‘ఎంత పని జరిగింది’.. మాంజా ప్రమాదం.. యువకుడి మెడకు 20 కుట్లు | Kite Manja Accident in Keesara | Sakshi
Sakshi News home page

‘ఎంత పని జరిగింది’.. మాంజా ప్రమాదం.. యువకుడి మెడకు 20 కుట్లు

Dec 27 2025 12:56 AM | Updated on Dec 27 2025 2:41 AM

Kite Manja Accident in Keesara

సాక్షి,హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా కీసరలో మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మల్లికార్జున నగర్‌ కాలనీలో నివసించే పినింటి సుధాకర్‌రెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి. శుక్రవారం సాయంత్రం బైక్‌పై పొలం వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా మాంజా దారం మెడకు తగిలింది.

ఈ ఘటనలో జశ్వంత్‌రెడ్డి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతన్ని కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. మాంజా దారం ప్రమాదకరంగా మెడ చుట్టుకుపోయింది. దీంతో జశ్వంత్‌ మెడకు సుమారు 20 కుట్లు వేసినట్లు  వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. మాంజా దారాల వాడకం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement