breaking news
Crime
-
చందానగర్: నగల దుకాణంలో దొంగల ముఠా కాల్పులు
సాక్షి, హైదరాబాద్: చందానగర్లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన ఐదు నిమిషాలకే(10.35 గం.ప్రాంతంలో) లోపలికి చొరబడ్డ ఓ ముఠా.. లాకర్ తాళాలు ఇవ్వాలంటూ గన్ చూపించి అసిస్టెంట్ మేనేజర్ను బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో.. కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలోని సతీష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాడి సమయంలో నగల షాపులోకి సీసీకెమెరాలను దొంగలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అయితే.. సిబ్బంది చాకచక్యంగా అందించిన సమాచారంలో పోలీసులు దుకాణం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది. దుండగులు ఆర్సీపురం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగల దుకాణంలోని వెండి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సీపీటీవీల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీపీ అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాకు వివరాలను అందజేశారు. -
ఠాణా మెట్లెక్కించిన సిగరేట్
గోదావరిఖని: సిగరేట్ తాగాలనే తాపత్రయం ఠా ణా మెట్లెక్కించింది. ఇరువర్గాలు రోడ్డుపై కొట్టుకో వడం భయాందోళనకు గురిచేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి 8మందిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖనిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులు సిగరెట్ కోసం రాజేశ్ థియేటర్ సమీపంలోని ఓ పాన్షాప్ వద్దకు వెళ్లారు. మూడు సిగరెట్లకు డబ్బులు చెల్లించగా రెండు సిగరెట్లే ఇచ్చావని షాపు నిర్వాహకుడిని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇరువర్గాల మద్య మాటామాట పెరిగింది. కొట్టు కట్టేసే సమయం అయిపోయిందని, పక్కకు వెళ్లి సిగరెట్ తాగాలని షాపు యాజమాని సూచించాడు. దీంతో ఆయనపై ఇద్దరు మిత్రలు చేయి చేసుకున్నారు. ఈక్రమంలో బాధితుడు తన బందువులకు ఫోన్చేసి ముగ్గురిని పిలిపించాడు. సిగరెట్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఫోన్చేసి మరో ఇద్దరిని పిలిపించుకున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 8 మంది నడిరోడ్డుపై కొట్టుకోవడంతో అక్కడ భీతావహ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకవర్గానికి చెందిన కె.ప్రణయ్కౌశిక్, మహ్మద్ ఆజీం, బి.ఆదర్శ్, టి.రాహుల్, మరో వర్గానికి చెందిన ఎం.శ్యాంసుందర్, ఎం.అభిలాష్, జి.రాజ్కుమార్, సీహెచ్ చంద్రమౌళిగా గుర్తించారు. నడిరోడ్డుపై గొడవకు దిగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన నిందితులపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సిగరేట్ కోసం ఠాణా మెట్లు ఎక్కి కేసులో ఇరుక్కోవడం నగరంలో చర్చనీయాంశమైంది. -
దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాశన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాçశన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. బస్సు స్పీడ్గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షిడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్లోని ప్లాట్ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
అల్లుడు.. అత్తకు యముడు
కర్ణాటక: జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి అనేకచోట్ల విసిరివేసిన భయానక హత్యాకాండలో మిస్టరీ వీడింది. సొంత అల్లుడే అత్తను అంతమొందించాడని తేలింది. తుమకూరు సిటీ కువెంపు నగరలో నివాసం ఉంటున్న ఆమె అల్లుడు, దంత వైద్యుడు డాక్టర్. ఎస్.రామచంద్రయ్య (47) సూత్రధారి కాగా, ఊర్డిగెరె సమీపంలో కళ్లహళ్ళివాసి సతీష్ కే.ఎన్.(38), కిరణ్ కే.ఎస్. (32) అనే ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ మీడియాతో తెలిపారు. ఏం జరిగిందంటే వివరాలు... తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన బసవరాజు భార్య లక్ష్మీదేవమ్మ (42) ఈ నెల 3వ తేదీన కూతురి తేజస్వినిని చూడాలని తుమకూరుకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లేదు. కూతురి ఇంటికి వచ్చిన అత్తను అల్లుడు, ఇతర దుండగులు కిడ్నాప్చేశారు. హత్య చేసి సుమారు 10 ముక్కలుగా చేసి చింపుగానహళ్లి పరిసరాలలో పడేశారు. గ్రామస్తుల సమాచారం ఎస్పీ, పోలీసులు గాలింపు జరిపి శరీర భాగాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవమ్మగా భర్త బసవరాజు, పిల్లలు గుర్తించారు. బంధువులను పిలిచి విచారణ చేసే సమయంలో అల్లుడు, డెంటిస్టు రామచంద్ర కనిపించలేదు. ధర్మస్థలలో అల్లుడు అల్లుడు ధర్మస్థలకు వెళ్లాడు. పోలీసులు అక్కడికే వెళ్లి నిర్బంధించి కొరటిగెరె స్టేషన్కు వచ్చి గట్టిగా విచారించగా జరిగింది వివరించాడు. తన భార్యను చెడుదారిలో తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేసిందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. శరీరాన్ని ముక్కలు చేసి 10 చోట్ల పడేశామని తెలిపాడు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. -
‘నాకు కొడుకే కావాలి’.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి ప్రాణం తీసిన తండ్రి
అగర్తల: కొడుకులకన్నా కూతురు నయం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఇంకా వివక్ష ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన.. విషాద వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తోంది.త్రిపుర రాష్ట్రం ఖోవై జిల్లా బేహలాబారి గ్రామంలో దారుణం జరిగింది. త్రిపురా స్టేట్ రైఫిల్స్కు చెందిన జవాన్ రతీంద్ర దేవ్బర్మా తన ఏడాది కుమార్తెను విషమిచ్చి హత్య చేశారు. అయితే,తండ్రి విషం ఇవ్వడంతో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం త్రిపురా రాజధాని అగర్తల జీబీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు రతీంద్ర దేవ్ బర్మా త్రిపురా స్టేట్ రైఫిల్స్ పదోవ బెటాలియన్ తరుఫున ఏడీసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రతీంద్రదేవ్ను కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది.కుమార్తె మరణంపై గుండెలవిసేలా రోధిస్తున్న తల్లి మిథాలీ.. తన భర్త రతీంద్రదేవ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుమార్తెకు బిస్కెట్లు కొనుక్కునే నెపంతో తమ కూతురు సుహాని దేవ్ బర్మా విషం తినిపించాడని ఆరోపించింది. తన భర్తకి ఎప్పుడూ కుమారులే కావాలి. ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చినందుకు తనను నిరంతరం ద్వేషిస్తుండేవారని వాపోయింది. మేం బెహలబరిలోని నా సోదరి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు నా భర్త.. నా కుమార్తెను, నా సోదరి కొడుకుకు బిస్కెట్లు కొనిచ్చేందుకు సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. వెంటనే, నా సోదరి కొడుకు, నా కుమార్తె వాంతులు,విరోచనాలు చేసుకున్నారు. నా కుమార్తె నోటి వెంట క్రిమిసంహారక మందు వాసన రావడాన్ని గమనించా. ఆస్పత్రికి తరలించా. కుమార్తెకు.. నా భర్త హాని తలపెట్టి ఉంటాడని అనుమానించా. అతడిని నిలదీశా. కుమార్తెకు విషం ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తే తన కుమార్తె సుహాని ప్రాణాలు తీశాడని, అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
తాళి కట్టిన మూడ్రోజులకే..
సాక్షి, రంగారెడ్డి: అంగరంగ వైభవంగా ఆ జంటకు వివాహం జరిగింది. అప్పగింతల తర్వాత బారాత్లో అంతా హుషారుగా చిందులేశారు. తెల్లవారు జామున వధువుతో పాటు వరుడు తన ఇంటికి చేరుకున్నాడు. అయితే కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రిలో చేరాడు.వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడంగ్పేట్ లోని లక్ష్మీ దుర్గ నగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్(26) ఈనెల 7వ తారీఖున వివాహం జరిగింది. ఆ మరుసటిరోజు.. తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందడంతో పెళ్ళంట విషాద ఛాయలు అలుముకున్నాయి.భారత్లో ఇటీవల ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 18-45 ఏళ్ల యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనల్లో.. కోవిడ్-19 తర్వాత ఆకస్మిక మరణాలు గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తులు, ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం లేకపోయినా, హఠాత్తుగా మరణించడం గమనార్హం. దీంతో.. పోస్ట్ మార్టం నివేదికల (AIIMS లో 50 కేసులు) ఆధారంగా శరీరంలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు, రక్తనాళాల గడ్డకట్టడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కంట్రోల్ గ్రూప్ ద్వారా ఆరోగ్యవంతుల వివరాలు సేకరించి, మరణించిన వారి లక్షణాలతో పోల్చుతున్నారు.ఆకస్మిక మరణాలకు సాధ్యమైన కారణాలు:గుండెపోటు (Heart Attack) – ముఖ్యంగా నిదానంగా పెరిగిన కొలెస్ట్రాల్, రక్తనాళాల బ్లాక్లుArrhythmia – గుండె రిథమ్ సక్రమంగా లేకపోవడంCOVID-19 ప్రభావం – శరీరంలో మైక్రో గడ్డలు, శ్వాసకోశ మార్పులుఒత్తిడి, జీవనశైలి సమస్యలు – నిద్రలేమి, మద్యం, ధూమపానంఅధిక వ్యాయామం లేదా శారీరక ఒత్తిడి – కొన్నిసార్లు వ్యాయామం సమయంలో గుండెపై అధిక ఒత్తిడినివారణకు సూచనలుతరచూ ఆరోగ్య పరీక్షలు తరచుగా చేయించుకోవడంగుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంకోవిడ్ తర్వాత శరీరంలో మార్పులు ఉంటే వైద్య సలహా తీసుకోవడంజీవనశైలిని మెరుగుపరచడం (ఆహారం, వ్యాయామం, నిద్ర) -
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
కడప అర్బన్: మోస్ట్వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.రామమోహన్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు స్పష్టమైంది. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో విధుల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం సౌమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్కుమార్ ఈ కిడ్నాప్కు పాల్పడ్డాడు. ఇందుకు శరభవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కళ్యాణం ఉమామహేష్, రాగోలు దుర్గావిగ్నేస్ సహకరించారు. వీరు ముగ్గురినీ పోలీసులు వైరామవరం మండలం, పాతకోటలో అరెస్ట్ చేశారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్దొర, పూసం పవన్ కుమార్లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్పై గంజాయి కేసుతో పాటు మరో నాలుగు క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్పోస్టులకు అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కదలికలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. శరభవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తరువాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాç³ర్లు కిడ్నాప్కు వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం వద్ద వదలి, మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్లు పేర్కొన్నారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవడం ద్వారా వారున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని తెలిపారు. -
సై'డర్'..!
మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. – శ్రీకాకుళం క్రైమ్గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్టైం జాబ్ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం. హనీ ట్రాప్లో పడి.. జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. ప్రొఫైల్ పిక్లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్ అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్ కాల్లో మాట్లాడడం.. వీడియో కాల్స్ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్లో న్యూడ్ కాల్స్ చేయడం ప్రారంభించింది. కొద్దిరోజులు తానే న్యూడ్గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ను రికార్డింగ్ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట.. విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్ సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందని.. మీ ఆధార్ లింక్ నంబర్తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి పై అధికారులను మేనేజ్ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు వెరిఫికేషన్ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్లైన్ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్ను కూడా వెరిఫికేషన్లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.పార్ట్టైం జాబ్ ఫ్రాడ్స్.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్టైం జాబ్ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్డ్రా చేసుకున్నారు. అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్లో చూపించినా విత్డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు ఆసక్తి ఉన్నా.. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడికి టోకరా నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్ వివరాలు వాట్సాప్లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నారు.పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్ వీడియో కాల్ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న సైబర్ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్ -
ఆరుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు. ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు. విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్ఎస్టిఎఫ్ సీఐ సి.శంకర్రెడ్డి, ఆర్ఎస్ టాస్్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్ » ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు » రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్తో చెట్టాపట్టాలుకడప అర్బన్: మోస్ట్వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
కన్నతల్లిని కత్తితో నరికి హత్యాయత్నం
కొయ్యలగూడెం: కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108 కోసం పలుమార్లు ప్రయత్నించినా స్పందన కనిపించలేదు. దీంతో సురక్ష ఆస్పత్రి అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుల నిరసన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆస్పత్రికి తరలించేందుకు అందుబాటులో ఉండాల్సిన 108 అంబులెన్సు నిరుపయోగంగా పడి ఉండటంపై యువకులు కొయ్యలగూడెంలో నిరసన తెలిపారు. లక్ష్మీ నరసమ్మపై హత్యాయత్నం జరిగిన తరువాత స్థానికులు 108కి ఫోన్ చేసినా కనీస స్పందన రాలేదు. దీంతో స్థానిక యువకులు ఆగ్రహానికి గురై నిరుపయోగంగా ఉన్న 108 అంబులెన్సు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఈక్వెడార్ నైట్ క్లబ్లో కాల్పులు..8 మంది మృతి
శాంటా లుకా: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్లోని ఓ నైట్ క్లబ్లో ఆదివారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీరప్రాంత గుయాస్ ప్రావిన్స్లోని శాంటా లుకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా 20–40 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒకటిగా దీనికి పేరుంది. రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు. -
ఆమెకు 30.. అతనికి 19!
కాటారం: ఆమె వయసు 30.. అతని వయసు 19. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్పల్లికి చెందిన దుర్గం సరళ(30).. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేశ్ గత జూన్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుతెరువు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈక్రమంలో రాజేశ్ను కుటుంబ సభ్యులు ఉసిగొల్పడంతో.. సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రియుడ్ని ఇంటికి పిలిచి.. దారుణంగా హత్య చేసిన మహిళ!
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్ను హత్య చేశారు. వివాహేతర సంబంధమే కారణం..ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
గచ్చిబౌలి: అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్ రాయపూర్కు చెందిన రూపక్ త్రిపాఠి(30) మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కేపీహెచ్బీలో తమ్ముడు శాశ్వత్ త్రిపాఠితో కలిసి నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి ఎర్టిగా కారులో కేపీహెచ్బీ నుంచి నాలెడ్జీ సిటీకి వెళుతుండా టీ హబ్ రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న రూపక్ త్రిపాఠి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్లోని మెడికొవర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారులో ఉన్న సోదరునితో పాటు స్నేహితులు వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, ఎస్ రాజ్ సింగ్లు క్షేమంగా బయటపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఇటీవల రూపక్ త్రిపాఠి మొబైల్ యాప్ను డెవలప్ చేశాడు. యాప్ను లాంచ్ చేయాల్సి ఉందని చెప్పి చత్తీస్ఘడ్ నుంచి వారం రోజుల క్రితం ముగ్గురు స్నేహితులను పిలిపించుకున్నాడు. తెల్లవారు జామున ఐటీ కారిడార్ చూసేందుకు వెళుతూ కారు అదుపుతప్పడంతో రూపక్ త్రిపాఠి తిరిగి రాని లోకాలు వెళ్లాడు.కారు ముందు చక్రం ఊడిపోయి నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు మృత దేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎంఆర్ఎఫ్లో బిగ్ స్కాం.. వీళ్లు మామూలోళ్లు కాదు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. డబ్బులు నొక్కేసింది. గతంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పని చేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. 2020-21 నుంచి అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం.సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నవారిని కాదని ఇంటి పేరును పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఓ ఉద్యోగి.. ముఠాకు సహకరించినట్లు తెలిసింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు తేలింది.2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వర రావు ఎస్బీఐ ఖాతాకు డబ్బులు రావడం.. డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ముఠాలోని మునగాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా.. నాలుగేళ్లపాటు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అర్చన ఎక్కడ?.. పోలీసులకు మిస్టరీగా మిస్సింగ్ కేసు
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక యువతి రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులైనా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన అర్చనా తివారీ(28) సివిల్ జడ్జి కావడానికి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఏడో తేదీన ఆమె తన ఇంటికి వెళ్లేందుకు ఇండోర్-బిలాస్పూర్ నర్మదా ఎక్స్ప్రెస్లో ఎక్కారు. ఎక్స్ప్రెస్ రైలులోని బీ-3 బోగీలో కూర్చున్నారు. అయితే, ఆమె దిగాల్సిన స్టేషన్ కట్నీ వద్ద అర్చన కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రైలు వచ్చినప్పటికీ అర్చన మాత్రం రైలు నుంచి దిగలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతుండగానే.. రైలు స్టేషన్ నుంచి వెళ్లిపోయింది.भोपाल में चलती ट्रेन से गायब हो गई 29 साल की लड़की ये घटना सरकार की नीद हराम कर दी है और कानून व्यवस्था पर धब्बा लगा दिया है दरअसल, अर्चना तिवारी नाम की युवती इंदौर से कटनी जाने के लिए निकली थी।वह ट्रेन नंबर 18233 इंदौर-बिलासपुर नर्मदा एक्सप्रेस के बी-3 कोच में सीट नंबर 3 पर… pic.twitter.com/GxCVxaT23A— Pradeep yaduvanshi (@Ritikapradeep94) August 9, 2025దీంతో, కుటుంబ సభ్యులు.. రైల్వే అధికారులను ఆశ్రయించడంతో.. పక్క స్టేషన్ ఉమారియాలో రైలు ఆగిన వెంటనే.. సదరు బోగీలో అర్చన కోసం వెతికినప్పటికీ ఆమె కనిపించలేదు. కానీ, ఆమె బ్యాగు మాత్రం బోగీలో లభించింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోజు ఉదయం 10:15 గంటల ప్రాంతంలో తాము చివరిసారిగా అర్చనతో మాట్లాడామని.. అప్పుడు రైలు భోపాల్ సమీపంలో ఉందని చెప్పారు. దీని తర్వాత అర్చన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని చెప్పుకొచ్చారు.అనంతరం, కట్నీ రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మరావి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. భోపాల్లోని రాణి కమలపతి స్టేషన్లో అర్చన కనిపించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భోపాల్ స్టేషన్ తర్వాత సహ ప్రయాణికులు ఆమెను చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మూడు రోజులైనా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ముక్కలుగా నరికి..10 చోట్ల పడేశారు..!
బెంగళూరు: 2022నాటి శ్రద్ధా వాకర్ దారుణ హత్యను తలపించే ఘటన ఒకటి కర్నాటకలో వెలుగు చూసింది. ఈ నెల 7వ తేదీన కొరటగెరె తాలుకాలోని ఓ గ్రామంలో వీధి కుక్క ఒకటి రక్తమోడుతున్న మనిషి చేతిని లాక్కెళుతుండగా చూసి షాక్కు గురయ్యారు. మరో చేయి అక్కడికి కిలోమీటర్ దూరంలో గ్రామస్తులకు కనిపించింది. గుర్తు తెలియని మహిళ తల, మొండెం తదితర భాగాలు పది వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండగా గుర్తించారు. సాధారణంగా చోటుచేసుకునే హత్య వంటిది కాదని తేలి్చన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని గుర్తించారు. హంతకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. 10 చోట్ల 10 భాగాలు.. ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం చింపుగనహళ్లి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన కుక్క ఒకటి మనిషి తెగిన చేతిని పొదల్లోకి లాక్కెళ్తుండగా స్థానికులు గమనించారు. ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మరో చేయి ఆ సమీపంలోనే వారికి కనిపించింది. మరికొద్ది గంటల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో మరికొన్ని అవయవ భాగాలు కనిపించాయి. లింగపుర రోడ్డు వంతెన వద్ద పేగులు, ఇతర అంతర్గత భాగాలు బెండోన్ నర్సరీకి సమీపంలో, ఒక కాలు రక్తంతో తడిచిన బ్యాగు జోనిగరహళ్లి వద్ద పోలీసులకు దొరికాయి. సిద్దారబెట్ట, నాగాలాల్ మధ్య రోడ్డుపై రెండు బ్యాగుల్లో మరికొన్ని శరీర భాగాలను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం సిద్దారబెట్ట సమీపంలో హతురాలి తల లభ్యమైంది. శరీర భాగాలన్నీకొరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 10 ప్రాంతాల్లో పడి ఉండగా స్వా«దీనం చేసుకున్నారు పోలీసులు. హతురాలి చేతులపై ఉన్న పచ్చబొట్లు, ముఖకవళికల ఆధారంగా ఆమెను తుమకూరు తాలుకా బెళ్లావికి చెందిన లక్ష్మీదేవమ్మ(42)అని గుర్తించారు. ఆగస్ట్ 3వ తేదీన ఉర్దిగెరెలో ఉన్న కుమార్తెను చూసేందుకని వెళ్లిన లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయిందంటూ ఆమె భర్త బెళ్లావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, ముక్కలుగా నరికారని, ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే హంతకులు పలు ప్రాంతాల్లో శరీర భాగాలను పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ హత్యకు పాల్పడిందెవరు? కారణాలేమిటో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె బాయ్ఫ్రెండ్ ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసిన ఘటన తీవ్ర సంచలనం రేపడం తెల్సిందే. -
సోదరునికి రాఖీ కట్టేందుకు వచ్చి..
సిద్దిపేట కమాన్: సోదరుడికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న యువతికి అదే చివరి రోజు అయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందగా.. తల్లి, మేనమామకు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనపై సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలివి. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి పర్షరాములు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో భార్య పల్లవి, కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరి కూతురు తాళ్లపల్లి శృతి (24) ఎం ఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. పర్షరాములు భార్య పల్లవి సిద్దిపేటలోని తమ్ముడు నాగిళ్ల శ్రీనివాస్కు రాఖీ కట్టేందుకు.. కూతురు శృతితో కలిసి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తన భార్య, అక్క పల్లవి, మేనకోడలు శృతితో కారులో అల్లీపూర్ గ్రామానికి వెళ్లి భార్యను అక్కడ దింపేశాడు. అనంతరం మహారాష్ట్ర నుంచి వచ్చిన సోద రుడు లింగంకు రాఖీ కట్టేందుకు శృతి.. తన తల్లి పల్లవి, మేనమామ శ్రీనివాస్తో కలిసి నంగునూర్ మండలం నర్మెటకు బయలుదేరింది. ఈ క్రమంలో పట్టణ శివారు రాజీవ్ రహదారిపై శ్రీనివాస్ నడుపుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో.. నెమ్మది గా రోడ్డు పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు.. వెనుకనుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనక సీట్లో కూర్చున్న శృతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శృతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్. ఆయన సోదరి పల్లవికి స్వల్ప గాయాలవడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఇంటి పక్కనే ఉంటాడు.. నా భార్యను వేధిస్తున్నాడు..
జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. -
వంట బాగోలేదనడం వేధింపెలా అవుతుంది?
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది. 2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ పిటిషన్ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్ముఖ్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
వెంటాడిన వెబ్సిరీస్
మొబైల్ఫోన్, అందులోని ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేమ్స్ అనేవి డ్రగ్స్ మాదిరిగా వ్యసనమవుతున్నాయి. ఎంతోమంది జీవితాలను బలిగొంటున్నాయి. ముఖ్యంగా బాలలు, యువకులు మొబైల్ గేమ్స్ మాయలో పడి విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి రెండు విషాద సంఘటనలు బెంగళూరులో సంభవించాయి.బనశంకరి: సిలికాన్ సిటీలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్స్టేషన్ పరిదిలో 14 ఏళ్లుబాలుడు గాంధార్ డెత్నోట్రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లిదండ్రులు జి.గంగాధర్, సవిత గాన సంగీత కళాకారులు కాగా, ఘటన సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాలుడు పద్మనాభనగరలో ప్రైవేటు స్కూలులో 7వ తరగతి చదివేవాడు. ఇంట్లో ఎలాంటి సమస్య లేదు, తల్లిదండ్రులు, సోదరునితో అన్యోన్యంగా ఉండే గాంధార్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి షాక్ ఇచ్చింది.స్వర్గంలో ఉంటానురాత్రి అందరితో కలిసి భోజనం చేసి తన పెంపుడు శునకంతో నిద్రకు ఉపక్రమించిన గాంధార్ తెల్లవారుజామున తన గదిలో ఉరివేసుకునే ముందు డెత్నోట్ను రాశాడు. తల్లిదండ్రులను ఉద్దేశించి.. మీరు నన్ను 14 ఏళ్లు బాగా పెంచారు. మీతో చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నేను వెళ్లే సమయం వచ్చింది. మీరు ఈ లేఖ చదివేలోగా నేను స్వర్గంలో ఉంటాను అని రాశాడు. అందులో కొన్ని బొమ్మలను కూడా గీశాడు.ఆ వెబ్ సిరీసే..బాలుడు చిన్న వయసులో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్న తలెత్తింది. పోలీసులు విచారణ జరపగా కలవరపరిచే అంశాలు బయటపడ్డాయి. గాంధార్ జపనీస్ భాషలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డెత్నోట్ వెబ్ సిరీస్ను క్రమం తప్పకుండా చూసేవాడు. అంతేగాక వెబ్సీరీస్లో వచ్చే ఒక పాత్రను గాంధార్ తన రూమ్లో గీశాడు. ఈ వెబ్సీరీస్లో ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర చెప్పినట్లు హీరో నడుచుకుంటాడు. ఆ మాయా బుక్లో ఎవరిపేరు రాసి వారు ఎలా చనిపోవాలి అనే ఊహించుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోతాడు. చెడ్డవారు ఎవరూ కూడా భూమిపై ఉండరాదు, వారందరినీ అంతం చేయాలి అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈ డెత్నోట్ వెబ్సిరీస్ను నిరంతరం చూసి దీని ప్రభావానికి లోనైన గాంధార్ ఆ మాదిరిగా ప్రాణాలు తీసుకున్నాడనే అనుమానం వ్యక్తమవుతోంది. బాలుని మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు!
కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్లైన్లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, చాకిచెర్ల: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుపాన్ వాహనం లారీని ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తుపాను వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, వీరంతా.. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన తనయుడు
కర్నూలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన ఘటన కర్నూలులో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో రుద్రాక్ష ఎల్లమ్మ(70), కుమారుడు జమ్మన్న నివాసముంటున్నారు. జమ్మన్న వంట మాస్టర్గా పనిచేస్తూ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గురువారం రాత్రి తల్లిని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున ఒంటరిగా పడుకుని ఉన్న తల్లి చెవి కమ్మలను బలవంతంగా లాక్కొన్నాడు. అనంతరం ముక్కు మూసి హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. జమ్మన్న కూతురు జ్ఞానేశ్వరి ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధుడు.. నలుగురు మహిళలు.. ఇవేం ట్విస్టులు రా సామీ!
ముంబై: సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. సైబర్ మోసగాళ్ల చేతిలో అమాయకులు సులభంగా మోసపోతునే ఉన్నారు. దేశంలో రోజురోజుకు ఇలాంటివి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యువతే కాదు.. వృద్ధులు సైతం వలపు వలలో పడుతున్నారు. వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి.. సైబర్ మోసానికి గురై రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.ముంబైకి చెందిన వృద్ధుడు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫేస్బుక్లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా.. ఆ రిక్వెస్ట్ అంగీకరించలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ వృద్ధుడు అంగీకరించాడు. ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు.అప్పుడే అసలు కథ మొదలైంది. తన భర్త నుంచి దూరమై పిల్లలతో ఉన్నట్లు నాటకానికి తెర తీసింది. ప్రస్తుతం తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. తనకు కొంత డబ్బు అవసరం అంటూ వాపోయింది. దీంతో కరిగిపోయిన ఆ వృద్ధుడు నగదును పంపించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ వాట్సాప్లో మెసేజ్లు పంపడం ప్రారంభించింది. షార్వి స్నేహితురాలిగా పరిచయం చేసుకున్న ఆమె. ఆ వృద్ధుడికి అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించింది. అనంతరం డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షార్వి సోదరి నంటూ మరో మహిళా దివాజ్ సందేశాలు పంపించడం మొదలు పెట్టింది. షార్వి చనిపోయిందని.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని స్క్రీన్ షాట్లు కూడా పంపించింది. దీంతో ఆ వృద్ధుడు డబ్బులు పంపించాడు. అనంతరం తిరిగి దినాజ్ను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇదిలా సాగుతుండగా..ఇంతలోనే జాస్మిన్ అనే మరో మహిళ మెసేజ్ పంపించింది. దినాజ్ స్నేహితురాలినంటూ సాయం చేయాలని అభ్యర్థించింది. దీంతో ఆమెకు కూడా ఆ వృద్ధుడు డబ్బు పంపించాడు. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు రూ. 8.7 కోట్లు పంపించాడు. ఇంతటితో ఆ వృద్ధుడు ఆగలేదు.. ఇక ఖాతాలో నగదు అయిపోవడంతో కోడలి దగ్గర రూ.2లక్షలు అప్పుతీసుకున్నాడు. మరింత డబ్బు కావాలంటూ ఆ మహిళలు కోరడంతో కుమారుడి దగ్గర కూడా రూ. 5 లక్షలు అడిగాడు.దీంతో అనుమానం వచ్చి కొడుకు తండ్రిని నిలదీయగా.. ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. మోసంపై జూలై 22న సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వృద్ధుడిని మోసం చేసిన నలుగురు మహిళలు తెలిసిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
భార్యపై ఇన్స్టాలో భర్త అసభ్య పోస్టులు.. నవవధువు ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాంగోపాల్పేట్: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఇన్స్ట్రాగామ్లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాంగోపాల్పేట్ గైదీన్బాగ్కు చెందిన కీర్తి, రామంతపూర్కు చెందిన భీమ్రాజ్ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్లోని ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే ఆ బిడ్డ తనకే పుట్టాడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించడంతో మనస్తాపానికి లోనైన కీర్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆటోలో 2 రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే? -
సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్.. నాలుగు రోజులుగా రెక్కీ..
రంపచోడవరం: సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సోయం శ్రీసౌమ్య ఉదయం 10.30 గంటలకు రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యారు.ఈ క్రమంలో వేటుకూరుకి చెందిన కె.అనిల్కుమార్ మరికొందరి సహాయంతో AP31TJ1462 నంబరు గల ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించి, బలవంతంగా ఈడ్చుకుంటూ ఎక్కించుకుని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు నాలుగు రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందూ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. -
విశాఖలో విషాదం
విశాఖ సిటీ: విశాఖ వన్టౌన్లో విషాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ రోడ్డులోని వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విస్ఫోటనం ధాటికి షాపు తునాతునకలైంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. సున్నపువీధి ప్రాంతంలో నివాసముంటున్న చల్లా గణేష్ (44) 6 నెలల క్రితమే బుక్కావీధి ప్రాంతంలోని ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని ప్రారంభించాడు. వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ తో పాటు హెల్పర్ శ్రీను, రోజువారీ వేతనం కింద ఎర్ర ఎల్లాజీ (45), డి.సన్యాసిరావు (46) పని చేస్తున్నారు. సాయంత్రం 4.30 సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండాపోయింది. షాపు యజమాని చల్లా గణేష్, హెల్పర్ శ్రీను శరీరాలు ముక్కలై షాపు వెనుక ఉన్న 9 అడుగుల గోడ పైనుంచి ఎగిరి అవతలివైపు పడ్డాయి. వర్కర్లు ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు దాని పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం వద్ద పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు (27), ఇప్పిలి రంగారావు(53)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో వన్టౌన్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి కేజీహెచ్కు తరలించారు. చింతకాయల ముత్యాలు శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 7 గంటలకు మరణించాడు. ప్రస్తుతం 95 శాతం కాలిన గాయాలతో ఎల్లాజీ, 75 శాతం గాయాలతో ఇప్పిలి రంగారావు, 18 శాతం గాయాలతో డి.సన్యాసిరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా పేలుడుకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుకు వెల్డింగ్ సిలిండర్ కారణమా? లేదా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగంతోనే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. -
తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్షెడ్కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్ల దుర్మరణం
జమ్ము కశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది సిబ్బందికి గాయాలతో చికిత్స పొందుతున్నారు.మొత్తం 23 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బంకర్ వాహనం బసంత్గఢ్ నుంచి గురువారం ఉదయం తిరుగు పయనం అయ్యింది. అయితే.. 10.30గం. ప్రాంతంలో కాంద్వా వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు కన్నుమూశారు. క్షతగాత్రులకు స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సదరు వాహనం 187వ బెటాలియన్కు చెందిందిగా నిర్ధారించారు. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారాయన. -
మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. -
అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: దేవీపట్నం మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. సౌమ్య అనే మహిళను కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయారు. శరభవరం సచివాలయంలో ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌమ్యను ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
హరిత నన్ను క్షమించు..
అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.అప్పులే శాపంగా మారాయి..రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు. హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు. -
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
సన్నిహిత ఫొటోలతో ప్రియుడు బ్లాక్మెయిల్.. చివరికి..
భువనేశ్వర్: భువనేశ్వర్లో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేంద్రపారా జిల్లాలొ ఇవాళ (బుధవారం) ఉదయం 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో తీవ్రంగా కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పెట్రోల్ పోసుకుని తానే నిప్పంటించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఆ యువతిని కొంతకాలంగా ఆమె ప్రియుడు వేధించడంతో పాటు ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఆ యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని కూడా బెదిరించాడంటూ తండ్రి ఆరోపించాడు. ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేయలేదని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కేంద్ర పారా ఎస్పీ సిద్ధార్థ్ కటారియా తెలిపారు.కాగా, గత నెల జూలై 12న బాలాసోర్లోని ఎఫ్ఎం కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్లో తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె తన డిపార్ట్మెంట్ హెడ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. -
మధుకి నరకం చూపించి మరీ..
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై.. ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. సింగపూర్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే.. పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది. అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది. -
పలమనేరులో మహిళ దారుణ హత్య!
చిత్తూరు జిల్లా: పట్టణ సమీపంలోని ఎక్స్ప్రెస్హైవే పనులు సాగుతున్న ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం.. పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయానికి వెనుకవైపు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఆ గుంతల్లో వర్షపునీరు చేరింది. ఓ గుంతలో 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. ఆపై మృతదేహాన్ని వెలికితీసి గమనించగా ముఖంపైన, శరీరంపై పలుచోట్ల రక్తగాయాలు కనిపించాయి. ఆ ప్రదేశానికి పైన గుంత ఒడ్డున ముళ్లపొదలపై మృతురాలి పాదరక్షలు, నైటీ, లోదుస్తులు కనిపించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పోలికలున్న మహిళ కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉండేదని కొందరు చెబుతున్నారు. ఆమెకు మతి బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఘటన జరిగి మూడురోజులైంటుదని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు. -
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్పై దాడికి దిగారు. రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
Cable Bridge: బర్త్ డే రోజే..
హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని హాస్టల్కు బైక్పై తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కేక్ కట్ చేసిన అరగంటకే యువకుడు మృత్యువాత పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముక్కురాళ్ల గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనిల్ (23) అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సమీపంలో ఉన్న మైండ్ మ్యాప్స్ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్లో ఎడిటింగ్ పనిచేస్తుంటాడు. మంగళవారం పుట్టినరోజు కావడంతో అనిల్ తన స్నేహితులు జాన్పాల్, మహేష్ నాగరాజు, వెంకటేష్ భాను తదితరులతో కలిసి బైక్లపై సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. తమతో పాటు తెచ్చుకున్న కేక్ను అనిల్ కట్ చేసిన అనంతరం స్నేహితులంతా అక్కడే సరదాగా గడిపి తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయలుదేరారు. ఈ క్రమంలో జాన్పాల్ బైక్ నడుపుతుండగా అనిల్ వెనుక కూర్చొన్నాడు. మిగతా స్నేహితులంతా ఎవరి బైక్లపై వారు అనుసరించారు. అనిల్ ఎక్కిన బైక్ను జాన్పాల్ అధిక వేగంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 ఫ్లైఓవర్ వైపు దూసుకెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. దీంతో అనిల్ కిందపడగా కొద్ది దూరం వరకు రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న జాన్పాల్కు స్వల్ప గాయాలయ్యాయి. వెనుక వస్తున్న స్నేహితులంతా తల పగిలి రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న అనిల్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు కావడంతో అంతకు ఆరు గంటల ముందే వీరు హాస్టల్లోనే మద్యం సేవించినట్లు పోలీసుల అదుపులో ఉన్న జాన్పాల్ వెల్లడించారు. జాన్పాల్కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా మద్యం సేవించినట్లుగా నమోదైంది. అర్ధరాత్రి మద్యం మత్తులో అదుపుతప్పిన వేగంతో బైక్పై దూసుకెళ్తుండడంతో మలుపు వద్ద కంట్రోల్ చేయలేక డివైడర్ను ఢీకొట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేబుల్ బ్రిడ్జి వద్ద నుంచి బయలుదేరే ముందు అనిల్ తన బర్త్ డే కేక్ను చేతిలో పట్టుకొని బైక్పై కూర్చోగా ఈ ప్రమాదంలో అనిల్ కిందపడ్డ తర్వాత కేక్ రోడ్డంతా చిందరవందరగా పడిపోయింది. బర్త్ డే రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల రోదనలకు అంతులేకుండాపోయింది. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన జాన్పాల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వద్దంటే వినరా.. టెకీ ఆత్మహత్య
జె.పంగులూరు: ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలంలోని కొండమంజులూరు గ్రామంలో మంగళవారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. కొండమంజులూరు గ్రామానికి చెందిన బొప్పుడి శివయ్య కుమార్తె బొప్పుడి మానస (26) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది ఆమెకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చేశారు. -
రూ.4.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్న 847 కిలోల హైగ్రేడ్ (అత్యధిక నాణ్యత) గంజాయిని ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) టీమ్ స్వాదీనం చేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ.4.2 కోట్లు ఉంటుందని ఈగల్ టీం డైరెక్టర్ సందీప్శాండిల్య తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఉత్తర ప్రదేశ్కు భారీ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం ఆర్ఎన్సీసీ (రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్), ఈగల్ టీమ్ శంషాబాద్ సమీపంలోని తొండపల్లి వద్ద అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అడ్డగించింది. సోదాలు చేయగా, పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. వాహనంలో ఉన్న మల్కన్గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్ బజింగ్లను అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న రమేశ్ సుక్రి, జగదీశ్ కులదీప్, షిబో అలియాస్ షిబా, బసు, షఫీక్ అలియాస్ షఫీల కోసం గాలిస్తున్నారు. గంజాయిని సరిహద్దు దాటించడంలో ఆ ఇద్దరూ దిట్ట మల్కన్గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్ బజింగ్లు గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో దిట్ట అని ఈగల్ డైరెక్టర్ సందీప్శాండిల్య తెలిపారు. ఖిలాధన 2019లో 20 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని డొంకరాయి వద్ద పోలీసులకు పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలులో 4 నెలలు ఉన్నాడు. బెయిల్పై బయటకు వచి్చన తర్వాతా ఉత్తరప్రదేశ్కు ఈ ఏడాదిలో 350 కిలోలు, 500 కిలోలు, 600 కిలోల చొప్పున గంజాయి తరలించిన చరిత్ర ఉంది. పోలీసులకు చిక్కకుండా స్థానిక రోడ్ల మీదుగా దూర ప్రాంతాలకు డ్రైవింగ్ చేయడంలో నిపుణుడు. » మరో నిందితుడు రాజేందర్ బజింగ్ 2023లో 150 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని నర్సీపట్నం పోలీసులకు చిక్కాడు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 10 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. గ్రామీణ ప్రత్యామ్నాయ రహదారుల గురించి లోతైన అవగాహన ఉంది. » పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎన్సీసీ ఖమ్మం బృందం డీఎస్పీ సీహెచ్ శ్రీధర్, ఇన్స్పెక్టర్ విజయ్, ఎస్సై రవిప్రసాద్, సైబరాబాద్ నార్కోటిక్స్ డీఎస్పీ హరీశ్చంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేశ్రెడ్డి,రామునాయక్, సిబ్బందిని ఈగల్ డైరెక్టర్ సందీప్శాండిల్య అభినందించారు. -
మద్యం తాగించి.. చెవిలో గడ్డి మందుపోసి
కరీంనగర్రూరల్: నిత్యం తనపై అనుమానంతో తాగొచ్చి కొడుతున్నాడని, ప్రియుడు, మరోవ్యక్తితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఈ ఘటన జూలై 29న కరీంనగర్ శివారులో చోటు చేసుకుంది. కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం ఆ వివరాలు వెల్లడించారు. సీపీ గౌస్ ఆలం కథనం ప్రకారం.. కరీంనగర్లోని సుభాశ్నగర్కు చెందిన ఐలవేణి సంపత్ (45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్గా పని చేస్తున్నాడు. జూలై 29న కరీంనగర్ శివారులోని రైల్వేట్రాక్పై అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య రమాదేవిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమాదేవికి కిసాన్నగర్కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. సంపత్ మద్యానికి బానిసై తరచూ కొడుతుండటంతో భర్తను హత్య చేసేందుకు రాజయ్యతోపాటు దూరపు బంధువు అయిన ఖాదర్గూడేనికి చెందిన కీసరి శ్రీనివాస్ను రమాదేవి సంప్రదించింది. ప్రణాళిక ప్రకారం రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్ను జూలై 29న బొమ్మకల్ ఫ్లై ఓవర్బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. రమాదేవి ఆదేశాల మేరకు మద్యం మత్తులో ఉన్న సంపత్ చెవిలో రాజయ్య, శ్రీనివాస్ గడ్డిమందు పోసి హత్య చేశారు. అనంతరం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు సంపత్ భార్యను విచారించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గుర్తించారు. నిందితులు కర్రె రాజయ్య, కీసరి శ్రీనివాస్, ఐలవేణి రమాదేవిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు టి.నరేశ్, లక్ష్మారెడ్డిని సీపీ అభినందించారు. -
డాక్టర్ నమ్రతా కస్టడీలో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు ముందు ఉంచి నమ్రతాను విచారించిన పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్థారణ అయ్యింది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. రేపటితో కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ముగియనుంది. మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపర్చనున్నారు.కాగా, సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు మరో డాక్టర్ను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్కు వచ్చిన డాక్టర్ విజ్జు లతను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 15కు చేరింది. మరోపక్క డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందంటూ మరో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.సరోగసీ కోసం హైదరాబాద్లోని సృష్టి సెంటర్ను ఆశ్రయించిన వారిని నమ్రత విశాఖపట్నంలోని బ్రాంచ్కు పంపేది. అక్కడ కీలకంగా వ్యహరించిన డాక్టర్ విజ్జు లత వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం తదితరాలు చేసేది. నమ్రత విచారణలో ఈ విషయం గుర్తించిన దర్యాప్తు అధికారులు విజ్జు లత కోసం గాలించారు. అయితే నమ్రత గ్యాంగ్ అరెస్టు విషయం తెలియడంతోనే ఆమెతోపాటు అనేక మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నమ్రత చేతిలో మోసపోయిన మరో ఐదుగురు బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసుల్లోనే విజ్జు లతను అరెస్టు చేశారు. సరోగసీ పేరుతో ఒప్పందాలు చేసుకున్న నమ్రతకు రూ.11 లక్షలు, రూ.15 లక్షలు, రూ.13 లక్షలు చొప్పున ఆ ముగ్గురు, మరో జంట రూ. 20 లక్షలు చెల్లించినట్టు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేశారు. నమ్రతతో పాటు ఇతర నిందితులను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్పై అరెస్టు చేయడంతో పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. రాజస్తాన్ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఆపై ఇతర కేసుల్లో అరెస్టు, కస్టడీ ప్రక్రియలు చేపట్టనున్నారు.నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్తో కథ నడిపించారు.ఈ సూరి శ్రీమతి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆమెకు తెలియకుండానే నమ్రత ఈ పని చేసినట్టు గుర్తించిన గోపాలపురం పోలీసులు ఈ మేరకు వాంగ్మూలాలు నమోదు చేశారు. నమ్రతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే మగ శిశువును గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఆడ శిశువును గరిష్టంగా రూ.3.5 లక్షలకు ఖరీదు చేస్తోందని, వారిని సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏజెంట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
స్నాప్చాట్లో పరిచయం.. ప్రేమపేరుతో సహజీవనం
హైదరాబాద్ : యువకుడిపై పోక్సో కేసు నమోదైన సంగటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిన వివరాల ప్రకారం.. మేడిపల్లి కి చెందిన బాలిక(17)ను చిన్నతనంలోనే తన అక్కకు, బావకు పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత ఇచ్చారు. అప్పటినుంచి బాలిక వారితోనే మేడిపల్లిలో పెరిగింది.పెంపుడు తల్లి సంవత్సరం క్రితం జబ్బుపడి మరణించగా అప్పటినుంచి బాలిక చదువు మానేసి తండ్రితోనే ఉంటోంది. ఈ సందర్బంగా బాలికకు ఒక సంవత్సర కాలంగా స్నాప్చాట్ అనే యాప్లో అలియాబాద్కు చెందిన యువకుడు పరిగి రవితేజ్(23)తో పరిచయం ఏర్పడింది. కాగా బాలిక తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అదునుగా చేసుకుని ప్రేమ పేరుచెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకుని గత రెండునెలలుగా బాలిక ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కన్నతల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తల్లి పిర్యాదుమేరకు నిందితుడిపై పోక్సోకేసును నమోదు చేసి నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు. -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..
నాన్న అంటే త్యాగం, బాధ్యత. వాటిని పక్కనపెట్టి తన సౌఖ్యం చూసుకుంటే కుటుంబం ఏవిధంగా చిన్నాభిన్నమవుతుందో అనేందుకు ఉదాహారణే ఈ ఘటన. తండ్రి కుటుంబానికి ప్రధాన ఆధారం అదే గాడి తప్పితే..దాన్ని బేసి చేసికుని ఉన్నవన్ని తునాతునకలేపోతాయి. తండ్రి స్థానం ఎంత బాధ్యతయుతమైనదో..అది దారితప్పితే ఫలితం తట్టుకోవడం అనితరసాధ్యమైనది. ఎంత ప్రయత్నించిన సరిద్దుకోలేని విధంగా ఉంటుంది. 'నాన్న' అని పిలుపుకి దూరమయ్యేలా వ్యధ మిగులుతుంది.ఈ విషాదకర ఘటన ఘజియాబాద్లోని గోవింద్పురంలో చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అవినాష్ అతడి సోదరి అంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు 22 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేని తండ్రి కారణంగా ఆ పిల్లల పడ్డ బాధ కళ్లకు కట్టినట్లు కనిపించింది. అంతేగాదు తమ మరణానికి కన్న తండ్రి, సవతి తల్లి రీతులే కారణమని పేర్కొంది సూసైడ్ నోట్లో. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లు గత గురువారం చనిపోగా, వారి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులకు చెప్పారు కుటుంబసభ్యులు. అయితే అనుమానస్పద కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితుల ఇంటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా, డైరీలో రాసిన 26 పేజిల అంజలి సూసైడ్నటి బయటపడింది. అందులో అంజలి తన వ్యథను వివరించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన సవతి తల్లి రీతు, తండ్రి సుఖ్వీర్ సింగ్ తమను ఎంతగానో మానసింగా వేధిస్తున్నట్లు తెలిపింది. తన తండ్రి రెండో వివాహం కోసం కన్న పిల్లల గొంతు నొక్కేశాడని, వారిని తన అవసరాలకు వాడుకున్నాడని ఆరోపించింది. అలాగే సవతి తెలివితేలు ముందు సుఖ్వీర్ సింగ్ వివరణ పూర్తిగా నిజాయితీ లేనిదని ఆరోగపించింది. ఆయన తన సవతితల్లినే నమ్ముతాడని కూడా ఫిర్యాదు చేసింది. తన సవతి తల్లి రీతూ తన గురించి తప్పుగా మాట్లాడి అవమానించినట్లు పేర్కొంది. ఆ మాటలను తన తండ్రి ఖండించను లేదు, పైగా తననే తప్పు పట్టడం తట్టుకోలేకపోయానని వాపోయింది. తన సవతి తల్లి నీడలో 16 ఏళ్లు తాను తన సోదరుడు ఎంత నరకయాతన అనుభవించామో చెప్పుకొచ్చింది. తన డైరీలో రాసిన సూసైడ్ నోట్ని చింపివేయొద్దని తను ఒంటరిగా చనిపోతే పలు ప్రశ్నలు లెవనెత్తాతారని వేడుకుంది. తన సవతి తల్లి తెలివితేటలు గురించి తెలుసునని అందుకే ముందు జాగ్రత్తగా దీన్ని ఫోటో తీసి వాట్సాప్లో చాలామందికి పంపినట్లు తెలిపింది. ఇక తమ మృతదేహాలను తన తండ్రి తాకడానికి వీలు లేదని తన స్నేహితుడు మహీనే తమ అంత్యక్రియలు చేయాలని కూడా చెప్పింది. పైగా తన ఖాతాలో డబ్బు కూడా తీసుకోమని, మిగిలిన డబ్బుని తన కుటుంబసభ్యులకు ఇవ్వమని పేర్కొంది. తన స్నేహితుడు మహీనే తనను అర్థం చేసుకున్నాడని, అందకుగాను తాను ఇస్తున్న చిన్న మొత్తం ఇది అని లేఖలో తెలిపింది. అలాగే ఆ లేఖలో తన మేనమామలు, దేవేంద్ర, అనిల్లను ఉద్దేశిస్తూ.. ఇప్పటి వరకు మా బాగోగులు గురించి కనీసం వాకబు కూడా చేయలేదు, మీరు బంధువులేనా అని ప్రశ్నించింది. తన అన్నయ్య, తాను చాలా మానసిక ఒత్తడిలో ఉన్నాం..ఇక భరించలేక ఈ పనికి ఒడిగట్టాం అని లేఖలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ఆ మృతుల తల్లి కమలేష్ కూడా ఇలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆమె చనిపోయిన ఆరు నెలలకే తన స్నేహితురాలిని పెళ్లిచేసుకున్నాడంటూ బావమరిది సుఖ్వీర్సింగ్పై ఫిర్యాదు చేశారు అంజలి మేనమామలు. ఇక బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్, తన భార్య తాను ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నామని, అదంతా ఎవరికోసం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లల మరణంతో చచ్చిన శవంగా అయిపోయానంటూ విలపించాడు. తన కూతురు అంజలి ఇలా తన పరువు తీసేలా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తనకు తెలియదని చెబుతున్నాడు బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్. ఇక మృతులు అవినాష్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారి కాగా, అంజలి నోయిడాలోని ఎగుమతి సంస్థలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నట్లు మేనమామ దేవేంద్ర వెల్లడించారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై మరింత కూలంకషంగా దర్యాప్తు చేయడమేగాక దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్) -
నవ వధువు, శ్రీ చైతన్య లెక్చరర్ ఆత్మహత్య.. కారణం అదేనా?
సాక్షి, కృష్ణా: కుటుంబ కలహాల కారణంగా నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే తమ బిడ్డ చనిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్యతో అరుణ్ కుమార్ వివాహం జరిగింది. ఐదు నెలల క్రితమే ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. శ్రీవిద్య(24) ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. అరుణ్ కుమార్ కలాపాములు గ్రామంలో విలేజ్ సర్వేయర్గా ఉన్నారు. అయితే, వీరికి వివాహం జరిగిన నాటి నుంచే అత్తరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె.. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఇక, వివాహం జరిగిన ఐదు నెలలకే ఇలా తమ కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు.. కన్నీటి పర్యంతమవుతున్నారు. -
బీఈడీ స్టూడెంట్ కేసు.. ఏబీవీపీ నేత అరెస్ట్
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
భర్త స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం.. కుటుంబ సభ్యుల ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా.. నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ, ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో మనోహర్ లోధీ, ద్రౌపది భార్యభర్తలు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, మనోహర్ బాల్య స్నేహితుడైన సురేంద్రతో ద్రౌపదికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒక రోజు.. తన తల్లిని సురేంద్రతో అభ్యంతరకర స్థితిలో చూసిన కూతురు శివాని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. అనంతరం, ద్రౌపదిని ఈ సంబంధం ముగించాలని భర్త సహా కుటుంబం కోరింది. అయితే, తాను మాత్రం సురేంద్ర లేకుండా జీవించలేనని ద్రౌపతి కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పింది. తనపై ఒత్తిడి తీసుకువస్తే, వరకట్న వేధింపులు కేసు పెడతాను అంటూ వారినే బెదిరించింది. దీంతో, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాకయ్యారు.ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన భర్త మనోహర్.. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని స్నేహితుడు సురేంద్రను అభ్యర్థించారు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవలు జరిగాయి. ద్రౌపది ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో.. కలత చెందిన కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన స్థానికంగా హాట్టాపిక్గా మారింది. -
తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య
సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తుఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
లారీ బీభత్సం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా, సాయికుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోషనగర్లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. నిశ్చితార్థం జరుగుతున్న క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్పూర్ రోడ్డు మార్గం నుంచి చెన్నైకు వెళ్తున్న లారీ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. దీంతో అక్కడే నిలబడి ఉన్న రామకృష్ణ మృతి చెందగా, సాయికుమార్తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్తో పాటు శివకుమార్ను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్కు భార్య, కుమార్తె ఉన్నారు. ధ్వంసమైన షాపులు, బైకులులారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్ షాప్లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఇష్టపడిన వ్యక్తిపై కక్షగట్టిన భగ్నప్రేమికురాలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు 22 బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన కేసులో నిందితురాలు రినే జోషిదా ఆద్యంతం చాలా తెలివిగా వ్యవహరించింది. తాను ఇష్టపడిన వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకోవడంతో కక్షగట్టిన రినే అతడి పేరునే వినియోగించింది. డార్క్ వెబ్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సహాయంతో తన ఆచూకీ బయటపడకుండా ఐదు నెలల పాటు పోలీసులను పరుగులు పెట్టించిన రినే.. ఆమెకు తెలియకుండా జరిగిన వైఫై కనెక్టివిటీతో చిక్కింది. ఇటీవల అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఈమెను శంషాబాద్ అధికారులు పీటీ వారెంట్పై తీసుకువచ్చి శనివారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్య.. ఎమ్మెన్సీ ఉద్యోగం.. చెన్నైకి చెందిన రినే జోషిదా తొలుత ఇంజినీరింగ్, ఆపై రోబోటిక్స్లో అడ్వాన్డ్స్ కోర్సు చేసింది. ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ (ఎమ్మెన్సీ) డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా తమ సంస్థలో ఉద్యోగం ఇచి్చంది. ఆ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా పని చేసిన రినే తన సహోద్యోగి దివిజ్ ప్రభాకర్ను ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈమె ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్షకట్టిన రినే కటకటాల పాలు చేయడం ద్వారా భార్య నుంచి విడగొట్టాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడం కోసం పక్కా పథకం ప్రకారం కథ నడిపింది. ప్రభాకర్ పేరుతో మెయిల్ ఐడీలు.. తొలుత రినే తన ల్యాప్టాప్ నుంచి డార్క్వెబ్ను యాక్సస్ చేసింది. దాని ద్వారానే తన వివరాలు పొందపరచకుండా ప్రభాకర్ పేరు, వివరాలతో ఈ–మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సస్ చేసే రినే.. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రులకు 22 బెదిరింపు మెయిల్స్ పంపింది. ఒక ప్రాంతానికి పంపిన మెయిల్లో మరో ప్రాంతంలో ఓ నేరం జరిగినట్లు, దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడానికే బాంబు పెట్టినట్లు రాసింది. అహ్మదాబాద్కు పంపిన ఓ ఈ–మెయిల్లో ‘2023లో హైదరాబాద్లోని లెమన్ ట్రీ హోటల్లో బాలికపై అత్యాచారం చేసిన రేపిస్ట్ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడానికి మీ స్కూల్లో బాంబు పేల్చబోతున్నారు’ అంటూ ప్రస్తావించింది. వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న ఆయా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రమాదం తర్వాత తీవ్రంగా పరిగణించి.. ఇలా రినే తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హరియాణా, గుజరాత్ల్లోని వివిధ సంస్థలకు మెయిల్స్ పంపినా ఆమె ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. పోలీసులు ప్రభాకర్ను అనుమానితుగా భావించడం, విచారణ అనంతరం వదిలేయడం జరిగాయి. అహ్మదాబాద్లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ మర్నాడు అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో మెయిల్ పంపిన రినే మరోసారి విధ్వంసం తప్పదని హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అప్పటి వరకు 12 రాష్ట్రాలకు వచి్చన 22 ఈ–మెయిల్స్కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అధ్యయనం చేసింది. ఆ పొరపాటుతో ఆమె ఆటలకు చెక్... ఈ ఏడాది ఏప్రిల్లో అహ్మదాబాద్లోని ఓ స్కూల్కు రినే ఇలానే బెదిరింపు మెయిల్ పంపింది. ప్రతి సందర్భంలోనూ డార్క్వెబ్ ద్వారా, వీపీఎన్ నెట్వర్క్ వాడటంతో ఆమె వివరాలు పోలీసులకు చిక్కలేదు. ఆయా సందర్భాల్లో వైఫై ఆఫ్ చేసి ఉండే రినే.. మొబైల్ డేటా ద్వారానే హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుని, వీపీఎన్ను యాక్టివేట్ చేసింది. అయితే ఏప్రిల్లో మెయిల్ పంపుతున్న సందర్భంలో పొరపాటున రినే ల్యాప్టాప్ ఆమె నివసిస్తున్న వైఫైకి కనెక్ట్ అయింది. దీంతో ఆ మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ రికార్డుల్లో నమోదైంది. ఈ వివరాలను సాంకేతికంగా సేకరించిన గుజరాత్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా రినే ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు లోకేషన్ సంగ్రహించారు. గత వారం చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. -
భర్తను కడతేర్చిన భార్య.. పోలీసులే షాకయ్యేలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు
దిస్పూర్: ముందు గుండెపోటన్నారు. ఆ తర్వాత దొంగతనమన్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులు కంగుతిన్నారు. చివరకు తమ్ముడొచ్చి తన అన్నది సహజ మరణం కాదని, హత్య జరిగిందనే ఆధారాలు బయటపెట్టడంతో అస్సాం వ్యాపారవేత్త హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉత్తమ్ గోగోయ్ హత్య కేసులో అయన భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె, ఇద్దరు మైనర్ యువకులు అరెస్టు అయ్యారు.అస్సాంలోని లాహన్ గావ్ ప్రాంతంలో 38 ఏళ్ల వ్యాపారవేత్త ఉత్తమ్ గొగోయ్ అలియాస్ శంకై తన నివాసంలో మృతదేహంగా కనిపించిన కేసులో అతని భార్య, మైనర్ కుమార్తెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దీబ్రుగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ వీవి రాకేశ్ రెడ్డి తెలిపారు. గొగోయ్ కుమార్తె 9వ తరగతి విద్యార్థిని. తండ్రి హత్యలో తన పాత్ర ఉన్నదని నేరం అంగీకరించిందని చెప్పారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గొగొయ్ను హత్య చేసేందుకు అతని భార్య,కుమార్తె గతంలో పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా, అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన వెనుక అసలు మోటీవ్ ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్య చేయడానికి ఇద్దరు మైనర్ కాంట్రాక్ట్ కిల్లర్లకు భార్య, కుమార్తె కలిసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గొగొయ్ హత్య జూలై 25 ఉదయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులు గుండెపోటుతో గొగోయ్ మరణించాడని పేర్కొన్నారు. కానీ, మృతదేహంపై గాయాలు ఉందని మృతుని సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. గొగోయ్ సోదరుడు మాట్లాడుతూ.. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటికి వెళ్లాను. అప్పటికే ఉత్తమ్ చనిపోయి ఉన్నాడు. చెవిపై గాయాలున్నాయి. మొదట దొంగతనంగా భావించాం. గుండెపోటుతో మరణిస్తే ఈ గాయాలు ఎలా వస్తాయి? ఇది ముందుగా పథకం వేసిన హత్యే. దోషులకు కఠిన శిక్ష వేయాలి" అని చెప్పారు.ఈ అరెస్టుల నేపథ్యంలో బర్బరూ ప్రాంతంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేయాలని, హత్యకేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చేవెళ్లలో కలకలం.. ఫాంహౌస్లో ఐటీ ఉద్యోగుల డ్రగ్స్ పార్టీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్లో బర్త్డే వేడుకలు పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో హంగామా చేస్తుండగా.. ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్ను బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారంతో ఫాంహౌస్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఐటీ ఉద్యోగుల నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఉన్న సమయంలో సదరు మహిళ భర్త వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అనంతరం, కుటుంబ సభ్యులు, స్థానికులు వారిద్దరినీ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాలో వివాహిత, రమేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ గమనించిన సదరు మహిళ భర్త.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అనంతరం, సదరు భర్త స్థానికుల సాయంతో.. విద్యుత్ స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఒడిశా బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్
భువనేశ్వర్: 70 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందిన ఒడిశా బాలిక నిన్న(శనివారం, ఆగస్టు 2వ తేదీ) మృతిచెందింది. గత నెల 19 వ తేదీన కాలిన గాయాలతో భువనేశ్వర్లోని ఎయిమ్స్లోచికిత్స అందించిన ఆ బాలికను ఆపై ఎయిర లిఫ్ట్ చేసి ఢిల్లీ ఎయిమ్స్కు మార్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు మాట మార్చారు. ఇందులో ఎవరు ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిందని ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, లేనిపోని కామెంట్లు చేసి ఇరకాటంలో పడొద్దని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఆ బాలిక ఘటన అనంతరం ఒడిశాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ స్పందించారు. ఆ యువతిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నం చేశామని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా బ్రతికించలేకపోయామని సీఎం మాఝీ తెలిపారు ఇదొక దురదృష్టకర ఘటన అని ఆయన పేర్కొన్నారు. అంటించలేదు.. అంటించుకుంది..!తన కూతురు మృతిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘ నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మానసిక స్థితి బాలేని కారణంగానే ఆమె ఇలా చేసింది. నా కూతుర్ని కాపాడటానికి ఒడిశా ప్రభుత్వం చాలానే చేసింది.. ఫలితం లేకుండా ప్యోఇంది. దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. అదే నా కూతురి ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున ఆందోళనజూలై 19 వ తేదీన ఆ బాలిక 70 శాతం గాయాల బారిన పడింది. దీనిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం దీనిపై ఆందోళన చేపట్టారు. ఒడిశాలో బాలికలపై ఈ తరహా దాడులు అధికమవుతున్నా పట్టించుకునే వారే లేరంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.ఒడిశాలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు కూడా రోడ్లపైకి రావడంతో ప్రతిపక్షాలకు బలం చేకూరునట్లయ్యింది. అయితే ఆ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు, ఆమె తండ్రి చెప్పడంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. బాలిక వాంగ్మూలం రికార్డు చేశారు..ఆమెను ఆస్పత్రిలో చేర్చిన క్రమంలోనే వాంగ్మూలం కూడా తీసుకున్నారు పోలీసులు. దానిలో భాగంగానే ముగ్గురు యువకుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ బాలిక మృతి చెందిన రోజు వ్యవధిలోనే ఇందులో ఎవరి ప్రమేయ లేదని తేల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బావ సాయంతో భర్తను కడతేర్చిన భార్య.. ఏడాది తర్వాత..
న్యూఢిల్లీ: భర్తను తన బంధువు(బావ) సాయంతో అత్యంత పాశవికంగా హత్యచేసిన మహిళను, ఆమె ప్రియుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీలోని అలీపూర్ నివాసి సోనియా (34), సోనిపట్కు చెందిన రోహిత్(28)గా గుర్తించామని, ఈ కేసులో మరో కీలక నిందితుడు విజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) హర్ష్ ఇండోరా మీడియాకు తెలిపారు.మృతుడు ప్రీతమ్ ప్రకాష్ (42) అలీపూర్కు చెందిన చరిత్రకారుడు. 2024, జూలై 5న ప్రీతమ్ ప్రకాష్ సోనిపట్లోని గన్నౌర్లో సోదరి ఇంటిలో ఉంటున్న సోనియాను తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రీతమ్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తపై ఆగ్రహంతో ఉన్న సోనియా తన బంధువు(బావ) విజయ్కి రూ. 50 వేలు ఇచ్చి, భర్తను హత్యచేయాలని కోరింది. ఇంతలో ప్రీతమ్ ప్రకాష్ తిరిగి వచ్చి, సోనియాను ఇంటికి రమ్మని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రీతమ్ ప్రకాష్ టెర్రస్పై పడుకున్నాడు. ఇదే సమయంలో విజయ్ అతనిని హత్య చేశాడు. తరువాత ఆ మృతదేహాన్ని ఒక పథకం ప్రకారం అగ్వాన్పూర్ సమీపంలోని కాలువలో పడేశాడు.జూలై 20న, సోనియా తన భర్త అదృశ్యమైనట్లు ఆలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాది తర్వాత ప్రీతమ్ ప్రకాష్ ఉపయోగించిన ఫోన్ యాక్టివ్ మోడ్లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. సోనిపట్లోని రోహిత్ ఆ ఫోన్ను ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించగా, అతను తొలుత దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించాడు. అయితే ఆ తరువాత నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అలాగే తనకు సోనియాతో సంబంధం ఉన్నదని, సోనియా, విజయ్లు ప్రీతమ్ను చంపడానికి కుట్ర పన్నారని రోహిత్ పోలీసులకు తెలిపాడు. భర్తను హత్యచేసేందుకు సోనియా.. విజయ్కు డబ్బులు ఇచ్చిందన్నాడు.ప్రీతమ్ ప్రకాష్ హత్య తరువాత సోనియా అతని ఫోన్ను రోహిత్కు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా సోనియాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రీతమ్ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. అనంతరం వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే ఇదే సమయంలో సోనియా, రోహిత్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కాగా రోహిత్పై గతంలో హత్య, ఆయుధాలు కలిగి ఉండటం తదితర నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతమ్ ప్రకాష్ను హత్యచేసిన విజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని,అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ ఇండోరా తెలిపారు. -
ప్రజ్వల్కు జీవితఖైదు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్కు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు. పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్హౌస్లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్ను అరెస్ట్చేయడం తెల్సిందే. కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యారి్థని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్ïÙట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. బాధితురాలికి హ్యాట్సాఫ్: సీఐడీ చీఫ్ వ్యాఖ్య బనశంకరి: ఈ కేసులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా బాధితురాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని సీఐడీ అదనపు డీజీపీ బిజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కేసు నమోదైన 16 నెలల్లో తీర్పు రావడం నిజంగా ప్రత్యేకం. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్నది ప్రజ్వల్ అని కోర్టుకు నిరూపించడానికి సిట్ ఎంతో శ్రమించింది. నేర నిరూపణకు బాధితురాలి ధైర్యమే కారణం. ఆమెకు ఈ విషయంలో సీఐడీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఈమె నిరుపేద కావడంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాబల్యం కలిగిన వ్యక్తి కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు’’అని బిజయ్ అన్నారు. ఎప్పుడేం జరిగిందంటే? → 2024 ఏప్రిల్ 22: ప్రజ్వల్ రేప్ వీడియోలు వైరల్ → ఏప్రిల్ 25 : అశ్లీల వీడియోలపై దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి లేఖ → ఏప్రిల్ 26–27: జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ → ఏప్రిల్ 28 : ప్రజ్వల్పై ఎఫ్ఐఆర్ నమోదు → ఏప్రిల్ 28 : అశ్లీల దృశ్యాలు కలిగిన పెన్డ్రైవ్ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం → ఏప్రిల్ 30: జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ నిర్ణయం → మే 1 : ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు → మే 30: బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రజ్వల్ అరెస్టు → సెప్టెంబర్ 9 : 113 సాక్షులతో కూడిన 1,632 పేజీల రెండో చార్జ్ïÙట్ దాఖలు → నవంబర్ 11 : ప్రజ్వల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు → 2025 జూలై 18 : విచారణ పూర్తి చేసి జూలై 30న తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు → జూలై 30: ఆగస్టు 1కి తీర్పు వాయిదా → ఆగస్టు 1: ప్రజ్వల్ను దోషిగా తేలి్చన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం → ఆగస్టు 2: ప్రజ్వల్కు జీవిత ఖైదు విధింపు -
ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లి..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #SecunderabadA disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025 -
ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే.. -
పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తారా?
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్కు వచ్చిన అనిల్ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
వర్కవుట్లు చేస్తుండగా ఆగిన గుండె
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిమ్లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు.. స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది. జిమ్.. జాగ్రత్తలుజిమ్లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదికుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి. #Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ— Atul singh (@atuljmd123) August 2, 2025 -
వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురు!
నాగ్పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్
కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి.. -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(35)కు భారీ షాక్ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.హాసన్లోని గన్నికాడ ఫామ్హౌజ్లో 2021 COVID లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అదే సమయంలో..ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ ఆరోపణలను ప్రజ్వల్ పేరెంట్స్ ఖండించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది. ఇదీ చదవండి: ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్ను ఎయిర్పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.#BreakingA Special court in Bengaluru has convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna, in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District. #PrajwalRevanna #Rape pic.twitter.com/fnzxJUp2Sc— Live Law (@LiveLawIndia) August 1, 2025ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ?ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: ప్రజ్వల్కు చీర చిక్కుఅశ్లీల వీడియోల కలకలంపని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్లోని ఫామ్హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు -
‘ఎవరిని పెళ్లి చేసుకున్నా చంపేస్తా..’
సాక్షి, సనత్నగర్: ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తానంటూ ఓ యువతిని బెదిరించిన ఆమె మాజీ ప్రియుడి బెదిరించిన ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు అతడిపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్ ఎల్బీఎస్నగర్కు చెందిన యువతికి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో, పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే రవికుమార్ కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఇరువురూ మళ్లీ కలవబోమని అంగీకరించారు.ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్.. వరుడికి ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు. అంతేకాకుండా బాధితురాలికి ఫోన్ చేసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అతడిని చెంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగాల్లో బంగ్లాదేశీ నటి, మోడల్ అరెస్ట్.. కారణం ఇదే..
కోల్కతా: దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్కు చెందిన మోడల్ శాంతా పాల్(28)ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. శాంతా పాల్ను బంగ్లాదేశ్లోని బారిసల్కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే, ఆమె.. నకిలీ ఆధార్ కార్డులతో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. బంగ్లాదేశీ మోడల్ శాంతా పాల్ కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు.. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె వద్ద వేర్వేరు అడ్రస్లతో రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఆమె పేరుపై బంగ్లాదేశీ పాస్పోర్టులు చాలా ఉన్నట్లు బయటకు వచ్చాయి. వాటన్నింటిని సీజ్ చేశారు. దీంతోపాటు బంగ్లాదేశ్కు చెందిన రెజెంట్ ఎయిర్వేస్లో ఉద్యోగిగా పేర్కొంటా ఆమె పేరుతో ఉన్న ఐడీ కార్డును, ఢాకాలో సెకండరీ విద్య అభ్యసిస్టున్నట్లు జారీచేసిన అడ్మిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా కోల్కతా జాయింట్ కమిషనర్ (క్రైమ్) రూపేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆమె 2024 చివరి నుంచి అక్కడ ఉంటుందని తెలిపారు. ఓ వ్యక్తితో కలిసి అక్కడి వచ్చిందని చెప్పారు. భారత్లో ఉండటానికి చెల్లుబాటు అయ్యే వీసాను చూపించలేదని వెల్లడించారు. కోల్కతా, బుద్వాన్ అడ్రస్లతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎలా పొందిందనే విషయమై ఆమెనుప ప్రశ్నిస్తున్నామన్నారు. అయితే విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు ఎలా ఇచ్చారనే విషయమై యూఏడీఏఐకి, ఓటరు, రేషన్ కార్డుల విషయమై ఎన్నికల కమిషన్, బెంగాల్ ఆహార మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్టు తెలిపారు.మరోవైపు, విశ్వసనీయ సమాచారం మేరకు శాంతా పాల్ బంగ్లాదేశ్లో పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా టీవీ చానల్స్, పలు కార్యక్రమాలకు యాంకర్గా, పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.Shanta Pal, 28, Bangladeshi model, arrested in Kolkata on July 31 for staying illegally with fake Aadhaar, voter & ration cards. Lacked valid visa. Police custody till Aug 8.Source: India TodayFollow @theGreenLine_#FakeID #IllegalStay #Kolkata pic.twitter.com/h0p5WbZmjk— The Green Line (@theGreenLine_) July 31, 2025 -
హైదరాబాద్ పబ్లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన సచిన్దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్లకు వెళ్లే అతడికి కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్యాదవ్తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్లో పబ్కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్ను తాను బైక్పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్ను అత్తాపూర్లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్కుమార్యాదవ్ గతంలో అదే పబ్లో బౌన్సర్గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్కు మకాం మార్చి అంబర్పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్యాదవ్, పవన్కుమార్యాదవ్తో పాటు కిడ్నాప్లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులు
సాక్షి టాస్క్పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు. -
వాటిని తెరిస్తే తంటాలే..!
సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్బాక్స్లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్ను అదే నంబర్తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్తో ఉన్న సిమ్కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్పే, ఫోన్పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్తో సైబర్కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్స్టేషన్లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ -
ఇంజినీ‘రింగ్ రింగ’
తెనాలిరూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మకాల్లో భాగస్తులై కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో స్టూడెంట్లు అరెస్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం గంజాయి అమ్ముతున్న, తాగుతున్న 13 మందిని గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5.2 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం. రూరల్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మాల డొంక ప్రాంతంలో కొల్లిపరకు చెందిన మల్లోల శోభన్ బాబు, పాముల రుషిబాబు, మండ్రురాజ్ కుమార్, ఆరే ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోకూరి శ్రీను, కాజా గ్రామానికి చెందిన కారంకి నిఖిల్కుమార్, అత్తోటకు చెందిన యర్రు శశికుమార్, దాసరి చేతన్, రేపల్లెకు చెందిన కొసరాజు రోహిత్, కుంచవరానికి చెందిన గరిక గోపినాథ్, మేడా ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి గంజాయి తాగుతున్నారని డీఎస్పీ వివరించారు. ఈ ముఠా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన పరమేశ్వరన్ వద్ద గంజాయిని చౌకగా కొని తెనాలి పరిసర ప్రాంతాలలో 20 గ్రాములు రూ.500 చొప్పున అమ్ముతున్నట్టు తేలిందని వెల్లడించారు. నిందితులలో 9 మందిపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే 21 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేశామని, ఇప్పుడు మరో 13 మంది గంజాయి కేసులో అరెస్టు అయ్యారని డీఎస్పీ వివరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి విక్రేతలు పదిమందిపై పీడీ యాక్టు ప్రయోగించబోతున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను కనిపెడుతుండాలని, లేకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి.కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జడ్చర్లలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జడ్చర్లలోని 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకునిఉన్న ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం (ఆదివారం) పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో నలుగురు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తరువాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్లు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆరోజు నుంచి బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో బుధవారం సాయంత్రం చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్ పరిశీలించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న, స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసుల వేధింపులతో.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్టౌన్ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం.. అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్ అండ్ ఆర్లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచి్చబౌలి/మణికొండ: కుమార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కొండముదుసుపాలెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్ వెళ్లగా వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు. కుమార్తెలను తీసుకొని శాలిని సోమవారం రాత్రి మణికొండకు వచ్చింది. భారతీయ విద్యాభవన్లో పెద్ద కుమార్తె సుదీక్ష 9వ తరగతి, చిన్న కుమార్తె సహస్ర 4వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్లో బస్సు ఎక్కించింది. ఉదయం 8.45 గంటలకు స్కూటీపై తిరిగి వస్తుండగా మణికొండలోని సుందర్ గార్డెన్ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టింది. కిందపడిపోయిన శాలిని తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా ట్యాంకర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మృతురాలి సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాగా చంపి ఫేమస్ అయ్యేదా!
హైదరాబాద్: తన అక్క ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే కారణంతో ఆమెను హత్య చేసిన నిందితుడు.. పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన రుచిత (21)ను సోమవారం ఆమె తమ్ముడు రోహిత్ (18) గొంతు నులిమి చంపగా పోలీసులు అతన్ని మంగళవారం రిమాండ్కు తరలించారు. స్వగ్రామానికి చెందిన యువకుడితో అక్క ఫోన్లో మాట్లాడుతుండటంతో స్నేహితుల వద్ద పరువు పోతోందని రోహిత్ భావించాడు. దీంతో ఆమెను చంపాలనుకున్నట్లు సమాచారం. అంతకుముందే ఇన్స్టాగ్రామ్లో ‘ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?’అనే సినీ డైలాగ్కు తాను చేసిన రీల్ను షేర్ చేశాడు. -
పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి..
సాక్షి, కోనేరు సెంటర్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక దుర్మార్గమైన పంచాయితీకి తెరతీశారు. యువతిని మోసగించిన టీడీపీ నేత, మంత్రి అనుచరుడి కుమారుడి తరఫున రంగంలోకి దిగారు. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల్లో ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ స్థానికంగా ఒక యువతిని ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లాడు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్ను గోవాలో పట్టుకున్నారు. అతడిని, ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్ నిరాకరించాడు. సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి, యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువతి తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందనే భయంతో ఆ యువతి తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. -
ఎస్బీఐలో రూ.12 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీ
హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్లో జరిగిన భారీ చోరీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సమయంలో బ్యాంకులో భారీ ఎత్తున నగలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హిందూపురం డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది, పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాoకు లాకర్లో ఉన్న దాదాపు రూ.12 కోట్ల విలువచేసే 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బ్యాంకు లాకర్ గ్యాస్కట్టర్తో కత్తిరించినా కింది అర లాక్ తెరుచుకోలేదనీ, గట్టిగా ఉండటంతో తెరవలేక పోయారన్నారు. లేదంటే మరో పదికేజీల బంగారం కూడా చోరీకి గురయ్యేదన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రత్నం మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. నిర్లక్ష్యమే కారణమా? అయితే ఈ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు లేకపోవడం, లోపల అలారం పనిచేయకపోవడం, సీసీ కెమెరాలను బ్యాంకు అధికారుల సెల్ఫోన్లకు అనుసంధానించకపోవడం వంటి లోపాలు వెలుగు చూశాయి. ఇటీవల తనిఖీల నిమిత్తం హిందూపురం రూరల్ సీఐ పారిశ్రామికవాడలో తనిఖీలకు వచి్చన సందర్భంగా బ్యాంకు భద్రతపై అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ పటిష్టం చేయాలని సూచించారు. అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. -
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్సైట్ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్ సాయం తీసుకోవాలని సూచించారు. -
తేజేశ్వర్ హత్య కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులైన ఏ–1 తిరుమలరావు, ఏ–2 ఐశ్వర్య అలియాస్ సహస్రను గద్వాల కోర్టు అనుమతితో ఈ నెల 26న రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. గడువు ముగియడంతో సోమవారం కోర్టులో తిరిగి హాజరుపరిచారు. దీంతో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. రెండు రోజుల విచారణలో నిందితులు పొంతనలేని సమాధానాలతో కేసు దర్యాప్తును గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేశారని గద్వాల సీఐ శ్రీను పేర్కొన్నారు. అందువల్ల వారిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామన్నారు. -
Hyderabad: అత్తను నరికి చంపిన అల్లుడు
మద్దూరు (హుస్నాబాద్): అల్లుడు వేట కొడవలితో అత్తను నరికి చంపాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ముర్మాముల గ్రామ శివారు బంజెరలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ (55)కు భర్త యాదగిరి, కుమార్తె భవాని ఉన్నారు. భవానిని ఎనిమిదేళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేశ్కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ, భర్త యాదగిరి, కుమార్తె భవాని, అల్లుడు మహేశ్తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్లోని బోయిన్పల్లి అంజయ్యనగర్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వజ్రమ్మ, కూతురు, అల్లుడి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఈనెల 22న స్వగ్రామమైన బంజెరకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానిని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేశ్ తన తమ్ముడైన హరీశ్ను వెంటబెట్టుకుని బైక్పై మధ్యాహ్నం బంజెరకు వెళ్లారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేశ్, హరీశ్ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సీఐ కొండ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్, నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్లో దినేశ్తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు. -
ఆగని టీడీపీ నేత అకృత్యాలు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తనటీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్టౌన్ సీఐ రాజగోపాల్నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
పామును కరిచి బతికిన పిల్లాడు.. అసలు జరిగింది ఇదే!
పట్నా: బిహార్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన విషయం తెలిసిందే. బొమ్మ అనుకుని పామును పట్టుకున్న పిల్లవాడు. దానిని నోటితో కొరికి చంపాడు. స్వల్ప విష ప్రభావంతో ఆస్పత్రిపాలైన బుడ్డోడు.. చివరకు ప్రాణాలతో బయపడ్డాడు. అయితే పామును కొరికినప్పటికీ పిల్లాడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై సర్వత్రా ఆశ్యర్చానికి గురవుతున్నారు.తాజాగా చిన్న పిల్లాడు బతికి బయటపడటంపై గల కారణాలను వైద్యులు వెల్లడించారు. సాధారణంగా పాము వ్యక్తులను కరిచినప్పుడు దానికున్న విషం రక్తంలోకి ప్రసరిస్తుందని, ఇది , నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దీనివల్ల అనారోగ్యానికి గురికావడం లేదా కొన్నిసార్లు మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అయితే గోవింద్ విషయంలో విషం నోటి ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిందన్నారు. మానవ జీర్ణవ్యవస్థ కొన్ని సందర్భాల్లో విషాన్ని విచ్ఛిన్నం చేసి తట్టుకోగలదని, ప్రాణాపాయాన్ని నివారిస్తుందన్నారు. ఒకవేళ శరీరంలో అంతర్గత రక్తస్రావం అయితే.. బాలుడుపరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ అదృష్టవశాత్తు అలాంటి సమస్యలు ఏం రాలేదని అన్నారు. అసలేం జరిగిందంటే.. బీహార్లో, ఏప్రిల్ 2023 మరియు మార్చి 2024 మధ్య 934 మంది పాముకాటు కారణంగా మరణించారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. అదే సమయంలో, 17,800 మందికి పైగా రాష్ట్ర ఆసుపత్రులలో పాముకాటుకు చికిత్స పొందారు వెస్ట్చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే పిల్లాడు నీరసించిపోయి తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెలుసుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. -
ఫేక్ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. ఏకంగా 3 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల కుంభకోణం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్పురోహిత్లు ముగ్గురని అరెస్ట్ చేశారు. వీరంతా ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు తెలిపారు. యాపిల్ వాచ్లు, ఎయిర్పాడ్స్, పవర్బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు. నిందితులను మీర్చౌక్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. యాపిల్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. -
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్గా ఆమె ఎదిగడం కొసమెరుపు. -
Hyderabad: బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి యువకులు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఓ యువకుడు బ్యాండ్మింటన్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. నాగోల్ స్టేడియంలో బ్యాండ్మింటన్ ఆడుతున్న గుండ్ల రాకేష్ అనే యువకుడు(25).. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వ్యక్తులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతడు రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు. కాగా అతడు ప్రైవేట్ కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. -
గబ్బిలాలతో చిల్లీ చికెన్!!
ఫాస్ట్ఫుడ్ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. మీరు ముక్కు తుడుచుకుంటూ, లొట్టలేసుకుంటూ తిన్నది ‘చిల్లీ చికెన్’ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే.. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్కు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి.తమిళనాడు సేలం జిల్లా డేనిష్ పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పేర్లను కమల్, సెల్వంగా చెప్పిన నిందితులు.. విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలను తెలియజేశారు. కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్న వీళ్లిద్దరూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్కు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. కొన్ని హోటల్స్కు చిల్లీ చికెన్ తదితర ఐటెమ్స్ను వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి నేరుగా చేరవేస్తున్నారట. తమ కంటే ముందు కొంతమంది.. కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నారంటూ మరో బాంబ్ పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..
లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.🚨 Shocking! UP Cop’s Wife Dies by Suicide After Emotional VideoLucknow: Soumya Kashyap, wife of constable Anurag Singh, died by suicide.She posted a crying video blaming husband & in-laws for abuse and dowry torture. She showed her wounds, said husband threatened her: “I’m… pic.twitter.com/ripREYqDOQ— زماں (@Delhiite_) July 27, 2025ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్ పార్టీపై పోలీసుల దాడి.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.ఎన్సీపీ(ఎస్పీ)నేత అయిన ఏక్నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు. प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I— Lokmat (@lokmat) July 27, 2025 -
ప్రియురాలి స్కూటీకి జీపీఎస్ ట్రాకర్
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఆదివారం మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఏ–1 తిరుమలరావు, ఏ–2 ఐశ్వర్య అలియాస్ సహస్రలను రెండోరోజూ సీఐ శ్రీను విచారించారు. కర్నూలు జిల్లాలో ఉన్న సన్నిహిత పరిచయంలోనే తిరుమలరావు తన ప్రియురాలిపై విపరీతమైన వ్యామోహంతో నిత్యం నిఘా నీడలో ఉండేలా పథక రచన చేశాడు. ఆమె ఎక్కడ ఉంటుంది.. ఎక్కడకు వెళుతుంది..ఇంటికి ఎప్పుడు వస్తుంది.. ఇలా అన్ని విషయాలు తెలుసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఐశ్యర్యకు బహుమతిగా అందించిన స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ను అమర్చినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. అయితే జీపీఎస్ ట్రాకర్ అమర్చిన విషయం ఇప్పటి వరకు ఐశ్యర్యకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. తేజేశ్వర్తో ఐశ్వర్యకు నిశ్చితార్థమైన రెండురోజులకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తిరుమలరావుతో చెప్పడంతో.. బెంగళూరులో ఉంటున్న తన బంధువుల ఇంటికి పంపించాడు. ఈ క్రమంలో కర్నూలులోని నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఐశ్వర్య కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ఆమె బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి.. వారి బంధువులకు అప్పగించారని విచారణలో బహిర్గతమైందని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై గద్వాల పోలీసులు అక్కడి పోలీసుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం సాంకేతిక శోధన..తిరుమలరావు నిత్యం సాంకేతిక విషయ పరిజ్ఞానంతో ముందు నుంచి ఓ పథకంతో ఉండేవాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు వివిధ అంశాలపై గూగుల్లో సెర్చ్ చేసి వ్యూహాత్మకంగా సాంకేతిక అంశాలనే అమలు చేశాడు. అయితే తేజేశ్వర్ మృతదేహంపై దాదాపు 9 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉంది. హత్య చేసిన నిందితుల రక్త నమూనాలు, తేజేశ్వర్ మృతదేహం నుంచి తీసిన ఎముకల నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించినట్టు సమాచారం. కీలక విషయాలపై ఆరా తీస్తున్నాం..తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలపై ఆరా తీస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో తిరుమలరావు కేసు నుంచి బయటపడేందుకు నిత్యం గూగుల్ సెర్చ్ చేస్తుండేవాడు. వ్యతిరేకంగా ఉన్న వారి కదలికలను గుర్తించేందుకు జీపీఎస్ ట్రాకర్తో తెలుసుకునేవాడు. తేజేశ్వర్తో ఐశ్వర్య నిశ్చితార్థం తర్వాత కర్నూలు జిల్లాలోని పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు, తదితర విషయాలపై ఆరా తీస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – శ్రీను, సీఐ, గద్వాల -
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈ నెల 21న రాత్రి జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు ఒక మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి 14తులాల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆదివారం ఉదయం పోలీసులు సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో తనిఖీలు చేస్తుండగా ఖమ్మం పరిధిలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె బ్యాగును తనిఖీ చేయగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఆభరణాలు అమ్మేందుకు హైదరాబాద్కు వెళ్తూ హైటెక్బస్టాండ్లో పట్టుబడింది. ఆమెను స్టేషన్కు తరలించి విచారించగా బంగారం షాపులో దొంగతనం చేసిన నిందితులకు ఆశ్రయం ఇచ్చి చోరీకి సహకరించినట్టు అంగీకరించింది. దొంగలించిన బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్కు తీసుకెళ్లి అమ్ముదామని దొంగలు నిర్ణయించారు. ఈమేరకు నిందితులకు ఆశ్రయం ఇచ్చి సహకరించిన అమర్ బట్, మేకల యశోద ఖర్చులకు కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చి మిగతా ఐదుగురు నిందితులు నేపాల్కు వెళ్లిపోతున్నట్లు వారికి చెప్పారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితులంతా ఖమ్మంలో దొంగతనాలు చేసి దొరికిపోయారని, అక్కడ చోరీ చేసే మళ్లీ దొరికిపోతామని, సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ కేసులో జ్యువెలరీ షాపు యజమాని రెండున్నర కిలోల బంగారం, కొంత నగదు దొంగతనానికి గురైనట్టు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో మరో స్పెర్మ్ క్లినిక్ నిర్వాకం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్బాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఇవాళ (ఆదివారం) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశారు.అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వహిస్తూ.. వీర్య కణాలను, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్లో స్పెర్మ్ సేకరణ చేస్తున్నారు. స్పెర్మ్ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
ప్రొద్దుటూరులో ఘరానా మోసం.. సచివాలయ ఉద్యోగస్తులమంటూ..
ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్ను దివ్యాంగుల పింఛన్కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్ను దివ్యాంగుల పింఛన్గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.ఫొటో అప్డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. -
కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మరోసారి నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్లో ఓ విల్లాలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.కాగా, రెండు రోజుల క్రితం మాదాపూర్లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహించారు. నిర్వాకుడు నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అమెరికాలో కత్తిపోట్లు.. 11 మందికి గాయాలు
ట్రావెర్స్ సిటీ: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం ట్రావెర్స్ సిటీలో శనివారం చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ మున్సన్ హెల్త్కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాల్మార్ట్ స్టోర్ వద్దకు వచ్చిన వారిపైకి అతడు ఫోల్డబుల్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఆయుధం సహా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మిషిగన్ వాసి అని తెలిపిన పోలీసులు అంతకుమించి వివరాలను వెల్లడించలేదు. ఇలా ఉండగా, అల్బుక్వెర్క్లోని న్యూమెక్సికో యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అనుమానితుడు జాన్ ఫుయెంటెస్(18)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో 14 ఏళ్ల బాలుడు చనిపోగా మరొకరు గాయపడటం తెల్సిందే. A knife-wielding man stabbed 11 in a Michigan Walmart. A brave armed civilian stepped in, likely saving lives.Most Americans know: Evil can't be reasoned with—only stopped. pic.twitter.com/w70HNNZtM2— Manni (@ThadhaniManish_) July 27, 2025 -
అత్తింటివారు హత్య చేశారని ఫిర్యాదు
ఒడిశా : అత్తగారి ఇంట్లో తమ కుమార్తెను హత్య చేశారని మృతిరాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బొయిపరిగుడ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న మంజులా నాయిక్ కుమార్తె వర్షా నాయిక్(20) 2023 సెప్టెంబర్ 16వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. బొయిపరిగుడ హనుమాన్ నగర్లోని ధన టక్రి కుమారుడు దుఖి శ్యామ్ టక్రిను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి వారు కలిసి నివసిస్తున్నారు. అయితే శుక్రవారం వర్ష నాయిక్ అత్తగారింట్లో ఉరిపోసుకుందని అత్తింట్లో వారు వెల్లడించారు. అయితే తన కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. గత నాలుగు నెలలుగా తన కుమార్తెను కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తన కుమార్తెను ఆమె భర్త దుఖి శ్యామ్ హత్య చేశాడని, హంతకుడిని అరెస్టు చేసి తగిన శిక్ష విధించాలని కోరింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. -
రూ. 22,845 కోట్లు కొల్లగొట్టారు!
భారత్లో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకూ చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 36.36 లక్షలకు పెరిగింది.ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు, బ్యాంకులు, పోలీసు విభాగాలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పుణ్యమా అని జనంలో సైబర్ నేరాలపట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గకపోవడం గమనార్హం. సైబర్ మోసాలే కాదు.. బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తమూ ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బాధితులు నష్టం జరిగిపోయాక.. పోలీసు స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టళ్లు, టోల్ ఫ్రీ నంబర్ల వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. –సాక్షి, స్పెషల్ డెస్క్లొకేషన్ ఇట్టే పట్టేస్తారుసైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలకు సమాచారం చేరవేసేందుకు ’ప్రతిబింబ్’ మాడ్యూల్ను కూడా ఏర్పాటుచేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. 63,019 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగలిగారు.కట్టడికి కలిసికట్టుగా..న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని (సీఎఫ్ఎంసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు.. సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు.. ఐటీ సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు ‘సహ్యోగ్’ పోర్టల్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్) రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఐఆర్) ప్లాట్ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్లో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది.సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది రూ.22,845.73 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం రూ.7,465.18 కోట్లు.2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో (ఎన్ సీఆర్పీ) 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు.. మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు.రూ.10 వేల కోట్లకుపైగా కాపాడారు!కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా వచ్చిన 17.8 లక్షల ఫిర్యాదులకుగాను రూ.5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్–1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. తద్వారా రూ.4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు. -
Hyderabad: వెలుగులోకి మరో ప్రీ లాంచ్ మోసం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్లు రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. ఐదేళ్ల కిందట ప్రాజెక్ట్ మొదలు పెట్టిన భారతీయ బిల్డర్స్.. కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు.బాధితులకు సాకులు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి భారతీయ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు. దీంతో బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించారు. బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు. భారతీయ బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరును శ్రీభారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా కేటుగాళ్లు మార్చేశారు.ఈ కంపెనీకి 60 శాతం ఆశిష్ అహూజా, మిగిలిన నలభై శాతం వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ లో పేరుతో షేర్లు ఉన్నాయి. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు.సిరిసింపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా పేర్లు మారుస్తున్న నిందితులు.. భానూరు, కోకోపేట్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రీలాంచ్ పేరుతో మోసాలకు తెరతీశారు. సునీల్ కుమార్ అహూజా, ఆశిష్ అహూజా, నాగరాజు, శివరామకృష్ణలను అరెస్టు చేయాలని.. తమ నగదును తిరిగి ఇప్పించాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆంబులెన్స్లో గ్యాంగ్రేప్
ఆమె హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు హాజరైంది. ఆ సమయంలో ఎక్కువ సేపు లైన్లో ఉండడంతో.. కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడి నిర్వాహకులు ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.బీహార్ గయ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు వెళ్లిన యువతి(26)పై అఘాయిత్యం జరిగింది. ఫిజికల్ టెస్టులో పాల్గొంటున్న ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. జులై 24వ తేదీన బోధగయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పృహలోని తనపై ఆంబులెన్స్లో నలుగురు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని(ఆంబులెన్స్ డ్రైవర్తో సహా) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగానూ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో సిట్ను, ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. -
యువతి అనుమానాస్పద మృతి
రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో గల చంద్రశేఖర్పూర్ పోలీసులు చంద్రశేఖర్పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. -
షాద్ నగర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం
రంగారెడ్డి: షాద్ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షాద్ నగర్కు చెందిన తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రిగా గుర్తించారు.శనివారం ఉదయం తండ్రీకూతురు బైక్పై వెళ్తున్నారు. షాద్ నగర్ చౌరస్తాకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వీళ్లను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. -
పాదపూజ చేసినా.. కనికరించని భర్త
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన డీఎస్పీలు మృతి!
యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చౌటుప్పల్లోని ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున స్పార్కియో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతులను ఏపీకి చెందిన డీఎస్పీ శాంతారావు, మేక చక్రధర్గా గుర్తించారు. వీరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ఇక, వాహనం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బాలుడిపై లైంగిక దాడి.. 24 కత్తిపోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రత్యర్థి గ్యాంగ్కు సమాచారమిచ్చాడనే కక్షతో 14 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న 13 మందిలో అత్యధికులు మైనర్లే కావడం గమనార్హం. అంతా కలిసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హింసించి ప్రాణాలు తీశారు. అతడి శరీరంపై మొత్తం 24 కత్తిపోట్లున్నాయి. మర్మాయవాలను తీవ్రంగా గాయపరిచారు. జూన్ 29–30వ తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకోగా బాలుడి మృతదేహం జూలై ఒకటో తేదీన ఢిల్లీలో మునాక్ కాలువ ఒడ్డును నగ్నంగా పడి ఉండగా గుర్తించారు. మొత్తం పది మంది ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు 19 ఏళ్ల కృష్ణ అలియాస్ భోలాను ప్రధాన నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కావడ్ యాత్రికులుగా వేషం వేసుకున్న ముగ్గురిని యూపీలోని మీరట్లో కన్వర్ క్యాంపులో ఉండగా గుర్తించారు. ఈ నెల 18న పోలీసులు సైతం కన్వరియాలుగా వేషం వేసుకుని వెళ్లి వారిని మోనుతోపాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడైన భోలాపై గతేడాది ప్రత్యర్థి బధ్వార్ సోదరులు మోను, సోనులు దాడి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, చోరీల ఆరోపణలపై పోలీసులు మోకా చట్టం కింద మోను, సోనులను జైలులో పెట్టారు. ఈ సోదరులకు తనను గురించిన సమాచారం అందిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న భోలా.. ఆ బాలుడిని చంపేందుకు కుట్ర పన్నాడు. జూన్ 29వ తేదీ రాత్రి బాలుడిని వీర్ చౌక్ వద్ద ఉండగా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం బలవంతంగా బైక్పై ఎక్కించుకుని మునాక్ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వెంట తెచ్చుకున్న కత్తితో ఒకరి తర్వాత ఒకరు అతడిని పొడిచి, వదిలేసి పరారయ్యారు. గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మెడకు కేవలం స్కార్ఫ్ మాత్రం కట్టి ఉంది. ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టి భోలాను పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో అత్యధికులు మైనర్లే అయినప్పటికీ అత్యంత తీవ్రమైన నేరమైనందున మేజర్లుగా 16ఏళ్లు దాటిన వారిగా గుర్తించి, తీవ్ర శిక్షలు వేయాలని కోర్టును కోరుతామని డీసీపీ హరేశ్వర్ స్వామి తెలిపారు. నిందితులపై హత్య, సాక్ష్యాధారాల తారుమారుతోపాటు పోక్సో కేసు కూడా నమోదు చేశామన్నారు. -
కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..
కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ అతని ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మెన్గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HCA Controversy: దేవరాజ్ తమిళనాడులో అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి ఆరోపణల కేసులో జనరల్ సెక్రటరీ దేవరాజ్ను ఎట్టకేలకు తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. తమిళనాడులో దేవరాజ్ను సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న దేవరాజ్.. 17రోజులుగా పరారీలో ఉన్నారు. సీఐడీ కేసు నమోదు చేసినప్పట్నుంచీ దేవరాజ్ పరారీలో ఉన్నారు. హెచ్సీఏ వివాదంలో ప్రెసిడెంట్ జగన్మోహన్రావును ఈ నెల 9వ తేదీన తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. జగన్మోహన్రావుతో పాటు పలువుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో జగన్మోహన్రావు ఏ-1గా ఉన్నారు.ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ దర్యాప్తు ేచేపట్టింది. దీనిలో భాగంగా ఏ-2గా ఉన్న జనరల్ సెక్రటరీ దేవరాజ్ను పోలీసులు ఈరోజు(శుక్రవారం, జూలై 25) అరెస్ట్ చేయడంతో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది.హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే హెచ్సీఏలో భారీ స్కామ్లు వెలుగుచూడటంతో అందులోని పెద్దల పాత్రపై దర్యాప్తు చేపట్టింది సీఐడీ. -
హెచ్సీఏలో మరో భారీ స్కాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్ల పేరుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్లు నిర్వహించిన హెచ్సీఏ.. ప్రతీ క్యాంప్లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.ఒక్కో క్యాంప్పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్మోహన్రావు కాజేశారు. క్యాంప్కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.కాగా, హెచ్సీఏ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్మోహన్రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్మోహన్రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. -
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi) -
సౌమ్య కేసు: దుస్తులే తాడుగా.. జైలు గోడ దూకి పరార్.. కేరళలో హైఅలర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్ ఛార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరింది.ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. 2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్తో ఉడాయించాడు. ఆ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇటు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్ట్రాక్ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే.. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది. అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ పోయింది. ఇది పక్కా స్కెచ్తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం. -
గర్భిణీ భార్య హత్య.. ఇంట్లో మృతదేహం.. బయట భర్త నాటకం
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. -
చచ్చేంత వరకు జైల్లోనే ఉండండి
సాక్షి, చెన్నై: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజూ చెమ్మల్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాంచీపురం సమీపంలో 2018లో ఇద్దరు పిల్లల హత్య స్థానికంగా కలకలం రేపింది. విజయ్, అభిరామి దంపతుల పిల్లలైన అజయ్(6), కరి్ణక(4) ఈ హత్యకు గురైనట్టు గుర్తించారు. ఈ పిల్లలను వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో తల్లే కడతేర్చినట్టు విచారణలో తేలింది. ప్రియుడు మీనాక్షి సుందరం మోజులో పడ్డ అభిరామి భర్త విజయ్, పిల్లలను హతమార్చేందుకు పథకం వేసింది. అయితే, ఘటన జరిగిన రోజున భర్త విజయ్ ఇంటికి రావడంలో ఆలస్యం జరగడంతో పిల్లలు హతమైనట్టు విచారణలో తేలింది. భర్తను హతమార్చ లేక పిల్లల్ని చంపేసి ప్రియుడితో ఉడాయించిన అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసు విచారణ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ ముందు విచారణ జరిగింది. వానదనలు, సాక్షుల విచారణలన్నీ ముగిసి గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో కోర్టుకు వచ్చిన అభిరామి తీర్పు తదుపరి మహిళా కానిస్టేబుల్ కాళ్లను పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. అభిరామి, మీనాక్షి సుందరంకు మరణించే వరకు జైలు శిక్షతోపాటూ తలా రూ. 15 వేలు జరిమానా విధించారు. -
బస్సులో అసభ్య ప్రవర్తన
తమిళనాడు: మద్యం మత్తులో ఓ యువతి ఎదుట నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ను బస్సులోని ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. తిరువళ్లూరు బస్టాండు నుంచి శ్రీపెరంబదూరుకు బుధవారం రాత్రి పది గంటలకు ప్రభుత్వ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు కామరాజర్ విగ్రహం వద్ద వచ్చిన క్రమంలో అప్పటికే మద్యం మత్తులో వున్న వ్యక్తి నగ్నంగా మారి యువతి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు నగ్నంగా ఉన్న వ్యక్తిని చూసి షాక్కు గురి కావడంతో పాటూ అతడ్ని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు చేపట్టిన విచారణలో మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి శ్రీపెరంబదూరుకు చెందిన మదియగళన్గా గుర్తించారు. ఇతను అరక్కోణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్గా పని చేస్తున్నట్టు నిర్ధారించారు. కాగా బస్సులో నగ్నంగా మారి యువత ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యుడి వ్యవహార శైలి స్థానికంగా కలకలం రేపింది. కాగా నిందితుడిని పోలీసు స్టేషన్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రాజస్తాన్: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్ సీఎం భజనాన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. सुबह-सुबह झालावाड़ से दुखद खबरझालावाड़ में एक सरकारी स्कूल की बिल्डिंग गिरने से 5 बच्चों की मौत हो गई. वहीं हादसे में 30 से ज्यादा बच्चे गंभीर घायल हैं.हादसा शुक्रवार सुबह प्रार्थना के दौरान मनोहरथाना ब्लॉक के पीपलोदी सरकारी स्कूल में हुआ.#Rajasthan #Jhalawar pic.twitter.com/DgtbbO8k3q— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 25, 2025 -
భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్: పదో తరగతి విద్యారి్థని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది. సీఐ శివప్రసాద్, మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్లోని డీ– బ్లాక్లో నాలుగో అంతస్తులో నివాసముంటున్న బిజయ్ నాయక్, చిన్మయి నాయక్ దంపతులకు కుమార్తె హన్సిక నాయక్ (15), ఓ కుమారుడు ఉన్నారు. హన్సిక మియాపూర్ మాధవ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం హన్సిక పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పాఠశాల యాజమాన్యం ఇంటికి తిరిగి పంపించింది. దీంతో హన్సిక ఇంటికి వెళ్లి మధ్యాహ్నం తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం.. మాధవనగర్లోని హన్సిక చదువుతున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న షేక్ రిజ్వాన్ (15) ఈ నెల 19న పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రిజ్వాన్, హన్సిక ఒకే తరగతి కావడంతో సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసుకునేవారు. వీటిని పాఠశాల టీచర్ చూసి ప్రిన్సిపాల్కు సమాచారం అందించింది. దీంతో ప్రిన్సిపాల్ రిజ్వాన్ తల్లిని పాఠశాలకు శనివారం పిలిపించి మాట్లాడుతుండగా ఈ చాటింగ్ విషయం తల్లికి, పాఠశాల యాజమాన్యానికి తెలిసిందనే మనస్తాపంతో పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో గురువారం విద్యార్థిని హన్సిక, తండ్రి బిజయ్ నాయక్తో కలిసి మృతి చెందిన తోటి విద్యార్థి రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. అక్కడ రిజ్వాన్ తల్లిదండ్రులు బిజయ్ నాయక్, హన్సికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనంపై నుంచి దూకి రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్న విధంగానే తన కుమార్తె హన్సికను పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని బెదిరించారని హన్సిక తండ్రి బిజయ్ నాయక్ పోలీసులకు చెప్పారు. పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడం, తోటి విద్యార్థి రిజ్వాన్ కుటుంబ సభ్యులు దూషించడంతో మనస్తాపం చెందిన తన కుమార్తె హన్సిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ పోలీసులు తెలిపారు. -
కూటమి నేతల ప్లాన్.. మైనర్లతో దొంగల ముఠా తయారీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్మిట్టల్ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్’ ప్లాన్ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. పట్టించిన సిమ్ ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్ఫోన్ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్పై మోజుతో ఓ మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. మంత్రి ఫోన్తో 41ఏ నోటీసులతో సరి..!విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
మియాపూర్లో విషాదం.. భవనంపై నుంచి దూకేసిన టెన్త్ విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.మియాపూర్లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హన్సిక (14) మియాపూర్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తుపై నుండి దూకింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
పెదాలు కొరికి.. వీడియోలు తీసి.. కటకటాల్లోకి కామపిశాచులు
ఐటీ మహా నగరం బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు కామపిశాచులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్యంగా అమ్మాయిలను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ డెలివరీ ఏజెంట్ను(19), అలాగే ఓ మహిళ పెదాలను కొరికి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. మణిపూర్కు చెందిన దిలావర్ హుస్సేన్.. బెంగళూరులో డెలివరీ ఏజెంట్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తనూరులోని బైరాతిలో అద్దెకు గది తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సాయంత్రం కాగానే నగరంలోని ఎంజీరోడ్డు, చర్చ్ స్ట్రీట్, కొరమంగల ప్రాంతాల్లో అమ్మాయిలను రహస్యంగా ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించాడు. అలా ఆ అశ్లీల ఫొటోలను, వీడియోలను బెంగళూర నైట్ లైఫ్ అనే ట్యాగుతో తన దిల్బర్ జానీ-67 పేజీలో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అశ్లీల పేజీలు పెరిగిపోతుండడంపై దృష్టిసారించిన అశోక్ నగర్ పోలీసులకు దిలావర్ పేజీ కంటపడింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ తరహా కంటెంట్ చిత్రీకరించి.. నెట్టింట వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. మహిళల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసినందుకు బీఎన్ఎస్తో పాటు ఐటీ సెక్షన్లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. మే చివరి వారంలో.. బెంగళూరు మెట్రో రైళ్లలో యువతులను అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జులై మొదటి వారంలో.. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ బాత్రూంలో మహిళా ఉద్యోగిణిని రహస్యంగా చిత్రీకరించబోయి ఓ సీనియర్ అసోషియేట్ జైలు పాలయ్యాడు. ఇక.. రెండు వారాల కిందట గురుదీప్ సింగ్ అనే వ్యక్తి రోడ్ల మీద మహిళలను తన ఫోన్లో బంధించే ప్రయత్నంలో ఓ యువతి చేతికి చిక్కి చెప్పు దెబ్బలు తిని.. ఆపై జైలు పాలయ్యాడు. తాజాగా మరో ఘటనలో.. గోవిందపూర్లో ఓ యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఆమె పెదాలను కొరికి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మరూఫ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీన బెంగళూరు కూక్ టౌన్ మిల్టన్ పార్క్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని మహిళను అసభ్యంగా తాకి.. ఆపై పార్క్లో ఆమె వెంటపడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అంతకు ముందు.. ఏప్రిల్ 3వ తేదీన బీటీఎం లేఅవుట్లోనూ ఇదే తరహాలో ఓ ఘటన జరిగంది. ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని వెంబడించి.. వాళ్లను అసభ్యంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. -
విశాఖ పోలీసుల థర్డ్ డిగ్రీ.. మేజిస్ట్రేట్ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం తీసిన నిజాయితీ.. విచారణకు సీఎం ఆదేశం
దిస్పూర్: విధి నిర్వహణలో నిజాయితీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణం తీసింది. ప్రాజెక్ట్లు పూర్తి కానప్పటికీ.. పూర్తయ్యాయని బిల్లులు ఇవ్వాలంటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న బాధితురాల్ని ఆమె సీనియర్ ఉద్యోగులు వేధించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాల్ని వివరిస్తూ ఓ లేఖను రాసింది. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా పని ఒత్తిడి కారణంగా నేను ఈ చర్య తీసుకుంటున్నాను. ఆఫీసులో నాకు అండగా ఎవరూ లేరు. పూర్తిగా అలసిపోయాను నా తల్లిదండ్రులు నా గురించి ఆందోళన చెందుతున్నారు’అని సూసైడ్ నోట్లో రాశారు.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా, ఇటీవల పదోన్నతి పొందిన సూపరింటెండెంట్ ఇంజనీర్, గతంలో బొంగైగావ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన దినేష్ మేధి శర్మ, ప్రస్తుతం బొంగైగావ్లో పనిచేస్తున్న సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్డిఓ) అమీనుల్ ఇస్లాంలను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
సంతమాగులూరు తండ్రీకొడుకుల హత్య కేసులో టీడీపీ నేత?
సాక్షి,బాపట్ల: జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన జంట హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం.చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కుమారుడు కిడ్నాప్,దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్తున్న వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను అగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణంగా హత్య చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తండ్రీ,కొడుకుల హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో బాదం మాధవరెడ్డితో హతులు వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి ఆర్ధిక పరమైన గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి వివాదం కారణంగానే మృతుల్ని పక్కాప్లాన్ ప్రకారం హత్య చేశారని, హత్యలో స్వయంగా బాదం మాధవరెడ్డి పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
అన్నా చెల్లెళ్ల ‘లవ్ స్టోరీ’ అలా ముగిసింది!
తమిళనాడు: తిరుపోరూర్ పక్కన ఉన్న తండలం పంచాయతీకి చెందిన సెల్వరాజ్ కుమారుడు సురేంద్రన్ (28). అతనూ షోలింగనల్లూర్లో నివసించే బంధువు ప్రియాంక (25) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇంజినీర్ అయిన ప్రియాంక, పోరూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. సురేంద్రన్ తల్లి, ప్రియాంక తల్లి అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ కుటుంబాల్లో ఎవరూ సురేంద్రన్, ప్రియాంక స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం వారికి తెలియగానే రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి మధ్య ప్రేమ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. దీని కారణంగా, ప్రేమికులిద్దరూ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇదే సమయంలో ఎంతకూ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్, ప్రియాంక మనస్తాపంతో మంగళవారం రాత్రి తండలం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్ తిరిగి రాకపోయేసరికి, అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్ రూంలో సురేంద్రన్, ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటన గురించి తిరుపోరూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
40 ఏళ్ల అంకుల్తో 10వ తరగతి విద్యార్థిని ప్రేమ..!
తమిళనాడు: తన 40 ఏళ్ల ప్రియుడితో వెళ్లేందుకు యత్నించి పట్టుబడిన ఓ 10వ తరగతి విద్యార్థిని పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకి కలకలం సృష్టించింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితిలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. నెల్లై జిల్లాలోని పత్తమడైకి చెందిన మురుగన్ (40). ఇతను కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. అతను పత్తమడై ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సోషల్ మీడియా ద్వారా కలుసుకుని ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నారు. తరు వాత, ఇద్దరూ సెల్ఫోన్ల ద్వారా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈనెల 14వ తేదీన పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అకస్మాత్తుగా అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రులు పత్తమడై పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చేరన్మా దేవి ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి తిరుచెందూర్ వెళ్లిందని తేలింది. పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు తిరుచెందూర్ వెళ్లి ఇద్దరు వ్యక్తులను బుధవారం ఉదయం అక్కడికి తీసుకువచ్చారు. తరువాత, ఆల్–ఉమెన్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించినప్పుడు, విద్యార్థిని తన తల్లిదండ్రులతో వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆమె తన ప్రియుడిని విడిచిపెట్టనని స్పష్టంగా చెప్పింది. అయితే విద్యార్థిని మైనర్ కావడంతో పోలీసులకు అప్పగిస్తామని తేల్చారు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ మిద్దెపై నుంచి దూకింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయి ప్రాణపాయ స్థితిలో ఉంది. వెంటనే పోలీసులు అతన్ని రక్షించి చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మురుగన్ను అరెస్టు చేశారు. మురుగన్కు వివాహం జరిగి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పడం గమనార్హం. -
భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!
నంద్యాల: భర్తను తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది ఓ మహిళ. నంద్యాల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి రమణయ్య పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పట్టణం, గాంధీనగర్కు చెందిన చింతల యామిని (27) ఇందిరానగర్లోని జేకే పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. మంగళవారం ఉదయం ఖమ్మం వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్కు బయలుదేరిన ఆమె వాంతులు కావడంతో కొద్దిసేపటికే హాస్టల్కు తిరిగి వచి్చంది. అనంతరం తన రూమ్మేట్స్ నిఖిత, రాణిలతో కలిసి టిఫిన్ చేసి హాస్టల్లోనే ఉండిపోయింది. ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ నిర్వాహకుల సహాయంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా కిటికీ గ్రిల్కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యామినికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. బుధవారం పోస్టు మార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్ పెడ్లర్గా భగ్న ప్రేమికుడు!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తూ ప్రేమలో విఫలమైన గాజులరామారం వాసి హర్షవర్ధన్ మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. పలుమార్లు డ్రగ్స్ ఖరీదు చేసిన ఇతగాడు ఆ దందాలో ఎంత లాభం ఉంటుందో తెలుసుకున్నాడు. దీంతో గోవా, ముంబైల్లో ఉన్న సప్లయర్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్ పెడ్లర్గా మారాడు. ఇతడిని పట్టుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు 10 గ్రాముల కొకైన్, 11 ఎక్స్టసీ పిల్స్ తదితరాలు స్వా«దీనం చేసుకున్నట్లు కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీసీపీ వైవీఎస్ సు«దీంద్ర, ఇన్స్పెక్టర్లు జీఎస్ డానియేల్, ఎస్.బాలస్వామిలతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అందమైన జీవితాన్ని ఊహించుకుని.. బీటెక్ పూర్తి చేసిన హర్ష ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటున్న క్రమంలో.. ఆ యువతి మరొకరిని వివాహం చేసుకోవడంతో భగ్న ప్రేమికుడయ్యాడు. ఆ బాధను మర్చిపోవడానికి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తొలినాళ్లల్లో ఓజీ డ్రగ్ వాడి ఆపై కొకైన్కు మారాడు. ఇలా ఇతగాడికి గోవా, బెంగళూరులకు చెందిన డ్రగ్ పెడ్లర్స్లో సంబంధాలు ఏర్పడ్డాయి. కొన్నాళ్లకు తానే పెడ్లర్గా మారాలని నిర్ణయించుకున్నాడు. ఆ రెండు నగరాల్లో ఉన్న వారితో సంబంధాలు కొనసాగించారు. వారి నుంచి కొకైన్, ఎక్స్టసీ తదితరాలు ఖరీదు చేసి బస్సులో లేదా కొరియర్ ద్వారా నగరానికి తెచ్చేవాడు. ఆపై ఇక్కడి కన్జూమర్లకు ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. వివరాలు ఇలా వెలుగులోకి.. హర్ష వ్యవహారాలపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ అతడిని పట్టుకుని సరుకు స్వా«దీనం చేసుకుంది. ఇతడి విచారణ నేపథ్యంలో నైజీరియా నుంచి వచి్చన అఫుల్ క్లెమెంట్, లాజరస్ చిన్వెన్మెరి నగరంలో అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. వీరిద్దరినీ హెచ్–న్యూ పట్టుకున్న సందర్భంలో వారి వద్ద మాదకద్రవ్యాలు లభించకపోవడంతో ఎఫ్ఆర్ఆర్ఓ ద్వారా నైజీరియాకు డిపోర్టేషన్ చేయాలని నిర్ణయించారు.విషపూరితం అనే విషయం చెప్పేలా.. మాదకద్రవ్యాలు మత్తు ఇచ్చినా ఇవి విషతుల్యమే. కొన్నాళ్లకు వినియోగదారుల శరీరాలను గుల్ల చేస్తాయి. ఈ నేపథ్యంలోనే వీటిని విక్రయించే పెడ్లర్స్ విష నాగులతో సమానమని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని లాజరస్ టీ షర్ట్ స్పష్టం చేస్తోంది. అరెస్టు సమయంలో అతడు ధరించిన నల్లరంగు టీ షర్ట్పై ‘వెనెమస్.. బోర్న్ హైబ్రీడ్’ (విషపూరితమైన... పుట్టుకతోనే సంకరజాతి) అని రాసి ఉంది. -
మసాజు మాటున 'గలీజు'
విశాఖ సిటీ : విశాఖ హైటెక్ వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది. స్పా సెంటర్ల ముసుగులో గలీజు వ్యవహారం సాగుతోంది. మసాజు మాటున వ్యభిచారం నడుస్తోంది. సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్ల ద్వారానే దందా జరుగుతోంది. వెల్నెస్.. స్పా సెంటర్ల పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేంద్రాలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీటి నిర్వాహకులు కొందరు విదేశాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటూ.. వారితో చీకటి వ్యాపారానికి తెరలేపుతున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన యాడ్స్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. అన్ని రకాల సేవలను అందిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా స్పా సెంటర్లపై పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వీటిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. గత వారంలో వరుసగా రెండు స్పా సెంటర్లపై చేసిన దాడుల్లో వారి మసాజ్ బాగోతం బయటపడింది. హైటెక్ దందా సామాజిక మాధ్యమాల ద్వారానే 80 శాతం హైటెక్ వ్యభిచారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు పలువురు నిర్వాహకులు లొకేంటో, ఇన్స్టా, టెలీగ్రామ్, వాట్సాప్.. ఇలా సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్ను వినియోగించుకుంటున్నారు. వీటిలో డిజిటల్ యాడ్స్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. వాటిలో ఉన్న నెంబర్కు మెసేజ్ చేస్తే చాలు. వెంటనే ఆటో జనరేటెడ్ రిప్లయ్ వచ్చేస్తుంది. ఎటువంటి సేవలు అందిస్తారన్న వివరాలు అందులో ఉంటాయి. మరో నిమిషంలోనే ఫోన్ మోగుతుంది. మధురమైన వాయిస్తో వారి అందించే సేవలు, వారి చార్జీలు వివరిస్తారు. ఓకే అంటే చాలు.. వెంటనే లొకేషన్ మొబైల్కు వచ్చేస్తుంది. ఇదీ విశాఖలో సాగే హైటెక్ వ్యభిచారం. సాధారణ మసాజ్లకు రూ.1000 నుంచి రూ.2500 ఛార్జ్ చేస్తున్నారు. అయితే క్రాస్ మసాజ్ నుంచి ప్రత్యేక సేవలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సేవలు కావాలంటే రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. విశాఖలో 71 స్పా సెంటర్లు ఆకర్షణీయమైన ఎంట్రన్స్.. లోపల అడుగుపెడితే అద్భుతమైన యాంబియన్స్.. అందమైన యువతులతో స్వాగతాలు.. స్టార్ హోటల్ను తలపించే రూమ్లు.. ఇలా నగరంలో ఇలా రూ.కోట్లు ఖర్చు పెట్టి స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 71 వరకు ఈ వెల్నెస్, స్పా, రిలాక్స్ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిరిపురం, పాండురంగాపురం, బీచ్ రోడ్డు, సీతమ్మధార, గాజువాక ప్రాంతాల్లోనే సగం కంటే ఎక్కువగా సెంటర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని స్పా సెంటర్ల నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. విదేశాల నుంచే కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటున్నారు. శరీరం అలసిపోయిన, కండరాలు బిగుసుకుపోయిన వారికి అనేక రకాల మసాజ్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ లోపల జరిగే తంతే వేరుగా ఉంటోంది. చట్ట విరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లు.. స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న చీకటి వ్యాపారానికి పోలీసుల నుంచి సహకారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంలో ఒక్కో స్పా సెంటర్ నుంచి నెలకు రూ.10 వేలు స్టేషన్కు అందుతున్నట్లు సమాచారం. అసాంఘిక కార్యకలాపాలు సాగించే సెంటర్ల నుంచి రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు ముట్టజెబుతున్నారన్న టాక్ ఉంది. అందువల్లే ఇన్నాళ్లు ఆ స్పా సెంటర్ల వ్యవహారం బయటపడలేదన్న వాదనలు ఉన్నాయి.వీటి నిర్వహణ, చట్ట విరుద్ధ కార్యక్రమాలపై అనేక ఫిర్యాదులు రావడంతో సీపీ శంఖబ్రత బాగ్చి గతంలో ప్రతి 2,3 నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అన్ని కేంద్రాల్లో దాడులు చేపట్టినా ఒక్క కేంద్రంలోనూ ఈ తరహా వ్యవహారం వెలుగు చూడలేదు. తనిఖీలకు వెళుతున్న సమాచారం నిర్వాహకులకు ముందుగానే అందుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా.. కూటమి ప్రభుత్వంలో విశాఖలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. హత్యలు, గ్యాంగ్వార్లు, దాడులు, దోపిడీలతో ప్రశాంత విశాఖలో అలజడి రేగుతోంది. తాజాగా ఈ స్పా సెంటర్లలో వ్యభిచారం వ్యవహారం బట్టబయలవడం నగరంలో పరిస్థితికి అద్దం పడుతోంది. గత వారంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో రెండు స్పా కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. -
నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ
నెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్ట్యాగ్తో బస్సు ఆచూకీ కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరి నైట్ హాల్ట్గా నెల్లూరు బస్టాండ్కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్ బస్టాండ్లోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జామున బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలేచిన కండక్టరు, డ్రైవర్ బస్టాండ్లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్ అయినట్లు ఫాస్ట్ట్యాగ్ మెసేజ్ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. నెల్లూరుపాళెం సెంటర్ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్స్టేషన్కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు. -
‘కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి మంగళవారం గద్వాల డీఎస్పీ మొగిలయ్యను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బోరంతపల్లెకు చెందిన ప్రియాంక 2023లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్కు రాగా.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్గౌడ్ సైతం శిక్షణ కోసం హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామంటూ రఘునాథ్గౌడ్ యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామని నమ్మించారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని ఫోన్లో సంప్రదించగా దాటవేస్తూ వచ్చారని బాధితురాలు చెప్పారు. ఈ నెల 17న రఘునాథ్గౌడ్ ఇంటికి వెళ్లి వివాహ విషయం మాట్లాడగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు తనపై చేయి చేసుకున్నట్లు డీఎస్పీకి వివరించింది.తీవ్ర మనస్తాపానికి గురై వారి ఇంటి ముందే నిద్రమాత్రలు మింగగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాప్రాయం తప్పిందని తెలిపింది. మంగళవారం ఉదయం కూడా మరోమారు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లగా నిరాకరించారన్నారు. ప్రస్తుతం శాంతినగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న రఘునాథ్గౌడ్, దాడి చేసిన కుటుంబ సభ్యులౖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత యువతి, తల్లిదండ్రులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేశాం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్పై గట్టు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కానిస్టేబుల్ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని.. మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
hit and run case: లారీతో గుద్ది చంపి..
సాక్షి,మెదక్: నార్సింగి ఎన్హెచ్44 పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నార్సింగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం జరిగింది.లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న సత్తిరెడ్డి కోపోద్రికుడయ్యాడు. వెంటనే లారీలో ఉన్న డ్రైవర్ను దిగాలని సూచించాడు. దీంతో లారీ డ్రైవర్ మృతుడిని లారీతో గుద్ది ప్రాణాలు తీశాడు. అనంతరం, లారీతో పరారయ్యాడు. హిట్ అండ్ రన్పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
మచిలీపట్నం: యూ ట్యూబ్ వీడియోలు చూసి..
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో యూ ట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు ముగ్గురూ 9వ తరగతి విద్యార్థులే. వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడిన మైనర్లు.. రెండు నెలల్లో నాలుగు దొంగతనాలు చేశారు. ఆ ముగ్గురు నుంచి రూ.10 లక్షల 20 వేలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుర్ల నుంచి చోరీ సొత్తును కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. జువైనల్ హోంకు తరలించారు. మైనర్ల నుంచి చోరీ వస్తువులు కొనుగోలు చేసిన ఇద్దరికి నోటీసులిచ్చి వదిలేశారు. కాగా, చోరీ చేసిన సొత్తును కొన్నవారికి 41 నోటీసులిచ్చి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
పడక సుఖం ఇవ్వని భర్తను..
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది. అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్లో చదవండి.👇ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా -
బాపట్ల జిల్లాలో జంట హత్యల కలకలం
సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో జంట హత్యలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు తండ్రి, కొడుకులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతులు పాతమాగులూరికి చెందిన వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే,వీరి హత్యకు బెంగుళూరులో ఆస్తి వివాదాలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
చిత్తూరు అర్బన్: అతడికి 19 ఏళ్లు. ఆమెకు 38 ఏళ్లు. అయినా వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సమాజం తమ పెళ్లిని అంగీకరించదని భావించి ఎవరికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. విధి అడ్డు తగలడంతో చేసేదేమీలేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ ఘటన జరిగింది.వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన యువకుడు(19) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో నాన్–టీచింగ్ స్టాఫ్గా మహిళ(38) పనిచేస్తోంది. ఈమెకు వివాహమవ్వగా.. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి, ఆ మహిళతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురి వయసు తేడా దాదాపు 20 ఏళ్లు ఉండటంతో తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన వీరు మూడు రోజుల క్రితం ఎవ్వరూ తమకు అభ్యంతరం చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వెళ్లిపోయారు.కానీ, ఇంతలో తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించడంలేదని యువకుడి తల్లిదండ్రులు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. వీరి ప్రేమ విషయం బయటపడింది. సాంకేతిక ఆధారంగా వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అక్కడి నుంచి ఇరువురినీ చిత్తూరుకు తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సీఐ నెట్టికంటయ్య కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో యువకుడిని ఇంటికి పంపించారు. ఆ మహిళ కూడా తన ఇంటికి వెళ్లిపోయింది. -
మహిళా వీవోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దళిత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక గత శనివారం తెల్లవారు జామున అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన తనను ఏడాది కాలంగా మానసికంగా వేధిస్తున్నాడని, అసభ్యపదజాలంతో అశ్లీల సూచనలు చేస్తూ తనను ఒంటరిగా ఇంటి వద్ద కలవాలని మానసికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మాది, నీ ఉద్యోగం ఉండాలంటే నాతో ఇంటి వద్ద రాత్రి ఒంటరిగా కలవాలని, నేను చెప్పినట్లు వినాలి’ అని బెదిరించినట్టు వివరించారు. ఆరు నెలల క్రితమే విషయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈ మధ్య సుబ్బారావు ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా నరకం అనుభవించానని, గత్యంతరం లేక ఆత్మహత్యా యత్నం చేశానని గోడు వెళ్లబోసుకున్నారు. విషయం పక్కదారి పట్టించే యత్నం.. అసలు విషయం పక్కదారి పట్టించేందుకు సుబ్బారావు పలువురు డ్వాక్రా సభ్యులను ఆటోల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. స్త్రీ నిధి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా నిధులు స్వాహా చేసిందని బాధితురాలి మీద ఆరోపణలు చేయించారు. సుబ్బారావు తమ తరఫున ఉన్నందున ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డ్వాక్రా సభ్యులు పదేపదే ఆయనకు అండగా నిలిచే యత్నం చేశారు. శనివారం తెల్లవారు జామున బాధితురాలు నిద్రమాత్రలు మింగిన విషయం తెలుసుకున్న వీరు సోమవారం ఉదయం నగదు స్వాహా చేసిందని వెలుగు కార్యాలయంలో అధికారులకు డ్వాక్రా సభ్యులతో చెప్పించే యత్నం చేయడం గమనార్హం. స్త్రీ నిధి నగదు కొంత తన వద్ద ఉన్న మాట వాస్తవమే అని, వాటిని తిరిగి సంస్థకు జమ చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. తన వ్యక్తిగత సమస్యకు డ్వాక్రా నిధులకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సిట్ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్రెడ్డి ఆవేదన
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసులో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి.. ఏసీబీ కోర్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన కుటుంబం గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వెలిబుచ్చారాయన. ‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు. నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్ఫోన్ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్లో ఓ వార్త చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణ చేయించుకోవచ్చని కోరుతున్నానుమాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలు అని కథనాలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అంఉదలో పేర్కొన్నారు. నేను నా లైఫ్లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా భార్య మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.గత 20 రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారాయన. -
తల్లిని అవమానించాడని.. 10 ఏళ్లుగా వెంటాడి..
లక్నో: ఇది సినిమాను తలపించే వాస్తవ కథనం. రచయితలు సినిమా కథలను ఉత్కంఠ కలిగించేలా రాస్తుంటారు. వాటిని తెరమీద చూసినప్పుడు ప్రేక్షకులు నిజమనే భావనకు లోనవుతుంటారు. అయితే ఒక్కోసారి అవి అల్లిన కథలుగా తేలిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్ వెలుగు చూసిన ఒక యధార్థ గాథ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం తల్లిని అవమానించిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు ఆమె కుమారుడు చేసిన పని ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సోసూ అనే యువకుని తల్లిపై పదేళ్ల క్రితం మనోజ్ అనే యువకుడు దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సోను, మనోజ్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా చోటుచేసుకుంది. తన తల్లికి జరిగిన ఘోర అవమానానికి కలత చెందిన సోను నాటి నుంచి మనోజ్ కోసం అన్వేషణ ప్రారంభించాడు. కాలం గడుస్తున్నప్పటికీ మనోజ్ తనలో సోనుపై ఉన్న పగను చల్లార్చుకోలేదు. మూడు నెలల క్రితం మనోజ్ను సోను ఇదే ప్రాంతంలోని మున్షి పులియాలో చూశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు.మనోజ్ రోజువారీ షెడ్యూల్ను నోట్ చేసుకున్నాడు. అతను ఎప్పుడెప్పుడు ఏమేమి చేసేదీ, ఎక్కడకు వెళ్లేదీ సోనూ గమనించాడు. నలుగురు స్నేహితుల సాయంతో మనోజ్ను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. ఈ హత్య తర్వాత పార్టీ ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. మే 22న మనోజ్ తన దుకాణాన్ని మూసివేసి, ఒంటరిగా వెళుతున్న సమయంలో, సోనూ తన స్నేహితుల సాయంతో మనోజ్పై దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనోజ్ హత్యకు పాల్పడిన వారిని సీసీటీవీలో గుర్తించారు. అయితే వారి ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఇంతలో సోనూ తన నలుగురు మిత్రులకు పార్టీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోనూ స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవే వారిని పోలీసులకు పట్టుబడేలా చేశాయి. సీసీటీవీ ఫుటేజీలలో కనిపించిన ఐదుగురు అనుమానితులలో ఒకరిని పోలీసులు సోషల్ మీడియా ఫోటోలలో గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఐదుగురు అనుమానితులను ట్రాక్ చేసి, అరెస్టు చేశారు. నిందితులు సోను, రంజిత్, ఆదిల్, సలాము, రెహమత్ అలీలను పోలీసులు విచారిస్తున్నారు. -
రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!
వికారాబాద్: ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. -
జాబు కావాలంటే ‘కమిట్మెంట్’ ఇవ్వాల్సిందే
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా పనిచేసిన ఓ మహిళను ఆసుపత్రిలో శానిటేషన్ పనులు చేయించే టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్(చింటు) ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆమె ఉద్యోగం కోసం అనేక మార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త నుంచి సదరు మహిళ సెల్కు కాల్ వచ్చింది. తాను సహాయం చేస్తానని, నీకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అయితే తనతో పాటు చింటుకు కమిట్మెంట్ ఇవ్వాలని నిస్సిగ్గుగా అడిగాడు.ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను అలాంటి దానిని కాదని, డబ్బులు కావాలంటే ఇస్తానని బాధితురాలు చెప్పగా.. ‘డబ్బు వద్దు’ అని చెబుతూ గట్టిగా మాట్లాడుతూ ‘ఒప్పుకుంటే ఇప్పిస్తా.. లేదంటే లేదు’ అని తేల్చి చెప్పాడు. అది లేకుండా ఉద్యోగం కుదరదా? అని సదరు మహిళ ప్రశ్నిస్తూ..‘ఎవరు అడిగారు’ అని అడగ్గా.. తానే అడిగానంటూ అంటూ సదరు వ్యక్తి చెప్పడం గమనార్హం.కాగా, ఈ ఘటన వారం క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. హిందూపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చింటు ఈ వ్యవహారం అంతా తనకు చుట్టుకుంటుందని తెలిసి నిందితుడి తరఫున మాట్లాడి తప్పించే ప్రయత్నం చేశాడు. ఇది కాస్తా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల దగ్గరకు వెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా చేసినట్టుగా తెలుస్తోంది. -
ఎటుపోతోంది విశాఖ?
చోరీలు.. దోపిడీలు.. హత్యలు.. లైంగిక దాడులు.. గంజాయి బ్యాచ్ల గ్యాంగ్ వార్లు.. మాదక ద్రవ్యాల మత్తులో యువకుల ఘర్షణలు.. ఇలా వరుస ఘటనలతో విశాఖ వణికిపోతోంది. ప్రశాంత నగరంలో రోజూ ఎక్కడో చోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో రౌడీషిటర్లు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డు మీదే కత్తులతో తెగబడుతున్నారు. హత్యలకు పూనుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ గ్యాంగ్ వార్లతో అలజడి సృష్టిస్తున్నారు. ఫలితంగా సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖ.. ఇప్పుడు సిటీ ఆఫ్ క్రైమ్గా మారిపోతోంది. ఇందుకు ఇటీవల జరిగిన హత్యలు, దాడులు, చోరీ ఘటనలే నిదర్శనం. – విశాఖ సిటీప్రకృతి అందాలతో అలరారే ప్రశాంత విశాఖలో నేడు రక్తపుటేర్లు పారుతున్నాయి. వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు వారాల్లో మూడు హత్యలు జరగడం కలకలం రేపుతోంది. ఈ ఆరు నెలల కాలంలో నగరంలో 12 హత్యలు చోటు చేసుకున్నాయి. వీరిలో ఏడుగురు మహిళలే బలవడం గమనార్హం. ⇒ ఈ నెల 13న అర్ధరాత్రి వెంకటేశ్వరమెట్టకు చెందిన రౌడీషిటర్ చెట్టి ఎల్లాజీ అలియాస్ వట్టి (22) హత్యకు గురయ్యాడు. గొడవలు వద్దు.. సర్దుకుపోండి అన్నందుకు స్నేహితుడే అతడిని కత్తితో పొడిచి హతమార్చాడు. ⇒ ఈ నెల 8న అర్ధరాత్రి పాత కక్షలతో పెందుర్తి పరిధి పులగానిపాలానికి చెందిన రౌడీషిటర్ మాసపు లోహిత్ (20) అలియాస్ నానిని అతడి స్నేహితులే పక్కా ప్లాన్ వేసి చంపేశారు. మాధవధార కుంచుమాంబ అమ్మవారి పండగలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ⇒ ఈ నెల 6న కొబ్బరితోటకు చెందిన కనకరాజు(32) అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. మద్యం సేవించి కింద పడటంతో తల వెనుక బలమైన గాయం తగలడంతో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు చెబుతుండగా.. ఇది హత్యేనని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఈ నెల 1న జ్ఞానాపురం శ్మశానవాటికలో అల్లిపురం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ నాగమణి ఎల్లాజీ(35) హత్యకు గురయ్యాడు. శ్మశాన వాటిక సిబ్బందిని బెదిరించిన ఘటనలో ఒకరు చేతిలో ఉన్న గెడ్డపారతో ఎల్లాజీ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళలకు రక్షణ కరువుఒక్క రోజులో డెలివరీ కాబోయే భార్యను అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన భర్త.. డబ్బు కోసం వృద్ధ దంపతులపై కత్తితో దాడి చేసి వివాహిత మెడ కోసి మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయిన అగంతకుడు.. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు.. దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్లో మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు.. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించిన తల్లిని కొట్టి చంపిన కొడుకు.. ఇలా విశాఖలో వరుసగా మహిళలు హత్యకు గురవుతూ నే ఉన్నారు.మహిళల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలు విశాఖలో పరిస్థితులపై కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోరు మెదపడం లేదు. పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నా.. కూటమి ప్రభు త్వానికి పట్టడం లేదు. ఈ ఘటనలు విశాఖ ఆర్థిక రాజధానిగా కాకుండా నేర రాజధానిగా మారుతోందన్న వార్తలకు బలాన్నిస్తున్నాయి.డ్రగ్స్ కలకలం కూటమి ప్రభుత్వంలో విశాఖ గంజాయికే కాకుండా డ్రగ్స్ కూడా అడ్డాగా మారిపోయింది. అందుకు ఇటీవల జరిగిన కొకైన్ వ్యవహారమే నిదర్శనం. ఢిల్లీ నుంచి కొకైన్ను విశాఖకు తీసుకొచ్చిన గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురి కూటమి నేతల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వీరిలో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చూపించారు.మిగిలిన ఇద్దరిని వదిలేయడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరిని అరెస్టు చేయకుండా కూటమి ప్రజాప్రతినిధులపై పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ సరఫరాదారుడు ఢిల్లీలో ఉంటే ప్రిన్స్ అనే కింగ్పిన్ కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్లాయి. కానీ ఇప్పటి వరకు అతడి ఆచూకీ లభించిలేనట్లు తెలుస్తోంది. గంజాయి బ్యాచ్ల గ్యాంగ్వార్కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గంజాయి బ్యాచ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రణాళిక పేరుతో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హడావుడి చేశారు. కానీ నగరంలో గంజాయి నిర్మూలన జరగకపోగా.. వినియోగం పెరిగిపోయింది. ఏజెన్సీలో జరిగే గంజాయి సాగుపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో నగరం నడిరోడ్డులోనే గంజాయి మొక్కలు దర్శనమివ్వడం సంచలనం రేపింది.కొద్ది నెలల కిందట ఆంధ్రా మెడికల్ కాలేజీ వెనుక గంజాయి మొక్కలను గుర్తించగా.. తాజాగా వారం కిందట జ్ఞానాపురంలో ఒక పాడుబడిన ఇంట్లో గంజాయిని సాగు చేస్తున్న విషయం బయటపడింది. ఇలా కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు నగరానికి పాకింది. గంజాయి వినియోగం సైతం విపరీతంగా పెరిగింది. గంజాయి మత్తులో యువకులు నిత్యం దాడులు, దోపిడీలతో అమాయకులపై తెగబడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో గ్యాంగ్ వార్లు విపరీతంగా పెరిగిపోయాయి. ⇒ ఈ నెల 6న అర్ధరాత్రి తమను అవమానకరంగా మాట్లాడి వేధిస్తున్నారన్న కక్షతో ఓ వర్గం.. కొత్తపాలెం ప్రధాన రహదారి గవర రామాలయం వద్ద నలుగురిపై దాడి చేసి గాయపరిచింది. ⇒ ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి రైల్వే గ్రౌండ్ వద్ద రెండు గ్యాంగ్లు కొట్లాటకు దిగాయి. రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు గాయపడగా వారికి కేజీహెచ్లో చికిత్స అందించారు. ⇒ ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి గాజువాకలో జీవన్ అనే వ్యక్తిపై 11 మంది యువకులు బీరు బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. -
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
సాక్షి,బెంగళూరు: భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.అయితే, ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. In #Karnataka's Yadagiri, a wife pushed her husband into the river on the pretext of taking a selfie.The couple got married 2 months ago, the husband had gone to his mother's house to pick up his wife, while returning,1/2 pic.twitter.com/u0N8xK8QLI— Siraj Noorani (@sirajnoorani) July 16, 2025 -
కనిపించని పశ్చాత్తాపం.. జైలు జీవితం బాగుందంటున్న సోనమ్
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో నిందితురాలు సోనమ్ రఘవంశీకి జైలు జీవితం బాగుందని సమాచారం.పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లిన భర్త రాజా రఘువంశీని అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్తో సోనమ్ రఘువంశీ హత్య చేయించింది. ఇదే కేసులో మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తోంది.నెల రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకున్న క్రమంలో ఈక్రమంలో జైల్లో ఉన్న సోనమ్ రఘువంశీ గురించి ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలు నిబంధనల ప్రకారం.. జైల్లో ఉన్న సోనమ్ను చూసేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఉంది. కానీ ఆమెను చూసేందుకు ఎవరూ రాలేదు. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం సోనమ్లో లేదు. జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుంది. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతుంది. జైలు నిబంధనల ప్రకారం.. సమయపాలన పాటిస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం నిద్ర లేస్తోంది. అయితే, తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో,తోటి ఖైదీలతో మాట్లాడడం లేదని సమాచారం.ఇక సోనమ్ను జైలు అధికారులు జైలు వార్డెన్ సమీపంలో ఆమెకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళ ఖైదీలు రూమ్ను షేర్ చేసుకుంటున్నారు. సోనమ్ కుట్టుమిషను ఇతర స్కిల్ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రోజు తప్పని సరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనమ్ జైలులో హత్య కేసులో నిందితురాలైన రెండవ మహిళా ఖైదీ.ఆమెను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. -
భర్తను చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టి..!
మనకు దృశ్యం సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో మర్డర్ సీన్ చుట్టూ తిరిగిన ఓవరాల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి సుమారు దశాబ్దకాలం పూర్తి కావొస్తున్నా.. ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయి మరీ చూసేస్తూ ఉంటాం. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్. అక్కడ తన కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని తండ్రి చంపి మొత్తం కేసునే తప్పుదోవ పట్టిస్తూ సీన్లు అల్లిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇది సినిమా కాబట్టి ఆసక్తికరం అనిపిస్తోంది. మరి నిజ జీవితంతో జరిగితే వామ్మో అనే పరిస్థితి.మరి, ఇదే దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది ఓ మహిళ. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. లవర్తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల విజయ్ చావన్, 28 ఏళ్ల కోమల చావన్లు భార్యా భర్తలు. ముంబైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరి జీవితంలోకి ఒక ‘ లవర్’ వచ్చాడు. కోమలకు ప్రియుడు.. విజయ్కు యముడు మాదిరి వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతని పేరు మోను. కోమల, మోను కలిసి విజయ్ను చంపేశారు. అంటే కోమల తన భర్త విజయ్ను మోనుతో కలిసి అంతమొందించింది. మరీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తే.. ఇంట్లోనే టైల్స్ కిందే శవాన్ని పూడ్చిపెట్టేందని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి ‘లాంగ్ టర్మ్ హనీమూన్’( వేరే చోటకి పరార్) వెళ్లిపోయారు. అయితే విజయ్ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా, అక్కడ తాళం వేసి ఉంది. ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్నను చంపేసిన వదిన.. ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టందనే విషయాన్ని తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు.