breaking news
Sri Sathya Sai District Latest News
-
పీఎం సూర్యఘర్ అమలుపై కలెక్టర్ అసంతృప్తి
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపు లక్ష్యాలు సాధించకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి డివిజన్లో 500, కదిరి–500, హిందూపురం డివిజన్లో 600 మొత్తంగా 1,600 సోలార్ ప్యానెళ్లు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగానికి అనువుగా ఉండే పీఎం కుసుమ్ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వినియోగదారుల్లో సోలార్ విద్యుత్పై అవగాహన పెంపొందించేందుకు స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోసెస్, పలువురు ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలి ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అధికారులు పని చేయాలన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడం కోసం గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. క్షయ రహిత సమాజ నిర్మాణం కోసం జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఎయిడ్స్ నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ అధికారులను ఆదేశించారు. బాలికలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు -
ఘనంగా గంధం వేడుకలు
పెనుకొండ రూరల్: బెహలూల్ షా బాబా గంధం వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున పీఠాధిపతి షెక్షావలి తన ఇంటి వద్ద తలపై గంధం ఉంచుకుని బయలుదేరి జాతీయ రహదారి పక్కన ఉన్న దర్గాలో స్వామి వారి సమాధి వద్ద సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. పకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురువారం దీపారాధనతో ఉరుసు ముగియనుంది. రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్గా కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అన్సర్, ఏజీపీ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలి పుట్టపర్తి టౌన్: ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సతీష్కుమార్ సూచించారు. ప్రపంచ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ సతీష్ కుమార్ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు అవగాహన సమావేశాలు, కళాజాత, ఎల్ఈడీ వ్యాన్ల ద్వారా పాఠశాలలు, కళాశాలలతో పాటు గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీసుల సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎయిడ్స్, క్షయ నియంత్రణ జిల్లా అధికారి అనుపమ జేమ్స్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఏఎన్ఎం హరిత తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా రామక్రిష్ణ పుట్టపర్తి: ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా బుక్కపట్నం డైట్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బర రామక్రిష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తమామి అన్సారీ నుంచి నియామక పత్రం అందింది. దీంతో బుధవారం డైట్ కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి ధర్మవరం అర్బన్: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్రాజు, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో బుధవారం అమరావతి ఛాంపియన్షిప్ కప్–2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల సోమేశ్వర్రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బంధనాథం సూర్యప్రకాష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. 500 మంది క్రీడాకారులు హాకీ, యోగా, బాస్కెట్బాల్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడల్లో సత్తా చాటారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో పాల్గొననున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి అంజన్న, వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, కృష్ణమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) కోర్సుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్లో ఏ బ్రాంచ్లోనైనా ఉత్తీర్ణత సాధించిన మహిళలు అర్హులు. వయోపరిమితి లేదు. ఆసక్తి ఉన్నవారు http://cfw.apnic.in బ్సైట్ ద్వారా డౌన్లోడు చేసుకున్న దరఖాస్తులను భర్తీ చేసి సెప్టెంబర్ 30వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలి. -
కట్టుకున్నోడే కాలయముడు!
అనంతపురం సెంట్రల్: ఓ మ్యాట్రిమోనీ ద్వారా వారిద్దరి మనసులు కలిశాయి. కొన్ని రోజులకే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఏమైందో తెలియదు కానీ పైళ్లెన నెలరోజులకే భర్త కాలయముడిగా మారి భార్యను కడతేర్చాడు. పోలీసుల కథనం మేరకు... కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్, గుంటూరుకు చెందిన శాంతి (26)కి మధ్య ఓ మ్యాట్రిమొనీ వెబ్సైట్ ద్వారా పరిచయం కుదిరి మనసులు కలిశాయి. నెలరోజుల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. పైళ్లెన తర్వాత మహేష్, శాంతి అనంతపురం నగరంలోని యల్లమ్మ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శాంతి ఇంట్లోనే ఉంటుండగా, మహేష్ ఆటో తీసుకొని పాల ప్యాకెట్ల వ్యాపారం చేసేవాడు. ఏమైందో తెలియదు కానీ, మూడు రోజుల క్రితం రోకలి బండతో మోది శాంతిని మహేష్ దారుణంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తాళం వేసి ఎక్కడికో పరారయ్యాడు. కొత్తగా పెళ్లయిన వారు కావడంతో భార్యాభర్తలిద్దరూ బంధువుల ఊళ్లకు వెళ్లారేమోనని ఇంటి యజమానులు భావించారు. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా శాంతి రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులో నివాసముంటున్న మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. పెళ్లయిన నెలకే రోకలిబండతో మోది భార్యను కడతేర్చిన భర్త -
ఐచర్ వాహనాన్ని ఢీకొన్న లారీ
కనగానపల్లి (నాగసముద్రం): చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో ఐచర్ వాహనంలో తరలిస్తున్న లక్షకు పైగా కోడి గుడ్లు పగిలిపోయాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. హైదరాబాద్ నుంచి కోలార్కు ఐచర్ వాహనంలో కోడి గుడ్లు తరలిస్తున్నారు. నాగసముద్రం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఐచర్ టైరు పంక్చర్ కావటంతో డ్రైవర్ జాతీయ రహదారి పక్కనే నిలిపాడు. ఈ క్రమంలోనే ఓ లారీ వెనుక వైపు నుంచి ఢీకొనడంతో ఐచర్ రోడ్డు పక్కన బోల్తా పడింది. వాహనంలోని లక్ష కోడిగుడ్లు కిందపడి పగిలిపోయాయి. రూ.7 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని ఐచర్ డ్రైవర్ తెలిపాడు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. చెన్నేకొత్తపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఐచర్లోని లక్షకుపైగా కోడిగుడ్లు పగిలిపోయిన వైనం -
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన హర్యాణా, చండీఘర్ సత్యసాయి భక్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. బుధవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం ‘‘ఆష్టావక్రా–జర్నీ ఫ్రం అద్వైతా టూ సాయి ప్రేమ’’ పేరుతో నాటిక నిర్వహించారు. అందరికీ దేవుడు ఒక్కడేననే సందేశాన్నిచ్చారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
హాని చేస్తాడని హతమార్చాడు!
ధర్మవరం అర్బన్: భవిష్యత్తులో స్నేహితుడే తనకు హాని చేస్తాడని అనుమానించిన ఓ వ్యక్తి అతడిని హతమార్చాడు. పట్టణంలో ఇటీవల హత్యకు గురైన బోయ దాసరి శ్రీనివాసులు కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం డీఎస్పీ జగన్నాథరాజు వివరాలు వెల్లడించారు. ధర్మవరం మండలం ఓబుళనాయనపల్లికి చెందిన గడిపూడి గంగాధర్నాయుడు, దాసరి శ్రీనివాసులు చిన్ననాటి స్నేహితులు. శ్రీనివాసులు వాహనాన్ని ఒకటిన్నర సంవత్సరం క్రితం గంగాధర్నాయుడు తీసుకెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. అనంతరం వాహనానికి మరమ్మతులు చేయించి తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తన కదలికలపై శ్రీనివాసులు ఆరా తీస్తున్నాడని గంగాధర్నాయుడుకు అనుమానం వచ్చింది. భవిష్యత్తులో ఆయన నుంచి హాని తప్పదని అనుమానించి చంపాలని నిర్ణయించుకున్నాడు. తన అనుచరులైన ఓబుళనాయనపల్లికి చెందిన బాల చరణ్కుమార్, గుజ్జల గంగాధర్కు చెప్పి హత్యకు పథక రచన చేశాడు. ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో తన థార్ వాహనంలో బాల చరణ్కుమార్, గుజ్జల గంగాధర్తో కలిసి శ్రీనివాసులును ధర్మవరం చెరువు రెండో మరువ ప్రాంతానికి తీసుకెళ్లాడు. శ్రీనివాసులుకు మద్యం తాగించిన అనంతరం వెంట తెచ్చుకున్న కర్రతో వెనుకవైపు నుంచి ముగ్గురూ దాడి చేశారు. కిందపడిన శ్రీనివాసులుపై అక్కడే ఉన్న బండరాయితో మోది హతమర్చారు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి చెరువులో పడేసి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 11న ధర్మవరం మండలం గొల్లపల్లి వంక బ్రిడ్జి సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి థార్ వాహనం, బజాజ్ పల్సర్ బైకు, మూడు సెల్ఫోన్లతో పాటు హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, ప్రభాకర్గౌడ్, అలి, ఎస్ఐ వీరేష్, పోలీసు సిబ్బందిని ఎస్పీ సతీష్కుమార్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. వీడిన హత్య కేసు మిస్టరీ మృతుడి స్నేహితుడితో పాటు ఇద్దరి అరెస్టు -
టీడీపీ నేత క్రిష్ణమూర్తి స్థలం కబ్జా చేశాడు ●డీఎస్పీకి వాల్మీకి సంఘం నాయకుల ఫిర్యాదు
కదిరి టౌన్: వాల్మీకులకు కేటాయించిన సర్వే నంబర్ 86లోని 2.96 ఎకరాల భూమిని టీడీపీ నేత బంగారు క్రిష్ణమూర్తి కబ్జా చేసి, తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వాల్మీకి సంఘం నాయ కులు ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కదిరి డిఎస్పీ శివనారాయణస్వామికి ఫిర్యాదు చేశారు. స్వార్థ బుద్ధితో ఆలోచించి వాల్మీకి జాతికి క్రిష్ణమూర్తి తీరని ద్రోహం చేశాడని విమర్శించారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు గంగరాజు, నాగరాజు, ఈశ్వర్, పట్నం మహేష్, పూల సురేష్, రామాంజనేయులు, ప్రసాద్, గిరి, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ఘనంగా బీబీ జైనబ్బీ గంధం వేడుకలు ఉరవకొండ: ప్రసిద్ధి గాంచిన హజరత్ బీబీ జైనబ్బీ అమ్మవారి ఉరుసు బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు విశేష పుష్పాలతో అలంకరించిన ముత్యాల హంస పల్లకీలో అమ్మవారి పవిత్ర గంధం ఉంచి మేళతాళాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూరుబాషా ఆధ్వర్యంలో సభ్యులు అమ్మవారి జీవసమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. దర్గా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఊరేగింపులో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
సమస్యలపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ
పుట్టపర్తి: ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బుధవారం డీఈఓ కిష్టప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు, విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, సబ్జెక్టు టీచర్లకు సంబంధిత సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లతో మరోసారి పోరాటానికి సిద్ధమైనట్లు చెప్పారు. ఆగస్టు 14న కమిషనర్, మంత్రికి వినతిపత్రాలు అందజేత, 18న ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శులు అమర్, నారాయణరెడ్డి, బాబు, నాయకులు సునీల్కుమార్, వెంకట కిషోర్, రవి శేఖర్, రవీంద్రారెడ్డి, బ్రహ్మ, ఫకృద్దీన్, జగన్ తదితరులు ఉన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి -
రైతులకు చంద్రబాబు ప్రభుత్వ మోసం
ఓడీచెరువు: సోలార్ కంపెనీల నుంచి రైతుల భూములను కాపాడాలని, సోలార్ పరిశ్రమలతో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మించి చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు సాగునీటిని అందించి ఆదుకోవాలని కోరారు. ఓడీచెరువు, అమడగూరు, నల్లమాడ మండలాలలో ఏర్పాటు చేయనున్న 16 పరిశ్రమలకు సంబంధించిన భూములను పరిశీలించారు. తప్పని పరిస్థితుల్లో భూములను లీజుకు ఇవ్వదలిస్తే ఎకరాకు సంవత్సరానికి రూ.50 వేలు, ప్రతి సంవత్సరం పది శాతం పెంచి లీజు తిరిగి రాయాలని, దీర్ఘకాలిక ఒప్పందాలకు రైతులు ససేమిరా ఒప్పుకోవద్దని కోరారు. బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు జిల్లా సహకార కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మాధవ రెడ్డి, రామిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
కదిరి అర్బన్: కదిరిలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల హిందూపురంలోని బసన్నపల్లి పాఠశాలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలోనే కబడ్డీలో బీ.హయాత్నీ, హైజంప్లో బీ.రాజశ్రిత, ఖోఖోలో డీ.మానస, 800 మీటర్ల పరుగులో జీ.దీక్షిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి, పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు. ఏపీఆర్ఎస్ విద్యార్థులు.. పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. అండర్–17 విభాగంలో 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్లో సీ.హేమంత్, 800 మీటర్ల పరుగు పందెంలో వినిత్కుమార్, షాట్ పుట్లో అఖిల్, హైజంప్లో మోక్షిత్ కుమార్, ఖోఖోలో రామ్చరణ్ ఎంపికయ్యారన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీడీ ప్రసాద్, పీఈటీ షబానాను బుధవారం ప్రిన్సిపాల్ అభినందించారు. -
డీఈఈ కోర్సులో ప్రవేశానికి రెండోదశ కౌన్సెలింగ్
పుట్టపర్తి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) కోర్సులో ప్రవేశానికి రెండోదశ కౌన్సెలింగ్కు శ్రీకారం చుట్టినట్లు బుక్కపట్నం డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 నుంచి 16 వరకూ ఆప్షన్ల నమోదు, ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకూ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. తరగతులు ఈనెల 27 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలని, ఇంటర్లో రిజర్వేషన్ వర్గాలకు 45 శాతం, ఇతర వర్గాల వారికి 50 శాతం మార్కులు ఉండాలన్నారు. అలాగే డీఈఈ సెట్లో ఓసీ, బీసీలకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు 25 మార్కులు ఉండాలన్నారు. ఒకేషనల్ కోర్సులు చేసిన వారు అర్హులు కారన్నారు. రూఫ్ టాప్ సోలార్ పనులు వేగవంతం చేయాలి అనంతపురం టౌన్: రూఫ్ టాప్ సోలార్ పనులను వేగవంతంగా చేపట్టాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. రాయలసీమ జిల్లాల విద్యుత్ అధికారులతో సీఎండీ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్ సంస్థ పరిధిలోని రాయలసీమ జిల్లాల్లో 50వేల రూఫ్టాప్ విద్యుత్ సర్వీసుల్లో నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై చేపడుతున్న సోలార్ పనులను వేగవంతంగా అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రూఫ్టాప్ సోలార్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లతో చర్చించి, రోజువారి పురోగతి చూపాలని ఆదేశించారు. సచివాలయాన్ని ముట్టడించిన చేనేతలు ● ‘నేతన్న సేవ’లో అర్హులకు అన్యాయం చేశారని ఆవేదన ధర్మవరం: అర్హులకు ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేయకపోవడంపై చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు సంక్షేమ పథకం లబ్ధి చేకూర్చిన రాజకీయ నేతలపై మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్ కాలనీకి చెందిన పలువురు చేనేతలు వైఎస్సార్సీపీ నాయకుడు ఆకుల రామలింగ ఆధ్వర్యంలో 27వ వార్డు సచివాలయాన్ని ముట్టడించారు. ‘నేతన్న సేవ’ పథకంలో అర్హులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సచివాలయాన్ని ఎదుటే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ...వార్డులో 136 మంది చేనేత కార్మికులు ఉండగా, వారికి ఎవరికీ ‘నేతన్న సేవ’లో పథకం వర్తింపజేయలేదన్నారు. సచివాలయ గ్రూప్ అడ్మిన్, టీడీపీ నాయకులు కుమ్మకై ్క అనర్హుల పేర్లు జాబితాలో చేర్చి లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. చేనేతల ధర్నా గురించి తెలుసుకున్న పోలీసులు సచివాలయం వద్దకు వచ్చి చేనేత కార్మికులకు సర్దిచెప్పారు. అంతేకాకుండా చేనేత కార్మికులతో దరఖాస్తులు తీసుకోవాలని సచివాలయ అడ్మిన్కు సూచించారు. దీంతో చేనేత కార్మికులు ధర్నా విరమించారు. వైఎస్సార్సీపీ శాంతిర్యాలీపై అధికార పార్టీ అక్కసు ● దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సహా 11 మంది నాయకులపై అక్రమ కేసు పుట్టపర్తి: డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చాలని కోరుతూ యువత, డీఎస్సీ అభ్యర్థులతో కలిసి ఈనెల 10న శాంతియుత ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ నాయకులు 11 మందిపై పుట్టపర్తి పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డితో పాటు రవి నాయక్, ఓబుళపతి, ఏవీ రమణారెడ్డి, జి.గంగాద్రి, ఈశ్వరప్ప, తలమర్ల శ్యాం సుందర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కేశవ, లేపాక్షిరెడ్డి, జయప్ప తదితరులపై బీఎన్ఎస్ 189(2), 126(2), 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీఆర్ఓ ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ యువరాజ్ చెప్పారు. ఈ చర్యలను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తప్పుపట్టారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించడం నేరమా అని ప్రశ్నించారు. ర్యాలీకి వచ్చిన స్పందన చూసి తట్టుకోలేని కూటమి ప్రజాప్రతినిధి ఆదేశాలతో అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అక్రమ కేసులకు బయపడేది లేదని, ఇందుకు చందబ్రాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. -
దీన్ని ఆస్పత్రి అంటారా?
● పెనుకొండ సీహెచ్సీ తనిఖీలో కలెక్టర్ శ్యాంప్రసాద్ అసహనం ● సేవలు, సౌకర్యాల కొరతపై డీసీహెచ్ఎస్కు మెమో పెనుకొండ రూరల్: ‘‘దీన్ని ఆస్పత్రి అంటారా.. సౌకర్యాలు మరీ ఇంత అధ్వానమా.. సేవలు ఇంతదారుణంగా ఉంటే ఎలా.. అసలు ఆస్పత్రి పర్యవేక్షణను ఎవరైనా పట్టించుకుంటున్నారా’’ అంటూ కలెక్టర్ శ్యాంప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పెనుకొండలోని సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. వార్డులు, ఫార్మసీ, ఎక్స్రే గదులు, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. వైద్యులు అందిస్తున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ట్రామా కేర్ సెంటర్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఓపీ సేవలను పరిశీలించారు. సౌకర్యాలు, సేవలపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడిని చేస్తూ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్)కు మెమో ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. మరో నెల తర్వాత తాను మళ్లీ ఆస్పత్రిని సందర్శిస్తానని ఆలోపు ఆస్పత్రిలోని సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. ఆస్పత్రి ఆవరణలోని సీమాంక్ సెంటర్కు అవసరమైన వసతులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. నూతన మార్చురీ గది నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న 104 వాహనాన్ని మహాప్రస్థానం వాహనంగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి ఆవరణం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆస్పత్రి కారిడార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, సీహెచ్సీ సూపరింటెండెంట్ మోహన్ నాయక్, తహసీల్దార్ స్వాతి, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే వేయండి
కదిరి అర్బన్/తనకల్లు: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులంతా ప్రత్యామ్నాయ పంటలే సాగుచేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డా. పీవీ సత్యనారాయణ సూచించారు. ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో రైతుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఆయన బుధవారం కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానానికి విచ్చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. సుమతి, డా. జయలక్ష్మి, డా. సంపత్కుమార్తో కలిసి పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. గత జూన్లో ఎక్కువ వర్షపాతం నమోదుకావడంతో రైతులు వర్షాధార పంటల సాగు చేశారని, కానీ జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు బెట్టతట్టుకునేందుకు రైతులకు సలహాలిచ్చామన్నారు. కొత్తగా పంటలు సాగుచేయాలనుకునే వారు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. కార్యక్రమంలో కదిరి వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. భాస్కర్రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ పీవీ సత్యనారాయణ, శాస్త్రవేత్తలు తనకల్లు మండల పరిధిలోని పరాకువాండ్లపల్లిలో ఎల్–నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో పండే కొర్ర, సజ్జ, జొన్న తదితర పంటలను సాగు చేసుకోవడం ఉత్తమమన్నారు. నీటి వృథాను అరికట్టడానికి డ్రిప్ సాంకేతికతపై అవగాహనను పెంచుకోవాలన్నారు. అనంతరం ఎల్నినో పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన శాసీ్త్రయ సాగు విధానాలను, డ్రై ల్యాండ్ టెక్నాలజీ, వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు నిర్వహణ పద్ధతులను వివరించారు. రైతులకు ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ సూచన -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పెనుకొండ రూరల్: పర్యవరణాన్ని పరిరక్షిస్తూ భూగర్భజలాను పెంపొందించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన మంత్రి సవితతో కలిసి పెనుకొండ 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ‘సీడ్ బాల్స్’ వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రోన్ల సాయంతో ‘సీడ్ బాల్స్’ను అటవీ ప్రాంతంలో చల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ ప్రాంతంలో వెదజల్లేందుకు 13 లక్షల సీడ్ బాల్స్ సిద్ధం చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియాను పక్కనపెట్టి ప్రకృతికి దగ్గర కావాలని హితవు పలికారు. ప్రతి శుభ కార్యానికి ఒక మొక్కను నాటడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఎఫ్ఓ చక్రపాణి, ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి, డీఆర్ఓ షఫీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విధుల్లో అలసత్వాన్ని సహించం.. అంతకుముందు స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు, పెండింగ్ ఫైళ్లు, మీ–సేవా దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, వినతులు ఎప్పటికప్పుడు పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన, ఇతర రెవెన్యూ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ స్వాతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ నేడు పుట్టపర్తిలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, యువత, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తిలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగుతుందన్నారు. జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటిచెప్పే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మామిడి రైతు కన్నీటి కష్టం
