breaking news
Sri Sathya Sai District Latest News
-
‘మెరిట్’ లిస్ట్.. ‘సెలక్షన్’ ట్విస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్: మెరిట్ జాబితాలో ముందున్న అభ్యర్ధుల కంటే వెనుక ఉన్న వారు పోస్టులకు ఎంపికవడంతో అర్హులైన డీఎస్సీ – 25 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పారదర్శకత పేరుతో అభ్యర్థులకు పూర్తిస్థాయి సమాచారం చేరవేయకుండా రాష్ట్రస్థాయి అధికారులే ఎంపిక ప్రక్రియ చేపట్టడం వివాదానికి కారణమైంది. ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఒకట్రెండు కాదు.. మొత్తం 5 సార్లు నిపుణులతో సర్టిఫికెట్ల పరిశీలన చేయించారు. కాల్లెటర్లు అందని అభ్యర్థులు, ఏవైనా సర్టిఫికెట్లు పొందుపరచని వారు ఉంటే చివరి విడత వరకూ అవకాశం కల్పించారు. అయినా అర్హులు అనర్హులుగా, అనర్హులు అర్హుల జాబితాలో కనిపిస్తుండడంతో ఆందోళన మొదలైంది. తనకంటే వెనకున్న వారిని ఎంపిక చేశారంటూ.. బీసీ–ఏ కేటగిరీకి చెందిన ఎ.ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ మెరిట్ జాబితాలో 48వ ర్యాంకులో ఉన్నాడు. సర్టిఫికెట్ల పరిశీలన రోజు ఒరిజనల్ పత్రాలు లేని కారణంగా ఫ్రీజింగ్ జాబితాలో ఉంచారు. గడువులోపు ఎస్వీయూకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అధికారులకు అందజేయడంతో అన్ఫ్రీజ్ చేసి అర్హత జాబితాలో ఉంచారు. చివరకు అతని కంటే తక్కువ మార్కులు, తక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చింది. సెలక్షన్ జాబితాలో ఆంజనేయులు పేరు మాయమైంది. ఇలా అతని కంటే వెనకున్న 8 మందిని అర్హుల జాబితాలోకి చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ రెండు పోస్టులకూ ఎంపికై న చంద్రిక.. కేజీబీవీలో పని చేస్తూ బీపీఈడీ చేసిందనే నెపంతో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కాకుండా యూజీపీడీ అర్హతతో పీఈటీ పోస్టుకు ఎంపిక చేశారు. తుది జాబితాలో మాత్రం అమె కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి పేర్లు కనిపిస్తున్నా.. చంద్రిక పేరు మాత్రం లేదు. తమకు జరిగిన అన్యాయంపై వీరిద్దరూ డీఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనర్హుడికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం కె.శ్రీనివాసులు అనే వ్యక్తి మానసిక అనారోగ్యం (ఎంఐ) కేటగిరీలో మెరిట్ జాబితాకు ఎంపికయ్యాడు. వెరిఫికేషన్ సమయంలో 70 శాతం వైకల్యం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ చూపించాడు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా వెరిఫికేషన్ బృందం తుది నిర్ధారణగావించి అప్లోడ్ చేసింది. అనంతరం మెడికల్ సర్టిఫికెట్ ధ్రువీకరణ కోసం అతడిని సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయకముందే శ్రీనివాసులు ఉడాయించాడు. ఇంతలో మతలబు ఏమి జరిగిందో ఏమో కానీ నేరుగా విజయవాడకు వెళ్లి విద్యాశాఖ కమిషనర్ను కలిసి, మళ్లీ వైద్య పరీక్షలు చేయించాలంటూ అక్కడి నుంచి ఆదేశాలు తీసుకొచ్చాడు. దీంతో డీఈఓ స్వయంగా రంగంలోకి దిగి సదరు అభ్యర్థిని సర్వజన ఆస్పత్రికి తీసువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎలాంటి మానసిక ఆరోగ్యం లేదని వైద్యులు ధ్రువీకరించారు. వైకల్యశాతం ‘0’గా నిర్ధారించారు. ఈ సర్టికెట్ను అప్లోడ్ చేసి అనర్హుడిగా నిర్ధారించాల్సి ఉంది. మరి ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయనకు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఆస్పత్రి నుంచి ఉడాయించిన రోజే మెడికల్ టెస్ట్కు గైర్హాజరు కారణంగా అనర్హుడి జాబితాలో ఉంచాలని డీఈఓ ఆదేశించినా.. వెరిఫికేషన్ బృందం ధిక్కరిస్తూ అర్హుడి జాబితాలో ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? దీని వెనుక ఎవరు చక్రం తిప్పారనే చర్చ జోరుగా జరుగుతోంది. 20 మందికి పైగా అభ్యర్థుల పేర్లు గల్లంతు జిల్లా అధికారుల వద్ద సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరై పోస్టులు రాని వారు దాదాపు 20 మందికిపైగా ఉన్నారు. వాస్తవానికి ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. కాల్లెటర్లు అంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినా తుది జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. మరి ఇంత మంది సెలక్షన్ జాబితాలో ఎందుకు లేరనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ లాజిక్ పీటముడి అధికారులకే తెలియాలని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు డీఈఓ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వారు ఇస్తున్న అర్జీలను తీసుకుంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఈఓ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో గందరగోళం ఒకే కేటగిరీలో వెనకున్న అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు వైకల్యమే లేకున్నా దివ్యాంగుల కోటాలో ఉద్యోగం -
నేటి నుంచి పోషణ్ మాసోత్సవాలు
పుట్టపర్తి అర్బన్: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకూ జిల్లాలో పోషణ్ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ ప్రమీల తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన ఆహారాలు, పర్యావరణం, సమానత్వం, సాధికారత, స్థూలకాయ నివారణ తదితర ఐదు అంశాలపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై పని భారం తగ్గించండి ● స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు మడకశిర: ఉపాధ్యాయులపై పని భారం తగ్గించి, బోధనకే పరిమితం చేయాలంటూ ప్రభుత్వాన్ని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఏపీ ఏస్టీఏ జిల్లా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డితో కలసి బేగార్లపల్లి, కదిరేపల్లి, పాపసానిపల్లి, సిద్ధగిరి, గుండుమల, మడకశిర పాఠశాలల్లో మంగళవారం ఆయన సభ్యత్వ నమోదు నిర్వహించారు. అనంతరం మడకశిర మండలం వనరుల కేంద్రంలో జిల్లా సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. యాప్ల భారంతో పాటు అసెస్మెంట్ పుస్తకాల నిర్వహణతో పాఠ్యాంశాల బోధనకు సమయం సరిపోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాట్యూటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నాలుగు పెండింగ్ డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్టీఏ జిల్లా కోశాధికారి ప్రదీప్కుమార్, డివిజన్ నాయకులు రమేష్, సురేష్, నాగరాజాచారి, మంజునాథ్, ఉమేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి విఘాతం
కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. పత్రికల్లో వచ్చిన వార్తాల్లో వాస్తవం లేకపోతే ఖండించాలి కానీ కేసులతో భయపెట్టాలనే ఆలోచన దుర్మార్గం. సాక్షి పత్రిక విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
జక్కల ఆదిశేషు కుటుంబానికి పరామర్శ
తనకల్లు: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, నల్లమాడ మాజీ జెడ్పీటీసీ జక్కల ఆదిశేషు కుటుంబాన్ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పరామర్శించారు. తనకల్లు మండలం బొంతలపల్లికి మంగళవారం చేరుకున్న ఆయన ఆదిశేషు భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి, కుటుంబ సభ్యులు బొడ్డు నాగరాజు, అరుణను ఓదార్చారు. అనంతరం ఆదిశేషు సమాధి వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ కదిరి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్, జిల్లా ఉపాధ్యక్షుడు బైక్ భాస్కరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, నాయకులు రామ్దేశాయ్, మాజీ ఎంపీటీసీ రాందాస్, చలపతి, రవి, స్టోర్ వెంకటరెడ్డి, గౌస్, మండల కమిటీ సభ్యులు కరే నరేంద్ర, బాబ్జాన్, సూరి, రెడ్డిశేఖర్రెడ్డి, తాహీర్, ఖాదర్వలి, సర్వేశ్వరరెడ్డి, సలీం, నారాయణరెడ్డి, యశ్వంత్రెడ్డి, రామమోహన్, మహేష్రెడ్డి, బాబు, నాగిరెడ్డి, గణేష్, హైదర్వలి, చాకివేలు రమణ, కిరణ్, నరసింహులు, నీలకంఠారెడ్డి, కిష్టప్ప, రామాంజి, కొండయ్య, నల్లచెరువు మండల నాయకులు విశ్వనాథ్రెడ్డి, దశరథనాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపికై న అభ్యర్థులూ తరలిరండి : డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరూ ఈ నెల 19న అమరావతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. మంగళవారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న అభ్యర్థితో పాటు తోడుగా మరొకరు విజయవాడకు రావచ్చన్నారు. ప్రయాణ ఖర్చులు, వసతి, భోజన సదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 18న ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలన్నారు. ప్రతి బస్సుకు నలుగురు చొప్పున లైజన్ ఆఫీసర్లను నియమిస్తామన్నారు. 19న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం చంద్రబాబుతో మీటింగ్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ కిట్టుతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేస్తారని, అదే రోజు రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం జిల్లాకు చేరుకుంటారన్నారు. ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం ● ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ● జిల్లా అడహాక్ కమిటీ ఎన్నిక పుట్టపర్తి టౌన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్లపాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం ఎన్జీఓ నాయకులు పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్వీజే కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా నాయకుడు లింగా రామ్మోహన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్లపాటి విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్డీఓ అసోసియేషన్ కట్టుబడి ఉందన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి చాలా సమస్యలున్నాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటమే శరణ్యమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణతోపాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా నూతన అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా లింగా రామ్మోహన్, కమిటీ సభ్యులుగా శంకరనారాయణ, కదిరి వేణుగోపాల్రెడ్డి, లలితమ్మ, లోకేశ్వర్రెడ్డి, ఈశ్వరప్ప తదితరులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి ఉద్యోగులు, సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. పూలమాలలు, శాలువతో సత్కరించారు. -
అనుమానాస్పద మృతి
సోమందేపల్లి: మండలంలోని పత్తికుంటపల్లి బస్టాండ్ సమీపంలో మోరీ కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. మంగళవారం అటుగా వెళ్లిన గ్రామస్తులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముక్కులో రక్తం రావడంతో పాటు శరీరంపై మూగ దెబ్బలను గుర్తించారు. విచారణ అనంతరం మృతుడిని హిందూపురం ప్రాంతానికి చెందిన సుబేద్గా నిర్ధారించారు. ఏదైన గొడవలో గాయపడి మృతి చెందడంతో మృతదేహాన్ని మోరీ కింద పడేసి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అది సాధారణ మరణమేనని పోలీసులు పేర్కొన్నారు. ● పుట్టపర్తి టౌన్: స్థానిక మున్సిపాల్టీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బ్రాహ్మణపల్లి తండాకు చెందిన నారాయణ నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ (38)కు భార్య గాయత్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో మంజూరైన ఇంటిలో నివాసముంటూ పెయింటింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం భార్యాపిల్లలతో కలసి మిద్దైపె నిద్రకు ఉపక్రమించాడు. అర్దరాత్రి సమయంలో భార్య గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే బాలాజీనాయక్ తలపై సిమెంట్ దిమ్మెతో మోది మిద్దె పైనుంచి కిందకు తోసేయడాన్ని గమనించి, కుటుంబ సభ్యులతో కలసి ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ శివాంజనేయులు మంగళవారం ఉదయం జగనన్న కాలనీకి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశఋలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భార్య గాయత్రి, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీటెక్ విద్యార్థిని బలవన్మరణం బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి (20) అదే కళాశాల హాస్టల్ గదిలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయండి
పుట్టపర్తి అర్బన్: మహిళల ఆరోగ్యం కోసం బుధవారం నుంచి జరిగే ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని వైద్యాధికారులకు స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమ స్టేట్ నోడలాఫీసర్ డాక్టర్ అనిల్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగంతో కలసి వైద్యాధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రణాళికా బద్దంగా అన్ని శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అక్టోబర్ 2 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యం హిందూపురం: మండలంలోని బేవనహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డాక్టర్ అనిల్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మాతాశిశు సంరక్షణ సేవలు, వివిధ రకాల పరీక్షలు, పౌష్టికాహారం, ఉచిత మందుల పంపిణీ తదితరాలపై ఆరా తీశారు. అక్టోబరు 2వ తేదీ వరకూ జరిగే మహిళల ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. డీఐఓ నాగేంద్రనాయక్, పీఓ సునీల్కుమార్, మెడికల్ ఆఫీసర్ పద్మజ, ఎంహెచ్ఓ మల్లప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నిధులు మేసి..దాడి చేసి
పుట్టపర్తి: పొదుపు సంఘంలోని నిధులను సభ్యులకు తెలియకుండా స్వాహా చేసిన ఓ మాజీ లీడర్...డబ్బు తిరిగి కట్టాలని కోరిన సంఘం సభ్యులపై, వారికి మద్దతు తెలిపిన సీపీఎం నాయకులపై బంధువులతో కలిసి దాడులకు దిగారు. ఈ ఘటన బుక్కపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నంలోని శ్రీసంతోషి మహిళా సంఘానికి గతంలో కోమల అనే మహిళ లీడర్గా ఉండేది. ఈక్రమంలో 8 నెలల క్రితం ఆమె సభ్యులకు తెలియకుండా సంఘం నిధులు రూ.7.50 లక్షలు సొంతానికి వాడుకుంది. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు ఆమెను లీడర్గా తొలగించడంతో పాటు సొంతానికి వాడుకున్న నిధులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుడు నెలరోజులు గడువు కోరిన కోమల... ఆ తర్వాత కూడా డబ్బు చెల్లించలేదు. ఈ క్రమంలో చాలాసార్లు సంఘం సభ్యులు కోమలను డబ్బుకోసం నిలదీయడం ఆమె ఎదురుదాడికి దిగడం జరిగాయి. ఇప్పటికి 8 నెలలు దాటినా కోమల డబ్బు చెల్లించలేదు. దీంతో సోమవారం రాత్రి సంఘం సభ్యులంతా కలిసి కోమల ఇంటి వద్దకు వెళ్లారు. సంఘం డబ్బులు రూ.7.50 లక్షలు చెల్లించాలని కోరారు. అంతవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పారు. దీంతో కోమల, ఆమె కుటుంబీకులు సంఘంలోని సభ్యులైన మహిళలపై దాడి చేశారు. దీంతో వారంతా సోమవారం రాత్రే బుక్కపట్నం పోలీసు స్టేషన్కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు. వెలుగు కార్యాలయం ముందు ధర్నా మంగళవారం ఉదయం కూడా శ్రీసంతోషి మహిళ సంఘం సభ్యులు స్థానిక సీ్త్రశక్తి భవనం ముందు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మహిళలకు మద్దతుగా సీపీఎం జిల్లా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈ.ఎస్ వెంకటేష్, బ్యాళ్ల అంజి తదితరులు కార్యాలయానికి వెళ్లి కోమల స్వాహా చేసిన నిధులు తిరిగి కట్టించాలని కోరారు. అయితే కోమలకు మద్దతుగా నిలిచిన యానిమేటర్ నాగరాజు, సిబ్బంది సీపీఎం నాయకులను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. దీంతో వారు బుక్కపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు స్వాహా అయిన నిధులు తిరిగి రికవరీ చేయాలని కోరారు. ఈ ఘటనపై ‘వెలుగు’ సీసీ రవిని వివరణ కోరగా... శ్రీసంతోషి పొదుపు సంఘంలోని డబ్బులు స్వాహా జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఆ సొమ్ము రికవరీ చేయాలని కోమల అనే మాజీ లీడర్ను పీడీ ఆదేశించారని, సీపీఎం నేతలు, యానిమేటర్లు ఇరు వర్గాలు తోపులాడుకుంటుంటే తాము వారిని సముదాయించామన్నారు. బుక్కపట్నం ‘శ్రీసంతోషి’ సంఘం నిధులు స్వాహా రూ.7.5 లక్షలు సొంతానికి వాడుకున్న మాజీ లీడర్ కోమల తిరిగి చెల్లించాలని కోరిన సభ్యులు, సీపీఎం నాయకులపై దాడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు -
దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి
ధర్మవరం: దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీఎల్ఏలతో అన్నారు. మంగళవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలకు చెందిన బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... దేశంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరిట ఎన్నికల సంఘం ఓటరు జాబితాను సమీక్షించి కొత్త జాబితాను రూపొందిస్తోందన్నారు. గతంలో బిహార్లో ఎస్ఐఆర్ పేరిట విడుదల చేసిన కొత్త జాబితాలో 60 లక్షల దాకా ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్ఐఆర్ సర్వే అక్టోబర్ నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సర్వేలో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు, అర్హులైన ప్రజల ఓట్లు గల్లంతు కాకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వే ప్రారంభమయ్యేలోపు అర్హులైన ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని బీఎల్ఏలకు సూచించారు. తద్వారా ఎన్నికల సిబ్బంది చేసే తప్పులను వెంటనే ఎత్తి చూపవచ్చన్నారు. లేకపోతే అధికార పార్టీ నాయకులు ఎంతకై నా తెగిస్తారన్నారు. 2014 ఎన్నికల్లో 14 వేలకుపైగా దొంగ ఓట్లను ఎక్కించారని, దీన్ని తాను రాష్ట్రస్థాయిలో ఆధారాలతో సహా చూపి టీడీపీ నాయకుల బండారం బయటపెట్టానన్నారు. 2018లోనూ కోర్టులకు వెళ్లి నియోజకవర్గంలో 19 వేల దొంగఓట్లను కట్టడి చేశామన్నారు. 2024 ఎన్నికలకు ఒక నెల ముందు దాదాపుగా 20 వేల ఓట్లు మళ్లీ ఎక్కించారని, ఇలా.. విలువలు పక్కన పెట్టి దొంగఓట్లతో ప్రత్యర్థులు దొడ్డిదారిన గెలుస్తున్నారన్నారు. అందువల్లే బీఎల్ఏలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి బీఎల్ఏలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూచన బీజేపీ గెలుపుతోనే అనుమానాలు ధర్మవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీకి 600 ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఆ పార్టీ గుర్తుపై కూడా ప్రజలకు ఇప్పటికీ అవగాహన లేదన్నారు. అలాంటి పార్టీ ఎన్నికల్లో గెలవడం ఏమిటని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. ఇక గత ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా ధర్మవరంలో పర్యటించిన రోజే రాష్ట్ర డీజీపీని మార్చడం... ఎన్నికల ఫలితాలు విడుదలైన పదిరోజుల్లోపే వీవీ ప్యాట్ స్లిప్పులను కాల్చివేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యంపై అందరికీ నమ్మకం కలుగుతుందన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
‘నువ్వు ఉండమ్మా..’
ఆర్డీటీ అంశంపై జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా ఎంపీ అంబికా వారించ బోయారు. జోక్యం చేసుకున్న గిరిజమ్మనుద్దేశించి ‘నువ్వు ఉండమ్మా.. అంటూ ఏకవచనంతో సంబోధించారు. ఇందుకు గిరిజమ్మ దీటుగా స్పందించారు. జెడ్పీ చైర్పర్సన్ హోదాలో సభను నడిపిస్తుంటే ఏకవచనంతో ఎలా మాట్లాడుతారంటూ నిలదీయడంతో ఎంపీ సర్దుకున్నారు. తరువాత గుమ్మఘట్ట ఎంపీపీ భవాని మాట్లాడుతూ తాను దళితురాలినని ఎంపీడీఓ వివక్ష చూపుతున్నారని, జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ దృష్టికి తెస్తే ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఈఓ డొంక తిరుగుడు సమాధానాలు ఇవ్వడంతో మిగిలిన జెడ్పీటీసీ సభ్యులందరూ ఒక్కసారిగా ఎదురు తిరిగారు. ఒక ప్రజాప్రతినిధికి ఇంత అవమానం జరిగితే చూస్తా.. చేస్తా అంటారా అంటూ మండిపడ్డారు. -
‘హోంవర్క్’ చేయలేదని.. పారిపోయిన విద్యార్థులు
● గంటలో పట్టుకున్న ధర్మవరం వన్టౌన్ పోలీసులు ధర్మవరం అర్బన్: హోంవర్క్ చేయని తమను టీచర్ కొడుతుందన్న భయంతో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ నుంచి పారిపోగా, పోలీసులు గంటలోనే వారి ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ధరణి, కృష్ణప్రియ ఆరో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ మంగళవారం హోంవర్క్ చేయలేదు. దీంతో టీచర్ కొడుతుందేమోనని భయపడి మధ్యాహ్నం స్కూల్ నుంచి పారిపోయారు. దీంతో స్కూల్ టీచర్లు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ వెంటనే స్పందించి విద్యార్థినుల కోసం ముమ్మరంగా గాలించారు. రైలు ఎక్కి ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్కు వెళ్తున్న విద్యార్థినులను పీఆర్టీవీధిలో గుర్తించారు. వారికి మంచిమాటలు చెప్పి స్టేషన్కు తీసుకువచ్చారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థినులను అప్పగించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి పుట్టపర్తి అర్బన్: అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా సమితి, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఐసీడీఎస్ పీడీ ప్రమీలకు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, యాప్ల భారం తగ్గించాలని, కొత్త ఫోన్లను ఇవ్వాలని, కక్ష సాధింపులు వీడాలని డిమాండ్ చేశారు. మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని కోరారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షురాలు మాబున్నీషా నాయకులు పాల్గొన్నారు. -
ఆ తల్లి నిర్ణయం.. ఆరుగురికి వరం
● ఒక్కగానొక్క కుమారుడి బ్రెయిన్డెడ్ ● అవయవ దానానికి తల్లి అంగీకారం చిలమత్తూరు: ఒక్కగానొక్క కుమారుడు. బిడ్డకు మూడు నెలల వయసులోనే భర్త మరణించాడు. అయినా కష్టాలకు ఎదురీది కుమారుణ్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఇరవై ఏళ్లు నిండాయి. ఇంటికి పెద్దదిక్కుగా నిలుస్తాడనుకుంది. అయితే విధి మరొకటి తలచింది. కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్డెడ్ అయ్యాడు. ఈ బాధ ఆ తల్లి గుండెను పిండేసింది. ఇంతటి దుఃఖంలోనూ కుమారుడి అవయవదానానికి అంగీకరించింది. వివరాల్లోకి వెళితే... చిలమత్తూరులో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, తుమ్మలకుంటకు చెందిన నవీన్తో పాటు మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. నవీన్ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయ్యాడు. ఆసుపత్రి వర్గాలు నవీన్ తల్లి గీతతో మాట్లాడి కుమారుడి అవయవాలు దానం చేయాలని అభ్యర్థించారు. ఇందుకు ఆమె అంగీకరించింది. తన బిడ్డ భౌతికంగా దూరమైనా అవయవ దానంతో సజీవంగా ఉంటాడని భావించింది. గుండె, కళ్లు, లివర్, కిడ్నీలను దానం చేసింది. వాటిని వైద్యులు ఆరుగురికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు. ఈ విషయం తెలిసిన పలువురు గీతను ప్రశంసిస్తున్నారు. సమ్మె చేయండని ఏ గొట్టంగాడు చెప్పాడు! ● ఎంపీడీఓ రమణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చిలమత్తూరు: సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ రమణమూర్తి నోరు పారేసుకున్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయండని ఏ గొట్టం గాడు చెప్పాడు’ అంటూ సచివాలయ ఉద్యోగులపై ఆయన రెచ్చిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘సమ్మె గిమ్మె అంటూ తిరిగితే షోకాజ్ నోటీసులు ఇస్తాను జాగ్రత్త’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమైన సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ చేసిన వ్యాఖ్యలను గ్రామ/వార్డు సచివాలయాల దివ్యాంగ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వర్థ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు సమ్మె హక్కును రాజ్యాంగం ప్రసాదించిందన్నారు. దాన్ని కూడా కాలరాయడం తగదన్నారు. వలంటీర్లు చేయాల్సిన పనులను సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ సీఎం చంద్రబాబు సచివాలయ ఉద్యోగులపై కక్ష తీర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కించపరిచేలా మాట్లాడిన ఎంపీడీఓ రమణమూర్తి వెంటనే సచివాలయ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
యూరియా కొరతపై కన్నెర్ర
అనంతపురం సిటీ: యూరియా కొరతపై సభ్యులు కన్నెర్రజేశారు. రైతుల అవసరాలకు తగ్గట్టు యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జిల్లాకు వస్తున్న యూరియా ఎక్కడికెళ్లిపోతోందని నిలదీశారు. యూరియాను తన్నుకుపోతున్న గద్దలెవరో నిగ్గు తేల్చాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల జాయింట్ కలెక్టర్లు శివ్ నారాయణ్ శర్మ, అభిషేక్ కుమార్, సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య హాజరయ్యారు. యూరియా కొరతపై జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయాన్ని జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించారు. గుమ్మఘట్ట, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, పరిగి జెడ్పీటీసీ సభ్యులు మహేశ్, చంద్రకుమార్, గోవిందరెడ్డి, శ్రీరామప్ప యూరియా కొరత గురించి ప్రస్తావిస్తూ రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కర్ణాటకలో తక్కువ ధరకే యూరియా దొరుకుతోందని, ఏపీలో ఎందుకు కొరత వస్తోందని నిలదీశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను కొందరు దళారులు కుమ్మకై ్క పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అనంతపురం ఎంపీ స్పందిస్తూ కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడి కావాల్సినంత యూరియా తెప్పిస్తున్నట్లు తెలిపారు. అయితే డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. దీనికి కారణం.. అవసరానికంటే ఎక్కువ యూరియాను రైతులు తీసుకెళ్లడమేనని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ స్పందిస్తూ.. రైతుల సమస్యలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకొని డిమాండ్కు తగ్గట్టు యూరియా సరఫరా చేసి ఆదుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తోందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువగా సాగవుతోందని, మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని లేపాక్షి జెడ్పీటీసీ సభ్యుడు శీనురెడ్డి సభ దృష్టికి తెచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం ఇస్తారో ఇవ్వరో తేల్చాలని రొద్దం జెడ్పీటీసీ సభ్యురాలు హరేసముద్రం పద్మ కోరారు. తల్లికి వందనం రాని వారి జాబితా ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులను అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు కాని వారిచేత జాతీయ పతాకావిష్కరణ చేయిస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్ర ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకపోయినా.. బయటి వ్యక్తులతో జెండా ఆవిష్కరణ చేయించినా చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ హెచ్చరించారు. ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్పై వాగ్వాదం ఆర్డీటీకీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ అంశంపై సభలో వాగ్వాదం జరిగింది. బడుగు, బలహీన వర్గాలవారి పాలిట జీవనాడిగా ఉన్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయాలని జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, దళితులు, గిరిజనులు, బీసీలు ఆందోళనలు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేంద్రంలోని పెద్దలందరినీ కలసి విన్నవిస్తున్నామని, ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. దీంతో సభ్యులందరూ మూకుమ్మడిగా నిలదీశారు. ఆర్డీటీకి నిధులు వస్తే గానీ పేదల జీవితాల్లో వెలుగులు నిండవని పేర్కొన్నారు. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుని సద్దుమణిగించారు. సర్వజనాస్పత్రిలో అక్రమాలపై ఆందోళన అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో జరుగుతున్న అక్రమాలు, వ్యవహారాలపై గోరంట్ల, అనంతపురం జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాం నాయక్, చంద్రకుమార్ సభ దృష్టికి తెచ్చారు. ఈసీజీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ సహా విలువైన రక్త పరీక్షలన్నీ పెద్దాస్పత్రిలోనే చేయించాలని ప్రభుత్వం ఆదేశించినా.. యంత్రాలు చెడిపోయాయంటూ రోగులను సత్యం డయాగ్నస్టిక్కు ఎందుకు పంపుతున్నారని నిలదీశారు. ప్రతి నెలా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఎందుకు చెల్లించాల్సి వస్తోందని, ఈ వ్యవహారంలో ఎవరెవరికి ఎంతెంత వాటా ముడుతోందని ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిన సూపరింటెండెంట్ గైర్హాజరు కావడంపై జెడ్పీ చైర్పర్సన్, ఎంపీ మండిపడ్డారు. సర్వజనాస్పత్రిలో మహిళా రోగులకు, సహాయకులకు రక్షణ కరువైపోయిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిలదీసిన సభ్యులు యూరియాను తన్నుకుపోతున్నదెవరో నిగ్గు తేల్చాలని డిమాండ్ రైతులే అదనంగా తీసుకెళ్తున్నారని ఎంపీ అంబికా వ్యాఖ్యలు డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసి ఆదుకోవాలన్న చైర్పర్సన్ గిరిజమ్మ -
కంటైనర్ మాటున చీకటి దందా
సాక్షి, పుట్టపర్తి: కంటైనర్ల మాటున గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో హిందూపురం నుంచి పశు మాంసం విచ్ఛలవిడిగా బెంగళూరుకు తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశుమాంస అక్రమ వ్యాపారం ఊపందుకుంది. హిందూపురం నుంచి రోజూ సగటున 20 టన్నుల పశుమాంసం తరలిస్తున్నట్లు సమాచారం. పాడి, పోషణ, వ్యాపారం పేరుతో గోరంట్ల, అనంతపురంలోని పశువుల సంతల నుంచి కొనుగోలు చేసిన గేదెలు, ఆవులు, ఎద్దులు, దున్నలను పగటి పూట నేరుగా హిందూపురం తరలిస్తారు. రాత్రి వేళల్లో వధించి.. తెల్లవారు లోపు ప్యాకింగ్ చేసి కంటైనర్లలో పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. అక్కడే ఎక్కువగా.. హిందూపురం పట్టణంలోని రహపుత్పురం, ఆజాద్ నగర్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆబాద్పేట, హస్నాబాద్, నింకంపల్లి తదితర ప్రాంతాల్లో పశు మాంస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పగటి పూట కేవలం దున్నలు, ఎద్దుల మాంసం అందుబాటులో ఉంచుతారు. రాత్రి వేళల్లో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెంగళూరుకు కిలో రూ.500 చొప్పున టన్నుల కొద్దీ తరలిస్తుంటారు. అంతేకాక పట్టణంలో సుమారు 20 షాపుల్లో పశుమాంసం విక్రయిస్తున్నారు. హిందూపురంలో 100కు పైగా వ్యాపారులు పశుమాంస విక్రయాల్లో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. నిబంధనలు బేఖాతరు మాంసం దుకాణాల్లో చాలా రోజులుగా నిల్వ ఉంచిన సరుకు ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. పగటి పూట వధించిన పశువుల మాంసం మిగిలితే డ్రమ్ములు, ప్లాస్టిక్ సంచుల్లో నింపి రాత్రివేళల్లో కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందాలో టీడీపీకి చెందిన కొందరు ప్రముఖులకు ప్రతి నెలా పర్సెంటేజీల రూపంలో కమీషన్లు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పశుమాంస విక్రయదారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళల్లో విచ్ఛలవిడిగా పశుమాంసం రవాణా గోరంట్ల, అనంతపురం సంతల్లో పశువుల కొనుగోళ్లు హిందూపురంలో గుట్టు చప్పుడు కాకుండా వధ డ్రమ్ములు, బాక్సుల్లో నింపి టన్నుల ప్రకారం తరలింపు ఈ ఏడాది జూన్ 22న హిందూపురం నుంచి ఆరు వాహనాల్లో బెంగళూరుకు తరలిస్తున్న పశు మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువుల మాంసాన్ని ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించారు. ఎద్దులు, ఆవుదూడలు వధించిన మాంసమా? లేక దున్నల మాంసమా అనేది తేలిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ పరిస్థితి జిల్లా నుంచి పశుమాంసం అక్రమ రవాణాకు అద్దం పడుతోంది. -
నేత్రపర్వంగా శ్రీవారి ఉట్లోత్సవం
కదిరి టౌన్: భాద్రపద బహుళ అష్టమిని పురస్కరించుకుని ఖాద్రీ ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట సోమవారం రాత్రి శ్రీవారి ఉట్లోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కౌలేపల్లికి చెందిన గొల్ల సామాజిక వర్గానికి చెందిన యువకులు ఉట్ల మాను ఎక్కడానికి పోటీ పడ్డారు. అనంతరం ఉత్సవమూర్తునలు తిరు వీధుల్లో ఊరేగించారు. సామూహిక సెలవులకు అనుమతివ్వండి●ఎంపీడీఓకు పంచాయతీ కార్యదర్శుల వినతి ఎన్పీకుంట: సమస్యలు పరిష్కరించలేకపోతే సామూహిక సెలవులు మంజూరు చేయాలంటూ ఎంపీడీఓ పార్థసారథికి పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు లేని విధంగా తమపై పనిభారం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించడం, సెలవులు, పండుగలు, ఆదివారాల్లోనూ బలవంతంగా పనిచేయించడం దారుణమన్నారు. పనిభారంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. స్వామిత్వ సర్వేలో సభ్యులందరూ హాజరుకాక పోవడంతో సర్వే ఆలస్యమవుతోందని, అయితే ఉన్నతాధికారులు మాత్రం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఒత్తిళ్లు పెంచుతున్నారని మండిపడ్డారు. అంతేకాక సచివాలయంలో రకరకాల సర్వేలు, ఆడిట్లు, ఇతర అంశాలపై ఒక పంచాయతీ కార్యదర్శి ఏకాగ్రత చూపలేక పోతున్నారన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ చాలా క్లిష్టమైన పనిగా ఉందన్నారు. సమస్యలకు పరిష్కారం చూపాలని, అలా చేయడానికి అవకాశం లేకపోతే తమకు సామూహిక సెలవులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
వాస్తవాలు రాస్తున్నారనే ‘సాక్షి’పై అక్రమ కేసులు
తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న ‘సాక్షి’ పత్రికపై కూటమి ప్రభుత్వం అక్కసు వెల్లగక్కుతోంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే ‘సాక్షి’ని నోరు మూయించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు ఎల్లో మీడియాలో చూపిస్తున్నారు. కానీ ‘సాక్షి’లో వాస్తవాలు రాస్తున్నందున చంద్రబాబు బండారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతోంది. అందుకే ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తన తప్పులను సరిచేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. అక్రమ కేసులు, అరెస్టులు ‘సాక్షి’ని ఏమీ చేయలేవు. – మహమ్మద్ షాకీర్, మాజీ మంత్రి, కదిరి -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
పుట్టపర్తి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, వాటిని నిర్వహించే సత్తా లేక కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి తిప్పన్న విమర్శించారు. గత ప్రభుత్వం సాధించిన రికార్డు కళ్లకు కనిపించడం లేదా అని మంత్రి సవితను ప్రశ్నించారు. ఎస్సీ సెల్ వివిధ అనుబంధ విభాగం అధ్యక్షులు, సభ్యుల విస్తృత స్థాయి సమావేశం పుట్టపర్తిలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం జరిగింది. సమావేశంలో నరసింహమూర్తి, మాతంగి తిప్పన్న మాట్లాడుతూ.. పెనుకొండతో పాటు రాష్ట్రంలోని పులివెందుల తదితర ప్రాంతాలలో నిర్మాణాలను 80 శాతానికి పైగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అయితే పెనుకొండలో వైద్య కళాశాల నిర్మాణమే జరుగలేదని మంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వైద్య కళాశాల నిర్వహణ చేతకాక ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయని, ఎస్సీ మహిళలపై అత్యాచారాలు మితిమీరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలోనే ఎస్సీలు అన్ని రంగాల్లోనూ రాణించారన్నారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల నేతలు ఓబులేసు, ఫొటో సాయి, చౌడప్ప, రామాంజనేయులు, ఆంజనేయులు, నరసింహులు, నారాయణస్వామి, రామయ్య, నరేష్, గంగన్న, చిన్నరెడ్డన్న, బి.ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి -
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైంది. ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తున్న పత్రికలపై, పత్రికా విలేకరులపై ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పత్రిక ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వాతంత్య్రాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. దీనిని ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – ఓతూరు పరమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
పరిష్కార వేదికకు 60 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు. పోలీసులే అన్యాయం చేస్తున్నారు టీడీపీ నేతల మాటలు విని కేసు నమోదు చేయకుండా పోలీసులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఎస్పీ ఎదుట నల్లమాడ మండలం సానేవారిపల్లి గ్రామానికి చెందిన మంజుల, వరలక్ష్మి వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు ఎస్సీ సతీష్కుమార్కు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... సానేవారిపల్లికి గ్రామంలో గత నెల 30న గణే ష్ నిమజ్జనమం జరిగిందని, ఆ సమయంలో ఆంజనేయులు, మంజుల, వరలక్ష్మి కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకోవడంతో ట్రాక్టర్లో ఉన్న చెన్నకేశవులపై ఆంనేయులు, ఆయన కుమారులు రాజేష్, సాయితో పాటు వారి బంధువులు దాడి చేశారన్నారు. అంతటితో ఆగకుండా సాయంత్రం వరలక్ష్మి, మంజుల ఇంటిపై కొడవళ్లు, రాళ్లతో దాడి చేశారని వివరించారు. దాడికి పాల్పడిన వారు టీడీపీ నేతలు కావడంతో ఘటనపై కేసు నమోదు చేసేందుకు నల్లమాడ పోలీసులు వెనకడుగు వేస్తున్నారన్నారు. పైగా టీడీపీ నేతల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని అక్రమంగా తమపై కేసులు నమోదు చేసి, రోజూ స్టేషన్కు రావాలంటూ వేధిస్తున్నారని వాపోయారు. దీనిపై తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నట్లు బాధితులు వివరించారు. అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ సతీష్కుమార్ ఎస్పీకి అందజేసిన వినతిని చూపుతున్న బాధితులు మంజుల, వరలక్ష్మి -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
గోరంట్ల: బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి తీసుకువెళ్లే వారిని టార్గెట్ చేసి దోచుకునే ఆరుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11.30 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీలకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం గోరంట్ల పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్సింగప్ప, గోరంట్ల సీఐ శేఖర్ వెల్లడించారు. ఆరుగురు నిందితులు... నాలుగు రాష్ట్రాల్లో చోరీలు గోరంట్ల మండలం కొండాపురం గ్రామానికి చెందిన రైతు భుజంగరావు ఈనెల 3వ తేదీన స్థానిక స్టేట్బ్యాంక్లో రూ.3.80 లక్షలు డ్రా చేసుకొని ద్విచక్రవాహనంలోని సైడ్బ్యాగులో పెట్టుకొని ఇంటికి వెళ్లే క్రమంలో గోరంట్లలోని ఓ వస్త్ర దుకాణం వద్ద ఆగాడు. దుకాణంలోకి వెళ్లి తిరిగి వచ్చి చూసుకునే సరికి ద్విచక్రవాహనం సైడు బ్యాగులో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీ (ఆదివారం) సాయంత్రం పాలసముద్రం సమీపంలోని ‘కియో’ హోటల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ఘడ్లోని కడియాశాంతి గ్రామానికి చెందిన దీపభాయితోపాటు పరిత సిసోడియా, ప్రదీప్ సిసోడియా, రేఖాబాయి, మమత, మాలభాయిలను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో రైతు భుజంగరావుకు చెందిన రూ.3.80 లక్షల నగదును తామే చోరీ చేసినట్లు వారు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఆగస్టు 27వ తేదీ నుంచి రాష్ట్రంలోని పులివెందుల, జమ్మలమడుగు, కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి, తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్, జనగామ, ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు రైతు భుజంగరావు వద్ద చోరీ చేసిన రూ.3.80 లక్షలతో పాటు వివిధ కేసులకు సంబంధించి రూ.7.50 లక్షలు మొత్తంగా రూ.11.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీలకు ఉపయోగించిన కారును సైతం సీజ్ చేశారు. సోమవారం నిందితులను పెనుకొండ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన సీఐ శేఖర్, ఎస్ఐ రామచంద్రతో పాటు సిబ్బందిని డీఎస్పీ నరసింగప్ప ప్రత్యేకంగా అభినందించారు. రూ.11.30 లక్షల నగదు స్వాధీనం, కారు సీజ్ -
‘పరిష్కార వేదిక’కు 232 అర్జీలు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి 232 అర్జీలు అందాయి. ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రతి అర్జీపై పూర్తి స్థాయి విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీపీఓ సమతలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు 1,156 ఈ పాస్ మిషన్లు పుట్టపర్తి అర్బన్: చౌక ధాన్యం పంపిణీలో భాగంగా జిల్లాకు 1,156 ఈ పాస్ మిషన్లు చేరాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వెల్లడించారు. గతంలో పంపిణీ చేసిన ఈ పాస్ మిషన్లు తరచూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తుండడంతో నూతన మిషన్లును అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. వృద్ధుడిని ఏమార్చి నగదు అపహరణ గోరంట్ల: వృద్ధుడిని ఏమార్చి అతని ఏటీఎం కార్డు ద్వారా నగదు అపహరించిన ఘటన గోరంట్లలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు... పుట్టపర్తి మండలం పెడపల్లి తండాకు వృద్ధుడు గ్యాంగేనాయక్ సోమవారం రూ.10వేలు నగదు విత్ డ్రా చేసేందుకు గోరంట్లలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి చేరుకున్నాడు. అయితే నగదు విత్ డ్రా విధానం తెలియక అక్కడే ఉన్న ఓ యువకుడి సాయం తీసుకున్నాడు. అతను ఏటీఎం నుంచి రూ.5వేలు డ్రా చేసి, అంతే మొత్తం మాత్రమే వస్తుందని నమ్మబలుకుతూ వృద్ధుడిని ఏమార్చి మరో ఏటీఎం కార్డు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఏటీఎం ద్వారా రూ.35 వేలు డ్రా అయినట్లుగా ఫోన్కు మెసేజ్ అందడంతో వృద్ధుడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చేతిలో ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా అది తమది కాకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘కూటమి’ చెరలో చిత్రావతి!
