‘ఎంత పని జరిగింది’.. మాంజా ప్రమాదం.. యువకుడి మెడకు 20 కుట్లు | Kite Manja Accident in Keesara | Sakshi
Sakshi News home page

‘ఎంత పని జరిగింది’.. మాంజా ప్రమాదం.. యువకుడి మెడకు 20 కుట్లు

Dec 27 2025 12:56 AM | Updated on Dec 27 2025 2:41 AM

Kite Manja Accident in Keesara

సాక్షి,హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా కీసరలో మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మల్లికార్జున నగర్‌ కాలనీలో నివసించే పినింటి సుధాకర్‌రెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి. శుక్రవారం సాయంత్రం బైక్‌పై పొలం వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా మాంజా దారం మెడకు తగిలింది.

ఈ ఘటనలో జశ్వంత్‌రెడ్డి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతన్ని కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. మాంజా దారం ప్రమాదకరంగా మెడ చుట్టుకుపోయింది. దీంతో జశ్వంత్‌ మెడకు సుమారు 20 కుట్లు వేసినట్లు  వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. మాంజా దారాల వాడకం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement