HYD: రైలు ప్రయాణికులకు శుభవార్త | Sleeping Pods Arrangement At Charlapalli Railway Station | Sakshi
Sakshi News home page

HYD: రైలు ప్రయాణికులకు శుభవార్త

Dec 27 2025 11:10 AM | Updated on Dec 27 2025 11:20 AM

Sleeping Pods Arrangement At Charlapalli Railway Station

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైలు ప్రయాణీకుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్‌లో స్లీపింగ్‌ పాడ్‌(Sleeping Pods)లను ఏర్పాటు చేసింది.  సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు రైల్వేశాఖ స్లీపింగ్‌ పాడ్‌లను అందుబాటులోకి తెస్తో​ంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్‌లో స్లీపింగ్‌ పాడ్‌లను ప్రయాణీకుల కోసం సిద్ధం చేసింది. రైలు పెట్టెలో పడకలను తలపిస్తూ లాకర్ల సదుపాయంతో కూడిన ఈ స్లీపింగ్‌ పాడ్‌లు ఆకట్టుకొంటున్నాయి. మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా వీటి ఛార్జీలను నిర్ణయించారు. రెండు గంటలకు రూ.200 కాగా.. ఆరు గంటలకు రూ.400, 12 గంటలకు రూ.800, 24 గంటలకు రూ.1200గా ధరలను నిర్ణయించారు. తొలుత జపాన్‌లో ప్రారంభమైన ఈ తరహా వసతి ఏర్పాటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిని ప్రారంభించిన అధికారులు.. తాజాగా ఈ సౌకర్యాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోనూ ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement