షాద్‌ నగర్‌ చౌరస్తాలో ఘోర ప్రమాదం | Two Members Died In Shadnagar Chowrasta Water Tanker Accident, More Details Inside | Sakshi
Sakshi News home page

షాద్‌ నగర్‌ చౌరస్తాలో ఘోర ప్రమాదం

Jul 26 2025 9:17 AM | Updated on Jul 26 2025 10:17 AM

Shadnagar Chowrasta Water Tanker Accident Details

రంగారెడ్డి: షాద్‌ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షాద్‌ నగర్‌కు చెందిన తండ్రీకూతురు మశ్చేందర్‌, మైత్రిగా గుర్తించారు.

శనివారం ఉదయం తండ్రీకూతురు బైక్‌పై వెళ్తున్నారు.  షాద్‌ నగర్‌ చౌరస్తాకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వీళ్లను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ట్యాంకర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement