breaking news
Sri Sathya Sai District Latest News
-
పొంచి ఉన్న ‘జల’గండం
మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు చెరువులు, బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల మట్టం పడిపోతుండడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. మడకశిర విద్యుత్ డివిజన్ పరిధిలో మడకశిర, రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం మండలాలు ఉన్నాయి. గత ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో అన్ని చెరువులూ నిండలేదు. ప్రస్తుతం కొన్ని చెరువుల్లోనే కొంత మేర నీరు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గుతుండడం గమనార్హం. కొత్తగా బోరు తవ్వకాలు.. వ్యవసాయ బోర్లలో నీటి మట్టం తగ్గుతుండడంతో రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి కొంత మంది రైతులు కొత్తగా బోరు తవ్వకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రైతులు దాదాపు 120 బోర్లు కొత్తగా తవ్వించినట్లు తెలిసింది. ఓ బోరు బావి తవ్వించడానికే రూ.3.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బోరు బావిలో నీరు లభిస్తే మోటార్ ఏర్పాటు చేయడానికి మరో రూ.3 లక్షలు రైతు భరించాల్సి ఉంటుంది. గత్యంతరం లేని పరిస్థితిలో అప్పులు చేసి మరీ రైతులు బోరు బావులు తవ్విస్తున్నారు. వేసవిలో కష్టాలు తప్పవా..? వేసవి ఇంకా ప్రారంభం కాకనే చాలా బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. భవిష్యత్తులో నీటి మట్టం మరింతగా పడి పోయే ప్రమాదం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని బోర్లు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడాల్సి వస్తుంది. ప్రధానంగా వక్క తోటల రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారనుంది. బోరు బావుల్లో తగ్గుతున్న నీటి లభ్యత పడిపోతున్న భూగర్భ జలమట్టం ఆందోళనలో అన్నదాతలు వేసవిని తలచుకుని హడలెత్తుతున్న వైనం -
వ్యాపార కోణం.. రైతుకు సహకారం
పంటల సాగుకు రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్త్తేసిన ప్రస్తుత తరుణంలో కొందరు వ్యాపారుల వినూత్న ఆలోచన అన్నదాతలకు వరంగా మారింది. సారవంతమైన భూమి, బోరుబావి ఉన్న రైతులకు కొందరు వ్యాపారులు విత్తు నుంచి కోతల వరకూ సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు రకాల పంటలను రైతులకు సూచిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. పంట దిగుబడిని కొనుగోలు చేసిన వెంటనే డబ్బు అందజేస్తున్నారు. పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని కదిరి, తనకల్లుతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా (చియా సీడ్స్) పంటల సాగుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయా పంటలకు చెందిన విత్తనాలను రైతులకు సదరు వ్యాపారులు సమకూర్చడమే కాకుండా వాటి సాగు విధానాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన ఎరువులు, మందులు, నీటి తడుల వివరాలతో పాటు కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చైతన్య పరుస్తున్నారు. ఆర్థికంగా అండగా.. తాము సూచించిన పంటల సాగు చేపట్టిన రైతులకు విత్తనం మొదలు కూలీల ఖర్చు వరకూ అన్ని రకాల సదుపాయాలను వ్యాపారులే కల్పిస్తున్నారు. రైతు చేయాల్సిందల్లా పంటలను సాగు చేయడం, వాటిని సంరక్షించడం, అవసరమైన నీటి తడులు అందించడం, రోగాలు వ్యాపిస్తే వాటిని సదరు వ్యాపారులకు తెలియజేసి అవసరమైన మందులు తీసుకుని పిచికారీ చేయించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువులు అందించి పంట పూర్తి కాగానే వ్యాపారులకు తెలియజేస్తే వారే క్షేత్రస్థాయిలో పరిశీలించి యంత్రాల సాయంతో కోతలు ముగిస్తారు. పంటల దిగుబడులను క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి ముందస్తుగా నిర్ణయించిన ధరల ప్రకారం అప్పటికప్పుడు నగదు అందజేస్తారు. కేవలం మూడు నెలల్లోనే రైతుపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వ్యాపారులు అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో జిల్లాలోని పలు మండలాల్లో సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా గింజల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. 1,074 హెక్టార్లకు పైగా.. వ్యాపారుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా 1,074 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, సబ్జా గింజలు, సజ్జ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 250 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 420 హెక్టార్లలో సబ్జా గింజలు, 404 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సజ్జ సాగులో ఉన్నాయి. బోరుబావి ఉండి, ఆసక్తి కనబరిచే రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను వ్యాపారులే అందజేస్తున్నారు. పంట పూర్తి కాగానే మిషన్ల ద్వారా కోతలు చేపట్టి నూర్పిడి అనంతరం ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు రైతులకు నగదు చెల్లించిన తర్వాతనే మార్కెట్కు పంట దిగుబడులను తరలిస్తున్నారు. ఈ లెక్కన క్వింటా పొద్దుతిరుగుడు పంటను రూ.12 వేలతో, క్వింటా సబ్జా గింజలను రూ.13,500తో, క్వింటా సజ్జ పంటను రకాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల సహకారంతో తమకు ఆర్థిక, మార్కెటింగ్ ఇబ్బందులు తొలిగిపోయాయని రైతులు పేర్కొంటున్నారు. సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా పంటల సాగుకు వ్యాపారుల ప్రోత్సాహం విత్తు నుంచి కోత వరకూ సహకారం దిగుబడిని కొనుగోలు చేసి డబ్బు అందజేత -
సంఘటిత పోరాటాలతో సమస్యలకు పరిష్కారం
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భానూజీరావు అనంతపురం ఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కారం కావాలన్నా, హక్కులు దక్కాలన్నా సంఘటిత పోరాటాలతోనే సాధ్యమవుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానూజీరావు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోని డీఎంహెచ్ఓ కమిటీ హాలులో ఉమ్మడి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా జనసభ జరిగింది. ఉద్యోగుల హక్కులు, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భానూజీరావు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్గా ఎం.ఈశ్వర్, ప్రధాన కార్యదర్శిగా సి.వరప్రసాద్, కోశాధికారిగా ఎం.రాజేష్తో పాటు 23 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి.గురునాథ్, వైస్ చైర్మన్లు దివాకర్బాబు, సుశీల, కోశాధికారి యు.అనిల్, నాయకులు బి.వరపుత్ర, షేక్ మస్తాన్, పి. లవరాజు, అమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతిపావగడ: స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడేటి గ్రామానికి చెందిన నరేష్ (20) అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్డాడు. ఆదివారం ఉదయానికి ఆ గ్రామ గేటు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు బోయ పాతన్న, జయమ్మ అక్కడకు చేరుకుని బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అరసికెరె పీఎస్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో మంగళవాడ గ్రామానికి చెందిన నరసింహమూర్తి (50) మృతి చెందాడు. ఈ ఘటనపై అరసికెరె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇల్లు దగ్ధం
నల్లమాడ: మండలంలోని గంగాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి రైతు నాగయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాగయ్య మరో ఇంట్లో నిద్రిస్తున్నట్లుగా తెలిసింది. రెండున్నర తులాల బంగారు నగలు, రూ.20 వేల నగదు, విద్యుత్ ఉపకరణాలు, వంట పాత్రలు, దుస్తులు, పట్టాదారు పాసు పుస్తకం తదితరాలు కాలి బూడిదయ్యాయి. ఇంటి గోడలు, పైకప్పు బాగా దెబ్బతిన్నాయి. రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. లారీ బీభత్సం గుత్తి: స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని లక్ష్మమ్మ గుడి సమీపంలో ఆదివారం ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన డ్రైవర్ ఆనందరెడ్డి ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని నుంచి లారీలో తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే అప్పటికే మద్యం సేవించి ఉండడంతో గుత్తి ఆర్ఎస్కు చేరుకోగానే మత్తు కారణంగా నియంత్రణ కోల్పోయి లారీని ఇష్టానుసారంగా నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. డివైడర్ మధ్యలో ఉన్న రెండు బటర్ఫ్లై విద్యుత్ స్తంభాలను ఢీకొనడంతో అవి కాస్త విరిగి పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించినా ఫలితం లేకపోయింది. చివరకు ఎన్టీఆర్ సర్కిల్లో లారీని అడ్డుకుని డ్రైవర్ ఆనందరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు. యువకుడి దుర్మరణంపరిగి: వరుస ప్రమాదాలు చోటు చేసుకుని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం మండలం సూగూరు సడ్లపల్లికి చెందిన ధనుజంయరెడ్డి కుమారుడు సి.బాబు (26) స్థానిక ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. మడకశిర మండలం అగ్రంపల్లిలో నివాసముంటున్న తన అక్క ప్రమీలమ్మను చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పరిగి మండలం హొన్నంపల్లి పంచాయతీ జంగాలపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో రెండు వాహనాలపై ఉన్న వారు రోడ్డుపై పడ్డారు. ఈ క్రమంలో బాబుపై వాహనం దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు.డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు కనగానపల్లికి చెందిన వ్యక్తికి కాలు విరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జేసీబీ యజమానుల ర్యాలీహిందూపురం: పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా తమ సేవల ధరలను పెంచిక తప్పడం లేదని హిందూపురంలో జేసీబీ వాహన యజమానులు గళమెత్తారు. ఆదివారం సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా డీజిల్ ధరలు, యంత్రాల విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దీంతో జేసీబీల నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జేసీబీ పనివేళల ధరలు పెంచక తప్పడం లేదన్నారు. గతంలో గంటకు రూ.వెయ్యి చొప్పున తీసుకునేవారని, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం గంటకు రూ.1,300 చొప్పున తీసుకునేలా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సూగూరు ఆలయం వద్ద నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకూ జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీబీ వాహన యజమానులు హనుమంతరెడ్డి, నేపాల్ నాగరాజు, ఆనంద్ కుమార్, లోకేష్, ఆనంద్, వెంకటేష్, సడ్లపల్లి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాంపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. భారీగా భక్తులు తరలి రావడంతో వెంకటాంపల్లి కొండప్రాంతం కిటకిటలాడింది. ఆదివారం వేకువజామునే లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ఉదయం పది గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 51 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి గోవింద నామస్మరణతో లాగారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పరిగి: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 2004–05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సెల్ఫీలు తీసుకున్నారు. విద్యనభ్యసించిన తరగతి గదుల్లో సంచరిస్తూ సందడి చేశారు. అనంతరం తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించారు. పాఠశాలకు రూ.30 వేలు విలువైన ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ను అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం కృపాసత్యరాజు, లక్ష్మయ్య, ప్రభాకర్, సురేష్, వహీదాఖాన్, చందనశ్రీ, రామాంజి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వనరుల విధ్వంసం
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత బత్తలపల్లి మండలంలో ‘పచ్చ’మూక అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. కొండలు, గుట్టలను స్వాహా చేసేస్తున్నారు. మాఫియాగా ఏర్పడి వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. అక్రమంగా రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారు. గ్రావెల్ దందా బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి, అప్పరాచెరువు గ్రామాల చెరువులు, గుట్టల్లో 20 అడుగుల మేర తవ్వేసి గ్రావెల్ను తరలిస్తున్నారు. 15 శాతం మేర కమీషన్లు రూపంలో వాటాలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రామాపురం, కోడేకండ్ల, గరిశలపల్లి, ఉప్పర్లపల్లి, ఓబుళాపురం దంపెట్ల గ్రామాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ యంత్రాల సాయంతో ఇసుక తవ్వేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు, హిటాచీలతో ఇసుక తోడేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టరుకు నెలకు రూ.5 వేల చొప్పున ఓ శాఖ అధికారులకు ముడుపులు అందిస్తున్నట్లు టీడీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. కేవలం ఇసుక, మట్టిలోనే కాకుండా బొగ్గులు కాల్చేవారితోనూ టీడీపీ నేతలు భారీగా దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దందా విషయంలో టీడీపీ లోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం, కిడ్నాప్ చేయడం, దీనిపై కేసులు నమోదై జైలుకు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరూ ఏమీ చేయలేరట... గత నెలలో మండలంలోని పోట్లమర్రి గ్రామంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య మట్టి తరలించే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ వర్గీయులు గ్రామ కట్టుబాటు మేరకు చెరువులో మట్టిని రైతులకు తరలిస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోగా వైఎస్సార్సీపీ వర్గీయులపై అధికారులు కేసులు పెట్టారు. అదే టీడీపీ నేతలు ఆదివారం మళ్లీ గ్రామ చెరువులో హిటాచీ పెట్టి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించడం గమనార్హం. గ్రామస్తులు దీనిపై ప్రశ్నిస్తే ‘మాకు కలెక్టర్, ఎస్పీ నుంచి అనుమతులు వచ్చాయి. ఎవరూ ఏమీ చేయలేరు. అడ్డుపడితే వైఎస్సార్సీపీ వాళ్లకు పట్టిన గతే మీకూ పడు తుంది’ అని హెచ్చరించినట్లు సమాచారం. ధర్మవరం ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ స్వర్ణలత పోట్లమర్రి చెరువును గత నెలలో పరిశీలించి అనుమతులు లేకుండా మట్టిని తరలించవద్దని చేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ మళ్లీ యథేచ్ఛగా తరలిస్తున్నా ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. అప్పరాచెరువులో పాఠశాల ముందు నుంచి మట్టి టిప్పర్లు వేగంగా వెళ్తుండడంతో గ్రామస్తులు తమ పిల్లలను బడికి పంపాలన్నా భయపడుతున్నారు. రెవెన్యూ, పోలీసులు, ఇరిగేషన్ అధి కారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బత్తలపల్లి మండలంలో రెచ్చిపోతున్న ఇసుక, మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రొళ్ల: వ్యక్తి హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మడకశిర రూరల్ పీఎస్ సీఐ రాజ్కుమార్ తెలిపారు. స్థానిక పీఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్ఐ గౌతమితో కలసి ఆయన వెల్లడించారు. రొళ్ల మండలం ఎం.రాయాపురం గ్రామంలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ (40)ను అదే గ్రామానికి చెందిన నాగరాజప్ప శనివారం సాయంత్రం కట్టెతో దాడి చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. హతుడి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఆదివారం సాయంత్రం ఎం.ఆర్.గొల్లహట్టి గ్రామానికి వెళ్లే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం మలుపు వద్ద తచ్చాడుతున్న నాగరాజప్పను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యక్తిగతంగా అనుమానంతో ప్రసన్నకుమార్పై కట్టెతో దాడి చేసినట్లుగా నాగరాజప్ప అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి,. సోమవారం ఉదయం మడకశిరలోని జేఎఫ్సీఎం న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలవ్వాలి
ప్రశాంతినిలయం: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం విద్యాశాఖ అధికారులు, హాస్టల్ వార్డెన్లు, ఎంఈఓలు, హెచ్ఎంలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్లిప్ టెస్టుల్లో సీ,డీ గ్రేడులు సాధించిన విద్యార్థులను 45 రోజుల పాటు హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర ప్రసాద్రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రెడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రైతును నష్టపరిచిన నకిలీ విత్తనంకనగానపల్లి: వ్యాపారుల మాటలు నమ్మి, వారు అంటగట్టిన నకిలీ విత్తనాలతో పంట సాగు చేపట్టి కనగానపల్లి మండలం ముత్తువకుంట గ్రామానికి చెందిన రైతు ఎం.నారాయణ మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. రైతు నారాయణ అనంతపురంలోని వినాయక ట్రేడర్స్ నిర్వాహకుడి మాటలు నమ్మి రూ.35 వేలు చెల్లించి పీహెచ్ఎస్– ప్లస్ అనే కళింగర విత్తనాలు కొనుగోలు చేసి, తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. తర్వాత వివిధ దశల్లో రూ.4 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాడు. నీరు సమృద్ధిగా అందించడంతో పంట ఏపుగా పెరిగి 90 రోజుల్లోనే కోతకు వచ్చింది. అయితే కాయ కోసి చూస్తే తెల్లగా బెండు బారిపోయి కనిపించింది. కాయలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు పంట కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని విత్తనం విక్రయించిన వ్యాపారితో పాటు విత్తన తయారీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళితే వారి నుంచి స్పందన లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. 13 టన్నుల దిగుబడి పొలంలోనే ఉండిపోయిందని, రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. అధికారులు స్పందించి నకిలీ విత్తనం అంటగట్టిన వ్యాపారిపై చర్యలు తీసుకుని తనకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నాడు. పోలీసుల అదుపులో నకిలీ పత్రాల సృష్టికర్తలు! పుట్టపర్తి టౌన్: ఓ గృహాన్ని అక్రమంగా కొట్టేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం నగరంలోని శారద నగర్లో కనకదర్గ అనే సత్యసాయి భక్తురాలు 1980 సంవత్సరంలో 6.43 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. సత్యసాయి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె పదవీ విరమణ తరువాత తన సోదరి శ్రీలక్ష్మితో కలసి శారదానగర్లో నివసించేవారు. వ్యక్తిగత పని నిమిత్తం గత ఏడాది నవంబర్లో రాజమండ్రికి వెళ్లిన కనకదుర్గ, శ్రీలక్ష్మిలు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలోనే అనంతపురం నగరానికి చెందిన ఓ టీడీపీ నేత వారి ఇంటిని కొట్టేసేందుకు పన్నాగం పన్నాడు. కనకదుర్గ జీవించి ఉన్న సమయంలో హిందూపురం ప్రాంతానికి చెందిన శకుంతల ఆమె బాగోగులు చూసిందని, అందుకు ప్రతిఫలంగా తన ఇంటిని ఆమెకు రాసివ్వగా.. శకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ. శేఖర్కు జీపీఏ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కనకదుర్గ బంధువులు అనంతపురం ఎస్పీని ఆశ్రయించారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ అనంతరం నకిలీ పత్రాలు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులు ఆవుల సుబ్రమణ్యం, దయ్యాల ఉమాపతి, శేఖర్ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
10 మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పెనుకొండ రూరల్: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పది మంది గాయపడ్డారు. పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకొంది. వివరాలు.. ఆదివారం హిందూపురం డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు ధర్మవరం బయలుదేరింది. మార్గమధ్యంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ క్రమంలో బస్సు కండక్టర్ చాంద్ బాషా, డ్రైవర్ వెంకటరమణ నాయక్తో పాటు ప్రయాణికులు భాస్కర్, చిన్న నరసప్ప, లక్ష్మమ్మ, సుజాత, కల్పన, వెంకటమ్మ, చెన్నకేశవ, శ్రీనాథ్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న కియా స్టేషన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్ చాంద్ బాషా, చిన్న అంజనప్ప, కల్పనను ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన కియా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవ చ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పుట్టపర్తి: జిల్లావ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 1,489 మంది విద్యార్థులకు గాను 1,433 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,274 మందికి గాను 1,224 మంది హాజరయ్యారన్నారు. మొత్తంగా 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పరీక్షల పరిశీలకుడు రమేశ్ ధర్మవరం, హిందూపురంలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. -
వామ్మో చిరుత !
కదిరి అర్బన్: ఇటీవల చిరుతపులుల సంచారంతో కదిరి నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పశువులపై చిరుతల దాడులు పెచ్చురిల్లుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, గొర్రెల కాపరులు, అడవులకు సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్ యూనిట్ల కార్మికులు మరింతగా భయపడుతున్నారు. అటవీ శివారు గ్రామాల్లో ఆందోళన కదిరి నియోజకవర్గంలో ఇటీవల వరుసగా చిరుతల సంచారాన్ని పసిగట్టిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అటవీ శివారు గ్రామాల్లో ప్రజలు చీకటి పడితే ఇళ్లను వదిలి బయటకు రావడం మానేశారు. గత నెల 29న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలోని లఘువమ్మ కొండ వద్ద చిరుతను గమనించిన స్టోన్ క్రషర్ కార్మికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిరుత తన పిల్లలతో కలిసి వెళ్తున్నట్లుగా ఉన్న పాదముద్రలను గుర్తించారు. అనంతరం ఈ నెల 1న నల్లచెరువు మండలం పోలేవాండ్లపల్లి వద్ద రహదారి దాటుతున్న చిరుతను వాహనదారులు గమనించారు. అలాగే ఈ నెల 6న తనకల్లు మండలం తురకవాండ్లపల్లి సమీపంలో సింగరాతిచెరువు వద్ద గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ ప్రాంతంలో చిరుతతో పాటు దాని పిల్లలు కూడా ఉన్నట్లు గొర్రెల కాపరి గుర్తించాడు. గిరి ప్రదక్షిణపై ప్రభావం కదిరి కొండ వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖాధ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఆ పరిసర కొండల్లోనే చిరుత పాదముద్రలు గుర్తించడంతో గిరి ప్రదక్షణ చేసేందుకు భక్తులు వెనుకాడుతున్నారు. కదిరి కొండవద్ద ఉపాధి హామీ కూలీలు సైతం పనులను అక్కడి నుంచి వేరేచోటికి మార్చుకున్నారు. పని ప్రాంతంలో టపాసులను సిద్ధంగా ఉంచుకుంటున్నారు. చిరుతల భయంతో బెంబేలెత్తుతున్న జనం ఇప్పటికే మూడు చోట్ల కనపడిన చిరుతలు చిరుతల కదలికలపై నిఘా కదిరి నియోజకవర్గ పరిసరాల్లో చిరుతల సంచారంపై నిఘా ఉంచాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గొర్రెల కాపరులు, అటవీ శివారు ప్రాంతాల్లోని క్రషింగ్ యూనిట్లలో పనిచేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా ఉండడం, తరచూ శబ్దాలు చేస్తుండడం లాంటివి చేయాలి. చిరుత పాదముద్రలు కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలి. – గుర్రప్ప, కదిరి అటవీక్షేత్ర అధికారి -
వర్షాలు కురవాలి
వేసవి ప్రారంభానికి ముందే కొన్ని బోర్లలో నీటి లభ్యత తగ్గిపోయింది. ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురిస్తేనే మేలు జరుగుతుంది. లేకపోతే చాలా బోర్లు ఎండి రైతులు పంటలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల పలువురు రైతులు కొత్తగా రూ.లక్షలు ఖర్చు పెట్టి బోర్లు తవ్విస్తున్నారు. అప్పులభారం మోస్తున్నారు. –రవికుమార్, బీజీహళ్లి, రొళ్ల మండలం ఆందోళన కలిగిస్తోంది బోర్లపైనే ఆధారపడి 5 వేల వక్క చెట్లు సాగు చేశా. బోర్లలో నీటి లభ్యత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో బోర్ల మనుగడ మరింత కష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణా జలాలతో చెరువులను నింపితే బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. లేకపోతే రైతులకు కష్టాలు తప్పవు. –చంద్రప్ప, మధూడి, అగళి మండలం -
ప్రభుత్వం ఆదుకోవాలి
ధర్మవరం: జిల్లాలోని ధర్మవరం, గోరంట్ల, చిలమత్తూరు, సోమందేపల్లి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాలలో 35 వేలకు పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.30 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మిరమిట్లు గొలిపే రంగురంగుల పట్టుచీరలను నేతన్నలు తయారు చేస్తున్నారు. కానరాని మద్దతు.. పట్టుచీరలను ఆకర్షణీయంగా రూపొందించేందుకు బార్డర్, పల్లు (కొంగు), మధ్యలో డిజైన్ తదితర చోట్ల జరీ వాడకం తప్పనిసరి. బంగారం, వెండి, రాగి వంటి లోహాల పూతతో చేసే దారాన్ని జరీ అంటారు. ప్రధానంగా కంచి జరీ (వన్గ్రాం గోల్డ్ పూత), జర్మన్ సిల్వర్ జరీ (వెండి పూత), నార్మల్ టెస్టెడ్ జరీ (గోల్డ్ కలర్ కోటింగ్), కాపర్ జరీ (రాగిపూత)ని నేతన్నలు ఉపయోగిస్తారు. ఇటీవల బంగారం, వెండి, రాగి ధరలు పెరగడంతో అందుకనుగుణంగా జరీ రేటు కూడా విపరీతంగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం రూ.2 వేలు పలికిన కంచి జరీ మార్కు ఇటీవల ఏకంగా రూ. 4 వేలకు చేరింది. అదేవిధంగా జర్మన్ సిల్వర్ జరీ రూ.800 నుంచి రూ.1,200కు, కాపర్ జరీ రూ.700 నుంచి రూ.1,000కు, నార్మల్ టెస్టెడ్ జరీ రూ.600 నుంచి రూ.800కు ఎగబాకాయి. ఒక పట్టు చీర తయారీకి కనీసం రెండు మార్కుల వరకు జరీ వాడాల్సి ఉంటుంది. అనతికాలంలోనే జరీ ధరలు భారీగా పెరగడం, పట్టుచీరలకు మద్దతు ధర మాత్రం 5 ఏళ్ల క్రితం ఎంత ఉందో నేటికీ అంతే ఉండటంతో నేతన్నలు నష్టాల పాలవుతున్నారు. సరఫరాలో జాప్యం.. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో మాత్రమే జరీ తయారవుతుంది. అక్కడి వ్యాపారుల నుంచి జిల్లాకు చెందిన చేనేతలు జరీ కొనుగోలు చేసి తీసుకొస్తారు. ముందుగా జరీ బాక్స్లకు నగదును డీడీల రూపంలో చెల్లిస్తేనే సూరత్ లోని కంపెనీ నిర్వాహకులు, ఏజెంట్లు పంపుతారు.ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో జరీకి డిమాండ్ పెరగడంతో నగదు చెల్లించినా ఇక్కడికి సరుకు సరఫరాలో జాప్యం అవుతోంది. దీంతో నేతన్నలకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు. కష్టతరంగా మగ్గాల నిర్వహణ గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలతో ఆధునిక డిజైన్లను చేనేత మగ్గాలలో తయారు చేస్తే కార్మికులకు కొంత లాభదాయకంగా ఉండేది. ఇటీవల జరీ ధరల పెరుగుదల కారణంగా చేనేతలకు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి జరీ ధరల పెరుగుదలను నియంత్రించాలి. చేనేతలకు సాయం అందించాలి. –జింకా కంబగిరి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం పెరిగిన జరీ ధరలకనుగుణంగా పెట్టుబడి వ్యయం బాగా పెరిగింది. ఇప్పటికే ముడిపట్టు, రేషం (నిలువుదారం, అడ్డదారం) ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని పెరిగిన జరీ ధరలు మరింత సంక్షోభంలోకి నెట్టాయి. రోజంతా కష్టపడినా దిన కూలీ కూడా దక్కడం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే మగ్గాల నిర్వహణ కష్టంగా మారుతుంది. –నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం పట్టుచీరలు అందంగా, ఆకర్షణీయంగా కనపడేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించే జరీ ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో అదనపు భారం పడడంతో నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం స్పందించి చేయూత అందించకుంటే భారీగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన జరీ ధరలు పట్టుచీరలకు మాత్రం ‘మద్దతు’ లేని వైనం నష్టాలబాటలో నేతన్నలు ప్రభుత్వం చేయూతనివ్వాలని వేడుకోలు -
గిరిజనుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్
‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. తనదైన బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు ఈ భువిపై వెలసిన ఆయనే సంత్ సేవాలాల్ మహరాజ్. కారణజన్ముడిగా బంజారాలు ఆరాధించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గుత్తి రూరల్: అనంతపురం జిల్లా మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సేవాగఢ్లో సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీలలో ఘనంగా జరగనున్నాయి. తమ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జన్మస్థలమైన సేవాఘడ్లో జరిగే ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు అశేషంగా హాజరవుతారు. 14న శనివారం రాత్రి జ్యోతి ప్రజ్వలనతో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సేవాగఢ్ విశిష్టత గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని రాంజీనాయక్ తండాలో భీమా నాయక్, ధర్మిణి బాయి దంపతులకు 1739, ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. తండ్రి భీమానాయక్ ఆ తండాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. గ్రామంలో రచ్చబండపై పంచాయితీ తీర్పులు ఇచ్చేవారు. అ కట్టను భీమానాయక్ కట్టగా పిలుస్తుంటారు. ఈ కట్టకు ఎదురుగా ఉన్న బావిలో అక్కమ్మ దేవతలు స్నానం చేసేవారని, దీంతో ఆ బావిని పవిత్ర ‘కాళోకుండ్’గా పిలుస్తుంటారు. ఈ బావిలోనే సేవాలాల్ మహరాజ్ అప్పట్లో స్నానం ఆచరించి, భీమానాయక్ కట్టపై కూర్చొని తన ఆధ్యాత్మిక బోధనలతో బంజారాల్లో చైతన్యం తీసుకువచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ కాళోకుండ్ దగ్గరలో రూ.1.2కోట్లతో దండం మోరో మాత (మారెమ్మ దేవత) ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని విద్యలూ నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమైన సేవాలాల్.. తన ఆధ్యాత్మిక బోధనలతో జాతిని ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఇందులో ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. దేశంలోనే అరుదైన ఆలయం దాదాపు పాతిక సంత్సరాల క్రితం వరకూ సేవాగఢ్ ప్రాంతం నిర్జనమైన కొండ గుట్టలతో నిండి ఉండేది. చారిత్రక ఆధారాలను పరిశీలించిన అనంతరం రూ. కోటి వ్యయంతో అక్కడ సేవాలాల్ ఆలయాన్ని బంజారా నాయకుడు రంజిత్ నాయక్ నిర్మించారు. ఆలయ నిర్మాణానికి బంజారాలను ఏకం చేసి విరాళాలు సేకరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఓ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. 2000 సంవత్సరంలో మొట్టమొదటి సారి సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బంజారాలు పాల్గొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సేవాలాల్ మహరాజ్ ఆలయ పరిసరాల్లోనే రూ.1.2కోట్లతో మారెమ్మ (మాతా జగదాంబ) ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి ఇలా చేరుకోవచ్చు సేవాఘడ్కు గుత్తి బస్టాండ్ నుంచి నేరుగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. రైలులో గుత్తి, గుంతకల్లు స్టేషన్లకు వచ్చిన భక్తులు ఆటోల ద్వారా బస్టాండులకు చేరుకొని ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో ప్రయాణించేవారు గుత్తి–గుంతకల్లు మార్గంలో గొల్లలదొడ్డి క్రాస్ నుంచి లోపలకు మూడు కిలోమీటర్ల దూరం వెళితే సేవాలాల్ ఆలయం వస్తుంది. భారతదేశంలోనే ఏకై క ఆలయం ‘సేవాగఢ్’ నాడు కొండ గుట్టల ప్రాంతం.. నేడు పుణ్య క్షేత్రం సేవాగఢ్లో 13 నుంచి జయంత్యుత్సవాలు -
మెళకువలు పాటించాలి
పిందె పరిమాణం నుంచి అభివృద్ధి సమయంలో మెలకువలు పాటించాలి. పదిహేనేళ్లకు పైన ఉన్న చెట్లపై 500 గ్రాముల యూరియాతో పాటు 1–15 కిలోల పొటాషియం చొప్పున వేస్తే పిందె అభివృద్ధి చెంది వాతావరణ మార్పులను తట్టుకుంటుంది. ఇరవై ఏళ్లు దాటిన తోటల్లో నీటి సౌకర్యం లేనప్పుడు పిందె పరిమాణం బాగా పెరిగిన అనంతరం లీటరు నీటికి 100 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే మేలు. – డాక్టర్ ఈ చండ్రాయుడు, కేవీకే కో ఆర్డినేటర్ -
ప్రైవేటు క్లినిక్లలో ఆకస్మిక తనిఖీలు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని పలు ప్రైవేటు క్లినిక్లలో శనివారం సాయంత్రం జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బృందంలోని ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్కుమార్, తహసీల్దార్ సురేష్బాబు, ఎస్ఐ ఉమాదేవి, డాక్టర్ సురేష్, వీఆర్ఓ రవిశేఖర్రెడ్డిలు క్లినిక్లలో రోగులకు అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి రోగులకు చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించి క్లినిక్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు ప్రైవేటు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. క్లినిక్లలో ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలని, ఎలాంటి ఇంజెక్షన్లు, సైలెన్ బాటిళ్లు, స్టెరాయిడ్లు రోగులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు ప్రైవేటు క్లినిక్ నిర్వాహకులు చికిత్సా కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయారు. మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలకు తాళం.. చెన్నేకొత్తపల్లి: నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలకు శనివారం అధికారులు తాళాలు వేశారు. మండల కేంద్రంలోని పలు ఆర్ఎంపీ కేంద్రాలను తహసీల్దార్ సురేష్కుమార్, ఎంపీడీఓ బాలక్రిష్ణుడు, వైద్యాధికారి డాక్టర్ రవినాయక్, ఎస్ఐ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు తేలడంతో ఆయా కేంద్రాల నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. కేంద్రాల్లో కేవలం ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వాసుపత్రులకు పంపాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మూడు కేంద్రాలకు తాళాలు వేశారు. కాగా, తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు ఆర్ఎంపీలు కేంద్రాలకు తాళం వేసి వెళ్లిపోవడం గమనార్హం. -
21 నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవ పోస్టర్లు, బ్రోచర్లను శనివారం గవిమఠం ఆవరణలో పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం ఇన్చార్జ్ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 26న స్వామి వారి మహారథోత్సవం, 27న లంకాదహనం ఉంటాయన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్గౌడ్, పాటిల్ రాజశేఖర్, మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం
పుట్టపర్తి: బుక్కపట్నం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలో కొండలో వెలసిన చెన్నకేశవ స్వామి తడక మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం తరుగు వంశీయులు తీసుకొచ్చిన తడకను స్వామి వారి ఆలయంపై కప్పారు. అనంతరం తరుగు వంశీయులు వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. కిక్కిరిసిన చండ్రాయునికొండ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయానికి చేరుకునేందుకు నూతనంగా రోడ్డు వేసింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు దారి మధ్యలో భక్తుల సౌకర్యార్థం తాగునీటిని ఏర్పాటు చేశారు. -
నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు
బత్తలపల్లి: నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని విశ్వదీప సేవా సంఘం సభ్యులు అన్నారు. మండల కేంద్రమైన బత్తలపల్లి ఓసీ కాలనీకి చెందిన పల్లపోతుల రామలక్ష్మమ్మ (78) శనివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణంలోని విశ్వదీప సేవా సంఘం సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారుడు గణేష్ (గణేష్ సిమెంట్ బ్రిక్స్), కోడలు శ్రీలక్ష్మీ, మనవ రాళ్లు సుస్మిత, దీక్షిత, కుమార్తె సుగుణమ్మ, అల్లుడు కృష్ణప్ప, స్టోర్ ప్రకాష్, పి.గోపాల్ అంగీకారంతో అనంతపురం రెడ్క్రాస్ డీవై కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ జి.రాఘవేంద్ర రామలక్ష్మమ్మ కంటి కార్నియా సేకరించారు. కుటుంబ సభ్యులకు విశ్వదీప సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంఘం ఫౌండర్ కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మరణించిన మనిషి మన మధ్య లేకపోయినా వారి నేత్రాలు జీవించి ఉంటాయన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్, కార్యదర్శి జూజారు రఘు, టి.చంద్రశేఖర్రెడ్డి, ధనుంజయ, సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్కు ఎంపిక గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జ్యోతి అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 2వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయస్థాయి 7వ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో (40 సంవత్సరాల వయస్సు పైబడిన) జ్యోతి 800 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్లో ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం గోపాల్రెడ్డి, పీడీ ఎంకె.రాజేష్ తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో గుంతకల్లు ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, డీ.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాల్లు పాల్గొని జ్యోతిని అభినందించారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన ఆమె త్వరలో జరగబోయే అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎంఈఓలు, హెచ్ఎం పేర్కొన్నారు. -
ప్రకృతి వ్యవసాయం సూపర్
బత్తలపల్లి: ప్రకృతి సాగు విధానం చాలా బాగుందని ఫ్రాన్స్ దేశస్తులు కితాబిచ్చారు. శనివారం బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఫ్రాన్స్కు చెందిన సీనియర్ ఎకానమిస్ట్ డాక్టర్ బ్రునో డోరియన్, పీహెచ్డీ పరిశోధకురాలు మిస్ క్యారీ లేపాల్ట్లు సర్వే నిర్వహించారు. సీఆర్పీలతో ఏటీఎం మోడల్, ఏ–గ్రేడ్ మోడల్, సీఎండీఎస్ మోడల్స్ చూశారు. చాంపి యన్ రైతులు, నూతనంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు, రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంతకు ముందు ఫ్రాన్స్ దేశస్తులను గ్రామస్తులు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఊరేగించారు. గురజాల అప్పస్వామి దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మానాయక్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నవీన్, మాస్టర్ ట్రైనర్ హరికుమార్, డివిజన్ ఇన్చార్జ్ గంగమ్మ, ఎల్1 నరసింహులు, ఎల్2 పార్వతి, ఎన్ఎఫ్ఐలు, ఎల్3లు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ దేశస్తుల కితాబు -
కీలక దశ.. మెళకువలతో లాభాల దిశ
కళ్యాణదుర్గం: ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చింది. ఈ సమయంలో దిగుబడి పెంచుకోవడానికి కొన్ని మెళకువలు పాటిస్తే గణనీయమైన లాభాలు సాధించవచ్చు. కొమ్మలకు పూత వచ్చే ప్రస్తుత సమయంలో వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సమయాల్లో పూత వచ్చినప్పటికీ అది ముడుచుకుని పోయే ప్రమాదం ఉంది. సీజనల్ పూత పూర్తిగా రాకపోవడం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాప్టలిస్ అసిటిక్ ఆమ్లాన్ని స్పిరిట్లో కరిగించి ఆ తర్వాత మంచినీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. కొమ్మలకు పూత సాగి పూలు విచ్చుకుని పిందెకట్టే అవకాశం అధికంగా ఉంటుంది. సాగునీటి యాజమాన్యం... మామిడి పూత సమయంలో తోటలకు నీటి తడులు చాలా అవసరం. పూత,మొగ్గ బయట పడే సమయంలో మామిడి తోటలకు తప్పనిసరిగా నీటిని అందించాల్సి ఉంటుంది. వేళ్ల నుంచి చివర కొమ్మ వరకు తడి అందేలా చేస్తే అన్ని కొమ్మలకు పూత సాగే అవకాశం ఉంటుంది. నీటిని అందించే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పదిహేనేళ్లు దాటని తోటలకు ఒక్కసారి (బాగా తేలిక నేలలైతే), వారం రోజుల తర్వాత మరోసారి సాగునీరు అందించాలి. లేదంటే డ్రిప్ ద్వారా వారం రోజుల పాటు నీరు అందిస్తే ప్రయోజనం ఉంటుంది. పిందె దశలో.. రబీలో ఆలస్యంగా కోతకు వచ్చే రకాల చెట్టుపై హోర్మోనులను పిచికారీ చేస్తే పూత, పిందె రాలడం బాగా తగ్గుతుంది. తెల్లపూత, జొన్న గింజ, పరిమాణంలో పిందెలు ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో 4 గ్రాముల నాప్టలీన్ అసిటెక్ ఆమ్లం, దీనికి తోడు 400 గ్రాముల బోరాన్ కలిపి పూతపై పడేలా పిచికారి చేసుకోవడం వల్ల పిందెకట్టే సమయంలో రాలడాన్ని నివారించవచ్చు. కాయ దశకు వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో పూతపై మాత్రమే తుంపర్లు పడే విధంగా జాగ్రత్తలు వహించడంతో పాటు పిందె పరిమాణం పెరుగుతన్న సమయంలో కూడా నీటిని అదించడం మొదళ్లలో తడి ఆరకుండా చూడాలి. పూత దశలో మామిడి తోటలు యాజమాన్యం పాటించాలని అధికారుల సూచనలు -
బాల్య వివాహాలను అరికట్టాలి
● కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు ● బాల్య వివాహముక్తి రథయాత్రకు శ్రీకారం ప్రశాంతి నిలయం: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలపై కలిగే అనర్థాలు వివరించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సమత స్వచ్ఛంద సంస్థ 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శనివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2030 నాటికి భారత్ను బాల్య వివాహాలు లేని దేశంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ప్రచార జాతాలో భాగంగా బాల్య వివాహాల చట్టం 2006 గురించి, శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బంది సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ (1098)కు, పోలీసులకు (112) ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ ఇందిర, సమత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఆదినారాయణరెడ్డి, బాలల పరిరక్షణ అధికారి మహేష్, సెక్రెటరీ వెంకటేషు, మనోహర్, ఉమా శంకర్రెడ్డి, సునీత, శారద, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం 1,210 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,020 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. అలాగే 9వ తరగతిలో ప్రవేశం కోసం 828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన వెల్లడించారు. -
పేకాట రాయుళ్ల అరెస్ట్
ముదిగుబ్బ: ముదిగుబ్బలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 17 మందిని శనివారం ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆదేశాల మేరకు సీఐ శివరాముడు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 86,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హేమంత్కుమార్ హెచ్చరించారు. మద్యం మత్తులో సొంతింటికే నిప్పు ముదిగుబ్బ: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన ఘన కార్యంతో అతని సొంతిల్లే దగ్ధమైంది. వివరాలు.. మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన చాకలి నారాయణస్వామి మద్యానికి బానిసయ్యాడు. పూటుగా తాగి శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అతను ఇంట్లో దుస్తులకు నిప్పు పెట్టాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు వెంటనే స్పందించి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ హిందూపురం టౌన్: హజ్ యాత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, జిల్లా నుంచి మక్కా సందర్శించే వారి యాత్ర క్షేమదాయకం కావాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఫైరోజా బేగం అన్నారు. జిల్లా నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న 161 మంది యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం పట్టణంలో నిర్వహించారు. హిందూపురం ప్రాంతం నుంచి 110 మంది యాత్రికులు హజ్కు వెళ్తున్నారని నిర్వాహకులు చెప్పారు. యాత్రికులు విదేశీ పర్యటనలో ఆయా దేశాలకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే తెలియజేయాలని, అక్కడికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మంజువాణి, డీఐఓ డాక్టర్ సురేషబాబు, వైద్యాధికారి డాక్టర్ కేసీకే నాయక్, వైద్యులు కిరణ్మయి, ఉషారాణి, హజ్ కమిటీ నూరుద్దీన్, వైద్య సిబ్బంది వన్నప్ప, ముస్తఫా, రమేష్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య హిందూపురం: స్థానిక కొట్నూరు–కగ్గల్లు రైల్వేగేట్ వద్ద శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం పొందినట్లు రైల్వే హెచ్సీ ఎర్రిస్వామి తెలిపారు. మృతుడు ఎరుపు, తెలుపు రంగు షర్టు, నీలం రంగు చెక్స్ లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. సమాచారం తెలిసిన వారు హిందూపురం రైల్వే పోలీసు స్టేషన్ నం. 94412 38182, 91820 19510కు తెలియజేయాలని కోరారు. బీటెక్ విద్యార్థి బలవన్మరణం గార్లదిన్నె: బీటెక్ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని కమలాపురంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. కమలాపురం గ్రామానికి చెందిన చింతబరరెడ్డి, జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి (21) బెంగళూరులో గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. శ్రీకర్ రెడ్డి మొదటి, ద్వితీయ సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. తోటి స్నేహితులు పాస్ కావడం, ఫైనల్ ఇయర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యం బాధపడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలో శనివారం తమ వ్యవసాయ తోటలో చీనీ చెట్లకు మందు పిచికారీ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన శ్రీకర్ రెడ్డి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పేదింట క్రీడా ఆణిముత్యం
తాడిమర్రి:పేదింట క్రీడా ఆణిముత్యం మెరిసింది. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. వివరాలు.. తాడిమర్రి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన మందల ఈరప్ప, శివమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె పావని బీఎస్సీ వరకు చదివింది. పావని ఒకవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాణిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాల స్థాయి నుంచి తాను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటిన పావని 2015లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్కి ఎంపికై ంది. 2016లో శ్రీకాకుళంలో సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొంది. 2017లో సీనియర్ విభాగంలో కర్నూల్, 2018లో గుంటూరులో జరిగిన సీనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడింది. ఆటకు విరామమిచ్చినా.. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరడంతో నాలుగేళ్లు విరామం తీసుకున్న అనంతరం తిరిగి ఆట ప్రారంభించిన పావని రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా తరఫున సీనియర్ విభాగంలో జరిగిన రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎంపికైంది. 2025–2026లో ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికై ంది. తమిళనాడులోని దిండిగల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఉత్తమ ఆటతీరుతో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి 5 వరకు నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ టెస్టు సిరీస్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించింది. బంగారు పతకం సాధించి దేశం మొత్తం గర్వించేలా చేసింది. ఇప్పటివరకూ పావని 11 సార్లు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు, 3 సార్లు జాతీయ స్థాయి టోర్నమెంట్లు, ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి ఆత్మకూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గ్రామస్తులు పావనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో దూసుకెళ్తున్న పావని అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం అత్యుత్తమ ఆటతో జిల్లాకు ఖ్యాతి అసోసియేషన్ పెద్దల ప్రోత్సాహంతోనే మాది చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. నాతో పాటు, నా చెల్లెల చదువుల కోసం మా తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. స్కూల్ గేమ్స్లో చక్కటి ఆటతీరు చూపుతున్న నాపై అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాజారామ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విజయ శంకర్రెడ్డి, బాలాజీ, ఉపాధ్యక్షులు గౌస్మొహిద్దీన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరయ్య, వెంకటేష్ నమ్మకం ఉంచారు. ముందుండి ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించారు. ప్రభుత్వం చేయూతనిస్తే మరింతగా రాణిస్తాననే నమ్మకముంది. – పావని -
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పుట్టపర్తి అర్బన్: పదో తరగతిలో ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం ఆయన పుట్టపర్తి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఫలితాల మెరుగునకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసే క్లాసులకు విద్యార్థులందరూ హాజరు కావాలన్నారు. ఏదైనా కారణం చేత పాఠశాలకు రాలేని విద్యార్థులు సమీపంలోని హాస్టళ్లకు అనుసంధానించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలన్నారు. పారిశుధ్యం మెరుగుపరచాలి ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణం, పట్టణ మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం మెరుగునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో డోర్ టు డోర్ చెత్తసేకరణ వందశాతం జరగాలన్నారు. వ్యర్థాలు వేరు చేసి తరలించడం, ప్రాసెసింగ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోనూ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. టిడ్కో కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు 4,176 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ధ్రువీకరించాలన్నారు. మున్సిపాలిటీలోని వీధి దీపాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, డీఈఈలు, టిడ్కో అధికారులు హాజరయ్యారు. గుండెపోటుతో హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మృతి పుట్టపర్తి: బుక్కపట్నం మండలం గూనిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పి.శ్రీనివాసరెడ్డి (57) గుండె పోటుతో శనివారం మృతి చెందారు. విధుల్లో ఉన్న సమయంలోనే ఆయకు ఛాతీలో నొప్పి రావడంతో ఎంఈఓ గోపాల్ నాయక్ హుటాహుటీన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. సౌమ్యుడు, అంకిత భావంతో పనిచేసే శ్రీనివాసరెడ్డి ఆకస్మిక మృతితో స్వగ్రామం ఎనుములపల్లిలో విషాదం నెలకొంది. ఆయన భార్య రాధిక బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి అనేక ఏళ్లుగా సర్పంచుగా సేవలందించి గుర్తింపు పొందారు. అలాగే శ్రీనివాసరెడ్డి చిన్నాన్న రమణారెడ్డి ఎస్కేయూ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా పని చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
ఫైవ్మెన్ కమిటీ పెత్తనమేంటి?
పరిగి: ‘‘ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నియమించిన ఐదుగురు సభ్యుల (ఫైవ్మెన్) కమిటీ పెత్తనమేంటి.. ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాన్ని వారికి ఎవరిచ్చారు. అసలు ఫైవ్మెన్ కమిటీని ఎవరు ఎన్నుకున్నారు. ఆ కమిటీతో ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీలకు గౌరవం కొరవడింది. అధికారులు కూడా ప్రొటోకాల్ పాటించకుండా ఆ కమిటీ సభ్యులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. క్షమించరాని నేరం’’ అంటూ పరిగి మండల సభలో ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ సవిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రారంభమైన పది నిమిషాలలోపే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. టీడీపీ ఫైవ్ మెన్ కమిటీ గురించి ఎంపీటీసీ మారుతి ప్రస్తావిస్తూ.. వారి పెత్తనంపై నిలదీయగా.. మిగతా సభ్యులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా ఎంపీటీసీలు సభ నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం అధికారులు సభ్యులకు నచ్చజెప్పడంతో పాటు ఎంపీపీ సవిత జోక్యంతో సమావేశం పునఃప్రారంభమైంది. బిల్లులు మంజూరు టీడీపీ సర్పంచులకేనా? పంచాయతీలకు ఉన్న అధికారాన్ని విస్మరించి టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న సర్పంచ్లకు మాత్రమే అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయడంపై సభ్యులు మండిపడ్డారు. మండలంలోని 14 పంచాయతీల్లో కేవలం బీచిగానిపల్లి పంచాయతీకి మాత్రమే బిల్లులు మంజూరు చేయడంపై అభ్యంతం తెలిపారు. బిల్లుల మంజూరులో డిప్యూటీ ఎంపీడీఓ అవలంబిస్తున్న ధోరణి సరికాదన్నారు. మంత్రి సవిత ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ... పదవికి రాజీనామా చేసి పచ్చకండువా కప్పుకోవాలన్నారు. వచ్చేవారంలో బిల్లులు మంజూరు చేయకపోతే కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో తహసీల్దారు, ఎంపీడీఓ స్పందించారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు లేనట్టేనా? రైతులకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక కనీసం కూలీ ఖర్చులు సైతం రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 5 కిలోల మొక్కజొన్న విత్తనాలు రూ.1,500 ఉంటే, రైతులు పండించిన పంట వంద కేజీలు రూ.1,500 పలకడం దారుణమన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, ఎంపీడీఓ రెడ్డెప్ప, వైస్ ఎంపీపీలు వేదవతి, శకుంతలమ్మ, జెడ్పీటీసీ శ్రీరామప్ప, మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పరిగి మండల సభలో సభ్యుల నిలదీత ప్రొటోకాల్ పాటించని అధికారులపై ఆగ్రహం ఎంపీపీ జోక్యంతో కొనసాగిన సమావేశం -
చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా..
హిందూపురం అల్లకల్లోలంగా మారింది. నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో సామాన్య జనం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. వివిధ కేసుల్లో ఉన్న వారు బెయిల్పై బయటకు వచ్చి దర్జాగా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం క్రిమినల్స్కు అడ్డాగా మారింది. అత్యాచారాలు, రాబరీలు, హత్యలు, హత్యాయత్నాలు, గూండాయిజం పెరిగిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఎస్పీ సతీష్కుమార్ జిల్లాకు వచ్చిన తర్వాత నేరాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ హిందూపురం నియోజకవర్గ పరిస్థితి మాత్రం మారలేదు. నిఘా వైఫల్యమే కారణమా? అధికార పార్టీ నాయకుల చేతుల్లో పోలీసులు కీలు బొమ్మల్లా మారడంతోనే హిందూపురంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్న విమర్శలున్నాయి. దీనికి తోడు పోలీసులు కూడా నిఘా పెట్టడంలో విఫలమయ్యారన్న వాదనలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టడంతో నేరాల తీవ్రత తక్కువగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. పోలీసులు... టీడీపీ నేతల ధాటికి తట్టుకోలేకపోవడం, పోలీసుల నిఘా లేదన్న సంకేతాన్ని గుర్తించడం కారణంగా రౌడీమూకలు, దొంగలు రెచ్చిపోతున్నారని అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం ధ్వంసం.. గతేడాది నవంబర్ 15న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద వందల మంది టీడీపీ నాయకులు , కార్యకర్తలు చేరుకొని బీభత్సం సృష్టించారు. చైర్లు, భవనం అద్దాలు, కంప్యూటర్లను పగలగొట్టారు. పోలీసుస్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక నుంచి రౌడీషీటర్లు.. హిందూపురం పట్టణం రాష్ట్ర సరిహద్దులో ఉంది. దీంతో కర్ణాటక రాష్ట్రం సరిహద్దు పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లు యథేచ్ఛగా జిల్లాలో సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. పోలీసుల నిఘా కొరవడటంతోనే జిల్లాలో సెటిల్మెంట్లు , దాడులకు యత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో తరచూ జరుగుతున్న పరిణామాలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితులున్నాయి. కనీసం ఇప్పటికై నా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండి లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన నెల రోజులకే హిందూపురం రూరల్ మండలంలోని గొళ్లాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ సతీష్ను టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. 2024లోనే చిలమత్తూరు మండలంలోని టేకులోడు పంచాయతీ నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తా కోడళ్లను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. 2025లో దొంగలు యథేచ్చగా రాబరీలకు తెగబడ్డారు. గన్స్, కత్తులు చూపించి హిందూపురం రూరల్ మండలం కిరికెర సమీపంలో ఓ ఇంట్లో దోపిడీ చేశారు. అదే సంవత్సరం జూలైలో హిందూపురం రూరల్ మండలంలోని తూముకుంట ఎస్బీఐ రాబరీ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లేపాక్షి మండలంలోని మైదుగోళంలో ఓ వ్యక్తి తలను వేరుచేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసులతో పాటు సామాన్యులను కూడా బెంబేలెత్తించింది. చిలమత్తూరు మండలంలో టీడీపీ నేతల దాష్టీకాలకు అంతే లేకుండా పోయింది. గతేడాది ఆగష్టులో ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసి ఆయనపై దాడి చేయడం, ఆయన తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు బాబూరెడ్డి పై గతంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. నిందితుడికి టీడీపీ నేత నాగరాజు యాదవ్ అనుకూలంగా ఉండటంతో బాబూరెడ్డిని కనీసం పోలీసులు అరెస్ట్ కూడా చేయలేకపోయారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో చోరీలు జరిగాయి. హుండీల్లోని డబ్బులను దుండగులు దోచుకెళ్లారు. అంతకంతకూ పెరిగిపోతున్న నేరాలు సెటిల్మెంట్లు, హత్యలు, దొంగతనాలతో ప్రజల బెంబేలు పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న వైనం ఖాకీలు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మల్లా మారడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయంటున్న ప్రజలు పోలీసులపైనే దాడి.. 2024 అక్టోబర్లో చిలమత్తూరు మండలం టేకులోడు సమీపంలో జరిగిన అత్తా కోడళ్లపై అత్యాచారంలో ప్రధాన నిందితుడు కావడి నాగేంద్ర శుక్రవారం ఉదయం కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచడం సంచలనం రేపింది. 70కి పైగా కేసులు ఉన్న నిందితుడు తప్పించుకుని తిరుగుతూ అఘాయిత్యాలు కొనసాగిస్తున్న తరుణంలో పోలీసులు బృందాలుగా విడిపోయి చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీప్రాంతం కనుమ వద్ద నాగేంద్ర ఉన్నాడన్న సమాచారంతో వెళ్లగా కానిస్టేబుల్తో పాటు సీఐ ఆంజనేయులపై నిందితుడు దాడి చేసి గాయపరిచాడు. అయితే సీఐ కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులపైనే దాడి చేసి గాయపరిచిన నిందితుడికి పట్టణంలోని పోలీసు సిబ్బంది నిరంతరాయం సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
ఎల్పీఎం సమస్యలను పరిష్కరిస్తాం
నల్లచెరువు: మండలంలో రీ సర్వే పూర్తయిన పంతులచెరువు, తవళంమర్రి గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. జాయింట్ ఎల్పీఎంలు ఉన్న రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎల్పీఎంలను విభజించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే పట్టాదారు పాస్బుక్లకు సంబంధించి జరుగుతున్న ఈ–కేవైసీ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలిచారు. కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
పుట్టపర్తి అర్బన్: గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి మొక్కజొన్న పంట దగ్ధమైంది. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు మురళి, శివప్ప, అంజి తదితరులు చిత్రావతి సమీపంలోని వేంకటేశ్వరస్వామి కొండ సమీపంలో సుమారు 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు రాజేయడంతో మంటలు వ్యాపించి సుమారు రెండు ఎకరాల్లోని పంట మొత్తం కాలిపోయింది. చుట్టుపక్కల రైతులు స్పేయర్లను ఉపయోగించి నీటిని పిచికారీ చేస్తూ మంటలను అదుపు చేశారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. బోర్వెల్ రాడ్ పడి వ్యక్తి మృతి బ్రహ్మసముద్రం : బోర్వెల్ రాడ్ తలపై పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకలి రామన్న పొలంలో గురువారం అర్ధరాత్రి బోర్ వేస్తుండగా పలువురు గ్రామస్తులు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బోర్వెల్ హైడ్రాలిక్ రాడ్ ఉన్నఫళంగా జారి అక్కడే ఉన్న గొల్ల అజ్జప్ప(45) తలపై పడింది. ఘటనలో అజ్జప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. ముగిసిన రీసెర్చ్ అడ్మిషన్ల ఇంటర్వ్యూలు అనంతపురం: ఈ నెల 2వ తేదీ నుంచి జేఎన్టీయూ (ఏ)లో చేపట్టిన రీసెర్చ్ అడ్మిషన్ల ఇంటర్వ్యూలు శుక్రవారం ముగిశాయి. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో నలుగురు, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం నుంచి 136 మంది, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ విభాగం నుంచి 103 మంది, ఎకనమిక్స్ విభాగంలో 31 మంది, ఈఈఈ విభాగంలో 139 మంది అభ్యర్థులు హాజరు కాగా, జేఎన్టీయూ (ఏ) వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల ప్రక్రియ సజావుగా జరిగినట్లు డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఎ.సురేష్బాబు వెల్లడించారు. మళ్లీ చిరుత కలకలం బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని సంజీవపురంలో మరోసారి చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళపై 3 రోజుల క్రితం చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ శుక్రవారం చిరుత ప్రత్యక్షం కావడం గమనార్హం. అయితే చిరుతను చూసిన గ్రామానికి చెందిన యువకులు రాళ్లు, కర్రలతో దాన్ని వెంబడించగా.. హెచ్ఎల్సీ వైపు పారిపోయింది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రమూ సహాయక చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు అడ్డుకున్న కాలనీ వాసులు కనగానపల్లి: మండలంలోని తూంచర్ల గ్రామంలో శుక్రవారం తారురోడ్డు పనులను స్థానిక ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. అనంతపురం నుంచి తూంచర్ల మీదుగా తగరకుంట వైపు తారురోడ్డు పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ రోడ్డును స్థానిక టీడీపీ నేత పొలాల వైపు నుంచి కాకుండా కాలనీ వైపు మళ్లించారు. ఇందు కోసం కాలనీలోని మరుగుదొడ్లను తొలగించడంతో పలువురు దళితులు ఆందోళన చేపట్టి అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే. దీంతో సర్వే అనంతరం రహదారి కొలతలు నిర్ధారించి రోడ్డు వేయాలని భావించారు. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి శుక్రవారం పనులు కొనసాగిస్తుండడంతో ఎస్సీ కాలనీ వాసులు అక్కమ్మ, లక్ష్మీదేవి, పార్వతమ్మ, నాగన్న, నల్లప్ప తదితరులు అడ్డుకున్నారు. -
సేవాలాల్ జయంత్యుత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు గుత్తి మండలం సేవాఘడ్లో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం అదనపు బస్సులు నడపాలన్నారు. సేవాఘడ్ వద్ద స్టాపింగ్ సదుపాయం కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాలు, కనీస వసతులు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి వేడుకలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గుంతకల్లు ఆర్డీఓ ఏబీవీఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, ట్రస్ట్ అధ్యక్షుడు కేశవనాయక్, కార్యదర్శి అశ్వర్థనాయక్, ప్రతినిధులు బాలనాయక్, డీఎల్డీఓ విజయలక్ష్మి, గుత్తి, గుంతకల్లు తహసీల్దారు పుణ్యవతి, రమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జేసీ విష్ణు చరణ్ -
రైతులు ఫిర్యాదు చేస్తే లైసెన్స్ రద్దు
● వ్యవసాయశాఖ జేడీ కృష్ణయ్య ఓడీచెరువు: ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై రైతులు ఫిర్యాదు చేస్తే ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కృష్ణయ్య హెచ్చరించారు. మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర, బాలాజీ ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువులు, పురుగు మందుల రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, ధరల పట్టిక కచ్చితంగా బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ సనావుల్లా, కదిరి ఏఓ శ్రీహరినాయక్ పాల్గొన్నారు. నేడు 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష లేపాక్షి: లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పట్టణంలో అజిజీయ, ఎంజీఎం, ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలకు 1205 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయం, ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డులతో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంతినిలయం: తనకల్లు మండలంలో ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఖాళీ సీట్లకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. 2026–27 సంవత్సరానికి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 80 సీట్లు ఉన్నాయని, అందులో ఎస్టీ 60, ఎస్సీ 10, బీసీ 4, ఓసీ 2, పీహెచ్సీలకు 2, ఏఈక్యూ 2 సీట్లు ఉన్నాయన్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల 28 వరకూ ఉంటుందన్నారు. ఏప్రిల్ 4న రాత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ప్రిన్సిపాల్ ఫోన్ నంబర్ 8500941752, 8333807978ను సంప్రదించాలన్నారు. ఇంటర్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోండి ప్రశాంతినిలయం: తనకల్లు మండలంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు(బాలికలు) దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గిరిజన బాలికలు ఈనెల 9 నుంచి మార్చి 4వ తేదీ లోపు దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మార్చి 8న ఉదయం 11 గంటలకు ఉంటుందన్నారు. 11న పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్మేళా ధర్మవరం అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈనెల 11న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు హైదరాబాద్, బెంగళూరు, కడప, పెనుకొండ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికెట్లతో ఆ రోజు ఉదయం 9 గంటలకు పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ రేపు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభ ఈ నెల 8న (ఆదివారం) ఉదయం 9 గంటలకు అనంతపురంలోని డీఎంహెచ్ఓ కమిటీ హాలులో నిర్వహించనున్నట్లు ఏపీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సి.వరప్రసాద్, రాఘవేంద్ర, శివానంద, సిద్ధయ్య, సాకే చంద్ర, రామకృష్ణ, కిరణ్యాదవ్, బి.మహేంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను శుక్రవారం అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) వారు విడుదల చేసి, మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంస్థాగతంగా సంఘం బలోపేతం లక్ష్యంగా మహాజనసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి నెలా రెండో శనివారం ‘హలో ఔట్సోర్సింగ్ ఏపీ’ పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర నాయకులు, జేఏసీ నేతలు హాజరుకానున్న మహాజనసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఆర్డర్ ఇస్తే .. కొట్టుకొచ్చేస్తారు !
ధర్మవరం అర్బన్: ఎవరైనా కొత్త బైక్పై మోజు పడితే షోరూంలలో కొనుగోలు చేస్తారు. అయితే కోరుకున్న బైక్ను క్షణాల్లో అపహరించి తెచ్చిచ్చి సొమ్ము చేసుకునే ఘటన ధర్మవరంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా... వివరాలను ధర్మవరం రెండో పట్టణ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రెడ్డప్పతో కలసి డీఎస్పీ హేమంత్ కుమార్ వెల్లడించారు. ధర్మవరానికి చెందిన అనంత బాబు, ఇదే పట్టణంలోని ఇందిరానగర్ నివాసి సాకే మల్లికార్జున, ముదిగుబ్బ ఓల్డ్టౌన్లో నివాసముంటున్న మద్దినేని నాగరాజు ఓ ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే తమ వద్ద ద్విచక్ర వాహనాలు ఉన్నాయని గ్రామీణులకు నమ్మబలికేవారు. ఏ కంపెనీ బైక్ కావాలన్నా.. ఏ మోడల్దైనా ముందుగా ఆర్డర్ తీసుకుని ఆ బైకును అపహరించి తక్కువ ధరకే విక్రయించేవారు. ధర్మవరం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, హిందూపురం, అనంతపురం, తాడిమర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల ద్విచక్ర వాహనాల అపహరణలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టూ టౌన్ సీఐ రెడ్డప్ప నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్యార్డు సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సాకే మల్లికార్జున, మద్దినేని నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాల అపహరణలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అనంతబాబు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. ఇద్దరు బైకు దొంగల అరెస్ట్ 12 ద్విచక్ర వాహనాల స్వాధీనం పరారీలో ప్రధాన నిందితుడు -
క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు
● రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ గుత్తి: రాయలసీమ డయాసిస్ పరిధిలో ఉన్న క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ తెలిపారు. గుత్తి సీఎస్ఐ చర్చిలో పాస్టర్లు, క్రైస్తవ సంఘం సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమై మాట్లాడారు. క్రైస్తవ మిషనరీ ఆస్తులను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే , ఇతర ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను బిషప్తో పాటు క్రైస్తవ సంఘం పెద్దలు, పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో డివిజనల్ చైర్మన్ డేవిడ్ నాయక్, ఎంఎస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ రస్సెల్ కిరణ్, బిషప్ సతీమణి భారతి, క్రైస్తవ సంఘం సభ్యులు విజయ్కుమార్, సునీల్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడే ప్రాణాలు బలిగొంది ● వైద్యురాలి మృతిపై తల్లిదండ్రుల ఆరోపణ తలుపుల: విజయవాడలోని జీజీహెచ్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తూ బుధవారం రాత్రి మృతి చెందిన పీజీ వైద్యురాలు బత్తుల దీపిక (27) ఘటనపై తల్లిదండ్రులు బత్తుల కోదండ రామిరెడ్డి, భారతి అనుమానాలు వ్యక్తం చేశారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే తమ కుమార్తె మృతికి కారణమంటూ ఆరోపించారు. దీపిక అమ్మమ్మ గారి ఊరైన తలుపుల మండలం మాడికవాండ్లపల్లిలో శుక్రవారం బంధుమిత్రుల మధ్య దీపిక అంత్యక్రియలు జరిగాయి. అనంతపురానికి చెందిన కోదండ రామిరెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, గైనకాలజిస్టుగా మౌనిక, అనస్థీషియా వైద్యురాలిగా దీపిక పనిచేస్తున్నారు. మౌనికకు పెళ్లి అయి పాప కూడా ఉన్నారు. పీజీ పూర్తి కాగానే దీపికకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో నిరంతరాయంగా 36 గంటల పాటు పని చేయాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయిన దీపిక చనిపోయిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. వ్యాపారం పేరుతో టోకరా బుక్కరాయసముద్రం: డబ్బు తీసుకుని కిరాణా సరుకులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను శుక్రవారం వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ఆనంద్గుప్తా బీకేఎస్లోని ముసలమ్మ కట్ట వద్ద రఘురామ ట్రేడర్స్ పేరుతో గోదాము ఏర్పాటు చేసుకుని, నగరంలోని పలు కిరాణా దుకాణాలకు సరుకులు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే శ్రీసాయి ట్రేడర్స్ పేరుతో హోల్సేల్ డీలర్ షిప్ నిర్వహిస్తున్న అనంతపురానికి చెందిన రామలక్ష్మి అరవింద్ దంపతులకు నిత్యావసర సరుకుల కోసం రూ.28.70 లక్షలను ఆనంద్గుప్తా చెల్లించాడు. అనంతరం రామలక్ష్మి దంపతులు సరుకులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిలదీస్తే అరవింద్ బెదిరింపులకు దిగాడు. ఘటనపై బాధితుడు ఆనంద్గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై పోస్టుకార్డు ఉద్యమం
ధర్మవరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లపై పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యరద్శి రమావత్ రామకృష్ణ నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో సీఎం చంద్రబాబుకు 200 పోస్టుకార్డులు పంపుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరంలోని శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై స్పందన లేకుండా పోయిందన్నారు. పలుమార్లు విన్నవించినా ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కాని చలనం లేకుండా పోయిందన్నారు. దీంతో ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. యూటీఎఫ్ పోస్ట్కార్డు ఉద్యమం ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలను తీసుకెళుతున్నట్లు వివరించారు. 12వ పీఆర్సీ నియామకం, పెండింగ్ డీఏల చెల్లింపు, 29 శాతం మధ్యంతర భృతి, ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటన, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడం, 2004 ముందు నియామకమైన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయడం తదితర సమస్యలపై పోరుబాట చేపట్టినట్లు వివరించారు. డిమాండ్లపై ఈ నెల 15వ తేదీ లోపు ప్రభుత్వం స్పందించకపోతే 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ పట్టణ గౌరవాధ్యక్షుడు కేవీ నాగిరెడ్డి, నాయకులు సాయి గణేష్, ప్రదీప్కుమార్, పాఠశాల హెచ్ఎం ఉమాపతి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జానకి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
కదిరి టౌన్: మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసులతో పాటు ఒక్కరి బాధ్యతని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. శుక్రవారం కదిరి పట్టణంలోని దత్త ఫంక్షన్హాల్ కదిరి పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘మీ భధ్రత – మా బాధ్యత ’ మహిళా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్కుమార్తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ఆడపిల్లలు బయటికి వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి వారితో కలిసి ఎక్కడికి వెళ్లకూడదన్నారు. ఐదారేళ్ల బాలికలకు చాకెట్లు ఇచ్చి వారిపై లైంగిక దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లినప్పుడు ఆడ పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో వదిలి వెళ్లాలని, అప్పుడే వారికి రక్షణ ఉంటుందన్నారు. ప్రమాదం పొంచి ఉన్న సమయంలో బాలికలు, మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు పట్టణంలో విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, మహిళా డీఎస్పీ ఇందిరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ దుర్మరణం
పెనుకొండ రూరల్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ రూరల్ పరిధిలోని అమ్మవారిపల్లికి చెందిన ఉప్పర రామాంజినమ్మ (54).. కియా పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తిగత పనిపై కియా పరిశ్రమ మెయిన్ గేట్ వద్దకు వెళ్లిన ఆమె అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపుగా వెళుతున్న వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అక్కంపల్లిలో దొంగ హల్చల్ మడకశిర: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని అక్కంపల్లిలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఓ దొంగ హల్చల్ చేశాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వీటిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రముఖ కాంట్రాక్టర్ బాబు ఇంట్లోకి చొరబడేందుకు దొంగ ప్రయత్నించాడు. అయితే ఇంటి గేట్ వద్ద ఉన్న కుక్క పసిగట్టి అరవడంతో అక్కడి నుంచి జారుకున్న దొంగ పక్కనే ఉన్న మరో ఇంటి ఆవరణలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ను అపహరించుకెళ్లాడు. శెట్టిపల్లి వద్ద కంటైనర్ బోల్తా చిలమత్తూరు: మండలంలోని కోడూరు – పుట్టపర్తి ప్రధాన రహదారిపై శెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం బోల్తా పడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. -
గొర్రె పిల్లలపై చిరుత దాడి
తనకల్లు: మండల పరిధిలోని తురకవాండ్లపల్లి సమీపంలోని సింగరాతి చెరువు వద్ద గొర్రెల మందపై శుక్రవారం చిరుత పులి దాడి చేసింది. గొర్రెల కాపరి వెంకటరమణ వివరాల మేరకు.. తురకవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ తన గొర్రెలను సమీపంలోని అడవిలోకి మేత కోసం తీసుకెళ్లాడు. అయితే గొర్రెలకు నీటిని తాగించడానికి సమీపంలోని సింగరాతి చెరువు వద్దకు తీసుకెళ్లి కొద్దిదూరంలో కూర్చున్నాడు. హఠాత్తుగా చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. రెండు గొర్రె పిల్లల గొంతులను కొరకడం చూసిన వెంకటరమణ భయాందోళనకు గురయ్యాడు. తనపై చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడి వెంటనే చెరువులోకి దూకి అటు నుంచి దగ్గర్లోని గుట్టలోకి పెద్దగా కేకలు వేసుకుంటూ వెళ్లిపోయాడు. కేకలకు భయపడిన చిరుత రెండు గొర్రె పిల్లలను అక్కడే వదిలేసి సమీపంలోని చెట్లపొదల్లోకి వెళ్లింది. సమాచారం అందుకున్న వెంకటరమణ కుమారుడు ముని, మరికొందరు గ్రామస్తులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వెంకటరమణతో పాటు గొర్రెలను ఇంటికి తీసుకెళ్లారు. ఘటనపై అటవీశాఖాధికారి గుర్రప్పను ‘సాక్షి’ వివరణ కోరగా గొర్రె పిల్లలపై చిరుత దాడి చేసినట్లు సమాచారం అందిందని, అటవీ సిబ్బంది పంపి విచారణ చేయిస్తామన్నారు. -
ఆగని గుప్త నిధుల తవ్వకాలు
పెనుకొండ: చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పెనుకొండ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దుండగులు రాత్రికి రాత్రే తవ్వకాలు చేస్తూ పురాతన భవనాలు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. పెనుకొండ కేంద్రంగా పాలన.. విజయనగర రాజులు, జైన రాజులు, చోళులు ఇతర ఎంతో మంది రాజులు పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు. పెనుకొండ ఊరువాకలి ఆంజనేయస్వామి, ఆర్డీఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో అప్పట్లో రాజులు ప్రధాన కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు దాచారన్న ప్రచారం ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది ముఠాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు. పెనుకొండ పరిసరాల్లోని గగన్మహల్, కోటగోడ, రాంబురుజులు, తిమ్మరుసు బందీఖానా, తిమ్మరుసు సమాధి, బసవణ్ణ బావి, నాగుల బావి, కొండపై ఖిల్లా, లక్ష్మీనరసింహస్వామి ఆలయం వీరణ్ణ కొండపై ఉన్న కట్టడాలు, ఇటీవల వెలుగు చూసిన వైష్ణవ ఆలయం ఇతర ఎన్నో కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే పెనుకొండ కొండ సొరంగం, గగన్మహల్ నుంచి ఉన్న రహస్య మార్గాల ద్వారా రొద్దం మండలం బొక్కసంపల్లి వద్ద సైతం గతంలో రాజులు ముస్లిం చక్రవర్తుల కంట పడకూడదని ఏనుగుల ద్వారా బంగారు, వజ్రాలు ఇతర సామగ్రిని తరలించారని ప్రచారంలో ఉంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు నిరవధికంగా ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. పెరిగిన పర్యాటకులు.. పెనుకొండకు ఇటీవల బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. సెలవులు వస్తే చాలు వాహనాలతో కొండపైకి రావడం అలవాటుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వీరణ్ణ కొండ వెనుక ప్రాంతంలో ఉన్న వైష్ణవ ఆలయాన్ని గుర్తించిన అధికారులు ఆలయం ఆవరణలో ఇష్టారాజ్యంగా నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు గుర్తించారు. పెనుకొండ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా ఇలాంటి ఘటనలపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండలో పురాతన కట్టడాల ధ్వంసం పట్టించుకోని అధికారులు, పోలీసులు కట్టడాల పరిరక్షణకు చర్యలు గుప్త నిధుల వేటగాళ్లతో పురాతన కట్టడాలు దెబ్బతింటున్న విషయం వాస్తవమే. స్థానిక పోలీసులకు తెలియజేసి తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదే విధంగా విషయాన్ని పురావస్తు శాఖ డీడీ, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. పురాతన కట్టడాల పరిరక్షణకు తగిన సిబ్బందిని నియమించి కట్టడాలను పరిరక్షిస్తాం. – స్వామినాయక్, పురావస్తుశాఖ అధికారి -
ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ
పుట్టపర్తి: ఉపాధ్యాయుల సమస్యల సెగ ఢిల్లీని తాకింది. పలు సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ సంఘం నేతలు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసినట్లు జిల్లా శాఖ అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానుజులు యాదవ్ తెలిపారు. 2010 కంటే ముందు నియామకం పొందిన 30 లక్షల మంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. లేదా పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు. నేటి నుంచి గ్రామోత్సవ్ అనంతపురం అగ్రికల్చర్: స్థానిక సాయినగర్లో ఉన్న అంబేడ్కర్ భవన్ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘అనంత గ్రామీణ మహోత్సవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డు, నేస్తం ఎన్జీఓ సంయుక్తంగా 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో వివిధ జిల్లాల నుంచి నేతన్నలు, ఎస్హెచ్జీ, రైతులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఉత్పత్తులు, ఆభరణాలు, పనిముట్ల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. నాబార్డు ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో పాటు రూడ్సెట్, గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులతో పాటు ఉమ్మడి జిల్లా రైతులు, మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలి ● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మడకశిర: పనుల్లో వేగవంతం, పారదర్శకత కోసం ఇక నుంచి ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాలను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి.. సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఫైళ్ల క్లియరెన్స్లో పారదర్శకత పాటించేందుకే ఈ– ఆఫీస్ను ప్రవేశపెట్టామన్నారు. పాత రికార్డులన్నీ భద్రపరచాలని ఆదేశించారు. కార్యాలయాల ప్రాంగణాలు, రికార్డు గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించి... నూతన కార్యాలయ ఏర్పాట్లపై సమీక్షించారు. మడకశిర రెవెన్యూ సబ్ డివిజన్కు సంబంధించిన రికార్డులన్నీ పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి మడకశిర కార్యాలయానికి వెంటనే తరలించాలని ఆర్డీఓను ఆదేశించారు. మ్యుటేషన్, డిజిటల్ రికార్డులను పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణను కూడా పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనందకుమార్, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్రూల్స్ అమలుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఈఓలు, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయాలు, డైట్ ఉద్యోగుల వర్క్షాపు గురువారం నిర్వహించారు. స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో జరిగిన వర్క్షాపును జేడీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోక్సో కేసుల్లో త్రీమెన్ కమిటీని నియమించి మూడు నెలల్లో విచారణ నివేదిక తీసుకోవాలన్నారు. క్రమశిక్షణ చర్యల కేసులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కొన్ని కేసుల్లో సస్పెన్షన్లు చేస్తున్నా...తర్వాత వాటిని రీఓక్ చేయడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదికి మించి సస్పెన్షన్లో ఉండకూడదన్నారు. కొందరు దూరప్రాంతాల్లో పని చేస్తున్న వారు కావాలనే చిన్నచిన్న తప్పులకు సస్పెన్షన్లు చేయించుకుంటున్నారన్నారు. 3–4 ఏళ్లు సస్పెన్షన్లోనే ఉంటూ అరజీతం పొందుతున్నారన్నారు. సమావేశంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా డీఈఓలు ఎం.ప్రసాద్బాబు, కిష్టప్ప, ఏడీ మునీర్ఖాన్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎరలతో పురుగులకు చెక్
పుట్టపర్తి అర్బన్: వివిధ పంటలను ఆశించే పురుగులతో రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. వాటిని అరికట్టేందుకు వేలాది రూపాయలు వెచ్చించి రసాయనిక మందులు కొనుగోలు చేసి పిచికారీ చేస్తున్నారు. దాని వలన ఆశించిన ఫలితాలు రాకపోగా భూమి కలుషితమవుతోంది. దీంతో రానురాను పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులు రసాయనిక మందులపైనే ఆధార పడకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే స్థిరమైన నాణ్యమైన ఉత్పత్తులు సాధించడానికి వీలవుతుంది. ఈ చర్యల్లో భాగంగా ఎరల వినియోగం గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బయ్య చెబుతున్నారు. లింగాకర్షక ఎరలు.. పంటలపై వాలే మగ రెక్కల పురుగులను సహజంగా ఆడ రెక్కల పురుగులు ఆకర్షిస్తాయి. దీనికి గాను ఆడ రెక్కల పురుగుల తల, రెక్కలు, కాళ్లు, జననాంగాల నుంచి కొన్ని రసాయనాలు విడుదల చేస్తాయి. ఈ రసాయనాలనే కృత్రిమంగా తయారు చేసి లింగాకర్షక ఎరలుగా రూపొందిస్తున్నారు. ఈ ఎరలు ప్రధానంగా మగ రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. వాటిని పాలిథిన్ సంచుల్లో గరాటా ఆకారపు పాత్రల్లో ఉంచి పొలం మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో కర్రలు పాతి వాటి చివరన ఎరలను ఉంచుతారు. వాటి ద్వారా మగ పురుగులు వచ్చి సంచుల్లో పడి చనిపోతాయి. వాటి సంఖ్య ఆధారంగా పురుగుల ఉధృతి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. దీపపు ఎరలు.. గొంగళి పురుగుల జాతికి చెందిన రెక్కల పురుగులు, కొన్ని రకాల పెంకు పురుగులు పంటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వాటిని నాశనం చేసేందుకు తెల్లని కాంతిని విరజిమ్మే విద్యుత్ దీపాలను రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ పొలం మధ్యలో అక్కడక్కడా ఏర్పాటు చేస్తే పురుగులు కాంతికి ఆకర్షితమవుతాయి. లైట్ల కింద క్లోరోఫైరిఫాస్, కిరోసిన్ లాంటి ద్రావణాలను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, చెరువకులో పీక పురుగు, కాండం తొలిచే పురుగు, కంది, పత్తిలో కాయతొలిచే పురుగు, వేరు పురుగు దీపపు ఎరల చేత ఆకర్షింపబడతాయి. సాగు చేసే పంటను బట్టి 1 ,2 మీటర్ల ఎత్తులో దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. దీపాల వద్దకు చేరుకోగానే రెక్కల పురుగులు విషపు ద్రావణంలో పడిచనిపోతాయి. విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసుకోలేని రైతులు రాత్రిపూట సామూహికంగా మంటలు వేస్తే రెక్కల పురుగులు అందులోపడి చనిపోతాయి. ఎర పంటలు.. పురుగుల నిర్మూలనకు ఎర పంటలు కూడా బాగా దోహదపడతాయి. పత్తిలో శనగ పచ్చ పురుగు నివారణకు బెండ, పొగాకు, లద్దె పురుగు నివారణకు ఆముదం మొక్కలు అక్కడక్కడా వేసుకోవాలి. దీంతో ప్రధాన పంటలకు పురుగు తాకిడి తగ్గుతుంది. వేరుశనగకు చుట్టూ నాలుగు సాల్లు జొన్న వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఎర పంటపైనే పురుగు మందును పిచికారీ చేసి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తద్వారా రైతులకు పెట్టుబడులు కూడా తగ్గుతాయి. పసుపు రంగు ఎరలు.. దోస, కళింగర, పత్తి, వంగ వంటి పంటలను ఆశించే తెల్లదోమ నిర్మూలనకు పసుపు రంగు ఎరలు అధికంగా ఉపయోగపడతాయి. ఈ ఎరలను ఎకరాకు పది ఏర్పాటు చేస్తే మంచిది. ఈ ఎరలకు తెల్ల దోమలు వచ్చి అతుక్కొని చనిపోతాయి. ప్రస్తుతం మామిడి, దోస, కళింగర పంటలు విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ పూత దశలోనూ, పిందె దశలో ఉన్నాయి. వాటికి పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఎరల వాడకంతో మందుల ఖర్చు తగ్గుతుంది. మామిడిలో బాటిల్లో విషద్రావణంతో ఎర ఏర్పాటు చేసిన దృశ్యంఎరకు పడి చనిపోయిన దోమలు, పురుగులు వివిధ పంటలకు పురుగులు ఆశిస్తుండటంతో తగ్గుతున్న దిగుబడి ఎరల వాడకంతో ఉత్తమ ఫలితాలు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి ఉత్తమ ఫలితాలు వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు -
గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు
అనంతపురం: గంజాయి సరఫరా, విక్రయ ముఠాలోని ఆరుగురు యువకులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం జిల్లా మొదటి సెషన్స్ కోర్టు జడ్జి సత్యవాణి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2021 జూన్ 17న అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దగ్గర ఎస్ఐ నబిరసూల్ వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక కారులో 29 కేజీల గంజాయి దొరింది. వీటిని తరలిస్తున్న అనంతపురానికి చెందిన కుంచపు వడ్డే పవన్కుమార్, గాజుల అఖిల్, ధనరాజ్, కళ్యాణదుర్గానికి చెందిన గాజుల నాగరాజు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంకు చెందిన పూల సునీల్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పల్లె వెంకట రవితేజలను అరెస్ట్ చేశారు. వీరంతా 21 నుంచి 29 ఏళ్లలోపు వయసు కలిగిన యువకులే. అప్పటి సీఐ మురళీధర్రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అనంతపురం మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు సాక్షులను జడ్జి సత్యవాణి విచారించారు. నేరం రుజువు కావడంతో అనంతపురం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్చు చెప్పారు. స్పెషల్ పీపీ లేపాక్షి నాయుడు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. పర్వతారోహకుడు ఈశ్వర్కు అభినందన మడకశిర: పట్టణానికి చెందిన పర్వతారోహకుడు, ట్రెక్కింగ్లో విశేష ప్రతిభ కనబరస్తున్న ఈశ్వర్ను గురువారం పుట్టపర్తిలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఈశ్వర్ను మడకశిర నుంచి ప్రత్యేకంగా పిలిపించుకుని కలెక్టర్ అభినందించారు. సాహస క్రీడల్లో ఈశ్వర్ రాణిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈశ్వర్ జిల్లాకే గుర్తింపు తెచ్చారని, ఇది ప్రజలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్లో మరెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారని ఈశ్వర్ తెలిపారు. యువతకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతానని ఈశ్వర్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కిషోర్ పాల్గొన్నారు. -
అండర్ –14 రాష్ట్ర జట్టుకు రోహిత్
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 రాష్ట్ర క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఎస్ మహ్మద్ షోయబ్, జట్టులో సభ్యుడిగా కే రోహిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు చైన్నెలో జరగనున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీల్లో రోహిత్ ఆంధ్ర జట్టు సభ్యుడిగా బరిలో దిగనున్నాడు. లెఫ్టార్మ్ చైనమన్ (హిందూపురం) బౌలర్గా స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్లలో 13 వికెట్లు తీసుకున్నాడు. హిందూపురం ఎంజీఎం స్కూల్లో రోహిత్ విద్యనభ్యసిస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ షోయబ్ ఏసీఏ లెవెల్ 0 క్రికెట్ కోచ్. గుంతకల్లు రైల్వే సబ్ సెంటర్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం హర్షించదగ్గ విషయమని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్రెడ్డి పేర్కొన్నారు.జాతీయ రహదారిపై లారీ దగ్ధం కనగానపల్లి: 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక లారీ టైర్ పేలడంతో మంటలు వ్యాపించి రోడ్డుపైనే లారీ దగ్ధమైంది. పోలీసుల వివరాల మేరకు... గురువారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఖాళీ అట్ట పెట్టెల వేసుకొని వెళ్తోంది. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే లారీ ముందు టైరు పేలింది. మంటలు వ్యాపించడంతో అట్ట పెట్టెలు అంటున్నాయి. లారీడ్రైవర్లు రాజేంద్రన్, వెంకట్ లారీ ఆపేసి కిందకు దిగారు. లారీ అంతా కాలిపోయింది. ఘటనతో జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాసేపటి తర్వాత పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
అరణ్యవాసా.. చెన్నకేశవా!
పుట్టపర్తి: అరణ్యాన వెలసినా... తన భక్తుల మదినే ఆవాసంగా చేసుకున్న చెన్నేకేశవ స్వామి తడకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుక్కపట్నం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ స్వామి భక్తులకు కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. శతాబ్దాల కిందట ఇక్కడ వెలసిన స్వామిని భక్తులు మల్లో చెన్నుడని, జెన్నావలప్ప అని రకరకాల పేర్లతో కొలుస్తుంటారు. ఏటా మాఘమాసంలో తరుగువాండ్లపల్లికి చెందిన తరుగు వంశీయులు ఆనవాయితీగా తడకోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ శనివారం స్వామి వారికి తడకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఇక స్వామి వెలసిన కొండ మరోభాగంలో దీపం గుండుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ గుండుపై దీపం వెలిగిస్తే సుదూరంలో ఉండే చెన్నకేశవ ఆలయంలో ఉన్నవారికి కనిపిస్తుందని ఇక్కడి వారు చెబుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆదాయం ఉన్నా దేవదాయ శాఖ అధికారులు మాత్రం ఆలయం అభివృద్ధికి గానీ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏర్పాట్లు పూర్తి.. శనివారం జరిగే తడకోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తరుగు వంశీయులు తెలిపారు. తాగునీరు, అన్నదాన ప్రసాదాలు అందించే ఏర్పాట్లు పూర్తి చేశామని, వాహనాల పార్కింగ్కు కొండపై చదును చేశామన్నారు. చండ్రాయునిపల్లి సమీపంలో వెలసిన చెన్నకేశవ స్వామి రేపు తడకోత్సవం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు -
పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
ప్రశాంతి నిలయం: జిల్లాలో పశుఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో పశుసంపద, వ్యాప్తిస్తున్న వ్యాధులు, స్థానిక పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఔషధాల జాబితాను తయారు చేయడానికి పశు వైద్యులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకంలో భాగంగా ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 10 మంది గైర్హాజరు పుట్టపర్తి అర్బన్: ఇంటర్ (జనరల్) ప్రాక్టికల్స్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. 16 కేంద్రాల్లో జరుగుతున్న ప్రాక్టికల్స్కు గురువారం 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్కు 484 మందికి గాను 480 మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్కు 535 మందికి గాను 529 మంది హాజరైనట్లు చెప్పారు. వివిధ కారణాలతో ఉదయం, మధ్యాహ్నం సెషన్లు కలిపి మొత్తంగా 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ బోర్డు రాష్ట్ర బోర్డు పరిశీలకులు సౌజన్య, డీఈసీ మెంబర్ రామరాజు, ప్రశాంతి, జయచంద్ర, ప్రశాంత్ తదితరులు ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ప్రాక్టికల్స్ను పర్యవేక్షించారు. క్వింటా చింతపండు రూ.25 వేలు హిందూపురం: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో చింతపండు విక్రయాలు ఊపందుకున్నాయి. గురువారం మార్కెట్కు 1,650 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.15,500, కనిష్టం రూ.6 వేల ప్రకారం ధర పలికిందన్నారు. మార్కెట్లో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన ఉత్పత్తులు తీసుకువస్తే మంచి ధరలకు ఉత్పత్తులను విక్రయించుకోవచ్చన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించండి ● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం పుట్టపర్తి టౌన్: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు, నిందితులు అరెస్ట్ గురించి డీఎస్పీ విజయకుమార్ను ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఇందుకోసం డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పేకాట, గంజాయి, మహిళా నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. -
లాటరీ ద్వారా మద్యం బార్ల ఎంపిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం షాపులకు లాటరీ తీసి ఎంపిక చేశారు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రెండు బార్లకు నాలుగు దరఖాస్తులు రాగా వాటికి లాటరీ తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ అధికారులు, బార్ లైసెన్స్ దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ ముగిసిందన్నారు. ధర్మవరం టౌన్లో ప్రకటించిన రెండు బార్లలో ఒక్కో బార్కు నాలుగు దరఖాస్తు వచ్చాయి. అందులో ఒకటి డోలా రాజారెడ్డికి , మరోటి లక్ష్మీనారాయణ దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్శాఖ అధికారి గోవిందనాయక్, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు.ఆటో నుంచి కిందపడి మహిళ మృతిపరిగి/గుడిబండ: పరిగి మండలంలోని పరిగి పెద్ద చెరువు కింద పన్నేడమ్మ గుడి సమీపంలో గొల్ల లక్ష్మమ్మ (50) అనే మహిళ ఆటోలో ప్రయాణిస్తూ నిద్ర మత్తులో జారిపడి కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఎస్ఐ రంగడుయాదవ్ వివరాలమేరకు... మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ పదేళ్ల క్రితం జరిగిన విద్యుదాఘాతంతో భర్త నారాయణప్పను కోల్పోయింది. పొలం పనులకు వెళ్లే లక్ష్మమ్మ... సీజన్ కావడంతో ప్రస్తుతం చింతపండును సేకరించి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇటీవల సేకరించిన చింతపండును సంచుల్లో నింపుకుని అమ్మడానికి గురువారం వేకువజామున తన స్వగ్రామం నుంచి ఆమెతో పాటు నారాయణప్ప అనే మరో వ్యక్తి ఆటోలో హిందూపురానికి బయలుదేరారు. ఈక్రమంలో పరిగి వద్దకు చేరుకోగానే నిద్రమత్తులో ఉన్న లక్ష్మమ్మ ఆటో నుంచి జారిపడి కింద పడిపోయింది. చికిత్స నిమిత్తం హిందూపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాబు వంచనపై గర్జన
అనంతపురం: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిలిచిపోవడానికి కారణమైన సీఎం చంద్రబాబు వైఖరి, మోసంపై అనంతపురం జిల్లా రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ప్రజల గర్జన ప్రభుత్వాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పోతిరెడ్డిపాడు’కు వేలాదిమంది అన్నదాతలు, ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ప్రభుత్వాన్ని నిలదీశారు. పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేయాలని నినదించారు.‘జల’కంటక సర్కార్పై గర్జించిన గళాలుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్ధాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టిన సీఎం చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేసింది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జించింది. ‘తీరు మారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్పై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదుంటూ హెచ్చరించింది. ‘తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ‘ఓటుకు నోటు’ కేసు భయం ఉంది. హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారం’టూ మండిపడింది.సంఘటితమైన సీమ నేతలురాయలసీమ ప్రయోజనాలపై రాజీ పడబోమని సీమ నేతలు, రైతులు పిడికిలి బిగించారు. వీరికి మద్దతుగా‘ సీమ’ ప్రయోజనాలు కాంక్షించే పలు రైతు, ప్రజా సంఘాల నేతలు సభలో పాల్గొన్నారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా.. వాడుకోలేని దయనీయ స్థితి. సీమకు, కృష్ణా జలాలకు అడ్డంకిగా ఉన్న చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాయలసీమ అంటే కరువు పీడిత ప్రాంతం కాదు.. బాబు పీడిత ప్రాంతమని రైతులు ఏకరువు పెట్టారు. రాయలసీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారిందన్నారు. -
ఏసీబీ వలలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి
కదిరి టౌన్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి(ఏబీసీడబ్ల్యూఓ) గుర్రం బాలాజీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బకాయిల మంజూరు కోసం వార్డెన్ నుంచి లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల మేరకు..గాండ్లపెంట మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ వార్డెన్గా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కోరగా...రూ.18 వేలు లంచం ఇవ్వాలని ఏబీసీడబ్ల్యూఓ గుర్రం బాలాజీ డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మీనారాయణ రూ.15 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా వార్డెన్ గురువారం కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో ఉన్న ఏబీసీడబ్ల్యూఓ నివాసానికి వెళ్లి.. ఆయనకు రూ.15 వేల నగదు అందజేశారు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు బాలాజీని పట్టుకున్నారు. ఈ మేరకు గుర్రం బాలాజీపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ హమీద్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సు కింద పడి డిగ్రీ విద్యార్థి మృతి
పుట్టపర్తి అర్బన్: కాలేజీ ముగిసిన తర్వాత ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తూ ప్రమాదవశాత్తూ బస్సు దిగే సమయంలో కిందపడటంతో డిగ్రీ విద్యార్థి సాయి కిరణ్ (19) మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లో గురువారం చోటు చేసుకుంది. పుట్టపర్తి రూరల్ ఎస్ఐ క్రాంతి వివరాలమేరకు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లికి చెందిన ప్రభాకర్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయికిరణ్ కొత్తచెరువులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బస్సు దిగే క్రమంలో కింద పడిన సాయికిరణ్పై బస్సు ఎక్కింది. తీవ్రంగా గాయపడిన సాయికిరణ్ను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో బీడుపల్లిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివించాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారని, దేవుడు వారికి తీరని అన్యాయం చేశాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డీపీటీఓ మధుసూదన్, ఎస్ఐ క్రాంతి ఆస్పత్రికెళ్లి వివరాలను నమోదు చేసుకున్నారు. తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు
ధర్మవరం: కరువుసీమ రైతులకు వరదాయనిగా భావించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలివేసిన చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దగ్గర ప్రజల భవిష్యత్ను తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి ఆయన ధర్మవరం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులను తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా పేర్కొనడం చూస్తే చంద్రబాబు కుట్ర రాజకీయాలు బహిర్గతమయ్యాయన్నారు. సీమ ప్రజలకు అన్యాయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను ప్రజలంతా ఎండగట్టాలన్నారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించకుండా మౌనంగా ఉండటం వల్ల రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. తాజాగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపడం ద్వారా మనకు రావాల్సిన నీటిని తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘చలో పోతిరెడ్డి పాడు’ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని భవిష్యత్లో డిమాండ్లు సాధించుకునే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గడ్డం కుళ్లాయప్ప, పెద్దిరెడ్డిగారి శ్రీనివాసులు, చెలిమి రామయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు గుర్రం శ్రీనివాస్రెడ్డి, వేముల అమర్నాథ్రెడ్డి, గజ్జల శివ, జింకా కంబగిరి, రెడ్డివారి రాజశేఖర్రెడ్డి, ఆవుల పోతిరెడ్డి, మద్దిలేటి మల్లికార్జున, కత్తె పెద్దన్న, కేశగాళ్ల కృష్ణ, చింతా భాస్కర్రెడ్డి, ఆకుల రామలింగ, అశోక్కుమార్రెడ్డి, అడ్రా నారాయణస్వామి, చంద్ర, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన స్వార్థ రాజకీయం కోసం రైతుకు అన్యాయం సీమ ప్రజల భవితను రేవంత్ దగ్గర తాకట్టుపెట్టాడు ‘చలో పోతిరెడ్డిపాడు’ ఆరంభం మాత్రమే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి -
ప్రకృతి వ్యవసాయం అద్భుతం
తాడిమర్రి: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు కొనియాడారు. గురువారం ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు డాక్టర్ బ్రూనో డోరియన్ (సీనియర్ ఎకనామిక్స్), పీహెచ్డీ పరిశోధకురాలు క్యారీ లేఫాల్ట్ మండలంలోని నార్శింపల్లిలో పర్యటించారు. ముందుగా ఏపీ సీఎన్ఎఫ్ అధికారులు, రైతులు వారికి ఘన స్వాగతం పలికి ఎద్దుల బండిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేశారు. పంటల సాగు, దిగుబడి, ఆదాయం తదితర వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజన్ లక్ష్మా నాయక్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నవీన్ పరిశోధన బృందానికి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అనంతరం పరిశోధన బృంద సభ్యులు వ్యవసాయంపై సెమీ డైరెక్టివ్ ఇంటర్వ్యూల ద్వారా సర్వే నిర్వహించారు. ముందుగా సీఆర్పీ నబీరసూల్తో చర్చించిన అనంతరం ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, పీఎండీఎస్ మోడల్స్ తదితర రకాల పంటలు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులను కూడా కలిసి పంటల సాగు, ఖర్చు, దిగుబడి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ సిబ్బంది హరికుమార్, గంగమ్మ, ఎల్వన్ నారాయణప్ప, ఎన్ఎఫ్ఐ శ్రీహర్ష, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. కితాబునిచ్చిన ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ బృందం -
ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి
రాప్తాడురూరల్: ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా పరిషత్ ఇన్చార్జ్ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. డీడీఓ నాగ శివలీలతో కలిసి బుధవారం అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్ఎస్)ను పరిశీలించారు. సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వెంకటసుబ్బయ్య సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి వర్ల శంకర్, పంచాయతీ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ శివ పాల్గొన్నారు. ఎస్డీసీ తిప్పేనాయక్ బదిలీ ● కాకినాడ డీఆర్ఓగా నియామకం అనంతపురం అర్బన్: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) డి.తిప్పేనాయక్ను కాకినాడ డీఆర్ఓగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిప్పేనాయక్ ప్రస్తుతం అనంతపురం కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) ఎస్డీసీగా ఉన్నారు. రస్తా విషయంలో ఇరువర్గాల ఘర్షణ గార్లదిన్నె: రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన మండల పరిధిలోని సంజీవపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... యర్రగుంట్ల రెవెన్యూ పొలం సర్వే నంబర్ 26/6లో సంజీవపురానికి చెందిన చితంబరయ్య కుమారులు దివ్యాంగుడు పెద్దన్న, లక్ష్మినారాయణ, శివయ్యలు 8 ఎకరాల పట్టా భూమి సాగు చేసుకుంటున్నారు. బీరప్ప కుమారులు ఎర్రిస్వామి, ఆదినారాయణకు కూడా 3 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇరువర్గాల మధ్య కొంతకాలంగా దారి విషయమై వివాదం నెలకొంది. బీరప్ప కుమారులు ఇటీవల కోర్టు నుంచి శాశ్వత ఇంజెంక్షన్ ఆర్డర్ పొందారు. బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో చితంబరయ్య భార్య కొండమ్మ స్పృహతప్పి పడిపోయింది. ఆదినారాయణ భార్య సరస్వతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి ఇరువురినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను గర్భిణి చేసిన ఆటోడ్రైవర్ గుత్తి రూరల్: ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను గర్భిణిని చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు బాలిక రోజూ ఆటోలో వస్తున్న క్రమంలో డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. శభాష్ వెంకటలక్ష్మి విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాల పదో తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటింది. తృతీయ స్థానంలో నిలిచింది. వారం క్రితం తమిళనాడులో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్రం తరఫున జట్టులో ప్రాతినిధ్యం వహించిన వెంకటలక్ష్మి అత్యంత ప్రతిభ కనబరిచి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ తులసి విద్యార్థిని అభినందించారు. పేదింట పుట్టినా ఒకవైపు చదువులతో పాటు మరోవైపు క్రీడల్లో కూడా రాణించడం గర్వకారణమన్నారు. ఆ కానిస్టేబుల్ సస్పెన్షన్ పుట్లూరు: మహిళపై అత్యాచారయత్నం చేసిన యల్లనూరు పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ మారుతికుమార్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జనవరి 30న పుట్లూరు మండలంలోని అరకటివేముల గ్రామంలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు పుట్లూరు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్పై కేసు నమోదైన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు మారుతీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఏపీ సూపర్ కప్ విన్నర్స్ గోదావరి లెజెండ్స్
అనంతపురం అర్బన్: ఆర్డీటీ స్టేడియంలో బుధవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ విన్నర్గా నిలిచి ఎఫ్సీ ఏపీసూపర్ కప్ ఫుట్బాల్–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తరువాత జరిగిన పెనాలిటీ షూటౌట్లో కోరమాండల్ ఎఫ్సీపై 3–0 గోల్స్తో విజయం సాధించి టైటిల్ను కై వసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి. నిర్ణీత సమయంలోనూ, అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దృఢమైన రక్షణాత్మక ఆటతో ఇరు జట్ల డిఫెండర్లు ప్రత్యర్థులకు స్పష్టమైన గోల్ అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్ పెనాలిటీ షూటౌట్కు చేరింది. గోల్స్గా మార్చిన గోదావరి లెజెండ్స్ పెనాలిటీ షూటౌట్లో గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ఆటగాళ్లు మూడు పెనాలిటీలను గోల్స్గా మార్చారు. రాజా దేబ్నాథ్, విఘ్నేష్ వేలమురగన్, రమేశోర్ మీతే గోల్స్ సాధించారు. గోల్ కీపర్ సచిన్ ఝూ రెండు కీలక పెనాలిటీలను అడ్డుకుని జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఈ విజయంతో గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ప్రతిష్టాత్మక ఏపీ సూపర్ కప్ను గెలుచుకోవడంతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీని అందుకుంది. టోర్నమెంట్లో కోరమాండల్, కొల్లేరు, పెన్నా, గోదావరి, విశాఖ, వంశధార, నల్లమల, తుంగభద్ర జట్లు పాల్గొన్నాయి. ఎనిమిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించి నాకౌట్ దశల ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ గెలుపు గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ స్టార్ ఆటగాడు, సహ యజమాని పృథ్వికి వ్యక్తిగతంగా కూడా మైలురాయిగా మారింది. కలెక్టర్ ఆనంద్ అభిందన ఏపీ సూపర్ కప్–2026 కైవసం చేసుకున్న గోదావరి లెజెండ్స్ జట్టును కలెక్టర్ ఓ.ఆనంద్ అభినందించారు. కలెక్టర్ను ఆయన చాంబర్లో ఆటగాళ్లు పృథ్వి, షాజెబ్, రాజేష్లు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. -
‘చలో పోతిరెడ్డిపాడు’కు తరలిరండి
కనగానపల్లి: కరువు ప్రాంత రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా గురువారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదన్నారు.గాలేరు, హంద్రీ–నీవా, తెలుగుగంగ కాలువలకు సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు అందాలంటే శ్రీశైలం డ్యాంలో 881 అడుగుల్లో నీరు ఉండాలన్నారు. కానీ 800 అడుగుల దిగువన నీరున్నా తెలంగాణ వారు పాలమూరు– రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్నారన్నారు. మనకు హక్కుగా ఉన్న నీటిని వాడుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టి, అప్పట్లోనే 50 శాతం పనులు కూడా పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం పనులను అన్యాయంగా ఆపేశారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో సాగునీటి హక్కుల కోసం రాయలసీమ రైతులంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద చేపట్టనున్న బహిరంగ సభకు రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపు -
తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ దూరం
పుట్టపర్తి అర్బన్: తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ను దూరం చేయవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం పేర్కొన్నారు. బుధవారం జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్తో పాటు దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేశామన్నారు. 3,41,441 మందిని స్క్రీనింగ్ చేయగా బీపీ 60,144 మంది, షుగర్ 43,008 మంది, నోటి క్యాన్సర్ 186 మంది, బ్రెస్ట్ క్యాన్సర్ 199 మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 162 మందిలో గుర్తించినట్లు చెప్పారు. పొగాకు వాడకం నివారించాలని, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ జయించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ సురేష్, డీపీఎంఓ డాక్టర్ నాగేంద్ర నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఎపిడెమియాలజిస్ట్ బాలాజీ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్య, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సీహెచ్ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం అనంతపురం: స్థానిక సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుభాష్రోడ్డులో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు మాట్లాడుతూ రిటైల్ ఫార్మాట్లు, విస్తృత శ్రేణి కలెక్షన్లు, మెరుగైన కస్టమర్ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. సంప్రదాయలు, వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నమ్మకం, పారదర్శకత, కస్టమర్ల నమ్మకాన్ని పెంపొందించుకుని రాయలసీమలోనే పెద్ద జ్యువెలరీ మాల్గా గుర్తింపు దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మలబార్ గోల్డ్ హెడ్ (రిటైల్ ఆపరేషన్స్,ఇండియా) సిరాజ్ పికే, జోనల్ హెడ్ (సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ) నిఖిల్ చంద్రన్, మహమద్ షరీజ్ (హైదరాబాద్ జోనల్ హెడ్), షానిబ్ (తెలంగాణ జోన్ హెడ్), హఫీజ్ మహమ్మద్ (డిప్యూటీ షోరూం హెడ్, అనంతపురం), తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
పుట్టపర్తిటౌన్: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ సతీష్కుమార్, ఆర్డీఓ సువర్ణ సూచించారు. బుధవారం కొత్తచెరువు శ్రీ చైతన్య పాఠశాల మైదానంలో పాఠశాలల అధినేత డాక్టర్ బీఎస్రావ్ జ్ఞాపకార్థం జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్, ఆర్డీఓ సువర్ణతోపాటు ఏజీఎమ్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల అలవాటవుతాయన్నారు. విద్యార్థులకు ప్రత్యేకమైన లక్ష్యం ఉండాలన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, బంగారు భవిష్యత్కు బాటలు వేసుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని చైతన్య బ్రాంచ్ల నుంచి దాదాపు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాళ్లు, కోఆర్డినేటర్లు, డీన్లు, ఏఓలు, పీఈటీలు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు!
రొద్దం: మండల పరిధిలోని పెద్దకోడిపల్లిలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన యువకుడు లింగమయ్య కేసులో ముగ్గురు నిందితులు పోలీ సుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. గురువారం లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడి ఇంటి వద్ద మృతదేహాన్ని పూడ్చి పెడతారనే సమాచారం రావడంతో సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. లింగమయ్య అంత్యక్రియలు సాఫీగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు కదిరి టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడిని కదిరి పోలీ సులు అరెస్టు చేశారు. సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. స్థానిక రాజీవ్గాంధీ నగర్లో నివాసం ఉంటున్న పట్రా చంద్రశేఖర్ కుమారులు పట్రా శివ, పవన్ లు గత ఏడాది ఆగస్టులో అయ్యప్ప గుడి వీధికి చెందిన సాయికిషోర్ను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు యత్నించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లోనే పట్రా పవన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న పట్రా శివకుమార్ను రాబడిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి కదిరిలో అరెస్టు చేశారు. బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. గతంలో శివపై 6 కేసులు ఉండడంతో అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఎద్దు పొడిచి మహిళా రైతుకు తీవ్ర గాయాలు గుత్తి రూరల్: గుంతకల్లు మండలంలోని శంకరబండ గ్రామంలో ఎద్దు పొడిచి ఓ మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. శంకరబండ గ్రామానికి చెందిన మహిళా రైతు నారాయణమ్మ పాడితో పాటుగా వ్యవసాయ పనుల కోసం పశువులు కొనుగోలు చేసింది. రోజు మాదిరిగానే బుధవారం ఎద్దులకు మేత పెట్టేందుకు ఇంటి సమీపంలో ఉన్న వామి వద్దకు తీసుకెళ్తోంది. అయితే ఒక ఎద్దు ఒక్కసారిగా బెదురుకొని నారాయణమ్మపైకి దూసుకెళ్లి పైకి ఎత్తి పడేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఎద్దును అదుపు చేసి తీవ్రంగా గాయపడిన నారాయణమ్మను ఆటోలో చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు. ‘దుర్గం’లో దొంగల అలజడి కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు అలజడి సృష్టించారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు సంచరించిన దృశ్యాలు స్థానికంగా ఓ ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారం క్రితం రెవెన్యూ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలోనే మళ్లీ దొంగల సంచారంతో స్థానికులు హడలెత్తుతున్నారు. -
రోడ్డు నిర్మాణం వివాదాస్పదం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి సమీపంలో క్రషర్ల యజమానులు నిర్మిస్తున్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. గురువారం నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని క్రషర్ల యజమానులకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారంటూ రైతులు వాపోతున్నారు. బాధితులు తెలిపిన మేరకు...అనంతపురం–కదిరి రహదారి నుంచి క్రషర్ల వద్దకు వెళ్లేదారి 8 అడుగులు (బండిరస్తా) మాత్రమే ఉందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ దాదాపు 25 అడుగుల వరకు బీటీ రోడ్డు వేస్తున్నారు. క్రషర్ల యజమానులు సొంత నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. గతంలోనూ ఈ రోడ్ల మీదుగానే తాము తిరుగుతున్నామని దుమ్ముధూళితో పంటలు నష్టపోతున్నామని చెప్ప డంతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని యజమానులు చెబుతున్నారు. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ రైతులు పనులను అడ్డుకోగా. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రైతులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ వాపోయారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. 10 సెంట్ల నుంచి ఎకరా వరకు భూములు కోల్పోతున్నామని, అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి జైల్లోకి పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో రోడ్లు వేస్తున్నారన్నారు. క్రషర్ల యజమానులు మాట్లాడుతూ... ఇప్పటికే నెల రోజుల పాటు క్రషర్లు బంద్ చేశామన్నారు. రోడ్డు సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాస్తవానికి 40 అడుగుల రోడ్డు ఉందని ఇందులో తాము 30 అడుగుల్లో మాత్రం రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. సొంత నిధులతో రోడ్లు వేస్తున్నా... అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని వాపోతున్న రైతులు, రోడ్డు పనులు చేయిస్తున్న దృశ్యం -
పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లకూడదు: జేసీ
చిలమత్తూరు: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేయనున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాల్లో కొలతలు, హద్దులు తదితర వివరాలన్నీ పక్కాగా ఉండాలని, ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని దేమకేతేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మార్చి నెలలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన పట్టాదారు డ్రాఫ్ట్ పుస్తకాలను జేసీ పరిశీలించారు. ఈ–కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతుల వేలిముద్రలు, భూమి విస్తీర్ణం తదితర వివరాలు, వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం కొడికొండలో పర్యటించి అక్కడ జరుగుతున్న రీసర్వేను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోజ్కుమార్, డీటీ జగన్నాథ్, సర్వేయర్లు కోదండపాణి , రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.‘విద్యాంజలి’తో బడులు బలోపేతంపుట్టపర్తి అర్బన్: ‘విద్యాంజలి–2.0’ కార్యక్రమం ద్వారా దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల అందించే చేయూతతో సర్కారు బడులు బలోపేతం అవుతాయని డీఈఓ కిష్టప్ప తెలిపారు. బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఓ ట్రస్ట్లో ‘విద్యాంజలి 2.0’ అమలుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు, ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని పాఠశాలలకు సహాయం చేసేలా పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలతో కార్యకమ్రాలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలల పోర్టల్లో తమ పాఠశాల పేరు రిజిష్టర్ చేయాలని, అక్కడే తమ పాఠశాలల అవసరాలను అందులో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పెనుకొండ డివిజన్ ఉప విద్యాధికారి జాన్రెడ్డెప్ప, సెక్టోరియల్ అధికారులు చంద్రశేఖర్, హరి ప్రసాద్, పుల్లన్న, రెహమాన్, ఫణి శర్మ, మాధవరెడ్డి, కోఆర్డినేటర్లు డాక్టర్ పుల్లన్న, జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.‘ఉపాధి’ పనుల పురోగతికి చర్యలు● ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షన్ముఖ్కుమార్ప్రశాంతి నిలయం: ఉపాధి హామీ పథకంలో పనుల పురోగతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పథకం రాష్ట్ర డైరెక్టర్ షన్ముఖ్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఉపాధి పనుల స్థితిగతులపై పీడీ విజయ్ప్రసాద్తో కలిసి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో 59,270 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు అధికారులు డైరెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకూ భౌతికంగా 23,288 పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఉద్యాన తోటల్లో 15,378, హౌసింగ్ పరిధిలో 1,777 పనులకు మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. వీటితో కలిపి సుమారు 40,443 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఇంకా 18,827 పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా జీరో ఎక్స్పెండేచర్ పనులు 500, డీసీసీ పనులు 5,735 మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. 20 పనుల కంటే తక్కువ చేసిన పంచాయతీలు జిల్లాలో 102 ఉన్నట్లు వివరించారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. -
మట్టిదొంగలు.. ‘పచ్చ’ నేతలు
పరిగి: రాష్ట్రం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతలు బరితెగించారు. సంపాదన పరమావధిగా సహజ వనరులను దోచుకు తింటున్నారు. చివరకు మట్టినీ వదలడం లేదు. బుధవారం మండలంలోని శ్రీరంగరాజుపల్లి వద్ద చెరువు సమీపంలో కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా మట్టిని తవ్వుతుండగా.. సమాచారం అందుకున్న ఎస్ఐ రంగడుయాదవ్ సిబ్బందితో కలిసి వెళ్లారు. పోలీసులను చూడగానే అక్కడున్న వారు వాహనాలు వదిలి పరారయ్యారు. దీంతో టీడీపీ నాయకులు నేతులపల్లి లోకేష్, శ్రీరంగరాజుపల్లికి చెందిన హనుమంతరాయప్పకు చెందిన రెండు జేసీబీ వాహనాలతో పాటూ మరో ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని ఎస్ఐ తెలిపారు. పోలీసుల దాడితో పరారీ.. వాహనాలు స్వాధీనం -
సీమ ద్రోహి చంద్రబాబు
రాయలసీమలో పుట్టిన చంద్రబాబు...సీమ ద్రోహిగా మారారు. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతోనే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తే.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేతులు కలిపిన చంద్రబాబు దాన్ని నిలిపివేశారు. దీనివల్ల వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఆయన్ను ఈ ప్రాంత రైతులు ఎప్పటికీ క్షమించరు. చందబ్రాబు వైఫల్యం..రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకే వైఎస్సార్ సీపీ ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలి. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు -
సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం
రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు. తప్పు చేయలేదంటే ఖండించాలి. కిరణ్కుమార్రెడ్డి హయాంలోనూ హంద్రీ–నీవా కాలువ పనులకు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీఓను రద్దు చేయించారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఈ విధంగా పదేపదే రాయలసీమకు ద్రోహం చేయడం చంద్ర బాబుకు అలవాటుగా మారిపోయింది. – కె.సలీం మాలిక్, మానవతా సంస్థ -
27 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
చిన్నారి అనుమానాస్పద మృతి
● టీకా వికటించడం వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ యల్లనూరు: వ్యాధి నిరోధక టీకా వేసిన కొన్ని గంటల తర్వాత ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. టీకా వికటించడం వల్లే ప్రాణం పోయిందంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నిట్టూరుకు చెందిన అనిత, ఓబులేసు దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో మూడో సంతానమైన మూడు నెలల కుమార్తెకు బుధవారం ఉదయం 11 గంటలకు ఏఎన్ఎం ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకా వేయించారు. అయితే సాయంత్రం చిన్నారికి జ్వరం వచ్చింది. ఈ సమయంలో తల్లి పాలు పట్టింది. అయితే చిన్నారికి నోరు, ముక్కులోంచి పాలురావడం, అపస్మారకస్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. టీకా వేయడం వల్లే ఇలా జరిగిందని భావించిన వారు హుటాహుటిన తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు వైద్యులు లోకేష్కుమార్ తాడిపత్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. నిట్టూరులో ఈ చిన్నారితో పాటు మరో ముగ్గురికి టీకాలు వేసినట్లు గుర్తించారు. టీకా గడువు కూడా ముగియలేదు. ఒకవేళ టీకా వికటించి ఉంటే మిగిలిన చిన్నారుల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. చనిపోయిన చిన్నారికి ఇంకేదైనా అనారోగ్యం ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు. అయినప్పటికీ చిన్నారి మృతిపై గ్రామంలో విచారణ కొనసాగుతోందని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీకా వికటించడం వల్లే చిన్నారి చనిపోయిందనే అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని డాక్టర్ లోకేష్కుమార్ చిన్నారి తల్లిదండ్రులతో చర్చించారు. -
పౌర సేవల్లో జాప్యం ఉండకూడదు
ప్రశాంతి నిలయం: మీ– సేవ కేంద్రాల ద్వారా అందించే పౌరసేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మీ–సేవ కేంద్రాల ఆపరేటర్లకు సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి ఆపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మ్యుటేషన్, కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర ముఖ్యమైన రెవెన్యూ సేవలను నిర్దిష్ట గడువులోపు ప్రజలకు అందించాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఎవరూ కూడా అదనపు రుసుము వసూలు చేయకూడదన్నారు. ప్రతి దరఖాస్తునూ రెవెన్యూ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. మీ–సేవా కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు మహేష్, శర్మ, ఆనంద తితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ను అందుబాటులోకి తేవాలి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న బ్లడ్ బ్యాంకులో సౌకర్యాలన్నీ కల్పించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పరిధిలోని పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి సమావేశానికీ డీఆర్ఎంజీఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ తప్పక హాజరు కావాలన్నారు. రక్తం లేకుండా రోగులు ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించాలని, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విస్తృతం చేయాలన్నారు. ఈ వారాన్ని టీకా వారంగా డ్రైవ్ చేపట్టి వంద శాతం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యాధికారి శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మీ–సేవా ద్వారా సర్వీసులు సకాలంలో అందించాలి మీ–సేవ ఆపరేటర్లకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక సజావుగా జరిగింది. ఎంపీపీగా హులికుంట ఎంపీటీసీ సభ్యురాలు ఎస్ఆర్ సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపీపీ–1గా గుడ్డగురికి ఎంపీటీసీ సభ్యుడు లింగరాజు, వైస్ ఎంపీపీ–2గా రొళ్ల ఎంపీటీసీ సభ్యురాలు సౌమ్య కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీలుండగా బుధవారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు దొడ్డేరి ఎంపీటీసీ సభ్యురాలు హెచ్డీ కవిత, రొళ్ల–2 ఎంపీటీసీ సభ్యుడు డీఎల్ నాగరాజు, మల్లినమడుగు ఎంపీటీసీ సభ్యురాలు రత్నమ్మ ముగ్గురు గైర్హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీ ఎన్నికలో పాల్గొన్నారు. ఎన్నిక ప్రక్రియకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రామకృష్ణయ్య వ్యవహరించారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎంపీపీ ఎన్నికను తహసీల్దార్ షేక్షావలి, ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి, మండల పరిషత్ ఏఓ ప్రసాద్, కార్యదర్శి శ్రీనాథ్, మండల పరిషత్ సిబ్బంది పర్యవేక్షించారు. -
రైతులను బలి చేశారు
ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేశారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి తద్వారా రాయలసీమ ద్రోహిగా నిలిచారు. సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించేందుకు పోతిరెడ్డి పాడు వద్ద గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాయలసీమ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి -
ప్రజల పక్షాన పోరాడుతాం
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిని విస్మరించి ఈ ప్రాంతానికి ఉరి వేయాలన్న ఆలోచనను పాలకులు విరమించుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. రాయలసీమ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడడానికి అలుపెరుగని పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ (రఫ్) తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. – తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు -
సేవాలాల్ ఆశయాలు కొనసాగిద్దాం
పుట్టపర్తి టౌన్: సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామని కలెక్టర శ్యాంప్రసాద్, ఆల్ ఇండియా బంజార భక్త సేవా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో మంగళవారం ఆల్ ఇండియా బంజార భక్త సేవా సంఘం (ఏబీబీఎస్ఎస్) ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్, సత్యసాయిబాబా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి సేవాలాల్ మహారాజ్ రథయాత్రను ప్రారంభించారు. బంజారా సాంప్రదాయ నృత్యాలు, డప్పులు, గిరిజన పాటలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ బంజార మహిళలతో కలసి నృత్యం చేశారు. సేవాఘడ్ ట్రస్ట్ అధ్యక్షుడు మహారాజ్స్వామి, జనరల్ సెక్రటరీ అశ్వర్థనాయక్, డంగావత్ రమేష్నాయక్, అఖిల భారత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీనాయక్, గిరిజన ప్రజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జుననాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బైకుల సీజ్.. తల్లిదండ్రులపై చర్యలు
రాప్తాడురూరల్: షర్ట్ విప్పి విన్యాసాలు చేసుకుంటూ రోడ్డుపై బైకు నడిపిన బాలురకు రాప్తాడు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారు నడిపిన బైకులను సీజ్ చేశారు. వివరాలను రాప్తాడు సీఐ శ్రీహర్ష మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం రాణినగర్కు చెందిన బాలురు ఈనెల 1న బుక్కరాయసముద్రంలో జరిగిన తేరుకు వెళ్లారు. అక్కడి నుంచి మూడు బైకుల్లో రాప్తాడు సమీపంలోని అయ్యవారిపల్లి వంక వద్దకు ఈతకు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై విన్యాసాలు చేసుకుంటూ వెళ్లారు. ఓ బాలుడు అత్యుత్సాహంతో షర్ట్ను విప్పేసి బైకు నడిపాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి... ‘గంజాయి బ్యాచ్ హల్చల్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో ఎస్పీ జగదీష్ స్పందించి రాప్తాడు పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సాంకేతికత ఆధారంగా బాలురు, వారి తల్లిదండ్రులను గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చారు. మైనర్లు నడిపిన బైకులను సీజ్ చేశారు. బైకుల రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులపై ఎంవీఐ యాక్ట్ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదని, సదరు వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి నోటీసు జారీ చేస్తామన్నారు. -
సందర్భం:
హిందూపురం టౌన్: ప్రస్తుతం సమాజాన్ని క్యాన్సర్ భూతం పట్టిపీడిస్తోంది. గతంతో పోల్చితే క్యాన్సర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గ్రామాల్లో అవగాహన లేక గతంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేవారుకాదు. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేయించుకోవాలనే ఆలోచన వస్తోంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పెరగడం వల్ల వ్యాధి ఎంతమందికి ఉందో తెలుస్తోంది. భయం వద్దు.. చాలా మంది క్యాన్సర్ అనగానే ఇక అంతేనంటూ భయాందోళన చెందుతారు. అయితే ప్రాణాంతకమైన క్యాన్సర్ను కూడా ఆత్మవిశ్వాసంతో జయించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో దానిని గుర్తించి చికిత్స పొందడం ద్వారా మరణాన్ని జయించవచ్చని, ఇప్పటికే ఎంతో మంది ఈ తరహా చికిత్స తీసుకుంటూ బతికి బయటపడ్డారని వివరిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంటున్నారు. వీటిని దూరం పెట్టాల్సిందే.. ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్, డీలక్స్, పొగాకు వంటివి తినడం, పొగ తాగడం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ వీటి వల్లే వస్తుంది. రొమ్ము క్యాన్సర్ జన్యుపరమైన కారణాలతో వస్తుంది. బయట ఫుడ్స్ తినడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, గడ్డలు ఏర్పడటం, రొమ్ము వద్ద చనుమొనలో ద్రవం కారడం, చర్మంలో మార్పు, పురీషనాళంలో నొప్పి, నిరంతర దగ్గు, కఫంలో రక్తం పడటం, ఛాతినొప్పి, భరించలేని తలనొప్పి,వికారం, వాంతులు, అవయవాల్లో బలహీనత వంటివి క్యాన్సర్ లక్షణాలు. చిన్న పరిమాణపు క్యాన్సర్ లేదా ప్రాథమిక దశల్లో ఉన్న వాటికి చికిత్స చేయడం సులభం. కారణాలు క్యాన్సర్ వ్యాధి రావడానికి 4 శాతం జన్యుపరంగా, 6 శాతం తీసుకునే నీరు, ఆహారం, 15 శాతం స్థూలకాయం, 40 శాతం పొగాకు, 10 శాతం ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి. మిగిలిన 25 శాతం క్యాన్సర్లకు సరైన కారణాలు లేవు. నాలుగు దశలు క్యాన్సర్లో నాలుగు దశలు ఉన్నాయి. మొదటి దశలో క్యాన్సర్ కణాల్ని స్క్రీనింగ్ ద్వారా గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు. ఇలా చేయడం ద్వారా 95 నుంచి 100 శాతం వరకు వ్యాధి నయం చేయవచ్చు. రెండో దశలో క్యాన్సర్ కణాలు ఒక భాగం నుంచి ఇతర భాగాలకు కొంచెం, కొంచెంగా విస్తరించడం ప్రారంభమవుతుంది. వాటికి రేడియోథెరఫీ అందిస్తే 70 నుంచి 80 శాతం వరకు పూర్తి స్థాయిలో నయమవుతుంది. ఇక మూడో దశలో క్యాన్సర్ ఇతర భాగాలకు పూర్తిగా విస్తరిస్తుంది. రేడియోథెరపీ, కీమోథెరపీ ఇస్తే 50 నుంచి 60 శాతం మందికి తగ్గుముఖం పడుతుంది. ఇక చివరి దశలో క్యాన్సర్ కీలకమైన అవయవాలకు సోకుతుంది. ఇలాంటి వారికి చికిత్స అందించినా ఆశించిన ఫలితం ఉండదు. కేవలం 5 నుంచి 10 శాతం మంది మాత్రమే బతికే అవకాశాలుంటాయి. క్యాన్సర్లో రకాలు క్యాన్సర్లో పలు రకాలు ఉన్నాయి. మహిళల్లో సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం ఉంటుంది. పురుషుల్లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ను పలు పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఎఫ్ఎన్ఎసీ, పాప్సిమీర్, బయాప్సీ పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. జిల్లాలో పెరుగుతున్న బాధితులు సకాలంలో గుర్తిస్తే మేలు అలసత్వం వీడాలంటున్న వైద్య నిపుణులు నేడు వరల్డ్ క్యాన్సర్ డే సంకేతాలిలా.. మలమూత్ర విసర్జనలో మార్పులు దీర్ఘకాలం మానని పుండ్లు, అసహజ రక్తస్రావం గొంతు బొంగురుపోవడం నొప్పి లేకుండా పెరుగుతున్న కణితులు, శరీరంలో ఎక్కడైనా ముద్దలు తీవ్రమైన అలసట, బలహీనత పుట్టుమచ్చల్లో సహజ మార్పులు -
లక్ష్యాలను సాధించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇండికేటర్స్ను ప్రతి నెలా 5వ తేదీ లోపు స్వర్ణాంధ్ర పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఇండికేటర్స్ వారీగా లక్ష్యాలను సాధించాలన్నారు. బీ గ్రేడ్, సీ గ్రేడ్లో ఉన్న జిల్లా శాఖ అధికారులను వారికి సంబంధించిన శాఖలను మెరుగైన గ్రేడ్ సాధించేందుకు వీలుగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, సీపీఓ విజయ్కుమార్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 108 మంది గైర్హాజరు పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 32 కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాకికల్స్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షలకు 108 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ మీడియట్ విద్యాశాఖాధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జనరల్లో 2035 మంది విద్యార్థులకు 1976 మంది, ఒకేషనల్లో 1453 మందికి 1413 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమం, భద్రత, చేయూతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న డీఎస్పీ కార్యాలయంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, రిసెప్సన్ కౌంటర్ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి లాయర్, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పోలీస్ మహిళా ప్రతినిధులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొదటగా కదిరిలో ప్రారంభించామని 27 ఫిర్యాదులు రాగా 16 పరిష్కారమైనట్లు చెప్పారు. ఇందులో భాగంగా పుట్టపర్తిలో ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. డీఎస్పీ విజయకుమార్, సీఐలు శ్రీనివాసులు, సురేష్, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేతనాల పెంపు ఇంకెప్పుడు? పుట్టపర్తి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్లో అంగన్వాడీల వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోని విధంగా బడ్జెట్ కేటాయించడం దుర్మార్గమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం బుక్కపట్నం మండల కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ నాయకులతో కలిసి బడ్జెట్ కాపీలను తగులబెట్టారు. ఓబిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దేశ వ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లతో సహా కోటి మంది స్కీం వర్కర్ల హక్కులను కాలరాసిందన్నారు. ఎంతో కాలంగా వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. మౌలిక సదుపాయాలకు సైతం ఈ బడ్జెట్ సరిపోదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి నాగమణి, జ్యోతి, పద్మ, శ్యామల, గంగ, సౌమ్య, నాగరత్న, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే రావొచ్చు
మామిడి రైతులకు సంబంధించిన బీమా కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతోంది. పరిహారం త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సాగు, నష్టం , రైతుల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపాం. జిల్లాలో 2,353 మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లించిన మాట వాస్తవమే. ఇన్సూరెన్స్ మొత్తాన్ని బీమా కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిహారం చెల్లిస్తాయి. – చంద్రశేఖర్, ఉద్యానశాఖ జిల్లా అధికారి -
కలెక్టర్ను కలిసిన గ్రూప్–1 విజేత
ప్రశాంతినిలయం/పుట్టపర్తి టౌన్: లేపాక్షి గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి సురేష్ గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన పుట్టపర్తిలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు పూల మొక్క అందజేసి శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రామప్ప, సురేష్ గురువులు ప్రసాద్, రమణారెడ్డి, సూపరింటెండెంట్ రమణ, పూర్వ అధ్యక్షుడు రామాంజి తదితరులు పాల్గొన్నారు. వంద అరటి చెట్లు నరికివేత● రూ.లక్ష వరకు పంట నష్టం కనగానపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు వంద అరటి చెట్లను నరికివేసిన ఘటన కనగానపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేర కు.. కనగానపల్లికి చెందిన రైతు సత్యనారాయణ రెండు ఎకరాల పొలంలో 3 వేల అరటి మొక్కలు నాటాడు. ప్రస్తుతం అరటి గెలలు కోత దశలో ఉన్నాయి. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి వంద చెట్లను నరికివేశారు. దీంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపాడు. దీనిపై మంగళ వారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రిజ్వాన్ కేసు నమోదు చేశారు. పొలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మామపై అల్లుడి దాడి పరిగి: కోనాపురం గ్రామంలో మామపై అల్లుడు దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపిన వివరాలు... ఒడిషా రాష్ట్రం గంజామ్ జిల్లా బరంపుర గ్రామానికి చెందిన సనాతన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 30 ఏళ్ల క్రితం పరిగి మండలానికి వలస వచ్చాడు. మోదా పంచాయతీ పరిధిలోని కోనాపురంలో నివాసముంటున్న సనాతన్కు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ వస్తోంది. తాగుడుకు బానిసైన ఇతని అల్లుడు ప్రశాంత్ డబ్బుల కోసం తరచూ సనాతన్తో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం యథావిధిగా డబ్బులడిగాడు. ఇవ్వకపోవడంతో కొడవలితో సనాతన్పై దాడి చేయగా అతడి చేయి, తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సనాతన్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
రొద్దం: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దకోడిపల్లికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న ఒక్కగానొక్క కుమారుడు లింగమయ్య (24). ఏడాది క్రితం తండ్రి పోతన్న మృతి చెందడంతో లింగమయ్య రోజూ దానిమ్మ కాయల ప్యాకింగ్కు వెళ్తూ తల్లి మల్లికమ్మను పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు మిత్రులతో కలిసి గ్రామ శివారు ప్రాంతానికి మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. స్నేహితులు కత్తితో మెడపై విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. గంజాయి బ్యాచ్ లింగమయ్యను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజూ గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులతో వాపోయారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐ రాఘవన్, ఎస్ఐ వీరాంజినేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులతో విచారణ చేపట్టారు. ఓ నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ పనేనని గ్రామస్తుల ఆరోపణ -
సీఎం, డిప్యూటీ సీఎంలపై చర్యలు తీసుకోండి
పుట్టపర్తి: ‘కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం తగదు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల విచారణలో నెయ్యి కల్తీ కాలేదని తేల్చినా దుష్ప్రచారానికి తెగబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం మడకశిరలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి అర్బన్ అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లి ఎస్ఐ లావణ్యకు, కదిరిలో వైఎస్సార్సీపీ నాయకులు పట్టణ పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసుస్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ఎన్పీకుంట: వైద్య సిబ్బంది తమకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వర్తించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ సురేష్బాబు సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. అంగన్ వాడీ కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను గుర్తించి వారు మెరుగైన స్థితికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిల్వ ఉంచిన టీకాలను పరిశీలించారు. ఓపీ, రికార్డులను తనిఖీ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బాలాజినాయక్, సీహెచ్ఓలు, వన్నప్ప, నాగలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ మహేశ్వరరెడ్డి, ఆరోగ్యకార్యకర్తలు రమేష్రెడ్డి, ఆదినారాయణ, ఫార్మసిస్ట్ ప్రకాష్, ఏఎన్ఎమ్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించాలి గాండ్లపెంట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందేలా ఆరోగ్యసిబ్బంది పని చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్బాబు అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. టీకాల రికార్డులు, టీకాలు నిల్వ ఉంచిన గదులను పరిశీలించారు. వైద్యాధికారి మహేశ్వరమారుతి, సామాజిక ఆరోగ్య అధికారి నాగేష్, తదితరులు పాల్గొన్నారు. -
నేత్రదానంతో ఇద్దరికి వెలుగు
ధర్మవరం అర్బన్: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును అందించవచ్చని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ధర్మవరం పట్టణంలోని పీఆర్టీవీధికి చెందిన అంబాభవాని ఆలయం మాజీ అధ్యక్షుడు సఫారు లక్ష్మణరావు(78) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర మృతుని కంటి కార్నియాను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య జయలక్ష్మి, కుమారుడు శివరాంమూర్తి, కుమార్తె భారతి, కోడలు చైతన్య, కుటుంబ సభ్యులు , విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం అధ్యక్షుడు గాజుల సురేష్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శి జుజారు రఘు, సభ్యులు ధనుంజయ, వెంకటేష్, కేశవరెడ్డి పాల్గొన్నారు. -
సొంత వైద్యం.. మొదటికే మోసం
సాక్షి, పుట్టపర్తి: ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్లో పరిశోధించి మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకీ పెరిగిపోతోంది. అందులోనూ ఎక్కువగా పారాసిటమాల్ మాత్రను కొనుగోలు చేస్తున్నారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, జలుబు ఏది సోకినా.. డాక్టర్ను సంప్రదించకుండానే ఆ మాత్రను మింగేయడం అలవాటుగా మార్చుకున్నారు. డాక్టర్ ఇచ్చిన మందుల గురించి కూడా గూగుల్లో వెతికి వాటి ద్వారా వచ్చే దుష్ఫలితాలను తెలుసుకుని వాడకుండా పడేస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అతి తెలివితో ప్రమాదం పల్లె ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని వారు ఏ చిన్న అనారోగ్యం వచ్చిన డాక్టర్ను సంప్రదిస్తున్నారు. అయితే విద్యావంతులు, ఉద్యోగులు ఆస్పత్రులకు వెళ్లలేక స్మార్ట్ఫోన్ ద్వారా గూగుల్లో పరిశోధించి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నారు. అలాంటి మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలిక రోగాలకు దారి తీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది కిడ్నీ బాధితుల్లో అతిగా మాత్రల వినియోగంతోనే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. విచ్చలవిడిగా విక్రయాలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందులు విక్రయిస్తున్నారు. మొబైల్లో చూపించినా, వాట్సాప్ ద్వారా డాక్టర్ను సంప్రదించినట్లు తెలిపినా మందులిస్తున్నారు.డాక్టర్ను సంప్రదించకుండా వెళ్లే వారిని మెడికల్ షాపుల నిర్వాహకులు కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారం పోగొట్టుకోలేక విక్రయాలు చేస్తున్నారు. డాక్టర్లను సంప్రదించకుండానే మందుల వినియోగం మెడికల్ స్టోర్లలోనూ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు కొత్త రోగాలను ‘కొని’ తెచ్చుకుంటోన్న బాధితులు పుట్టపర్తికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం జలుబు చేసింది. ఈ క్రమంలో గూగుల్లో మాత్రల కోసం వెతికి స్థానికంగా ఉండే ఓ మెడికల్ స్టోర్లో రెండు, మూడు రకాల మాత్రలు తీసుకుని మింగాడు. జలుబుతో పాటు దగ్గు, జ్వరం ఎక్కువైంది. మాట్లాడేందుకు కూడా కాలేదు. వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాడు. మోతాదుకు మించి మందులు తీసుకోవడంతోనే సమస్య తలెత్తినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అయినట్లు బాధితుడు తెలిపాడు. ధర్మవరానికి చెందిన ఓ 55 ఏళ్ల మహిళకు జనవరి రెండో వారంలో జ్వరం సోకింది. వెంటనే తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మందుల ఫొటోలు తెప్పించుకుంది. అనంతరం స్థానికంగా ఓ మెడికల్ షాపులో వాటిని తెచ్చుకుని మింగింది. మరుసటి రోజున ఉదయం నుంచి వాంతులు కావడంతో పాటు నీరసం వచ్చి స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పలు పరీక్షలు చేసిన తర్వాత రోగానికి సంబంధం లేని మాత్రలు మింగడంతో సమస్య తలెత్తిందని తేల్చాడు. అప్పటికే సుమారు రూ.5 వేల వరకు ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరే కాదు.. జిల్లాలో చాలామంది ఇటీవల సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. వైద్యులను సంప్రదించాలి జబ్బు చేసినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. గూగుల్లో పరిశోధించి కొనే మాత్రలతో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ వద్దకు వెళ్తే రోగ తీవ్రత ఆధారంగా మాత్రల మోతాదు ఇస్తారు. అతి తెలివి ప్రదర్శించి లేని పోని రోగాల బారిన పడొద్దు. జబ్బు ముదిరి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. గూగుల్లో దొరికే సమాచారమంతా కచ్చితమైనది కాదు. – డాక్టర్ ఫైరోజబేగం, డీఎంహెచ్ఓ -
వెంటనే పరిహారం చెల్లించాలి
మామిడి రైతులు చెల్లించిన ప్రీమియానికి వెంటనే పరిహారం చెల్లించాలి. గత ఏడాది మామిడి రైతులు వివిధ కారణాలతో పంటను కోల్పోయారు. ఈ విషయంపై గతంలోనే కలెక్టర్కు గ్రీవెన్స్లో రైతులు అంతా కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏడాది గడిచినా పరిహారంపై ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. చిత్తూరు రైతులను ఒకలా, ఇతర జిల్లాల రైతులను ఒకలా చూసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం సిగ్గుచేటు. తోతాపురి కాయల కొనుగోలులో వ్యత్యాసం చూపి మామిడి రైతులను నట్టేట ముంచారు. – ఆవుటాల రమణారెడ్డి, అగ్రిబోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు -
చిరుత దాడిలో 12 గొర్రెల మృతి
గుమ్మఘట్ట: మండలంలోని రంగసముద్రం గ్రామంలో గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనిల్కుమార్ తన 60 గొర్రెలను మందగా తోలాడు. అర్ధరాత్రి సమయంలో మందపై చిరుత దాడి చేసింది. 12 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృత్యువాత పడ్డాయి. రూ.2 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదరరెడ్డి, పశు వైద్యులు నవీన్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంజినేయులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రభుత్వం బాధితునికి పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బియ్యం వ్యాపారి బలవన్మరణం తాడిపత్రిటౌన్:బియ్యం వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో జరిగింది. సీఐ ఆరోహణరావు తెలిపిన మేరకు.. పట్టణంలోని మెయిన్ బజార్లో నరేంద్రకుమార్ (45), భార్య రజనీకుమారి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైఎస్సార్ సర్కిల్లో నరేంద్రకుమార్ కిరాణ స్టోర్ నడుపుతున్నాడు. 10 సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం కూడా చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం నరేంద్రకుమార్ అప్పులు చేశాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆవేదనలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో మంగళవారం కిరాణా స్టోర్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా రాయదుర్గం: ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశామని, ఒక్క బాక్సు కర్ణాటక మద్యం కూడా దిగుమతి కాకుండా చర్యలు చేపట్టామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య,ఈఎస్ రామమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్స్టేషన్ను సీఐ జయనాథ్రెడ్డితో కలిసి సందర్శించారు. స్థానిక ఎస్హెచ్ఓ (సీఐ) మహేష్కుమార్ ఆధ్వర్యంలో బార్ పాలసీపై డీసీ, ఈఎస్ అవగాహన కల్పించారు. బార్ లైసెన్స్ దరఖాస్తు విధానాలు, అర్హతలు, రుసుం, స్లాబు వివరాలు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డీసీ, ఈఎస్లు సిబ్బంది సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ కేసులపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సీఐ ఉత్తమ అవార్డులకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. చింతచెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి పెద్దవడుగూరు: చింతచెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధి లోని విరుపాపురం గ్రామంలో జరిగింది. ఎస్ఐ ఆంజినేయులు తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన శ్రీనివాసులు (46)కు భార్య పుష్పలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసులు చింతకాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పెద్దవడు గూరు మండలంలోని విరుపాపురం సమీపంలో చింత చెట్లు కొనుగోలు చేశాడు. మంగళవారం చెట్లు ఎక్కి చింతకాయలు కోస్తుండగా అదుపుతప్పి కిందకు జారిపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికుల సాయంతో భార్య గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొండుపల్లి గనిలో ప్రమాదం ● ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు పెద్దవడుగూరు: మండల పరిధిలోని కొండుపల్లి గనిలో ప్రమాదం చోటు చేసుకొంది. ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున కొండుపల్లి గనిలో డోలమైట్, బలపం రాయిని వెలికి తీసేందుకు కొండుపల్లికి చెందిన గొల్ల నరేష్, బోయ అనిల్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బలపం రాళ్లు మీద పడడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని తోటి కార్మికులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. -
పోలీసు సిబ్బందికి క్రమ శిక్షణ అవసరం
పుట్టపర్తి టౌన్: పోలీస్శాఖలో అంకితా భావంతో విధులు నిర్వర్థించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. పుట్టపర్తి పోలీస్ కార్యాలయం సమీపంలో పరేడ్ మైదానంలో మంగళవారం ఏఆర్ డీ మొబలైజేషన్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను పరిశీలించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఏఆర్ సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం, దేహదారుడ్యం మెరుగుపర్చుకునేందుకు 15 రోజుల డీ మొబలైజేషన్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి అన్ని విభాగాల నుంచి 87 శాతం మంది హాజరుకావడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలను తెలుసుకోవచ్చన్నారు. విధుల్లో తప్పులు చేస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ప్రతి మూడో శనివారం ఏఆర్ సిబ్బంది సమస్యలపై తనను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు వలి, మేహేష్, రవికుమార్, ఆర్ఎస్ఐలు ప్రదీప్సింగ్, వెంకటేశ్వర్లు, ప్రసాద ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ -
కూలీని మింగిన ఇసుక మేట
హిందూపురం: ఇసుక మేట మీద పడి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని అప్పలకుంట వద్ద జరిగింది. హిందూపురం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని మేళాపురానికి చెందిన రామమూర్తి (70) కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మంగళవారం అప్పలకుంట గ్రామ సమీపంలోని పెన్నానది వద్ద ఇసుక తవ్వి ట్రాక్టర్లో నింపే పనులకు వెళ్లాడు. ఇసుక తవ్వుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇసుక మేట కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇసుకలో కూరుకుపోయిన రామమూర్తి ఊపిరాడక మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోళ్లఫాం షెడ్డులో అగ్ని ప్రమాదం
వజ్రకరూరు: కోళ్లఫాం షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగి రూ.15 లక్షల నష్టం వాటిల్లిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరుకు చెందిన రైతు గోపి జయరామిరెడ్డి తన వ్యవసాయం పొలంలో కోళ్లఫాం షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల షెడ్డులో వేరుశనగ, కంది, పప్పుశనగ పొట్టుతో పాటు వరిగడ్డి నిల్వ చేశాడు. దీంతోపాటు సొప్పు కటింగ్ మిషన్, ఇతర వ్యవసాయ పనిముట్లు, పెంకులు, తీర్లు ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున షెడ్డులో మంటలు ఎగిసిపడుతుండడం గమనించిన స్థానికులు వెంటనే రైతు గోపి జయరామిరెడ్డికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న గోపిజయరామిరెడ్డి, కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే షెడ్డులోని గడ్డితో పాటు వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, ఏఎస్ఐ రమేష్, వీఆర్ఓ మారెన్న తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలిబూడిదైన వేరుశనగ పొట్టు, వ్యవసాయ పనిముట్లు రూ. 15 లక్షల నష్టం -
హెల్మెట్ లేదా?..పెట్రోల్ వేయం!
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు నిబంధన విధించారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారుల శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరి చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ వేయవద్దని బంకుల నిర్వాహకులకు సూచించారు. ఈ క్రమంలో సోమవారం అనంతపురంలోని పలు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేని వారికి ఇంధనం వేయలేదు. అలాగే పోలీసులు పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టి హెల్మెట్ లేని వారికి జరిమానా విధించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
2 వేల అరటి చెట్లు దగ్ధం
యల్లనూరు: అగ్నిప్రమాదంలో 2 వేల అరటి చెట్లు దగ్ధమైన ఘటన యల్లనూరు సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రైతులు మహబూబ్బాషా, రఫీలు యల్లనూరు సమీపంలో పదెకరాల్లో 15 వేల అరటి మొక్కలను సాగు చేస్తున్నారు. పొలం పక్కనే బీడు భూమి ఉంది. అందులో పెరిగిన గడ్డికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు పక్కనే ఉన్న అరటి తోటకు వ్యాపించి 2 వేల అరటి చెట్లు దగ్ధమయ్యాయి. నాలుగు మోటర్లు, ట్రాక్టరు డ్రిప్ పైపులు, 70 పీవీసీ పైపులు కూడా కాలిపోవడంతో రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. రెండో కోతకు గెలలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించింది: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల
శింగనమల(నార్పల): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. నార్పల మండలం బండ్లపల్లిలో సోమవారం ఆమె ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కరువు ప్రాంతం కావడంతో ఈ పథకాన్ని ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఈ పథకం ఉపాధి కూలీల జీవితాల్లో వెలుగులు తెచ్చిందన్నారు. అలాంటి పథకానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేరు మార్చడంతో పాటు నిర్వీర్యం చేస్తోందన్నారు. 40 శాతం నిధులు రాష్ట్రాలే భరించాలని పేర్కొనడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి,రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు దాదాగాంధీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, శింగనమల కాంగ్రెస్ ఇన్చార్జ్ సాకే శంకర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రిపై కుమారుడి దాడి పెద్దవడుగూరు: మండల పరిధిలోని జి.వెంకటాంపల్లిలో సోమవారం తండ్రి శ్రీనివాసులుపై అతని కుమారుడు సాయి కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆస్తి తన పేరిట రాయాలంటూ కొన్ని రోజులుగా కుమారుడు సాయి తన తండ్రి శ్రీనివాసులుపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం సాయంత్రం తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆక్రోశంతో సాయి తన తండ్రి శ్రీనివాసులు తలపై కట్టెతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు పెద్దవడుగూరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఆంజినేయులు తెలిపారు. మరణించి.. మరో ఇద్దరికి చూపువజ్రకరూరు: ఆమె మరణించినా మరో ఇద్దరికి చూపు ప్రసాదించింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు గ్రామానికి చెందిన ఎం.భాగ్యలక్ష్మిదేవి (70) రెండు రోజుల క్రితం ఇంట్లో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. ఈ క్రమంలో మృతురాలు భాగ్యలక్ష్మిదేవి నేత్రాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆస్పత్రి ప్రతినిధి సమాచారం మేరకు ఐ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర అక్కడికి చేరుకుని నేత్రాలను సేకరించారు. తమ తల్లి చివరి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుమారులు ఎం. రమేష్, ఎం.విశ్వ నాథ్, కుమార్తెలు శ్రీదేవి, విజయలక్ష్మి, ఉషారాణి తెలిపారు. -
శవంపై శవం.. ఎన్నాళ్లిలా?
బత్తలపల్లి:‘నివాసముండేందుకు ఎలాగూ స్థలాలు ఇవ్వలేకపోతున్నారు. కనీసం చనిపోయాకనైనా శవం పూడ్చేందుకు ఆరడుగుల స్థలం కేటాయించండయ్యా’ అంటూ అధికారులను బత్తలపల్లి వాసులు వేడుకుంటున్నారు. బత్తలపల్లి శ్మశాన వాటికలో మృతదేహాలను పూడ్చేందుకు ఆరడుగుల స్థలం లేక కాలనీవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో ఎక్కడ తవ్వినా ఒకటి, రెండు పుర్రెలు, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. గ్రామం ఏర్పడినప్పుడు 1.47 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిక ఉండేది. రానురాను ఆక్రమణలకు గురి కావడంతో శ్మశాన వాటిక కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఎకరా విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైంది. రోడ్డు విస్తరణ జరిగితే అది కూడా ఉండదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా బత్తలపల్లిలో దాదాపు 25వేల మంది జనాభా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో కొంత సమాధులతో నిండిపోగా మిగిలిన కొద్దిపాటి స్థలంలో ఖననం చేయాల్సి వస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చట్టపరంగా కనీసం మూడు ఎకరాల స్థలం శ్మశాన వాటికకు కేటాయించాల్సి ఉంది. ఈ అంశంపై పాలకుల వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఎవరైనా మృతి చెందితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. ఇతర ప్రాంతాల్లో ఖననాలు శ్మశాన వాటికకు స్థలం కేటాయింపుపై గతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానికులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అలాగే ధర్మవరం ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ను కలిసివినతి పత్రం అందజేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్కూ వినతి పత్రం అందజేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీలు తప్ప ఇప్పటి వరకూ ఆచరణలో కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక శ్మశాన వాటికలో మృతదేహాలను పాతి పెట్టేందుకు స్థలం లేక చాలా మంది తమ స్వగ్రామాలకో, అనంతపురంలోనూ ఖననం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఊరికి దూరంగా మూడు ఎకరాల్లో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరడుగుల స్థలం లేక అష్టకష్టాలు కుంచించుకుపోయిన శ్మశాన వాటిక అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం స్థలం కేటాయించాలంటున్న గ్రామస్తులు -
కనికరించండి.. న్యాయం చేయండి
పుట్టపర్తి టౌన్: ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. మీరైనా కనికరించి న్యాయం చేయండి’ అంటూ బాధితులు ఎస్పీ సతీష్ కుమార్ను వేడుకున్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి మొత్తం 130 వినతులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సతీష్ కుమార్ అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి మాట్లాడారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఇందిర, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐ లక్ష్మికాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని... ● భర్త తనను మోసం చేసి వెళ్లిపోయాడని నేలకోట తాండాకు చెందిన సరస్వతీబాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. బత్తలపల్లి పశువైద్యశాలలో కాంపౌండర్గా పనిచేస్తున్న గోరంట్ల మండలం పాలసముద్రంకు చెందిన సురేష్ నాయక్, తాను ఒకరినొకరం ప్రేమించుకుని గత ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకున్నామన్నారు. కొన్ని రోజులు కాపురం చేసిన సురేష్నాయక్ ఉన్నట్లుండి వదిలి వెళ్లిపోయాడన్నారు. దీనిపై ధర్మవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు.భర్త కావాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్పీ ధర్మవరం డీఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. సురేష్నాయక్ను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ చేసి సరస్వతికి న్యాయం చేయాలని ఆదేశించారు. ●తనను అత్తమామలు వేధిస్తున్నారంటూ రొద్దం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జ్యోతి తిరుమల అనే మహిళ ఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో జీర్ణించుకోలేక అత్తమామతో పాటు తన భర్త సోదరుడు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కులం పేరుతో దూషిస్తూ ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ బలవంతం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. మడకశిర పోలీసుస్టేషన్ అధికారులకు ఎస్పీ ఫోన్ చేసి తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని వైఎస్సార్టీఏ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో డీఈఓ కిష్టప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీహెచ్ఓను పాఠశాల మొత్తానికి ఇవ్వాలని, ఎస్ఎస్సీ డ్యూటీ నుంచి దివ్యాంగులు, 55 సంవత్సరాలు పైబడినవారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులకు సీఎల్ వినియోగించుకొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నాడు–నేడు రెండో విడత, ఎస్ఎస్సీ వంద రోజుల ప్రణాళికలో సెలవు దినాల్లో పనిచేసిన వారికి సీసీఎన్ మంజూరు చేయాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రతాప్రెడ్డి, రామ్మోహన్, మహమ్మద్, అలీ, తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంట్లో చోరీఎన్పీకుంట: మండల పరిధిలోని ఆసంవారిపల్లికి చెందిన సిద్ధా హరీష్నాయుడు ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని శివాలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో హరీష్నాయుడు పాల్గొన్నాడు. భార్య కూడా వెంట రావడంతో ఇంటికి తాళం వేసుకొని వెళ్లాడు. ఆలయంలో పూజల అనంతరం తిరిగి ఇంటికి రాగా తలుపులు తెరచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 31 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ కిషోర్రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని సోమవారం క్లూస్ టీం పరిశీలించి, వేలి ముద్రలు సేకరించింది. యువకుడి మృతదేహం లభ్యంపెనుకొండ (సోమందేపల్లి): సోమందేపల్లి మండలం నక్కల గుట్ట వద్ద హంద్రీ–నీవా లిఫ్టు పంపు హౌస్లో గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ పట్టణంలోని నారాయణమ్మ కాలనీకి చెందిన మహేష్కుమార్ (26) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం హంద్రీ–నీవా లిఫ్టు పంపు హౌస్ వద్దకు ఈత కోసం వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. అక్కడున్న కొందరు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి కావడంతో ప్రయత్నాలు విరమించుకున్న పోలీసులు సోమవారం పెనుకొండ అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం యువకుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుని సోదరుడు శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెచ్చిపోయిన దొంగలు● 11 మంది రైతుల పొలాల్లో కేబుల్ వైరు చోరీ అగళి: దొంగలు రెచ్చిపోయారు. 11 మంది రైతుల పొలాల్లో కేబుల్ వైరు చోరీ చేశారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని మధూడి గ్రామంలో సర్పంచ్ శివకుమార్, దేవరాజు, రంగనాథప్ప, గిరీష్, సత్యనారాయణ, రవిశంకర్, గోవిందప్ప, తదితర 11 మంది రైతుల పొలాల్లో దాదాపు 480 మీటర్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బాలికను గర్భిణి చేసిన కామాంధుడి అరెస్టు
కదిరి టౌన్: బాలికను గర్భిణిని చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కదిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నాగేంద్ర వివరాలు వెల్లడించారు. వివరాలు.. ఎన్పీ కుంట మండలంలోని ఓ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. బాలికపై కన్నేసిన కుంచెపు మహేంద్ర ఆమైపె పలుమార్లు లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే బాధితురాలిని నిందితుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఒక ప్రయివేట్ నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లి ఇంజెక్షన్ వేయించగా, అదే రోజు గర్భస్రావం జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం గాండ్లపెంట మండలం రెక్కమాను సమీపంలోని కురుమామిడి ఆర్డీటీ ఆస్పత్రి ఎదుట మహేంద్రను అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్ఫోన్, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడిని కదిరి కోర్టులో ఎదుట హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు క్రిష్ణమూర్తి, సుమతి పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న టాటా ఏస్
మడకశిరరూరల్: మండలంలోని యూ రంగాపురం వద్ద జాతీయ రహదారిలో సోమవారం ఓ టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం వాహనంలో లోడ్ వేసుకుని బెంగళూరు వెళ్లిన పావగడకు చెందిన శివ, దుర్గాప్రసాద్లు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో యూ రంగాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతినగా, అందులో శివ, దుర్గాప్రసాద్ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరినీ బయటకు తీశారు. శివకు కుడికాలు, దుర్గాప్రసాద్కు ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే వారిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మొరుగైన చికిత్సల కోసం హిందూపురం తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు డీఈ శివరాములు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక గణేష్ సర్కిల్ సమీపంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు అదాలత్ ఉంటుందన్నారు. విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ధర్మవరం మున్సిపాలిటీ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానిపల్లి మండలాల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను రాత పూర్వకంగా తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. బాల్య వివాహాలను అరికడదాం ● కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపు పుట్టపర్తి అర్బన్/పుట్టపర్తి టౌన్: బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్లే కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఐసీడీఎస్, రెడ్స్, శక్తి టీం సంయుక్త ఆధ్వర్యంలో 100 రోజుల క్యాంపెయిన్ కోసం బాల్య వివాహ ముక్తి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ రథాలను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. ఇందు కోసం రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. మొదటి విడతగా కదిరి, పుట్టపర్తి డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, రెడ్స్ డైరెక్టర్ భానుజా పాల్గొన్నారు. -
నాణ్యమైన పరిష్కారం చూపండి
ప్రశాంతినిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో పరిష్కరించి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదికకు వివిధ సమస్సపై 203 అర్జీలు వచ్చాయి. వీటిని వెంటనే ఆయా శాఖలకు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్లతో సమస్యలకు పరిష్కారం.. రెవెన్యూ క్లినిక్ల ద్వారా ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లను ఆయన సందర్శించారు. రెవెన్యూ సమస్యలున్న వారు రెవెన్యూ క్లినిక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ఆయా రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు అక్కడే ఉండి ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ● కదిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ 2025 ఆగస్టు 31వ తేదీన తామంతా పదవీ విరమణ పొందామని, ఇంతవరకూ తమకు రావాల్సిన గ్రాట్యుటీ రూ.13.67 లక్షలు, లీవుల డబ్బు రూ.6.13 లక్షలు మంజూరు కాలేదని పలువురు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు కలెక్టర్కు తెలిపారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందక తమ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అలాగే తమకు రూ.9,645 మాత్రమే పింఛన్ వస్తుందని, అందువల్ల రేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. ● తనకు ప్రమాదంలో ఒక కాలు పోయిందని 90 శాతం అంగవైకల్యం ఉన్నా.. ప్రభుత్వం కేవలం రూ.4 వేల పింఛన్ మంజూరు చేసిందని తలుపుల మండలం వీఆర్ తండాకు చెందిన రామునాయక్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. 70 ఏళ్ల వయస్సులో ఏ పనీ చేసుకోలేని తన పరిస్థితి అర్థం చేసుకుని రూ.15 వేల పింఛన్ ఇప్పించాలని కోరారు. అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం పరిష్కార వేదికకు 203 అర్జీలు -
‘కల్తీ’ ప్రచారకులపై చర్యలు తీసుకోండి
పరిగి: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ కల్తీ ప్రచారం చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేష్లపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దుష్ప్రచారానికి ఒడిగట్టిన కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని పరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టర్లను తయారు చేస్తున్న ముద్రణ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్వహించిన విచారణలో టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదన్న విషయం బట్టబయలైందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగంగా కల్తీ నెయ్యి అంటూ వెంకన్న భక్తులను మానసికక్షోభకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ కాలేదని ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పినా... కూటమి నేతలు అసత్య ప్రచారాన్ని ఆపకపోవడం దుర్మార్గమన్నారు. కల్తీ అంటూ ఇప్పటికీ అసత్య ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్ శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని, శ్రీవారి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. దాడులకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం చంద్రబాబేనని ఉషశ్రీచరణ్ ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోవాలంటూ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్తే ఆయనపై కర్రలు, రాళ్లతో దాడికి సిద్ధమైన టీడీపీ గూండాలను పోలీసులు నిలువరించపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐదు గంటల పాటు దాడులు చేసినా పట్టించుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం, ఆపై దాడులు చేసిన వారిని విడిచిపెట్టడం చూస్తే దీని వెనుక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన చంద్రబాబుకు పాలించే హక్కు లేదని, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని ఉపేక్షించబోం సర్పంచ్లు, ఎంపీటీసీలకు రావాల్సిన బిల్లులను పక్షపాత ధోరణితో జాప్యం చేస్తే ఉపేక్షించబోమని, త్వరలోనే పెనుకొండలో ధర్నా నిర్వహిస్తామని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. అప్పులు చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు రావాల్సిన బిల్లులను మంజూరు చేయకుండా మంత్రి సవిత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు బిల్లులు చేయొద్దని సాక్షాత్తు ఓఎస్డీ సుమన జయంతి చెప్పడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీపీ సవిత, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లడ్డూకు వాడే నెయ్యి కల్తీ అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కల్తీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు వైఎస్ జగన్ ఫ్లెక్సీలతో దుష్ప్రచారాన్ని చేస్తే ఊరుకోం పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
కొత్త రైల్వేలైన్లకు నిధులు కష్టమే
● డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: కేంద్రం ప్రవేశపెట్టిన 2026–2027 బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్లో కొత్త రైల్వే లైన్లకు నిధులు దక్కడం కష్టమేనని డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్వనివైష్టవ్ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశాన్ని అధికారులు డీఆర్ఎం కార్యాలయంలో సోమవారం సాయంత్రం వీక్షించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు దాదాపు రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ.4,000 కోట్లకు పైగా రైల్వేకు కేటాయించినట్లు తెలిపారు. హైదరాబాద్ వయా అమరావతి మీదుగా చైన్నె, హైదరాబాద్ – బెంగళూరు మధ్య హై స్పీడ్ డైమండ్ ప్రాజెక్ట్ (హై స్పీడ్ ప్రత్యేక రైల్ మార్గం)ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయన్నారు. దీంతో ఇండియన్ రైల్వే మరో చరిత్ర సృష్టించబోతోందన్నారు. అయితే కొత్త రైల్వే లెన్లకు దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీంతో తమ డివిజన్కు కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయింపులు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. డివిజన్కు రైల్వే నిధుల కేటాయింపులపై పింక్ బుక్ విడుదల అనంతరం పూర్తిస్థాయిలో తెలుస్తాయన్నారు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు చుర్గుగా సాగుతున్నాయని, పూర్తి స్థాయి జోనల్ ఏర్పాటు చేసుకోవడానికి మరో మూడేళ్లపైగా సమయం పడుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వింటా చింతపండు రూ.23 వేలు హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్లో చింతపండు విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం మార్కెట్కు 1,500 క్వింటాళ్ల చింతపండు రాగా, క్వింటా (కరిపులి రకం) గరిష్టంగా రూ.23 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయని మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. ఇక ఫ్లవర్ రంక క్వింటాల్ గరిష్టంగా రూ.18 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికిందని ఆయన వెల్లడించారు. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కార్యదర్శి సూచించారు. రేపు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి 11 మంది ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికకు ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ ఆనంద్కుమార్ వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నిక నేపథ్యంలో బుధవారం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తహసీల్దార్ షేక్షావలి తెలిపారు. ఈ ఎన్నికను 11 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు గుర్తించిన పత్రిక విలేకరులు మాత్రమే హాజరు కావాల్సి ఉందన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. -
‘పల్లె’ సార్ చెప్తేనే పింఛన్ !
ఓడీచెరువు: వృద్ధులకిచ్చే పింఛన్లోనూ రాజకీయ వైరం చూపుతున్నారు. అర్హత ఉండి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సరే ‘పల్లె’ సార్ చెబితేనే పింఛన్ మొత్తం ఇస్తామంటూ అధికారులు వృద్ధులను వేధిస్తున్నారు. రాజకీయ కారణాలతో కొందరికి నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వకుండా ఆ తర్వాత స్థానికంగా లేరంటూ జాబితా నుంచి తీసేస్తున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనలు తెలిసి జనం పాలకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సార్తో ఫోన్ చేయించండి.. ఓడీచెరువు మండలం కొండకమర్ల పంచాయతీ చెరువుమునెప్పపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఎనుమల వెంకటశివారెడ్డి, చెరువు చిన్నపరెడ్డి ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలవుదీరాక వీరిపై రాజకీయంగా కక్షగట్టారు. వృద్ధులు, ఏ ఆసరా లేని వారిని బలిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారికి పింఛన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇందులో ఎనుమల వెంకటశివారెడ్డి, చెరువు చిన్నపరెడ్డికి నాలుగు నెలలుగా పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు. శ్రీనివాసరెడ్డికి మూడు నెలలుగా పింఛన్ మొత్తం అందించకుండా వేధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వారు తమకు పింఛన్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా ఎంపీడీఓ సార్ ఆపమన్నాడని సమాధానం ఇచ్చారు. ఎంపీడీఓను పింఛన్ డబ్బులిప్పించాలని అభ్యర్థించగా.. ‘‘పల్లె సార్ ఆపమన్నాడు, పల్లె సార్ దగ్గరికిపోయి ఫోన్ చేయిస్తేనే మీ పింఛన్ ఇస్తాం’’ అని చెప్పారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేతనయితే సాయం చేయాలి గానీ... ఇలా కీడు చేస్తారా అని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి ఫించన్ ఈ నెల ఆపితే మూడు నెలలు గడిచిపోతుందని.. అప్పుడు పింఛన్ జాబితా నుంచి పేరు తొలగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్నప్ప, వెంకటశివారెడ్డిల పేర్లు పింఛన్ జాబితా నుంచి గతనెలలోనే తొలగించారు. గతంలో కూడా వీరిని ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేయగా.. విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి ఎంపీడీఓ కార్యాలయ అధికారులను మందలించడంతో అదే రోజు వారికి పింఛన్ అందించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అధికారుల వింత వైఖరి గతంలో పింఛన్ అందుకుంటున్న వారికీ నెలలుగా మొండిచేయి నాలుగు నెలల తర్వాత స్థానికంగా లేరంటూ పింఛన్ రద్దు -
అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు
పెనుకొండ: స్థానిక పులేకమ్మ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అటవీ ప్రాంతానంతా వ్యాపించాయి. మంటలు ఎగసిపడటంతో పచ్చని చెట్లు బూడిదయ్యాయి. అడవిని ఆవాసంగా చేసుకుని బతుకుతున్న వన్యప్రాణాలూ మంటల్లో కాలి మృత్యువాతపడ్డాయి. దట్టమైన పొగ జాతీయ రహదారిని కమ్మేయగా...వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కళ్లముందే కాలిపోతున్న అటవీ ప్రాంతాన్ని, వన్యప్రాణులను చూసి ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతమంతా బోధ గడ్డి ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని, అందువల్ల బోధగడ్డిని తొలగించడంతో పాటు అటవీ ప్రాంతానికి ట్రెంచ్లు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ క్లినిక్ల ఏర్పాటు.. భూ వివాదాల పరిష్కారానికి కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటర్లలో ఆయా రెవెన్యూ డివిజన్ల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అడంగల్ మార్పులు–చేర్పులు, మ్యుటేషన్లు, రస్తా, శ్మశాన వాటిక సమస్యలు, 22ఏ చుక్కల భూములు, సబ్ డివిజన్లు, పట్టాదార్ పేరు మార్పులు తదితర అన్ని సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఆదివారం ఆయా డివిజన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాలపై ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 105 మంది గైర్హాజరు పుట్టపర్తి అర్బన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 105 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యశాఖాధికారి చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. 32 కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఇందులో జనరల్లో 1,506 మంది విద్యార్థులకు 1,444 మంది, ఒకేషనల్లో 999 మందికి 956 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. చిరుత సంచారం నల్లచెరువు: మండలంలోని పోలేవాండ్లపల్లి – బాలేపల్లి తండా మార్గంలో ఆదివారం ఉదయం చిరుత కనిపించింది. సామచేనుబైలు గ్రామానికి చెందిన వెంకటేష్ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై నల్లచెరువుకు వెళుతుండగా పొలాల్లో నుంచి రోడ్డు పక్కకు చిరుత రావడాన్ని గమనించాడు. సమాచారం అందుకున్న అటవీ సెక్షన్ అధికారి రామేశ్వరి, గార్డు సుబ్రహ్మణ్యం అకడ్కకు చేరుకుని చిరుత పాద ముద్రలు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఓం నమో వేంకటేశాయ
హిందూపురం: పట్టణంలో ఆదివారం పేట వేంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష జనవాహిని చేసిన ‘నమో వేంకటేశ’ నామస్మరణతో ‘పురం’ పులకించింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం పేట వేంకట రమణ స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం బంగారు కవచాలు, పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. గోవిందా.. గోవింద మధ్యాహ్నం 3 గంటలకు రథం వద్ద వేదపండితులు హోమం నిర్వ హించి శాంతిపూజలు జరిపారు. ఆలయం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత వేంకటరమణస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. రథానికి సంబంధించిన కొత్త దుంగలను యువకులు మోసుకుని ప్రాకారోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను రథం వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్లను భక్తజనం కరతాళల ధ్వనులతో స్వాగతించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా రథంపైకి అరటిపండ్లు, పూలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో మెయిన్రోడ్డు ప్రాంతం మార్మోగింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రథోత్సవం సందర్భంగా సీఐలు రాజగోపాల్ నాయుడు, జనార్దన్, అబ్దుల్కరీం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, మాజీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్నిశ్చల్, ఆలయ కమిటీ చైర్మన్ భగీరథ నవీన్, లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రమనంద్, ఈఓ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా పేట వేంకటరమణస్వామి బ్రహ్మ రథోత్సవం -
కంటైనర్లో మంటలు
చెన్నేకొత్తపల్లి: ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా కంటైనర్ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాలు.. తమిళనాడులోని హోసూరు నుంచి మహారాష్ట్రలోని లాథూర్కు ప్లాస్టిక్ క్రేట్ల లోడుతో బయలుదేరిన కంటైనర్ ఆదివారం సీకేపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా క్యాబిన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ జ్ఞానేంద్రయాదవ్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పెనుకొండ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేసేలోపు క్యాబిన్ మొత్తం కాలిపోయింది. -
రాష్ట్రంలో ఆటవిక పాలన
● మాజీ మంత్రి శంకరనారాయణ ధ్వజం సాక్షి పుట్టపర్తి: దాడులు, విధ్వంసాలు, హత్యలతో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకర నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు పట్టపగలే దాడికి పాల్పడడం చంద్రబాబు విధ్వంసక పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్ పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చిందని, ఈ క్రమంలో వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే అక్కసుతో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపార న్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో, సరైన రీతిలో గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. -
అంబటి అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే
పెనుకొండ రూరల్: సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి, అరెస్టులు జరిగాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం పెనుకొండ నగర పంచాయతీలో ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ క్లీన్చిట్ ఇవ్వడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఎక్కడ వైఎస్సార్ సీపీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే విధ్వంసానికి తెరలేపారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడా చంద్రబాబును దూషించలేదన్నారు. మొదట టీడీపీ నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, అంతటితో ఆగక అంబటి ఇంటి వద్ద విధ్వంసం సృష్టించారన్నారు. ఆయనను హత్య చేసేందుకు ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయన్నారు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పినప్పటికీ పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారని, అయినా ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదన్నారు. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అనేకసార్లు అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు ప్రెస్మీట్ పెట్టి చెప్పినా ఇప్పటికీ అతడిని అరెస్టు చేయలేదన్నారు. అదే పార్టీ నాయకుడు రాయల్ కిరణ్పై కూడా ఎలాంటి చర్యలూ లేవన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, కిష్ణారెడ్డి, నాయకులు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి, మల్లిరెడ్డి, నారాయణ యాధవ్, భూమా నాగిరెడ్డి, చెన్నకేశవులు, బొగ్గు నరసింహులు, నారాయణ స్వామి, పిట్టా బాబు, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలు చేసినా చర్యల్లేవు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ మండిపాటు -
కామంతో కళ్లుమూసుకుని..
ఎన్పీకుంట: మానవత్వం మంటకలిసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కుమార్తైపెనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన స్నేహితులనూ ఆమైపె పురిగొలిపి చివరికి గర్భం దాల్చేలా చేశాడు.వివరాలు..ఎన్పీకుంట మండలంలోని ఓ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువు తోంది. ఇటీవల విద్యార్థిని తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఉపాధ్యాయి నులు గమనించి ఆస్పత్రికి పంపారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. బాలికను ఆరా తీస్తే భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి.తండ్రి కారణంగానే ఇలా జరిగినట్లు తెలిసింది. మద్యం మత్తులో తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడని ఆమె వాపోయింది. ఒకసారి తన స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. సదరు కామాంధుడిపై గతంలో పలు పోలీసు కేసులున్నట్లు తెలిసింది. కుమార్తైపె పలుమార్లు తండ్రి అఘాయిత్యం గర్భం దాల్చిన బాలిక ఎన్పీ కుంట మండలంలో దారుణం -
బైక్ను ఢీకొన్న కారు – బాలుడి మృతి
తాడిమర్రి: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రిలోని న్యూఎస్సీ కాలనీలో నివాసముంటున్న చిన్నసంటి రామకృష్ణ, జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని రామకృష్ణ ఇంటి వద్దనే ఉంచి పనిపై గ్రామంలోకి వెళ్లాడు. ఆ సమయంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు ఓంసాయి (13), చెల్లెలు కుమారుడు ఆకాష్ ద్విచక్రవాహనంపై చెరువు కట్ట సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు వెళుతుండగా పులివెందుల వైపుగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనలో గాయపడిన ఓంసాయి, ఆకాష్ను స్థానికులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఓం సాయి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
● ఊరంతా ఖాళీ!
తాడిపత్రి రూరల్: శతాబ్దాల క్రితం జరిగిన బ్రాహ్మణ హత్య శాపంగా మారి గ్రామాన్ని వెంటాడుతోందని ఇప్పటికీ తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ కారణంగానే నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఆదివారం పాటించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున గ్రామం విడిచి సమీపంలోని హాజీవలి దర్గా ప్రాంతంలో బస చేశారు. పిల్లాపాప, వృద్ధులతో పాటు పశువులు, కోళ్లు, జీవాలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు అన్నీ తమ వెంటే తీసుకెళ్లారు. అక్కడే వంట వార్పుతో సేదతీరారు. అర్ధరాత్రి తర్వాత పౌర్ణమి ఘడియలు దాటాక, అందరూ తిరిగి ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకుని, గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, దీపాలు వేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని, తలస్నానాలు చేసి దేవునికి పూజలు చేశారు. ..ఆ శాపం కారణంగానే ఇందుకు సంబంధించి ఓ కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం బందిపోట్లతో కలిసి ఓ బ్రాహ్మణుడు ఊరిలో పండిన పంటను, ధనాన్ని దోచుకెళ్తుండేవాడు. గ్రామస్తులంతా కలిసి అతణ్ని చంపేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో పుట్టిన మగ శిశువులు మరణించడమే కాకుండా ఊరంతా కరవుకాటకాలతో అల్లాతుండేది. దీనిపై గ్రామస్తులు అప్పట్లో ఓ మునిని అడగగా బ్రాహ్మణ హత్య కారణంగానే గ్రామంలో మగపిల్లలు బతకడంలేదని, ఊరు అభివృద్ధి చెందడం లేదని, ప్రాయశ్చిత్తంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఊళ్లో నిప్పు రాజేయకుండా ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని సూచించారు. అలా చేయడంతో గ్రామానికి మంచి జరిగింది. ఈ ఆచారాన్ని పాటిస్తున్నందుకే గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నామని తలారిచెరువు గ్రామస్తులు అంటున్నారు. -
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వెంకటకృష్ణ
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ చైర్మన్గా అనంతపురానికి చెందిన వంకదారు వెంకటకృష్ణ ఆదివారం నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ ఎఫ్సీసీఐ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా తరఫున ఎంపికై న గోపా జగదీష్, ప్రధాన కార్యదర్శిగా గుత్తి మాకం శ్రీకాంత్, కళ్యాణదుర్గం జయం విశ్వనాథ్, గుంతకల్లు సత్రశాల విష్ణు చైతన్య తదితరులు కూడా బాధ్యతలు స్వీకరించారు. 4న హిందూపురంలో మెగా జాబ్మేళాప్రశాంతినిలయం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4న హిందూపురంలోని ఎస్డీజీఎస్, ఎంబీఏ కాలేజీలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు. 12 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొని, ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నాయి. పదోతరగతి, డిప్లొమా, బీ–ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, బీటెక్, పీజీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు అర్హులు. వెంట విద్యార్హత పత్రాలు, నకళ్లు, ఆధార్, రెండు ఫొటోలు తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 96767 06976, 99594 16770 లో సంప్రదించవచ్చు. జాతీయ సమైక్యత శిబిరానికి ఎన్ఎస్పీఆర్ విద్యార్ధిహిందూపురం టౌన్: ఈ నెల 8 వరకు తేదీ వరకు బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో వారం రోజుల పాటు జరిగే జాతీయ సమైక్యతా శిబిరానికి హిందూపురంలోని ఎన్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బీకామ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశోద ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి ఆదివారం వెల్లడించారు. ఎస్కే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం నుంచి ఏపీ తరఫున ఆమె పాల్గొంటున్నట్లు వివరించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, వికసిత్ భారత్, తదితర అనేక సామాజిక అంశాలపై చర్చా గోష్టి లు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధినిని ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేషులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు శ్రీధర్, ఎన్సీసీ ఆఫీసర్ సరస్వతి, ఎన్ఎస్ఎస్ పీఓ రంగనాయకులు, అధ్యాపకులు అభినందించారు. -
సాంఘిక అసమానతలను ప్రశ్నించాలి
అనంతపురం కల్చరల్: ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలు, దోపిడీ వ్యవస్థలను సాహిత్యం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని అభ్యుదయ రచయితలను అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అభినందించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) ఆధ్వర్యంలో 90 ఏళ్ల అభ్యుదయ సాహిత్యం కార్యక్రమంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం అనంతపురంలోని ఎకాలజీ సెంటర్లో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి రచయితలు, కవులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుకొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ జీవన సాఫల్య అవార్డు గ్రహీత డాక్టర్ శాంతినారాయణ, రాజారాం తదితరులు ప్రసంగించారు. సమాజాన్ని నెలకొల్పే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందన్నారు. ప్రజల పక్షాన కవులు, కళాకారులు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అరసం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బోధన భాష వరకు తెలుగు మాత్రమే ఉండాలని, దాని స్థానంలో హిందీ అమలును ప్రతిఘటించాలని, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులను ప్రకటించే తరుణంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు. పలు పుస్తకాల సమీక్షలు జరిగాయి. విశాఖపట్టణానికి చెందిన బసు పోతన రచించిన ‘మనిషి జాడను వెతుక్కుంటూ’ అనే కవితా సంపుటిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అరసం ప్రధాన కార్యదర్శి తన్నీరు నాగేంద్ర, సీనియర్ రచయితలు తరిమెల అమరనాథరెడ్డి, జనప్రియ కవి ఏలూరు యంగన్న, కడప ఈశ్వరరెడ్డి, ఉప్పరపాటి వెంకటేశులు, మధురశ్రీ, చెట్ల ఈరన్న, కొత్తపల్లి సురేష్, శేషగిరి రాయుడు, గోసల నారాయణస్వామి, యమున, విద్యావతి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి -
వైభవం.. రంగనాథుడి రథోత్సవం
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. వేకువజామునే ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టించారు. ప్రత్యేక పూజల అనంతరం రథోత్సవాన్ని ఎమ్మెల్యే జయరాం, ఈఓ శోభ ప్రారంభించారు. వేలాది మంది భక్తులు రంగనాథ స్వామి నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. -
శనీశ్వరా.. పాహిమాం
పావగడ: స్థానిక శనీశ్వరాలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం జ్యేష్టాదేవి, శనీశ్వరస్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై అధిష్టింపజేశారు. విశేష పూజల అనంతరం గోవింద నామస్మరణతో రథాన్ని భక్తులు లాగారు. శని మహాత్మ సర్కిల్ను చుట్టేసి శిరా మార్గంలో ఉన్న ఆలయ సమీపానికి చేర్చారు. స్థానిక తుముల్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అన్నపూర్ణ దాసోహ భవనంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. వేడుకల్లో ఆలయ సమితి అధ్యక్షుడు అనిల్కుమార్, పదాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
చిన్నారులపై కుక్కల దాడి
కణేకల్లు: వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మాల్యం గ్రామంలో ఆదివారం నాలుగేళ్ల బాలుడు అలీబాషా ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖంపై కరిచి గాయపరిచాయి. ఇక కణేకల్లులోని రామనగర్ భువనేశ్వర్ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి ముందు నిల్చుని ఉండగా కుక్కలు దాడిచేయడంతో గాయపడ్డాడు. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే తప్ప చలనం రాదా అని ప్రశ్నిస్తున్నారు. -
అరటి తోట దగ్ధం
ధర్మవరం రూరల్: మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగు చేసిన అరటి తోట ఆదివారం సాయంత్రం అగ్నికి ఆహుతైంది తనకున్న 3 ఎకరాల్లో 3 వేల అరటి చెట్లను సాగు చేశాడు. ప్రస్తుతం రెండో పంట మొగ్గ దశలో ఉంది. పొలం సమీపంలోని ఎండుగడ్డికి ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు తోటకు వ్యాపించి 1,500 చెట్లు కాలిపోయాయి. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. సర్వేయర్ల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక పుట్టపర్తి టౌన్: జిల్లా సర్వేయర్ల ఉద్యోగ సంఘం ఎన్నిక ఆదివారం పుట్టపర్తిలోని సాయిరామంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సురేష్, దినేష్రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షుడిగా వినోద్కుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రెడ్డిశేఖర్, సెక్రటరీగా ప్రదీప్, జాయింట్ సెక్రటరీగా సురేష్, ట్రెజరర్గా అయూబ్ఖాన్, కార్యవర్గ సభ్యులుగా బాబ్జాన్, షరీన్, నందిని, అపర్ణారెడ్డి, హరీష్కుమార్, నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉగాదికై నా హామీలు నెరవేరేనా?● వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి పుట్టపర్తి అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉగాది నాటికై నా నెరవేర్చేరా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పీఆర్సీ ఊసే లేదన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలు విడుదల చేయాలన్నారు. తక్షణమే పీఆర్సీని ప్రకటించి, 30 ఐఆర్ ఇవ్వాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర హామీలను అమలు చేయాలన్నారు. వైభవంగా గిరి రఽథోత్సవంపుట్టపర్తిటౌన్: పౌర్ణమి సందర్భంగా ఆదివారం సత్యసాయి గిరి రథోత్సవం వైభవంగా సాగింది. అందంగా అలకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతినిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్కూడలి, ెపెట్రోల్బంక్, చింతతోపు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా ఊరేగింపుగా ప్రశాంతినిలయానికి చేర్చారు. రథోత్సవంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో పోటెత్తిన ‘అశ్వత్థం’ పెద్దపప్పూరు: మండలంలోని చిన్నపప్పూరు వద్ద వెలసిన అశ్వత్థ నారాయణ స్వామి క్షేత్రం మాఘ మాసం రెండో ఆదివారం సందర్భంగా భక్తుతో పోలెత్తింది. పెన్నా నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత స్వామి వారిని భక్తులు సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుబడిలో భాగంగా ధర్మావరానికి చెందిన ఎల్లప్ప దేవేంద్రప్ప అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ సుబ్రహ్మణ్యం, చైర్మన్ శివ శంకర్రెడ్డి పర్యవేక్షించారు. -
బాలవికాస్ విద్య నేటి సమాజానికి ఆదర్శం
ప్రశాంతి నిలయం: బాల్యం నుంచే విలువలు, విజ్ఙానంతో పాటు ఆధ్యాత్మికత సంస్కృతిపై జ్ఙానాన్ని ఇచ్చే బాలవికాస్ విద్యా విధానం నేటి సమాజానికి ఆదర్శమని సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్య పేర్కొన్నారు. రెండు రోజుల సత్యసాయి బాల వికాస్ 16వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం తమిళనాడుకు చెందిన బాలవికాస్ విద్యార్థులు బ్రాస్ బాండ్ వాయిద్యంతో కాన్వొకేషన్ ర్యాలీ సాయికుల్వంత సభా మందిరం వరకూ నిర్వహించారు. ఒడిస్సాకు చెందిన బాలవికాస్ బాలికలు నృత్య ప్రదర్శన నిర్వహించారు. చక్కటి నృత్య భంగిమతో వారు నిర్వహించిన ప్రదర్శన భక్తులను మైమరపించింది. అనంతరం 13వ బాలవికాస్ ఆశీర్వాద కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలవికాస ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు. -
సెపక్తక్రా పోటీల్లో విజేత ఉరవకొండ
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా ఆదివారం ప్రారంభమైన అస్మిత సెపక్ తక్రా ఖేలో ఇండియా పోటీల్లో ఉరవకొండ క్రీడాకారులు ప్రతిభ చూపి జిల్లా విజేతగా నిలిచారు. పోటీలను అఖిల భారత సెపక్తక్రా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 18 జట్లు తలపడ్డాయి. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఉరవకొండ సెంట్రల్ ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో కరకముక్కల జెడ్పీహెచ్ఎస్ జట్టు, మూడో స్థానంలో తట్రకల్లు కేజీబీవీ జట్టు నిలిచాయి. జూనియర్ బాలిక విభాగంలో తట్రకల్లు కేజీబీవీ జట్టు మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో ఉరవకొండ సెంట్రల్ పాఠశాల జట్టు, మూడో స్ధానంలో కరకముక్కల జెడ్పీహెచ్ఎస్జట్టు నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, మహేశ్వరీ, సెపక్తక్రా జిల్లా అధ్యక్షుడు షాహిన్, పీడీలు మారుతీప్రసాద్, అనిత, రుద్ర, మౌనిక పాల్గొన్నారు. -
ప్రగతి కూత పెట్టేనా?
గుంతకల్లు: దక్షిణ మధ్య రైల్వేలో ఆదాయ పరంగా గుంతకల్లు రైల్వే డివిజన్ ముందంజలో ఉంటోంది. అయితే కేంద్ర బడ్జెట్లో మాత్రం నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెడుతున్నారు. డివిజన్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అరకొరగా నిధులు కేటాయిస్తుండటమే ఇందుకు కారణం. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానాన్ని పదేళ్లుగా నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్ ప్రసంగంలో రైల్వేల ప్రస్తావన తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు నిధుల కేటాయింపులు కూడా తగ్గిపోయాయి. కొత్త రైల్వే జోన్ రానున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్ నుంచి కొత్త రైళ్లు ప్రకటించాలన్న డిమాండ్ పెరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో గుంతకల్లు రెండో అతిపెద్ద డివిజన్గా ఉంది. దీంతో గుంతకల్లు–విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా రాకపోకలు పెరుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్ల ఆవశ్యకత ఏర్పడుతుంది. కనీసం ఈ ఏడాది (2026–2027) అయినా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ‘ప్రగతి’ కూత పెట్టిస్తారా అని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆదివారం పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైల్వే డివిజన్లో ఇవీ ప్రధాన సమస్యలు.. ● గుంతకల్లు జంక్షన్లో ఏడు ప్లాట్ఫాంలు ఉన్నాయి. ఇందులో 1, 2, 3 ప్లాట్ఫాంలపైకి వచ్చే రైళ్లు మిగిలిన 4, 5, 6, 7 ప్లాట్ఫాంలపైకి వెళ్లడానికి అవకాశం లేదు. దీంతో వీటిని అనుసంధానం చేయకపోతుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్లాట్ఫాంల అనుసంధానం చేయడానికి రెండేళ్ల క్రితం బడ్జెట్లో అనుమతులు ఇవ్వడంతోపాటు దాదాపు రూ.35 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ● దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కడప – బెంగళూరు మధ్య 255 కి.మీ ప్రాజెక్టుకు రూ.2,706 కోట్లు కేటాయిస్తూ 2008లో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మార్గంలో దాదాపు 30 కి.మీ మేర పనులు పూర్తి చేశారు. ● 2023 బడ్జెట్లో కొత్త రైలు మార్గాల కోసం సర్వేలకు అనుమతిస్తూ ప్రతిపాదనలు పంపింది. ఆయా ప్రాజెక్టులకు డివిజన్ అధికారులు సర్వేలు పూర్తి చేసి నివేదికలను జోనల్ అధికారులకు ఇదివరకే పంపారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే రైలు మార్గాలు లేని ప్రాంతాల్లో నిర్మించి రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ధర్మవరం–బళ్లారి మధ్య 130 కి.మీ, రాయచోటి–హిందూపురం మధ్య 162 కి.మీ, మంత్రాలయం–కర్నూలు మధ్య 100 కి.మీ, ముద్దనూరు – ముదిగుబ్బ మధ్య 90 కి.మీతో ప్రాజెక్టులు ఉన్నాయి. రైళ్లు వచ్చేనా..? డివిజన్ కేంద్రమైన గుంతకల్లు జంక్షన్ నుంచి పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, డీఆర్సీసీ సభ్యులు పలుమార్లు వినతులను డీఆర్ఎంతోపాటు జోనల్ అధికారులకు కూడా పంపారు. అయితే ఇంత వరకు ఏ ఒక్క ప్రతిపాదననూ ఆమోదించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులో ధర్మవరం – గుంతకల్లు – కాచిగూడ డైలీ ఎక్స్ప్రెస్ రైలు, పుట్టపర్తి నుంచి షిర్డీకి, గుంతకల్లు – హైదరాబాద్, గుంతకల్లు–విజయవాడ మధ్య పగటి పూట ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాల్సి ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్ – కర్నూలు మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్లు వరకు పొడిగించాలనే డిమాండ్లు ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. కరోనా సమయంలో రద్దు అయిన బెంగళూరు – విజయవాడ – బెంగళూరు, గుంతకల్లు – ధర్మవరం – గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లు ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఇక కొల్హాపూర్ – గుంతకల్లు వయా రాయచూర్ – సికింద్రాబాద్ మీదుగా మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు చేశారు. ముంబై – చెన్నె మధ్య తిరిగే రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్లను, రద్దు అయిన రైళ్లను తిరిగి పట్టా లెక్కేటట్లు చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది. గుంతకల్లు రైల్వే డివిజన్పై కరుణ చూపేరా? నిధుల కేటాయింపుపై ప్రజల గంపెడాశలు నేడు పార్లమెంట్లో ప్రవేశ పెట్టనునున్న కేంద్ర బడ్జెట్ -
విద్యుత్ సక్రమంగా సరఫరా చేయరా?
అమరాపురం: మండల పరిధిలోని నిద్రగట్ట గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ శనివారం హేమావతి విద్యుత్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరగంటకోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. విద్యుత్ శాఖాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ భీష్మించారు. ఏఈ సిద్దేశ్వర అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తానని, మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో రైతులు నిరసన విరమించారు. కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్, అశోక్, ఈరన్న, మంజునాథ, నటరాజు, రవి, రాజు, నరసింహప్ప, నరసింహమూర్తి, చిక్క నరసప్ప, రాజన్న, నాగరాజు, నరసింహప్ప, జంపన్న, యలె రంగ, పరమేష్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పులతో అభివృద్ధి సాధ్యమా?
హిందూపురం టౌన్: మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. రూ.375 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అధికారులు అంకెల గారడీ చేశారని, అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెబుతున్నారని, ప్రజలపై భారం పడే బడ్జెట్ మార్చాలంటూ వైఎస్సార్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయినా పాలక వర్గం, అధికారులు వినకపోతే వారు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అధికార పార్టీ సభ్యులే బడ్జెట్కు ఆమోదం తెలుపుకున్నారు. ‘గొల్లపల్లి’ అప్పులే కట్టలేకపోతున్నాం.. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాలులో శనివారం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. హిందూపురం పాలకసంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.375 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో కేంద్రం నుంచి రూ.78 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.228 కోట్లు నిధులు వస్తాయని, మున్సిపాలిటికి బీపీఎస్ పథకం ద్వారా వచ్చే రూ.9 కోట్లను కలిపి రూ.315 కోట్లను అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. అలాగే పురపాలక సంఘానికి సొంత ఆదాయం రూ. 41.55 కోట్లు వస్తుందని, ఇందులో 35 కోట్లు మున్సిపల్ ఉద్యోగుల జీతభత్యాల నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ, ఇతరాత్ర నిర్వహణ పనులు, విద్యుత్ చార్జీల చెల్లింపు తదితర వాటికి వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేశారు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ సర్కార్ గొల్లపల్లి నీటి పథకం కోసం చేసిన అప్పులకు నేటికీ వడ్డీలు చెల్లిస్తున్నామని మండిపడ్టారు. ఇప్పుడు తాజాగా అప్పులతో అభివృద్ధి చేసి ఆ భారాన్ని పట్టణ వాసులపై మోపడం ఎంతవరకు న్యాయమని కౌన్సిల్ ప్రతిపక్ష నేత ఆసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, కౌన్సిలర్ నాగేంద్రబాబులు వాపోయారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అప్పులు చేయడం లేదని, వచ్చే నిధులను మాత్రమే చూపించామన్నారు. ఇదే విషయంపై కౌన్సిలర్ నాగేంద్రబాబు ఎన్హెచ్బీ లోన్ కింద రూ.136 కోట్లు వస్తున్నట్లు ఎలా చూపించారని ప్రశ్నించారు. రుణాలు కాకపోతే అకౌంట్ కోడ్ మార్చాలని నిలదీశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనగా.. అప్పులతో అభివృద్ధి వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులు నినాదాలు చేశారు. అఫ్పుల భారం పట్టణ వాసులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి టీడీపీ వారే ప్రాతినిథ్యం వహిస్తున్నా...ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో రైల్వే రోడ్డు విస్తరణ చర్యలు చేపట్టి, 90 శాతం మందికి నష్టపరిహారం చెల్లించామని, కానీ ఆ పనులు చేయలేకపోయారన్నారు. అలాగే రైల్వే రోడ్డును వేయలేకపోయారని, కేవలం కొలతలు వేస్తూ, ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అంకెల గారడితో రూపొందించిన ఈ బడ్జెట్ ను తాము వ్యతిరేకిస్తున్నామని, బడ్జెట్ను సవరించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుపట్టినా.. అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు వినకపోవడంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సభలో నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ బడ్జెట్పై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బడ్జెట్ సవరించాలని డిమాండ్... అధికారులు వినకపోవడంతో వాకౌట్ -
వీరభద్రుని సేవలో ఐఏఎస్ సోనాల్ గోయెల్
లేపాక్షి: ఐఏఎస్ అధికారిణి, న్యూఢిల్లీలోని త్రిపుర భవన్ స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ సోనాల్ గోయెల్ శనివారం లేపాక్షిలో వెలసిన వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోనాల్ గోయెల్ ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, వారి సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆమె వెంట ఉన్నారు. కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా కమ్మన్న అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా పోలుగల్లు కమ్మన్న శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇంత వరకు కార్యదర్శిగా పనిచేసిన రమ పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను గ్రంథాలయాల శాఖా సంచాలకుడు కమ్మన్నకు అప్పగించారు. ఇది వరకు ఆయన డిప్యూటీ లైబ్రేరియన్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు మరింతగా పాఠకులు వచ్చేలా, కవులు, రచయితలను భాగస్వాములను చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. ● పదవీ విరమణ చేసిన రమను గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రతాపరెడ్డి, జయరాం, రాజు, రవికుమార్ నాయుడు, శ్రీనివాసులు, రామాంజనమ్మ, గోవిందు, బుల్లె శంకర్, వీరనారాయణరెడ్డి, శ్రీపతి తదితరులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పోలీస్ డైరీ ఆవిష్కరణ పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రూపొందించిన పోలీస్ డైరీ–2026ను ఎస్పీ సతీష్కుమార్ శనివారం స్థానిక సాయి ఆరామంలో ఆవిష్కరించారు. డైరీలో పోలీస్ అధికారులు, సిబ్బందికి అవసరమయ్యే కీలక సమాచారాన్ని పొందుపరచడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డీఎస్పీలు నరశింగప్ప, శివన్నారాయణస్వామి, ఇందిరా, విజయకుమార్, హేమంత్కుమార్, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం కమిటీ సభ్యులు సూర్యకుమార్, దాదాపీర్, పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుర్మరణం కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో కనగానపల్లి రహదారిలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు కనగానపల్లికి చెందిన గొర్రెల కాపరి కుంటాల ఆదినారాయణ (42) కుమారుడు బన్నితో కలిసి మామిళ్లపల్లి సమీపంలో ఉన్న తన గొర్రెల మంద వద్దకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు బన్ని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొన్న మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతునికి భార్య వరలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కనగానపల్లి ఎస్ఐ రిజ్వాన్ తెలిపారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
హిందూపురం: పట్టణంలో శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత పేట వెంకటరమణ స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా బంగారు కవచాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం చేపట్టారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటరమణస్వామిని పల్లకీలో మేళాతాళాల నడుమ తీసుకువచ్చి ముఖమండపంలో కల్యాణ వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రోచ్ఛారణలతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళ హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు నవీన్నిశ్చల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు భగీరథ నవీన్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నేడు బ్రహ్మ రథోత్సవం.. పేట వెంకటరమణస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. ఇప్పటికే రథాన్ని తోరణాలతో అలంకరించి సిద్ధం చేశారు. -
స్పెల్బీలో జిల్లా విద్యార్థి సత్తా
ప్రశాంతినిలయం: రాష్ట్ర స్థాయిలో జరిగిన స్పెల్బీ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థి సత్తా చాటి రెండో స్థానంలో నిలిచాడని డీఈఓ కృష్ణప్ప, జిల్లా పరీక్షల మండలి సెక్రటరీ గోపాల్, జిల్లా సైన్స్ అధికారి తనూజ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఎస్సీఈఆర్టీ, విభా ఆధ్వర్యంలో స్పెల్బీ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా,పదో తరగతి విభాగంలో కొత్తచెరువు బాలుర పాఠశాలకు చెందిన జశ్వంత్ కుమార్రెడ్డి రాత పరీక్ష, ఓరల్ రౌండ్లో ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచినట్లు వివరించారు. విజేతలకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటక్రిష్ణారెడ్డి జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పుట్టపర్తి టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీడాప్ జాబ్ కోఆర్డినేటర్ ఆంజనేయులు తెలిపారు. పది, ఇంటర్,డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి 19–26 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్నెట్ స్కిల్స్పై 90 రోజుల పాటు అనంతపురంలో శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 9676042701, 8074495608 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
అనంతపురం: ఆర్డీటీ మైదానంలో శనివారం సినీతారల క్రికెట్ మ్యాచ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ సందడి చేశారు. నటీనటులను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఫైనల్ పోటీల్లో బ్లూ బ్లాస్టర్ జట్టు, గ్రీన్ గ్లాడియేటర్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బ్లూ బ్లాస్టర్స్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన గ్రీన్ గ్లాడియేటర్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బ్లూ బ్లాస్టర్స్ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయకేతనం ఎగరేసింది. విజేత జట్టుకు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ ట్రోఫీ అందించారు. -
సేంద్రియం వైపు.. రైతు చూపు
ధర్మవరం రూరల్: పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో నేలలోని పోషకాల నిల్వల్లో సమతుల్యత లోపించి ఉత్పాదకత తగ్గుతోంది. చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాల లోపం తదితర కారణాలతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే సేంద్రియ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తుండడంతో ఆ దిశగా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సేంద్రియ ఎరువులకు డిమాండ్ పెరగడమే ఇందుకు నిదర్శనం. ధర్మవరం మండలంలో 20 పంచాయతీల్లో 22 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 వేల హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తుంటారు. చీనీ, బొప్పాయి, మామిడి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష , దోస, కళింగర తదితర పంటలతో పాటు వేరుశనగ, కాయ గూరల పంటలను విరివిగా పండిస్తుంటారు. మండలంలో పాడి సంపద ఎక్కువగా ఉంది. దీనికి తోడు గొర్రెలు, మేకలు అధికంగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఎరువులను పొలాలకు వాడుతున్నారు. సేంద్రియ ఎరువులతో భూసారం.. పొలాలు దుక్కులు దున్నేముందు పశువులు, గొర్రెల ఎరువును పొలాల్లో వేసుకుంటే బాగుంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. దుక్కులు దున్నిన తరువాత పశువుల పేడ, గొర్రెల పెంట మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు సేంద్రియ ఎరువు ఎంతో ఉపయోగపడుతుంది. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును వినియోగిస్తే భూమి సారవంతమవుతుంది. గొర్రెల పెంటకు భలే గిరాకీ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల్లో గొర్రెలు ఉన్నాయి. ఒకప్పుడు రెండు మూడు సామాజిక వర్గాల వారే గొర్రెలను మేపే వారు. ఇటీవల గొర్రెల మాంసా నికి డిమాండ్ ఉండడంతో చాలా మంది షెడ్లను ఏర్పాటు చేసుకొని మరీ గొర్రెలను పెంచుతున్నారు. గొర్రెల పెంటకు గిరాకీ ఉండడంతో కాపరులకు అదనపు ఆదాయం తెచ్చి పెడుతోంది. గొర్రెల పెంట కోసం ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడానికి వ్యాపారులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు కాపర్లు చెబుతున్నారు. తమ వద్దకే వచ్చి గొర్రెల పెంట 30 కిలోల బస్తాను రూ. 60 దాకా వెచ్చించి కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. గొర్రెల పెంటను కర్ణాటక రాష్ట్రంలో వక్క చెట్లకు, దానిమ్మ తోటలకు అధికంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది. సేంద్రియ ఎరువులతో ఎన్నో లాభాలు అధిక దిగుబడులతో పాటు భూసారం పెంపు అధికారుల సూచనలతో అటువైపు అన్నదాతల దృష్టి అధిక దిగుబడులు.. పొలాలకు సేంద్రియ ఎరువులను తోలుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. రసాయనిక మందులను వేసుకుంటే వారం పది రోజుల పాటు మాత్రమే పొలం కళగా వుంటుంది. ఆ తరువాత యథాస్థితికి వస్తుంది. పశువుల ఎరువును వేసుకుంటే చివరి వరకు పొలం పచ్చగా కళకళలాడుతుంది. దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. – వెంకటరెడ్డి, రైతు, కుణుతూరు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టండి రసాయన ఎరువులను అధికంగా వాడుతుండడంతో తో భూమిలోని సారం తగ్గిపోతుంది. రైతులు సేంద్రి య సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పంట మార్పిడితో రైతులకు ఆర్థిక దన్ను ఉంటుంది. సేంద్రియ ఎరువులతో భూమి సారవంతంగా మారుతుంది. అధిక దిగుబడులనూ సాధించవచ్చు. – ముస్తఫా, వ్యవసాయాధికారి, ధర్మవరం -
సత్యసాయి బాలవికాస్తో బంగారు భవితకు పునాది
ప్రశాంతినిలయం: సత్యసాయి బాలవికాస్ విద్య ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. ప్రశాంతినిలయంలో బాలవికాస్ పూర్వ విద్యార్థుల 16వ ఆలిండియా సమావేశం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 2,500 మంది బాలవికాస్ పూర్వ విద్యార్థులు, గురువులు పాల్గొన్నారు. ముందుగా ఆర్జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, నిమీష్పాండ్యాలు బాలవికాస్ విద్యా విధానానికి సంబంధించిన టేబుల్ బుక్ను విడుదల చేశారు. రత్నాకర్ రాజు మాట్లాడుతూ బాల్యం నుంచే క్రమశిక్షణ కలిగిన విద్యను అందిస్తూ ఆరోగ్యకరమైన బాల్యాన్ని తీర్చిదిద్దాలని సత్యసాయి బాబా 1969లో బాలవికాస్ విద్యా విధానాన్ని ప్రారంభించారన్నారు. నేడు దేశంలోని 1,676 బాలవికాస్ కేంద్రాల్లో 21,370 మంది గురువులు బోధన అందిస్తున్నారన్నారు. అనంతరం బాల వికాస్ విద్యార్థులు నృత్యప్రదర్శన నిర్వహించారు. మానవతా విలువలతో తమదైన ప్రతిభ చాటిన పూర్వ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు పంపిణీ చేశారు. -
శభాష్ ‘నిత్యశ్రీ’
● తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1కు ఎంపిక ● డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టు దక్కిన వైనం ● గ్రూప్లో–2లో సైతం సత్తా చాటిన తనకల్లు యువతి తనకల్లు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో తనకల్లుకు చెందిన నిత్యశ్రీ సత్తాచాటారు. జోన్–2 పరిధిలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సర్వీసులో డిప్యూటీ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. తొలిప్రయత్నంలోనే ఆమె గ్రూప్–1 సాధించడం విశేషం. రెండు రోజుల క్రితం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లోనూ మంచి ప్రతిభ చూపి రోడ్లు, భవనాల శాఖలో పోస్టు సాధించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే.. నిత్యశ్రీ ప్రాథమిక విద్య నుంచి పదో తరగతి వరకూ మొలకలచెరువులో చదివారు. ఆ తర్వాత ఐఐఐటీ ఇడుపులపాయ క్యాంపస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమె తల్లిదండ్రులు రెడ్డెప్ప, టి.శ్రీవాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీవాణి తనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవలే బదిలీపై హిందూపురానికి వెళ్లారు. తండ్రి రెడ్డెప్ప బి. కొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా నిత్యశ్రీ తొలిసారే గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ రిజిస్ట్రార్గా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సివిల్స్ సాధించడమే లక్ష్యం నా తల్లిదండ్రులతో పాటు మేనమామలు లక్ష్మీనారాయణ, గిరిధర్ అందించిన ప్రోత్సాహంతోనే నేను గ్రూప్–1లో విజయం సాధించగలిగాను. డిప్యూటీ రిజిస్ట్రార్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. అయితే నా టార్గెట్ సివిల్స్. అందులో విజయం సాధించి కలెక్టర్గా పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం. – నిత్యశ్రీ -
లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే
పుట్టపర్తి: తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సాగిన ప్రచారం ‘పచ్చ’ నేతల కుట్రేనని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం తిరుమల వెంకన్న ప్రసాదాన్ని వాడుకోవడం దుర్మార్గమన్నారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ కాలేదంటూ సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిన నివేదిక చూసైనా వారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ‘కల్తీ నెయ్యి’ అంటూ కూటమి నేతలు చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశారు. రాజకీయం కోసం ఎంతకై నా దిగజారి ప్రవర్తించే కూటమి పార్టీల నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని దేవుళ్లను వేడుకున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ‘‘నెయ్యి కాదు కల్తీ..చంద్రబాబు రాజకీయం కల్తీ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టపర్తిలో హనుమంతునికి పూజలు.. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సూచన మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు పుట్టపర్తి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిపై కూటమి నేతల విష ప్రచారాలను ఖండించారు. మోసం, అబద్ధాలు, కుట్రలతో పాలన సాగిస్తున్న కూటమి నేతలు సీబీఐ చార్జ్ షీట్ చూసైనా మారాలని, గత జగన్ సర్కార్ పై విషం చిమ్మడం మానుకోవాలని సూచించారు. అంతకుముందు హనుమాన్ సర్కిల్లో కూటమి కుట్రలపై ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, పుట్టపర్తి పట్టణ కన్వీనర్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. హిందూపురంలో.. తమ స్వార్థం కోసం కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అంటూ హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త టీఎన్ దీపిక, పార్టీ నేత వేణురెడ్డి తదితరులు దేవ దేవుడిని కోరుకున్నారు. శనివారం వారు స్థానిక పేట వేంకటరమణ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘చంద్రబాబు అండ్ కో’ తిరుమల లడ్డూపై అసత్య, విష ప్రచారాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. సీబీఐ ఇచ్చిన చార్జ్ షీట్ చూసైనా కూటమి నేతల విష ప్రచారం మానుకోలేదన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేదని సీబీఐ తేల్చి చెప్పిందన్నారు. కదిరిలో... తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నానా యాగీ చేసిన కూటమి నేతలకు కనీసం సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ వేసిన చార్జ్ షీట్ చూసైనా బుద్ధి రావాలని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అన్నారు. శనివారం పార్టీ నేతలతో కలిసి స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పచ్చ బ్యాచ్కు బుద్ధిరావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి కల్తీ కాలేదని సీబీఐ చార్జ్ షీట్లో పేర్కొందని, ఇంతకంటే రుజువులు ఏమి ఉంటాయని మక్బూల్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాష తదితరులు పాల్గొన్నారు. మడకశిరలో.. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా మడకశిర నియోజకవర్గం పరిధిలోని అమారాపురంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘కల్తీ నెయ్యి’ అంటూ సీఎం చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న అసత్యపు ప్రచారాలను తప్పుపట్టారు. నెయ్యి కల్తీ జరగలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థ సీబీఐ స్పష్టం చేసినప్పటికీ... కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసి కూటమి నేతలు కోట్లాది మంది భక్తులను త ప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ధర్మవరంలో... కూటమి నేతల కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం ధర్మవరం చెన్నకేశస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ తేల్చిచెప్పిందని, ‘కల్తీ నెయ్యి’ అంటూ ఆరోణలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నారు. నీచ రాజకీయాల కోసం కలియుగ దైవం వెంకన్న ప్రసాదాన్ని వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కుళ్లాయప్ప, పురుషోత్తమరెడ్డి, శ్రీనివాసులు, పార్టీ జిల్లా నేతలు గుర్రం శ్రీనివాసరెడ్డి, చందమూరి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూకు వాడే ‘నెయ్యి కల్తీ’ ప్రచారంపై వైఎస్సార్ సీపీ నేతల కన్నెర్ర రాజకీయ ప్రయోజనం కోసం వెంకన్న ప్రసాదాన్ని వాడుకోవడంపై ఆగ్రహం కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆలయాల్లో పూజలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు -
చదువుకుంటేనే ఉజ్వల భవిత
చిలమత్తూరు: ‘‘డబ్బు ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు. కానీ చదువు అలా కాదు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. అందువల్ల అందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’’ అని రాష్ట్ర లేబర్ కమిషనర్, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేకాధికారి గంధం చంద్రుడు, కలెక్టర్ శ్యాం ప్రసాద్లు టేకులోడు ఎంజేపీ విద్యార్థినులకు సూచించారు. శనివారం వీరు టేకులోడు క్రాస్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... క్రమశిక్షణతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందన్నారు. బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. 10 వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఆ దిశగా విద్యార్థులను చదివించాలని సూచించారు. సౌకర్యాలు కల్పించండి.. గురుకుల పాఠశాల పక్కనే ఉన్న జగనన్న కాలనీలో సౌకర్యాలు లేక రెండేళ్లుగా కష్టాలు పడుతున్నామని కాలనీ వాసులు కలెక్టర్ ఎదుట వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోతోందన్నారు. అలాగే తాగునీరు, వీధి లైట్లు కూడా లేవన్నారు. దీంతో కలెక్టర్ శ్యాం ప్రసాద్, గంధం చంద్రుడుతో కలిసి కాలనీలో పర్యటించారు. సమస్యలు వెంటనే పరిష్కారించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ మనోజ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ్, ఎంఈఓ హనుమంతరెడ్డి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి టేకులోడు ఎంజేపీ విద్యార్థినులతో గంధం చంద్రుడు, శ్యాం ప్రసాద్ -
చివర్లో పెరిగిన చలిగింతలు
● తనకల్లులో 9.4 డిగ్రీలు, రాప్తాడులో 12.4 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్: సీజన్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ‘చలి’ గింతలు పెరిగాయి. వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల మధ్య నమోదు కావడంతో చలి తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయితే వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ 10 నుంచి 15 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో చలి వాతావరణం పెరిగింది. ఉదయం పూట పొగమంచు ఆవరిస్తోంది. శనివారం శ్రీసత్యసాయి జిల్లా తనకల్లులో 9.4 డిగ్రీలు, గాండ్లపెంటలో 9.8 డిగ్రీలు, మడకశిరలో 10.1 డిగ్రీలు.. ఇలా కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు అనంతపురం జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోగా చలి ప్రభావం కనిపిస్తోంది. ఈనెల 15 వరకు ఉదయం పొగమంచు, చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంపిణీకి పాసు పుస్తకాలు సిద్ధం చేయాలిప్రశాంతి నిలయం: రీసర్వే పూర్తయి ఇప్పటికే డ్రాఫ్ట్ పాసు పుస్తకాలు అందించిన గ్రామాల్లోని రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకూ గ్రామల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు క్యూర్ కోడ్తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో పంపిణీ చేయాల్సిన పాసు పుస్తకాల్లో పట్టాదారు వివరాలు, పొలం విస్తీర్ణం తదితర వివరాలతో పాటు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. గస్తీ పెంచండి.. చోరీలు నియంత్రించండి ● నేర సమీక్షలో ఎస్పీ ఆదేశం పుట్టపర్తి టౌన్: గస్తీ పెంచి చోరీలను పూర్తిగా నియంత్రించాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. అలాగే ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. శనివారం ఆయన స్థానిక సాయి ఆరామంలో అన్ని సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చోరీల నివారణ, గ్రేవ్, నాన్గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు యాక్సిడెంట్ కేసుల గురించి చర్చించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం వివిధ కేసుల ఛేదింపులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం వివిధ కేసుల దర్యాప్తులో లీగల్గా ఎదురయ్యే సమస్యల గురించి పుట్టపర్తి జడ్జి ముజీజ్ సయ్యద్ పోలీస్ అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... పెండింగ్ కేసుల ఛేదింపులో పురోగతి సాధించాలన్నారు. చోరీల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఎస్ఐలు మరింత ఽబాధ్యతగా పనిచేయాలన్నారు. ఆర్టీసీ బప్టాండ్లో చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విజుబుల్ పోలీసింగ్తో పాటు నైట్ విజన్ డ్రోన్లతో నిఘా పెంచాలన్నారు. అలాగే గ్రామ సందర్శనలు, పల్లె నిద్రలు చేపట్టి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరస్తులను జిల్లా నుంచి బహిష్కరించేందుకు సిఫార్సు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి శాఖ ప్రతిష్ట పెంచాలన్నారు. కార్యక్రమంలో పోలీసు లీగల్ అడ్వయిజర్ సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్కుమార్, నర్సింగప్ప, శివన్నారాయస్వామి, ఇందిరతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై రైతన్నల ఆగ్రహం
రొద్దం: అధికార పార్టీ అండదండలతో కొందరు ఇసుక అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పెన్నమ్మను తూర్పారబడుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఫలితంగా భూగర్భ జలమట్టం తగ్గి బోర్లు ఒట్టిపోయి సాగునీటికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇసుకను తరలించవద్దని వేడుకున్నా ఇసుకాసురులు వినిపించుకోలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులపై రైతులు కన్నెర్ర జేశారు. శనివారం మండల కేంద్రంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా పెన్నానదిలో ఇసుక తవ్వకాల కోసం ఇసుక అక్రమ రవాణాదారులు వేసిన రోడ్డును జేసీబీతో ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్లను స్టేషన్ను తరలించారు. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన అక్రమార్కులను పోలీసులకు అప్పగించిన వైనం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
● 108కు ఫోన్ చేసినా స్పందించని వైనం రొద్దం: మండల పరిధిలోని ఆర్ మరువపల్లి పాత చెక్ పోస్టు సమీపంలో వెంకటరాపురం–రొద్దం ప్రధాన రహదరిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యేక సాక్షుల వివరాలమేరకు.. శుక్రవారం సాయంత్రం రెడ్డిపల్లికి చెందిన శివకుమార్ రొద్దం వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వస్తున్నాడు. గోనిమేకులపల్లికు చెందిన అన్వర్ ద్విచక్ర వాహనంలో అటుగా వస్తున్నాడు. ఆర్ మరువపల్లి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయగా 108 వాహనం పెనుకొండ నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడంతో ప్రైవేట్ వాహనంలో పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించినట్లు తెలిపారు. రొద్దంలో 108 వాహనం ఉన్నా కూడా తిప్పడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయంపై డీఎం అనిల్ను వివరణ కోరగా రొద్దంలో ఉన్న వాహనం తిప్పకపోవడంపై తమకు సమాచారం లేదన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. 37వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో పాటు సర్వీసులో ఒక్క ప్రమాదం చేయని ఆర్టీసీ డ్రైవర్లను అభినందించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్, ఆర్డీఓ సువర్ణ, డీపీటీఓ మధుసూదన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రమాద రహిత డ్రైవర్లుగా ఎంపికై న 18 మందిని డ్రైవర్లను సన్మానించారు. ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... రహదారులపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, అందువల్ల ప్రతి పౌరుడూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సురక్షిత ప్రయాణానికి డ్రైవర్లంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇయతుల్లా, ఆరు డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్చార్జ్లు, డ్రైవర్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని బలవన్మరణం
ఓడీచెరువు (అమడగూరు): అమడగూరు మండల పరిధిలోని చీకిరేవులపల్లికి చెందిన పీట్ల రమేష్, అనిత దంపతుల కుమార్తె ఝాన్సీ (14) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు... అమడగూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఝాన్సీ తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే సరిగా చదవడంలేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అమడగూరు ఎస్ఐ గోపాలక్రిష్ణ, నల్లమాడ సీఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఆత్మకూరు: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని నందిని (18) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నందిని విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 23న స్వగ్రామమైన కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురంకు వచ్చింది. తాను ఎక్కువగా చదువుకున్నది , ఉన్నది తలుపూరులో అవడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటానంటూ ఈ నెల 28న తలుపూరుకు వచ్చింది. 29న తండ్రి నాగరాజు కళాశాలలో వదిలివస్తాను బయలుదేరు అని చెప్పాడు. రేపు వెళ్తామని చెప్పి ఫోన్ పెట్టేసింది. శుక్రవారం ఉదయం కూడా నాగరాజు ఫోన్ చేసి కళాశాలకు వెళ్దాం బయలుదేరు అని చెప్పాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు చూసి తల్లిదండ్రులు నాగరాజు, మల్లీశ్వరికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నందినికి అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని వారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి ధర్మవరం అర్బన్: పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన కొండన్న (80) ద్విచక్ర వాహనంపై మేడాపురం నుంచి పట్టణానికి వస్తుండగా పట్టణంలోని అరిగెల పోతన్న రైస్ మిల్ సమీపంలో వెనుక వైపు నుంచి లారీ ఢీకొందన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కొండన్నను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, అయితే అక్కడ చికిత్స పొందుతూ కొండన్న మృతి చెందాడని తెలిపారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం లేపాక్షి: మండలంలోని పీ సడ్లపల్లి సమీపంలో ట్రాక్టర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందారు. వివరాలు ... హిందూపురం రూరల్ మండలంలోని జుమాకులపల్లికి చెందిన సునీల్ (26) హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి జుమాకులపల్లి నుంచి హిందూపురానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. లేపాక్షి మండలం పీ. సడ్లపల్లి సమీపంలో ప్రమాదశాత్తూ ఇసుక ట్రాక్టర్ను ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారుబోల్తా – నలుగురికి గాయాలు చిలమత్తూరు: మండల పరిధిలోని 544–ఈ జాతీయ రహదారి కనుమ అటవీ ప్రాంతం సమీపంలో శుక్రవారం లేపాక్షి వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 ద్వారా హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. -
టీడీపీ కౌన్సిలర్ వేధిస్తున్నాడు
కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని 24వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా ఏడాది నుంచి వేధిస్తున్నడని అదే వార్డుకు చెందిన రూక్సానా కన్నీరు మున్నీరైంది. వివరాలు ఇలా.. మున్సిపల్ పరిధిలోని 24 వార్డులో సర్వే నంబర్ 682–3సీలో రుక్సానాకు 15 అడుగుల స్థలం ఉంది. వార్డులో ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో 7 అడుగుల జాగలో నిర్మాణం చేపడుతుండగా అధికారం బలంతో సచివాలయ ఉద్యోగులను పంపి నిర్మాణాం చేపట్టుకుండా అడ్డుపడుతున్నారని రుక్సానా ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అరీఫుల్లా చనిపోయాడని, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని బతకడానికి కష్టంగా ఉన్న తరుణంలో తమ స్థలంలో నిర్మాణం చేపడుతుంటే టీడీపీ కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా అడ్డుకుంటున్నాడన్నారు. తాము వైఎస్సార్సీపీ అన్న ఒకే ఉద్దేశంతో ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. నిర్మాణాలు పడకొట్టాలని జేసీబీని తీసుకొచ్చారని, పడగొట్టడం ఖాయం దిక్కున్న చోట చెప్పుకోండని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. దీంతో రుక్సానా రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
మహాత్ముడు మళ్లీ పుట్టాలి
పరిగి/హిందూపురం: భారతజాతికి స్వేచ్ఛావాయువుల కొనసాగింపునకు జాతిపిత మహాత్మాగాంధీ మళ్లీ పుట్టాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. మండలంలోని సేవామందిరంలోని ఏఎం లింగణ్ణ విద్యాసంస్థల ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల క్రితం మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం నుంచి మహాత్మాగాంధీ సందేశ్ యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. హిందూపురం వరకూ చేపట్టిన యాత్రలో భాగంగా చివరి రోజు శుక్రవారం సేవామందిరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం హిందూపురం పట్టణంలోని గాంధీ సర్కిల్ వరకు పాదయాత్రగా నడిచి వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముగింపు సభలో రఘువీర మాట్లాడుతూ ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరును మార్చడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుండటం బాధాకరమన్నారు. దేశంలో వివిధ సోషల్ మీడియాలో గాంధీని అవహేళన చేస్తూ సందేశాలను పంపుతూ నేటి యువతకు తప్పుదోవ పట్టిస్తూ గాంధీని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ మహత్ముడి రూపాన్ని ఎవరూ దేశం నుంచి చేరపలేరని, ఆయన స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం, చేసిన త్యాగం మరవలేవన్నారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర బీసీ అధ్యక్షుడు దాదా గాంధీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
పుట్టపర్తి టౌన్: జిల్లాకు చెందిన ఇద్దరికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లోని కమిటీల్లో చోటు కల్పించారు. అలాగే మరో పది మందిని జిల్లా కమిటీల్లో నియమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరానికి చెందిన షేక్ బాషా, పుట్టపర్తికి చెందిన ఎం. మాబూసాబ్ను మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా రెడ్డివారి రాజశేఖర్రెడ్డి (ధర్మవరం), ప్రధాన కార్యదర్శిగా కోటి నరేష్ (ధర్మవరం), కార్యదర్శులుగా రాజశేఖర్రెడ్డి(ధర్మవరం), కె.రాజుకుళ్లాయప్ప (ధర్మవరం), కార్యనిర్వాహక సభ్యులుగా డి.యుగంధర్(ధర్మవరం), డి.శ్యామ్ కుమార్ (ధర్మవరం)ను నియమించారు. ఇక జిల్లా మైనారిటీ సెల్ కార్యనిర్వాహక సభ్యులుగా ఎస్.చాంద్బాషా (హిందూపురం) ఎఫ్. ఇర్షాద్ (హిందూపురం), హెచ్.ఆర్. నూరుల్లా(హిందూపురం), షేక్ షాజహాన్ ( హిందూపురం)ను నియమించారు. -
తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక చిలమత్తూరు: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ, జనసేన డైవర్సన్ పాలిటిక్స్కు తెరతీశాయని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక విమర్శించారు. శుక్రవారం హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతటి నీచానికై నా దిగజారే మనస్తత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉందనే విషయాన్ని ప్రజలే మాట్లాడుకుంటున్నారన్నారు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళతో ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారో అందరికి తెలుసన్నారు. అలాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండటం దురదృష్టకరమన్నారు. రెండేళ్లుగా టీడీపీ, జనసేన నాయకులు చేయని అకృత్యాలు లేవని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు, అక్రమాలు ఇరు పార్టీలు పోటీ పడి చేస్తున్నాయన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఉద్దేశ పూర్వకంగా తిరుమలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, తగిన సమయంలో భగవంతుడే తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. -
డ్వాక్రా మహిళకు టోకరా
హిందూపురం: పట్టణంలోని ఎస్బీఐ ధనలక్ష్మి రోడ్డు బ్రాంచ్లో కొట్టిపి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళ గంగరత్నమ్మను ఓ మోసగాడు బురిడి కొట్టించి రూ.50 వేలు కాజేశాడు. వివరాల్లోకెళితే... గంగ రత్నమ్మ సంఘం అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి 15 రోజుల క్రితం ఎస్బీఐ ధనలక్ష్మి రోడ్డు బ్రాంచ్కు వచ్చింది. ఆమెకు చదవడం, రాయడం రాకపోవడంతో అక్కడే ఉన్న గుర్తుతెలియని ఓ వ్యక్తికి ఫారం నింపి ఇవ్వాలని కోరింది. దీన్ని అదునుగా తీసుకున్న ఆ వ్యక్తి ఫారంలో తన సొంత ఖాతాకు రూ.50 వేలు పడేలా రాసిచ్చాడు. దీంతో ఈమె నేరుగా కౌంటర్లో ఫారం అందించింది. ఇప్పుడు తాజాగా మహిళా సంఘం సభ్యులు సమావేశమయ్యారు. స్లిప్ తప్పుగా ఉండటంతో అందరూ గంగరత్నమ్మను ప్రశ్నించారు. ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించింది. స్వయంగా మీరే బ్యాంకులో నగదు జమ చేశారని వారు సమాధానం ఇచ్చారు. అతను వెంటనే డ్రా కూడా చేసుకున్నాడని చెప్పారు. దీంతో మహిళా సంఘం సభ్యులు టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖాతా వివరాలు మార్చి రూ.50 వేలు డ్రా లబోదిబోమంటున్న మహిళా సంఘం సభ్యులు -
చంద్రబాబు హయాంలో చేనేత నిర్వీర్యం
పెనుకొండ రూరల్: చంద్రబాబు హయాంలో చేనేత రంగం నిర్వీర్యమైందని, సర్కార్ సాయం లేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమందేపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘నేతన్న పోరు’ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత స్థానిక చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చేనేత కార్మికులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉషశ్రీచరణ్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి రెండేళ్లవుతున్నా...చేనేతలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందన్నారు. గతంలో వైఎస్ జగన్ అమలు చేసిన ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా చేనేతలకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్ అందేదన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేనేతల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల కాలంలో నేతన్నలకు నూతనంగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. చేనేత ముడిసరుకుల ధరల నియంత్రణకూ చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ప్రభుత్వానికి నేత కార్మికుల బాగోగులు పట్టలేదన్నారు. చేనేత కార్మికుల కష్టాలు పట్టవా..? చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న సవితకు రెండేళ్లుగా చేనేత కార్మికుల కష్టాలు గుర్తుకు రాలేదని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతన్నల కోసం పోరు కార్యక్రమం తలపెట్టగానే మంత్రి... ఆగమేఘాల మీద అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి... ఏప్రిల్ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారన్నారు. వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేస్తే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వానికి గుర్తుకు రావా అని ప్రశ్నించారు. చేనేతలకు నూతన ఫించన్లు ఎప్పుడు ఇస్తారో కూడా మంత్రి ప్రకటించాలన్నారు. చేనేతల సంక్షేమంపై మంత్రి సవితకి చిత్త శుద్ధి ఉంటే చేనేత కార్మికుల అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నేతన్నల కష్టాలు తెలిసిన నేత జగన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు చేనేతలకోసం అమలు చేశారని ఉషశ్రీచరణ్ గుర్తు చేశారు. ఆప్కో బకాయిలు రూ.108 కోట్లు చెల్లించారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చేనేత ముడి సరుకుల ధరలు తగ్గించారన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి చేనేత కార్మికునికీ ఏడాదికి రూ.24 వేలు ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. బోలే బాబాకు టెండర్ ఇంచ్చింది చంద్రబాబే టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు ప్రభుత్వం కావాలనే వైఎస్సార్ సీపీపై విష ప్రచారం చేసిందని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ జరగలేదని ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిందన్నారు, 2018లో బోలే బాబా డెయిరీకి టెండర్ ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాజకీయాలు కోసం దేవున్ని కూడా కూటమి ప్రభుత్వం వదల్లేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. దేవుడిపై రాజకీయాలు చేసిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్, సర్పంచ్ నరసింహమూర్తి, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, శ్రీనివాసులు, గజేంద్ర, శంకర, నరసింహ మూర్తి, బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, తిమ్మయ్య, నాయకులు వేణు గోపాల్, మంజునాథ్, లక్ష్మీనరసప్ప, జిలాన్ ఖాన్, క్రిష్టప్ప, సోము, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్, జితేందర్ రెడ్డి, శివమ్మ, నాగళూరు బాబు, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఎన్. నారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కంబాలప్ప, కొండలరాయుడు, బోయ రాము తదితరులు పాల్గొన్నారు. నేతన్నలకు అందని కొత్త ఫించన్లు, అమలు కాని ఉచిత విద్యుత్ ఇప్పటికై నా ఇచ్చిన హామీలు అమలు చేయాలి బడ్జెట్లో చేనేతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి హామీలు విస్మరిస్తే ఏప్రిల్లో భారీ ఎత్తున ఉద్యమాలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
మడకశిర: తిరుమల లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు... చెంపలేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని మడకశిర నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మడకశిరలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో సీబీఐ వేసిన అభియోగపత్రంలో తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొందన్నారు. కేవలం చంద్రబాబు తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. ఈ విషయంలోవైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. చేసిన తప్పుకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే దేవుడే శిక్షవేస్తారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై ఉన్న కోపంతోనే చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేసి ఘోర తప్పిదం చేశారని తెలిపారు. ఇప్పటికై నా చేసిన తప్పును ఒప్పుకుని చంద్రబాబు పాపపరిహారం చేసుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప -
వైషమ్యాలు వీడితేనే ప్రశాంత జీవనం
● ప్రజలంతా కలసి మెలసి జీవించాలి ● పౌరహక్కుల సదస్సులో కలెక్టర్ శ్యాంప్రసాద్ ,ఎస్పీ సతీష్కుమార్ కనగానపల్లి: ఆధిపత్య పోరుతో అందరినీ నష్టమేనని, అందరూ వర్గ వైషమ్యాలు వీడి ప్రశాంత జీవనం సాగించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ సూచించారు. శుక్రవారం వారు మండల పరిధిలోని తగరకుంటలో నిర్వహించిన పౌరహక్కుల సదస్సులో ముఖ్య అథితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలన్నారు. హింసతో మానసిక ప్రశాంతత దూరం కావడం తప్ప ఒరిగేది ఏమీ ఉండన్నారు. ఏ గ్రామం కక్షలకు, ఘర్షణలకు దూరంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. అనంతరం పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు బాధ్యతగా జీవించాలన్నారు. ఫ్యాక్షన్కు దూరంగా ఉండి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్ కుమార్తో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రూప్–1లో మెరిసిన దివ్యశ్రీ అనంతపురం: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలో దివ్య శ్రీ సత్తా చాటి డీఎస్పీ పోస్టు సాధించింది. రాష్ట్రంలో 25 మంది డీఎస్పీలుగా ఎంపిక కాగా.. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి దివ్య శ్రీ ఎంపికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలుకు చెందిన దివ్యశ్రీ తల్లిదండ్రులు గాండ్ల రంగనాథం, క్రిష్టమ్మ. అనంతపురం నగరంలో స్థిరపడ్డారు. దివ్య శ్రీ సోదరుడు నంద కిరణ్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. దివ్యశ్రీ సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్–1 సాధించడం సులభతరం అయ్యిందని చెప్పారు. డిగ్రీ నారాయణ ఐఏఎస్ అకాడమీ (హైదరాబాద్)లో పూర్తి చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివి.. గోల్డ్మెడల్ సాధించారు. గత గ్రూప్–1 ప్రశ్నపత్రాలు, సిలబస్లోని అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. 2022 నోటిఫికేషన్లో గ్రూప్–1 మెయిన్స్ రాశారు. గత తప్పిదాలను గ్రహించి, మెయిన్స్లో సరిదిద్దుకున్నట్లు వెల్లడించారు. గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. అమ్మా నాన్న ప్రోత్సాహంతోనే గ్రూప్–1 సాధించానని, సివిల్ సర్వీసెస్ తన లక్ష్యమని స్పష్టం చేశారు. -
‘పచ్చ’ కబ్జాకు చెక్
● ఆలయం పేరుతో స్థలానికి ఎసరుపెట్టిన వారికి హెచ్చరిక ● ఈ స్థలం తహసీల్దార్ ఆఫీసుకు కేటాయించినట్లు బోర్డు పుట్టపర్తి: బుక్కపట్నం సచివాలయం–3 వద్ద బుక్కపట్నం–ముదిగుబ్బ మార్గంలో జాతీయ రహదారి– 342కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1533లోని 80 సెంట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్లకు అధికారులు చెక్ పెట్టారు. రూ.3.20 కోట్ల విలువైన 80 సెంట్ల స్థలాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ నాయకులు గంగమ్మ ఆలయం పేరుతో చేస్తున్న కుయుక్తులను వివరిస్తూ ‘‘ఆలయం పేరుతో పచ్చ పన్నాగం’’ శీర్షికన గురువారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన బుక్కపట్నం తహసీల్దార్ నరసింహులు శుక్రవారం సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం ‘‘ఈ స్థలం తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించారు..ఆక్రమణదారులు శిక్షార్హులు’’ అంటూ హెచ్చరిక బోర్డు నాటించారు. తహసీల్దార్ వెంట వీఆర్ఓలు రామమోహన్, నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. 21 నుంచి ‘అనంత బాలోత్సవం’ అనంతపురం ఎడ్యుకేషన్: చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో నిర్వహించనున్న ‘అనంత బాలోత్సవం–6’ను జయప్రదం చేయాలని అనంతపురం డీఈఓ ఎం.ప్రసాద్బాబు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. -
లక్ష్యానికి తూట్లు !
నల్లచెరువు: గ్రామీణ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ కింద ఎన్సీడీ–డీసీ 4.0 సర్వే చేపట్టింది. సాంక్రమికేతర (నాన్ కమ్యూనికేషన్ డీసీజెస్) వ్యాధులను గుర్తించేందుకు సర్వేకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు కలిసి గ్రామాల్లోని ప్రతి ఇంటినీ సందర్శించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకొని యాప్ ద్వారా ఆన్లైన్ చేయాల్సి ఉంది. అయితే వైద్య సిబ్బంది మాత్రం ఇవేవీ తమకు పట్టనట్లే వ్యవహరిస్తూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సర్వే పర్సెంటేజీ కోసం ఆయా గ్రామాల్లోని వ్యక్తుల వివరాలను ఇష్టం వచ్చిన రీతిలో నమోదు చేస్తున్నార్న విమర్శలున్నాయి. సర్వే నిర్వహణ తీరును పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో సర్వే లక్ష్యం నీరుగారుతోంది. ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు కలిసి వారి పరిధిలలో రోజూ నాలుగు కుటుంబాలను సందర్శించి ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పక్కాగా నమోదు చేయాలి. బరువు, ఎత్తుతో పాటు బీడీ, సిగరెట్, మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారా? అని అడిగి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే వివిధ వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించాల్సి ఉంది. వివరాలను పక్కాగా సేకరించి యాప్లో నమోదు చేయాలి. సంబంధిత వ్యక్తులకు ఎవరికై నా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే ఆ వ్యక్తిని పరీక్షించేందుకు ఆస్పత్రికి పిలిపించి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాల్సి ఉంది. తీవ్రమైన ఆరోగ్య ఉన్నవారిని గుర్తించి జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలి. ఈ సర్వే ద్వారానే స్థానిక ఆస్పత్రుల్లో ఎలాంటి మందులు అవసరమో అవి పంపుతారు. ఎన్సీడీ–డీసీ 4.0 సర్వే చేయడానికి వైద్యారోగ్య సిబ్బంది గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లడం లేదు. ఏదో ఒక చోట కూర్చొని యాప్లో తోచిన విధంగా వివరాలు నమోదు చేస్తున్నారు. గ్రామంలోని ఆయా కుటుంబాల ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పించుకొని సర్వేను మమ అనిపించేస్తున్నారు. కనీసం ఫోన్లో కూడా ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీయడం లేదని ప్రజలే చెబుతున్నారు. హెల్త్ సర్వే చేస్తున్నాం.. మీ నంబర్కు ఓటీపీ వచ్చింది చెప్పడంటూ సర్వే పూర్తి చేస్తున్నారు. అయితే సర్వే చేస్తున్నట్లు మాత్రం ఫొటోలకు ఫోజులు ఇచ్చి అప్లోడ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పేదల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్సీడీ–డీసీ 4.0 సర్వే గాడి తప్పింది. కేవలం ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఫోన్లు చేసి ఓటీపీలు తెలుసుకొని సర్వేను వైద్యసిబ్బంది మమ అనిపిస్తున్నారు. అంతా తెలిసినా వైద్యాధికారులు, ఉన్నతాధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. గాడితప్పిన ఎన్సీడీ–డీసీ 4.0 సర్వే ఫోన్లు చేసి ఓటీపీలతో మమ అనిపిస్తున్న వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు పట్టించుకోని ఉన్నతాధికారులు ఓటీపీలతోనే సరి.. సర్వే చేయాల్సింది ఇలా... -
చేప కరువు.. బతుకు బరువు
పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు సర్కార్ మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఆర్థికంగా ఎలాంటి చేయూత ఇవ్వని సర్కార్... కనీసం చెరువుల్లో చేపపిల్లలను కూడా వదలకుండా మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసింది. దీంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం.. ఒట్టిపోయిన చెరువులు.. వర్షాభావం... ముందుచూపులేని పాలకుల నిర్లక్ష్యం తోడుకావడంతో చెరువులన్నీ ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో 23 చేపల చెరువులు, 4 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇందులో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యోగి వేమన, గుంజేపల్లి, పేరూరు ఉన్నాయి. గుంజేపల్లి రిజర్వాయర్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. పేరూరు డ్యాం గేటు విరిగిపోయినా నేటికీ అమర్చక పోవడంతో నీళ్లన్నీ కిందకు వెళ్లిపోయి డ్యాం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం అందులో 5 శాతం కూడా నీళ్లు లేవు. ఇక జిల్లాలో 223 చెరువుల్లో కేవలం 22 చెరువుల్లో మాత్రమే నీళ్లున్నాయి. వాస్తవానికి తీవ్ర వర్షాభావం ఏర్పడినప్పుడు పాలకులు ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వచ్చే నీటితోనే రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా హంద్రీ–నీవా ద్వారా అందే కృష్ణా జలాలనూ చెరువులకు మళ్లించాలి. అప్పుడు తాగు, సాగునీటి తిప్పలు తప్పడంతో పాటు చెరువుల్లో చేపలు పెరిగి మత్స్యకారులకూ ఉపాధి దొరుకుతుంది. కానీ టీడీపీ పాలనలో చెరువుల నింపాలన్న ఆలోచనే ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ లేకపోయింది. దీంతో చెరువుల్లో నీరు చేరక అవన్నీ ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. ఉపాధి కరువైన మత్స్యకారులు కుటుంబాలతో సహా వలస వెళ్లే పరిస్థితులు జిల్లా నెలకొన్నాయి. ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్.. జిల్లాలో 47 మత్స్యకార సొసైటీలున్నాయి. ఆయా సొసైటీల ఆధ్వర్యంలో చేపలు పడతారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వమే చెరువుల్లో చేప పిల్లలను పెంచుతుంది. గతంలోనూ జగన్ సర్కార్ ఠంచన్గా చెరువుల్లో చేప పిల్లలను వదలేది. అలాగే చేపలు విక్రయించుకునేందుకు వీలుగా రూ.75 వేలు విలువ ద్విచక్ర వాహనాన్ని 16 కుటుంబాలకు అందజేశారు. చేపల వేటకు వెళ్లిన వారు ఎవరైనా అనుకోకుండా మృత్యువాత పడితే రూ.10 లక్షల పరిహారం, లైవ్ ఫిష్ విక్రయాలు సాగించే వారు రూ.10 వేలు డిపాజిట్ చేస్తే రూ.లక్ష , రూ.20 వేలు చెల్లిస్తే రూ.2 లక్షలు రుణసదుపాయం కల్పించారు. చేపలతో తయారైన వంటకాలు విక్రయించేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఔత్సాహికులకు రూ.20 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేసి ఉపాఽధి అవకాశాలు కల్పించారు. చెరువుల్లో చేప పిల్లలను వదలని చంద్రబాబు సర్కార్ ఆర్థిక ప్రోత్సాహమూ కల్పించని వైనం ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు పూట గడవని స్థితిలో పెరిగిన వలసలు చేపలకు డిమాండ్ ఉంది ఇటీవల చాలా మంది చికెన్, మటన్ స్థానంలో చేపలను ఎక్కువగా తింటున్నారు. దీంతో స్థానికంగా డిమాండ్ పెరిగింది. కానీ చెరువుల్లో చేపలు దొరక్క ఇతర జిల్లాల నుంచి వచ్చే వాటిపై ఆధారపడ్డాం. ప్రసుత్తం కిలో చేపలు రూ.100 నుంచి రూ.300 వరకూ పలుకుతున్నాయి. జిల్లాలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువులో నీళ్లు సమృద్ధిగా ఉన్నా... ప్రభుత్వం చేప పిల్లలను వదల లేదు. దీంతో జీవనాధారం లేక మత్య్సకార కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. – రమేష్, పుట్టపర్తి ఉపాధి కరువైంది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చారు. పింఛన్లతో పాటు మోపెడ్లు, ఫిష్ ఆంధ్రా యూనిట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కనీసం చెరువుల్లో చేప పిల్లలను సైతం వదలకపోవడంతో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కరువైంది. – నాగేంద్ర, కొత్తచెరువు త్వరలోనే చేప పిల్లలు వదులుతాం ఈ ఏడాది వర్షాలు లేక చాలా చెరువుల్లో నీళ్లు లేవు. ఇక జిల్లాలో నీళ్లు సమృద్ధిగా ఉన్న 22 చెరువులను గుర్తించాం. ఆయా చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే చెరువుల్లో చేప పిల్లలను వదులుతాం. – చంద్రశేఖర్రెడ్డి, మత్స్య శాఖ జిల్లా అధికారి -
చోరీ కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్
చెన్నేకొత్తపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు చోరీ కేసుల్లోని నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, ఒక కిలో రెండు వందల గ్రాముల వెండిని చెన్నేకొత్తపల్లి పోలీసులు రికవరీ చేశారు. చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడారు. చెన్నేకొత్తపల్లిలో ఈనెల 10న రాత్రి రెండిళ్లలో చోరీ జరగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈనెల 27న ముగ్గురు మండల పరిధిలోని ఎన్ఎస్ సమీపంలో ధర్మవరం వెళ్లేదారిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో అక్కడికి వెళ్లి మేడాపురానికి చెందిన సాకే శివ, ధర్మవరం మండలం ఎర్రగుంటకు చెందిన గుజ్జల విజయ్, మేడాపురానికి చెందిన సాకే తరుణ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 9 తులాల బంగారు, 2.5 కిలోల వెండి చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. దొంగిలించిన బంగారు, వెండిని అనంతపురము పట్టణంలోని గోల్డ్ ప్రైవేటు కంపెనీలో విక్రయించినట్లు తెలిపారన్నారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, కిలో రెండు వందల గ్రాముల వెండిని సీజ్ చేశామన్నారు. వీరిపై ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బంగారు కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. -
నిలదొక్కుకున్నాం
● రైతు ఇంట లాభాల మూట ● ఈసారి రికార్డు స్థాయిలో వక్క ఉత్పత్తి ● మార్కెట్లో ధరలు ఆశాజనకం ● ప్రారంభంలో క్వింటా రూ.65 వేలు పలికిన వైనం మడకశిర: వక్కతోటల సాగుకు మడకశిర నియోజకవర్గం పేరుగాంచింది. జిల్లాలో దాదాపు 2,500 హెక్టార్లలో వక్క తోటలు విస్తరించి ఉండగా.. అందులో ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే 2 వేల హెక్టార్లలో రైతులు వక్క తోటలు సాగుచేస్తున్నారు. మిగతా 500 హెక్టార్ల వక్కతోటలు పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇక్కడి రైతులు ఏటా రికార్డు స్థాయిలో వక్కలు ఉత్పత్తి చేస్తారు. అయితే మార్కెట్లో ఆశించినంత ధర లేక నష్టాలు మూటగట్టుకునే వారు. కానీ ఈసారి వక్క రైతుకు లాభాలు తెచ్చిపెట్టింది. దిగుబడితో పాటు పెరిగిన ధర.. గత ఏడాది వక్క ధర ఆశాజనంగా ఉన్నా... దిగుబడి తగ్గిపోవడంతో రైతులు నష్టాలు చవిచూశారు. గతంలో ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రాగా, ఈ సీజన్లో ఏకంగా 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మరోవైపు ఈ సీజన్లో వక్క రికార్డు స్థాయిలో ధర పలికింది. సీజన్ ప్రారంభంలోనే క్వింటా వక్క ధర ఏకంగా రూ.65 పలకగా..రైతు మోము ఆనందంతో వెలిగిపోయింది. అయితే సీజన్ ముగుస్తున్న కొద్దీ ధర కాస్త తగ్గింది. ప్రస్తుతం క్వింటా వక్క రూ.55 వేల వరకూ పలుకుతోంది. ధరలు నిలకడగానే కొనసాగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వక్క ఉత్పత్తి విలువ రూ.55 కోట్లపైనే.. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రూ.55 కోట్ల విలువైన వక్క పండినట్లు మార్కెట్ వర్గాల అంచనా. అందులో ఒక్క మడకశిర నియోజకవర్గంలోని రైతులే రూ.48 కోట్ల విలువైన వక్కలు పండించినట్లు చెబుతున్నారు. దిగుబడి పెరగడం వల్లే వక్క ఉత్పత్తుల విలువ భారీగా పెరిగిందని చెబుతున్నారు. గత ఏడాది ధర బాగున్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో వక్క ఉత్పత్తి విలువ రూ.30 కోట్లలోపే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సీజన్లో కూలీలకు చేతినిండా పని.. ఏటా వక్క సీజన్ అగస్టులో ప్రారంభమై జనవరి చివర్లో ముగుస్తుంది. రైతులు చెట్ల నుంచి వక్కను నాలుగు విడతలుగా కోసి, శుద్ధిచేసి మార్కెట్కు తరలిస్తారు. దాదాపు 6 నెలల పాటు వక్క సీజన్ కొనసాగుతుంది. ఈ ఆరు నెలల కాలంలో వేలాది మంది కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది.వక్క రైతుల మోము లాభాల సంతోషంతో వెలిగిపోతోంది. ఈ సీజన్లో దిగుబడి గణనీయంగా పెరగడంతో పాటు మార్కెట్లో ఆశించిన ధర దక్కడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో పంట విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి జిల్లాలో వక్క విక్రయాలు చేపడితే తమకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ధరలు ఆశాజనకం వక్క దిగుబడి ఈ సారి బాగా పెరిగింది. దీంతో ఆర్థికంగా కొంత వరకు నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడింది. గత సీజన్లో ధరలు బాగానే ఉన్నా.. దిగుబడి తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయాం. అయితే ఈసారి దిగుబడితో పాటు ధరలు కూడా బాగానే ఉండటం లాభదాయకంగా మారింది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలకు వక్కలను తీసుకువెళ్లాల్సి వస్తోంది. స్థానికంగానే వక్కకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. – వీరక్యాతరాయప్ప, గౌడనకుంట, అమరాపురం మండలంవక్క ధరలు ఈసారి ఆశాజనకంగా ఉండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం క్వింటా వక్కలు రూ.55 వేల వరకు పలుకుతున్నాయి. వక్క ధర ఇంకా పెరుగుతుందన్న ఆశతో చాలా మంది రైతులు సరుకును ఇంట్లోనే నిల్వ ఉంచుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో దిగుబడి, మార్కెట్లో ధర ఆశించినంత ఉండటంతో రైతులు లాభపడ్డారు. – ప్రకాశ్, తమ్మడేపల్లి, అమరాపురం మండలం -
రైతులకు యూరియా కష్టాలు
పుట్టపర్తి టౌన్: రైతులకు రబీలోనూ యూరియా కష్టాలు తప్పడం లేదు. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం... పాలకులు పట్టించుకోకపోవడంతో బస్తా యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం పుట్టపర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. దీంతో మున్సిపాటిలీ పరిధిలోని రైతులంతా ఉదయమే సొసైటీ కార్యాలయం ఎదుట బారులు తీరారు. సొసైటీకి కేవలం 280 బస్తాల యూరియానే రావడంతో అధికారులు ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియానే పంపిణీ చేశారు. ఈ క్రమంలో పలువురు రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయమే వచ్చి క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా ఇస్తే ఏం చేసుకోవాలంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే రైతు భరోసా కేంద్రాల్లోనే సకాలంలో ఆయా సీజన్లలకు విత్తనాలు, ఎరువులు అందించేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో రబీలోనూ యూరియా కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయాలని కోరారు. పుట్టపర్తి సొసైటీ కార్యాలయం ఎదుట బారులు ఒక్కో రైతుకు బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంపై ఆగ్రహం -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి
హిందూపురం: శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని, ఎస్పీ సతీష్కుమార్ పోలీసులను ఆదేశించారు. గురువారం ఆయన హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలతోపాటు లాకప్ గదులు, మహిళా హెల్ప్ డెస్క్, కంప్యూటర్ గదిని పరిశీలించారు. రికార్డు గదిని పరిశీలించి కేసులకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, కేసుల దర్యాప్తు, పురోగతి గురించి ఆరా తీయడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. అసాంఘిక కార్యక్రమాలకు ఏమాత్రమూ తావులేకుండా చూడాలన్నారు. రాత్రి వేళల్లో డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి చోరీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెంచడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. అలాగే పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుస్టేషన్ను ఆశ్రయించే వారి సమస్యలను పూర్తిగా విని పరిష్కారం చూపాలన్నారు. గంజాయి, పేకాట వంటి వాటిపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట టూటౌన్ సీఐ కరీం, ఎస్ఐలు లింగన్న, నాగ ప్రసన్న పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం -
అంగన్వాడీలపై అదనపు భారం
పుట్టపర్తి అర్బన్: నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులు, బాలింతలు రక్తహీనత సమస్యను అధిగమించేందుకు అవసరైన పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం అంగన్వాడీలకు అదనపు భారంగా మారింది. ఇన్నాళ్లు లబ్ధిదారుల వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నమోదు చేసేవారు. కానీ ఇటీవలే ఈ బాధ్యతను అంగన్వాడీలకు అప్పగించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో వివరాల నమోదుకు అంగన్వాడీ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు తమ సొంత మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకుని మాతృత్వ వందన యోజన పథకం లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ సరిగా లేని అటవీ ప్రాంతాల్లో అంగన్వాడీల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే పోషణ ట్రాకర్, బాల సంజీవని, సాసా ప్రోగ్రాం, పౌష్టికాహారం పంపిణీ సమాచారం అప్లోడ్ చేయడం, పీఎంఈవై తదితర యాప్లతో పాటు ఉన్నతాధికారులు అడిగే సమచారం ఇచ్చేందుకు సతమతమవుతున్న అంగన్వాడీలపై ‘మాతృ వందన’ రిజిస్ట్రేషన్ అదనపు భారంగా మారింది. జిల్లాలో 16,167 మంది లబ్ధిదారులు.. ప్రధానమంత్రి మాతృత్వ వందన పథకం లబ్ధిదారులు జిల్లాలో 16,167 మంది ఉన్నారు. ఇందులో 8,981 మంది గర్భిణులు, 7,186 మంది బాలింతలున్నారు. వీరందరి వివరాలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు ఒక్కో ప్రసవానికి రూ. 6 వేలను మూడు విడతల్లో అందజేస్తారు. ఇందుకోసం కేంద్రం రూ.5 వేలు ఇవ్వనుండగా... ప్రసవానంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 చొప్పున అందించనుంది. ఇందుకోసం అంగన్వాడీలు లబ్ధిదారురాలి ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్, ఫొటో, ఆరోగ్య కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతోందని, చాలాసార్లు నెట్ పని చేయక... చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తోందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇలా సర్వేలు, యాప్లలో వివరాల నమోదుపై దృష్టి సారిస్తే చిన్నారులకు ఎవరు చదువు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏ సర్వే చేయాలన్నా.. గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఆ బాధ్యతను అంగన్వాడీలపై పెడుతోందని, దీనివల్ల అంగన్వాడీ అసలు లక్ష్యం నెరవేరడం లేదని అంగన్ వాడీ వర్కర్ల సంఘం జిల్లా నాయకులు చెబుతున్నారు. ‘మాతృత్వ వందన’ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగింత పనిచేయని యాప్తో ముప్పుతిప్పలు -
రాజూ.. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు
మడకశిర రూరల్: ‘‘రాజూ...నీ స్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో...ఏమేం పనులు చేసి వచ్చావో గుర్తుంచుకో. కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చావా..ఒక్క పట్టా పంపిణీ చేశావా..నువ్వు కూడా ప్రజాసేవ గురించి మాట్లాడుతుంటే జనమే నవ్వుతున్నారు. పక్షివి కాబట్టి గత ఐదేళ్లలో మడకశిరలో జరిగిన అభివృద్ధి గురించి నీకు తెలియదనుకుంట... నియోజకవర్గంలోని చిన్న పిల్లాడినడిగినా జగన్ చేసిన మేలు చెబుతారు. చంద్రబాబు వద్ద మెప్పుకోసం మరోసారి అవాకులు చెవాకులు పేలితే జాగ్రత్త’’ అంటూ వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఎమ్మెల్యే ఎంఎస్రాజును హెచ్చరించారు. గురువారం ఆయన పార్టీ నేతలతో కలిసి మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పత్రికా విలేకరులపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బ్రోకర్, లోఫర్ లాంటి పదాలు తామూ మాట్లాడగలమని...కానీ తమ అధినేత అలా మాట్లాడటం తమకు నేర్పించలేదన్నారు. ఎప్పుడూ టీడీపీ పెద్దల సేవలో గడిపే ఎంఎస్ రాజు కూడా నియోజకవర్గం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండేళ్లలో ఆయన చేసిందేమీ లేదన్నారు. తాను బోర్లు వేయించానని గొప్పలు చెబుతున్న ఎంఎస్ రాజు...అవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసినవేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మండల పరిషత్ నిధులతో బోరు వేయించి...ఆయన తన సొంత డబ్బులతో వేయించినట్లు గొప్పలు చెబుతున్నారన్నారు. మీ ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ కరువు.. చంద్రబాబు సర్కార్లో రక్షక భటులకే రక్షణ కరువైందని ఈరలక్కప్ప అన్నారు. ఇటీవల అగళి మండలంలోని ఓ హోటల్లో మద్యం విక్రయిస్తున్నట్లు తెలిసి ఎస్ఐ తనిఖీ చేస్తుండగా.. టీడీపీ నాయకుడి కుమార్తె ఎస్ఐపై దాడి చేశారని, టీడీపీ పాలనకు ఇదే ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సమస్య పరిష్కరించడం చేతగాకే.. తాగునీటి సమస్యపై ఇటీవల బేగార్లపల్లి క్రాస్లో మహిళలు ఖాళీ బిందెలతో రాస్తోరోకో చేస్తే..ఆ సమస్యను పరిష్కరించడం చేతగాని ఎంఎస్ రాజు.. ఆ ఘటన గురించి రాసిన విలేకరులను దుర్భాషలాడటం దుర్మార్గమన్నారు. వెంటనే విలేకరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జలహారతి ఇచ్చింది మీ పార్టీ వారే.. వైఎస్ జగన్ చొరవతోనే మడకశిర మండలంలోని చెరువులను కృష్ణాజాలాలు నింపారని, ఆ చెరువులు మరువలు పారితే ఆనాడు టీడీపీ నాయకులే జలహారతి ఇచ్చారని ఈరలక్కప్ప గుర్తు చేశారు. తన రెండేళ్ల పదవీ కాలంలో ఎంఎస్ రాజు నియోజకవర్గంలో ఎన్ని చెరువులను కృష్ణాజలాలతో నింపారో చెప్పాలన్నారు. కొత్తగా ఒక్క ఇంటి పట్టా మంజూరు చేయని టీడీపీ ప్రభుత్వం పాత పట్టాలకు రంగులు మార్చి ఆర్భాటంగా పంపిణీ చేసిందన్నారు. ఇప్పటికై నా అబద్ధాలు చెప్పడం మాని ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. అలా కాకుండా నోరుంది కదా అని ఎవరిని పడితే వారిని దూషిస్తానంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కుంచిటిగ వక్కలిగ విభాగం అధ్యక్షుడు రంగేగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకులు హనుమంతరాయప్ప, తిమ్మారెడ్డి, నరసింహ, మల్లికార్జున, బాలకృష్ణారెడ్డి, ధను, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వలస పక్షివి కాబట్టి ఇక్కడి అభివృద్ధి నీకు తెలియదనుకుంట మడకశిరలో ఏ ఒక్కరిని అడిగినా జగన్ చేసిన మేలు చెబుతారు రెండేళ్లలో మడకశిరకు నువ్వేం చేశావో చెప్పు ఒక్క పింఛన్ ఇచ్చావా.. ఒక్క పట్టా పంచావా..? వైఎస్సార్ సీపీ మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప -
ముష్టిపల్లిలో చిరుత సంచారం
కదిరి అర్బన్: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ ముష్టిపల్లికి వెళ్లే రహదారిలో గురువారం చిరుత కనిపించింది. క్రషర్ సమీపంలోని కొండ దిగువ ప్రాంతంలో చిరుతను చూసిన కూలీలు వెంటనే ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప... చిరుత పాద ముద్రలను గుర్తించారు. చిరుతతో పాటు దాని పిల్ల ఉన్నట్లు పాదాల గుర్తుల ద్వారా తెలుస్తోందన్నారు. సమీపంలోని కొండపై ఉంటున్న చిరుత నీటి కోసం కిందకు వచ్చి ఉంటుందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత సంచారం గురించి డీఎఫ్ఓకు తెలిపామని, చిరుత కనిపించిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.


