ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో కీలక పరిణామం.. | Centre Grants Permission To Prosecution Of IAS Officer Arvind Kumar In Formula E Car Race, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో కీలక పరిణామం..

Feb 14 2026 7:52 PM | Updated on Feb 14 2026 8:03 PM

Formula E Car Race: Permission Granted Prosecution Of Ias Arvind Kumar

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్‌ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ.. మరో వైపు ఇప్పటికే కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ, అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.

ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై కేసు నమోదు చేసంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement