్ల ప్రొఫైల్ను తయారు చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డీఆర్ లాంటి కేంద్ర సంస్థలు సహా ఏపీ, ఒడిశా, గోవా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లను నిర్వహించనున్నారు. ఇతర మత్తు పదార్థాలతో పోలిస్తే.. ఇటీవల ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు గంజాయి విక్రయాలు విస్తరించాయి. గంజాయిపైనా స్థానికపోలీసులతో కలిసి ఈగల్ టీంలు సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. సాంకేతికతను వినియోగిస్తున్న ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నెట్వర్క్ రాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లై చైన్ వరకు ఎలా విస్తరిస్తుందో పక్కాగా నిఘా సమాచారం వచ్చిన తర్వాతే క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తుండటంతో విజయాల శాతం పెరుగుతోంది. ప్రధానంగా ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న గంజాయికి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఈగల్ స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్లను రంగంలోకి దింపేందుకు చర్యలు ప్రా రంభమయ్యాయి. డ్రగ్స్. గంజాయి కేసు ల్లో పట్టుబడిన పాత నేరస్తులు, కస్టమర్ల డేటా ఆధారంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. సరిహద్దుల నుంచి రాకుండా కట్టడి.. రాష్ట్ర పరిధిలో స్పెషల్ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్న ప్రాంతాల్లోనూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించడం, మాటు వేసి మత్తు ముఠాల గుట్టు కనిపెట్టడంలోనూ ఈగల్ బృందాలు విజయవంతమవుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ.. హైదరాబాద్కు కొకైన్ సప్లయ్ చేస్తున్న డీజే వనిష్ టక్కర్, సప్లయర్ బాలకృష్ణను ఇటీవల అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న డ్రగ్స్ సప్లయర్ల కాంటాక్ట్స్, కస్టమర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. అధికారులు గోవాలో ఇటీవలే సోదాలు నిర్వహించడం తెలిసిందే. గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు పనిచేస్తున్నట్టు పక్కా సమాచారం సేకరించిన తర్వాత.. డ్రగ్స్ కింగ్పిన్గా భావిస్తున్న మ్యాక్స్ నెట్వర్క్లోని హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజు సింగ్, మహేందర్ ప్రజాపతిలను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి రూ.49.65 లక్షలు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నైజీరియన్ను అరెస్ట్ చేసి రూ.1.64 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. ఇలా అంతర్రాష్ట్ర ఆపరేషన్లలోనూ దూకుడుగా వెళ్తున్నారు. -
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా కీలక బైపాస్ రోడ్ల నిర్మాణం మొ దలైంది. నగర శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివిని ఎన్హెచ్ఏఐ నాలుగు వరుసలుగా విస్తరించనున్న విషయం తెలిసిందే. ప్రధాన రోడ్డుపై ఉన్న 915 మర్రి వృక్షాలను సంరక్షించే విషయంలో ఎన్హెచ్ఏఐ సరైన ప్రణాళిక ఇవ్వకపోవటంతో..జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలు కావటంతో రోడ్డు నిర్మాణంపై స్టే ఇచి్చ న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన రోడ్డు విస్తరణ పనులు మొదలుకాలేదు. కానీ విస్తరణలో కీలకంగా ఉండే 11 కి.మీ. నిడివితో ఉండే బైపాస్ రోడ్ల నిర్మాణం మొదలై వేగంగా జరుగుతోంది. మొయినాబాద్, చేవెళ్ల వద్ద..: ఈ రోడ్డును 60 మీటర్ల వెడల్పుతో విస్తరించాల్సి ఉంది. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద అంతమేర రోడ్డు విస్తరణ జరగాలంటే భారీగా ప్రైవేట్ భవనాలను తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఆ రెండు చోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. » తొలుత మొయినాబాద్ పట్టణం ముందు జేబీఐటీ వద్ద తొలి బైపాస్ రోడ్డు మొదలవుతుంది. ఇది పట్టణం దాటిన తర్వాత తాజ్ హోటల్ కూడలి వద్ద ముగుస్తుంది. దాదాపు 4.8 కి.మీ. నిడివితో సాగుతుంది. » చేవెళ్ల శివారులోని కేసారం గ్రామం వద్ద మొదలయ్యే బైపాస్ రోడ్డు దాదాపు 6 కి.మీ. మేర కొనసాగి చేవెళ్ల దాటిన తర్వాత ఇబ్రహీంపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డును కలుస్తుంది. » రెండు బైపాస్ల నిర్మాణానికి 135 హెక్టార్ల భూమిని సేకరించిన అధికారులు రూ.200 కోట్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించారు. చేవెళ్ల బైపాస్లో కొంత భాగంలో పరిహారం వివాదం కొన సాగుతుండటంతో ఆ భాగం మినహా మిగతా భా గం పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమిని 60 మీటర్ల వెడల్పుతో చదును చేసి గ్రావెల్ పరిచి కంప్రెస్ చేసే పని పూర్తయ్యింది. మొయినాబాద్ నుంచి సురంగల్, శ్రీరామ్నగర్ గ్రామాల మీదుగా షాబాద్ రోడ్డుకు కలిసే రోడ్డు క్రాస్ చేసే చోట విశాలమైన అండర్పాస్ నిర్మాణం జరుగుతోంది. మరో నాలుగు చోట్ల కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఈ బైపాస్ సిద్ధమైతే సురంగల్, శ్రీరామ్నగర్ ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలు మొయినాబాద్ కూడలి నుంచి రావాల్సిన అసవరం లేకుండా దీనిమీదుగా వచ్చే వీలుంటుంది. బైపాస్ నుంచి దిగువ రోడ్డుకు అనుసంధానించే లింక్ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే అప్పా కూడలి నుంచి అక్కడకు చేరుకోవచ్చు. ఇక చేవెళ్ల బైపాస్లో చేవెళ్ల–షాద్నగర్ రోడ్డు, దామరగిద్ద గ్రామానికి వెళ్లే దారిలో అండర్పాస్ల నిర్మాణం మొదలైంది. మరో ఆరు కల్వర్టుల పనులు కూడా ప్రారంభించారు. మార్చి నాటికి ఈ రెండు బైపాస్ పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను అనుమతిస్తామని ఎన్హెచ్ఏఐ పేర్కొంటోంది. పర్యావరణ ప్రభావ అంచనా సర్వే మొదలు.. ప్రధాన రహదారిపై మర్రి వృక్షాల రక్షణకు ఎన్హెచ్ఏఐ నడుంబిగించింది. ఆ వృక్షాల రక్షణకు పక్కా ప్రణాళికను అందజేయాలని ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. దీనికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ) సర్వే చేయాలని చెప్పింది. గతంలో ఈ సర్వే జరిగినా, అది పక్కాగా లేదని ఇటీవల ఆక్షేపించింది. దీంతో తాజాగా ఎన్హెచ్ఐఏ జడ్ఎస్ఐ–బీఎస్ఐల నిపుణుల ఆధ్వర్యంలో ఆ సర్వే కూడా ప్రారంభమైంది. త్వరలో నివేదిక అందించనున్నారు. దాన్ని హరిత ట్రిబ్యునల్కు అందించి, రోడ్డు నిర్మాణంపై ఉన్న స్టే తొలగించేలా ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. -
బరాజ్లు కూలితే బాధ్యులెవరు?
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్ నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నట్టు ఎన్డీఎస్ఏ తేల్చిం ది. ఆ కట్టడాలు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని, వాటిలో నీళ్లను నింపవద్దని సూచించింది. బరాజ్లలో నీళ్లు నింపితే అవి కూలిపోయి దిగువన ఉన్న 44 గ్రామాలతో పాటు సమ్మక్క సారక్క బరాజ్ కొట్టుకుపోతాయ్. భద్రాచలం ఆలయం, పట్టణం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. బరాజ్లు కూలితే ఎవరు బాధ్యులు?’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు, తప్పుడు నిర్ణయంతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం అనే అంశాలపై బుధవారం ప్రజాభవన్లో ఆయన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మాట్లాడారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ‘రూ.38 వేల కోట్ల అంచనాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడం వల్లే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ను తరలించినట్టు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనలో నిజం లేదు. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదు. ప్రాణహిత కింద 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. అదనంగా 2 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి వ్యయాన్ని నాలుగింతలు పెంచారు. ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి 165 టీఎంసీలను గత ప్రభుత్వం తరలించింది. ఏడాదికి సగటున 13 టీఎంసీలతో కొత్తగా 1.4 లక్షల ఎకరాలకే సాగునీరు అందించింది..’అని ఉత్తమ్ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే ఏపీ సామర్థ్యం పెరిగింది.. ‘ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే బీఆర్ఎస్ పాలనలోనే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి ఏపీ అక్రమ నీటి తరలింపు సామర్థ్యం రోజుకు 47,850 క్యూసెక్కుల (4.1 టీఎంసీలు) నుంచి 1,11,400 క్యూసెక్కుల (9.6 టీఎంసీలు)కు పెరిగింది. 2019 మే, 2020 జనవరి, జూన్లో నాటి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్తో గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై జరిపిన చర్చల ఫలితమే ఇది. 2004– 14 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు మొత్తం 727 టీఎంసీలను తరలించుకుపోగా, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో 2014–2023 మధ్యకాలంలో ఏకంగా 1,200 టీఎంసీలను తరలించుకుపోవడం నిర్ఘాంతపరిచే అంశం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024–25లో 286 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చితే ఇదే అత్యధికం. బీఆర్ఎస్ పాలనలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 92 వేలకు, మల్యాల లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6 వేలకు, ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు రోజూ 12,600 క్యూసెక్కుల (1.09 టీఎంసీలు)ను అక్రమంగా తరలించుకునే సామర్థ్యాన్ని ఏపీ పెంచుకుంది..’అని ఉత్తమ్ వివరించారు. 34% నీళ్లు చాలని రాసిచ్చారు.. ‘బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) సరిపోతాయంటూ, ఏపీకి పదేళ్ల పాటు 512 టీఎంసీలు (66 శాతం) ఇచ్చేందుకు.. 2016 సెప్టెంబర్లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్లు అంగీకారం తెలిపారు.మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్.. కృష్ణా జలాల్లో మాకు 71 శాతం వాటా ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. పరీవాహక ప్రాంతం, సాగుకు యోగ్యమైన భూమి, కరువును పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 575 టీఎంసీలు (71 శాతం), ఏపీకి 236 టీఎంసీలు(29 శాతం) కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నాం..’అని మంత్రి తెలిపారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ప్రమాదం శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల లోతు నుంచి నీళ్లను తరలించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్టు స్కిమ్తో నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలతో 2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించతలపెట్టగా, ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని నాటి సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారన్నారు. అప్పట్లో రాయలసీమ లిఫ్టుకు ఏపీ పిలిచిన టెండర్లకు సహకరించడానికే ఈ కుట్ర చేశారని ఆరోపించారు. -
రేపో ఎల్లుండో నీట్ స్టేట్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వీలైనంత త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి నీట్ ర్యాంకర్లకు సంబంధించిన సీడీని తీసుకువచ్చారు. సీడీలో ఉన్న.. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థులు, వారికి వచ్చిన మార్కులు, జాతీయ స్థాయిలో ర్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత, రెండు మూడురోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. అనంతరం ర్యాంకర్లు యూనివర్సిటీలో రిజి్రస్టేషన్ చేసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేసిన వెంటనే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నేతృత్వంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆలిండియా కోటా కింద ఎన్ఎంసీ కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, రాష్ట్ర ర్యాంకర్లకు కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుంది. పూర్తయిన ప్రభుత్వ కళాశాలల రెన్యువల్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ పూర్తి కావస్తోంది. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. మే నెలలో జరిపిన తనిఖీల సందర్భంగా 26 కాలేజీల నిర్వహణపై కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నారని, అనుబంధ ఆసుపత్రులలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, రోగులు లేరని, విద్యార్థుల ప్రాక్టికల్స్కు అవసరమైన మౌలిక వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించి క్లాస్ తీసుకుంది. ఈ నేపథ్యంలో 26 కళాశాలల్లోని సీట్ల రెన్యువల్ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును, వెంటనే సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిని ఎన్ఎంసీకి అధికారులు వివరించారు. తర్వాత ఎన్ఎంసీ సూచనల మేరకు ఫ్యాకల్టీ పెంపు, కొత్త నియామకాలు, సౌకర్యాల మెరుగు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు సంబంధించి ఎన్ఎంసీ ఎలాంటి కోత విధించలేదు. అలాగే ఎలాంటి జరిమానాలూ విధించలేదు. ఈ నేపథ్యంలో 4,090 ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా వచ్చే సంవత్సరం కూడా కొనసాగనున్నాయి. ఎన్ఎంసీ గ్రీన్సిగ్నల్ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియలో వేగం పెరిగిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.ప్రైవేటు మెడికల్ కళాశాలల తీరే వేరు..! ప్రభుత్వ కళాశాలలను ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కృషి చేస్తుంటే, ప్రైవేటు కళాశాలలు నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరానికి రెన్యువల్ కోసం కాళోజీ వర్సిటీ గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా, పలు కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనల జాడే లేదని, ఇష్టానుసారంగా నిర్వహణ సాగుతోందని తేలింది. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు తాత్కాలిక ఫ్యాకల్టీలతో పాఠాలు చెప్పడం తప్ప ప్రాక్టికల్స్ అంటే ఏంటో తెలియని పరిస్థితి మెజారిటీ కళాశాలల్లో ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. తనిఖీలు మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. అనంతరం నివేదికను ఎన్ఎంసీకి పంపిస్తే, ఎన్ని కళాశాలల్లో సీట్ల రెన్యువల్కు అనుమ తి వస్తుందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల తనిఖీలతో సంబంధం లేకుండా స్టేట్ ర్యాంకులను నిర్ణయించి, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని వర్సిటీ భావిస్తున్నట్లు సమాచారం. -
నిజాలు చెప్పే దమ్ము లేదు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగంపై చర్చకు రావాలంటూ రంకెలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాభవన్లో బుధవారం నిర్వహించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించలేదని మాజీమంత్రి టి.హరీశ్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. సభ్యుల హక్కులకు భంగం కలిగించినందుకు స్పీకర్, శాసనమండలి చైర్మన్కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హరీశ్రావు ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాల పుట్ట అంటూ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం సవాలులో నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించి ఉండేవారన్నారు. ఎన్ని కొరడాలైనా తక్కువే.. ‘ఐదు దశాబ్దాలుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాసి, గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటాను ఆంధ్రకు అప్పజెప్పిన కాంగ్రెస్ను కొట్టేందుకు ఎన్ని కొరడాలైనా సరిపోవు. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలో చెప్పాలి. పవర్పాయింట్ ప్రజెంటేషన్ పేరిట కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలతో సీఎం రేవంత్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తమ అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. సీఎం, మంత్రులు చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ లోపలా, బయటా అనేకసార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించాం. అయినా కుక్క తోక వంకర అన్నట్టు పదే పదే చెప్పిన అబద్ధాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేటు’అని హరీశ్ విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డిపై కుట్రలు ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్లగొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విషయం గురించి దాచిపెట్టే కుట్ర చేస్తుండు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మూలనపడింది. ప్రాణహిత–చేవెళ్ల తరహాలోనే మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా పండ బెడుతున్నారు. కేవలం 7 టీఎంసీల సామర్థ్యమున్న జూరాలపై అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యం కాదని రేవంత్రెడ్డికి తెలియదా.. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని కాంగ్రెస్ మరణ శాసనం రాయడం వల్లే తెలంగాణ శిక్ష అనుభవిస్తోంది’అని హరీశ్రావు మండిపడ్డారు. నేడు పీసీ ఘోష్ కమిషన్ వద్దకు హరీశ్రావుకాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ను గురువారం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీశ్రావు కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించేందుకు హరీశ్ సమయాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కలవడానికి కమిషన్ సమయం ఇచ్చింది. -
కల్తీ కల్లుకు మరో నలుగురు బలి
కూకట్పల్లి/ లక్డీకాపూల్/ సాక్షి, హైదరాబాద్: కల్తీ కల్లు మృతులు, బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. కూకట్పల్లి, హైదర్నగర్ కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు సేవించినవారిలో మూడు రోజుల క్రితం ఇద్దరు మరణించగా, బుధవారం మరో నలుగురు మృతిచెందారు. బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి వరకు 31 మంది నిమ్స్లో, రామ్దేవ్రావ్ ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కల్తీ కల్లు తాగి బొజ్జయ్య, నారమ్మ అనే వ్యక్తులు సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం సీతారాం (47) అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదర్నగర్కు చెందిన స్వరూప (61) సాయంత్రం 4 గంటలకు మృతి చెందగా, సాయిచరణ్ కాలనీకి చెందిన మౌనిక (24) సాయంత్రం 6 గంటలకు మరణించింది. రాత్రి 8 గంటలకు నారాయణ అనే వ్యక్తి రామ్దేవ్ రావ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో చేరిన విజయ్, కృష్ణయ్య అనే బాధితులను మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించినట్లు గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్కుమార్ తెలిపారు. నిమ్స్లో మోహనప్ప, పెంటయ్య, యాదగిరి, రాములు అనే బాధితులు ఇప్పటికే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మాధవి, యోబు, నర్సింహ, దేవదాసు, గోవిందమ్మ, లక్ష్మీ, కోటేశ్వరరావు, పోచమ్మ,ప్రమీల తదితరులకు వైద్యం అందిస్తున్నట్లు నిమ్స్ వర్గాలు తెలిపాయి. కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు: జూపల్లి రాష్ట్రంలో కల్తీ కల్లు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బుధవారం ఆయన ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కల్తీ కల్లు సరఫరా చేసినవారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కల్తీ కల్లును పరీక్షల కోసం ల్యాబ్కు పంపామని, నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నారని నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డా.ఎంవీఎస్ సుబ్బలక్ష్మి తెలిపారు. బాధితులను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐదుమంది అరెస్టు కల్తీ కల్లు ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ షాన్వాజ్ ఖాసిం తెలిపారు. దుకాణాల నిర్వాహకులు నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్గౌడ్, టి.శ్రీనివాస్గౌడ్, టి.కుమార్గౌడ్, తీగల రమేశ్లను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు చెప్పారు. హెచ్ఎంటీ కాలనీ, హైదర్నగర్, ఎస్పీనగర్ కల్లు దుకాణాలను సీజ్ చేశారు. కూకట్పల్లి, హైదర్నగర్ కల్లు కాంపౌండ్లో లభించిన 674 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. మృతులు స్వరూప కుమారుడు, సీతారాం భార్య కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మీరు ఎప్పుడంటే అప్పుడే.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన ఏ తారీఖు ఇచ్చినా శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో మీరు, ఏడాదిన్నరలో మేము తీసుకున్న నిర్ణయాలపై చర్చిద్దాం..’ అని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యాయ, సాగునీటి రంగ నిపుణులను పిలిపించి వారి అభిప్రాయాన్ని కూడా ప్రజలకు వినిపిద్దామని అన్నారు. ‘ఏ చిన్న గందరగోళం ఏర్పడకుండా, ఎవరి గౌరవానికి భంగం కలిగించకుండా చట్ట పరిధిలో సభ నిర్వహించే బాధ్యత నాది. ఆరోగ్యం సహకరించక కేసీఆర్ రాకపోతే ఎర్రవల్లి ఫామ్హౌస్కు మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. తారీఖు చెప్తే మా వాళ్లు మొత్తం సెటప్ తీసుకుని వస్తారు. అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహించి చర్చ పెడదాం. కోదండరాం అందులో కూర్చోవాలి. కేసీఆర్ పిలిస్తే నేనూ వస్తా..’ అని సీఎం సవాల్ విసిరారు. మేడిగడ్డ బరాజ్కు సంబంధించి తప్పుడు నిర్ణయాలు, ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు అంశాలపై బుధవారం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట సభల్లో చర్చిద్దాం..లేదంటే ఫామ్హౌస్కు వస్తా ‘చట్టసభల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏ తారీఖున వస్తారో చెబుతూ స్పీకర్కు లేఖ రాయమన్నాం. అంతేకానీ సవాలు విసరలేదు. ఆయన (కేటీఆర్) సడన్గా బయలుదేరిండు. పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. పొద్దటి పూట క్లబ్బుల్లో, రాత్రిపూట పబ్బుల్లో చర్చజేద్దామని ఉబలాటపడుతున్నడు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా మనం చట్టసభల్లో చర్చిద్దాం. క్లబ్బులు, పబ్బులకు, ఆ కల్చర్కు నేను చదువుకునే రోజుల నుంచే దూరం. నన్ను వాటికి పిలవద్దు. అయితే అసెంబ్లీకి, లేకుంటే మండలికి, లేకపోతే ఎర్రవల్లి ఫార్మ్హౌస్కి వస్తా..’ అని రేవంత్ అన్నారు. వీధి భాగోతాలు మంచివి కావు.. ‘ప్రదాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి. ప్రజలకు ఉపయోగపడాలని అని నేను అంటుంటే ఆయన ఎందుకూ పనికి రాడు..ఆయనతో ఏం పని అని ఆయన కొడుకు (కేటీఆర్) అంటాడు. నేపాల్లో రాజ్యం రాలేదని డిన్నర్కి పిలిపించి (యువరాజు)16 మందిని ఏకే 47తో పటపటా కాల్చిండు. అందరూ పోయాక వాడొకడే మిగిలి నేపాల్కు రాజైండు. కుటుంబంలో సమస్యలుంటే కుటుంబ పెద్దలు, కుల పెద్దలతో కూర్చొని పంచాయతీ తేల్చుకోవాలి. తమ్ముడు చెల్లెలకు, బావబామ్మర్దికి పంచాయతీలు ఉంటాయి. కానీ ఈ వీధి భాగోతాలు మంచివి కావు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీకి అన్ని రకాలుగా సహకరించారు ‘కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను 2015, 2020లో కేసీఆర్ మంజూరు చేసి వచ్చిండు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను కృష్ణా బేసిన్కు అక్కడి నుంచి పెన్నా బేసిన్కు తీసుకెళ్లండని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సలహాలిచ్చిండు. ఏపీకి అన్ని రకాలుగా సహకరించిండు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని ప్రకటించిండు. కృష్ణా బేసిన్లోని రైతులకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్కు ఎవరూ ఇవ్వలేదు. హైదరాబాద్లో ఏపీ, ఇతర రాష్ట్రాల ప్రజలు 20 శాతం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కోటా నుంచి నగర అవసరాలను వేరు చేసి మిగిలిన జలాలను పంపకాలు చేద్దాం అని ఆనాడు కేసీఆర్ అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..’ అని రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా జలాల దోపిడీకి అవకాశం కల్పించారు ‘జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల తరలింపు కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి సర్వేలు జరపాలని 2011లో కిరణ్కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. అయితే కేసీఆర్ సోర్సు(నీటిని తీసుకునే ప్రదేశం)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. తుంగభద్ర, కృష్ణా, భీమా నదుల నుంచి తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్లో ముందుగా కృష్ణా జలాలు ప్రవేశిస్తాయి. ఆ నీళ్లను అక్కడే ఒడిసి పట్టుకుని తెచ్చుకుని ఉంటే.. ఈ రోజు శ్రీశైలం బ్యాక్వాటర్ వద్ద ఏపీకి మనం పైనుంచి వదిలితేనే నీళ్లు దొరుకుతుండే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా నీళ్లు తరలించుకుపోవడానికి ఏపీకి అవకాశం ఉండేది కాదు. కిందికి పోయాక పట్టుకోవాలనే నిర్ణయంతో పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి అక్కడే దారిదోపిడీ చేసే అవకాశాన్ని ఏపీకి కేసీఆర్ కల్పించాడు..’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం ‘శ్రీశైలం నుంచి ఏపీ పెద్ద మొత్తంలో నీళ్లు తీసుకుంటుండడంతో శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి అవకాశాన్ని తెలంగాణ కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి టీఎంసీకి తగ్గించి కేసీఆర్ మరో అన్యాయం చేశారు. శ్రీశైలం నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని ఏపీ రోజుకు 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుకోగా, కేసీఆర్ మాత్రం తెలంగాణ సామర్థ్యాన్ని తగ్గించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి సీమాంధ్ర పాలకులను ఒక కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిందే. బేసిన్లు లేవు..భేషజాలు లేవని చెప్పే అధికారం కేసీఆర్కు ఎవరు ఇచ్చారు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును పూర్తిగా, నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఆయకట్టును కేసీఆర్ తొలగించిండు. కృష్ణా బేసిన్లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తే కృష్ణా ట్రిబ్యునల్లో నీటి కేటాయింపుల సమస్య వస్తది అని సమర్థించుకుండు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఎకరాకు రూ.93 వేలు ఖర్చు కాగా, కేసీఆర్ ధనదాహంతో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఎకరాకు రూ.11 లక్షలు ఖర్చు పెట్టిండు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు. ఏపీ సీఎంకు అభ్యంతరం ఎందుకు? ‘బనకచర్లతో వరద జలాలే తీసుకెళ్తామంటున్న ఏపీ సీఎంకు, మా నల్లగొండకు వరద, నికర జలాలు తీసుకెళ్తే అభ్యంతరం ఏమిటి? మా ప్రాజెక్టులన్నీ కట్టుకుంటే వరద ఉందా? లేదా? అనేది తేలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కాబట్టి కింద మీకు వరద కనిపించవచ్చు..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శ్రీధర్బాబుకు మాజీమంత్రి హరీశ్రావు ఫోన్ చేసి ప్రజాభవన్లో సమావేశాల నిర్వహణపై అభ్యంతరం తెలపడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గడీ కాదని అన్నారు. -
KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదంగా మారింది. కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి మొత్తంగా 31మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో పలువురు నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
కేసీఆర్ ఒప్పుకుంటే ఫామ్హౌజ్లోనే మాక్ అసెంబ్లీ: సీఎం రేవంత్
నేనెవరికీ చాలెంజ్లు విసరలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మని మాత్రమే పిలిచాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే.. కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయితీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి అంటూ సీఎం రేవంత్ సెటైర్లు సంధించారు. హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న సవాళ్ల పర్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు కేసీఆర్ను సభను రమ్మనే తాను సూచించానని, తానెవరికీ సవాళ్లు విసరలేదని అన్నారాయన. బుధవారం ప్రగతి భవన్లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏండ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ శాఖను చూశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరక్కపోతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్కు నేనేం సవాల్ విసరలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చట్ట సభల్లో చర్చ జరుపుదాం.. రండి అని అన్నాను అంతే. 👉కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు సభ పెడతాను. ప్రాజెక్టుల పై అసెంబ్లీలో చర్చ జరుపుదాం. ప్రత్యేకమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల పై అవగాహన ఉన్న నిపుణులను సైతం చర్చకు పిలుద్దాం. అసెంబ్లీ స్పీకర్కు కేసీఆర్ లేఖ రాస్తే చర్చకు మేము సిద్ధం. మీరు పదేళ్లలో చేసింది.. ఏడాదిన్నర కాలంలో మేము చేసింది ఏంటో చర్చ పెడదాం. సభలో ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా బాధ్యత నేను తీసుకుంటా. సభ ప్రశాంతంగా జరిపేలా నేను చూసుకుంటా. కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తే స్వీకరిస్తాం. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.👉కేసీఆర్ మా సవాళ్లను స్వీకరించాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు మా మంత్రుల బృందాన్ని పంపుతాం. కేసీఆర్ ఒప్పుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ పెడతాం. కేసీఆర్ పిలిస్తే నేను సైతం ఫామ్ హౌస్కు వస్తాను. డేట్, ప్లేస్ మీరు చెప్పినా సరే.. మేమైనా చెప్తాం. కానీ, క్లబ్ లు, పబ్లు అంటే మాకు కష్టం. గతంలో ఎన్నో చాలెంజ్లు చేశాం. కానీ, క్లబ్బులు, పబ్బుల కల్చర్కు నేను దూరం. నన్ను పిలవొద్దు. 👉ప్రజా భవన్ లో మీటింగ్ పెట్టినా BRS ఒప్పుకోవడం లేదు. ప్రజా భవన్ లో ఎలా పెడతారు? అని హరీష్ రావు అంటున్నారు. ప్రజా భవన్ ప్రజల కోసమే ఉంది..అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయతీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి. 👉స్టేక్ ఓల్డర్లతో త్వరలో PPT పెడతాం. ఏపీ సీఎంకు సూచనలు చేస్తున్న. వరద జలాల్లో లెక్కలు తేల్చుకుందాం. వరద జలాల లెక్కలు తేల్చిన తరువాత పైన మేము కట్టుకుంటాం..కింద మీరు కట్టుకోండి. మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా మిగులు జలాలు అంటే ఎలా?. నికర, మిగులు జలాల పై కేంద్రం వద్ద చర్చ జరుపుకుందాం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే చూస్తూ ఊరుకోం. మీరు ఎవరు మాకు సలహాలు ఇవ్వడానికి. కృష్ణా, గోదావరి జలాల కోసం కోట్లాడుతాం. కృష్ణా, గోదావరి జలాల పై తెలంగాణను తాకట్టు పెట్టం. తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదురిస్తాం.👉కొంతమంది పేరును ప్రస్తావించినా నా స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుంది. బేసిన్లు భేషజాలు లేవని.. రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్కు లేదు. జూరాల నుంచి నీళ్లు తేవాలని చిన్నారెడ్డి అసెంబ్లీలో అంటే.. కేసీఆర్ ఆయన్ను అవమానించారు. రెండు టీఎంసీ లు ఉన్న పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీ కేసీఆర్ తగ్గించారు. కృష్ణాజలాల పై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. 👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ వెయ్యి రెట్లు ద్రోహం చేశారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లను ఏపీ తీసుకుపోతోంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టను కేసీఆర్ ఎందుకు తొలగించారు?. రంగారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షలు, నల్గొండ తో కలిపి ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కేసీఆర్ తొలగించారు. కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ కు ఎందుకు తేలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. అనాడు రాజశేఖర్ రెడ్డి నీళ్లు తెస్తానని టెండర్లు పిలిస్తే.. కేసీఆర్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశారా ? అలాంటప్పుడు బేసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ ఎలా చెప్తారు?. వాస్తవాలు చర్చ జరుపుదాం అంటే కేసీఆర్ రావడం లేదు అని రేవంత్ మండిపడ్డారు. -
హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్తోపాటు హెచ్సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు.వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం, ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. -
ఆరుగురిపై న్యూసెన్స్ కేసు నమోదు
కుత్బుల్లాపూర్: ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే వారితో పాటు హిజ్రాల ఆగడాలపై వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. పేట్షిరాబాద్ సీఐ విజయవర్ధన్ సుచిత్ర చౌరస్తాలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేస్తూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించి సుమారు ఆరుగురిని అదుపులో తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూసెన్స్ కేసు కింద ఫైన్ వేశారు. ఇక మీదట రోడ్లపై అడుక్కోరాదని తేల్చి చెప్పారు. -
‘లక్కీ’ కనిపిస్తే చెప్పండి.!
హైదరాబాద్: అప్పటి వరకు ఆ కుక్క పిల్ల ‘లక్కీ’ఇంట్లో సందడి చేసింది. యాజమాని ఉద్యోగానికి వెళ్లేందుకు తయారవుతుండగా అతడి వెంటే తిరిగింది. అతడిని గేటు వరకు సాగనంపి ఇంట్లోకి వెళ్లకుండా వీధిలో కాసేపు నిల్చుంది. వీధిలో అటు ఇటుగా తచ్చాడుతున్న ఆ కుక్క పిల్లను ఓ మహిళ తన వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన మంగళవారం కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డా మోతీమార్కెట్ చోటు చేసుకుంది. మోతీమార్కెట్లో నివసించే మహేందర్ ‘లక్కీ’అనే కుక్కను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అతడు కార్యాలయానికి వెళ్లగా గేటు వద్దకు వచ్చిన కుక్కపిల్ల తిరిగి ఇంట్లోకి రాలేదు. ఎంత సేపటికీ అది రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా అది కనిపించలేదు. జమాల్ బస్తీలోని కల్లు కంపౌండ్లోకి కుక్కపిల్లను తీసుకెళ్లినట్లు స్థానికులు వారికి తెలిపారు. వెంటనే వారు అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజీని పరిశీలించగా ఓ మహిళ తీసుకొచి్చనట్లు గుర్తించారు. కుక్కపిల్లను ఎవరైన గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని వారు తెలిపారు. -
జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది. ఈ దంపతులు కేపీహెచ్బీ, 7వ ఫేజ్లోని ఎల్ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్బీ పోలీసులు చెప్పారు. -
ఫుట్ఓవర్ బ్రిడ్జే లేబర్ వార్డు!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మిలటరీ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న హైదరాబాద్ వాసి మేజర్ రోహిత్ బచ్వాలా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళను కాపాడటానికి రైల్వే స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని లేబర్ వార్డుగా మార్చారు. పురిటినొప్పులతో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఆమెకు తన వద్ద ఉన్న సాధారణ ఉపకరణాలతో పురుడుపోశారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్ర పన్వేల్ ప్రాంతానికి చెందిన నిండు గర్భిణి అశ్వర్ ఫలక్ తన భర్త జుబేర్ ఖురేషీ కుమారుడితో కలిసి గత శుక్రవారం పన్వేల్–గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. తన భర్త స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని బరాబంకీ ప్రయాణమయ్యారు. వీరి రైలు గత శనివారం మధ్యాహ్నం ఝూన్సీ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో ఫలక్కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. విషయం గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ మహిళా టీటీఈ, ఇతర సిబ్బందిని వీల్చైర్తో ప్లాట్ఫామ్పై సిద్ధంగా ఉంచారు. అదే సమయంలో ఆర్మీ మెడికల్ కారŠప్స్లో (ఏఎంసీ) మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్న డాక్టర్ రోహిత్ హైదరాబాద్లోని కుటుంబం వద్దకు రావడానికి శనివారం మధ్యాహ్నం ఝాన్సీ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడ గర్భిణికి పురిటినొప్పులు వస్తున్న విషయం తెలుసుకుని ఆమెకు పురుడు పోసేందుకు సిద్ధమయ్యారు. ఆమెను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన పడుకోబెట్టి..తన జేబులో ఉన్న పాకెట్ నైఫ్, మహిళా టీటీఈకి చెందిన హెయిర్ క్లిప్స్తో పాటు ఆ సమీపంలో ఉన్న వ్యక్తి నుంచి తీసుకున్న ధోవతిలతో ఆ పని ప్రారంభించారు. దాదాపు 20 నిమిషాలు శ్రమించిన రోహిత్ ఈ క్రతువు పూర్తి చేయగా..ఫలక్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు అక్కడకు చేరుకున్న అంబులెన్స్ను వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ఆ తల్లీబిడ్డలకు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ హడావుడి పూర్తయ్యే సమయానికి రోహిత్ ఎక్కాల్సిన రైలు వెళ్లిపోవడంతో ఆయన మళ్లీ మిలటరీ ఆస్పత్రికి వెళ్లిపోయారు. అభినందించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర.. రైల్వే స్టేషన్లో ఇబ్బందికర పరిస్థితుల్లో కనిపించిన మహిళకు సాయం చేయడానికి సిద్ధమవడంతో పాటు తన ప్రయాణాన్నీ మానుకుని కాన్పు చేసిన మేజర్ రోహిత్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం అభినందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. -
ఏ ఫ్లైట్.. ఎక్కడ..
సాక్షి, సిటీబ్యూరో: విమానాల రాకపోకలపై రియల్ టైం సమాచారాన్ని అందజేసే అధునాతన కియోస్్కలను హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫ్లైట్ వాస్తవ సమాచారం లభిస్తుంది. రియల్ టైం సమాచారం వల్ల ప్రయాణికులకు తమ జర్నీ సమయంపై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే సుమారు 400కు పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల వివరాలను కియోస్క్ల ద్వారా తెలుసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన, సత్వర సదుపాయాలను అందజేసే చర్యల్లో భాగంగా టెర్మినళ్లపై వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతంఅంతర్జాతీయ విమానాశ్రయాల్లో వివిధ రకాల కియోస్క్లు ఉన్నాయి. చెక్–ఇన్ వంటి సదుపాయాల కోసం కొన్నింటిని వినియోగిస్తున్నారు. బ్యాగేజ్ సేవల కోసం, అదనపు లగేజీ చెల్లింపులు వంటి వాటి కోసం కూడా ఎయిర్లైన్స్ కొన్ని రకాల కియోస్క్లను వినియోగిస్తున్నాయి, కొన్ని కియోస్్కల ద్వారా నచ్చిన సీట్లను కూడా ఎంపిక చేసుకొనే సదుపాయం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తాజాగా ఈ సమాచార కియోస్క్లను ప్రవేశపెట్టింది. సత్వర స్పందన.. ⇒ సాధారణంగా ఆలస్యంగా చేరుకొనే విమానాలు, ఆలస్యంగా బయలుదేరే వాటి వివరాలపై అధికారిక ప్రకటన వస్తే తప్ప సమాచారం లభించదు. ఇప్పుడు ప్రయాణికులే స్వయంగా ఈ వివరాలను తెలుసుకొనే అవకాశం ఉంది. అలాగే ఎయిర్పోర్టు నుంచి టెరి్మనల్కు వెళ్లేవాళ్లు, టెరి్మనల్ నుంచి ఎయిర్పోర్టు బయటకు వచ్చేవాళ్లు ప్రవేశ, ని్రష్కమణ మార్గాలను కూడా ఈ కియోస్్కల ద్వారా తెలుసుకొనే సదుపాయం ఉంది. నావిగేషన్ మ్యాప్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎయిర్పోర్టులో లభించే వివిధ రకాల సదుపాయాల రూట్మ్యాపులు కూడా ఈ కియోస్్కలలో ఉన్నాయి. ⇒ ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి, జాప్యానికి తావు లేకుండా ఎయిర్పోర్టు సేవలను వినియోగించుకోవచ్చని రెండు రోజుల క్రితం ఆ్రస్టేలియా నుంచి హైదరాబాద్కు చేరుకున్న అవినాష్ అనే ప్రయాణికుడు తెలిపారు.కియోస్క్ సేవల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కియోస్్కల ద్వారా వైఫై సేవలను కూడా అందజేస్తున్నారు. ప్రయాణికులు తమ ఫ్లైట్ పీఎన్నార్ నంబర్ను నమోదు చేసి వైఫై సేవలను పొందవచ్చు. ఎయిర్పోర్ట్ సేవల పట్ల స్పందన తెలియజేసేందుకు కూడా ఈ కియోస్్కలలో ఒక ఆప్షన్ ఏర్పాటు చేశారు. రూట్ మ్యాపుల ద్వారా ఎయిర్పోర్టులో ఏ సదుపాయం ఎక్కడ లభిస్తుందో తెలుసుకొని నేరుగా అక్కడికి చేరుకోవచ్చు.ఉత్తమ ఎయిర్పోర్టుగా గుర్తింపు.. ప్రయాణికుడే ప్రథమం అనే లక్ష్యంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక రకాల సేవలను అందజేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రయాణికుల సంఖ్య, విమానసీట్ల భర్తీ ఆధారంగా 4వ స్థానంలో నిలిచింది. ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఎయిర్పోర్టుగా గుర్తింపును పొందింది. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 400కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 80 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 70కిపైగా నగరాలకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉంది. 20కి పైగా అంతర్జాతీయ నగరాలకు నేరుగా హైదరాబాద్ నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
రేపు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్: ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనంలో భాగంగా ఇప్పటికే మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బోనాన్ని విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి.. మూడో బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగో బోనాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. అయిదో బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. -
బతుకమ్మకుంటకు జీవజలం!
అంబర్పేటలోని బతుకమ్మకుంట జీవం పోసుకుంది. ఒకప్పటిలా నీటితో కళకళలాడుతోంది. కబ్జా చెర వీడటంతో రూ.8 కోట్ల వ్యయంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే సెపె్టంబర్ నాటికి బతుకమ్మకుంట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని హైడ్రా ప్రకటించింది. ఈ చెరువుకు సంబంధించిన ‘నాడు–నేడు’ ఫొటోలను మంగళవారం విడుదల చేసింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు చెరువులో పూడికతీత చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపడుతూ అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానికులు ఈ ఏడాది బతుకమ్మకుంటలోనే బతుకమ్మ ఆడేలా చేయాలన్నదే తమ లక్ష్యమని హైడ్రా స్పష్టం చేసింది. -
అందుకే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదు.. హైడ్రా క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్టు పేర్కొంది.ఎంఐఎం ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై తాజాగా హైడ్రా స్పందించింది. ఈ సందర్బంగా హైడ్రా..‘అక్బర్ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరు అడుగుతున్నారు. కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినందున గత సెప్టెంబర్లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేద ముస్లిం మహిళలకు వెనుకబాటు తనం నుంచి విముక్తి కల్పిస్తున్నారుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశాం. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్ గా మార్చిన ఒవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేశాం. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నాం. చాంద్రయాన్గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాం. సామాజిక కారణాల వల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశాం. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని దాని పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు, ఫాతిమా కాలేజీ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కళాశాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ కళాశాల జోలికి పోతే ఏం అన్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ణయమా? లేక ఆ అధికారి సొంత నిర్ణయమో చెప్పాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల గుడిసెలను కూల్చిన హైడ్రా అధికారులు.. అక్బరుద్దీన్ ఒవైసీ కళాశాలకు మాత్రం గతేడాది నోటీసులిచ్చి ఊరుకున్నారని.. ఆ కళాశాలను ఈ ఏడాది మరోచోటుకు తరలించాలని ఎందుకు చెప్పలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
మీ సేవ.. మరింత చేరువ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లకుండానే వారికి అవసరమైన ధ్రువపత్రాలు అందించడంలో మీ సేవ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రేటర్ సహా శివారు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 1,327 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. తద్వారా ప్రభుత్వ పరిధిలోని 22 శాఖలకు సంబంధించిన 482 రకాల సర్వీసులు లభిస్తుండటంతో గ్రేటర్ సహా శివారు జిల్లాల ప్రజలకు వెసులుబాటు కలగటంతోపాటు వ్యయ, దూర భారం తగ్గుతోంది. తాజాగా మరో రెండు రకాల సేవలను ఈ జాబితాలో చేర్చడంతో సంబంధిత ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. వివాహ రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం.. వివాహ ధ్రువీకరణ పత్రం పలు సందర్భాల్లో అత్యవసరం. దీంతో వివాహ బంధానికి చట్టపరంగా గుర్తింపు లభిస్తోంది. దరఖాస్తుకు భార్యాభర్తల ఆధార్కార్డులు, వయసు, పుట్టిన తేదీ, కుల, ఆదాయం, పదోతరగతి ధ్రువీకరణ పత్రాలతో పాటు పెళ్లి ఫొటోలు, వివాహ ఆహ్వాన కార్డులు అవసరం. పెళ్లి చేసుకున్న ప్రాంతం, చిరునామా, వివాహ తేదీ, భార్యాభర్తల మతం, వృత్తి, శాశ్వత చిరునామా, దరఖాస్తుదారుల తల్లిదండ్రుల పేర్లు, సాక్షుల వివరాలు, వారి చిరునామాను దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. న్యాయవాది ద్వారా తీసుకున్న నోటరీ ఉండాలి. దేవాలయంలో పెళ్లి చేసుకుంటే ఆలయం నుంచి, ఫంక్షన్ హాలులో చేసుకుంటే సంబంధిత యాజమాన్యం నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. దరఖాస్తుతో రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. తర్వాత స్లాట్ బుక్ చేసుకుని ఆ తేదీన సబ్ రిజిస్ట్రార్ ఎదుట ముగ్గురు సాక్షులతో పాటు భార్యాభర్తలు హాజరు కావాల్సి ఉంటుంది. దరఖాస్తును సబ్ రిజి్రస్టార్ పరిశీలించి వివాహ ధ్రువపత్రం జారీ చేస్తారు.మార్కెట్ విలువ సర్టిఫికేట్ కు.. అపార్టుమెంట్, ఇంటి స్థలం, ఇతర ఆస్తులపై ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను నిర్ధారించుకోవడానికి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవటాని కి అవకాశం ఉంది. దరఖాస్తు పరిశీలన అనంతరంసబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం జారీ కానుంది. దరఖాస్తుదారు ఆధార్కార్డు, ఇల్లు, స్థలం పత్రాలు, పన్ను రసీదు, జిల్లా, గ్రామం వివరాలను సమరి్పంచాల్సి ఉంటోంది. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం కొత్తగా రెండు రకాల సేవలను మీసేవ జాబితాలో చేర్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ అధికార వర్గాలు సూచించాయి. ప్రజలకు పాలన చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, మీ సేవ కేంద్రాల ద్వారా సులభంగా, వేగంగా పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొంటున్నాయి. -
ఏసీబీ వలలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్
హైదరాబాద్: జీఎస్టీ రిజి్రస్టేషన్ కోసం రూ.8 వేల లంచం తీసుకుంటూ మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, ఎం.సుధ నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని గగన్ విహార్లోని కార్యాలయంలో ఓ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్యాక్స్ ఆఫీసర్ సుధ రూ.8 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం ఆమె బాధితుడిని నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి..
కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్): కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య మూడు చేరింది. కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ముగ్గురు ఇద్దరు మృతి చెందారు . గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు చెందారు. ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. మృతులు తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్ఎంటీ హిల్స్ సాయిచరణ్ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఎమ్మెల్యే మాధవరం పరామర్శ విషయం తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే ఆసుపత్రికి చేసుకుని వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీ కల్లు విషయంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే గాందీకల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన వారిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరామర్శించారు. అక్కడే ఉన్న వైద్యులను, పోలీసులు, ఎక్షైజ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలాకాలంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
నైపుణ్యమే ఉన్నత..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, డిగ్రీ సహా ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి గుణాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు ప్రతి విద్యార్థికి నైపుణ్యంతో కూడిన మాడ్యూల్స్ అందించబోతున్నట్టు చెప్పారు. సెల్ఫోన్కు కనెక్ట్ అయినా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అందిపుచ్చుకునే వెసులుబాటు ఉండబోతోందని పేర్కొన్నారు. నైపుణ్యాల కోసం రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదని చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరం మొదలవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాణ్యమైన విద్యే ప్రామాణికంగా ఉన్నత విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఈ–లైబ్రరీ రెడీ ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ను ఆధునీకరించాం. ఇప్పుడు దీనిని 1.5 లక్షల మంది చూస్తున్నారు. ఇందులో సమాచారం మొత్తం ఉంది. గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టాం. సమస్యలు, సూచనలు వెబ్ ద్వారానే పంపొచ్చు. ఫీడ్బ్యాక్గా దీన్ని తీసుకుంటున్నాం. మార్పులు చేసుకుంటున్నాం. మండలి న్యూస్ లెటర్ వెబ్సైట్లో లభిస్తుంది. వివిధ రంగాల నిపుణుల రీసెర్చ్ ఆరి్టకల్స్తో ఉన్న జర్నల్ను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కపైసా ఖర్చు లేకుండా 13,500 జర్నల్స్ను వెబ్సైట్లో చూడొచ్చు. అంతర్జాతీయ నైపుణ్య మెళకువలు ఇందులో లభిస్తాయి. మారుమూల ప్రాంతాల విద్యా ర్థులు కూడా డిజిటల్ లైబ్రరీ ద్వారా నాలెడ్జ్ పెంచుకోవచ్చు. పారిశ్రామిక ‘విద్య’ గ్రాడ్యుయేషన్లో మార్కులు ప్రామాణికం కానేకాదు. నైపుణ్యాన్నే పరిశ్రమలు పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. అందుకే అకడమిక్ విద్యతో పరిశ్రమలను లింక్ చేస్తున్నాం. బల్్కడ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, బీడీఎంఏ, బీఎస్ఎఫ్ఐ... ఇలా అనేక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇవన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే నైపుణ్యం అందిస్తాయి. ఇప్పటికే 400 మంది ఇంటర్న్íÙప్ కూడా చేస్తున్నారు. పుస్తకాల జ్ఞానమే కాదు.. పారిశ్రామిక స్కిల్స్ అవసరం. అప్పుడే ఉపాధి లభిస్తుంది. టీ–శాట్ ద్వారా ఓపెన్ లెక్చర్స్ ఇప్పిస్తున్నాం. రీసెర్చ్లో నాణ్యత పెరగాలి. ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి. బ్రిటన్, ఆ్రస్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్ సంస్థలను రంగంలోకి దించాం. ఉన్నత విద్య సంస్థలతో ఇవి భాగస్వామ్యమవుతాయి. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందిస్తాయి. కోర్ సబ్జెక్టులకే భవిష్యత్ విద్యార్థులు మూస ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఇంజనీరింగ్లో కంప్యూటర్ కోర్సులు చదివితేనే ఉద్యోగాలు వస్తాయనే భ్రమ వీడాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. విద్యార్థుల అవగాహన లోపమే దీనికి కారణం. సాఫ్ట్వేర్ వైపే వెళ్లాలనుకుంటే ఏ కోర్సు చేస్తే ఏం? ఉదాహరణకు మెకానికల్ తీసుకుని, మైనర్ కోర్సుగా కంప్యూటర్స్ కోర్సు తీసుకోవచ్చు. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదా? చాలా మంది ఓ విషయాన్ని తెలుసుకోవాలి. సివిల్, మెకానికల్ అన్నింటికీ సాంకేతికత తోడవుతుంది. సిలబస్ను ఈ విధంగా రూపొందించాం. డిగ్రీ, ఇంజనీరింగ్లో ఈ ఏడాది నుంచే 20 శాతం స్కిల్ సబ్జెక్టులు ఉంటాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో చాప్టర్లు ఉంటాయి. నాలెడ్జ్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం అని వివరించారు. -
బోధకులు లేరు.. రోగులు ఉండరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలలు అడుగడుగునా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. ఆయా కళాశాలల్లో ప్రొఫెసర్లు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో నర్సింగ్, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరూ లేరనే విషయం వెల్లడైంది. దీంతో నిబంధనలు అతిక్రమించిన కాలేజీలకు వర్సిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతానికి భిన్నంగా తనిఖీలతో.. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలను ఏటా రెన్యు వల్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఎన్ఎంసీ అధికారులే తనిఖీ చేస్తే ప్రైవేటు వైద్య కళాశాలలను సంబంధిత ఆరోగ్య విశ్వవిద్యాలయం తనిఖీ చేసి నివేదికను ఎన్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంటుంది. అయితే గతంలో ప్రైవేటు కళాశాలలకు ఫలానా తేదీన తనిఖీలకు వస్తున్నట్లు సమాచారం ఇవ్వడం వల్ల యాజమాన్యాలు అప్పటికప్పుడు రోగుల ను, వైద్యులను, సిబ్బందిని సమకూర్చుకొని ‘షో’చేసేవి. కానీ ఈసారి వీసీ నందకుమార్రెడ్డి నేతృత్వంలో ‘సీన్’మారింది.తనిఖీలకు వెళ్లడానికి కేవలం అరగంట ముందే కళాశాలలకు వస్తున్నట్లు సంబంధిత యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారు. స్వయంగా వీసీతోపాటు డీఎంఈ నరేంద్రకుమార్, వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్టులు బృందాలుగా ఏర్పాటై 8 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో తనిఖీలు చేయగా, ప్రైవేటు యాజమాన్యాల నిజస్వరూపం బహిర్గతమైంది. రెండు కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని చూసి వీసీ, డీఎంఈ విస్తుపోయారు. ఖాళీ బెడ్లు... నిరుపయోగంగా యంత్రాలు హైదరాబాద్ సమీపంలోని రాజరాజేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రిలో కార్పొ రేట్ హాస్పిటల్ తరహాలో పడకలు, అధునాతన పరికరాలను ఏర్పాటు చేసినా అందులో ఒక్క రోగి కూడా లేడు. ఆయా పరికరాలను నిర్వహించే సిబ్బంది సైతం కనిపించలేదు. వార్డుల్లో డాక్టర్లు, నర్సులు కూడా లేరు. కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాల ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.గత నెల 30న ఈ ఆసుపత్రిలో తనిఖీలు జరపగా పిల్లల విభాగం, సర్జికల్ వార్డు, మహిళా విభాగం, పురుషుల వార్డుతోపాటు తని ఖీలు నిర్వహించిన కె,ఎల్,ఎం. వార్డులన్నీ ఖాళీగానే ఉన్నాయి. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాల, మహేశ్వరి వైద్య కళా శాలల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.పారిశుద్ధ్య సిబ్బంది కూడా లేకపోవడంతో అత్యంత అధ్వానంగా ఆస్పత్రులు ఉన్నట్లు తనిఖీ చేసిన అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. తనిఖీలు జరిపిన మరో నాలుగు కళాశాలల్లో వీటికన్నా కొంత మెరుగైన పరిస్థితి ఉన్నట్లు ఆరోగ్య విశ్వవిద్యాలయం భావించింది. నాలుగున్నరేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు దాదాపు అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఐదేళ్ల కోర్సు ఫీజు వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. అంటే ఈ లెక్కన ఒక్కో కళాశాల సీట్లను బట్టి ఏడాదికి రూ. 6 కోట్ల నుంచి రూ. 12 కోట్లు అదనంగా వసూలు చేస్తోంది. దీనికితోడు ఇంటర్న్íÙప్ చేసే విద్యార్థికి కళాశాల యాజమాన్యం నెలకు రూ. 25 వేల వరకు స్టైపెండ్ చెల్లించాల్సి ఉండగా తనిఖీలు జరిగిన కాలేజీల్లో ఏ కాలేజీ కూడా దాన్ని చెల్లించట్లేదు. స్టైపెండ్ అడిగిన పాపానికి ఇటీవల చల్మెడ మెడికల్ కళాశాల 60 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది.ఇక తరచూ తనిఖీలు ఈసారి ప్రైవేటు వైద్య కళాశాలల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికి 8 కళాశాలల్లో తనిఖీలు జరిపాం. నిబంధనలను పూర్తిగా కాలరాస్తున్న చల్మెడ, ఎంఎన్ఆర్, రాజరాజేశ్వర, మహేశ్వరి కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. 48 గంటల్లోగా వివరణ కోరాం. తని ఖీలు ఏడాదికోసారి కాకుండా తరచూ నిర్వహించాలని నిర్ణయించాం. నిబంధనలు పాటించని కళాశాలలపై పూర్తిస్థాయి నివేదికను ఎన్ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పరిస్థితి మారకపోతే వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. – కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ నందకుమార్రెడ్డి