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచీ ఆ పార్టీల నేతలు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఇందుకోసం చిత్రావతిని చెరబట్టి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, మైనింగ్ అధికారులను భయపెట్టి జేసీబీల సాయంతో పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారు. కర్ణాటకనాగేపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న చిత్రావతి నది నుంచి ఇసుకను తోడేస్తూ తరలిస్తున్నారు. కూటమి నేతల ధనదాహానికి చిత్రావతి రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. రేయింబవళ్లు వందల ట్రాక్టర్ల ఇసుకను చిత్రావతి నుంచి తరలించి ఓ చోట డంప్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో బెంగళూరుకు పంపి భారీగా సంపాదిస్తున్నారు. కూటమి నేతల ఇసుక దందాను ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా... మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారిని మందలించినట్లు తెలుస్తోంది. చిత్రావతివైపు గానీ, ఇసుక అక్రమ రవాణా వైపు గానీ కన్నెత్తి చూడవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరిగేషన్ అధికారులు మైన్స్ శాఖ అధికారులకు లేఖలు రాసి మిన్నకుండిపోయారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ చిత్రావతిలో చెక్ డ్యాం నిర్మాణం పేరుతో కేవలం ఇసుకను తరలించి రూ.వందల కోట్లు సంపాదించినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా కూడా డబ్బు కోసం అదే మార్గాన్ని అవలంబిస్తున్నారు. నది నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా ప్రైవేటు స్థలంలో డంప్.. బెంగళూరుకు తరలింపు ఇసుకాసురులకు మాజీ మంత్రి ‘పల్లె’ అండ ! -
శాంతిభద్రతలు, మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి
పుట్టపర్తి టౌన్: శాంతిభద్రతలు, మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నూతన ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు ఆయన బదిలీపై వచ్చారు. ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. బ్రాస్బ్యాండ్ నడుమ చాంబర్ వద్దకు చేరుకోగా.. పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఎస్పీ రత్న నుంచి సతీష్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ పరిశీలించారు. అక్కడి నుంచి బయల్దేరి దుర్గమ్మ ఆలయం చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అటు నుంచి మసీదు, చర్చిలకు వెళ్లి ఆయా మత పెద్దలతో కలసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రశాంతి నిలయం వెళ్లి భగవాన్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. నేరాల నియంత్రణకు కృషి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్నూ సందర్శించి, అక్కడి కేసుల వివరాలు తెలుసుకుని నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఎస్పీ సతీష్కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతానని, ప్రజలు కూడా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను విస్తృతం చేస్తామన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. నూతన ఎస్పీకి శుభాకాంక్షలు నూతనంగా ఎస్పీ సతీష్కుమార్ను డీఎస్పీలు విజయకుమార్, నరసింగప్ప, హేమంత్కుమార్, శివన్నారాయణస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, మల్లికార్జున, ఎస్పీ సీసీ చిరంజీవి, ఆర్ఐ మహేష్తోపాటు సీఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఎస్పీ సతీష్కుమార్ వెల్లడి -
సర్వజనాస్పత్రిలో ఆహారం.. ఘోరం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. జీజీహెచ్లో డైట్ తయారు చేసే గది బూత్ బంగ్లాను తలపిస్తోంది. దీనిపై గతంలోనే ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైనా పరిస్థితిలో మార్పురాలేదు. సర్వజనాస్పత్రిలో రోజూ 2,500 మంది ఓపీ, 1,100 మంది ఇన్పేషంట్లు ఉంటారు. ఇన్పేషంట్లలో గైనిక్, లేబర్ వార్డులో జేఎస్ఎస్కే మెనూ ప్రకారం, మధుమేహం ఉన్న వారికి మరో రకమైన ఆహారం ఇవ్వాలి. కానీ నూతన కాంట్రాక్టర్ అలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదివారం ఉదయం నాణ్యత లేని ఉప్మా, నీళ్ల చట్నీ, పాలు అందించారు. ఇడ్లీ, పొంగల్ ఇస్తారు కదా అని డైట్ అందించేవారిని అడిగితే ఇంట్లోలాగా ఇక్కడ భోజనం పెట్టరు.. ఏమి ఇస్తే అదే తీసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. గైనిక్, లేబర్ వార్డులోని గర్భిణులు, బాలింతలకు కిచిడీ, చట్నీ ఇవ్వాల్సి ఉండగా, ఉప్మాతోనే సరిపెట్టారు. అలాగే మధ్యాహ్నం రాత్రి వేళల్లోనూ మెనూ పాటించలేదని తెల్సింది. శుభ్రత పాటించని డైట్ సిబ్బంది.. డైట్ సరఫరా చేసే సిబ్బంది శుభ్రత పాటించడం లేదు. చెప్పులు వేసుకొని ఆహారం తీసుకెళ్లే ట్రాలీని తోసుకెళ్తున్నారు. దీంతో పాటు చేతులకు గ్లౌజు, ముఖానికి మాస్క్, తలకు క్యాప్ లేకుండానే ఆహారం సరఫరా చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రమణ్యం పట్టించు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే పరిస్థితులు మెరుగుపడతాయని రోగులు అంటున్నారు. -
ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు
అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక నాయకుడు ప్రెస్మీట్లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై గౌరవభావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వైటీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మడకశిర -
బోధిస్తాం..వేధింపులు పడలేం
కదిరి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదోన్నతి(ప్రమోషన్) కోరుకుంటాడు. ఇందుకోసం ఎంతో కష్టపడతాడు. పదోన్నతి దక్కగానే సంతోషపడిపోతాడు. జీవితంలో మరో మెట్టు ఎక్కానని గర్వపడతాడు. మిగతా శాఖలతో పోలిస్తే విద్యాశాఖలో ప్రమోషన్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూడాల్సి ఉంటుంది. అందుకే ప్రమోషన్ జాబితాలో పేరు కనిపించగానే టీచర్లు సంబరపడతారు. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక పరిస్థితి మారిపోయింది. ప్రమోషన్ అంటేనే ప్రస్తుతం టీచర్లు భయపడిపోతున్నారు. ఇటీవల స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)గా ఉన్న కొందరికి ఉన్నత పాఠశాల హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే అందులో సగం మంది దాకా ‘మాకొద్దు..బాబు నీ ప్రమోషన్’ అంటూ తిరస్కరించారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం వారిని ఎంత ఒత్తిడికి గురి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. 124 మందిలో 52 మంది విముఖత గత జూన్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 124 మంది స్కూల్ అసిస్టెంట్లకు కూటమి ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించింది. అయితే వారిలో 52 మంది టీచర్లు పదోన్నతులు తీసుకునేందుకు ఇష్టపడలేదు. కొందరైతే హెచ్ఎంలుగా బాధ్యతలు తీసుకొని రెండు, మూడు నెలలు పని చేసి తర్వాత ‘హెచ్ఎం పోస్టుకు ఓ దండం’ అంటూ మళ్లీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు వెనక్కు వచ్చేశారు. ఇలా స్కూల్ అసిస్టెంట్ నుంచి రొళ్ల మండలంలోని ఓ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పదోన్నతి పొందిన ఒకరు రెండున్నర నెలలు హెచ్ఎంగా పని చేసి తర్వాత రివర్షన్ తీసుకుని కదిరి ప్రాంతానికి స్కూల్ అసిస్టెంట్గా వచ్చారు. ఇటీవలే ప్రమోషన్ పొంది సోమందేపల్లి సమీపంలోని ఓ పాఠశాలలో హెచ్ఎంగా ఉన్న ఒకరు ‘నాకు హెచ్ఎం ప్రమోషన్ వద్దు. రివర్షన్ ఇచ్చి నన్ను మళ్లీ స్కూల్ అసిస్టెంట్గా పంపండి సార్ ప్లీజ్..’ అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. గౌరవం కాదు..భారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడంటే అందరికీ గౌరవమే. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులందరూ హెచ్ఎంకు తగిన గౌరవం, మర్యాద ఇస్తారు. అందుకే గతంలో ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ తీసుకునేందుకు ఉత్సాహం చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రమోషన్ అంటేనే టీచర్లు భయపడి పోతున్నారు. ‘కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదువుకు సంబంధించినవి కాకుండా రోజూ అనవసరమైన నివేదికలు కోరుతోంది. అది కూడా సమాచారం అడిగిన గంటలోనే పంపాలని ఒత్తిడి పెడుతోంది... అందుకే చాలా మంది హెచ్ఎం పోస్టు మాకు వద్దని తప్పుకుంటున్నారు..’ అని జిల్లాలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం పెట్టే ఒత్తిడిని భరించలేని ఎందరో ప్రధానోపాధ్యాయులు బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం పోస్టు మాకొద్దు బాబూ కూటమి సర్కారులో ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి అడిగిన వెంటనే నివేదికలివ్వాలంటూ ఆదేశాలు బోధనేతర పనులతో ఉక్కిరి బిక్కిరి మానసిక ఒత్తిడితో రోగాల బారిన పడుతున్న వైనం ‘టెన్షన్’ పడలేక పదోన్నతులను తిరస్కరిస్తున్న ఉపాధ్యాయులు ‘పాఠాలు చెబుతాం. పాఠశాల నిర్వహణ మాత్రం చూడలేం’ జిల్లాలోని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఎందుకంటే కూటమి సర్కార్ కొలువుదీరాక ప్రధానోపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి పెరిగింది. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, తరగతి గదుల మరమ్మతులు, తల్లిదండ్రుల కమిటీలతో సమన్వయం.. ఇలా ఇతర కార్యక్రమాల నివేదికలు క్షణాల్లో కావాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. దీంతో చాలా మంది హెచ్ఎం బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. -
కమలపాడులో దొంగల బీభత్సం
● మాజీ ఎంపీపీ ఇంట్లో చోరీ ● ఐదు కిలోల వెండి, బంగారు ఆభరణాలు, నగదు, దస్త్రాల అపహరణ ● అదే గ్రామంలోని మరో ఇంట్లో నగదు, అర కిలో వెండి చోరీ ● గ్రామంలోని శివాలయంలో హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లిన దుండగులు వజ్రకరూరు: మండలంలోని కమలపాడులో దొంగలు బీభత్సం సృష్టించారు. మాజీ ఎంపీపీ శైలజారాజశేఖరరెడ్డి ఇంటికి తాళం వేసిన విషయాన్ని గుర్తించిన దుండగులు ఆదివారం వేకువజామున లోపలకు చొరబడ్డారు. బీరువాతో పాటు వార్డు రోబ్ను తెరిచి అందులోని కీలకమైన డాక్యుమెంట్లు, రూ.10 వేల నగదు, ఐదు కిలోల వెండి, రెండు జతల బంగారు కమ్మలు అపహరించారు. అనంతరం అర్చకుడు దేవేంద్రస్వామి ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.1.5 లక్షల నగదు, అర కిలో వెండి సామగ్రిని అపహరించారు. గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న హుండీ తాళాలను బద్ధలుగొట్టి అందులోని సుమారు రూ.15 వేలను అపహరించారు. ఉదయం అనంతపురం నుంచి ఇంటికి చేరుకున్న శైలజారాజశేఖరరెడ్డి, అలాగే గుంతకల్లు ఉంచి కమలపాడుకు చేరుకున్న అర్చకుడు దేవేంద్రస్వామి చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నాగస్వామి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్టీంను రంగంలో దించి వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తారా?
పత్రికా స్వేచ్ఛకు, వాక్స్వాతంత్య్రపు హక్కుకు సంకెళ్లు వేస్తారా? కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపుతోంది. స్టేట్మెంట్ ప్రచురించిన పత్రికపై కేసులు పెట్టడం దారుణం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి, వారి బాధ్యతను గుర్తు చేసి ప్రజలపక్షాన నిలిచి పోరాడేది మీడియా. అలాంటి మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. ప్రతిఒక్కరూ ఖండించాలి. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలలో కూడా కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదుల సమాచారం తెలుసుకోవడానికై నా శ్రీమీ కోసం కాల్ సెంటర్ 1100శ్రీకు ఫోన్ చేయాలని సూచించారు. పోలీస్ కార్యాలయంలో.... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. అర్జీతో పాటు ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. తోపుదుర్తి భాస్కరరెడ్డికి కన్నీటి వీడ్కోలు ఆత్మకూరు: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కరరెడ్డి (70) అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల మధ్య జరిగాయి. శుక్రవారం గుండెపోటుతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. అనంతపురంలోని తోపుదుర్తి భాస్కరరెడ్డి నివాసం నుంచి పెద్ద ఎత్తున అంతిమయాత్ర సాగింది. భాస్కర్రెడ్డి అంతిమయాత్ర విషయం తెలుసుకున్న ప్రజలు కక్కపల్లి కాలనీ నుంచి ఆలమూరు రోడ్డు, బి. యాలేరు, మదిగుబ్బ క్రాస్, సనప, రంగంపేట, తోపుదుర్తి గ్రామాల వరకూ ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో తరలి వచ్చారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రముఖులు తోపుదుర్తి భాస్కరరెడ్డి అంత్య క్రియల్లో వైఎస్సార్సీపీ ఉభయ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, ఉష శ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి మార్గంతో పరిపూర్ణతప్రశాంతి నిలయం: మనిషిలోని అరిషడ్వర్గాలను వదిలి సత్యసాయి సనాతన ధర్మాలను పాటించడం ద్వారా మనిషి పరిపూర్ణుడు అవుతాడన్న సందేశాన్నిస్తూ సత్యసాయి యూత్, బాలవికాస్ విద్యార్థులు నిర్వహించిన సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సంగారెడ్డి భక్తులు ఆదివారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత స్వర నీరాజనం అర్పించారు. సాయంత్రం శ్రీమృత్యోర్మా అమృతంగమయశ్రీ పేరుతో నిర్వహించిన సంగీత నృత్యరూపకం ఆకట్టుకుంది. మానవుడు ధర్మ మార్గాన్ని వదిలి అరిషడ్వర్గాలకు లోనై చెడుమార్గాలలో పయనిస్తున్నాడని, సత్యసాయి సనాతన ధర్మాలను పాటించడం ద్వారా పరిపూర్ణుడవుతాడన్న సందేశాన్నిచ్చారు. -
నవంబర్ 7 నుంచి రెవెన్యూ క్రీడలు
అనంతపురం అర్బన్: అనంతపుం వేదికగా రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు నంబరు 7 నుంచి మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం రెవెన్యూ హోమ్లో డీఆర్ఓ మలోల, రెవెన్యూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ రాజేష్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్రావు, మైనుద్దీన్, మహిళా విభాగం అధ్యక్షురాలు సురేఖరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్ల సహకారంతో క్రీడలను ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. పనిఒత్తిడిలో ఉండే రెవెన్యూ ఉద్యోగులకు ఈ క్రీడా ఉత్సవాలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. తొలిరోజు 7న కార్యక్రమాన్ని సీసీఎల్ఏ ప్రారంభిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరవుతారని పేర్కొన్నారు. ఇక ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే అందరినీ కలిసి ఆహ్వానించామన్నారు. హోదా తారతమ్యం లేకుండా క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో రెవెన్యూ ఉద్యోగులు వీఆర్ఏ మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు అందరూ పాల్గొంటారన్నారు. జిల్లా ఒక యూనిట్గా 26 జిల్లా యూనిట్లు, సీసీఎల్ఏ యూనిట్ మొత్తం 27 యూనిట్ల నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని వెల్లడించారు. క్రీడా కార్యక్రమాల్లో ఐఏఎస్ అధికారులందరూ పాల్గొంటారన్నారు. రెవెన్యూ క్రీడలు నిర్వహించేందుకు సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి, ఆర్డీటీ యాజమాన్యానికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరఫున ధన్యావాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల షెడ్యూల్ను నాయకులు విడుదల చేశారు. హాజరు కానున్న 2 వేల మంది ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు -
పరిమళించిన మానవత్వం
అనంతపురం సిటీ: ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు ఆకలిబాధ తట్టుకోలేక ఫుట్పాత్పై వృద్ధుడు ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఆ మార్గంలో ఎంతోమంది వెళ్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ నలుగురు విద్యార్థినులు స్పందించారు. దగ్గరకు వెళ్లి ఆయన బాధ కనుక్కొని అన్నం పెట్టి.. ఆపై ఆస్పత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తికి చెందిన సత్యనారాయణ (70) షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన ఆయన అనంతపురం చేరాడు. జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ఫుట్పాత్పై పడి ఉన్నాడు. నాలుగు రోజులుగా అన్నపానీయాలు లేక నీరసించిపోయాడు. శనివారం ఆకలికి తాళలేక గట్టిగా కేకలు వేస్తున్నాడు. అటుగా రాకపోకలు సాగిస్తున్నవారు చూస్తూ పోతున్నారే కానీ ఎవ్వరూ ఆయన బాధ ఏమిటో కనుక్కోలేకపోయారు. అదే సమయంలో కేఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న త్రివేణి, కళ్యాణి, శిరీష, లల్లీశ్రీ ఆ వృద్ధుడి దీనస్థితి చూసి చలించిపోయారు. అయ్యో పాపం.. అంటూ దగ్గరకు వెళ్లగానే దుర్వాసన వచ్చింది. కాలు కుళ్లిపోయి.. పురుగులు పట్టి కదలలేని స్థితిలో ఉన్న అతడిని ‘ఏమైంది తాతా’ అంటూ ఆరా తీశారు. అతను కడుపు పట్టుకుని ఆకలి అవుతున్నట్లు తెలిపాడు. ఆ విద్యార్థినులు తమ వద్ద ఉన్న చిల్లర డబ్బు పోగు చేసుకుని హోటల్నుంచి భోజనం తీసుకొచ్చి తినిపించారు. ఆ తర్వాత ఆటోను పిలిచి వృద్ధుడిని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. సంతకాలు పెడితేనే అడ్మిషన్ చేసుకుంటామని చెప్పడంతో విద్యార్థినులు నేరుగా ఆర్ఎంఓ డాక్టర్ గుజ్జల హేమలతను కలిసి విషయం తెలిపారు. ఆమె ఆలస్యం చేయకుండా విద్యార్థినులకు ధైర్యం చెప్పి.. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డాక్టర్ కార్తీక్రెడ్డి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాదేవిని వెంటబెట్టుకొని క్యాజువాలిటీకి చేరుకున్నారు. దుర్వాసన వస్తున్న వృద్ధుడికి సిబ్బంది చేత స్నానం చేయించిన తర్వాత అన్ని రకాల పరీక్షలు చేయించారు. కుళ్లిపోయిన కాలును తొలగించాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తేల్చారు. అడ్మిషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. మానవత్వంతో స్పందించిన విద్యార్థినులు త్రివేణి, కళ్యాణి, శిరీష, లల్లీశ్రీని ఆర్ఎంఓ, సీఎంఓ ప్రశంసించారు. విద్యార్థి లోకానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఫుట్పాత్పై వృద్ధుడి నరకయాతన ఆకలి తీర్చి.. ఆటోలో ఆస్పత్రికి చేర్చి ఆదర్శంగా నిలిచిన ఇంటర్ విద్యార్థినులు -
అనంతపురం క్రికెట్కు వన్నె తెచ్చిన అనూష
అనంతపురం: భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనంతపురం క్రికెట్ చరిత్రకు వన్నె తెచ్చిన గొప్ప క్రీడాకారిణి అనూష అని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో శనివారం రాయలసీమ క్రికెట్ మైదానాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సీనియర్ క్రీడాకరులు చొరవ చూపించాలన్నారు. ఈ సందర్భంగా భారత జట్టు మహిళా క్రికెటర్ అనూషకు లక్ష రూపాయల చెక్కును జిల్లా క్రికెట్ సంఘం తరఫున మాంఛోఫెర్రర్ అందజేశారు. అనంతరం సీనియర్ క్రికెటర్లు ఒక మ్యాచ్ ఆడారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, జిల్లా కార్యదర్శి వి.భీమలింగారెడ్డి, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున, మాజీ రంజీ క్రీడాకారలు కేఎస్ షాబుద్దీన్, ఎల్ఎన్ ప్రసాద్రెడ్డి, కేఏ ఫయాజ్ అహమ్మద్, డి.సురేష్, షేక్షావలి, డీబీ ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
బత్తలపల్లి: రామాపురం జెడ్పీహెచ్ఎస్ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల 10వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భాగంగా రెండో రోజు శనివారం పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం – తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి, ప్రకాశం – విశాఖపట్నం మధ్య జరిగిన పోటీలో ప్రకాశం జట్టు విజయం సాధించాయి. బాలికల విభాగంలో గుంటూరు–విశాఖపట్నం మధ్య జరిగిన పోటీలో గుంటూరు, శ్రీకాకుళం–తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో శ్రీకాకుళం జట్టు విజయం సాధించాయి. బాలుర విభాగంలో ప్రకాశం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలు సెమీఫైనల్కు చేరాయి. బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు సెమీఫైనల్కు చేరాయి. కాగా.. శనివారం నాటి పోటీలను హెచ్ఎం వెంకటనాయుడుతో కలిసి ఎంఈఓ సుధాకర్నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయశంకర్రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజీ, జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, పీడీ తలారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలి
పుట్టపర్తి అర్బన్: వైద్య ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. శనివారం పుట్టపర్తి మండలం ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి, పుట్టపర్తి ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యం కోసం ఆస్పత్రులకు వచ్చే ప్రజలు ఈహెచ్ఆర్ నమోదు కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ఆరాతీశారు. ప్రజలకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీలు క్రియేట్ చేయాలని ఆదేశించారు. కర్ణాటక నాగేపల్లిలో వ్యాధి నిరోధక టీకా కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు ఇచ్చే టీకాలను పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఏఎన్ఎంను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మునిచంద్రిక, సీహెచ్ఓ వన్నప్ప, సిబ్బంది పాల్గొన్నారు. భాస్కర్రెడ్డి మృతి తీరని లోటు మడకశిర: వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతి ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీరని లోటని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులతో కలిసి రఘువీరారెడ్డి శనివారం అనంతపురంలో తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాస్కర్రెడ్డి సతీమణి, జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవితను ఓదార్చారు. ఇసుక టిప్పర్లు స్వాధీనం ముదిగుబ్బ: ఉప్పలపాడు సమీపంలోని చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివరాముడు శనివారం తెలిపారు. సీజ్ చేసిన టిప్పర్లను మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు అప్పగించిచినట్లు పేర్కొన్నారు. -
జిల్లా నూతన ఎస్పీగా సతీష్కుమార్
పుట్టపర్తి టౌన్: జిల్లా నూతన ఎస్పీగా సతీష్కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం... గుంటూరు (అర్బన్) ఎస్పీగా పనిచేస్తున్న సతీష్ కుమార్ను జిల్లాకు బదిలీ చేసింది. ఇక్కడ ఎస్పీగా ఉన్న వి.రత్నకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సతీష్కుమార్ స్వస్థలం తమిళనాడు. ఆయన 2016 ఐపీఎస్ బ్యాచ్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన.. బీటెక్ బయోటెక్నాలజీ చదివారు. అనంతరం తమిళనాడు గ్రూప్–2 పోస్టు సాధించి ట్రెజరీ డిపార్టుమెంట్లో రెండున్నర ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత యూపీఎస్సీపై గురిపెట్టారు. నాలుగుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివారు. ఐదో ప్రయత్నంలో ఐపీఎస్గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం చింతలపల్లి అదనపు ఎస్పీగా, నర్సీపట్నంలో ఓఎస్డీగా, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సతీష్కుమార్ ఎక్కడ పనిచేసినా యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తరచూ కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు సైబర్ నేరాల గురించి తెలియజెప్పేవారు. అర్ధరాత్రి సమయాల్లో పట్టణంలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునే వారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేవారు. స్నేహపూర్వక పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్లో మంచిపేరు సంపాదించారు. గుంటూరు ఎస్పీగా నేరాలు నియంత్రించడంలో వ్యూహాత్మంగా పనిచేశారు. అందుకే సతీష్కుమార్కు అటు పోలీసులు, ఇటు ప్రజల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆదివారమే ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వి.రత్నకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం -
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
ప్రజాస్వామ్యానికి పత్రికలే పట్టుగొమ్మలు. అలాంటి పత్రికలపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. ఒక నాయకుడు ప్రెస్ మీట్ కవర్ చేసిన పత్రికపై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడా చూడలేదు. కూటమి సర్కార్ నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనం. ‘సాక్షి’ ఎడిటర్, తదితరులపై కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోంది. ప్రజాస్వామ్యవాదులంతా సర్కారు చర్యలను ఖండించాలి. –దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి -
రెచ్చిపోయిన ‘పచ్చ’ నేతలు
● భార్యాభర్తపై కర్రలతో విచక్షణారహితంగా దాడి సాక్షి టాస్క్ఫోర్స్: ‘పచ్చ’ నేతలు రెచ్చిపోయారు. భార్యాభర్తపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు.. తలుపూరు గ్రామానికి చెందిన గోసల కొండా, గోసల ఎర్రమ్మ భార్యాభర్తలు. వీరు శనివారం గ్రామ సమీపంలోని తమ పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారు. ఈ భూమిలో వ్యవసాయం ఎలా చేస్తారు అంటూ దౌర్జన్యానికి దిగారు. సర్వే నంబర్ 68కు సంబంధించి భూమి సమస్య పెండింగ్లో ఉందని, తాము వ్యవసాయం చేస్తున్నది సర్వే నంబర్ 69లో అని గోసల కొండ చెబుతున్నా వినలేదు. భార్యాభర్తపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గోసల యర్రమ్మ తలకు తీవ్ర గాయాలు కాగా, కొండా కాలికి గాయమైంది. వెంటనే వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యర్రమ్మ తలకు వైద్యులు కుట్లు వేశారు. కొండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ నేతల ప్రోద్బలంతోనే తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ఎర్రమ్మ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘‘ జిల్లా సమగ్రాభివృద్ధే నా లక్ష్యం. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ముందుకు సాగుతాం. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందేలా చేస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతా’’ అని జిల్లా నూతన కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడారు. తాను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చానని తెలిపారు. తన కుమార్తె విద్యాభ్యాసం సత్యసాయి విద్యాసంస్థల్లో సాగిందని, అందువల్ల జిల్లాపై తనకు సమగ్ర అవగాహన ఉందన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. పరిశుభ్రత, నీటి సరఫరా, విద్యుత్, జల సంరక్షణ, ఆరోగ్యం, విద్య తదితర ప్రధానమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకు సాగుతాం అర్హులకు పథకాలు అందిస్తాం... పౌరసేవలు వేగవంతం చేస్తాం జిల్లా నూతన కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ వైభవంగా బాబా శత జయంత్యుత్సవాలు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నూతన కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జ్ డీఆర్ఓ రామసుబ్బయ్య, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకున్న కలెక్టర్ శ్యాంప్రసాద్కు సాయికుల్వంత్ సభా మందిరంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జ్ డీఆర్ఓ ఎం.రామసుబ్బయ్య, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, శర్మ, ఆనంద్కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ సాయికుల్వంత్ సభా మందిరానికి వెళ్లి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నిజాలను వెలికితీస్తున్న ‘సాక్షి’పై కూటమి సర్కార్ అక్కసు వెళ్లగక్కుతోంది. పోలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. వాక్ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. –వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ -
బార్.. టెం‘డర్’
సాక్షి, పుట్టపర్తి నూతన మద్యం పాలసీతో ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచనకు అధికార కూటమి పార్టీల నాయకులు తూట్లు పొడుస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ తమ ఆధ్వర్యంలోనే నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్న నేతలు...తాజాగా బార్లపై కన్నేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలవగా.. కూటమి పార్టీల నాయకులే సిండికేటుగా మారి ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లాలో 12 బార్లకు టెండర్లు పిలవగా.. ఏడింటికి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వాటిని లాటరీ పద్ధతిన కేటాయించారు. మిగిలిన ఐదు బార్లకు మరోమారు నోటిఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి ఆదివారంతో (ఈనెల 14) దరఖాస్తుకు గడువు ముగుస్తుంది. అయినా దరఖాస్తులు రాలేదు. దీంతో ఎకై ్సజ్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల గడువు ఈనెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అయితే ఇప్పటివరకు ఒక్క బార్కు కూడా దరఖాస్తులు రాలేదు. మరో మూడు రోజులు కాదు.. మూడు నెలలు పొడిగించినా.. దరఖాస్తులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే కానీ, బార్ కేటాయింపునకు లాటరీ తీయరాదనే నిబంధన ఉండటంతో ఎకై ్సజ్ అధికారులకు ఒత్తిళ్లు తప్పడం లేదు. వ్యాపారం తగ్గుతుందని... జిల్లాలోని మద్యం అమ్మకాలన్నీ కూటమి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన 7 బార్లనూ వారే నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల వ్యాపారం తగ్గుతుందని కొత్త బార్లకు అవకాశం ఇవ్వకుండా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అందువల్లే దరఖాస్తులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులే చెబుతున్నారు. అందని దరఖాస్తులు.. అధికారులపై ఒత్తిడి.. జిల్లాలో మడకశిర, ధర్మవరం–1, ధర్మవరం–2, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో మద్యం బార్ల ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు విధించారు. తగినన్ని దరఖాస్తులు అందని పరిస్థితుల్లో ఈనెల 17వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇన్ని రోజులుగా రాని దరఖాస్తులు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూటమి నేతలు సిండికేటుగా మారి ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఎకై ్సజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంది. మొన్న కూడా 4 చొప్పునే.. బార్ల టెండర్లలో ప్రభుత్వం నూతన నిబంధనలు విధించింది. కనీసం నాలుగు దరఖాస్తులు అందితేనే లాటరీ తీయాలని ఆదేశించింది. దీంతో గత నెలలో జిల్లాలోని 12 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో ఆరు బార్లకు కేవలం నాలుగు చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. నిబంధన మేరకు నాలుగు దరఖాస్తులు వేయాలి కాబట్టి కూటమి నేతలే వేసినట్లు సమాచారం. మిగతా వారు దరఖాస్తు చేయనీయకుండా బెదిరింపులతో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసిన బార్కు మాత్రం 11 మంది పోటీ పడటం గమనార్హం. ఒక్క దరఖాస్తూ కష్టమే.. హిందూపురంలో ఇప్పటికే మూడు బార్లు ఉన్నాయి. దీంతో మరో బార్కు దరఖాస్తులు రాకుండా మిగిలిన బార్ ఓనర్లు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అక్కడ ఒక్క దరఖాస్తు కూడా కష్టమే. కదిరిలో ఇప్పటికే రెండు బార్లు నడుస్తున్నాయి. దీంతో మరో బార్ వద్దనే నిర్ణయానికి వచ్చారు. మడకశిరలో ఒక బార్ ఏర్పాటుకు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ... కర్ణాటక సరిహద్దు కావడం... ఈ ప్రాంత వాసులు కర్ణాటక మద్యానికి మొగ్గు చూపడంతో వ్యాపారం జరగని ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక ధర్మవరంలో ఇప్పటికే ఒక బార్ నడుస్తోంది. మరో రెండు బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దరఖాస్తులు అందలేదు. దరఖాస్తులు వస్తేనే లాటరీ ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తాం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉన్నాయి. ఒకట్రెండు దరఖాస్తులు వస్తే.. ఫీజు వెనక్కి చెల్లించి లాటరీ ప్రక్రియ రద్దు చేస్తాం. మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. దరఖాస్తులు వేయనీయకుండా నాయకుల బెదిరింపుల అంశం నా దృష్టికి రాలేదు. – గోవిందనాయక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి గడువు సమీపిస్తున్నా బార్లకు దరఖాస్తులు నిల్ అప్లికేషన్లు వేయనీయకుండా అడ్డగింత కూటమి నేతలు సిండికేటుగా మారి బెదిరింపులు 12 బార్లలో 7 దుకాణాలకు ఫుల్.. ఐదింటికి మళ్లీ నోటిఫికేషన్ అయినా స్పందన లేక ఎకై ్సజ్ అధికారుల తిప్పలు మరో మూడు రోజులు గడువు పొడిగించిన వైనం -
జిల్లా కోర్టు భవనాలకు స్థల పరిశీలన
పుట్టపర్తి అర్బన్: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని హైకోర్టు జడ్జి రామకృష్ణ ప్రసాద్, జేసీ అభిషేక్కుమార్ పరిశీలించారు. జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకు కనీసం పది ఎకరాలు అవసరం కానుండగా, శనివారం హైకోర్టు జడ్జి, జేసీ అధికారులతో కలిసి పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట క్రాస్లో ఉన్న భూములను పరిశీలించారు. కొత్తచెరువు–పుట్టపర్తి ప్రధాన రహదారి సమీపంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమిని పరిశీలించారు. అలాగే మరో ప్రాంతంలోని భూములను సైతం పరిశీలించారు. జిల్లా ప్రజలకు అనుకూలంగా అన్ని కోర్టులు ఒకే ప్రాంతంలో ఉండేవిధంగా సౌకర్యవంతంగా జిల్లా కోర్టు భవనాలు నిర్మించనున్నట్లు హైకోర్టు జడ్జి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. అధికారుల వెంట ఆర్డీఓ సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్, తహసీల్దార్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. సత్యసాయి సేవలో హైకోర్టు జడ్జి ప్రశాంతి నిలయం: హైకోర్టు జడ్జి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ శనివారం సత్యసాయి సేవలో గడిపారు. శనివారం రోడ్డుమార్గాన పుట్టపర్తికి చేరుకున్న ఆయనకు ప్రశాంతి నిలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్లు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో జడ్జి రామకృష్ణ ప్రసాద్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. టీడీపీ నేతకు దేహశుద్ధి ● మహిళను వేధించిన ఫలితం ● కారులోంచి లాక్కెళ్లి చితకబాదిన వైనం గోరంట్ల: ‘వెలుగు’లో పని చేస్తున్న ఓ మహిళను వేధింపులకు గురిచేసిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ను సదరు మహిళ బంధువులు దేహశుద్ధి చేశారు. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ‘వెలుగు’లో పనిచేస్తోంది. సదరు మహిళపై కన్నేసిన ఓ టీడీపీ ముఖ్యనాయకుడు తరచూ ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు గురిచేసేవాడు. రానురాను వేధింపులు తీవ్రతరం కావడంతో బాధిత మహిళ విషయం భర్తకు తెలిపింది. దీంతో సదరు నాయకుడికి బుద్ధి చెప్పాలనుకున్న మహిళ భర్త తన బంధువులు, మిత్రులతో కలిసి రెండురోజుల క్రితం రాత్రి వేళ పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద కాపు కాశాడు. ఆ సమయంలో కారులో అక్కడికి వచ్చిన టీడీపీ నాయకుడిని కారులోంచి లాక్కుని వెళ్లి చితకబాదారు. సదరు మహిళ భర్త కూడా టీడీపీ నాయకుడే కావడంతో ఆ పార్టీలోని కొందరు పెద్దలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ శనివారం ఈ విషయం బయటకు రాగా..ఎవరా నాయకుడంటూ అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. అయినా మహిళను వేధించిన ఆ నాయకుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. జాతీయ లోక్ అదాలత్లో 6,542 కేసుల పరిష్కారం అనంతపురం: ‘కోర్టు కేసుల్లో ఎవరో ఒకరే గెలుస్తారు. మరొకరు పరాజితులు అవుతారు. కానీ జాతీయ లోక్ అదాలత్లో లభించే పరిష్కారంలో ఇరువురూ విజేతలే’ అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో మొత్తం 6,542 కేసులు పరిష్కారమయ్యాయి. 32 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో రూ.1.26 కోట్లు, సివిల్ దావాల్లో రూ.84 లక్షలు, 2,351 ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.1.04 కోట్లు, ఎన్ఐ యాక్ట్ కేసుల్లో రూ. 1.18 కోట్లు బాధితులకు నష్ట పరిహారం అందించారు. జాతీయ లోక్అదాలత్కు హాజరైన కక్షిదారులకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి సి.సత్యవాణి, అనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ మొదలైన దందా..
ఈ ఏడాది సీజన్ మొదలు కావడంతో ‘గూండా ట్యాక్స్ 2.0’ మొదలైంది. ఓ ట్రాన్స్పోర్ట్ యజమాని, ఓ మండీ యజమాని రంగంలోకి దిగారు. వీరి ఆధ్వర్యంలోనే వసూళ్లు చేస్తున్నారు. రోజూ సగటున 190 దాకా వాహనాలు లోడింగ్ అవుతున్నాయి. అంటే రోజూ ఆదాయం రూ. 3 లక్షలకు పైమాటే. పరిటాల కుటుంబం పేరు చెప్పుకుంటూ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందుకోసం కొందరిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఉదయం ఏ మండీకి ఏయే వాహనాలు వచ్చాయో స్లిప్పులు రాసుకుని సాయంత్రం ఆయా మండీల యజమానులకు చెబుతారు. స్లిప్పుల్లో లెక్కల ప్రకారం ఎన్ని వాహనాలు వెళ్లి ఉంటే అంత డబ్బు చెల్లించాలి. ఇదంతా బయ్యర్ల నుంచి వసూలు చేస్తున్నా...వారు రైతులపై మోపుతారని వాపోతున్నారు. ‘టమాట మండీమే అప్సీ ఏక్ గాడీకు దో హజార్ గూండా ట్యాక్స్ బర్నా’ అంటూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన బయ్యర్లు చర్చించుకుంటున్నారు. కాగా ‘టమాట లారీ లోడింగ్ రిసీప్ట్, ‘టమాట మినీ లారీ లోడింగ్ రిసీప్ట్’ పేరుతో రశీదులు ఇస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరి కోసం, ఎందుకోసం వసూళ్లు చేస్తున్నారో అన్న వివరాలు లేకపోవడంతో మండిపడుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతి
ఆత్మకూరు/ అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి (70) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. తోపుదుర్తి భాస్కర్రెడ్డి అనంతపురంలో నివాసముంటూ ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామం వద్ద ఉన్న తన పొలంలో కూలీలతో పనులు చేయించేవారు. శుక్రవారం కూడా పొలంలో కూలీలతో పనులు చేయిస్తుండగా ఫోన్ రావడంతో పక్కకు వెళ్లారు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో పొలంలో పని చేసే వారు వెళ్లి చూడగా కిందపడి ఉన్నారు. వెంటనే అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. తోపుదుర్తి భాస్కర్రెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. పలువురి నివాళి.. తోపుదుర్తి భాస్కర్రెడ్డి మరణ వార్త వినగానే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు అనంతపురంలోని నివాసం వద్దకు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చందు, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి, గంగుల భానుమతి, రమేష్గౌడ్ తదితరులు భాస్కర్రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. సంతాపం తెలిపిన వారిలో అనంతపురం మేయర్ వసీం, మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మహమ్మద్, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేత బెస్త రమణ, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు వడిత్య గోవిందునాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్రెడ్డి, తెలుగు వర్సిటీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ పెదారపు చెన్నారెడ్డి ఉన్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: తోపుదుర్తి భాస్కర్రెడ్డి అంతిమయాత్ర ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అనంతపురం రామచంద్రనగర్లోని ఇంటివద్ద నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఇంటి వద్ద నుంచి ప్రారంభమై ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామం వరకు సాగుతుందని, అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. రేపు అంత్యక్రియలు అందరితో సన్నిహితంగా.. తోపుదుర్తి భాస్కర్రెడ్డి 1987లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కూడా పని చేశారు. ఆయన సతీమణి తోపుదుర్తి కవిత 2006లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక దంపతులిద్దరూ జగన్ వెంట నడిచారు. రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న భాస్కర్రెడ్డి ప్రతి ఒక్కరితోనూ సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. -
జిల్లా ప్రజల అభిమానం మరువలేనిది: కలెక్టర్ చేతన్
ప్రశాంతి నిలయం: ‘‘జిల్లా ప్రజల ప్రేమ, అభిమానం మరువలేనిది. జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్తి సంతృప్తితో ఇక్కడి నుంచి వెళ్తున్నా’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. ప్రభుత్వం టీఎస్ చేతన్ను గురువారం బదిలీ చేయగా... శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు జాతీయ రహదారులు, సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలెక్టర్ టీఎస్ చేతన్కు వీడ్కోలు పలుకుతూ సత్యసాయి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, వీవీఎస్ శర్మ, ఆనంద్కుమార్, మహేష్, ఇన్చార్జ్ డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 37 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి పుట్టపర్తి టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 37 మంది హెడ్కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్ఐ)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1996 పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారం రోస్టర్ పాయింట్ల ఆధారంగా పదోన్నతులు కల్పించారు. హెడ్కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన వారిలో టి.చంద్రశేఖర్, కె. లక్ష్మీనారాయణ, సి.బాబు, ఏ.శ్రీనివాసులు, జి.నరహరి, ఎస్. శ్రీరామనాయక్, ఎస్. బీమ్లా నాయక్, జి.సౌరెడ్డి, బి.నారాయణ, కె.లక్ష్మీనారాయణ, వి.నాగరాజు, సి.రవికాంత్, ఆర్, సంజీవులు, ఎం.అశోక్కుమార్, టీఎస్ హనీష్బాబు, డీఎన్ .చలంబాబు, వై.కృష్ణమూర్తి, వై. వెంకటరాముడు, బి.ఎర్రిస్వామి, జె.అమరేశ్వర్రావు, ఏ. ఆదినారాయణ, కె. ధనుంజయ, ఏసీ సురేంద్రబాబు, టీ. వెంకటేషులు, కె. జయరాముడు, జి. ఈశ్వరయ్య, కె. షబ్బీర్ఖాన్, జి. తిప్పయ్య, ఎం. వెంకటేసులు, బి. వెంకటనారాయణ, జీసీ అఽశ్వర్థనారాయణ, బి. శ్రీనివాసులు, కె. దేవానంద, బి. నరేంద్రనాథ్రెడ్డి, ఎం. రామకృష్ణ, డి. భాస్కర్బాబు, సి. శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. నేటి నుంచి వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు రాగల ఐదు రోజులు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షం పడే సూచన ఉందని పేర్కొన్నారు. ఈ నెల 13న 13 మి.మీ, 14న 8 మి.మీ, 15న 14 మి.మీ, 16న 16 మి.మీ, 17న 15 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. -
రేపు ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్షలు జరగనున్నాయని డీఆర్ఓ మలోల తెలిపారు. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 252 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై డీఆర్ఓ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో యూపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ముఖేష్ దత్ మీనాతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జేఎన్టీయూఏ కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి ఉదయం 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పేపర్–2, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పేపర్–3 జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 119 మంది హాజరవుతారని వెల్లడించారు. అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు 133 మంది హాజరవుతారని తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జేఎన్టీయూఏ కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా ఎస్డీసీ తిప్పేనాయక్, రూట్ అధికారిగా ఎస్డీసీ రామ్మోహన్, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఎస్డీసీ మల్లికార్జునుడు, రూట్ అధికారిగా మల్లికార్జునరెడ్డిని నియమించామని వెల్లడించారు. పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. 252 మంది అభ్యర్థులకు రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని డీఆర్ఓ ఆదేశం -
పత్రికా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యానికి గీటురాయి
ఏ దేశంలోనైనా పత్రికా స్వేచ్ఛ ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉందని అర్థం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్లు ఆ స్థాయిలో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏదో స్టేట్మెంట్ ప్రచురించారని కేసులు పెట్టడం దారుణం. ప్రజాస్వామ్యవాదులు పత్రికా సంకెళ్లు, అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమననీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, అనంతపురం -
యువకుడి దుర్మరణం
తనకల్లు: మండల పరిధిలోని 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ముదిగుబ్బ మండలం దొరిగల్లుకు చెందిన ఓం ప్రతాప్ (30) సొంతంగా బొలెరో పికప్ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వివాహమైంది కానీ పిల్లలు లేరు. శుక్రవారం టమాట లోడ్ చేసుకుని పుంగనూరు సమీపంలోని వడ్డిపల్లికి రైతు ప్రసాద్తో కలసి వెళ్లాడు. అక్కడ అన్లోడ్ అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. తనకల్లు మండలం మండ్లిపల్లి మలుపు వద్దకు రాగానే 42వ జాతీయ రహదారిపై కదిరి నుంచి మదనపల్లి వైపు వెళుతున్న లారీని వేగంగా ఢీకొనడంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలతో ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలోనే ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతి కష్టంపై స్థానికులు వెలికి తీశారు. తీవ్ర గాయాలమైన రైతు ప్రసాద్ను వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్లో తొలుత తనకల్లులోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. గిరిజన యువతి అదృశ్యం కదిరి టౌన్: గిరిజన యువతి మిస్సింగ్పై కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. స్థానిక శివాలయం వీధిలో నివాసముంటున్న గిరిజన వ్యక్తి తన అక్క కుమార్తెను చేరదీసి ఆమె పోషణ భారాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తల్లి వంట చేస్తుండగా ఇంట్లో చెత్త బయట పడేసి వస్తానని వెళ్లిన యువతి.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు మేనమామ ఫిర్యాదు చేశాడు. కాగా, తన మేనకోడలితో కదిరి రూరల్ మండలం దిగువపల్లికి చెందిన మహేష్నాయుడు చనువుగా ఉండేవాడని, ఈ పరిస్థితుల్లో మహేష్నాయుడిపైనే తమకు అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని బలిగొన్న బాటిల్ మూత గుత్తి రూరల్: వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని రక్షత్రామ్ (18 నెలలు) అనే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులోని పవర్గ్రిడ్ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన మౌనిక పవర్గ్రిడ్ కేంద్రంలో ఏపీ ట్రాన్స్కో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీకి కుమారుడు రక్షత్రామ్ను తీసుకుని వెళ్లారు. కుమారుడు ఆడుకోవడానికి వాటర్ బాటిల్ ఇచ్చి విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బాటిల్ మూత తీసి మింగడానికి ప్రయత్నించడంతో గొంతులో ఇరుక్కుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ఏడీఈ, పవర్గ్రిడ్ ఉద్యోగులు వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతితో తల్లి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించారు. -
17 నుంచి మహిళా ఆరోగ్య కార్యక్రమాలు
పుట్టపర్తి అర్బన్: మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన చికిత్స పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం తెలిపారు. ఈ నెల 17న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయుస్మాన్ మందిరాలు, ప్రాధమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ కియోస్కీల ఏర్పాటు, ప్రసూతి, చిన్న పిల్లల, కంటి, ఈఎన్టీ, దంత, చర్మ, సైకియాట్రీ సేవలు, మహిళలకు హిమోగ్లోబిన్, బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీకు స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. చిన్నారులకు టీకాలు కూడా వేస్తారన్నారు.న రక్తదాన శిబిరాల ఏర్పాటు, పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన సదస్సులు ఉంటాయన్నారు. ఆయుస్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన కార్డులు, 70 ఏళ్లు దాటిన వారికి వయోవందన కార్డులు జారీకి వివరాలు నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
కనిపించని ప్రత్యామ్నాయం
పుట్టపర్తి అర్బన్: కీలకమైన జూలై వర్షాలు ఖరీఫ్ను దారుణంగా దెబ్బతీశాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్లో లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేయలేక రైతులు చేతులెత్తేశారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగే శరణ్యంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్లో వేరుశనగ పూర్తిగా సాగులోకి రాకపోవడంతో రాబోవు వేసవిలో పశువులకు మేత దొరకడం కష్టమవుతుంది. దీంతో కనీసం ప్రత్యామ్నాయ పంటలు ఆదుకుంటాయని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ విత్తన పంపిణీపై ఇప్పటి వరకూ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో 2,69,152 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో జిల్లాలోకి ప్రవేశించినా ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో కేవలం 35 వేల హెక్టార్లలో వేరుశనగ, 15 వేల హెక్టార్లలో కంది, 17 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్ల వరి, మరో 75 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఇప్పటికీ సుమారు 2 లక్షల హెక్టార్ల భూమి బీడుగానే ఉంది. ఆగస్టులో అంచనాకు మించి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఈ నెలలోనూ అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో భూములు బీడుగా ఉంచడం కంటే ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, పెసర, అలసంద, జొన్న సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ పంటల ద్వారా కనీసం పశువులకు మేతైనా దక్కుతుందని ఆశిస్తున్నారు. జిల్లాలో 64 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలుకావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్ తెలిపారు. ఇందులో 55 వేల హెక్టార్లలో ఉలవ సాగుకు 13,750 క్వింటాళ్ల విత్తనాలు, 3 వేల హెక్టార్లలో పెసర సాగుకు 600 క్వింటాళ్ల విత్తనాలు, 4 వేల హెక్టార్లలో అలసంద సాగుకు 800 కిలోల విత్తనాలు, 2 వేల హెక్టార్లలో జొన్న సాగుకు 200 కిలోల విత్తనాలకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. అయితే ప్రత్యామ్నాయ విత్తన పంపిణీపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు సైతం వేచి చూడక తప్పడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు తిలోదకాలిచ్చేశారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా వ్యవసాయం, రైతు సంక్షేమం గురించి ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడంతో అన్నదాతల్లో అసహనం వ్యక్తమవుతోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వలేదు, పంటల బీమా కింద పరిహారం ఇవ్వలేదు. కొత్తగా పంటల బీమా పథకాల గురించి ఊసేలేదు. ప్రత్యామ్నాయం కింద విత్తనాలకు అతీగతీ లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీజన్కు ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సాయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తూ వచ్చారని, ఉచిత పంటల బీమా పథకంతో తమకు అండగా నిలిచారంటూ నాటి వైఎస్ జగన్ పాలనను అనుక్షణం రైతులు గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుతో వ్యవసాయానికి గడ్డు కాలం దాపురిస్తోందని మండిపడుతున్నారు. 75 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు 64 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయానికి ప్రతిపాదనలు వర్షాలు కురుస్తున్నా విత్తన పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం కూటమి సర్కారు తీరుపై రైతుల మండిపాటు రైతు సంక్షేమానికి తిలోదకాలు.. ప్రత్యామ్నామయే దిక్కు.. 64వేల హెక్టార్లకు ప్రతిపాదనలు.. -
కనకాంబరం.. ధర పతనం
● రవాణా చార్జీలు రావని ఉచితంగా పంపిణీ బత్తలపల్లి: ‘‘పూలమ్మా పూలు.. కనకాంబరాలు.. ఉచితంగా తీసుకోండి’’ అంటూ మండీ నిర్వాకులు శుక్రవారం బత్తలపల్లి కూడలిలో పూలను పంపిణీ చేశారు. గతంలో బత్తలపల్లి మార్కెట్లో రూ.500పైనే పలికిన కేజీ కనకాంబరాలు... శుక్రవారం రూ.50 మాత్రమే పలికాయి. అయితే వాటిని ఎగుమతి చేసేందుకు ప్రయత్నించగా...ఇతర ప్రాంతాల్లో ఆ మాత్రం ధర కూడా లేదు. పైగా ఎగుమతి చేయాలంటే ఆర్టీసీ కొరియర్కు అదనంగా రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో రైతుల నుంచి కేజీ రూ.50 చొప్పున కొనుగోలు చేసిన మండీల నిర్వాహకులు... బత్తలపల్లి కూడలిలో ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. మరోవైపు ఆరుగాలం కష్టించి ఎంతో ఆశతో కనకాంబరాలు పండించిన రైతులు కూడా తమకు రవాణా ఖర్చు కూడా రాలేదని వాపోయారు. -
భర్త చేతిలో గాయపడి వివాహిత మృతి
పెనుకొండ: భర్త చేతిలో గాయపడి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత శుక్రవారం మృతిచెందింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పెనుకొండలోని కుమ్మరిదొడ్డిలో నివాసముంటున్న షాను కుమార్తె సుమియా బేగంకు స్థానిక విశ్రాంత ఆర్ఐ ఫజులుల్లాఖాన్ కుమారుడు అల్తాఫ్ ఖాన్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమారుడు, రెండేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం పిల్లలను పిలుచుకుని సుమియా తన పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. 20 రోజుల క్రితం అల్తాఫ్ఖాన్ స్కూల్ వద్దకెళ్లి కుమార్తె జైనాబీని పిలుచుకెళ్లాడు. విషయం తెలుసుకున్న సుమియా బేగం వెంటనే దర్గా సర్కిల్లో నివాసముంటున్న భర్త గదికి వెళ్లి కుమార్తెను తన వెంట పంపాలని వేడుకుంది. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అల్తాఫ్ఖాన్ విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న అనంతరం ఇద్దరినీ రాజీ చేసి కలపాలని ఇరువైపులా కుటుంబసభ్యులు భావించారు. అయితే బెంగళూరులో చికిత్స పొందుతున్న సుమియా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. తల్లి అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. మృతురాలి తల్లి షాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జక్కల ఆదిశేషుకు కన్నీటి వీడ్కోలు
● స్వగ్రామం బొంతలపల్లిలో ముగిసిన అంత్యక్రియలు తనకల్లు: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నల్లమాడ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జక్కల ఆదిశేషు అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం బొంతలపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. కాగా, బొంతలపల్లికి గురువారం కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహమ్మద్ చేరుకుని జక్కల ఆదిశేషు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కల ఆదిశేషు భార్య జెడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు దేశాయి తిప్పారెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు ముస్తఫా, పలువురు జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు తదితరులు జక్కల ఆదిశేషు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘అనంత’ నేతల నివాళి జక్కల ఆదిశేషు మృతదేహాన్ని గురువారం వైఎస్సార్సీపీ రాస్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు అమరనాతరెడ్డి, గౌడ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కల లక్ష్మీనరసింహగౌడ్, బీసీ సంఘం ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సంపంగి గోవర్ధన్, కదిరి సాయి, జై గౌడ రాష్ట్ర నాయకులు రాజ్కుమార్, వాల్మీకి అంజి, పవన్, బెస్త వెంకటేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
జాతీయ స్థాయి వర్సిటీ పోటీల్లో సత్తా చాటాలి
అనంతపురం: దక్షిణ భారతదేశ అంతర వర్సిటీ, జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్టీయూ(ఏ) విద్యార్థులు సత్తా చాటాలని ఆ వర్సిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. జేఎన్టీయూ (ఏ)లో గురువారం నిర్వహించిన 16వ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ క్రీడలను నిర్వహించే కాలేజీలను ,క్రీడాభివృద్ధికి సంబంధించిన అంశాలను స్పోర్ట్స్ కౌన్సిల్కు వివరించారు. జాతీయ, దక్షిణ భారత అంతర వర్సిటీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వర్సిటీ తరపున తగిన ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య, డీఏపీ ఎస్వీ సత్యనారాయణ, డీఈ వి.నాగప్రసాదనాయుడు, ఓటీపీఆర్ఐ డైరెక్టర్ సుబ్బారెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, పులివెందుల కళాశాల ప్రిన్సిపాల్ డి. విష్ణువర్ధన్, ఫిజికల్ డైరెక్టర్ బి.జోజిరెడ్డి, జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడితో మెరుగైన ఫలితాలుపుట్టపర్తి అర్బన్: పంట మార్పిడితో మెరుగైన ఫలితాలు ఉంటాయని, జిల్లాలో బోరు బావుల కింద పంటలు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలంటూ ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రామసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేరుశనగ సాగు చేసిన పొలంలో మొక్కజొన్న, మొక్కజొన్న సాగు చేసిన పొలంలో వేరుశనగ పంటలను సాగు చేయాలని సూచించారు. వరి సాగు చేసే నేలలో తరచూ అదే పంటను సాగు చేయకుండా పెసర, మినుము సాగు చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చునని పేర్కొన్నారు. సాగు ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. 14న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక కదిరి అర్బన్: ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు విజయవాడ వేదికగా జరిగే 51వ జూనియర్ బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్లను ఈ నెల 14న కదిరిలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ, సుహాసిని, హరీష్కుమార్ తెలిపారు. 20 ఏళ్ల లోపు వయసున్న బాలబాలికలు అర్హులు. బాలురు 75 కేజీలు, బాలికలు 65 కేజీలలోపు ఉండాలి. పూర్తి వివరాలకు 88862 30013లో సంప్రదించవచ్చు. -
ధరలు పతనం.. రైతుల్లో అయోమయం
దిగుబడులు బాగా ఉన్నా మార్కెట్లో సరైన ధరలు లేకపోవడంతో వేరుశనగ, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ధరలు పతనమవుతుండడంతో అయోమయంలో పడ్డారు. పుట్టపర్తి అర్బన్: ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు మిగులుతున్నాయని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి రాకముందు ఉన్న ధరలు దిగుబడి వచ్చిన తర్వాత గణణీయంగా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుల పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో దళారుల చెప్పిందే వేదంగా మారింది. జిల్లాలో వ్యవసాయ బోరు బావులు ఉన్న రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేశారు. ఖరీఫ్లో వచ్చే ఆదాయాలపైనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహ నిర్మాణాలు వంటి వాటిపైనే రైతులు ఆధారపడి ఉంటారు. ఇలాంటి తరుణంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలు చవిచూడక తప్పడం లేదు.పంట చేతికి రాగానే ధర పతనం..ఏటా పంట విక్రయాల్లో రైతులు దగా పడుతూనే ఉన్నారు. పంట చేతికి రాకముందు ఉన్న ధరలు.. పంట చేతికి వచ్చిన సమయానికి పూర్తిగా పడిపోతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 45 కిలోల వేరుశనగ బస్తా రూ.3600తో అమ్ముడు పోయింది. మొక్కజొన్న క్వింటా రూ.3,800 వరకూ వ్యాపారులు కొనుగోలు చేశారు. గత నెలలో వేరుశనగ రూ.3,200, మొక్కజొన్న రూ.2,600తో వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వేరుశనగ 45 కిలోల బస్తాను రూ.2,400 నుంచి రూ.3 వేలు, మొక్కజొన్న క్వింటా రూ.2 వేలతో కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు. కే6 కాకుండా ఇతర నూతన రకం వేరుశనగను రూ.2 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. వేరుశనగ సాగుకు ఎకరానికి రూ.40 వేలకు పైగా, మొక్కజొన్న సాగుకు రూ.25 వేలకు పైగా ఖర్చు వస్తోందని, ఈ నేపథ్యంలో వ్యాపారులు అడిగిన ధరతో పంటను విక్రయిస్తే తమకు ఎంత మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వేలాది మంది రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలను తొలగించలేదు. పంటలన్నీ పూర్తయ్యే సమయానికి ఎంత మేర ధరలు పతనమవుతాయోనని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.15 రోజుల్లోనే రూ.600 తగ్గిందిమొక్కజొన్న కోతలు మొదలు పెట్టే సమయంలో ఉన్న ధర కోత కాగానే లేకుండా పోయింది. 15 రోజుల వ్యవధిలోనే క్వింటా ధరలో రూ.600కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.2 వేలకు కూడా కొనుగోలు చేయలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రబీలో పంటలు సాగు చేయడం కష్టం. – నాగభూషణ, రైతు, పెడపల్లిగిట్టుబాటు ధర కల్పించాలిగత ఏడాది వేరుశనగ బస్తా రూ.3,800తో అమ్మాను. ప్రస్తుతం బస్తా రూ. 3 వేల లోపు అడుగుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పంటను కొనుగోలు చేస్తే వ్యాపారుల ఆటలు సాగవు. ఖరీఫ్, రబీ కాలానికి ముందే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి.– నరసింహారెడ్డి, రైతు, వెంకటగారిపల్లి -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ కార్యదర్శిగా దేవరకొండ
ధర్మవరం: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన దేవరకొండ రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు కలెక్టర్పై లోకాయుక్తకు ఫిర్యాదు ● రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలకు సహకరించారంటూ ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలకు సహకరించారంటూ కలెక్టర్తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్పై కర్నూలులోని లోకాయుక్త కార్యాలయానికి ఆర్టీఐ ప్రచార కార్యకర్త ఆంజనేయులు గురువారం ఫిర్యాదు చేశారు. బయటి ప్రాంతం నుంచి వచ్చిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి స్థానిక రైతుల నుంచి వందలాది ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో పాటు నది, నదీ పోరంబోకు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, ఏపీఐఐసీ భూములను ఆక్రమించుకుని కంచె ఏర్పాటు చేసుకున్నాడన్నారు. పాలీహౌస్లు, ఫారం పాండ్లకు రూ. కోట్ల విలువైన సబ్సిడీ పొంది ప్రభుత్వాన్ని మోసం చేశాడన్నారు. అక్రమాలపై ‘‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలపై స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆక్రమలు వాస్తవమని గుర్తించారన్నారు. ఉన్నతాధికారులు సైతం ఎవిక్షన్ నోటీసులు కూడా జారీ చేసి, చేతులు దులుపుకున్నారని, రియల్టర్కు దాసోహమంటూ ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పని సరి పెనుకొండ: బయో మెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని సచివాలయ సిబ్బందిని మున్సిపల్ ఆర్డీ నాగరాజు ఆదేశించారు. పెనుకొండలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందితో ఆయన సమావేశమై మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. యువతి బలవన్మరణం హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మంజునాథ్ కుమార్తె ఉషారాణి (19) ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటి పట్టునే ఉంటున్న ఆమె కడుపు నొప్పి తాళలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోను ఢీకొన్న లారీ ● ఎనిమిది మంది మహిళా కార్మికులకు గాయాలు హిందూపురం: స్థానిక మణేసముద్రం మార్గంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మహిళా కార్మికులు గాయపడ్డారు. కొల్లకుంట, కేతిగాని చెరువు, మణేసముద్రం గ్రామాలకు మహిళా కార్మికులు కర్ణాటకలోని గౌరిబిదనూర్ సమీపంలోని జాకీ గార్మెంట్స్ పరిశ్రమలో గురువారం రాత్రి విధులు ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మణేసముద్రం సమీపంలోకి చేరుకోగానే వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఆటో డ్రైవర్తో పాటు నాగమణి, లక్ష్మీదేవి, ఉమాదేవి, కీర్తన, అనుపమ, మరో నలుగురుర కార్మికులు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్కు దేహశుద్ధి సోమందేపల్లి: హిందూపురం రూరల్ మండలం మణేసముద్రం వద్ద ఆటోను ఢీకొన్ని 8 మంది మహిళా కార్మికులు గాయపడడానికి కారణమైన లారీ డ్రైవర్ను గురువారం రాత్రి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మణేసముద్రం వరకూ లారీ ఈడ్చుకెళ్లిందని గుర్తించారు. అదే సమయంలో గార్మెంట్స్ పరిశ్రమలో విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన మహిళా కార్మికుల ఆటోను ఢీకొన్నట్లుగా నిర్ధారణ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీని ఆపకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకెళ్లిపోయాడు. దీంతో క్షతగాత్రుల బంధువులు లారీని వెంబడిస్తూ చాలకూరు సమీపంలో అడ్డుకుని, డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. అనంతరం హిందూపురం నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించారు. -
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
అనంతపురం సిటీ: ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. జెడ్పీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సెప్టెంబర్లోనే ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్యానల్ రూపొందించిన నేపథ్యంలో గిరిజమ్మతో పాటు సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బయ్యను జెడ్పీ ఉద్యోగులు గురువారం ఘనంగా సన్మానించారు. ఏఓలు విజయభాస్కర్రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, షబ్బీర్ నియాజ్, మహబూబ్ వలి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజమ్మను కలిసిన పీఆర్ ఎస్ఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను పంచాయతీరాజ్ రాయలసీమ సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్(ఎస్ఈ) వై.చిన్నసుబ్బరాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడులో పని చేస్తూ పదోన్నతిపై అనంతపురం ఎస్ఈగా వచ్చిన ఆయన.. జిల్లా పరిషత్ కార్యాలయంలోని చాంబర్లో చైర్పర్సన్ కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయనకు గిరిజమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సబ్ డివిజన్–1, 2 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ -
పట్టు ‘ప్రోత్సాహకం’ ఇవ్వండి
మడకశిర: బైవోల్టిన్ పట్టు సాగు చేసిన రైతులకు ప్రోత్సాహక ధనాన్ని వెంటనే మంజూరు చేయాలని సెంట్రల్ సిల్క్ బోర్డు జాయింట్ సెక్రటరీ నరేష్బాబును పలువురు రైతులు డిమాండ్ చేశారు. సెరికల్చర్ టెక్నాలజీ బదిలీ ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన గురువారం మడకశిరలోని యాదవ కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన ‘మేరా రేషం–మేరా అభిమాన్’ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమంలో నరేష్బాబు మాట్లాడుతూ... పట్టు పరిశ్రమలో ఆధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పత్తులను పెంచే అంశంపై పట్టు రైతులకు అవగాహన కల్పించారు. దేశ వ్యాప్తంగా కేంద్ర పట్టు మండలికి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.4వేల కోట్లు కేటాయిస్తోందని, ఈ కేటాయింపును రూ.7,500 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టు రైతు సంఘం జిల్లా నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, రామకృష్ణారెడ్డి, సోమ్కుమార్, శంకర్రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. బైవోల్టిన్ రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహక ధనం ఇంత వరకూ అందించ లేదని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించాల్సిన ప్రోత్సాహక ధనం బకాయిలు రూ.70 కోట్ల వరకు ఉన్నాయన్నారు. తక్షణమే ప్రోత్సాహక ధనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. రేషం షెడ్లపై సబ్సిడీని రూ.10లక్షల వరకు పెంచాలని కోరారు. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన 30 మంది ఆదర్శ పట్టు రైతులు, రీలర్లను సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ డైరెక్టర్ అరుణకుమారి, జిల్లా అధికారి శోభారాణి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, స్థానిక ఏడీఏ హనుమంతనాయక్, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లాలోని పట్టు రైతులు పాల్గొన్నారు. సెంట్రల్ సిల్క్ బోర్డు జాయింట్ సెక్రటరీ నరేష్బాబును డిమాండ్ చేసిన పట్టు రైతులు -
ఉపాధ్యాయుల ‘పోరుబాట’
కదిరి: ‘అధికారం ఇచ్చి చూడండి. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం. పెండింగ్ బకాయిలన్నింటినీ ఒకేసారి ఇచ్చేస్తాం. సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగులకు పని భారం తగ్గిస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయులపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూటమి సర్కారుపై గుర్రుగా ఉన్నాయి. ఓపిక నశించడంతో ఉద్యమాలకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) రణభేరి ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 19 వరకూ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బృందాలుగా పర్యటించనున్నారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోతే ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీచర్లకే పరీక్ష.. కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరిట విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. విద్యాశాఖామంత్రి లోకేష్కు విద్యారంగంపై ఏమాత్రం అవగాహన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల అభ్యసన మదింపు కోసం పెట్టే పరీక్షల మూల్యాంకణం ఇప్పుడు టీచర్లకే పరీక్షగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యోగాంధ్ర, మెగా పేరెంట్ .. టీచర్స్ మీటింగ్లతో పాటు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయమని టీచర్లపై ప్రభుత్వం పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. ప్రధానంగా పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ బడుల వైపు మళ్లించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడోవంతు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. ఉన్నత పాఠశాలల్లో పని చేయాల్సిన టీచర్లను క్లస్టర్ టీచర్లుగా, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా మార్చేసింది. ట్రైనింగ్ల పేరుతో టీచర్లను బడికి దూరం చేయడమే కాకుండా బోధనేతర పనులతో టీచర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బదిలీలు. ప్రదోన్నతులు ముగిసి మూడు నెలలు పూర్తయినా ఇంకా కొందరు టీచర్లు పాత స్థానాల్లోనే పని చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకు కూటమి ప్రభుత్వం నేటికీ పరిష్కారం చూపలేదు. డీఏలన్నీ పెండింగ్లోనే.. టీచర్లకు న్యాయబద్ధంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన వాటిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నోరు మెదపడంలేదు. ప్రతి సంవత్సరం జనవరి, జూలై మాసాల్లో అంటే ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరవు భత్యం ప్రకటిస్తోంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీఏ ఇవ్వాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. 12వ పీఆర్సీని కూడా ప్రభుత్వం ఇంతవరకూ వేయలేదు. మధ్యంతర భృతి (ఐఆర్) ఊసే లేదు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)తీసుకొస్తామని హామీపై కూడా కూటమి సర్కారు నుంచి స్పందన లేదు. కూటమి ప్రభుత్వం సమస్యలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం 15 నుంచి 19 వరకూ యూటీఎఫ్ నిరసనలు ఈ నెల 25న విజయవాడలో ప్రభుత్వంపై రణభేరి ఈ నెల 17 వరకూ ఏపీటీఎఫ్ నిరసన వారం ఉపాధ్యాయ సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యాం. 12న మండల కేంద్రాల్లో నిరసనలు, 13, 14 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతులు ఇవ్వడం, 15న డివిజన్ కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 17న ముఖ్యమంత్రితో పాటు సీఎస్లకు వాట్సాప్, ఈ–మెయిల్ల ద్వారా వినతులు ఇవ్వాలని నిర్ణయించాము. – ఆది బయన్న, జిల్లా కార్యదర్శి, ఏపీటీఎఫ్ -
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని గృహనిర్మాణశాఖ అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 72,338 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు 28,240 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన 40,009 ఇళ్లలో 36,200 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అక్టోబర్ 15 నాటికి జిల్లాలో 9,984 ఇళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని ఆ దిశగా ఇళ్లు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పారదర్శకంగా యూరియా పంపిణీ.. జిల్లాలో పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యానికి తావులేకుండా యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. చెరువులన్నీ నీటితో నింపాలి.. జిల్లాలో ఉన్న చెరువులను నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని చెరువుల స్థితిగతులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 15 చెరువులు పూర్తి నీటి సామర్థ్యంతో ఉన్నాయని, 75 శాతం సామర్థ్యంతో 17 చెరువులు ఉన్నాయని, 50 శాతం సామర్థ్యంతో 55 చెరువులు ఉన్నాయన్నారు. జిల్లాలో 284 చెరువుల్లో మోస్తరుగా నీరు ఉందన్నారు. మొత్తంగా 371 చెరువుల్లో నీరు ఉందన్నారు. జిల్లాలో 1186 చెరువుల్లోని 815 చెరువుల్లో నీరు లేదని, హంద్రీ–నీవా ద్వారా కృష్ణానీటితో మరిన్ని చెరువులను నింపడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
జర్నలిస్టులపై అక్రమ కేసులు దుర్మార్గం
ఒక నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్ను పత్రికల్లో ప్రచురిస్తే చేస్తే కేసులు పెట్టడం దుర్మార్గం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైపోయింది. నిజాయతీగా పనిచేసే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాత్రంత్య్రంతో పాటు పత్రికా స్వేచ్ఛ కూడా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం మరో బిహార్లా మారిపోయింది. ఏపీలో సామాన్యులకు కూడా భద్రత కరువైంది. – ఉషశ్రీచరణ్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు తెలియజేసిన విషయాలను కూడా పేపర్లలో రాయడం నేరమనడం హాస్యాస్పదం. అలాగే పోలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి వాస్తవాలు రాస్తే పత్రిక యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణకు పిలిపించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సాక్షిపై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. – మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ మంత్రి -
సమాచారశాఖ ఏడీగా సీహెచ్ పురుషోత్తం
పుట్టపర్తి టౌన్: జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ సహాయ సంచాలకులుగా సీహెచ్ పురుషోత్తం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నంద్యాల జిల్లా డీఐపీఆర్ఓగా పనిచేస్తూ సహాయ సంచాలకులుగా జిల్లాకు వచ్చారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న వేణుగోపాల్రెడ్డి డీడీగా పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన పురషోత్తంకు సమాచార శాఖ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. బదిలీపై వెళ్లిన వేణుగోపాల్రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఏడీ మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయుల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర కీలకంపుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు సీసీ కెమెరాలు, బోర్డు రూమ్, వీడియో కాన్ఫెరెన్స్ హాల్ విభాగాన్ని ఎస్పీ రత్న సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ, డీఐజీ సహకారంతో పాటు ప్రభుత్వ అనుమతితో ట్రంప్ షూలే పరిశ్రమ భాగస్వామ్యంతో పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కదిరి, హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో సబ్కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో 345 మ్యాట్రిక్స్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పెనుకొండ దర్మవరం, పుట్టపర్తిలో కూడా సబ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఆర్ఐలు వలి, మహేష్, సీఐలు శ్రీనివాసులు, సోషియల్ మీడియా మోహన్, సీసీ చిరంజీవి, సోషియల్ మీడియా ఎస్ఐ మునిప్రతాప్, ఐటీ కో ఇన్చార్జ్ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మద్యం మత్తులో యువకుడి హల్చల్మడకశిర: పట్టణంలో మద్యం మత్తులో ఓ యువకుడు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. మద్యం సేవించి బీరు బాటిల్ పగులగొట్టి గాజు ముక్కలను చేతిలో పట్టుకుని వీధుల్లో వీరంగం సృష్టించాడు. పగులగొట్టిన బీరు బాటిల్తో ఊరు మారెమ్మ ఆలయ సమీపంలో రెచ్చిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అలాగే ఎస్బీఐ ప్రధాన రహదారిలో కూడా యువకుడు అర్థనగ్నంగా తిరగడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కోటవీధి, అమరాపురం రోడ్లలో యువకుడు హల్చల్ చేశాడు. అమరాపురం బస్టాండ్ సమీపంలోనే మద్యం షాపు ఉంది. ఈ మద్యం షాపులో మందు కొనుగోలు చేసి కొందరు యువకులు ఫూటుగా మద్యం తాగుతుండడంతో ఈపరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.పాముకాటుతో మహిళా రైతు మృతిధర్మవరం రూరల్: మండల పరిధిలోని ఓబుళనాయనపల్లికి చెందిన మహిళా రైతు సరస్వతి (55) గురువారం పాముకాటుతో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సరస్వతి తన పొలంలో కలుపు తీస్తుండగా కాలికి ఏదో కాటు వేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. సరస్వతికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
సర్కారుపై సమరమే
ఉపాధ్యాయ సమస్యలపై కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. అందుకే సమరమే సిద్ధమవుతున్నాం. ఈ నెల 15 నుంచి యూటీఎఫ్ తలపెట్టిన రణభేరి బైక్ జాతా 17న జిల్లాలో పర్యటిస్తుంది. టీచర్లను బోధనేతర పనులకు దూరం చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా పదోన్నతులు కల్పించాలి. పెండింగ్ డీఏలు తక్షణం ఇవ్వాలి. 12వ పీఆర్సీ ఏర్పాటుతో పాటు అంతవరకూ 29 శాతం ఐఆర్ ఇవ్వాలనేవి ప్రధాన డిమాండ్లు. – శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
దిక్కు తోచడం లేదు
నాకున్న ఆరు ఎకరాల్లో పంటల సాగుకు బోరు బావి వేశాను. అరకొరగా నీరు లభ్యం కావడంతో మూడు ఎకరాల్లో టమాట సాగు చేపట్టాను. ఇప్పుడేమో చెరువుల్లో నీరు లేక బోరుబావి ఎండిపోయింది. టమాట సాగుకు చాలా పెట్టుబడి పెట్టాను. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. – బయపరెడ్డి, రైతు, మామిళ్లకుంట్లపల్లి అప్పు ఎలా తీర్చాలి నాకున్న నాలుగు ఎకరాల్లో పంటల సాగుకని వరుసగా నాలుగు బోర్లు వేశాను. ఒక్క బోరులో కూడా చుక్కనీరు పడలేదు. అన్ని బోర్లు 700 నుంచి 900 అడుగుల వరకూ వేశాను. దాదాపు రూ. 7 లక్షలకు పైగా ఖర్చయింది. గతంలో బెంగళూరుకు వలసవెళ్లి కూడబెట్టిన డబ్బు పోను రూ.4 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఈ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – చింతా కృష్ణారెడ్డి, రైతు, మారెవాండ్లపల్లి -
సచివాలయాలకు మూత
అనంతపురం కార్పొరేషన్: కూటమి పార్టీల కార్యక్రమం నేపథ్యంలో సచివాలయాలు మూతపడ్డాయి. పైగా ఈ కార్యక్రమానికి తరలించేందుకు సచివాలయ సిబ్బందితోనే జన సమీకరణ చేయించడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. మహిళా సంఘాల సభ్యులు వచ్చారో లేదో నమోదు చేసుకున్నారు. సమావేశానికి రాని వారికి ఫోన్లు చేసి పిలిపించారు. అనంతరం తమ పరిధిలో ఎంత మందిని బస్సుల్లో ఎక్కించారో ఆ వివరాలను ఆయా గ్రూపుల్లో నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో అయితే ఎంత మంది బస్సుల్లో ఉన్నారు.. పూర్తి స్థాయిలో వచ్చారా.. తదితర వివరాలు ఆరా తీసేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఉద్యోగులను పార్టీల కార్యక్రమాలకు వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
వద్దు బాబోయ్!
అనంతపురం: ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ పేరుతో బుధవారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం ఇళ్ల బాట పట్టారు. ముఖ్యమంత్రి ప్రసంగం సగం కూడా పూర్తి కాకనే గ్యాలరీలన్నీ ఖాళీ అయ్యాయి. జనాన్ని ఆపేందుకు టీడీపీ కేడర్, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.అడిగి మరీ చప్పట్లు !సీఎం చంద్రబాబు ప్రసంగం కూడా ఆద్యంతం ‘ఆత్మస్తుతి–పరనింద’ చందాన సాగింది. తాము చేసిన కార్యక్రమాల గురించి గొప్పలు చెబుతూనే చప్పట్లు కొట్టాలని సీఎం పదేపదే జనాన్ని కోరడంతో వచ్చిన వారు విసుగెత్తిపోయారు. సీఎం కోరినా చప్పట్లు కొట్టడానికి ఆసక్తి చూపించకపోవడంతో ‘ఏమయ్యా నేను ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. అది వినియోగిస్తున్నారు కదా కనీసం చప్పట్లు అయినా కొట్టండి’ అంటూ బతిమాలుకోవడం గమనార్హం. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జనసేన నాయకులు జెండాలను ఎగురవేయడంతో వాటిని కిందికి దించాలని సీఎం పదేపదే కోరారు. అయినా జనసేన కార్యకర్తలు పోటాపోటీగా జెండాలను ప్రదర్శించడం కనిపించింది. దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తన ప్రసంగాన్ని ఐదు నిమిషాల్లోపే ముగించడంపై పలువురు చలోక్తులు విసిరారు. ‘సూపర్ సిక్స్’ పూర్తి స్థాయిలో అమలు చేయకనే సూపర్ హిట్ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఆయనకు ఇష్టం లేదేమో! అంటూ పలువురు చర్చించుకున్నారు.నానా అవస్థలు..సభా ప్రాంగణం వద్ద జనం నానా అవస్థలు పడ్డారు. మండుటెండలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. పలువురు వేడి తట్టుకోలేక వాంతులు చేసుకున్నారు. కేవలం కొన్ని గ్యాలరీల్లోనే కుర్చీలు వేసి, చాలా చోట్ల వేయకపోవడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిల్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎందుకు ఇక్కడికి వచ్చాం దేవుడా అంటూ నిట్టూర్చారు.పోలీసు ఆంక్షలతో కష్టాలు ..సూపర్ సిక్స్ సభ సందర్భంగా జిల్లాలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఏకంగా అనంతపురం నగరానికి 5 కిలోమీటర్ల దూరం నుంచే బస్సులను, వాహనాలను దారి మళ్లించడంతో ప్రయాణికులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. హైదరాబాద్–బెంగళూరు మార్గంలో వాహనాలను వడియంపేట– బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్– నార్పల– ధర్మవరం–ఎన్ఎస్ గేట్ మీదుగా మళ్లించడంతో తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చింది. మధ్యలో నార్పల–బత్తలపల్లి మార్గం సరిగా లేకపోవడంతో ప్రయాణంలో నరకం కనిపించింది. సాధారణంగా అనంతపురం నుంచి పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీకి ఉద్యోగులు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోయేది. కానీ బుధవారం అదనంగా మరో 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.యంత్రాంగానికీ ఇక్కట్లు..సభ పూర్తిగా పార్టీ కార్యక్రమమే అయినా అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేశారు. దాదాపు 10 జిల్లాల నుంచి పోలీసులను కేటాయించారు. ఈ క్రమంలో ఖాకీలు కూడా ఇబ్బందులు పడ్డారు. బందోబస్తు చర్యలను పర్యవేక్షించాల్సింది పోయి జనం సభ నుంచి వెళ్లిపోకుండా కాపలా కాయాల్సి వచ్చింది. -
ఎండుతున్న చెరువులు
ఏక కాలంలో ఇద్దరు రైతులు పక్కపక్కనే బోర్లు వేయిస్తున్న దృశ్యం కనుచూపు మేర వందల ఎకరాల్లో కనిపించని పంటల సాగుఓడీచెరువు: వర్షాభావం ఓడీచెరువు మండలాన్ని అతలాకుతలం చేస్తోంది. మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు నీరు లేక వట్టిపోయాయి. ఫలితంగా భూగర్బ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయాయి. మండల వ్యాప్తంగా ఉన్న 24 చెరువులు, మరో 24 కుంటల పరిధిలో 1,300 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతుల పరిస్థితి దయనీయం మండల వ్యాప్తంగా 4,200 వ్యవసాయ విద్యుత్ కనెక్షనుల ఉండగా దాదాపు 9వేల ఎకరాలు బోరుబావుల కింద సాగవుతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండిపోయాయి. నీరు అందక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు కొత్తగా బోరుబావులు తవ్వించడం మొదలు పెట్టారు. అదృష్టవశాత్తు నీళ్లు పడితే సరి... లేదంటే మరొకటి, అదీ పడకపోతే మరొకటి ఇలా ఒక్కో రైతు ఏడేనిమిది బోర్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. గతంలో 400 నుంచి 500 అడుగుల లోతు వరకూ బోరు వేస్తే నీరు సమృద్ధిగా లభ్యమయ్యేది. ప్రస్తుతం 800 అడుగుల నుంచి వెయ్యి అడుగులు వరకూ లోతుకు బోరు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో.. ఈ ప్రాంత రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకునిసీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 193 చెరువులను హంద్రీ–నీవా జలాలతో నింపే పనులకు ఆమోదం తెలుపుతూ రూ.864 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ పనులను పూర్తి చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అడుగంటిన భూగర్భజలాలు నిట్టనిలువునా వాడిపోతున్న పంటలు -
రోజంతా క్యూలో ఉన్నా ఒక్క బస్తానే!
పుట్టపర్తి అర్బన్: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. అరకొర సరఫరా చేసి కావాల్సినంత నిల్వ ఉందంటూ అధికారులు, కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా.. ఈ విషయం తెలియని రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. బుధవారం పుట్టపర్తి మండలం పెడపల్లి రైతు సేవ కేంద్రానికి 260 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే ఆర్ఎస్కే ఎదుట బారులు తీరారు. రోజంతా నిలబడినా ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇచ్చారు. పైగా ఆధార్, పట్టాదార్ పాసుబుక్, వేలిముద్ర అంటూ హడావుడి చేశారు. దీంతో ఈ మాత్రం దానికి ఇంత కష్టపెట్టాలా అంటూ రైతులు పెదవి విరిచారు. యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు -
గుడిసె దగ్ధం
ముదిగుబ్బ: మండలంలోని దొరిగిల్లులో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో లక్ష్మమ్మ గుడిసె దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేలోపు వంట సరుకులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు కన్నీటి పర్యతమైంది. నాయకుల ముందస్తు అరెస్ట్ ● మడకశిర పోలీసుస్టేషన్లో ఆనందరంగారెడ్డి, దళిత నేత హనుమంతు అక్రమ నిర్బంధం మడకశిర: కూటమి సర్కార్ అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ సభ నేపథ్యంలో బుధవారం మడకశిర పోలీసులు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా ఆనందరంగారెడ్డి మాట్లాడుతూ...ముందస్తు అరెస్టులతో ప్రజల తరఫున వినిపించే తమ గొంతను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్’ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే ‘సూపర్ హిట్’ పేరుతో కూటమి ప్రభుత్వం సభను నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ, ముందస్తు అరెస్ట్లతో దళిత ఉద్యమాలను ఆపలేరన్నారు. ‘మలుపు’ పథకంతో పాటు లెదర్ పార్కులను ప్రారంభించి చర్మ కారులు, దళిత నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న తనను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లో ఉంచడం అన్యాయమన్నారు. ఇది దళితులపై కూటమి ప్రభుత్వం సాధిస్తున్న కక్షగా భావిస్తున్నామన్నారు. -
విషజ్వరాలు విజృంభణ
పెనుకొండ రూరల్/హిందూపురం టౌన్: విష జ్వరాలు వ్యాప్తి చెందడంతో హిందూపురంలోని జిల్లాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జిల్లాస్పత్రిలో సాధారణ సమయాల్లో 800 నుంచి వెయ్యి వరకు ఓపీ నమోదు అవుతుండగా గత వారం రోజులుగా వెయ్యి నుంచి 1,200కు దాటింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగుల రద్దీతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఓపీ ముగిసిన తర్వాత ఎమర్జెన్సీ విభాగానికి రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆస్పత్రిలో సాధారణ రోజుటోల 60 నుంచి 80 మంది ఐపీలో ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 120కు పైగా చేరుకుంది.పేరుకుపోతున్న మురుగుఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాల్లో మురుగు పేరుకు పోయి దోమలు వృద్ధి చెందాయి. దోమకాటుతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేట్ క్లినిక్ల నిర్వాహకులు అక్రమార్జనకు తెరలేపారు. రెఫరల్ వైద్యంతో ఆర్ఎంపీలు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు సకాలంలో విధులుకు హాజరు కాకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్లను ఆశ్రయించాల్సి వస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 13 డెంగీ కేసులు నమోదు కావడం కలవరం రేపుతోంది.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన ఓపీ వివరాలుమే : 3,76,934 జూన్ : 4,16,619జూలై : 4,59,666 ఆగస్టు : 2,15,200(ఇప్పటి వరకు) -
ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ ..
పుట్టపర్తి టౌన్: అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ హిట్’ సభలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జే రత్నాకర్, ఆర్డీఓ సువర్ణ, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయంనుంచి 1.42 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. సభ ముగిసిన తర్వాత అనంతపురం నుంచి హెలీకాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో 5.30 గంటలకు తిరిగి హైదరాబాదుకు వెళ్లారు. -
పేదల వైద్యం.. ప్రైవేటు పరం
పెనుకొండ మెడికల్ కళాశాలపై కూటమి సర్కార్ విషం చిమ్మింది. కళాశాల అందుబాటులోకి వస్తే కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందనుకున్న నిరుపేదల ఆశలపై నీళ్లు పోసింది. నిర్వహణ భారమంటూ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించింది. కూటమి ‘కుట్ర’పై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పెనుకొండ: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడం..వైద్య విద్యనభ్యసించే విద్యార్థులకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి తెచ్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే 2021 అక్టోబర్ 31న అప్పటి సీఎం వైఎస్ జగన్ వర్చువల్ పద్ధతిలో పెనుకొండ మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు. దీంతో ఈ ప్రాంత వాసులంతా ఎంతో సంతోషించారు. మెడికల్ కళాశాల, సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కావడంపై హర్షించారు. పెనుకొండకు ప్రత్యేక గుర్తింపుతో పాటు పేదలకు మేలు జరుగుతుందని సంబరపడ్డారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తుండడంపై ఆవేదనకు గురవుతున్నారు. వడివడిగా పనులు.. పెనుకొండ మెడికల్ కళాశాలకు వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 475 కోట్లు మంజూరయ్యాయి. మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్ ఆస్పత్రి నిర్మాణానికి గత ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఎమ్మెల్యే శంకరనారాయణ అధికారులను పరుగులు పెట్టించి పనులు వేగవంతం చేశారు. కానీ కళాశాల ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో బండరాళ్లు ఉండటంతో వాటిని బ్లాస్టింగ్ చేస్తూ పనులు చేపట్టారు. ఈ క్రమంలో పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భవనాలకు పిల్లర్లను నిర్మించడమే కాక కొన్ని భవనాలకు పైకప్పు పనులు సైతం పూర్తి చేశారు. అప్పటి ఎమ్మెల్యే శంకరనారాయణ, ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్, కలెక్టర్, ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి పనులు ముందుకు సాగేలా చూశారు. కూటమి రాకతో ఆశలు ఆవిరి.. కూటమి ప్రభుత్వం వచ్చాక పెనుకొండ మెడికల్ కళాశాల పనులు నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థను ఇక్కడి నుంచి పాలకులు సాగనంపారు. ఇక కొత్త కాంట్రాక్ట్ సంస్థకు ఇస్తారని ప్రజలు భావించినా... అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు అప్పగిస్తూ కేబినెట్లో తీర్మానించడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉచిత వైద్యం అందుతుందనుకుంటే ముక్కు పిండి వసూలు చేసే ప్రైవేటు విధానం అమల్లోకి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా రూ.వందల కోట్ల విలువైన వైద్య కళాశాల భూమిని ఎకరా ఏడాదికి కేవలం రూ.100తో లీజుకు ఇవ్వడంపై మండిపడుతున్నారు. కూటమి సర్కార్ చర్యల వల్ల ఈప్రాంత ప్రజలకు ఉచిత వైద్యం అందకపోగా, ఈ ప్రాంత యువత వైద్యవిద్యకూ అడ్డంకులు ఎదురవుతాయంటున్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ తన నిర్ణయాన్ని విరమించుకుని పెనుకొండ కళాశాలను పూర్తి చేసి ఈప్రాంత పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా చూడాలని కోరుతున్నారు. పెనుకొండ మెడికల్ కళాశాలపై కాల ‘కూటమి’ విషం పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం కరువు ప్రజలకు కార్పొరేట్ ఉచిత వైద్యం ఇక కలే ఎకరా రూ.2 కోట్ల విలువైన భూమిని ఏడాదికి రూ.100తో లీజు ప్రైవేటుకు ధారాదత్తంతో ప్రజల అయోమయం -
జలుబు.. దగ్గు.. జ్వరం...
ధర్మవరం అర్బన్: నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణం, రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభించాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికారికంగా 2,596 కేసులు రికార్డయ్యాయి. ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో విషజ్వరాలు, దగ్గు, జలుబు, న్యుమోనియా కేసులు ఉన్నట్లు సమాచారం. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజూ వందల సంఖ్యలో విషజ్వరాల బాధితులు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఎక్కడ చూసినా చెత్తాచెదారమే... ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పారిశుధ్య చర్యలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాల్సిన మున్సిపల్, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ముఖ్యంగా ధర్మవరం పట్టణంలోని ప్రధాన రహదారులపై చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యం పడకేయడంతో వైరల్ జ్వరాలు పెరిగిపోతున్నాయి. పట్టించుకునేవారు లేరు కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఏ వార్డులో చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తోంది. వార్డుల్లో పదిరోజులైనా చెత్తాచెదారం తొలగించడం లేదు. దోమలు విపరీతంగా పెరిగి విషజ్వరాలు వ్యాపింపజేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక చొరవ చూపి పారిశుధ్య చర్యలు చేప.. వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలి. – మాసపల్లి సాయికుమార్, కౌన్సిలర్, ధర్మవరం -
చేతగాకపోతే దిగిపోండి
కూటమి సర్కారు ఏడాదిన్నర పాలనలో ఏ వర్గానికీ న్యాయం చేయలేకపోయింది. కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేక పోవడం దుర్మార్గం. ఉచిత విద్యుత్ కోసం ధర్నా చేసిన రైతులపై గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాలో పాలన సాగిస్తున్నారు. ఏసీ రూముల్లో సమీక్షలు చేస్తూ తాను అనుభవజ్ఞుడినని గొప్పలు చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారు. ఎంత మేర ఎరువులు కావాలో కూడా తెలియకుండా పాలన సాగిస్తున్నారా...? మీకు ఓటు వేసిన పాపానికి రైతులు రోడ్లెక్కాలా...? పాలన చేతగాకపోతే దిగిపోండి. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వైఎస్సార్ సీపీ పుట్టపర్తి సమన్వయకర్త -
సంక్షోభంలో వ్యవసాయం
కూటమి పాలనలో వ్యవసాయం సంక్షోభంలోకి పడింది. ప్రభుత్వ సాయం కరువై రైతన్నలు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. చివరకు యూరియా కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు బారులు తీరిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. దీనికి సిగ్గుపడాల్సిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు బఫేల వద్ద భోజనాల కోసం నిలబడ్డారంటూ రైతులను అవమానించారు. నిజంగా ఇది సిగ్గుచేటు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా ఎప్పటికప్పుడు యూరియా, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచిన జగనన్న.. రైతాంగానికి దన్నుగా నిలిచారు. ఇప్పటికై నా ఈ పాలకులు రైతుకు అండగా నిలబడాలి. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ ధర్మవరం సమన్వయకర్త -
రైతులంటే అంత అలుసా?
పంట వేద్దామంటే విత్తనాలు, ఎరువులు ఇవ్వరు. ఎలాగోలా కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించరు. కూటమి సర్కారుకు రైతు సంక్షేమం పట్టడం లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమే. రైతులు యూరియా కోసం బారులు తీరితే భోజనం కోసం నిలబడ్డారంటూ మంత్రి అచ్చెన్నాయుడు హేళనగా మాట్లాడారు. రైతు కష్టం తెలియని ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా పనికి రారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలి. రైతుల సమస్యను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకే వైఎస్సార్ సీపీ ‘అన్నదాత పోరు’ నిర్వహించింది. విజయవంతం చేసిన కార్యకర్తలకు, రైతులకు ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు -
పట్టు చీరలో ప్రతిబింబించిన క్రీడాభిమానం
పావగడ: ఇటీవల టీ 20 క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన ఆర్సీబీ జట్టుపై తనకున్న అభిమాన్ని ఓ చేనేత కార్మికుడు పురుషోత్తం ప్రత్యేకంగా చాటుకున్నారు. పావగడ తాలూకా వైఎన్ హొసకోట గ్రామానికి చెందిన పురుషోత్తం.. ఆర్సీబీ జట్టు లెజెండ్ విరాట్ కోహ్లితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలను పట్టుచీరలో పొందుపరిచి క్రికెట్ అభిమానులకు కానుకగా అందించారు. ఈ చీరను మంగళవారం ఆయన ప్రదర్శించి, పలువురిని ఆకట్టుకున్నారు. జిల్లాకు 800 మెట్రిక్ టన్నుల యూరియాఅనంతపురం అగ్రికల్చర్: ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. మంగళవారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. ఇండెంట్ల మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మార్క్ఫెడ్కు 560 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 240 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవించాలి ● ఎయిడ్స్ నియంత్రణ అధికారి సునీల్ హిందూపురం టౌన్: ఆరోగ్యకమైన అలవాట్లతో జీవనం సాగించాలని, ముఖ్యంగా యువత హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహనతో మెలగాలని జిల్లా లెప్రసి, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సునీల్ అన్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు హిందూపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన 5 కిలోమీటర్ల మారథాన్ రెడ్ రన్ను మున్సిపల్ చైర్మన్ రమేష్ జెండా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. యువత క్రమశిక్షణ కలిగి ఉండి, సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. అనంతరం మారథాన్లో మొదటి స్థానం సాధించిన ఎస్డీజీఎస్ డిగ్రీ కళాశాలలో బీకాం విద్యార్థి జి. శ్రీనివాసబాబు, ఎన్ఎస్పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల బీకాం కంప్యూటర్స్ విద్యార్థిని బి.రాధిక, రెండో స్థానం సాధించిన పుట్టపర్తిలోని మంగళకర డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థి కె.జయచంద్ర, ఎన్ఎస్పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల బీకాం కంప్యూటర్స్ విద్యార్థిని యు.పల్లవికి నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్డీఓ ఉదయ భాస్కర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా సెక్రటరీ రామకృష్ణ, పీడీ లోక్నాథ్, ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రగతి, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
అనంతపురం సిటీ: మెరుగైన సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా ఉంటోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహిళ స్నేహపూర్వక గ్రామం–పంచాయతీ థీమ్–9’ అంశంపై రెండు రోజుల శిక్షణ తరగతులు అనంతపురంలోని జెడ్పీ క్యాంపస్లో ఉన్న డీపీఆర్సీ భవన్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళల భద్రత, సమానత్వం, సమగ్రాభివృద్ధి వైపు ప్రోత్సహించే దిశగా కార్యక్రమాన్ని రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో సానుకూల మార్పుల కోసం పని చేసే దిశగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే శిక్షణ ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ కింద జిల్లాలోని ఆరు మండలాల్లో ఒక్క పంచాయతీ చొప్పున మొత్తం ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామని సీఈఓ శివశంకర్ తెలిపారు. ఇందులో ఆత్మకూరు మండలంలో తోపుదుర్తి, బత్తలపల్లి మండలంలో బత్తలపల్లి, కంబదూరు మండలంలో చెన్నంపల్లి, కనగానపల్లి మండలంలో తగరకుంట, తాడిపత్రి మండలంలో ఊరచింతల, వజ్రకరూరు మండలంలో పాత కడమలకుంట గ్రామాలు ఉన్నాయన్నారు. ఒక్కో పంచాయతీ నుంచి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, వెల్ఫెర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎం, వీఓ లీటర్లు ముగ్గురు చొప్పున ఒక్కో పంచాయతీ నుంచి మొత్తం తొమ్మిది మందిని ఎంపిక చేసి, వారికి రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తమ పంచాయతీల్లో అమలయ్యేలా చూడాలని కోరారు.డీడీఓ నాగశివలీల, డీపీఆర్సీ శిక్షణ కేంద్రం జిల్లా మేనేజర్ నిర్మల్దాస్ పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ -
జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం బులెటిన్ విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మోస్తరు వర్షం కురిసే సూచన ఉందన్నారు. 10న ఒక మి.మీ, 11న 15 మి.మీ, 12న 8 మి.మీ, 13న 15 మి.మీ, 14న 13 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.7 డిగ్రీల నుంచి 34.1 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్నారు. పశ్చిమ దిశగా గంటకు 13 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు పాఠశాలలకు సెలవు ● రెండో శనివారం 13న పాఠశాలలు పనిచేయాలంటూ ఆదేశం ● ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం పుట్టపర్తి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పాల్గొనే ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ కార్యక్రమానికి పాఠశాలల బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. నేటి సెలవుకు బదులుగా రెండో శనివారం (ఈనెల 13న) అన్ని యాజమన్యాల పాఠశాలలు పని చేయాల్సి ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన సెలవుకు రెండో శనివారం పని చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవలు వస్తాయని ముందుగానే వారి ప్రోగ్రాంలు నిర్ణయించుకుని, ప్రయాణాలకు టికెట్లు రిజర్వేషన్లు చేయించుకొని సిద్ధంగా ఉంటారన్నారు. అలాంటి ఉన్నట్టుండి శనివారం పనిదినంగా ప్రకటించడంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం సభ ఏర్పాటు చేస్తే ప్రయాణ భద్రత రీత్యా పాఠశాలలకు సెలవు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సెలవుకు పరిహారంగా మరో రోజును ప్రకటించాలని, రెండో శనివారం కచ్చితంగా సెలవు మంజూరు చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. మాతాశిశు మరణాలను తగ్గించాలి : డీఎంహెచ్ఓహిందూపురం టౌన్: మాతాశిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని వైద్యాధికారులకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం సూచించారు. మంగళవారం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో హిందూపురం ప్రాంత వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఓపీ, ఐపీలను పెంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. హెల్త్ సెంటర్లలో కుక్క కాటుకు, పాము కాటుకు టీకాలను అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులు, బాలింతలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆమె ఆదేశించారు. -
కావాల్సింది కొండంత.. సరఫరా గోరంత
మడకశిర: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. అదనులో ఎరువు వేయకపోతే పంట దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతులు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. మంగళవారం మడకశిర పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ) 150 బస్తాల యూరియా సరఫరా కాగా, వందలాది మంది రైతులు తరలి వచ్చారు. క్యూలో నిలబడి గంటల తరబడి బారులు తీరగా.. అధికారులు తొలుత రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఆ తర్వాత స్టాకు తక్కువగా ఉండటంతో రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేయాల్సి వచ్చింది. అయినా కూడా చాలా మంది రైతులకు యూరియా అందకపోవడంతో వారంతా సర్కారు తీరుపై మండిపడ్డారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డిమాండ్ మేరకు యూరియాను కూడా అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కర్ణాటకలో కొనుగోలు డిమాండ్ మేరకు సర్కారు యూరియాను అందించకపోవడంతో నియోజకవర్గంలోని పలువురు రైతులు కర్ణాటకలోని ధర్మపురం, మంగళవాడ, బరగూరు, శిర, మదలూరు, మిడిగేశి, పావగడ తదితర ప్రాంతాలకు వెళ్లి యూరియాను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లోనే యూరియా, కాంప్లెక్స్, డీఏపీ తదితర ఎరువులు, విత్తనాలు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం రైతులకు తప్పని అగచాట్లు పీఏసీఎస్ ఎదుట బారులు తీరిన వైనం కూటమి సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి -
కూలిన బతుకులు
తనకల్లు: వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. కూలి కాస్త ఎక్కువగా వస్తుందన్న ఆశతో జిల్లాదాటి వచ్చారు. రోజంతా టమాట తొలగింపు పనుల్లో అలసిపోయారు. సూర్యుడు అస్తమించే వేళ ఆ రోజు అందిన కూలి తీసుకుని స్వగ్రామాలకు ఆటోలో పయనమయ్యారు. ఇంట్లో బిడ్డల గురించి ఒకరు, భార్య ఆరోగ్యం గురించి మరొకరు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నారు. కానీ ఆటో బోల్తా పడగా వారి జీవితాలు అక్కడే ముగిసిపోయాయి. కూలీలతో వెళ్తున్న ఓ ఆటో మండలం పరిధిలోని కొక్కంటి సమీపంలోని మించిలవారికోట రోడ్డు వద్ద బోల్తా పడడంతో వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన వ్యసాయ కూలీలు పట్టా దేవనాథ్ (45), బత్తల హేమలత (32) మృతి చెందారు. తిరిగి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందిన పలువురు వ్యవసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని అగ్రహారంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో టమాట కోసేందుకు వచ్చారు. పని ముగిసిన అనంతరం అదే ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మించిలివారికోట రోడ్డు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బత్తల హేమలతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న బూరుజుపల్లికి చెందిన పట్టా దేవనాథ్, పట్టా బయన్న, శివగంగ, కొండప్పగారిపల్లికి చెందిన పెద్ద గంగులయ్య, బురుజుపల్లికి చెందిన పట్టా బయప్ప, గాయపడ్డారు. షయం తెలుసుకున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాగేపల్లి అశోక్, బాలు, నవీన్, తండేల్ తదితరులు క్షతగాత్రులను తమ ఉచిత అంబులెన్స్లో తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుట్టా దేవనాథ్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ గోపి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతి చెందిన పట్టా దేవనాథ్, బత్తల హేమలత మించిలివారికోట వద్ద ఆటో బోల్తా వైఎస్సార్ కడపకు చెందిన ఇద్దరు కూలీల మృతి అగ్రహారంలో టమాట కోసేందుకు వచ్చి మృత్యువాత -
నేడు ‘అన్నదాత పోరు’
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు పరిస్థితి అగమ్యగోచరమైంది. సీజన్కు ముందే పంటలసాగును అంచనా వేసి ఎరువులు తెప్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిపోయినా... ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు ఒక్క ఎరువు బస్తా కూడా చేర్చలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని రోజూ మండల కేంద్రాల్లోని ఫర్టిలైజర్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మే నెలాఖరులోపే రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను చేర్చేదని, గ్రామాల్ల్లోనే కావాల్సినన్ని ఎరువులు అందించేదని గుర్తు చేసుకుంటున్నారు. బ్లాక్ దందా.. జిల్లాలో కావాల్సినంత యూరియా ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఏ దుకాణంలో వెళ్లి అడిగినా లేదనే అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా.. కొందరు వ్యాపారులు, కూటమి నేతలు సిండికేటుగా మారి యూరియాను దారి మళ్లించి.. అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం యూరియా బస్తా రూ.267కు ఇస్తామంటోంది. కానీ బహిరంగ మార్కెట్లో బస్తా రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లు వచ్చే లోపు దుకాణం సర్దేస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో సుమారు 75 వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. మరో 63 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు వేశారు. ఖరీఫ్లో వరి పంట 7 వేల హెక్టార్లలో.. మొక్కజొన్న 16 వేలకు పైగా హెక్టార్లలో సాగులో ఉన్నాయి. వరి, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. ఎకరా వరి పంటకు నాలుగు బస్తాల వరకు యూరియా వేస్తారు. అదే మొక్కజొన్న పంటకు అయితే ఎకరాకు 5 నుంచి 8 బస్తాల వరకు విడతల వారీగా వినియోగించాలి. జిల్లాలో కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, ఇంకో 2 వేల టన్నుల కోసం ఇండెంట్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఏ రైతును పలకరించినా.. యూరియా దొరకలేదని చెబుతున్నారు. బయో కొంటేనే.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూరియాను బ్లాక్ చేసిన కొందరు వ్యాపారులు ధర భారీగా పెంచారు. రూ.267 చొప్పున విక్రయించాల్సిన యూరియా బస్తాను రూ.500 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అది కూడా తాము సూచించిన బయో ఎరువులను కొంటేనే యూరియా ఇస్తామని షరతు పెడుతున్నారు. దీంతో అవసరం లేకున్నా రైతులు బయో ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. యూరియా కోసం రైతుల ఆందోళన లేపాక్షి: యూరియా కోసం మండలంలోని కల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 15 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వరా..? అంటూ నిలదీశారు. వివరాల్లోకి వెళితే... కల్లూరు రైతు సేవా కేంద్రం పరిధిలోని పలువురు రైతులకు అధికారులు యూరియా పంపిణీ నిమిత్తం 15 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చారు. సోమవారం యూరియా పంపిణీ ఉందని తెలుసుకున్న వారంతా రైతు సేవా కేంద్రానికి వచ్చారు. అయితే అధికారులు మాత్రం గతంలో టోకెన్లు ఇచ్చిన రైతులను కాదని, కొత్తగా కొంతమందికి టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు. దీంతో గతంలో టోకెన్లు తీసుకున్న రైతులు తమకు తొలుత యూరియా పంపిణీ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతుల మధ్య వివాదం నెలకొంది. ఓ దశలో రైతులు ఘర్షణకు దిగేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. గతంలో టోకెన్లు తీసుకున్న వారికి పంపిణీ చేసిన తర్వాతే ప్రస్తుతం టోకెన్లు తీసుకున్న రైతులకు యూరియా పంపిణీ చేసేలా అధికారులతో మాట్లాడారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. యూరియా బారులు కొత్తచెరువులోని ప్రధాన మంత్రి రైతుల సమృద్ధి కేంద్రం వద్ద ఈనెల 5వ తేదీ (శుక్రవారం) కనిపించిన దృశ్యమిది. మండలంలో చాలా మంది రైతులు ప్రస్తుతం వరినాట్లు వేశారు. ఇప్పుడు యూరియా చల్లకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల రైతులంతా ఉదయమే మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన 160 బస్తాల యూరియా రాగా, టోకెన్లు ఇచ్చి పోలీసుల రక్షణలో పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు గొడవకు దిగగా, దుకాణం మూసివేసి వెళ్లారు. – కొత్తచెరువు: యూరియా కోసం రైతుల అవస్థలు చూసి చలించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుబాటకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రైతుల తరఫున వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాకు తలపెట్టింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలనే డిమాండ్తో ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఆర్డీఓ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయా ఆర్డీఓ కార్యాలయాల వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. -
రైతులు వీధుల్లో.. మంత్రులు సీఎం సభ ఏర్పాట్లలో..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలు అంటూ తెల్లార్లూ జాగారం చేస్తున్న పరిస్థితి. ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రైతన్నల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లోనూ శరపరంపరగా పోస్టులు కన్పిస్తున్నాయి. సర్కారు తీరుపై సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా దగ్గరుండి రైతుల కష్టాలు తీర్చాల్సిన మంత్రులు అసలు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మీరు ఏం చావు చస్తే మాకేమిటీ’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు రైతులు అర్ధరాత్రి నుంచే యూరియా కోసం పంపిణీ కేంద్రాలు, ఎరువుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం సభ ఏర్పాట్లలో ఉండగా.. అధికారులు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు.సగం కేబినెట్ అనంతపురంలోనే..రాష్ట్రంలో ఒక జిల్లాలోనో, ఒక నియోజకవర్గంలోనో కాదు ఊరూరా యూరియా కష్టాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లే ముఖ్యమయ్యాయని సామాన్యులు వాపోతున్నారు. ఈ నెల 10వ తేదీన ‘సూపర్ సిక్స్–సూపర్హిట్’ అనే కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం 10 మంది మంత్రులు వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు. సీఎంతో పాటు పవన్కల్యాణ్, లోకేష్ సభకు వస్తున్నారని, అట్టహాసంగా చేయాలన్న ఆలోచనతో మంత్రులు ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ తదితరులంతా ఇక్కడే ఉన్నారు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి సీఎం సభ ఏర్పాట్ల నిమిత్తం అనంతపురంలో మకాం వేశారు.నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు..మంత్రుల మాట దేవుడెరుగు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎం సభ ఏర్పాట్లలోనే తరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో వరి ఎక్కువగా పండిస్తారు. గడిచిన పక్షం రోజులుగా ఇక్కడ యూరియా లేదు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనంతపురం వదలి అక్కడికి వెళ్లడం లేదు. మడకశిర నియోజకవర్గంలో రెండ్రోజుల క్రితం తాగునీరు లేక ప్రజలు రోడ్డెక్కారు. కానీ ఆ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం అనంతపురంలోనే ఉన్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, రాప్తాడు..ఇలా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు. సభ సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం కోసం ఒకర్ని మించి ఒకరు పోటీపడుతున్నారు. వీరు తీరును రైతులు, ప్రజలు ఏవగించుకుంటున్నారు. -
యూరియా కూడా ఇవ్వలేరా?
కూటమి సర్కార్ రైతుకు ఎలాంటి మేలు చేయడం లేదు. విత్తనాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు నానా కష్టాలు పడి పంటలు పండిస్తుంటే యూరియా కూడా ఇవ్వలేకపోతోంది. ఇది చేతగాని ప్రభుత్వం. రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం యూరియా కావాల్సినంత ఉందంటూ ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా వారికి ధైర్యం ఉంటే మండల కేంద్రాలకు వచ్చి రైతులను కలిస్తే వాస్తవం తెలుస్తుంది. – అవుటాల రమణా రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ -
యూరియా అధికంగా వాడితే తెగుళ్లు
● రైతులతో కలెక్టర్ చేతన్ పుట్టపర్తి అర్బన్: ‘‘ పంటల సాగులో అధికారులు సూచించినంత మేరకే మేరకే యూరియా వాడాలి. అధికంగా వాడితే పంటలకు తెగుళ్లు సోకుతాయి’’ అని కలెక్టర్ చేతన్ రైతులకు సూచించారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలన్నారు. సోమవారం ఆయన పుట్టపర్తి మండలం పెడపల్లి, కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామాలను సందర్శించి అక్కడి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి యూరియా నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పెడపల్లిలో రైతు బ్రహ్మానందరెడ్డి మొక్కజొన్న పంటను పరిశీలించిన కలెక్టర్ రైతుతో మాట్లాడారు. పంటకు ఎంత యూరియా వేశారు...ఎక్కడ కొనుగోలు చేశారంటూ ఆరా తీశారు. అధికారుల సిఫార్సు మేరకే యూరియా, ఎరువులు వాడారా.. అని అడిగి తెలుసుకున్నారు. కొత్తచెరువు మండలంలో యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా హెల్త్ క్లినిక్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు కళ్యాణచక్రవర్తి, బాలాంజనేయులు, ఏఓలు శ్రీవాణి, సతీష్, వీఆర్ఓలు, వీఓఏలు ఉన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్ ప్రశాంతి నిలయం: జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదని, పంటల నమోదు ఆధారంగా రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురిసినా, తగినంత వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఖరీఫ్ సీజన్లో వేరుశనగ 45,000 హెక్టార్లు, మొక్కజొన్న 15,000 హెక్టార్లు, కంది 16,000 హెక్టార్లు, వరి 4 వేల హెక్టార్లలో సాగులో ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 5,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందన్నారు. రోజూ సగటున 145 నుంచి 150 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతోందన్నారు. రైతులు ఈనెల 30వ తేదీలోపు ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. 871 మెట్రిక్ టన్నుల యూరియా రాక అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు 871 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోరమాండల్ కంపెనీ (సీఐఎల్) నుంచి 601 మెట్రిక్ టన్నులు, పారాదీప్ ఫాస్పేట్ కంపెనీ (పీపీఎల్) నుంచి 270 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరిందన్నారు. ఇందులో మార్క్ఫెడ్కు 530 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 341 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ప్రకారం సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 4న ‘రెడ్క్రాస్’ నూతన కమిటీ ఎన్నిక ప్రశాంతి నిలయం: జిల్లా రెడ్క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నిక అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి, ఎన్నికల అధికారి కృష్ణానాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారమే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి రెడ్క్రాస్ సొసైటీ పోషకులు, ఉప పోషకులు, జీవితకాల సభ్యులు, జీవితకాల అనుబంధ సభ్యులందరూ తమ ఆధార్ కార్డు, సభ్యత్వ కార్డులతో హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో కనీసం 10 మంది సభ్యులతో కూడిన జిల్లా రెడ్క్రాస్ నూతన నిర్వహణ కమిటీని ఎన్నుకుంటారన్నారు. అదేరోజు కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నిక కూడా జరుగుతుందని వివరించారు. -
రైతులు కష్టాల్లో ఉంటే విజయోత్సవాలా?
పెనుకొండ రూరల్: ‘‘రైతులు యూరియా కోసం రోడ్లపై తిరుగుతుంటే.. మీరు మాత్రం విజయోత్సవాలు చేసుకుంటారా..? రైతు గురించి ఏనాడైనా ఆలోచించారా..మీ వ్యవహార శైలి చూస్తుంటే రైతు సంక్షేమంపై మీకే మాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. మీ పాలన సూపర్ హిట్ కాదు...అట్టర్ ఫ్లాప్’’ అంటూ కూటమి నాయకులపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె పెనుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ‘అన్నదాత పోరు’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులను వంచనకు గురిచేయడంలో కూటమి ప్రభుత్వం హిట్ కొట్టిందన్నారు. రాష్ట్రంలో బంగారం దొరుకుతోందని కానీ, యూరియా దొరకడం లేదనన్నారు. విత్తనాలు, ఎరువులు అన్నింటికీ రైతులు అడుక్కోవాల్సి వస్తోందన్నారు. ఈ పాలకులకు రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. రైతు సంతోషంగా ఉండాలంటే వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ముంగిటకే విత్తనాలు, ఎరువులు తెచ్చారన్నారు. కూటమి అసమర్థ పాలనలో యూరియా కోసం పడరానిపాట్లు పడుతున్న రైతుల కోసం వైఎస్సార్ సీపీ మంగళవారం ‘అన్నదాత పోరు’కు శ్రీకారం చుట్టిందన్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రైతు పక్షమేనన్నారు. రైతుకోసం నిలబడ్డామని, వారికి ఏ కష్టం వచ్చినా పోరుకు సిద్ధమన్నారు. యూరియా కూడా ఇవ్వలేని మీదీ ఓ ప్రభుత్వమా? అది సూపర్ హిట్ కాదు ...అట్టర్ఫ్లాప్ సభ రైతు కోసం మేం నిలబడ్డాం..పోరుబాట చేస్తున్నాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ -
అడుగుకో గుంత.. తీరని జనం చింత!
కొత్తచెరువు రైల్వే ట్రాక్ దాటగానే ఛిద్రమైన రోడ్డు ఓడీసీలో గుంతలమయమైన ప్రధాన రోడ్డు పుట్టపర్తి అర్బన్: జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎటు చూసినా కంకర తేలి, గుంతలు పడిన దారులే కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు వేసిన ప్యాచ్ వర్క్ కేవలం ఆరు నెలలకే వెలసి పోయి రోడ్లన్నీ తిరిగి గుంతలమయమయ్యాయి. పాయ్చ్ వర్క్కు రూ.20 కోట్లు ఇటీవల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రోడ్లు గుంతలమయ్యాయి. దీంతో రూ.20 కోట్లు వెచ్చించి ప్యాచ్ వర్క్ పనులు చేపట్టారు. ఒక్కో నియోజక వర్గానికి రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ వెచ్చించారు. అయితే పనులు నాసిరకంగా చేయడంతో ఆరు నెలలు తిరగకనే గుంతలు పడ్డాయి. పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, కదిరి, పెనుకొండ మడకశిర నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల రహదారులు మరీ అధ్వానంగా మారాయి. గుంతల మయమైన రహదారుల్లో ప్రయాణం సాగించలేకపోతున్నామని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తికి వచ్చే రహదారులన్నీ ఛిద్రం కావడంతో ఆ మార్గంలో ప్రయాణించే దేశవిదేశీ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పరువు తీస్తున్నారంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మరో 70 రోజుల్లో సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రారంభకానున్నాయి. ఇలాంటి తరుణంలో రహదారుల మరమ్మతు పనులు నాణ్యతతో చేస్తారో లేదో వేచి చూడాలి. ఛిద్రమైన రహదారులు నాసిరకంగా ప్యాచ్ వర్కులు రోజుల వ్యవధిలోనే తిరిగి గుంతల మయం -
పోషకాహార లోపాన్ని నివారించండి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: పోషకాహార లోపాన్ని నివారించేలా ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు.ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే ‘పౌష్టికాహార మాసోత్సవం’ కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఐసీడీఎస్ పీడీ ప్రమీల మాట్లాడుతూ.. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా ప్రధానంగా ఐదు అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జ్ డీఆర్వో సూర్యనారాయణరెడ్డి, అర్డీఓ సువర్ణ, డీపీఓ సమత, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రోగులకు సత్వర సేవలు అందించాలి అత్యవసర సమయంలో రోగులకు సత్వర సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం 108 అంబులెన్స్ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతమున్న 33 అంబులెన్స్ వాహనాల ద్వారా రోగులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయన్నారు. తాజాగా అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం, ఎన్టీఆర్ వైద్య సేవల కోర్డినేటర్ శ్రీదేవి, డీసీహెచ్ఎస్ డాక్డర్ మధుసూదన్, 108 సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్లన్నీ పాడయ్యాయి
ఇటీవల రోడ్లకు వేసిన ప్యాచ్ వర్క్ మొత్తం ఎక్కడికక్కడ మటుమాయమైంది. దీంతో పుట్టపర్తికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాచ్ వర్క్కు వెచ్చించిన రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయి. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. – రవినాయక్, పుట్టపర్తి ఇటీవల మట్టి వేశారు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వేసిన ప్యాచ్ వర్క్ చేశారు. అయితే ఎక్కడే కానీ దాని ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. దీంతో గుంతలమయమైన రహదారిలో తిరగలేక కొందరు యువకులు స్వచ్ఛందంగా మట్టితో పూడ్చి వేశారు. – లక్ష్మీరెడ్డి, ఓడీసీ -
ప్రాణానికే ప్రమాదం
హానికరమైన రంగులు, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్ కూడా వస్తుంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం సక్రమంగా పని చేయడం మానేస్తాయి. ఫలితంగా ప్రాణానికే ప్రమాదం. కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, విరేచనాలతో మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆహార పదార్థాల్లో వాడే రసాయనాలు మెదడు, ఎముకలపై కూడా ప్రబావం చూపుతాయి. చర్మంపై దద్దుర్లు, మచ్చలు కూడా వస్తాయి. – డాక్టర్ నాగేంద్రకుమార్రెడ్డి, కదిరి -
ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లిలో దళితుడు నారాయణ మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గ్రామంలో దళిత (మాల) సామాజిక వర్గానికి చెందిన శ్మశాన స్థలం వివాదంలో ఉండడంతో మృతదేహం ఖననానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. అంత్యక్రియలు అదే శ్మశానంలో చేయాలని ఓ సామాజిక వర్గం వారు... కోర్టు వివాదంలో ఉండడంతో అక్కడ చేయరాదని మరరో వర్గం వారు పట్టుపట్టారు. విషయం తెలుసుకున్న ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంతకుమార్, చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ సురేష్కుమార్, ఎస్ఐ సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని ఇరువర్గాలతో చర్చించారు. త్వరలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీనివ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు, దళిత సామాజిక వర్డానికి చెందిన వారు అంగీకరించారు. దీంతో గ్రామ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో మృతదేహాన్ని సోమవారం ఖననం చేశారు. -
ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
● ముగ్గురికి తీవ్రగాయాలు బత్తలపల్లి: మండలలోని పోట్లమర్రి సమీపంలో సోమవారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ధర్మవరం నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో పోట్లమర్రి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా తాడిపత్రి నుంచి ధర్మవరానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్ర వాహనదారుడిని ఓవర్టేక్ చేస్తూ ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న తాడిమర్రి మండలం మద్దలచెరువు గ్రామానికి చెందిన బాలవెంగళరెడ్డి, చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామానికి చెందిన వరదరాజులు, బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఈరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోకిరీకి దేహశుద్ధికదిరి అర్బన్: వివాహితను వేధించిన పోకిరీకి స్థానికులు దేహశుద్ధి చేశారు. కదిరి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలానికి చెందిన యువకుడు మహేష్ మద్యం మత్తులో ఓ వివాహితతో ఆమె ఇంటి వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కోరిక తీర్చాలని గొడవకు దిగాడు. గమనించిన భర్త, బంధువులు వెంటనే మహేష్ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీఐ నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సుల ఢీ●ముగ్గురికి గాయాలు చెన్నేకొత్తపల్లి: స్థానిక 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరికి కాలు విరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కేరళలోని అలపూరకు చెందిన ఏడుగురు యువకులు హైదరాబాద్లో కావడి ఉత్సవాన్ని ముగించుకుని తమ మినీ బస్సులో ఆదివానం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం చెన్నేకొత్తపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారి పక్కన ఆపిన కియా కంపెనీను వెనుక నుంచి ఢీకొనడంతో మినీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కేరళకు చెందిన అర్జున్కు ఎడమ కాలు పాదం వద్ద విరిగింది. అగిల్, రాహుల్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినటుపోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్లో వృద్ధుడి మృతి గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్లోని మూడో ప్లాట్ఫారంపై ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్లాట్ ఫారంలోని 22వ పోల్ వద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. చామఛాయ రంగు కలిగి ఉన్నాడు. గడ్డం పెరిగి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. -
సత్యసాయి వైభవం.. భక్తజన పరవశం
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన కాంచీపురం సత్యసాయి భక్తులు సత్యసాయి వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను పరవశింపజేశారు. సోమవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి యూత్, బాలవికాస్కు చెందిన యువతులు ‘శ్రీ సత్యసాయి కరుణామృత కావ్యం’ కాలక్షేపం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీగాన వైభవ సాయి’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం కాంచీపురానికి చెందిన సత్యసాయి యూత్ షిరిడీ సాయి సత్యసాయి ఇద్దరు ఒక్కటే అన్న సందేశాన్నిస్తూ నాటికను ప్రదర్శించారు. ‘షిరిడీ కే మహల్సపతి, పర్తి కే కౌన్’ పేరుతో నిర్వహించిన నాటిక భక్తులకు చక్కటి సందేశాన్నిచ్చింది. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 233 వినతులు అందాయి. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జ్ డీఆర్వో సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీపీఓ సమత, వివిద శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం సీజీ ప్రాజెక్ట్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించి న్యాయం చేయకపోతే తమకు అత్మహత్యలే శరణ్యంమని ప్రాజెక్ట్ మత్స్యకార సహకార సంఘం సభ్యుడు రమణా నాయక్తో కలసి పలువురు మత్యకారులు కలెక్టర్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్ట్ మత్య్సకార సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న తమకు తెలియకుండా మత్య్సకార శాఖ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన శంకరయ్య నెల్లూరు ప్రాంతానికి చెందిన వారికి చేపల వేటకు అనుమతులు ఇచ్చారన్నారు. 50 టన్నులకు పైగా చేపలను పట్టుకుని వారు అమ్ముకున్నారన్నారు. గతంలోనూ పలుమార్లు కదిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని, ఇప్పటికై నా తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. -
సత్సంబంధాలతోనే ఉన్నత శిఖరాలు
ధర్మవరం అర్బన్: విద్యార్థులతో ఉపాధ్యాయులు సత్సంబంధాలను కలిగి ఉండాలని, అప్పుడు ఆ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సినీ నటుడు వెల్లంకి నాగినీడు అన్నారు. ఆత్మీయ ట్రస్ట్, యూటీఎఫ్ ధర్మవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ధర్మవరంలోని ఎన్జీఓ హోంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగినీడు హాజరై, మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలను పసిగట్టి వాటికి అనుగుణంగా పాఠాలు బోధించాలన్నారు. శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 68 మందిని ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సురేష్కుమార్, పెనుకొండ డీవైఈఓ జాన్ రెడ్డప్ప, ధర్మవరం ఎంఈఓలు రాజేశ్వరిదేవి, గోపాల్నాయక్, హనుమంతరెడ్డి, యూటీఎఫ్ నాయకులు సుధాకర్, రమణయ్య, రామప్పచౌదరి, నారాయణస్వామి, రామకృష్ణనాయక్, బూతన్న, బాబు, శ్రీనివాసులు, మేరీవరకుమారి, మారుతి, ఆంజనేయులు, అమర్నారాయణరెడ్డి, హరికృష్ణ, రాంప్రసాద్, వెంకటకిషోర్, సకల చంద్రశేఖర్, సురేష్, హెచ్.రామాంజనేయులు, సాయిగణేష్, జేవీవీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు నాగినీడు -
నిమజ్జనం.. ప్రశాంతం
మడకశిర: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వినాయక చవితి సందర్భంగా మడకశిరలో కొలువుదీరిన గణనాథులను ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించారు. శనివారం రాత్రి పది గంటలకు నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక వాహనాల్లో కొలువుదీర్చిన వినాయక విగ్రహాలతో శోభాయాత్ర ప్రారంభమై ఆదివారం తెల్లవారుజాము వరకు సాగింది. భారీ పోలీసు బందోబస్తు క్రేన్ల సాయంతో విగ్రహాలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. గణపతి బప్ప మోరియా.. బైబై గణేశా అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో సీఐలు రాజ్కుమార్, నగేష్ బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలకు సీఐ నగేష్ కృతజ్ఞతలు తెలిపారు. -
బసంపల్లిలో మృతదేహం ఖననానికి అడ్డంకులు
చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన నారాయణ (85) ఆదివారం వేకువజామున మృతి చెందాడు. స్థల సమస్య కారణంగా ఖననానికి ఇబ్బందులు ఎదురుకావడంతో మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుకోవడం కలకలం రేపింది. గ్రామంలో దళితుల శ్మశాన స్థల వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, ఆనంద్, ప్రకాష్తో పాటు దళిత వర్గీయుల మధ్య స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. దీంతో దళితుల కుటుంబాల్లో ఎవరు మరణించినా వారి మృతదేహాన్ని ఖననం చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం నారాయణ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందిని తెలుసుకున్న తహసీల్దార్ సురేష్కుమార్, ఎస్ఐ సత్యనారాయణ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. ప్రస్తుతం శ్మశాన స్థల వివాదం కోర్టులో ఉందని, పరిష్కారం అయ్యే వరకూ మృతదేహాలను మరో చోట ఖననం చేయాలని సూచించారు. అయితే.. ఆనవాయితీ మేరకు అదే స్థలంలోనే ఖననం చేసేలా అనుమతులు ఇవ్వాలని అధికారులను దళితులు కోరారు. -
అది హిట్ కాదు.. సూపర్ చీట్ సభ
● చంద్రబాబు 14 నెలల్లో జిల్లాకు వెలగబెట్టింది శూన్యం ● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఫైర్ రాప్తాడురూరల్: ‘చంద్రబాబు ఎన్నికల ముందు 200కు పైగా హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్లో రెండు పథకాలు అరకొరగా అమలు చేయగానే ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ అంటున్నారు. అది సూపర్ హిట్ కాదు సూపర్ చీట్ సభ’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో తలపెట్టిన ‘అన్నదాత పోరు’కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలకు రూ. 10 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఇప్పటిదాకా కనీసం రూ. 50 వేల కోట్ల పథకాలు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. లేదంటే ప్రతినెలా రూ. 2 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జిల్లాలో ఉపాధి లేక వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్రెడ్డి ఇస్తున్న పథకాలేవీ ఆపను... వాటితో పాటు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ‘చేయూత, ఆసరా, నేతన్న నేస్తం’ అందించలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేసి అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు యూరియా కొరత కనిపించలేదా? బ్లాక్మార్కెట్కు తరలించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 14 నెలల్లో ఏం వెలగబెట్టారు? ఈ 14 నెలల్లో జిల్లాకు చంద్రబాబు ఏం వెలగబెట్టారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ను తిడుతూ లోకేష్ వద్ద మెప్పు పొందాలని చూస్తున్నారన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని ఒక్క ఇల్లయినా ఇచ్చారా అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి అందులో 7 నిర్మాణాలు కూడా పూర్తి చేశారన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వాటిని సంపూర్ణంగా ప్రైవేట్పరం చేశారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఆర్నెల్లలో ప్రజలకు రూ. 16 వేల కోట్ల వాతలు పెట్టారన్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తే సంపూర్ణంగా నీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని, అలాంటి వాటిని పక్కన పెట్టేసి అమరావతికి మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు అనుమతులు తీసుకొచ్చేందుకు ఎందుకు చిత్తశుద్ధి చూపించడం లేదని విమర్శించారు. హంద్రీ–నీవా వెడల్పులో భాగంగా గత ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు అనుమతులిచ్చి పనులు ప్రారంభిస్తే దానిని 3,800 క్యూసెక్కులకు కుదించడం వంచన కాదా అన్నారు. లైనింగ్ పనులను కేవలం చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం జిల్లా రైతులకు మోసం చేయడం కాదా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలనూ మోసగించిన చంద్రబాబుకు అనంతకు రావడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్ ఫెయిల్యూర్ మినిస్టర్ అని , మరో మంత్రి సవితమ్మకు పులివెందుల వెళ్లి దొంగ ఓట్లు వేయించే శ్రద్ధ జిల్లా ప్రజల పట్ల లేదని విమర్శించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ధిల్లీలో ఉంటారో, లక్నోలో ఉంటారో, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంటారో ఎవరికీ తెలీదన్నారు. ఆ ఎమ్మెల్యేలు అన్నమే తింటున్నారా? అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు కనీసం కడుపునకు అన్నం తింటున్నారా అని మండిపడ్డారు. వారి నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఇళ్ల నిర్మాణాలను 14 నెలలుగా విజిలెన్స్ తనిఖీల పేరుతో నిలబెట్టారని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారంటే ఆ ఇద్దరికీ సిగ్గుందా అని దుయ్యబట్టారు. అసమర్థ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధనాపేక్ష కోసం పేదల ఇళ్ల నిర్మాణం అటకెక్కించారని ధ్వజమెత్తారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, లోకనాథరెడ్డి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వు స్థలంలో మట్టి తవ్వకాలు
ధర్మవరం: టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. మున్సిపల్ రిజర్వు స్థలంలో అక్రమంగా మట్టి తవ్వి తరలించేస్తున్నారు. పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో పాఠశాల పక్కన ఉన్న మున్సిపల్ రిజర్వు స్థలంలో జేసీబీలతో ఇష్టారాజ్యంగా తవ్వడంతో పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరితే ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని కాలనీవాసులు అంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా మట్టిని తరలించకుండా రిజర్వు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. రిజర్వు స్థలంలో తవ్వకాలతో ఏర్పడిన పెద్ద గుంతలు -
అన్నదాత పోరుకు తరలిరండి
● యూరియాపై సీఎం మాటలు హాస్యాస్పదం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ గోరంట్ల: ఎరువుల బ్లాక్ మార్కెట్ను నిరసిస్తూ రైతులకు బాసటగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. పెనుకొండలో ఈ నెల 9న నిర్వహించే ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆమె ఆదివారం గోరంట్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ యూరియా సహా అవసరమైన ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం కావడంతో వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా వినియోగం వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన సొంత కంపెనీ హెరిటేజ్కు లాభాలు చేకూర్చడం కోసం రైతులు వరి, ఇతర పంటలు సాగు చేయకుండా పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించాలని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బ్లాక్మార్కెట్ను నియంత్రించి, ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సుల మేరకు కాకుండా సీనియారిటీ ప్రాతిపదికన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. బాబు మోసాలను వివరించండి ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఉషశ్రీచరణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం కమ్మవారిపల్లిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏడాది దాటినా అరకొర పథకాలు అమలు చేసి.. అవీ అనేక కొర్రీలు వేసి చాలామంది అర్హులకు ఫలాలు అందకుండా చేశారని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటేశు, టౌన్ కన్వీనర్ మేదర శంకర, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆర్.వెంకటరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఫక్రుద్ధీన్ సాబ్, సీనియర్ నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, కమ్మవారిపల్లి పంచాయతీ నాయకులు రంగారెడ్డి, రాజు, రామిరెడ్డితో పాటు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అసమర్థ పాలన
● మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి నల్లమాడ: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధరరెడ్డి ఆరోపించారు. ఈ నెల 9న పుట్టపర్తిలో తలపెట్టిన అన్నదాత పోరు పోస్టర్లను నల్లసింగయ్యగారిపల్లిలోని తన స్వగృహంలో ఆదివారం పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందన్నారు. ప్రభుత్వం చేతగాని తనం కారణంగా బ్లాక్ మార్కెట్లో రూ.500 నుంచి రూ.600 లకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిచండంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేర్చకుండానే సక్సెస్ మీటింగ్లు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 66 లక్షలు ఉన్న సామాజిక పింఛన్లలో ఇప్పటికే ఆరు లక్షలు తొలగించారని, వీటిని 50 లక్షలకు కుదించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... రైతుల శ్రేయస్సు, ఆర్థిక భద్రతకు నిరంతరం కృషి చేశారన్నారు. వేరుశనగ, వరి, చిరుధాన్యాలు అన్నింటికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, మందులు, వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందించడమే గాక ఏ సమయంలో ఏ పంట వేయాలో, ఏయే మందులు వాడాలో వ్యవసాయ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వచ్చారన్నారు. రైతు సమస్యలపై ఈ నెల 9న మంగళవారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు టీడీ కేశవరెడ్డి, శేషురెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్హెచ్ బాషా, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలా రెడ్డి, సంయుక్త కార్యదర్శి దేశాయి భారతీరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సతీష్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి అంజినప్ప, నియోజకవర్గ అధ్యక్షుడు ఆసాది గంగిశెట్టి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్యాకుమారి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, ఎంపీపీ పెడబల్లి రమణారెడ్డి, కన్వీనర్లు జయప్ప, రవీనాయక్, మాజీ కన్వీనర్ పొరకల రామాంజనేయులు, ఎస్టీ సెల్ విజయకుమార్ నాయక్, సర్పంచ్లు జగన్మోహన్ చౌదరి, మల్లికార్జున , నాగరాజునాయుడు, నరసింహమూర్తి, నాయకులు గోవర్ధన్రెడ్డి, నారాయణరెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుదర్శన్రెడ్డి, దాదిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నీళ్లే మిగిలాయి..
కరుణ లేని సర్కారులో తన ఈడు స్నేహితురాళ్లతో సంతోషంగా ఆడుకోవాల్సిన వయసులో తీరని అన్యాయానికి గురైంది. మృగాళ్ల చేతికి చిక్కి విలవిలలాడిపోయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పొందాల్సిన సమయంలో తనే ఓ బిడ్డకు తల్లయ్యింది. మేమున్నాం అంటూ ఆదుకోవాల్సిన వారు.. అలా చేస్తే ఎక్కడ తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందోనని అసలు అటువైపే చూడలేదు. నాలుగు గోడలకే పరిమితం చేసేశారు. గుండెలవిసేలా రోదించినా స్పందన లేదు. అయిన వాళ్లు లేరు.. పలకరించే వారు కరువయ్యారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా కరువైపోయాయి. మౌన రోదనే మిగిలింది. చంద్రబాబు ప్రభుత్వ అలసత్వ ధోరణితో ఏడుగుర్రాలపల్లి దళిత బాలిక కుటుంబం వీధిన పడింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత టీడీపీ సర్కారు హయాంలో కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతిని కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ పాపం ఇప్పటికీ చంద్రబాబు సర్కారును వెంటాడుతోంది. ఇంచుమించు అలాంటి ఘటనే మళ్లీ.. అదీ బాబు సీఎంగా ఉన్న సమయంలోనే రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో జరిగింది. టీడీపీకి చెందిన మానవ మృగాలు ఓ దళిత బాలికను చెరపట్టి సామూహిక అత్యాచారం చేశాయి. దీంతో ఆ బాలిక గర్భం దాల్చి బిడ్డకు తల్లయింది. ఈ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురైన బాలిక నేడు ఓ ఎన్జీవో హోంలో బాధను దిగమింగు కుని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తోంది. కొన్ని మాసాల క్రితం ఏడుగుర్రాలపల్లెలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసే సరికి ఆమె ఐదు మాసాల గర్భిణి. తర్వాత రెండు నెలలకు అనంతపురం సర్వజనాసుపత్రిలో ప్రసవం అయింది. అనంతరం మూడు వారాలకే తల్లినుంచి బిడ్డను వేరు చేశారు. తల్లిని బత్తలపల్లిలోని ఆర్డీటీ హోంలో ఉంచారు. పసి కందును ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. స్కూలుకెళ్లి ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఆ బాలిక ఇప్పుడు ఎన్జీవో హోంలో ఒంటరిగా జీవిస్తోంది. ఎక్కడికెళ్లాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఎన్నిరోజులు ఉంచుతారో తెలియదు. ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదు.. ఇదీ ఆ బాలిక ఎదుర్కొంటున్న అగమ్యగోచర పరిస్థితి. అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే..గతంలో సుగాలి ప్రీతి.. నేడు ఏడుగుర్రాలపల్లిలో యువతి దళిత మైనర్ బాలిక జీవితం అథోగతి ప్రసవమైన మూడు వారాలకే తల్లీబిడ్డను వేరుచేసిన అధికారులు ఎన్జీవో హోంలో బిక్కు బిక్కుమంటూ బతుకీడుస్తున్న బాలిక పసికందును ఎక్కడికి చేర్చారో ఇప్పటికీ తెలియని దుస్థితి బాధిత కుటుంబాన్ని పట్టించుకోని బాబు ప్రభుత్వం ఎన్జీవో హోంలో ఒంటరి బతుకు.. సామూహిక అత్యాచారంతో సర్వస్వం కోల్పోయిన దళిత మైనర్బాలికకు సర్కారు పైసా సాయం అందించలేదు. సాయం ప్రకటిస్తే నేరం ఒప్పుకున్నట్టు అవుతుందేమో అనుకున్న ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. కనీసం రాప్తాడు ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. ఆ బాలికకు సర్కారు సాయం లేక, కుటుంబంలో కూడా చూసుకునే వారు కరువై జీవితమే ఛిద్రమైంది. ఇప్పుడా బాలికను పోషిస్తారో లేదో కూడా అంతుచిక్కడం లేదు. స్వగ్రామానికి వెళ్లినా బతకనిస్తారా అన్నది అనుమానంగా ఉందని జిల్లా వాసుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి తరహాలోనే ఈ బాధితురాలికి టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుకు కూడా బాలికను పరామర్శించడానికి గాని, బిడ్డను చూడటానికి గాని ఎవరికీ ప్రవేశం లేకుండా అధికారులు నిషేధం విధించారు. నెలరోజులుగా తల్లీ బిడ్డ ఎలా ఉన్నారు.. వారి బాగోగులు ఏమిటి అన్న వివరాలు ఎవరికీ తెలియడం లేదు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు గొంతెత్తితే అడ్డుకోవడం లేదా అరెస్టులు చేస్తున్నారు. గతంలో సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో చేసిన పాపాన్ని నేడు ఏడుగుర్రాలపల్లిలో అత్యాచారం ఘటన విషయంలోనూ కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆలయాల మూత
కదిరి టౌన్/ లేపాక్షి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన రాజగోపురం తలుపులు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అర్చకులు మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ఆలయ సంప్రోక్షణ, పరివార దేవత మూర్తులకు పుళికాపు, తిరుమంజనములు, నిత్య ప్రత్యాబ్దికములు గావించి, ఆరాధన, నివేదన అనంతరం భక్తులకు ఉదయం 8.30 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామని ప్రధాన అర్చకులు పార్థసారథి ఆచార్యులు తెలిపారు. = లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయాన్ని ఆదివారం పూజాకార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి, అభిషేకాకాల అనంతరం 8 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. -
బ్యాంకు దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు
పుట్టపర్తి టౌన్: హిందూపురం రూరల్ తూముకుంట చెక్పోస్ట్ సమీపంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచులో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు అనిల్ కుమార్ పన్వార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు కిలోల బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ రత్న శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్తో కలసి మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జులై 26న తూముకుంట ఎస్బీఐలో దొంగతనం జరిగింది. విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హిందూపురం రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఆదేశాల మేరకు అనంతపురం, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పోలీసులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఐదు రాష్ట్రాలలో గాలింపు చేపట్టారు. ఈ కేసులో నిందితుడైన హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ పన్వార్ను గుర్గాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు కేజీల బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన పన్వార్.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో దేశంలో అనేక చోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో జైలుకు వెళ్లడం, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. గతంలో అనంతపురంలో జరిగిన బ్యాంకు దోపిడీ కేసులోనూ ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో 18 కేసులు ఉన్నాయి. ఐదేళ్లు జైలుకు కూడా వెళ్లాడు. కాగా..తూముకుంట బ్యాంకు దోపిడీ కేసులో రాజస్థాన్కు చెందిన ఇంకొక ముఠా సభ్యుడు పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుణ్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. రెండు కిలోల బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం -
భూ సమస్యపై యువకుడి నిరసన
చిలమత్తూరు: భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తే తహసీల్దార్ అందుబాటులో ఉండటం లేదని ఓ యువకుడు శనివారం ధర్నాకు దిగాడు. ఎన్నిసార్లు వచ్చినా ఖాళీ కుర్చీనే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. హిందూపురంలో పనిచేస్తున్న వెంకటేష్కు రెండోసారి చిలమత్తూరుకు ఎఫ్ఏసీ తహసీల్దార్గా బాధ్యతలు కేటాయించినా ఏనాడూ విధుల్లో కనిపించడం లేదన్నాడు. ఆర్థిక ఇబ్బందులున్న తాను భూమి విక్రయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో వివరాలు కనిపించడం లేదని, ఈ సమస్యను పరిష్కరించుకుందామని వస్తే అధికారి దొరకడం లేదన్నారు. తహసీల్దార్ వచ్చే వరకూ తాను కార్యాలయం నుంచి వెళ్లబోనని కొంతసేపు భీష్మించాడు. ఎంతకూ ఆయన రాకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. -
‘అన్నదాత పోరు’తో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
రొద్దం(పరిగి)/పెనుకొండ రూరల్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన తలపెట్టిన ‘అన్నదాత పోరు’కు రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ఈ మేరకు ఆమె శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో, రొద్దం మండలం చిన్నమంతూరులో ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కనీసం ఎరువులు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. గతేడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇప్పటికీ నయా పైసా ఆర్థికసాయం అందించలేదన్నారు. ఈ ఏడాది కూడా ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదన్నారు. ఆర్ఎస్కేల్లో యూరియా స్టాక్ లేదని, డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎండగట్టేందుకే ‘అన్నదాత పోరు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో సోమందేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు అశోక్ కుమార్, పార్టీ మండల కన్వీనర్ గజేంద్ర, ఉప సర్పంచ్ వేణు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జిలాన్ ఖాన్, నాయకులు మంజూనాథ్, ఇమామ్ వలి, రఫీక్ సాబ్, జితేంద్ర రెడ్డి, అభిషేక్రెడ్డి, ఆదినారాయణ, చిన్నమంతూరులో జరిగిన కార్యక్రమంలో రొద్దం ఎంపీపీ నాగమ్మ, నాయకులు రామచంద్రారెడ్డి, ఎన్.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, చెరుకూరి సర్పంచ్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో సర్కారు విఫలం ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
భర్త చేతిలో భార్య హతం
● అనుమానంతోనే ఘాతుకం గాండ్లపెంట: భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తూపల్లికి చెందిన కుటాగుళ్ల మన్సూర్ కదిరిలోని ఓ చికెన్ సెంటర్లో పని చేస్తున్నాడు. భార్య కుటాగుళ్ల మెహతాజ్ (28) శుక్రవారం ఇంట్లో చెప్పకుండా మదనపల్లికి వెళ్లింది. భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. తనకు చెప్పకుండా ఎందుకు ఊరికి వెళ్లావంటూ అదే రోజు రాత్రి భార్యతో మన్సూర్ గొడవపడ్డాడు. ఈ క్రమంలో రోకలిబండ తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో మెహతాజ్ అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా పన్నెండేళ్ల కుమారుడి ఎదుటే జరిగింది. శనివారం కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
ప్రతీకారంతోనే రౌడీషీటర్ హత్య
పుట్టపర్తి టౌన్: ధర్మవరం నడిబొడ్డున జరిగిన రౌడీషీటర్ లోకేంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రిని హత్య చేశాడన్న ప్రతీకారంతోనే బాలకృష్ణారెడ్డి తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రత్న శనివారం పుట్టపర్తిలోని పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ధర్మవరానికి చెందిన బాలకృష్ణారెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి బాడుగ విషయంలో రూ.10 తక్కువ ఇచ్చినందుకు అప్పట్లో ఆటోడ్రైవర్గా ఉన్న లోకేంద్ర దారుణంగా హత్య చేశాడు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న బాలకృష్ణారెడ్డి అదును కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ధర్మవరం పట్టణంలోని శ్రీనిధి మార్ట్ ముందు స్నేహితుడితో కలిసి బైక్లో కూర్చుని ఉండగా.. బాలకృష్ణారెడ్డి తన సహచరులు సయ్యద్ ఇలియాజ్, ఆంజనేయులుతో కలిసి కారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కిందపడిన లోకేంద్రపై బాలకృష్ణారెడ్డి, ఆంజనేయులు కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపి.. కారులో పరారయ్యారు. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. డీఎస్పీ హమంత్కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బాలకృష్ణారెడ్డి, సయ్యద్ ఇలియాజ్, ఆంజనేయులును నిందితులుగా గుర్తించి.. శనివారం కొత్తపేట సమీపంలో అరెస్ట్ చేశారు. వారినుంచి రెండు వేటకొడవళ్లు, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ధర్మవరం టూటౌన్ రెడ్డెప్పతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.అనుమానాస్పద మృతి హిందూపురం: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని ట్రాక్ వద్ద రహంతుల్లా (45) అనే పానీపూరి వ్యాపారి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భార్య సహారాబాను ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 24 గంటల్లోపు కేసు ఛేదింపు ముగ్గురు నిందితుల అరెస్ట్ -
యూరియా పంపిణీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు
ప్రశాంతి నిలయం: యూరియా పంపిణీలో అక్రమాలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సరఫరా, నిల్వలలో తేడాలు రాకూడదన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు. యూరియా సరఫరాలో లోటుపాట్లు తలెత్తకుండా అర్డీవోలు, వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రైతులకు సమయానుకూలంగా ఎరువుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఆ రోజుకు ఎంత సరఫరా అవుతుంది, ఎంతమందికి పంపిణీ చేస్తారనే వివరాలు ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు. ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్చార్జ్ అధికారి రామునాయక్, మార్క్ఫెడ్ డీఎం గీతా, డీసీఓ కృష్ణానాయక్, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
నాణ్యమైన వైద్య సేవలందించండి
హిందూపురం: రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. శనివారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రతి విభాగాన్నీ దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. రోగులకు తక్షణ, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిని తొలగించి.. కొత్తవారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవసరాన్ని బట్టి కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్ వద్ద కూడా డిస్ప్లే బోర్డులు, రోగులకు ఆస్పత్రిలో లభించే సదుపాయాల సమాచార బోర్డులు అందరికీ అర్థం అయ్యేలా ఉంచాలని చెప్పారు. బ్లడ్ బ్యాంక్లో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన అన్ని మందులూ ఉండేలా చూసుకోవాలన్నారు. ఓపీ కేంద్రాల వద్ద వీడియో డిస్ప్లే బోర్డులు, షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ పనులు సక్రమంగా పర్యవేక్షిస్తూ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ చీటీల విభాగం ప్రారంభం ఆస్పత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ చీటీల విభాగాన్ని కలెక్టర్ ప్రారంభించారు. హిందూపురం ఆస్పత్రిలో రోగుల రద్దీ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి ఆస్పత్రిలో అన్ని సదుపాయాలూ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, డాక్టర్లు, సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించి రోగులకు మెరుగైన సేవలందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, సూపరింటెండెంట్ సి.అన్నపూర్ణ, ఎన్టీఆర్ వైద్యసేవ అధికారి శ్రీదేవి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేడియం పనులు వేగవంతం హిందూపురంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో అసంపూర్తిగా ఉన్న ఇండోర్ షటిల్ స్టేడియం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. త్వరలో ప్రత్యేక నిధులతో స్టేడియం పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు విద్యాసాగర్, బాలాజీ, అన్నపూర్ణ, శ్రీనివాస్ నాయుడు, శ్రీదేవి, ప్రభుకుమార్, మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మందులు, రక్తం అందుబాటులో ఉంచండి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ చేతన్ -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
రత్నగిరి ఆర్ఎస్కే వద్ద రైతుల రద్దీ బీడుపల్లి ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం వేచివున్న రైతులుపుట్టపర్తి టౌన్: రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. బస్తా యూరియా దొరకడం కూడా గగనంగా మారింది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి రైతు సేవా కేంద్రంలో శనివారం యూరియా పంపిణీ చేపట్టారు. ఈ కేంద్రానికి 140 బస్తాల యూరియా మాత్రమే కేటాయించారు. గ్రామంలో రైతుల సంఖ్య 500 పైగా ఉంది. దీంతో రైతులు ఉదయం ఆరు గంటల నుంచి పడిగాపులు కాశారు. ఆర్ఎస్కే సిబ్బంది ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రారంభించారు. రైతుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్కరికి బస్తా మాత్రమే అందజేశారు. 135 మంది రైతులు మొదట పేర్లు నమోదు చేసుకోగా..వారికి మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. సర్వర్ నిదానంగా పనిచేయడంతో పంపిణీ మందకొడిగా సాగింది. రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి రైతు సేవా కేంద్రం వద్ద శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇది వరకే మల్లినమడుగు, దొడ్డేరి రైతు సేవా కేంద్రాలకు 120 బ్యాగుల చొప్పున సరఫరా అయిన యూరియా ప్రస్తుతం ఖాళీ అయింది. దీంతో రత్నగిరిలో పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. అక్కడ కూడా 120 బ్యాగుల యూరియా మాత్రమే ఉండగా.. వందల సంఖ్యలో రైతులు రావడంతో పంపిణీ చేసేందుకు ఆర్ఎస్కే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం బస్తా యూరియా ధర రూ.266.50 చొప్పున నిర్ణయించగా.. ఆర్ఎస్కే సిబ్బంది రూ.300 వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. -
కిక్కిరిసిన ఖాద్రీశుని ఆలయం
కదిరి టౌన్: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, కర్ణాటక నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇన్స్పైర్ మనాక్పై రేపటి నుంచి అవగాహన ప్రశాంతి నిలయం: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్పైర్ మనాక్, స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ఆన్లైన్ పోర్టల్లో నామినేషన్ల అప్లోడ్పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెనుకొండ డివిజన్ ఉపాధ్యాయులకు సోమవారం ఉదయం హిందూపురంలోని చిన్మయా విద్యాలయంలో, పుట్టపర్తి డివిజన్ వారికి సోమవారం మధ్యాహ్నం కొత్తచెరువు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం డివిజన్ ఉపాధ్యాయులకు మంగళవారం ఉదయం ధర్మవరం బాలుర ఉన్నత పాఠశాలలో, మధ్యాహ్నం కదిరి డివిజన్ ఉపాధ్యాయులకు కదిరి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఉన్నత, ప్రాథమికోన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం బోధించే ఒక్కొక్క ఉపాధ్యాయుడిని పంపించాలని ఆదేశించారు. రిజిస్టర్ చేసుకున్న అన్ని పాఠశాలల నుంచి సెప్టెంబర్ 15లోగా నామినేషన్లు సమర్పించాలని సూచించారు. ఘనంగా సత్యసాయి మీడియా సెంటర్ వార్షికోత్సవం ప్రశాంతి నిలయం: సత్యసాయి మీడియా సెంటర్ 24వ వార్షికోత్సవం శనివారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి చెంత ఘనంగా జరిగింది. ఉదయం వేడుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి కిడ్ వరల్డ్ చానెల్కు చెందిన చిన్నారులు ‘గణేష్ మహిమ’ పేరుతో అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చారు. సత్యసాయి మీడియా సెంటర్ సాధించిన ఘట్టాలతో కూడిన పుస్తకాన్ని ఆర్జే రత్నాకర్తో పాటు ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, మీడియా సెంటర్ డైరెక్టర్ సుందర్ స్వామినాథన్ ఆవిష్కరించారు. సాయంత్రం మీడియా సెంటర్ సభ్యులు ప్రశాంతి వాహిని పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. -
‘ఉపాధి’ కూలీల వేతన వెతలు
సాక్షి, పుట్టపర్తి/ఎన్పీకుంట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు వేతనాలు అందడం లేదు. మూడు నెలలుగా జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు సంబంధించి సుమారు రూ.77.47 కోట్ల వేతన బకాయిలు రావాల్సి ఉంది. వేతనాలు సకాలంలో రాకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో సుమారు 3.83 లక్షల మంది కూలీలు ఉండగా.. వీరిలో 80 వేల మంది దాకా పనుల్లో పాల్గొని, మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. చివరగా ఈ ఏడాది మే 28న వేతనం జమ అయ్యింది. తగ్గిపోయిన హాజరు సకాలంలో వేతనాలు రాకపోవడంతో ‘ఉపాధి’ పనులకు కూలీల హాజరు పూర్తిగా తగ్గిపోయింది. నాలుగైదు రోజులుగా జరిగిన పనులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రోజువారీగా జిల్లాలో కనీసం రెండు వేల మంది కూడా పనుల్లో పాల్గొనడం లేదు. ఈ నెల మూడో తేదీన 1,997 మంది మాత్రమే హాజరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులను అడిగితే నిధులు రాగానే జమ చేస్తామంటున్నారని, ఎప్పుడొస్తాయో చెప్పడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధిలేక చాలామంది కూలీలు బతుకుదెరువు కోసం బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది లేకుండా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉపాధి కూలీలకు ఎప్పటికప్పుడు వేతనాలు జమ అయ్యేవి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాగానే.. కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధి పనులను గాలికొదిలేసింది. పైగా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో పనులపై ఆసక్తి పోయిందని కూలీలు చెబుతున్నారు. మూడు నెలలుగా జమ కాని కూలి డబ్బు పనులపై కొరవడిన ఆసక్తి రెండు వేలకు మించని హాజరుజిల్లాలో... జాబ్కార్డులు – 2.17 లక్షలు మొత్తం కూలీలు – 3.83 లక్షలు పనుల్లో పాల్గొన్న కూలీలు – 80 వేలు వేతన బకాయిలు – రూ.77.47 కోట్లు -
వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ విజయశ్రీ
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల 17వ ప్రిన్సిపాల్గా డాక్టర్ విజయశ్రీ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పెథాలజీ విభాగాధిపతిగా ఉన్న ఆమెను అనంతపురం వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా పలువురిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. జిల్లాకు చెందిన చౌళూరు మధుమతిరెడ్డికి మడకశిర, పెనుకొండ అసెంబ్లీ స్థానాలు, అనంతపురం జిల్లాకు చెందిన నిట్టూరు రఘునాథ్ రెడ్డికి కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాలు, నార్పల సత్యనారాయణ రెడ్డికి రాప్తాడు అసెంబ్లీ, కే.రమేష్రెడ్డికి ధర్మవరం అసెంబ్లీ, ఫయాజ్ బాషాకు హిందూపురం అసెంబ్లీ స్థానం కేటాయించింది. ● వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నారు. -
యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం
మడకశిర: రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూరియా కొరతకు ప్రభుత్వ చేతకాని తనమే కారణమని మండిపడ్డారు. కేంద్రం నుంచి డిమాండ్ మేరకు రాష్ట్రానికి యూరియాను తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. యూరియా సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోని చేతకాని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ రైతులకు ఆర్బీకేలు, పీఏసీఎస్ల ద్వారా పూర్తి స్థాయిలో యూరియాను అందించారని గుర్తు చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించారని తెలిపారు. ఉచిత పంటల బీమా, రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు సకాలంలో అందించి రైతులను వైఎస్ జగన్ ఆదుకున్నారని పేర్కొన్నారు. ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ, సున్నావడ్డీ పథకాలను రద్దు చేసి రైతులను నిండా ముంచారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులకు 41ఏ నోటీసులుచెన్నేకొత్తపల్లి: రాప్తాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు, వెంకటేష్కు చెన్నేకొత్తపల్లి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరు గత నెలలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీకి చెందిన ఫణీంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురినీ ఎస్ఐ సత్యనారాయణ శనివారం స్టేషన్కు పిలిపించి, 41ఏ నోటీసులు అందజేశారు. -
ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు
బత్తలపల్లి: వలంటీర్ చేసే పనులు చేయిస్తూ తమ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి బత్తలపల్లిలో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ నరసింహనాయుడుకు వినతిపత్రం అందజేశారు. తమకు కేటాయిస్తున్న వలంటీర్ విధులను బహిష్కరిస్తున్నామన్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ ఆత్మగౌరవం దెబ్బతీసేలా చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండలంలోని 11 గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. పుట్టపర్తి టౌన్: ప్రభుత్వం సచివాలయం ఉద్యోగులను హీనంగా చూడటం బాధాకరమని మున్సిపాలిటీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సరేంద్రరెడ్డి పేర్కొన్నారు. వలంటీర్ల విధులను ఉద్యోగులతో చేయించచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు మోహన్, నరసింహ, లావణ్య, కవిత, రామకృష్ణ, రఫీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.9న ఎకాలజీలో ‘ఫార్మా’ అడ్మిషన్ మేళాఅనంతపురం అగ్రికల్చర్: ఫార్మా రంగంలో శిక్షణ, ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 9న అనంతపురం ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో అడ్మిషన్, ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న యువతీ యువకులకు స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి సదుపాయం ఉంటుందన్నారు. 2023, 2024, 2025లో బీఎస్సీ లేదా ఎంఎస్సీ (బీజెడ్సీ) కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలెక్ట్రానిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, బీ–ఫార్మా లేదా డీ ఫార్మా లేదా ఎం ఫార్మా, బీఎస్సీ లేదా ఎంఎస్సీ (మైక్రోబయాలజీ), బీఈ లేదా బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9న బయోడేటాతో మేళాకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ కార్యాలయం లేదా 81217 17846 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం పెనుకొండ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కియా ఏరియా స్టేషన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మునిమడుగు పంచాయతీ చిన్నపరెడ్డిపల్లికి చెందిన మారుతి (28) అమ్మవారిపల్లికి చెందిన రామాంజి అనే యువకుడితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం శుక్రవారం ద్విచక్రవాహనంపై రాంపురం వెళ్లారు. అక్కడ పని చూసుకుని తిరుగుపయనమయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో పెనుకొండలోని 44వ జాతీయ రహదారిపై కొత్తచెరువు రోడ్డు మలుపు వద్ద రోడ్డు దాటే సమయంలో బెంగళూరు నుంచి తాడిపత్రికి వెళ్తున్న ఫార్చూనర్ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామాంజిని 108 వాహనం ద్వారా హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. మారుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కియా స్టేషన్ ఎస్ఐ రాజేష్ తెలిపారు. అంజినప్పకు ‘బళ్లారి రాఘవ’ పురస్కారం బత్తలపల్లి: తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, కళాభిషేకం నిర్వాహకులైన శేషయ్యగారిపల్లి అంజినప్ప ప్రతిష్టాత్మక బళ్లారి రాఘవ జాతీయ పురస్కారం అందుకున్నారు. శనివారం బళ్లారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ వారు బళ్లారిలోని బీపీఎస్సీ కళాశాల శరవణ ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కళాప్రపూర్ణ బళ్లారి రాఘవ జాతీయ పురస్కారాన్ని బళ్లారి రాఘవ మనవడైన రఘురామ్, అనంతపురం డిప్యూటీ కలెక్టర్ రఘునాథ్ చేతుల మీదుగా అంజినప్ప అందుకున్నారు. అవార్డుతో పాటు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కారం అందుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు శీలా బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి యశ్వంత్రాజ్, కోశాధికారి మల్లేసు, కార్యవర్గ సభ్యులు తదితరులు అంజినప్ప కళాసేవలను కొనియాడారు. బంగారు గొలుసు అపహరణ ధర్మవరం రూరల్: ఆరుబయట పడుకున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. నిమ్మలకుంట గ్రామంలో లలితమ్మ తన భర్త కుళ్లాయప్పతో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై నిద్రిస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు వచ్చి లలితమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు (మంగళసూత్రం) లాక్కెళ్లారు. బాధితురాలు లేచి గట్టిగా అరిచేలోపు దుండగులు చీకట్లో కనిపించకుండా పారిపోయారు. -
ఆయతపల్లిలో విషాదం
రాయదుర్గం టౌన్: మండలంలోని ఆయతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గణపతి నిమజ్జనం కోసం నీటి కుంటలో దిగిన ఓ బాలుడు బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికి చెందిన మల్లయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్ (9) చిన్నప్పటి నుంచి రాయదుర్గం మండలం ఆయతపల్లిలోని అవ్వతాతల వద్ద ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న మనోజ్ శుక్రవారం మరో ఇద్దరు స్నేహితులతో కలసి మట్టితో ఓ చిన్నగణపతిని చేశాడు. అనంతరం వారికి తోచిన విధంగా పూజలు చేసి సరదాగా ఆడుకుంటూ పాఠశాల వెనుక ఉన్న కుంటలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. గణపతి బొమ్మను తీసుకుని కుంటలోకి దిగిన మనోజ్ బురదలో కూరుకు పోతుండగా.. గమనించిన తోటి స్నేహితులు పరుగున గ్రామంలోకి వెళ్లి బంధువులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని బాలుడిని వెలికి తీసి రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నీటి కుంటలో దిగి 4వ తరగతి విద్యార్థి మృతి సరదాగా స్నేహితులతో కలిసి ఓ చిన్న గణపతిని నిమజ్జనం చేస్తుండగా ఘటన -
విత్తన సొమ్ము పక్కదారి!
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ సీడ్స్కు చెల్లించాల్సిన విత్తనం సొమ్మును ఆర్ఎస్కే అసిస్టెంట్లు కొందరు సొంతానికి వాడుకున్నారు. పంపిణీ చేసిన రోజు లేదా మరుసటి రోజే ఏపీ సీడ్స్ ఖాతాకు జమ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము కాస్త పక్కదారి పట్టింది. రూ.77 లక్షలు బాకీ ఖరీఫ్లో ఏపీ సీడ్స్ ద్వారా 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ, విత్తన వరి, 50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్ సీడ్) రైతులకు పంపిణీ చేశారు. రాయితీ పోనూ రైతులు తమ వాటాగా (నాన్సబ్సిడీ) ఆర్ఎస్కే అసిస్టెంట్లకు రూ.26,93,71,674 చెల్లించారు. ఇందులో ఇప్పటి వరకూ ఏపీ సీడ్స్కు 26.61 కోట్లు చెల్లించినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరో రూ.32.54 లక్షలకు పైగా సొమ్ము ఏమైందో అంతుచిక్కడం లేదు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో రూ.35,55,61,081 విలువ చేసే రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. అందులో ఏపీ సీడ్స్కు రూ.35.11 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.44.21 లక్షలకు లెక్క తేలాల్సి ఉంది. విత్తన పంపిణీ ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.77 లక్షల వరకు ఏపీ సీడ్స్కు బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి ఆర్ఎస్కే ద్వారా రూ.8.11 లక్షలు, వెస్ట్కోడిపల్లి ఆర్ఎస్కే నుంచి రూ.3.69 లక్షలు, ఉరవకొండ మండలం వెలిగొండ ఆర్ఎస్కే నుంచి రూ.3.05 లక్షలు, కుందుర్పి మండలం అపిలేపల్లి ఆర్ఎస్కే నుంచి రూ.2.04 లక్షలు, గుమ్మఘట్ట మండలం కలుగోడు ఆర్ఎస్కే నుంచి రూ.1.82 లక్షలు, కుందుర్పి మండలం బెస్తరపల్లి ఆర్ఎస్కే నుంచి రూ.1.24 లక్షలు... ఇలా ఏపీ సీడ్స్ సొమ్మును తమ సొంతానికి ఆర్ఎస్కే అసిస్టెంట్లు వాడుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఓడీసీ మండలం తంగేడుకుంట, మడకశిర మండలం ఎర్రబొమ్మనహళ్లి, రామగిరి మండలం కుంటిమద్ది, తాడిమర్రి మండలం పెదకోట్ల, గాండ్లపెంట మండలం గొడ్డువెలగల, ఎన్పీ కుంట మండలం ఎదురుదొన, నల్లమాడ మండలం దొన్నికోట–2, అమరాపురం మండలం మద్దనకుంట ఆర్ఎస్కేల నుంచి రూ.లక్షల బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్న ఆర్ఎస్కే అసిస్టెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీడ్స్కు చెల్లించని ఆర్ఎస్కే అసిస్టెంట్లు ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన రూ.77 లక్షల బకాయిలు ఉదాసీనంగా వ్యవవహరిస్తున్న వ్యవసాయాధికారులు -
మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
పుట్టపర్తి టౌన్: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 12వ పీఆర్సీ అమలు చేసి కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగభూషణ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆ సంఘం 3వ జిల్లా మహాసభలు జరిగాయి. స్థానిక మున్సిపల్ యూనియన్ అఽధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, నరసింహులు, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేబర్ కోడ్ పేరుతో చట్టాలను కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మికులకు 12 గంటల పని వేళలు పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరంచారు. కార్యక్రమంలో నాయకులు పైపల్లి గంగాధర్, నాగార్జున, నరసింహులు, రామయ్య, కేశవ, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగభూషణ -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బత్తలపల్లి/ ముదిగుబ్బ: బత్తలపల్లి మండల పరిధిలోని ముదిగుబ్బ – చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన జిల్లేడుబండ నది ఆర్ఓబీపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. శరీరం ఛిద్రమైంది. 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు, మెరూన్ రంగు టీ షర్టు, నీలం... ఎరుపు రంగు గళ్ల లుంగీ ధరించాడు. ఇంతకు మించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 89786 56463, 99513 25345కు సమాచారం అందించాలని కోరారు. తాగుడుకు డబ్బివ్వలేదని.. రాప్తాడు: తాగుడుకు డబ్బు ఇవ్వలేదంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం యర్రగుంటకు చెందిన ఉప్పర గౌతమికి రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి కోడిగ సంజీవయ్య (31)తో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంటలోనే కాపురం ఉంటున్నారు. అదే గ్రామంలో ఐసీఆర్పీ సంస్థలో గౌతమి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మద్యానికి బానిసైన సంజీవయ్య ఎలాంటి పనిపాటా చేయకుండా జులాయిగా మారాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని మద్యం మత్తులో తరచూ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. తాగేందుకు డబ్బు ఇవ్వాలని కొట్టేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి నచ్చచెప్పినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 4న తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో గడ్డి మందు తాగి బాత్రూమ్లో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక గురువారం రాత్రి సంజీవయ్య మృతి చెందాడు. గౌతమి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో.. నల్లమాడ వాసి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు నల్లమాడ: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కడతాల్ బస్టాప్ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో నల్లమాడ మండల వాసి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన మేరకు... నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన జె.రంగస్వామి నాయుడు (57) కొంతకాలంగా తెలంగాణ ప్రాంతంలో మామిడి, జామ తోటల ఫలసాయం కొనుగోలు చేస్తూ పండ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారం రోజుల క్రితం స్వగ్రామంలో కుమారుడు హరినాయుడు వివాహం జరిపించాడు. పెళ్లి తంతు ముగించుకుని గురువారం రాత్రి రైలులో తన భార్య ఆదిలక్ష్మి, సహాయకుడు నరసపు కిష్టప్పతో కలసి హైదరాబాద్కు బయల్దేరిన రంగస్వామి నాయుడు శుక్రవారం తెల్లవారుజామున కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అనంతరం తాము నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లేందుకు రంగారెడ్డి జిల్లా కడతాల్ బస్టాప్కు చేరుకుని బస్ కోసం వేచి ఉండగా... హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన దూసుకొచ్చిన కారు ముగ్గురినీ ఢీకొంది. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆదిలక్ష్మి, కిష్టప్పను ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ గుర్తించి ఆస్పత్రికి తరలించాడు. రోడ్డుకు దూరంగా ఎగిరి పడిన రంగస్వామినాయుడుని గుర్తించలేకపోయాడు. విషయం తెలుసుకున్న అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్న నల్లమాడ మండల వాసులు వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని రోడ్డుకు కొంత దూరంలో పడి ఉన్న రంగస్వామినాయుడును గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక మృతి చెందాడు. కిష్టప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదిలక్ష్మికి రెండు కాళ్లు దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం రంగస్వామి నాయుడు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
పుట్టపర్తి టౌన్: ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర అంగన్వాడీ వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అధ్యక్షతన 8వ జిల్లా మహాసభలు జరిగాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, జిల్లా శ్రామిక సంఘం అధ్యక్షురాలు దిల్షాద్, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శకుంతల, కార్యదర్శి రమాదేవి పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. ఇతర పనులు కేటాయించరాదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. డిమాండ్ల సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా పి. శ్రీదేవి, కోఽశాధికారిగా రంగమ్మ, ఉపాధ్యక్షురాలుగా దిల్షాద్, మహదేవమ్మ, మరో 34 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అంగన్వాడీ వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ -
గురువులకు అవమానం
గురుపూజోత్సవం రోజున జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను అవమానించారు. కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై న వారు, వారి కుటుంబీకులు, స్నేహితులు తరలిరాగా కనీసం కుర్చీలు కూడా వేయలేదు. దీంతో వారంతా సుమారు 3 గంటల పాటు చెట్లకిందే నిలబడ్డారు. కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్ష మంజూరు చేసినా విద్యాశాఖ అధికారులు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులే 50 మందికి భోజనాలు, బొకేలు, పూలహారాలు సమకూర్చడం విశేషం. ప్రజాప్రతినిధులకు పిలుపులేదు.. జిల్లా స్థాయి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులనూ ఆహ్వానించలేదు. స్థానిక ఎంపీపీ రమణారెడ్డిని, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, ఎంపీటీసీ మధురిమలను విద్యాశాఖ ఆహ్వానించలేదు. కనీసం ఆహ్వాన పత్రికలో కూడా వారి పేర్లు ముద్రించలేదు. ఇటీవల నియామకమైన కార్పొరేషన్ డైరెక్టర్లు, టీడీపీ నాయకులను పిలిచి ప్రజాప్రతినిధులను అవమానించారు. -
తిరుఓనం.. భక్తజన సంద్రం
ప్రశాంతి నిలయం: ఆధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయంలో కేరళ సంస్కృతి ఉట్టిపటింది. రెండు రోజులుగా సాగుతున్న ఓనం వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు వేలాది మంది కేరళీయులు వేడుకల్లో పాల్గొన్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలు చాటుతూ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిగీతాలు ఆలపిస్తూ వేడుకలు నిర్వహించుకున్నారు. సాయంత్రం కేరళకు చెందిన సత్యసాయి యూత్, బాలవికాస్ చిన్నారులు ‘పరిత్రానాయ భక్తానాం’ పేరుతో సంగీత నృత్యరూపకం నిర్వహించారు. కవయిత్రి జనాభాయి జీవిత చరిత్ర గురించి చక్కగా వివరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
గురువులే మార్గనిర్దేశకులు
పుట్టపర్తి అర్బన్: నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే మార్గనిర్దేశకులని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్లో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. డీఈఓ కిష్టప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ.. ఎవరు ఏ రంగంలో.. ఏ స్థాయికి వెళ్లినా దాని వెనుక గురువుల కృషి ఉంటుందన్నారు. తరగతి గదిలోనే వారు జాతి నిర్మాణానికి పునాదులు వేస్తారన్నారు. అందుకే గురువును దైవంతో సమానంగా చూస్తామన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ గురుతర బాధ్యతను గుర్తించి పనిచేయాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకుని పిల్లలను గొప్ప విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం 71 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ దేవరాజ్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు గంగాద్రి, శ్రీనివాసులు, బూక్యా కాలేనాయక్, సోమ్లా నాయక్ తదితరులు ఉన్నారు. గురుపూజోత్సవంలో జేసీ అభిషేక్ కుమార్ 71 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం -
●శాంతిమార్గం.. ఆధ్యాత్మిక సౌరభం
మహమ్మద్ ప్రవక్త భువిపై వెలసిన రోజుకు గుర్తుగా ముస్లింలు జరుపుకునే మిలాద్–ఉన్ – నబీ వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర తదితర పట్టణాల్లో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు జరిగాయి. మక్కా, మదీనాల నమూనాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ముస్లిం యువత జెండాలతో నినాదాలతో చేస్తూ ముందుకు సాగారు. మత పెద్దలు మిలాద్ ఉన్ నబీ పర్వదిన విశిష్టతను వివరించారు. శాంతి ర్యాలీలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. – సాక్షి బృందం -
తనిఖీల భయం... ఎరువుల దుకాణాలకు మూత
ధర్మవరం రూరల్: తనిఖీ చేయడానికి విజిలెన్స్ అధికారులు వస్తున్న సమాచారంతో ధర్మవరం పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం నిర్వాహకులు మూతేశారు. తనిఖీ అధికారుల్లోని కింద స్థాయి సిబ్బంది ముందుగా సమాచారం ఇవ్వడంతో అందరూ జాగ్రత పడ్డారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులు మూత పడిన దుకాణాలను చూసి గంటల తరబడి ఎదురు చూశారు. అసలే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కనీసం కాంప్లెక్స్ ఎరువులైన తీసుకెళ్లదామని వస్తే దుకాణాలు మూతేయడంతో అసహనానికి గురయ్యారు. దుకాణాల్లో అక్రమ నిల్వలు, నకిలీ మందులు లేకుంటే ఎందుకు మూతేస్తారని, నిజాయితీగా వ్యాపారం సాగించకుండా ఇంత కాలం మోసగిస్తూ వచ్చారంటూ మండిపడ్డారు. జాతీయ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన ధర్మవరం: చేనేత డిజైన్ డెవలప్మెంట్లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న ధర్మవరం పట్టణానికి చెందిన జుజారె నాగరాజును కలెక్టర్ టీఎస్ చేతన్ గురువారం తన చాంబర్లో అభినందించారు. అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం అందజేసిన తామ్ర పత్రం, సర్టిఫికెట్లను పరిశీలించారు. కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడీ రామకృష్ణ, ఏపీసీఓ మేనేజర్ సుబ్బరావు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాల ఢీ.. ● వ్యక్తి మృతి కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల వద్ద గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముదిగుబ్బ మండలం నాగులగుబ్బ గ్రామానికి చెందిన రామాంజనేయులు(40) మృతి చెందాడు. ఈ మేరకు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. గాండ్లపెంటలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా స్థానిక పులివెందుల క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. తలకు రక్తగాయాలైన రామాంజనేయులును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు రమణప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు, కదిరికి చెందిన పౌజన్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ–క్రాప్ ఆధారంగానే యూరియా
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఈ–క్రాప్ నమోదు ఆధారంగా టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఎంత మేరకు పంటలు సాగు చేశారు. పంటల జాబితా , వాటికి అవసరమయ్యే యూరియా మోతాదును డివిజన్, మండల, రైతు సేవా కేంద్రాల వారీగా నమోదు చేయాలన్నారు. పంటలు సాగు చేసి యూరియా అవసరమున్న రైతులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. డివిజనల్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల వివరాల ఆధారంగా ఎరువుల పంపిణీపై సమీక్ష చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, మార్క్ఫెడ్ నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ రైతు సేవా కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వల్లో తేడాలుంటే వెంటనే కేసులను నమోదు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. జిల్లాలో యూరియా సరఫరాపై పర్యవేక్షణకు పుట్టపర్తిలోని జిల్లా ట్రైనింగ్ సెంటర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెల్ 9177768274, 9948224545 నంబర్లను సంప్రదించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి రాము నాయక్, మార్క్ఫెడ్ డీఎం గీతా, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
కర్ణాటక సరిహద్దున దారుణ హత్య
ఓడీచెరువు (అమడగూరు): కర్ణాటక సరిహదులోని అమడగూరు మండలం ఆకులోల్లపల్లి సమీపంలో కర్ణాటకలోని బిల్లూరు పంచాయతీ దేవరంక గ్రామానికి ముత్తప్ప (47) దారుణ హత్యకు గురయ్యాడు. సమీప బందువులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని చింతామణికి చెందిన శ్రీనివాసరెడ్డి, దేవరంక గ్రామానికి చెందిన ముత్తప్ప రెండేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 12 ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో లలరోజూ సొంతూరు నుంచి కూలీలను తీసుకెళ్లి పనులు చేయించేవారు. బుధవారం సాయంత్రం టమాటలు లోడ్ చేయించి మార్కెట్కు తరలించిన అనంతరం ముత్తప్ప స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అమడగూరు మండలం ఆకులోల్లపల్లి సమీపంలో వంకలోకి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే హతమయ్యాడు. సమాచారం అందుకున్న పుట్టపర్తి డీఎస్పి విజయ్కుమార్, నల్లమాడ సీఐ నరేంద్రరెడ్డి, ఓడీచెరువు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, డాగ్ స్క్వాడ్, ఫోర్సెనిక్ నిపుణులు గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలపై 2 కత్తిపోట్లు, గొంతు ఎడమ వైపు బలమైన గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ బడిలో చేరేలా...
కదిరి అర్బన్: గతంలో కదిరి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయురాలు లావణ్య తనదైన శైలిలో విద్యాబోధన సాగిస్తూ 54 మంది ఉన్న ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 184కు చేరేలా చేశారు. విద్యా ఉపకరణాలను తన సొంత డబ్బుతో కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేస్తూ వారిని చదువులపై దృష్టి సారించేలా చేశారు. ఈ క్రమంలో పాఠశాల వేళలు ముగిసిన తర్వాత ఇళ్ల వద్ద సాయంత్రం విద్యార్థులు చదువుకుంటుండడం గమనించిన ధనవంతులు సైతం ఆకర్షితులై తమ పిల్లలను అదే పాఠశాలలో చేర్పిస్తూ వచ్చారు. ఆమె సేవలకు గుర్తుగా 2017లో బెస్ట్ టీచర్ అవార్డును రోటరీ క్లబ్ ప్రదానం చేసింది. 2024లో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును ఎస్టీయూ అందజేసింది. ప్రస్తుతం సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మూర్తిపల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. -
యూరియా కొరతపై అన్నదాతల ఆగ్రహం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తి మండలం గాజులపల్లి చెరువు కింద వరి సాగు చేసే రైతులు, నిడిమామిడి పంచాయతీ రైతులు సుమారు 300 మందికి కేవలం 140 బస్తాలే సరఫరా చేయడంతో యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు నెల రోజుల నుంచి యూరియా లేక అల్లాడిపోతున్న రైతులకు ప్రభుత్వం నిడిమామిడి ఆర్ఎస్కేకు కేవలం 140 బస్తాలు సరఫరా చేయడంతో రెండు గంటల్లో స్టాక్ అయిపోయింది. తక్కిన రైతులు ఉసూరుమంటూ ప్రభుత్వంపై, వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగు ముఖం పట్టారు. చేతగాని ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. పక్కనే మరో మూడు పంచాయతీలు కొట్లపల్లి, ఇరగరాజుపల్లి, రాచువారిపల్లి ఉన్నాయి. సుమారు 1000 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వీరికి మొదటిసారి కేవలం 140 బస్తాలు యూరియా రావడంతో రైతులంతా ఉదయం నుంచే వేచి ఉన్నారు. యూరియా పంపిణీ ప్రారంభమైన కొద్ది సేపటికే స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా కోసం ఆందోళన చేశారు. మూకుమ్మడిగా ఆర్ఎస్కేలోకి చొచ్చుకెల్లినా ఫలితం లేకపోయింది. 300 మంది 140 బస్తాలు ఎలా సరిపోతాయని నిలదీత -
తిరుగులేని విజయాలు
ధర్మవరం అర్బన్: ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సంజయ్నగర్లోనున్న బీఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్ తీర్చిదిద్దారు. ఆయన కృషి ఫలితంగా ఏటా పదో తరగతి ఫలితాల్లో బీఎస్ఆర్ విద్యార్థులు టౌన్ఫస్ట్గా నిలుస్తూ వస్తున్నారు. ఇలా ఒకటి రెండు సారు కాదు.. ఇప్పటి వరకూ వరుసగా ఐదు పర్యాయాలు ఈ పాఠశాల విద్యార్థులే టౌన్ ఫస్ట్గా నిలిచారు. అంతేకాక చదువు మానేసిన వారి ఇళ్లకు వెళ్లి పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులకు సర్దిచెప్పి మరీ పాఠశాలలో చేర్పించేవారు. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు రాత్రి పూట చదువుకుంటున్నారా లేదా అని వారి ఇళ్లకు వెళ్లి మరీ పరిశీలించేవారు. ఆయన కృషి ఫలితంగా బీఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడేవారు. దీంతో తమ పాఠశాలలో సీట్లు లేవు అని బోర్డు తగిలించాల్సి వచ్చేది. ప్రస్తుతం హెచ్ఎం రాంప్రసాద్ కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. -
సొసైటీలను తనిఖీ చేసిన కలెక్టర్
పుట్టపర్తి అర్బన్: యూరియా కొరత అధికం కావడంతో కలెక్టర్ చేతన్ పలు మండలాల్లోని సొసైటీలను తనిఖీ చేశారు. బుక్కపట్నం మండలం గూనిపల్లి, కొత్తచెరువు మండలం కేశాపురం, సోమందేపల్లి లోని సొసైటీలను తనిఖీ చేసి యూరియా స్టాక్పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరి సాగుకు అధిక నీటితో పాటు యూరియా అవసరం ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. చిరుధాన్యాల సాగు, పండ్ల తోటలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను, సేంద్రియ ఎరువులను వినియోగించడంలో ముందుండాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే వివిధ ప్రయోజనాలను ,సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్, డీసీఓ కృష్ణానాయక్, ఏఓ నటరాజ్, తహసీల్దార్ నరసింహులు, సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు నేడు అవార్డుల ప్రదానం పుట్టపర్తి అర్బన్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరచడంతో పాటు పాఠశాలను అభివృద్ధి చేసి సమసమాజస్థాపనకు కృషి చేసిన జిల్లాలోని 71 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయనున్నారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న 156 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏఓలు ఉమాదేవి (జెడ్పీ–అనంతపురం), జి.శ్రీనివాసులు (బత్తలపల్లి), జయరాములు(వజ్రకరూరు) ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ నుంచి శకుంతల (నల్లచెరువు), మాధవి(డీపీఆర్సీ–అనంతపురం), ఆనంద్(రాప్తాడు), కమలాబాయ్(పెనుకొండ) ఉన్నారు. 8 నుంచి శిక్షణ తరగతులు.. ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన వారికి ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ గురువారం రాత్రి తెలిపారు. ఈ మేరకు వారందరికీ సమాచారం ఇచ్చామని వివరించారు. ఏడు రోజుల పోలీసు కస్టడీకి నిందితులు కదిరి అర్బన్: మండలంలోని కొండమనాయునిపాళెం సమీపంలో గత నెల 22న గంజాయిని అక్రమ తరలిస్తూ పట్టుబడిన అజాజ్, షోయబ్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని, నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్పై అనంతపురం ఎన్డీపీఎస్ కోర్టు జడ్జి స్పందిస్తూ ఏడు రోజుల కస్టడీకి అనుమతించారు. ఈ మేరకు కదిరి రూరల్ అప్గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. రిమాండ్కు నిందితులు..: కదిరి మండలం పట్నం గ్రామంలో ఈ నెల 1న జరిగిన హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న సూర్యనారాయణ, అతని కుమారులు అరవిందు, నవీన్అశోక్, భార్య రమణమ్మ, కుమార్తె కీర్తనను అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి కొడవలి, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకుని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. -
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
బత్తలపల్లి: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం ఆర్డీఓ మహేష్ ఎరువుల దుకాణాదారులను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోని ఎరువుల దుకాణాల్లో తహసీల్దార్ స్వర్ణలత, వ్యవసాయాధికారి ఓబిరెడ్డితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మన గ్రోమోర్, మంజునాథ్ ఎరువుల దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్, స్టాక్ను తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం బత్తలపల్లి మండలంలో రైతులకు 13 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. కావాల్సిన రైతులకు రెండు బ్యాగులు చొప్పున విక్రయించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో రైతు సేవా కేంద్రాలకు కూడా యూరియా సరఫరా అవుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏపీఐఐసీతో భూమి కొనుగోలు ఒప్పందం ప్రశాంతి నిలయం: ఆగ్నేయస్తా యూనిజెర్టిక్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తమ పారిశ్రామిక అవసరాల కోసం మడకశిర మండలం ఆర్.అనంతపురం, గౌడెనహళ్లి గ్రామాలలో ఏపీఐఐసీతో భూమి కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. భూమి పొజిషన్ పొందిన వెంటనే పరిశ్రమల ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులకు రిమాండ్ బుక్కరాయసముద్రం: మైనర్ బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పుల్లయ్య తెలిపారు. బీకేఎస్ మండలం కొట్టాలపల్లిలో ఓ బాలుడు 2022, ఏప్రిల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పాత కేసులు త్వరగా పూర్తి చేయాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు.. బాలుడు ఆత్మహత్య కేసులో లోతైన విచారణ అనంతరం నలుగురు యువకులను అరెస్ట్ చేసి గురువారం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. టీ తాగి వచ్చే లోపు నగదు అపహరణ రాయదుర్గం టౌన్: స్థానిక లక్ష్మీబజార్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సమీపంలోని ఓ టీ కొట్టు వద్ద నిలిపిన ద్విచక్రవాహనం సైడ్ బ్యాగ్లోని నగదును దుండగుడు అపహరించుకెళ్లాడు. వివరాలు.. గుమ్మఘట్ట మండలం జె.వెంకటంపల్లికి చెందిన వడ్డే కుళ్లాయప్ప వ్యక్తిగత అవసరాల నిమిత్తం గురువారం మధ్యాహ్నం ముత్తూట్ ఫైనాన్స్లో బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.70 లక్షలు నగదు తీసుకున్నాడు. అనంతరం నగదును తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగ్లో ఉంచుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన ఆయన లక్ష్మీబజార్లోని టీ కొట్టు వద్ద ఆపి టీ తాగి వచ్చేలోపు నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
తాగుడు మానేయాలంటూ భర్తపై దాడి
ఉరవకొండ రూరల్: పదేపదే ప్రాధేయపడిన తాగుడు మానేయకపోవడంతో అసహనానికి లోనైన వివాహిత తన భర్తపై కట్టెతో దాడి చేసింది. వివరాలు.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన ఓబులేసు, ఉలిగమ్మ దంపతులు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భర్త తాగుడుకు బానిసై కూలి పనులు చేయకుండా నిత్యమూ మద్యం మత్తులో జోగేవాడు. తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవ పడేవాడు. తాగుడు మానాలని భార్య పలుమార్లు ప్రాధేయపడింది. అయినా ఓబులేసులో మార్పు రాలేదు. గురువారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఓబులేసును మరోసారి భార్య మందలించింది. తాగుడు మానేసి బుద్ధిగా తనతో పాటు కూలి పనులకు రావాలని హితవు పలికింది. ఆమె మాటలతో ఏకీభవించని ఓబులేసు వాగ్వాదానికి దిగాడు. దీంతో అసహనానికి గురైన ఉలిగమ్మ చేతికి అందుబాటులో ఉన్న కట్టె తీసుకుని భర్తపై దాడి చేసింది. అనంతరం స్థానికులతో కలసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జై బోలో గణేశ్ మహరాజ్కీ జై .. గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో హిందూపురం వీధులన్నీ ప్రతిధ్వనించాయి. ఎటు చూసినా భక్తుల కోలాహలం... తప్పెట వాద్యాలు.. చెక్క భజనలు, బ్యాండు మేళాలు, భక్తి గీతాలాపనలు, యువకుల ఈలలు , కేరింతలే. చవితి రోజున కొలువుదీర
హిందూపురం: బొజ్జ గణపతి.. సకల విద్యల విఘ్నేశ్వరుడు.. శివపార్వతుల ముద్దుల తనయుడు... ఆదిపూజలస్వామి... ఏకదంతుడైన వినాయకుడి నిమజ్జనం గురువారం హిందూపురం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలో కొలువు దీరిన 138 వినాయక విగ్రహాలను గుడ్డం కోనేరులో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే.. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే గణేశ్ మండపాల వద్ద కోలాహలం మొదలైంది. భారీ గణేశ్ విగ్రహాలను వాహనాల్లో కొలువుదీర్చి ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకూ నిమజ్జనోత్సవం సాగింది. అంతకుముందు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయకుల ప్రతిమలను ట్రాక్టర్లు, లారీలపై ముస్తాబు చేసి అంబేడ్కర్ సర్కిల్కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అటు నుంచి గాంధీసర్కిల్ గుండా విడి రోడ్డు మీదుగా పల్లా సర్కిల్ రైల్వేరోడ్డు నుంచి శ్రీనివాస మందిరం, రాజీవ్సర్కిల్ల గుండా ఎంజీఎం స్కూల్ నుంచి గుడ్డం కోనేరు చేర్చారు. సందడే సందడి.. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా హిందూపురంలో సందడి వాతావరణం నెలకొంది. డీజే మ్యూజిక్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల మధ్య యువకుల నృత్యాలతో హోరెత్తించారు. వివిధ వేఽషధారణలతో యువకులు ఆకట్టుకున్నారు. అడుగడుగునా దాతలు నీరు, మజ్జిగ, ప్రసాదాలను భక్తులకు అందించారు. కట్టుదిట్టమైన బందోబస్తు.. పురంలో గణేశ్ నిమజ్జనోత్సం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వి.రత్న, అదనపు ఎస్పీ, పర్యవేక్షణలో డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. పట్టణ ప్రధాన ప్రాంతాలతో పాటు గుడ్డం కోనేరు ఘాట్ వద్ద బందోబస్తులను పర్యవేక్షంచారు. సీఐలు రాజగోపాల్నాయుడు, అబ్దుల్ కరీం, ఆంజనేయులు, జనార్దన్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయించారు. విద్యుత్తు అంతరాయంపై అసహనం.. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పట్టణమంతా అంధకారం నెలకొంది. జనరేటర్లు, యూపీఎస్లు ఉన్న చోట తప్ప ఎక్కడా విద్యుత్ కాంతులు లేవు. గురువారం అర్ధరాత్రి వరకూ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలేకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పురం’లో అత్యంత వైభవంగా వినాయక నిమజ్జనం భక్తులతో కిక్కిరిసిపోయిన పట్టణం డప్పు మోతలతో సందడే సందడి తెల్లవారే వరకూ సాగిన కార్యక్రమం నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు -
తన సబ్జెక్టే ఇంటి పేరుగా..
బత్తలపల్లి: మండలంలోని గరిశలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న బేల్దారి అంజినప్ప గారి తిమ్మప్ప అంటే గతంలో ఆయన పనిచేసిన మడకశిరలో ఎవరూ గుర్తు పట్టరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయన పనిచేస్తున్న సమయంలో తన సబ్జెక్ట్లో విద్యార్థులు ఎవరూ వెనుకబడకుండా చూపిన శ్రద్ధనే కారణం. అందుకే ఆయన బోధించే సబ్జెక్ట్నే ఆయన ఇంటి పేరుగా ఆ ప్రాంత వాసులు మార్చేశారు. దీంతో తిమ్మప్ప కాస్త ఇంగ్లిష్ తిమ్మప్పగా ఆయన ఖ్యాతి గాంచారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఫలితంగా పలుమార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. -
ఆధ్యాత్మిక ధామం .. ఓనం వైభవం
ప్రశాంతి నిలయం: ప్రముఖ అధ్యాత్మిక కేంద్రమైన ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు రెండో రోజు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని ఉదయం కేరళ సత్యసాయి భక్తులు ఓనం విశిష్టతను చాటుతూ చక్కటి భక్తిగీతాలు ఆలపిస్తూ చేసిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. సాయంత్రం వేడుకల్లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు కావ్య అజిత్ బృందం చక్కటి స్వరాలోలికిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ముఖ్య అథితిగా ఇస్త్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సేవలను కొనియాడారు. సత్యసాయి సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. -
ఆంధ్రా ప్రెసిడెంట్ , మధ్యప్రదేశ్ జట్ల విజయం
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో భాగంగా గురువారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచుల్లో ఆంధ్రా ప్రెసిడెంట్, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. తొలుత ఆంధ్రా ప్రెసిడెంట్, ఆంధ్రా సెక్రెటరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. 49.1 ఓవర్లలో 232 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రా సెక్రెటరీ జట్టు కేవలం 30.4 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మధ్యప్రదేశ్, బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బరోడా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. 45.4 ఓవర్ల వద్ద 178 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 45.4 ఓవర్లలో 182 పరుగుల సాధించి విజయాన్ని కై వసం చేసుకుంది. -
రైతుకోసం వైఎస్సార్ సీపీ పోరుబాటు
పుట్టపర్తి అర్బన్: రైతు కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ కూటమి సర్కార్ పాలనను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన ధర్నాకు సిద్ధమైంది. రైతుల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, రైతు సంక్షేమాన్ని కాంక్షించే వారంతా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డితో కలిసి పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి నేతలు మామిడి రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించలేకపోయారన్నారు. ఉల్లి రైతులకు కంట కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. ఇక విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో రైతులకు అందించలేకపోయారన్నారు. అందువల్లే ఈ సీజన్లో జిల్లాలో కేవలం 63 శాతం మంది రైతులే పంటలు సాగు చేశారన్నారు. రైతులకు జీవనాధారమైన వరి సాగు చేయవద్దని ప్రకటించడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. కీలకమైన సమయంలో యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పంట నష్ట పరిహారం, ఉచిత బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ గత ఏడాది అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేక పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9వ తేదీ మంగళవారం జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్ జగన్ సర్కార్ రైతును రాజు చేస్తే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలను నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లు, కమిటీల సభ్యులు పాల్గొన్నారు. యూరియా కొరతపై 9న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపు -
మద్యం బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మద్యం బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్, ఏఈఎస్ నరసింహులు తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీ రెండు, కదిరి మున్సిపాలిటీ, మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్ట్ 31 వరకు బార్లు నిర్వహించుకునేందుకు వీలుగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు పుట్టపర్తి ఉజ్వల ఫౌండేషన్ విల్లాలో ఉన్న జిల్లా ప్రొహిబిషన్, ఎక్పైజ్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు నేరుగా దరఖాస్తులు అందజేయాలన్నారు. లేదా ఆన్లైన్కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు రూ. 5 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు రూ.10 వేలు (ప్రాసెసింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక బార్కు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లో లాటరీ ద్వారా బార్లను కేటాయిస్తామన్నారు. బార్లు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజును ఆరు వారయిదాల్లో చెల్లించవచ్చన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలిమడకశిర రూరల్: బలవంతపు భూసేకరణతో రైతుల పొట్టకొట్టవద్దని ఏపీ రైతు సంఘం నాయకులు అధికారులను వేడుకున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం రైతు సంఘం నాయకులు వైబీ హళ్లి, సీ కొడిగేపల్లి పంచాయతీల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. సారవంతమైన భూములను సేకరించడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి వైబీహళ్లిలో సోలార్ ప్రాజెక్టు వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరి, కార్యదర్శి పెద్దన్న, ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు మాట్లాడారు. రైతుల ఆమోదం లేకపోతే భూ సేకరణ చేయకూడదని 2013 భూ సేకరణ చట్టం చెబుతోందన్నారు. ఎకరాకు రూ.30 వేల ప్రకారం 30 ఏళ్లు అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా రైతులు భూ హక్కును కూడా ప్రమాదం ఉంటుందన్నారు. సీ కొడిగేపల్లి పంచాయతీలో సేకరించిన భూముల్లో ఇప్పటి వరకు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనందున ఆ భూములను తిరిగి రైతులకు కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. -
ప్రశాంతి నిలయంలో ఓనం వైభవం
ప్రసంగిస్తున్న ఎంపీ ప్రేమచంద్రన్సంగీత కచేరీ నిర్వహిస్తున్న బాలవికాస్ చిన్నారులు ప్రశాంతి నిలయం: కేరళీయుల పవిత్రంగా ఆచరించే ఓనం వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత కేరళ సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లం ఎంపీ ఎన్కె.ప్రేమ చంద్రన్ ప్రసంగిస్తూ.. ఓనం పర్వదిన విశిష్టతను, సత్యసాయి నిస్వార్థ సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలన్నారు. అనంతరం శ్రీశైలానికి చెందిన శ్రీసత్యసాయి విద్యాపీఠం విద్యార్థులు ‘‘ది పాథ్ ఆఫ్ ట్రూ డివోషన్’’పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. శబరి భక్తి ప్రపత్తులను వివరిస్తూ అద్భుతంగా ఆడిపాడారు. -
పోరాడదాం.. విజేతలుగా నిలుద్దాం
పుట్టపర్తి అర్బన్: ‘‘పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల నేతల దౌర్జన్యం, అరాచకం చూశాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారి వైఖరి అలాగే ఉంటుంది. ఏస్థాయికై నా దిగజారి రాజకీయం చేస్తారు. వారి అరాచకరాలను సమష్టిగా ఎదుర్కొందాం. గ్రామ గ్రామానా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడిద్దాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. బుధవారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉషశ్రీచరణ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్, రమేష్రెడ్డి మాట్లాడారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరోసారి తెలియజేసి పార్టీని గ్రామ/వార్డు స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమర్థవంతమైన నాయకులు వేలాది మంది ఉన్నారని, అందుకే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించామన్నారు. తొలుత ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’లో భాగంగా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మన పార్టీ నాయకులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, తిరిగి మనమే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు జిల్లాలోని 7 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కై వసం చేసుకోవాలన్నారు. పనిచేసే వారికి సముచిత స్థానం పార్టీకోసం కష్టపడే వారికి తప్పక సముచిత స్థానం కల్పించడంతో పాటు అండగా ఉంటామని ఉషశ్రీచరణ్, రమేష్రెడ్డి తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయడానికి జిల్లాలో తొలి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరి సలహా, సూచనలను కమిటీ తీసుకుంటుందన్నారు. వివిధ కమిటీల్లో స్థానం దక్కించుకున్న వారంతా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో గమనించిన ప్రతి అంశాన్ని జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి బూత్లోనూ బీఎల్ఏలను ఏర్పాటు చేసుకుని, ఆ జాబితాను ఆర్డీఓలకు పంపాలన్నారు. ఓటరు జాబితా, మార్పులు, చేర్పులు, పోలింగ్ బూత్ల మార్పు తదితర విషయాలన్నీ తెలుసుకోవాలన్నారు. సోషల్ మీడియాను వాడుకుందాం ప్రతి గ్రామంలోనూ మహిళా, రైతు, యువజన, సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను, కూటమి సర్కార్ అసమర్థ పాలన, అరాచకాలను ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరిద్దామన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లింగాల లోకేశ్వరరెడ్డి, కురుబ నాగిరెడ్డి, శేషురెడ్డి, సుధాకరరెడ్డి, జోనల్ ఇన్చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, మహిళా విభాగం రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్, శివప్రసాద్, రఘురామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రణీత్రెడ్డి, సురేష్కుమార్, ప్రభాకరరెడ్డి, రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అభిలాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవింద్నాయక్, వలంటీర్ విభాగం అధ్యక్షుడు హరినాథ్రెడ్డి, చేనేత విభాగం అధ్యక్షుడు జింకా కంబగిరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పురుషోత్తం, పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడు ఫకృద్దీన్, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు రమేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, ఐటీ విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు గజ్జల శివ తదితరులు పాల్గొన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదాం కూటమి దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఊరూరా వివరిద్దాం పార్టీ శ్రేణులకు ఉషశ్రీ చరణ్, రమేష్రెడ్డి పిలుపు పుట్టపర్తిలో వైఎస్సార్ సీపీ వర్కింగ్ కమిటీ సభ్యులతో సమావేశం -
‘పురం’లో నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
● డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని ఎస్పీ రత్న వెల్లడి హిందూపురం: చవితి రోజున మండపాల్లో కొలువై పూజలందుకున్న వినాయకుడి గంగఒడికి చేరే అపురూపఘట్టం ఆసన్నమైంది. వినాయక చవితి ఉత్సవాలకు జిల్లాలోనే పేరుగాంచిన హిందూపురంలో గురువారం గణేశుడి నిమజ్జనం అట్టహాసంగా సాగనుంది. ఇప్పటికే అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న హిందూపురంలో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ ఎస్పీతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 33 మంది సీఐలు, 63 మంది ఎస్ఐలు, 170 మంది ఎఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు, 316 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 49 మంది మహిళా పోలీసులు, 210 మంది హోం గార్డులతో పాటు 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, స్పెషల్ పార్టీ పోలీసులు... ఇలా మొత్తంగా 1,000 మంది నిమజ్జనం విధుల్లో ఉంటారని ఎస్పీ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా హిందూపురంలో ట్రాఫిక్ మళ్లించామని, ఈ విషయాన్ని వాహన చోదకులు, ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల్లోపు శోభయాత్రకు సిద్ధంకావాలి గురువారం ఉదయం పదిగంటలల్లోపు అన్ని మండపాల నుంచి వినాయక విగ్రహాలు శోభాయాత్రకు బయలుదేరాలన్నారు. ఇందుకు గణేష్ మండపాల నిర్వహకులు సహకరించాలని ఎస్పీ రత్న కోరారు. నిమజ్జనం చేసే కోనేరు వద్దకు రాకుండా పిల్లలు, మహిళలను దూరంగా ఉంచాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా మతపెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు, యువత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.డిసెంబర్ 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష పుట్టపర్తి అర్బన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీనివాసులరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల్లోపు ఉండాలన్నారు. విద్యార్థులు ఈ నెల 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు www.bse.ap.gov.inల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలన్నారు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఎస్బీఐ లింక్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
29 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకూ 233.8 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా చిలమత్తూరు మండలంలో 28.2 మి.మీ, అమడగూరు మండలంలో 20.2 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇక అమరాపురం మండలంలో 15.2 మి.మీ, గోరంట్ల 14.2, అగళి 13.8, హిందూపురం 11.2, కొత్తచెరువు 10.2, లేపాక్షి 10.2, సోమందేపల్లి 9.8, పెనుకొండ 9.4, మడకశిర 9.2, రొళ్ల 9.2, గాండ్లపెంట 8.2, సీకేపల్లి 7.8, బుక్కపట్నం 6.4, నల్లమాడ 5.6, గుడిబండ 5.4, పుట్టపర్తి 4.6, పరిగి 4.2, ఎన్పీకుంట 3.6, తలుపుల 2.4, ఓడీచెరువు 2.4, బత్తలపల్లి 2.2, కదిరి 2.2, తనకల్లు 2.0, ధర్మవరం 1.6, నల్లచెరువు మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ పెనుకొండ రూరల్: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్పీ పదోన్నతులపై చోటు చేసుకున్న అక్రమాలపై ఆధారాలతో సహా ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురిస్తే.. కక్ష కట్టి విజయవాడలోని ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేయించడంతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించిన ప్రభుత్వ తీరును ఆమె ఖండించారు. నిజాలను నిర్బయంగా రాసే పాత్రికేయులను అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. భూసంరక్షణా విభాగం ఈఈగా పోలప్ప అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న భూసంరక్షణా విభాగం (సాయిల్ కన్సర్వేషన్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ)గా పోలప్ప బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఆ స్థానంలో ఇప్పటి వరకూ ఇన్చార్జి ఈఈగా ఉన్న ఓబుళపతి బాధ్యతలు అప్పజెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో డీఈగా ఉన్న పోలప్పకు ఈఈగా పదోన్నతి కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. అలాగే డీఈ హోదాలో ఉన్న ఇన్చార్జి ఈఈ ఓబుళపతికి సైతం ఈఈగా పదోన్నతి కల్పించి ఒంగోలుకు బదిలీ చేశారు. అయితే ఓబుళపతి డెప్యుటేషన్ కింద ఏపీ ఆగ్రోస్ జిల్లా మేనేజర్గా కొనసాగనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇరువురూ ఈఈలకు ఆ శాఖ ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 11, 12న జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నంలోని డైట్ కళాశాల వేదికగా ఈ నెల 11, 12 తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు సంస్కృతి, కళలపై జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు–2025 నిర్వహించనున్నారు. ఈ మేరకు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ చాటిన వారిని ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు 99499 93712, 79817 76864లో సంప్రదించవచ్చు. -
బదిలీల్లో ఘోర పరాభవం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటికే రోజుకో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, కింది స్థాయి కేడర్కు మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పోరు పతాక స్థాయికి చేరినట్లు తెలిసింది. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎంపీ మాట నెగ్గే పరిస్థితి లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎంపీలు డమ్మీలుగా మారారని, ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. టీటీడీ లెటర్లు ఇవ్వడానికి మినహా దేనికీ పనికిరావడం లేదంటున్నారు. మా అనుమతి లేనిదే.. ఎలాంటి అనధికార కార్యక్రమాలకూ తమకు తెలియకుండా ఎంపీలు వెళ్లడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. తాజాగా అనంతపురం అర్బన్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాతూరు మార్కెట్ పరిశీలనకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేకు, ఎంపీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘నా అనుమతి లేకుండా వెళ్లడానికి మీరెవరు’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి విరుచుకుపడినట్టు తెలిసింది. తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి వంటి నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో కూడా ఎంపీలకు తెలియదు! నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు కానీ, కేటాయింపులు చేసే అధికారాలు కూడా ఎంపీలకు లేవు. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇసుక, మట్టి, మద్యం ఇలా ఏదైనా కానీ ఎంపీలకు దక్కడానికి వీల్లేకుండా చేశారు. ‘పేరుకే ఎంపీ.. అంతా ఎంప్టీ’ అన్న చందాన తయారైంది పరిస్థితి. ఇటీవల శింగనమల నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ తమకొద్దంటూ టీడీపీ కార్యకర్తలే ధర్నా చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆయనకు అడుగడుగునా.. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చివరి నిమిషంలో ఇచ్చింది చాలు అన్నట్టు ఎంపీ సీటు దక్కించుకుని గెలిచినా.. ఉమ్మడి జిల్లాలో ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదు. ఇక.. సొంత నియోజకవర్గం పెనుకొండలో అయితే మంత్రి సవితకు, ఎంపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏ పనిలోనూ ఎంపీకి చిన్న భాగస్వామ్యం కూడా లేదు. కదిరి, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్థసారథి మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఎంపీలను లెక్కచేయని శాసనసభ్యులు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదని హుకుం ఇటీవల ఎంపీ అంబికాతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఢీ శింగనమలలో ఎంపీపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు పెనుకొండలో మరీ ఘోరంగా ఎంపీ పార్థసారథి పరిస్థితి ఆవేదనలో ఎంపీల అనుచరులు టీటీడీ లెటర్లకు తప్ప ఎందుకూ ఉపయోగపడటం లేదని నిట్టూర్పు ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చిన సిఫార్సు లేఖల్లో ఎంపీల సిఫార్సు లేఖలు బుట్టదాఖలయ్యాయి. నియోజకవర్గంలో తమ సిఫార్సు కాదని ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకోవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. చివరకు ఎంపీ ల్యాడ్స్ కింద పనులు చేసినా తమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కాబట్టి తమకు వాటా దక్కాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో బయటకు చెప్పుకోలేక, ఎమ్మెల్యేలను ఎదుర్కొనే శక్తి లేక ఎంపీలు లోలోపల కుమిలిపోతున్నారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో నలిగిపోతున్నారు. తమకంటే నామినేటెడ్ పోస్టులు దక్కించుకుంటున్న వారే నయమని ఎంపీలు సన్నిహితులతో వాపోతున్నారు. -
సస్యరక్షణ చర్యలే ముఖ్యం
● డాట్ సెంటర్ శాస్త్రవేత్త రామసుబ్బయ్య తలుపుల: పంటల సాగుతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని రైతులకు అనంతపురం డాట్ సెంటర్ శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య సూచించారు. ఏడీఏ శైలకుమారి, ఏఓ నాగ మధుసూదన్ ఆధ్వర్యంలో తలుపుల మండలం గొల్లపల్లితండాలో బుధవారం ఏర్పాటు చేసిన రైత శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా వేరుశనగ, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నందున ఆయా పంటలలో సస్యరక్షణ చర్యలు, పంట సాగు విధానాలను వివరించారు. పకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవేంద్ర, వీఐఏ సుధాకర్, సీఎస్ఏ సిబ్బంది రైతులు పాల్గొన్నారు. జిల్లాకు 1,923 మెట్రిక్ టన్నుల ఎరువులుఅనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీ నుంచి 1,922.75 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాగా, ఇందులో 904.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు బుధవారం వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులు, యూరియాను పరిశీలించారు. 904.5 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 507.85 మెట్రిక్ టన్నుల డీఏపీ, 255.2 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 255.2 మెట్రిక్ టన్నుల 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు చేరాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియాకు సంబంధించి కోటా మేరకు 399.915 మెట్రిక్ టన్నులు అనంతపురం మార్క్ఫెడ్కు, 200.655 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు కేటాయించగా... 303.93 మెట్రిక్ టన్నులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. కాంప్లెక్స్, డీఏపీలు 90 శాతం మేర ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు 10 శాతం మార్క్ఫెడ్కు కేటాయించినట్లు వివరించారు. జింక పిల్ల స్వాధీనం బత్తలపల్లి: మండలంలోని ఈదుల ముష్టూరు కొట్టాల గ్రామంలో బోయ సాంబ శివుడు వద్ద ఉన్న జింక పిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు బత్తలపల్లి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఉన్న జింక పిల్లతో పాటు సాంబశివుడిని పుట్టపర్తిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశులు, కానిస్టేబుల్ అనిల్కుమార్, అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అక్కులప్ప పాల్గొన్నారు. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సుమడకశిర: కర్ణాటకకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం మధ్యాహ్నం పావగడ నుంచి 30 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బస్సు బయల్దేరింది. మడకశిర సమీపంలోకి చేరుకోగానే బ్రేక్ ఫెయిల్ అయినట్లుగా డ్రైవర్ గుర్తించి చాకచక్యంగా వ్యవహరిస్తూ పొలాల్లోకి తిప్పాడు. పొలాల్లో బస్సు కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ఎవరూ గాయపడలేదు. ఈ సందర్భంగా డ్రైవర్ను పలువురు అభినందించారు. ఉపాధ్యాయురాలి సస్పెన్షన్ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రోజారాణిని సస్పెండ్ చేస్తూ డీఈఓ క్రిష్టప్ప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ ఇటీవల డీఈఓకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు డీఈఓ ఆదేశించారు. విచారణాధికారి అందజేసిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ రమణప్ప తెలిపారు. -
బెంగళూరులో మృతి.. ‘పురం’లో సర్టిఫికెట్
చిలమత్తూరు: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో హిందూపురం మున్సిపల్ అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడ మరణించినా.. ఎక్కడ జన్మించినా.. స్థానిక మున్సిపల్ అధికారులు కోరిన మొత్తాన్ని ముట్టజెపితే నిమిషాల వ్యవధిలో దొంగ సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. వాస్తవానికి జనన, మరణాలు చోటు చేసుకున్న ప్రాంతంలోనే ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది. అయితే నిబంధనలు అతిక్రమిస్తూ హిందూపురం మున్సిపల్ అధికారులు జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలు.. వాటిని పొందిన వారికి భవిష్యత్తులో చుక్కలు చూపడం గ్యారంటీ అని కొందరు మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. హిందూపురంలోని కంసాల పేటలకు చెందిన వి.శంకరాచారి (84) ఈ ఏడాది జూలై 3న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి సదరు ఆస్పత్రి యాజమాన్యం డెత్ సర్టిఫికెట్ను అందజేసింది. దీని ఆధారంగా బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) డెత్ సర్టిఫికెట్ను జారీ చేస్తుంది. అయితే స్థానిక టీడీపీ నేత జోక్యం చేసుకుని డెత్ సర్టిఫికెట్ను హిందూపురం మున్సిపాల్టీ ద్వారానే అందజేయిస్తానని నమ్మబలకడంతో మృతుడి కుటుంబీకులు జూల్ 17న దరఖాస్తు చేసుకున్నారు. దీని ఆధారంగా డెత్ సర్టిఫికెట్ను మున్సిపల్ అధికారులు అందజేశారు. వయోభారంతో ఇంటి వద్దనే శంకరాచారి మృతి చెందినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ అక్రమాల్లో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. మున్సిపల్ కమిషనర్ సంతకాలతోనే ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడం కలకలం రేపింది. ఇలాంటివి లెక్కకు మించి దొంగ సర్టిఫికెట్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ అంశం తన దృష్టిలో లేదని, అలాంటివి మంజూరు చేయడం నేరమవుతుందని అన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హిందూపురంలోనే మృతి చెందినట్లుగా దరఖాస్తు చేయించిన పత్రం బెంగళూరులోని ఆస్పత్రి నిర్వాహకులు అందజేసిన మరణ ధ్రువీకరణ పత్రం జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీలో హిందూపురం మున్సిపల్ అధికారుల చేతివాటం టీడీపీ నేతల కనుసన్నల్లో ఇష్టారీతిన డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ ముడుపులు దండుకుని.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందాలంటే అంత సులువు కాదు. అయితే హిందూపురం మున్సిపాల్టీలో కేవలం నిమిషాల వ్యవధిలోనే జనన, ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుండడం గమనార్హం. స్థానిక టీడీపీ నేతల సిఫారసు తీసుకెళితే చాలు.. ముందు వెనుక ఆలోచించకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ప్రక్రియలో అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నట్లు సమాచారం. శంకరాచారి మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశంలోనూ హిందూపురం పట్టణానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. స్థిరాస్తి విషయంలో మరణ ధ్రువీకరణ పత్రం అవసరంకావడంతో సదరు టీడీపీ నేత తన పలుకుబడిని ఉపయోగించి దొంగ సర్టిఫికెట్ చేయించి ఇచ్చినట్లుగా తెలిసింది. అంతా మా ఇష్టం.. -
ఇద్దరు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు
మాణిక్యం ఇసాక్ తెలుగు టీచర్ జయచంద్ర హిందీ టీచర్ పుట్టపర్తి అర్బన్: జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రొద్దం మండలం కోగిర ఉన్నత పాఠశాల హిందీ టీచర్ జాబిలి చాంద్బాషా అలియాస్ జయచంద్ర, కొత్తచెరువు మండలం బండ్లపల్లి ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మాణిక్యం ఇసాక్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. జయచంద్ర తాను పని చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు విద్యాభివృద్ధికి పాటుపడ్డారు. వినూత్న పద్ధతుల్లో పిల్లలకు అర్థం అయ్యేలా బోధిస్తున్నారు. జాబిలి కలం పేరుతో కవితా రచన, జాతీయ గీతం ‘జనగణమన’తో లక్ష గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనకు 2017లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2018లో అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించాయి. అలాగే సేవా రత్న, మదర్థెరీసా పురస్కారం తదితర 70 వరకూ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. మాణిక్యం ఇసాక్కు బోధనలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 216 పద్యాల పుస్తకాలు ఆవిష్కరించారు. 2025లో మహమ్మద్ ఇక్బాల్ జాతీయ పురస్కారం పొందారు. పదో తరగతిలో ఏటా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం టీచర్లు, డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. -
ఎమ్మెల్యే గుమ్మనూరుపై చర్యలు తీసుకోవాలి
ధర్మవరం: ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులతో దురుసుగా మాట్లాడిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ధర్మవరంలో వారు విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి, పామిడి మండలాల్లోని ఐదు గ్రామాల్లో సోలార్ విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు లీజు పద్ధతిలో కాకుండా దళారులతో దౌర్జన్యంగా భూ సేకరణను టీడీపీ నేతలు చేపట్టారన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మండల నాయకులు, రైతులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఎమ్మెల్యే జయరాం ఫోన్ చేసి అవమానకర రీతిలో దూషిస్తూ.. బెదిరింపులకు దిగడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ బాషా, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, అయూబ్ఖాన్, ఎల్.ఆదినారాయణ, హైదర్వలి, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారుతి, వెంకటస్వామి, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.