తనకల్లు: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా...భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బావులు, చెరువులు, కుంటలు నీరు సైతం ఇంకిపోగా, బోర్ల నుంచి కూడా నీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు పొలాలను బీళ్లుగా వదిలేశారు. అయితే ఏళ్లుగా ఉద్యానతోటలు సాగుచేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 15 నుంచి 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి చెట్లు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే కుదేలైన మామిడి రైతులు...అష్టకష్టాలు పడి రూ. లక్షలు ఖర్చు చేసి పెంచిన మామిడిచెట్లు కళ్ల ముందే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా.. తనకల్లు మండలంలో రైతులు ఏళ్లుగా మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఈ ఒక్క మండలంలోనే దాదాపు 1,200 ఎకరాలకు పైగానే మామిడి తోటలున్నాయి. అయితే వర్షాలు లేకపోవడం, వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటిపోవడంతో మామిడి తోటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. ట్యాంకర్లతో తోటలకు నీరు అందించాలంటే ఒక్కో ట్యాంకర్కు రూ. 1,000కి పైగా చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో చేసేది లేక ఎండిపోయిన మామిడి చెట్లను తొలగించుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్యాంకర్లతో తోటలకు నీటిని అందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. ఎల్–నినోతో తీవ్ర వర్షాభావం.. అడుగంటిన భూగర్భ జలం నీరందక ఎండిపోతున్న మామిడి తోటలు చెట్లను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా ఒక్కో ట్యాంకర్ నీరు రూ.1000 ప్రకారం కొంటున్న రైతులు -
బోనం.. చౌడేశ్వరీ వైభోగం
పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): మేళతాళాలు...భక్తుల పూనకాలతో చౌడేశ్వరీదేవి బోనాల ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని బుధవారం సోమందేపల్లి గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని అమ్మవారిని స్మరిస్తూ ముందుకుసాగారు. ప్రధాన రహదారుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. చిన్నారులు, మహిళలు అమ్మవారి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేశారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు. -
చెట్లను తొలగించుకున్నాం
మేము 25 ఎకరాల్లో మామిడితో పాటు నేరేడు, ఉసిరి, నిమ్మ, కొబ్బరి తదితర తోటలను సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడం, బోర్లలో నీరు రాక ఇప్పటికే 80 మామిడి చెట్లు పూర్తిగా ఎండిపోగా, వాటిని తొలగించాం. మరో 160 చెట్లు ఎండిపోయేలా ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యాన రైతులను ఆదుకోవాలి. – గీతారాణి, పీవీకే పల్లి, తనకల్లు మండలం నీరు ఉచితంగా సరఫరా చేయాలి మా గ్రామంలోని రైతులం వందల ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశాం. వర్షాలు లేకపోవడంతో మామిడి తోటలతో పాటు ఇతర పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో అరకొర నీరు వస్తోంది. ఆ నీరు తోటలకు సరిపోవడం లేదు. ప్రభుత్వం ఉచితంగా ట్యాంకర్లతో తోటలకు నీటిని సరఫరా చేయాలి. – భాస్కర్రెడ్డి, పెద్ద కడపలవాండ్లపల్లి, తనకల్లు మండలం -
హోరా హోరీగా క్రీడా పోటీలు
హిందూపురం: మండలంలోని కె.బసవనపల్లి జెడ్పీ హైస్కూల్లో అమరావతి చాంపియన్షిప్ –2026 జిల్లాస్థాయి పోటీలు హోరాహోరీగా జరిగాయి. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకాలను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు డిస్ట్రిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ పేర్కొన్నారు. మంగళవారం 40 మంది పీడీల పర్యవేక్షణలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కిశోర్ పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎంలు రవీంద్రరెడి, పీడీలు సురేష్ కుమార్, అరుణా, మాజీ స్కూల్ గేమ్స్ సెక్రెటరీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు మళ్లీ నిరాశే
అనంతపురం సెంట్రల్: అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీల నీరు మాత్రమే కేటాయించారు. అది కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారు. ఈ మేరకు మంగళవారం కర్ణాటకలో జరిగిన తుంగభద్ర బోర్డు మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్రావు తెలిపారు. ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్లోనూ పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చునని భావించిన తుంగభద్రబోర్డు అధికారులు ఈ ఏడాది జలాశయానికి నీటి లభ్యత 170 టీఎంసీలుగా లెక్క కట్టారు. ఇటీవల తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జలాశయంలోకి భారీస్థాయిలో నీరు వచ్చింది. ప్రస్తుతం నీటి మట్టం 82.599కు చేరుకోగా 41167 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ఈ లెక్కన హెచ్చెల్సీతో పాటు అన్ని ప్రధాన కాల్వలకూ నీటి కేటాయింపులు చేశారు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 15 టీఎంసీలు విడుదల చేసేలా నిర్ణయించారు. భవిష్యత్తులో నీటి లభ్యత పెరిగితే నీటి కేటాయింపులు పెరిగే అవకాశమూ లేకపోలేదు. మొత్తం తాగునీటికే.. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి ఈఏడాది అత్యల్పంగా నీరు కేటాయించడంతో రానున్న కాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా వచ్చిన నీటిని వచ్చినట్లు రిజర్వాయర్లలో నిల్వ చేయాలని నిర్ణయించారు. కణేకల్లు చెరువు, గుంతకల్లు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే ఆర్డబ్ల్యూఎస్ స్కీములకు నీటిని విడుదల చేశారు. తక్కిన నీటిని నేరుగా పీఏబీఆర్లో నిల్వ చేయనున్నారు. ఇక్కడి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకం ద్వారా అనంతపురం నగరపాలకసంస్థకు, శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకాల ద్వారా అన్ని నియోజకవర్గాలకూ నీటిని సరఫరా చేయనున్నారు. హెచ్చెల్సీకి 15 టీఎంసీలే తుంగభద్ర మొదటి బోర్డు సమావేశంలో నిర్ణయం కనిష్ట స్థాయిలో నీటి కేటాయింపులు తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు తుంగభద్ర జలాశయంలోకి వచ్చే నీటి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు చేశారు. ప్రస్తుతం నీటి లభ్యత.. అంచనా ఆధారంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీలు కేటాయించారు. ఆ నీటిని మొత్తం తాగునీటికే వినియోగించనున్నాం. ఎక్కడా పంటలు సాగు చేయడానికి వీల్లేదు. నిన్నటి వరకు 500 క్యూసెక్కులు మాత్రమే వచ్చేవి. మంగళవారం నుంచి 800 క్యూసెక్కులకు పెంచాం. గురువారం నాటికి 1500 క్యూసెక్కులు తీసుకోవాలని భావిస్తున్నాం. రైతులు, ప్రజలు సహకరించాలి. – సుధాకర్రావు, ఎస్ఈ, హెచ్చెల్సీ -
ప్రజలకు రక్షణకు అధిక ప్రాధాన్యం : ఎస్పీ
ధర్మవరం అర్బన్: ప్రజా రక్షణకే పోలీసుశాఖ అధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఎస్పీ సతీష్కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రధాన రహదారులు, బీట్ పాయింట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, నైట్ బీట్, పెట్రోలింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాన్ని సమీక్షించారు. అనంతరం కాలేజీ సర్కిల్లో పోలీసుల గస్తీ, పెట్రోలింగ్ వాహనాల కదలికలను పరిశీలించారు. రాత్రివేళల్లో సంచరిస్తున్న వ్యక్తులు, వాహనాల వివరాలను తెలుసుకున్నారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, దేవాలయాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో నైట్బీట్, పెట్రోలింగ్ను మరింత పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా బయట సంచరించకూడదని ప్రజలకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమంలో మంచి ఫలితాలు సాధించాలిప్రశాంతి నిలయం: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ మంచి ఫలితాలు సాధించి, లక్ష్యాలను పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలపై అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలతో సమగ్ర వివరణ ఇవ్వాలన్నారు. ఎన్నినో పరిస్థితుల దృష్ట్యా పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. అనధికారిక లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. అలరించిన సంగీత కచేరీప్రశాంతి నిలయం: సత్యసాయిపై భక్తి భావనను చాటుతూ జమ్మూ కాశ్మీర్ భక్తులు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేశారు. మంగళవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరి సాగింది. చక్కటి భక్తిగీతాలతో వారు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను మైమరపింపజేసింది. తర్వాత భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
అర్హులకు అన్యాయం చేస్తారా ?
ధర్మవరం అర్బన్: ‘అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేలు డబ్బులు వేయకుండా అనర్హులకు వేశారు. నిజమైన చేనేత కార్మికులకు అన్యాయం చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు అర్హులైన చేనేత కార్మికుల అకౌంట్లలోకి నేతన్న పథకం కింద రూ.25 వేలు జమ చేయాలి. లేకపోతే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పురుగుల మందు డబ్బాలతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. అందరూ వాటాలు పంచుకున్నారు ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే 15 వేల మందికి నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేశామని, ప్రస్తుతం కేవలం 6 వేల మందికి మాత్రమే అందించారన్నారు. నీకు సగం, నాకు సగం అంటూ అధికారులు, నాయకులు నేతన్న పథకం డబ్బులు పంచుకున్నారన్నారు. అనర్హులకు పథకాన్ని వర్తింపచేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన చేనేత కార్మికులకు డబ్బులిచ్చే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. అనర్హులకు డబ్బులేసి తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మంత్రి సత్యకుమార్యాదవ్ కేవలం మీటింగుల్లో గొప్పలు చెబుతుంటారని, ఆచరణలో మాత్రం ఏవీ కావన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ నేతన్న నేస్తం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని, మరి ఉచిత కరెంటు ఇస్తున్న కార్మికులకు డబ్బులు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మవరంలో 52 మంది చేనేత కార్మికులు ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పటికైనా వెంటనే హ్యాండ్లూమ్ అధికారులను పిలిపించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ఆర్డీఓ రాంభూపాల్రెడ్డికి అర్హులైన చేనేత కార్మికుల జాబితాలను అందించారు. ధర్నాలో వైఎస్సార్సీపీ చేనేత నాయకులు కాచర్ల అంజి, గడ్డం రంగ, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు షేక్ చాంద్బాషా, పట్టణాధ్యక్షుడు కోటిరెడ్డి బాలిరెడ్డి, చెలిమి పెద్దన్న, శంకర్ తేజ, కత్తె పెద్దన్న, జింకా కంబగిరి, బ్రహ్మయ్య, యల్లయ్య, దేవరకొండ రమేష్, కడప రంగస్వామి, శివ, గుండా ఈశ్వరయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు. నేతన్న నేస్తం పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయాలి లేకపోతే 15న పురుగుల మందు డబ్బాలతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి -
దివ్యాంగ విద్యార్థులతో పనులా?
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఉదయం దివ్యాంగ విద్యార్థులతో ఉపాధ్యాయులు పనులు చేయించారు. చూపు, మాట, వినికిడి తదితర లోపాలతో బాధపడుతున్న విద్యార్థులతో ప్రాంగణంలో సున్నం వేయించారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి అంధ విద్యార్థులన్న కనీస కనికరం లేకుండా వెట్టిచాకిరీ పనులు చేయించారని, వెంటనే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షకుమార్ డిమాండ్ చేశారు. ప్రాంగణంలోని గోడలకు, పరిసరాలకు విద్యార్థులచే సున్నం వేసే పనులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈమేరకు పాఠశాలలో విద్యార్థులతో కలిసి జరిగిన ఉదంతంపై మంగళవారం సాయంత్రం చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్ర పెరిగిందన్నారు. కనీస కనికరం లేకుండా దివ్యాంగ విద్యార్థులతో పనులు చేయించడం వెట్టి చాకిరీ కాదా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలే ముందుకొచ్చి పనులు చేశారు రాబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను పురస్కరించకుని పిల్లలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతుగా పనులు చేయాలని భావించారని, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని ప్రిన్సిపాల్ రాజేశ్వరి తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు -
‘ఎన్ఎంఎంఎస్’ మెరిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోండి
పుట్టపర్తి: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాల్లో ఎంపికై న విద్యార్థుల మెరిట్ కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ ఏడీ లాజరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www. bse. ap. gov. in లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు వెంటనే బ్యాంకులో ఖాతా తెరిచి , విద్యార్థి ఆధార్ను లింక్ చేయించి డీపీటీ ద్వారా డబ్బు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెరిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని సక్రమంగా ఉన్న వివరాలను సరి చూసుకొని www. scholarships. gov. in లో నమోదు చేసి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలన్నారు. తర్వాత సంబంధిత పాఠశాల నోడలాఫీసర్, జిల్లా నోడలాఫీసర్ లాగిన్ ద్వారా అప్రూవ్ చేయించుకోవాలన్నారు. ముద్రించిన మెరిట్ కార్డులను త్వరలోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. రేపటి నుంచి అంగన్వాడీ ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ధర్మవరం, మడకశిర రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ ప్రమీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మవరం, సీకేపల్లి, బత్తలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అభ్యర్థులకు ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు ధర్మవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, 14న ఉదయం 10.30 గంటలకు మడకశిర డివిజన్ పరిధిలోని మడకశిర, గుడిబండ ప్రాజెక్టుల్లోని అభ్యర్థులకు మడకశిరలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. బీటెక్లో బైపీసీ విద్యార్థులకు ప్రవేశాలు మడకశిర రూరల్: వ్యవసాయ ఇంజినీరింగ్ బీటెక్ కోర్సులో బైపీసీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా ప్రవేశాలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఏడు కొండలు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు నాలుగేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్ బీటెక్ కోర్సులు ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే ఉండేవన్నారు. తాజా ఉత్తర్వులతో కన్వీనర్ కోటా కింద మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో బైపీసీ విద్యార్థులకు 15 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏపీఈఏపీసీఈటీ పరీక్ష రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. బైపీసీ విద్యార్థులకు బుధవారం నుంచి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 17 లోపు విద్యార్థులు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. గురువారం నుంచి 18వ తేదీ వరకూ విద్యార్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను పరిశీలిస్తారని వివరించారు. 14 నుంచి 19వ తేదీ వరకూ సీట్ల కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నారు. -
సోమందేపల్లిలో చేనేతల నిరసన
పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): చేనేత కార్మికులకు అన్ని అర్హతలు ఉన్నా నేతన్న నేస్తం పథకం వర్తింపజేయకపోవడం సరికాదని సీపీఐ నేతలు మండిపడ్డారు. అర్హులకు నేతన్న నేస్తం వర్తింపజేయలేదంటూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేనేత కార్మికుల ఎంపిక పారదర్శకంగా జరగలేదన్నారు. మండల వ్యాప్తంగా 500 చేనేత మగ్గాలు ఉండగా, దాదాపుగా 800 మందికి నేతన్న నేస్తం పథకం ఎలా అమలు చేశారో చెప్పాలన్నారు. ఒకే సచివాలయంలో 600 మందిని అర్హులుగా నిర్ధారించడం ఎలా సాధ్యమైందో అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపుగా 150 మంది చేనేతలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకం వర్తింజేయలేదన్నారు. ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి, గంగరాజు, శ్రీకాంత్, చేనేత సంఘం నాయకులు నారాయణస్వామి, దాసరి సుధాకర్, శ్రీనివాసులు, అఽశ్వర్థ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
పుట్టపర్తి అర్బన్: బాలికలు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ముందుకెళ్లాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత , ప్రముఖ అథ్లెట్ మాలతీ, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లోని ఓ ఫంక్షన్ హాల్లో ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ విద్యార్థినులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం సమష్టి బాధ్యతన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత చదువులను అభ్యసించాలన్నారు. జిల్లాలో డ్రాపౌట్స్ పెరుగుతుండడం, బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 156 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు, సోషల్ మీడియాకు లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. అత్యవసర సమయాల్లో 112 టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకితా సురానా, ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం, డీఈఓ కిష్టప్ప, డీఆర్డీఏ పీడీ నరసయ్య, విద్యార్థినులు పాల్గొన్నారు. -
రైలు నుంచి కింద పడి తూ.గో.వాసి మృతి
బత్తలపల్లి: మండల పరిధిలోని డి.చెర్లోపల్లి–చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్ మధ్య రైలు నుంచి కిందపడి తూర్పుగోదావరి జిల్లా వాసి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గోల్లకొట్టూరిపాలెం గ్రామానికి చెందిన వీరవెంకటదుర్గాప్రసాద్ (36) పెనుకొండ సమీపంలో మరిమాకుల పల్లి వద్ద ఉన్న సోలార్ ప్లాంట్లో కూలీగా పని చేస్తున్నాడు. ఆయనకు పెళ్లి కాలేదు. ఈ నెల 9న ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ధర్మవరం నుంచి నర్సాపూర్ రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే 2.50 నిమిషాలకు వీరవెంకటదుర్గాప్రసాద్ ఫోన్ స్విచాఫ్ అయింది. మంగళవారం మధ్యాహ్నం రైల్వే గ్యాంగ్మెన్ శంకర్ డి.చెర్లోపల్లి–చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్ మధ్య పట్టాలపై వెళుతుండగా ముళ్లపొదల్లో పడి ఉన్న వీరవెంకటదుర్గాప్రసాద్ మృతదేహాన్ని చూసి ఎస్ఎంఆర్కు సమాచారం అందించాడు. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. మరేమైనా కారణాలున్నాయా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఎర్ర చందనం దుంగల స్వాధీనం.. ఒకరి అరెస్టు తలుపుల: మండలంలోని సంగటివారిపల్లి సమీపంలోని కోలేకనుమ వద్ద కారులో నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకన్నట్లు ఎఫ్ఎస్ఓ బ్రహ్మయ్య తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ముందస్తు సమాచారంతో కోలేకనుమ వద్ద ఆదివారం రోడ్డుపై అధికారులు కాపు కాశారు. ఈ క్రమంలోనే కడప నుంచి బెంగుళూరుకు ఇన్నోవా కారులో ఎర్ర చందనం దుంగలు తరలిస్తుండగా పట్టుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం లింగాల దిన్నెకు చెందిన బంగారురెడ్డి పట్టుబడగా, మిగిలిన ఇద్దరు పారిపోయారు. కారును కదిరి అటవీ కార్యాలయానికి తరలించారు. నిందితుడిని మంగళవారం తిరుపతి ఎర్రచందనం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు ఎఫ్ఎస్ఓ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్బీఓలు నరసింహమూర్తి, స్రవంతి పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమల గ్రామ సమీపంలోని పెంకల గేట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మంగళవారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిస్తే 9346010561 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
ఏపీఐఐసీకి నూతన అధికారుల నియామకం
ప్రశాంతి నిలయం: జిల్లా పరిధిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూసేకరణ, పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు అధికారులను జిల్లాకు బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా పని చేస్తున్న జి.రామకృష్ణారెడ్డిని వాణిజ్య, పరిశ్రమలశాఖ పుట్టపర్తికి జోనల్ మేనేజర్గా బదిలీ చేశారు. అలాగే రాష్ట్ర భూ పరిపాలనా విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేస్తున్న ఎస్.మహబూబ్బాషాను వాణిజ్య, పరిశ్రమలశాఖ పుట్టపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూసేకరణ, పారిశ్రామిక అభివృద్ధి పనులను వీరు పర్యవేక్షించనున్నారు. -
శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు
గుడిబండ: రైతులు పట్టు పరిశ్రమ వైపు దృష్టి సారించాలని, శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తే పట్టు పురుగుల పెంపకంలో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి శోభారాణి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బీటీ పల్లిలో మల్బరీ సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ రైతులు మల్బరీ సాగు, పురుగుల యాజమాన్యం, ఆధునిక పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నాణ్యమైన గుడ్లను ఉత్పత్తి చేసి అధిక లాభాలు పొందవచ్చునని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాన్నారు. మల్బరీలో నేచురల్ ఫార్మింగ్, పట్టు పురుగుల పెంపకంలో మెలకువలను వివరించారు. కార్యక్రమంలో ఏడీ హనుమంతరాయప్ప, ఆర్ఎస్ఆర్ఎస్ శాస్త్రవేత్త రమ్య, ఏఎస్ఓ సరోజిని, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ యువతి మృతితాడిమర్రి: పురుగుల మందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని నిడిగల్లు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నిడిగల్లు గ్రామానికి చెందిన జవాబు వీరయ్య, ఓబుళమ్మ దంపతుల కుమార్తె రేణుక (36) పదో తరగతి వరకు చదివింది. తండ్రి పదేళ్ల క్రితం మృతి చెందడంతో టైలర్ పని నేర్చుకుని కుటుంబానికి చేదోడుగా ఉండేది. వయసు మీద పడుతున్నా వివాహం కాలేదని మనస్తాపం చెందిన ఆమె గత నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడిన రేణుక నాలుగు రోజుల తర్వాత సోదరుడు మోహన్కు మందు తాగిన విషయం తెలిపింది. దీంతో వారు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న రేణుక మంగళవారం ఉదయం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి మడకశిరరూరల్: మండల పరిధిలోని జమ్మానిపల్లిలో ఇంటి ఆవరణంలోని గొర్రెల పాకలోకి కుక్కలు ప్రవేశించి ఏడు పిల్లలపై దాడి చేసి చంపేశాయని బాధిత గొర్రెల కాపరి శేషప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. శేషప్ప మంగళవారం ఉదయం గొర్రె పిల్లలకు మేత వేసి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కుక్కలు 7 పిల్లలపై దాడి చేసి చంపి వేశాయి. రూ.40 వేల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరాడు. -
ఇంట్లో బంగారు ఆభరణాల అపహరణ
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పెద్దిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన మేరకు...పెద్దిరెడ్డిపల్లికి చెందిన నారాయణస్వామి కుమారుడు ఆదినారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి గత సోమవారం కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న వారు తలుపులు, లోపలి బీరువా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని 250 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రవికుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. దొంగల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యతో గొడవ పడి.. రైల్వే ట్రాక్పై పడుకుని● యువకుడిని కాపాడిన పోలీసులు కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): భార్యతో గొడవ పడి ఆత్మహత్యకు యత్నించిన ఒక యువకుడిని చెన్నేకొత్తపల్లి పోలీసులు కాపాడారు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లికి చెందిన గణేష్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తి– ధర్మవరం మార్గంలో బసంపల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై పడుకున్నాడు. సెల్ఫీ తీసుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఘటనా స్థలాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్థానికుల సహకారంతో అక్కడికి చేరుకున్నారు. యువకుడికి ఏఎస్ఐ వేణుగోపాల్ సర్ది చెప్పి ట్రాక్పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. వివాహితుడైన గణేష్ తన భార్యతో గొడవ పడి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తికి జైలు గోరంట్ల: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో మంగళవారం గోరంట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తిని అరెస్టు చేశారు. నిందితుడిని పెనుకొండ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ అనుపమ నిందితుడికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమాన విధించినట్లు సీఐ శేఖర్ తెలిపారు. -
పూల తోటను మాడ్చిన కలుపు మందు!
అమరాపురం: కలుపు మొక్కకు మందును పిచికారీ చేస్తే తోటలోని 300 కాకడ పూల చెట్లు ఎండిపోయాయని ఓ రైతు వాపోయాడు. వివరాలు.. మండల పరిధిలోని తమ్మడేపల్లికి చెందిన రైతు మధుసూదన్ తన పొలంలో 300 కాకడ మొక్కలు సాగు చేశాడు. శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో పూల దిగుబడి పెరగాలని, చెట్లలో ఉన్న పురుగులు చావాలనే ఉద్దేశంతో మందు తెచ్చి పిచికారీ చేశాడు. పురుగు మందుకు బదులు కలుపు మందును ప్రతి చెట్టుకు పిచికారీ చేశాడు. సాయంత్రానికి కాకడ చెట్ల ఆకులు, పూలు, మొగ్గ ఎండిపోయాయి. దీంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రావణ మాసంలో మంచి లాభాలు గడించవచ్చని అనుకున్న తరుణంలో ఇలా జరిగిందంటూ వాపోయాడు. సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని ఆయన కోరాడు. -
వైభవం.. బోనాల ఉత్సవం
కనగానపల్లి: మండలంలోని వేపకుంట గ్రామంలో మంగళవారం పోతలయ్యస్వామికి బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతలయ్యస్వామి ఆలయానికి పచ్చని తోరణాలు కట్టి స్వామి వారిని ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు, యువకులు బోనాల దుత్తలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. గొర్రెలు, మేకలు, పాడి పశువులను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. గ్రామ దేవతలకు పూజలు చేయటం ద్వారా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్మకమని గ్రామ పెద్దలు తెలిపారు. -
ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలం
మడకశిరరూరల్: ప్రస్తుత ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు మాసంలో వర్షం పడితే రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్ చాన్స్లర్) డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆమిదాలగొంది పంచాయతీలో పర్యటించారు. రైతులు సాలు పద్ధతిలో సాగు చేసిన కంది, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవడంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు మాసంలో వర్షాలు పడితే రైతులు కంది, పెసర, కొర్ర, సజ్జ, జొన్న తదితర పంటలను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. జూన్ మాసంలో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలు బెట్టకు గురి కాకుండా పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ పంటలను రక్షించుకోవాలన్నారు. నీటి పొదుపు పద్ధతులు, వాతావరణానికి అనుగుణంగా పంటల సాగు చేసుకోవాలన్నారు. కందిలో తల్లి సాలు తీయడం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండడంతో తేమ ఎక్కువ రోజులు పంట ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు సుమతి, విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఇయర్స్ డాక్టర్ సంపత్ కుమార్, నంద్యాల పరిశోధన సంచాలకులు విజయలక్ష్మి, ఏఓ తిమ్మప్ప, వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ -
ఎమ్మెల్సీ బృందాన్ని కలిసిన వైఎస్సార్ టీఏ నాయకులు
పుట్టపర్తి: మాజీ సీఎం వైఎస్ జగన్ చొరవతో పలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ బృందాన్ని వైఎస్సార్టీఏ నాయకులు మంగళవారం తిరుపతిలో కలిశారు. ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కల్పలతారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలను విన్నవించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, టెట్ మినహాయింపు తదితర అంశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్కుమార్రెడ్డి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల అధ్యక్షులు పీవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు. ఆలువ వేటగాళ్ల అరెస్ట్కదిరి టౌన్: ఆలువ వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దొరిగల్లు ఈస్ట్ బీట్, దొరిగల్లు రిజర్వు ఫారెస్ట్లోని వనం బావి ప్రాంతంలో సోమవారం వేటగాళ్లు ఆలువను వేటాడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది వెంటనే దాడి చేశారు. నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుళ్లాయప్ప, ఉమామహేశ్, గంగన్న యాదవ్, బత్తలపల్లికి చెందిన ముత్యాలయ్య, ఆంజినేయులును అరెస్టు చేశారు. వేటగాళ్ల నుంచి ఒక ఆలువ, స్కూటర్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కదిరి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపారు. ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు కదిరి టౌన్: పట్టణ పోలీసులు ఇద్దరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. కదిరిలోని నారాయణమ్మ కాలనీకి చెందిన అంజినమ్మ, అల్తాఫ్ పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన ఓ ప్రేమ జంట ఇటీవల పారిపోయి వచ్చి అల్తాఫ్ ఇంట్లో తలదాచుకుంది. ఈ విషయంపై పోలీసులకు అంజినమ్మ సమాచారం ఇచ్చిందని అనుమానించిన అల్తాఫ్ మంగళవారం ఆమైపె దాడికి పాల్పడ్డాడు. కులం పేరుతో దూషించాడు. స్థానికురాలు ప్రమీలతో కలిసి ఇటుకతో చాతీపై కొట్టి గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అల్తాఫ్, ప్రమీలపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
విద్యార్థి అదృశ్యం కలకలం
మడకశిర: మండలంలో మంగళవారం ఓ విద్యార్థి అదృశ్యం ఘటన కలకలం సృష్టించింది. గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. మండలంలోని కే. కొత్తపాళ్యం గ్రామానికి చెందిన అజిత్ 3వ తరగతి చదువుతున్నాడు. రోజూ విద్యార్థి కొత్తపాళ్యం నుంచి పీఎస్ తండాలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. మంగళవారం విద్యార్థి అజిత్ అవ్వ తమ పిల్లాడిని స్కూల్ దగ్గర వదలమంటూ గ్రామంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంలో ఎక్కించింది. అయితే విద్యార్థిని స్కూల్ దగ్గర దించకుండా ద్విచక్ర వాహనదారుడు మరిచిపోయి కదిరేపల్లి క్రాస్కు వెళ్లాడు. ఇప్పుడెలా అని అజిత్ను ద్విచక్రవాహన దారుడు అడగ్గా.. సమీపంలోని కేకాతిలో తమ బంధువులు ఉన్నారని, బస్సు చార్జీకి డబ్బులిస్తే అక్కడికి వెళతానని చెప్పడంతో డబ్బులిచ్చి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే విద్యార్థి తప్పిపోయాడంటూ పీఎస్ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రూరల్ సీఐ రాజ్కుమార్, ఎస్ఐ కృష్ణారెడ్డి స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అజిత్ కేకాతి గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ రాజ్కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
కలప.. కొల్లగొడుతున్నారప్ప!
మడకశిర: జిల్లాలో కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న మడకశిర నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో పెద్ద ఎత్తున చెరువులను నిర్మించారు. ఈ చెరువుల్లో వృక్ష సంపద అధికంగా ఉంది. ప్రధానంగా తుమ్మచెట్లు పెద్ద ఎత్తున పెరిగాయి. తుమ్మచెట్ల దుంగల ద్వారా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. తలుపులు, కిటికీలు, మంచాలు, దూలాలు తదితర వాటిని తయారు చేయవచ్చు. ఇంటి సామగ్రికి ఉపయోగపడని దుంగలను బొగ్గుల తయారీకి ఉపయోగిస్తారు. సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు.. ఎంతో విలువైన తుమ్మ చెట్లను కొంత మంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. తొలుత తుమ్మచెట్లను నరికి దుంగలుగా చేసి రాత్రికి రాత్రి వాహనాల్లో కర్ణాటక సరిహద్దుకు తరలిస్తున్నారు. అక్కడ బట్టీల్లో కాల్చి బొగ్గుగా మార్చి కర్ణాటకలోని బెంగళూరు, శివమొగ్గ, దావణగెరె, చిత్రదుర్గకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 47 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, దాదాపు అన్ని చెరువుల్లో అక్రమార్కులు చెట్లను నరికివేసి అక్రమార్జన సాగిస్తున్నారు. ఫిర్యాదు చేసినా జలవనరులశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు.. అమరాపురం మండలం పురవరం చెరువులో తుమ్మ చెట్ల నరికివేతపై మే 25న కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఆయకట్టు రైతు ఈశ్వరప్ప తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం మరోసారి పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఈ సందర్భంగా జలవనరుశాఖ అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు, జలవనరుల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. చెరువుల్లో యథేచ్ఛగా తుమ్మ చెట్ల నరికివేత రూ.లక్షల్లో అక్రమార్జన జలవనరులశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలుఅమరాపురం మండలం హేమావతి గ్రామ పంచాయతీలోని పురవరం మైనర్ ఇరిగేషన్ చెరువులో పడి ఉన్న తుమ్మ చెట్ల దుంగలివి. చెరువులోని తుమ్మ చెట్లను కొంత మంది అక్రమార్కులు యథేచ్ఛగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెట్ల నరికివేత ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై జలవనరులశాఖ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. -
ప్రభుత్వ భూమికి అక్రమంగా పట్టాలు
● రద్దు చేయాలని ఆర్డీఓకు గ్రామస్తుల వినతిపత్రం అగళి: మండల పరిధిలోని నరసబుంది గ్రామంలో కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా పాసు పుస్తకాలు పొందారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ పట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం మడకశిరలో ఆర్డీఓ నాగప్రసన్నలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. సర్వే నంబర్ 92–1లో 41.65 ఎకరాల్లోని చెరువు పాత కట్టకు చెందిన ప్రభుత్వ భూమికి 50 ఏళ్ల క్రితం పట్టాలిచ్చినట్లు కొందరు చెబుతున్నారన్నారు. సదరు భూమిలో ప్రస్తుతం గ్రామ సచివాలయం, చెత్త సంపద కేంద్రం, పశువుల తాగునీటి తొట్టెతో పాటు పంచాయతీకి చెందిన మూడు తాగునీటి బోరు బావులు ఉన్నాయన్నారు. భూములకు పట్టా పొందినప్పటి నుంచి పట్టాదారులు ఎవరూ సాగు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో పట్టాలు రద్దు చేసి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి నివేదికలు పంపించాలని ఆర్డీఓ నాగప్రసన్న లక్ష్మి స్థానిక అధికారులను ఆదేశించారు. -
ముందు హామీలు అమలు చేయండి
ధర్మవరం అర్బన్: శ్వేతపత్రం విడుదల చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలపై తప్పుడు లెక్కలు చెప్పడంపై ఉన్న శ్రద్ధ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు లేదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్లు ప్రశ్నించారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి సమస్యల పరిష్కారంలో అలుపెరుగని పోరాటాలు చేస్తూ రీ గ్రూపింగ్ స్కేల్స్ సాధన, మెరుగైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, నోషనల్ ఇంక్రిమెంట్లు, అప్రెంటిస్ విధానం రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిందన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు బోధనేతర పనులతో సతమతమవుతున్నారని వాపోయారు. విద్యను ప్రైవేటీకరించడంలో భాగంగా పాఠశాలల మూసివేతకు ప్రభుత్వమే పరోక్షంగా కుట్ర పన్నుతున్నట్లుగా ఉందన్నారు. డీఏలు, పీఆర్సీ, సంపాదిత సెలవుల మంజూరు, మెడికల్ రీయింబర్స్మెంట్, పీఎఫ్ సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకపోగా రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయులకే చెల్లిస్తున్నట్లు శ్వేత పత్రాలను విడుదల చేయడం సరికాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అమర్నారాయణరెడ్డి, నాయకులు ఆంజనేయులు, లతాదేవి, పట్టణ అధ్యక్షులు జింక హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి రామంజినేయులు, డివిజన్ నాయకులు వెంకటకిషోర్, ఆదిశేషు, పోసా సాయిగణేష్, నాగిరెడ్డి, రవిశేఖర్, ప్రదీప్కుమార్, హేమంత్, విశ్వనాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోపు ఫిర్యాదులు పరిష్కరించండి
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సతీష్ కుమార్ 80 వినతులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు విన్న అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, సీఐ బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు. కారు బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు చిలమత్తూరు: మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద కారు బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయచోటి నుంచి బెంగళూరు వెళుతున్న కారు తిమ్మారెడ్డిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటిన 108 ద్వారా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కదిరికి చెందిన సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాయచోటికి చెందిన రేణుక, సురేఖ, సోమశేఖర్, రవికుమార్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కారు ఢీకొని బిహార్ వాసి మృతిగోరంట్ల: కారు ఢీకొని బిహార్ వాసి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జీనవాండ్లపల్లి సమీపంలో జరిగింది. సీఐ బోయ శేఖర్ తెలిపిన మేరకు.. జీనవాండ్లపల్లి సమీపంలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వద్ద సైట్ ఇంజినీర్గా బిహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంతకుమార్ పాండే (36) పనిచేస్తున్నాడు. సోమవారం తన ద్విచక్ర వాహనంలో బ్రిడ్జి వైపు వెళ్తున్న ఆయనను ఓ కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ప్రశాంత కుమార్ పాండే అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉన్నట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణం ఎరగుంటకు చెందిన బోయ దాసరి శ్రీనివాసులు హత్య కేసులో కీలక నిందితుడు గంగాధర్నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని చెరువులో ఆదివారం దాసరి శ్రీనివాసులు శవమై తేలాడు. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన ఆయన చెరువులో శవమై తేలడంతో పోలీసులు పూర్తిగా విచారించి హత్య కేసుగా నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు సోమవారం పట్టణ శివారు ప్రాంతంలో మరో ప్రధాన నిందితుడు గంగాధర్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో నేడో, రేపో అరెస్టు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాగులపాడు చేరుకున్న కృష్ణా జలాలు వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఈ నెల 5న కర్నూలు జిల్లా మల్యాల వద్ద నీటి పంపింగ్ ప్రారంభించగా, 9వ తేదీన అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. మొదట ఒక పంపుతో నీటి పంపింగ్ ప్రారంభించిన అధికారులు నీటి ప్రవాహం పెరగడంతో ఆరు పంపులకు పెంచారు. ఈ క్రమంలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా జలాల రాకతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడు లిఫ్ట్ నుంచి మొత్తం 1,900 క్యూసెక్కుల మేర నీరు పంపింగ్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హంద్రీ–నీవా ఈఈ శ్రీనివాస్నాయక్, ఏఈ సురేష్కుమార్నాయక్ కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీటిని తాగు అవసరాలకు మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. -
దొంగల అరెస్టు
హిందూపురం/లేపాక్షి: ఐదుగురు దొంగలను హిందూపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్లో సీఐ జనార్ధన్ వివరాలు వెల్లడించారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన కె.ఆదినారాయణ, సింహాద్రి, కర్ణాటక రాష్ట్రం చించనహళ్లికి చెందిన సీఎన్ మంజునాథ్, డి.పాళ్యంకు చెందిన రాజేష్, దారినాయకనపల్లికి చెందిన త్రినేజ్లు జల్సాలకు అలవాటు పడ్డారు. వీరంతా బృందంగా ఏర్పడి ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వస్తువులు, నగదు లాక్కునేవారు. లేపాక్షి పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 25న సిరివరం– మనేంపల్లి చెరువు మార్గంలో షామీర్ అనే వ్యక్తిని బెదిరించి అతని వద్ద రూ.4,200 నగదుతో పాటు ఒప్పో ఫోన్ లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు హిందూపురం ఏఎస్పీ మహేష్ పర్యవేక్షణలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం లేపాక్షి సమీపంలో దొంగల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు వాహనాలు, రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ నరేంద్ర, సిబ్బందిని సీఐ జనార్ధన్ అభినందించారు. -
ప్రతి అర్జీని బాధ్యతగా పరిష్కరించండి
● అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ● ‘పరిష్కార వేదిక’కు 331 అర్జీలు ప్రశాంతి నిలయం: రపజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యతగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ప్రశాంతి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిశీ లించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి 331 అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య, ఎస్డీసీ విజయ కుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ రెవెన్యూ భవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సహాయ ఉపకరణాలను అందజేశారు. దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించి వారికి వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఇతర ఉపకరణాలను అందించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన పాల్గొన్నారు. -
టీడీపీ వారు చెబితేనే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తారా?
మడకశిర: టీడీపీ వారు చెబితేనే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తారా..? అంటూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం మడకశిరలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఈరలక్కప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు పారదర్శకంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ నాయకులు చెప్పిన వారికే ట్రాన్స్ఫార్మర్లను అందిస్తున్నారని, రూ.లక్షలు చేతులు మారుతున్నాయని ధ్వజమెత్తారు. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయడం లేదని ఈఈ చంద్రానాయక్కు వివరించారు. ఇప్పటికై నా మేల్కొని పారదర్శకంగా పంపిణీ చేయకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల, పట్టణ కన్వీనర్లు శ్రీరాములు, ఓంకుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కుంచిటి వక్కలిగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతరాజు, మండల కన్వీనర్లు యంజారేగౌడ్, త్రిలోక్నాథ్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం పారదర్శకంగా పంపిణీ చేయకుంటే దీక్షలు చేపడతామని హెచ్చరిక -
శనీశ్వరుడి వేడుకలు చూతము రారండి
పావగడ: శాంత స్వరూపుడు శనీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 5 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 15న శ్రావణ తొలి శనివారోత్సవం నిర్వహిస్తారు. 21న శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా శీతలాంబదేవికి విశేష పూజలు ఉంటాయి. 22న ద్వితీయ శ్రావణ శనివారోత్సవం, 29న తృతీయ శ్రావణ శనివారోత్సవం, వచ్చే నెల 5న నాల్గో శ్రావణ శనివారోత్సవం జరగనున్నాయి. ● ప్రస్తుతం ఉన్న ఆలయ స్థలం వద్ద 1955లో శనీశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తులు పూజించేవారు. అప్పట్లో పావగడలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భగా సీదరగట్ట స్వామి సలహా మేరకు అదే స్థలంలో శీతల యంత్రాన్ని ప్రతిష్టించి శాంతి పూజలు చేయగా.. అప్పట్నుంచి కలరా తగ్గుముఖం పట్టి ప్రజల ప్రాణాలు నిలిచాయి. ఈ పరిణామంతో శీతల యంత్రం శీతలాంబ దేవిగా మారింది. శనీశ్వర స్వామి చిత్రపటం చుట్టూ దేవాలయం రూపుదిద్దుకుంది. కర్ణాటకతో పాటు ఆంధ్ర రాష్ట్రాల నుంచి సైతం పావగడ శనీశ్వర దేవాలయానికి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఎస్ఎస్కే సంఘం అధ్యక్షుడు తొలి అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య శెట్టితో పాటు సుమారు 20 ఏళ్ల పాటు అధికార బాధ్యతలు చేపట్టిన దివంగత జీఎస్ ధర్మపాల్లు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం ధర్మపాల్ కుమారుడు అనిల్ కుమార్ ఆలయ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శీతలాంబ దేవి శనీశ్వరుడు శ్రావణంలో స్వామికి విశేష పూజలు 13 నుంచి వచ్చే నెల 5 వరకు వైభవంగా వేడుకలు -
ఈశ్వరా.. ప్రాణం నిలపరా?!
తలుపుల: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నంతలో సాధారణ జీవితం గడుపుతూ, రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న ఆ పేద గూటిలో ప్రస్తుతం గుండెల్ని పిండేసే విషాదం అలుముకుంది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వేపమానుపేట పంచాయతీ కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్న ఉద్యోగం.. అంతలోనే సంక్షోభం యోగేశ్వర్ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని కంటికి రెప్పలా పోషించే వారు. కుటుంబానికి ఏకై క జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే రూ.50 లక్షలకు పైగా భారీ వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఉన్న భూమిని అమ్మేసినా.. భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఉన్న ఆస్తిని అమ్ముకున్నా భర్తను ఇంకా ఇంటికి తెచ్చుకోలేకపోయామే అని ఆ భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా మారింది. చిరుద్యోగి యోగేశ్వర్ రెడ్డిని కాటేసిన అనారోగ్యం పడిపోతున్న తెల్ల రక్తకణాలతో ఆసుపత్రిలో మృత్యు పోరాటం ఇప్పటికే రూ.25 లక్షలు ఖర్చు పెట్టి సర్వస్వం కోల్పోయిన కుటుంబం చికిత్స కొనసాగాలంటే అదనంగా మరో పాతిక లక్షలు అత్యవసరం తండ్రి ప్రేమకు నోచుకోని 45 రోజుల పసికందుచేయూతే ఆశాకిరణం కళ్లముందే కుటుంబ పెద్ద అవస్థను చూస్తూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందించి కనిపించని దేవుడికి ప్రతిరూపాలుగా నిలవవచ్చు. సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్కు ఫోన్పే,గూగుల్పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్ నంబర్: 30754629889, ఐఎఫ్ఎస్సీ కోడ్:SBIN0010187 ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేసి యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు. తండ్రి ప్రేమకు నోచుకోని పసిగుడ్డు ఆ పసిగుడ్డుకు ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం 45 రోజుల వయసు మాత్రమే ఉన్న ఆ పసిబిడ్డ, తండ్రి ఒడిలో తలవాల్చి హాయిగా నిద్రించాల్సిన అపురూపమైన సమయం అది. కానీ, విధి ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. పుట్టిన నలభై ఐదు రోజులకే.. కన్నతండ్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన దయనీయ స్థితి ఎదురైంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
● వేటకొడవలితో దాడి చేసిన టీడీపీ కార్యకర్త చిలమత్తూరు: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మహేంద్రరెడ్డిపై ఆదివారం రాత్రి గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో హత్యాయత్నం జరిగింది. డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలన్న డిమాండ్తో ఆదివారం మండలకేంద్రమైన గోరంట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహేంద్రరెడ్డి వెళ్లారు. ర్యాలీ అనంతరం మహేంద్రరెడ్డి బంధువుల గ్రామమైన రెడ్డిచెరువుపల్లి చెరువుకు వెళ్లాడు. అక్కడ ర్యాలీ జరిగిన తీరును వివరిస్తుండగా...అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త నరసింహమూర్తి జీర్ణించుకోలేక మహేంద్రరెడ్డిని దూషించాడు. మాటామాటా పెరగడంతో సమీపంలో ఉన్న కొడవలి తీసుకుని మహేంద్రరెడ్డి తలపై, వీపుపై ఇష్టారీతిన దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. అంతకుముందు హిందూపురం ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి మహేంద్రరెడ్డిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వేణురెడ్డి వెంట వైఎస్సార్సీపీ జోన్–5 వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్కుమార్రెడ్డి, మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అంజన్రెడ్డి, దామోదర్రెడ్డి, గజేంద్రరెడ్డి, మహేంద్రరెడ్డి, విష్ణు శంకర్, చందు తదితరులు ఉన్నారు. -
పుట్టపర్తి జనసంద్రం
సాక్షి, పుట్టపర్తి దగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ జిల్లా వ్యాప్తంగా నిరసన, ర్యాలీలతో కదం తొక్కింది. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువతతో కలిసి పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, హిందూపురం, మడకశిరలో భారీ ర్యాలీలు నిర్వహించింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలనే డిమాండ్ హోరెత్తింది. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని యువత, నిరుద్యోగులు, విద్యార్థులు గళమెత్తారు. అక్కడక్కడా వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తేల్చిచెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలతో నియోజకవర్గ కేంద్రాల్లో కిలోమీటర్ల మేర జనాలు పోగయ్యారు. ఎటు చూసినా వైఎస్సార్సీపీ జెండాలే దర్శనమిచ్చాయి. డ్రోన్కు తప్ప మొబైల్ కెమెరాకు చిక్కని విధంగా జనాలు తరలివచ్చారు. కనుచూపుమేర వైఎస్సార్సీపీ జెండాలతో అభిమానులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు దగా డీఎస్సీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీతో ధర్మవరం పట్టణం దద్దరిల్లింది. ఎస్బీఐ కాలనీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాలేజీ సర్కిల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది మంది జనాలతో ర్యాలీ నిర్వహించారు. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ధర్మవరం నిండిపోయింది. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిందన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్లకు టీడీపీ ప్రజాప్రతినిధులను చైర్మన్లుగా నియమించి అనర్హులకు క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చి రూ.లక్షలు సొమ్ముచేసుకున్నారన్నారు. 2 శాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడం, డీఎస్సీ నియామకాలు పూర్తిగానే స్పోర్ట్స్ కోటా పెంచుతూ ఇచ్చిన జీఓ రద్దు చేయడం అక్రమాలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు. లేని పక్షంలో నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కదిరిలో చేపట్టిన ర్యాలీకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, యువకులు సైన్యంలా కదిలివచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (యాక్టివిటీ) వజ్రభాస్కర్రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో మడకశిరలో నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి నుంచి నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మడకశిర పట్టణం నిండిపోయింది. అనంతరం ఈరలక్కప్ప మాట్లాడుతూ..డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీబీఐతో విచారణ జరిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. సంబంధిత విద్యాశాఖ మంత్రి కనీసం నోరు విప్పడం లేదని, దీన్నిబట్టి చూస్తే అవకతవకలు ఏ మేరకు సాగాయో అర్థమవుతోందన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో పుట్టపర్తి జన సంద్రమైంది. అమడగూరు, ఓడీ చెరువు, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువతతో ర్యాలీ హోరెత్తింది. వందల మంది కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ... డీఎస్సీ నియామకాలన్నీ సవ్యంగా సాగి ఉంటే వెంటనే సీబీఐతో విచారణ జరిపించి నిజాయితీని నిరుపించుకోవాలని మంత్రి లోకేష్కు సూచించారు. ఇంతజరుగుతున్నా ఆయన మౌనంగా ఉండటం చూస్తే అక్రమాలు నిజమేనని అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో పాఠశాలల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. హిందూపురంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో వందల మందితో బైక్ ర్యాలీ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తెలుగు తల్లి సర్కిల్ మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ సాగింది. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ నుంచి పట్టణానికి భారీగా తరలివచ్చారు. యువత, నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ సర్కిల్లో టీఎన్ దీపిక మాట్లాడుతూ...డీఎస్సీ అక్రమాలను వైఎస్సార్సీపీ వెలుగులోకి తీసుకురావడంతో సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్కు మింగుడుపడటం లేదన్నారు. అందుకే తమ నిరసనలకు పోలీసులను అడ్డం పెట్టి అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు. అర్హులకు న్యాయం జరిదేదాకా అండగా ఉంటామన్నారు. హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో మాట్లాడుతున్న పార్టీ సమన్వయకర్త టీఎన్ దీపిక అర్హులకు న్యాయం చేయాలని కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఊరూరా యువకులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీలు నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు పోరాడతామని వెల్లడి ఉపాధ్యాయ పోస్టింగుల్లో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ ర్యాలీలకు తరలి వచ్చిన యువజన, విద్యార్థి విభాగం నాయకులు మడకశిరలో జనహోరు.. కదిరిలో కదిలిన సైన్యం.. ‘పురం’లో జనతరంగం.. దద్దరిల్లిన ధర్మవరం.. -
13 నుంచి ఆర్జిత కల్యాణోత్సవాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జ్జిత కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13, 16, 17, 18, 20, 23, 24, 25, 27, 30, 31 తేదీల్లో కలాణోత్సవాలు ఉంటాయన్నారు. ఆర్జ్జిత కల్యాణోత్సవ టిక్కెట్ రూ. 6,500గా నిర్ణయించామని, ఒక్కో టికెట్పై ఐదుగురిని అనుమతిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఖాద్రీ ఆలయంలో సంప్రదించవచ్చన్నారు. లేకపోతే ఆన్లైన్లోనూ కల్యాణోత్సవ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 9000490670, 9441860432 సంప్రదించాలన్నారు. రేపటి నుంచి హెచ్ఐవీ నివారణపై విస్తృత ప్రచారం ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఆగస్ట్ 12 నుంచి నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖవ్యాధుల నివారణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం పీజీఈర్ఎస్ కార్యక్రమంలో పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంతో పాటు అవగాహన సమావేశాలు, కళాజాతాలు, ఎల్ఈడీ వ్యాన్ల ద్వారా వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ప్రజల్లో పూర్తి చైతన్యం వచ్చేలా ప్రచార కార్యక్రమాలు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి అనుపమ జేమ్స్, టీబీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణయ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ వెంకటరత్నం పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ ప్రశాంతి నిలయం: స్థానిక రెవెన్యూ భవన్ ఆవరణంలో సోమవారం 2026–27 సంవత్సర విద్యా విషయక క్యాలెండర్ను కలెక్టర్ ఏ. శ్యామ్ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు ఈ క్యాలెండర్ను విధిగా అనుసరించాలన్నారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప, జిల్లా సాధారణ పరీక్షల మండలి కార్యదర్శి గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
నా చావుకు మంత్రి లోకేష్దే బాధ్యత
డీఎస్సీలో ఉద్యోగం రాలేదని ఆవేదనతో నేను చనిపోతే దానికి మంత్రి లోకేష్, ఎమ్మెల్యే పల్లె సింధూరాదే బాధ్యత. 8 నెలలుగా తీవ్ర మనోవేదనతో నా ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, విద్యాశాఖ కమిషనర్, మంత్రి లోకేష్, చంద్రబాబును కలిసి నా బాధను విన్నవించుకున్నా. ఎవరూ న్యాయం చేయలేదు. గుంతకల్లులో ఓ అభ్యర్థికి అక్కడి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే ఇప్పటి వరకూ కనీసం ఓదార్చిన సందర్భం కూడా లేదు. ఇప్పటికై నా నాకు దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇవ్వాలి. నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి అన్యాయానికి గురైన ప్రతి అభ్యర్థికీ న్యాయం చేయాలి. – అంజినప్ప, డీఎస్సీ అభ్యర్థి, టి.కుంట్లపల్లి, ఓడీచెరువు మండలం -
మురళీనాయక్ త్యాగం స్ఫూర్తిదాయకం
పుట్టపర్తి టౌన్: దేశ రక్షణ కోసం సరిహద్దులో మురళీనాయక్ చేసిన ప్రాణత్యాగం రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ కొనియాడారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన అమర జవాన్ మురళీనాయక్ జ్ఞాపకార్థం అతని విగ్రహాన్ని పుట్టపర్తిలోని శిల్పారామంలో ఏర్పాటు చేశారు. నూతన విగ్రహాన్ని సోమవారం కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ జవాన్ తల్లిదండ్రులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను శాలువతో సన్మానించారు. అనంతరం దేశ భక్తిగీతాలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ బలగాలు దీటుగా ఎదుర్కొనే క్రమంలో 2025 మే 9వ తేదీన మురళీనాయక్ ప్రాణ త్యాగం చేశారన్నారు. అతి చిన్న వయస్సుల్లోనే దేశం కోసం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి రాబోవు యువతరాలకు నిరంతరం ప్రేరణగా నిలుస్తాయన్నారు. అమర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ, మాతృభూమి రక్షణకోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ అమరత్వం అమూల్యమైందన్నారు. సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలకు తెగించి కాపాలా ఉండటం వల్లే మనమందరం సురక్షితంగా ఉంటున్నామన్నారు. మురళీనాయక్ వీరత్వాన్ని ప్రతి భారతీయుడు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా డైరెక్టర్ రజాక్ఖాన్, ఆర్డీఓ సువర్ణతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్మీ ప్రతినిధులు, అమరజవాన్ కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటించారు. విగ్రహావిష్కరణలో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీ్ష్కుమార్ -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. గంగా నిలయం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ఉన్న వృద్ధుడు మృతిచెందినట్లు గుర్తించిన భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు యాచకులను విచారించగా మృతిచెందిన వృద్ధుడు రెండు నెలలుగా ఆలయ పరిసరాల్లోనే ఉంటున్నట్లు తెలిపారన్నారు. అయితే మృతి చెందిన మృతుడి వయసు సమారు 75 సంవత్సరాలకు పైగా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వివాహిత.. ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో మల్లమ్మ (28) అనే వివాహిత మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లికి చెందిన భార్యాభర్తలు హరికుమార్, మల్లమ్మతో పాటు వారి కుమారుడు యశ్విక్ ముగ్గురు ద్విచక్ర వాహనంలో అనంతపురానికి బయలుదేరారు. మల్లమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి చూపించాలనుకున్నారు. అయితే ఆత్మకూరు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో మల్లమ్మ ఉన్నఫలంగా రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మల్లమ్మను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు గార్లదిన్నె: మండల పరిధిలోని ఎగువపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాలమేరకు... బత్తలపల్లి మండలం వెంకటగారి పల్లెకు చెందిన మురళీ, రమేష్, లోక్నాథ్, శివమ్మ, ఆదిలక్ష్మి తమ బంధువుల గ్రామమైన శింగనమల మండలం పెరవలికి వారం రోజుల క్రితం వెళ్లారు. బంధువులు సూరి, నారాయణలతో కలసి పామిడిలో నాటు వైద్యం కోసం అందరూ ఆదివారం తెల్లవారు జామున ఆటోలో పామిడికి బయలుదేరారు. అయితే ఎగువపల్లి వద్దకు రాగానే ఎదురుగా ఐచర్ వాహనం వచ్చి ఆటోను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆటోలోని ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురము ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మురళీకి తీవ్రగాయాలు కావడంతో వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతితాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని తేరన్నపల్లి క్రాస్ సమీపంలో లారీ డ్రైవర్ నాగేంద్ర (46) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రానికి చెందిన నాగేంద్ర 20 ఏళ్లుగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 2న గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన క్లీనర్ రామకృష్ణారెడితో కలిసి మంగళూరుకు లారీ లోడ్ తీసుకొని వెళ్లారు. ఈనెల 8న భార్య వెంకటలక్ష్మికి నాగేంద్ర ఫోన్ చేసి కొందరితో గొడవ జరిగిందని ఫోన్లో చెప్పాడు. ఆమె భయంతో తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నాగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించినట్లు సీఐ పేర్కొన్నారు. అయితే తేరన్నపల్లి క్రాస్ వద్ద నాగేంద్ర శవాన్ని కొనుగొన్నామని తెలిపారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో చనిపోవడానికి అధిక మద్యం కారణమా, లేక లారీ యజమాని, క్లీనర్తో జరిగిన గొడవలో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
కోరిన కోర్కెలు తీర్చే బెహలూల్ షా బాబా
పెనుకొండ రూరల్: భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దైవంగా బెహలూల్ షా బాబా కీర్తిగడించారు. పెనుకొండ పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన బెహలూల్ షా ఖాద్రీ షాహీద్ దర్గా ఉంది. సర్వమత సమైక్యతకు ప్రతీకగా ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. మంగళవారం నుంచి స్వామి వారి ఉరుసు ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇరాన్ నుంచి ఇండియాకు.... బెహలూల్ షా బాబా ఇరాన్ దేశంలోని సిస్తాన్ పట్టణానికి చెందిన వారు. ఆధ్యాత్మిక మార్గంలో గురు ఆజ్ఞానసారంగా భారతదేశానికి వచ్చి మత సామరస్యానికి కృషి చేసినట్లు దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నో మహిమలు కూడా చేసి చూపించారంటున్నారు. 1197లో బాబా పెనుకొండ అటవీ ప్రాంతం సమీపంలో సమాధి అయ్యారు. బెహలూల్ షా బాబాను బెల్లాల్ సాబ్, జలాల్ సాబ్ అని కూడా పిలుస్తుంటారు. అప్పట్లో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో దారి దోపిడీ దొంగలు, క్రూర మృగాల దాడులు ఎక్కువగా జరిగేవి. బెంగళూరు, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ రహదారి గుండా వెళ్లాలంటే వణికిపోయేవారు. ఎద్దుల బండ్లు, గుర్రాలపై వెళ్లే వర్తకులతో పాటు ప్రయాణికులు కచ్చితంగా బాబా సమాధిని దర్శించుకొని ప్రార్థనలు చేసి వెళ్లేవారు. ఇలా చేయడం వల్ల ఏ ప్రమాదాల బారిన పడకుండా ఉండటంతో పాటు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని భక్తుల నమ్మకం. అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చిన అనేక మంది వర్తకులు పెద్ద ఎత్తున ఇక్కడి వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లిస్తుంటారు. జాతీయ రహదారిపై భక్తులను రోడ్డు ప్రమాదాల నుంచి అనేకసార్లు కాపాడినట్లు భక్తులు చెబుతుంటారు. 44వ జాతీయ రహదారి పక్కనున్న బెహలూల్ షా బాబా దర్గా బాబా సమాధి రేపటి నుంచి ఉరుసు ఉత్సవాలు విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి షెక్షావలి పిలుపు రేపు జెండా ఉత్సవం బెహలూల్ షా బాబా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11న జెండా ఉత్సవం, 12న గంధం వేడుక, 13న దీపారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు దర్గా పీఠాధిపతి ఆదోని షెక్షావలి తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ చేస్తామన్నారు. -
హతమార్చి చెరువులో పడేశారు!
ధర్మవరం అర్బన్: వ్యక్తిని హతమార్చి చెరువులో పడేసిన ఘటన ధర్మవరంలో కలకలం రేపింది. వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన మేరకు.. ధర్మవరం మండలంలోని ఓబుళనాయనపల్లికి చెందిన బోయ దాసరి శ్రీనివాసులు (40) కొంత కాలంగా పట్టణంలోని ఎరగుంటలో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య భవాని, ముగ్గురు కుమారులు ఉన్నారు. శ్రీనివాసులు తమ గ్రామ సమీపంలో భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. ఆయనకు 10 రోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయమై పలువురితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసులు తిరిగి రాలేదు. ఆదివారం ధర్మవరం చెరువులోని రెండో మరువ వద్ద శవమై తేలాడు. ఎక్కడో హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. డీఎస్పీ జగన్నాథ్రాజు, వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ సీఐ జయనాయక్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. శ్రీనివాసులుతో ఆర్థిక లావాదేవీల విషయమై గొడవ పడిన వారితో పాటు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ధర్మవరంలో కలకలం రేపిన వ్యక్తి హత్య -
చలో ఢిల్లీని విజయవంతం చేయండి
హిందూపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న సీపీఐ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సీపీఐ ఆధ్వర్యంలో ‘‘మార్పు కావాలి.. మార్పు రావాలి’’ అనే నినాదంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ కాలనీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రహమత్పురం సర్కిల్ మీదుగా గన్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం గన్ సర్కిల్లో ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. వేమయ్య యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి హిందూపురం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శులు ఇస్మాయిల్, మారుతిరెడ్డి, సీనియర్ నాయకుడు డి.బాబు, ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ భాష, మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాబీర, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి తదితరులు పాల్గొన్నారు. -
కస్సు‘బస్సు’మంటున్నారు బాబో!
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనేది ఒకప్పటి నానుడి. ఆర్టీసీలో ప్రయాణం ఆందోళనకరం, నరకప్రాయం అనేది ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్న మాట. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ సీ్త్ర శక్తి పథకం తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రయాణానికి తగినన్ని బస్సులను అందించడంలో మాత్రం విఫలమైంది. దీంతో బస్సుల్లో రోజురోజుకు రద్దీ పెరిగిపోతూ ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. చెయ్యెత్తినా ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు ఆపడం లేదు. ఒకవేళ ఆపినా కస్సుబుస్సులాడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దించేస్తూ.. బస్సుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన బస్స్టాప్లో బస్సులు ఆపడం లేదు. ఎక్కడో దూరంగా ఆపి ప్రయాణికులను దించేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ప్రయాణికులు రద్దీ దృష్ట్యా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గొడవలు.. దాడులు పలు రూట్లలో రద్దీకి అనుగుణంగా సర్వీసులు లేకపోవడంతో ఉన్న బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు దాడులు చోటుచేసుకుంటుఉన్నాయి. ప్రయాణికులకు సర్దిచెప్పడం, వారిని అదుపు చేయడం ఆర్టీసీ సిబ్బందికి కత్తిమీద సాములా మారుతోంది. చెయ్యెత్తినా బస్సు ఆపని ఆర్టీసీ డ్రైవర్లు వెనకే మరో బస్సు వస్తోందంటూ కండక్టర్ల ఉచిత సలహాలు రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడంతోనే ఈ తిప్పలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెనుక బస్సు ఖాళీ.. అందులో రండి! జిల్లా వ్యాప్తంగా పలు రూట్లలో 278 ఆర్టీసీ బస్సులు నడుపుడుతున్నారు. పుట్టపర్తి–అనంతపురం, ధర్మవరం–అనంతపురం మార్గంలో ప్రతి గంటకు ఒక బస్సు నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతి బస్సు రద్దీగా వస్తుండడంతో చుక్కలు కనబడుతున్నాయి. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కొత్తచెరువు, ధర్మవరంలో ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంది. అయితే ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో చెయ్యి ఎత్తి బస్సు ఆపాలని కోరితే వెనకాలే మరో బస్సు వస్తోందంటూ బస్సు డ్రైవర్, కండక్టర్ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వెనుక వచ్చే బస్సులు కూడా రద్దీగా ఉండడం, ఆ బస్సు సిబ్బంది కూడా వెనుక బస్సులొస్తున్నాయంటూ సెలవిస్తుండడంతో ప్రయాణికులకు దిక్కు తోచడం లేదు. జిల్లా వ్యాప్తంగా చాలా రూట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
జూదరుల అరెస్టు
గోరంట్ల: మండల పరిధిలోని పులేరు శివారులో జూదమడుతున్న 8 మందిని ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ బోయశేఖర్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21,350 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేమ పేరుతో మోసం● యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముదిగుబ్బ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ముక్తాపురం ఓబుళపతి అనే యువకుడు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఈ నెల 3న తెల్లవారుజామున బైక్పై అనంతపురం, అక్కడి నుంచి కారులో బెంగళూరుకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ శివరాముడు తెలిపారు. బెంగళూరులో వివాహం చేసుకున్నట్లు చెప్పి మైనర్పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. తరువాత బాలికను ముదిగుబ్బ బస్టాండ్ వద్ద వదిలివేయగా ఆమె నేరుగా ముదిగుబ్బ పోలీస్స్టేషన్కు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపిందన్నారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం కృష్ణాపురం క్రాస్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అతని వద్ద ఉన్న బైకును సీజ్ చేశామన్నారు. మహిళకు తీవ్రగాయాలుబత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని బత్తలపల్లి బైపాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల వివరాలమేరకు.. మండలంలోని తిమ్మనకొట్టాలకు చెందిన శేఖర్, రామాంజినమ్మ దంపతులు ఆదివారం గ్రామం నుంచి అనంతపురంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత స్వగ్రామానికి బయలుదేరారు. బత్తలపల్లి దాటిన అనంతరం బైపాస్లోకి ప్రవేశించే సమయంలో బత్తలపల్లికి మిరపకాయలు మూటలతో వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని దాటే సమయంలో ఆటోలో వేలాడుతున్న మూటలు రామాంజినమ్మను తాకడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆర్డీటీ ఆస్పత్రికి మరో ఆటోలో తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. -
సామూహికంగా పశుగ్రాసం పెంచండి
● వీబీజీ రామ్జీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్ లేపాక్షి: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంత రైతులు చెరువుల్లో సామూహికంగా పశు గ్రాసం పెంచుకోవాలని వీబీజీ రామ్జీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం మండలంలోని పులమతి చెరువులో సామూహిక పశుగ్రాస పెంపకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరా నుంచి 5 ఎకరాల వరకు రెండు సంవత్సరాలకు కలిపి ఎకరాకు రూ. 56 వేల విలువ చేసే గ్రాసం పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బ్రహ్మదేవ్ మాట్లాడుతూ చెరువుల్లో పశుగ్రాస పెంపకానికి ఉచితంగా గడ్డి జొన్నలు సరఫరా చేస్తామన్నారు. 75 శాతం సబ్సిడీతో అన్ని పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం డివిజన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పెంచలయ్య, ఏపీడీ శివానందనాయక్, ఏడీలు సోమనాథ్, డాక్టర్లు కిషోర్, జయశ్రీ, సుబ్బరాయుడు, నీరజ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో 127వ ర్యాంక్
అనంతపురం మెడికల్ కాలేజీకిఅనంతపురం సిటీ: జాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలకు ఇండియన్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఐఐఆర్ఎఫ్) 2026 సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకింగ్లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 127వ ర్యాంక్ దక్కింది. దేశీయంగా ఎంపిక చేసిన 144 కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు, వైద్య విద్య నాణ్యత, పరిశోధన, వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, విద్యార్థుల ప్లేస్మెంట్, కేరీర్ అవకాశాలు, బాహ్య నిపుణుల అభిప్రాయాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ర్యాంక్లను ఐఐఆర్ఎఫ్ ప్రకటించింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మెడికల్ కళాశాలలకు ఉత్తమ ర్యాంక్ దక్కడం గమనార్హం. జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్తో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత గుంటూరు మెడికల్ కళాశాలకు 50వ ర్యాంక్, కర్నూలు మెడికల్ కళాశాలకు 57వ ర్యాంక్, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్కు 59వ ర్యాంక్, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్కు 69వ ర్యాంక్, విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్కు 109వ ర్యాంక్ దక్కాయి. -
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: పుట్టపర్తి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో .. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. తమ ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. రౌడీషీటర్పై పీడీ యాక్ట్● కడప సెంట్రల్ జైలుకు తరలింపు కదిరి టౌన్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ షేక్ ముజాహిద్ (ముజ్జు)పై ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం– 1986 ప్రకారం నిర్బంధ ఉత్తర్వులు (పీడీ యాక్ట్) జారీ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఆదివారం కదిరి పట్టణ పోలీస్స్టేషన్లో విలేకర్ల సమావేశంలో సీఐ బి.వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. కదిరి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన షేక్ ముజాహిద్పై రెండేళ్లలో 7 కేసులు నమోదయ్యాయన్నారు. అయినా నేరప్రవృత్తి వీడలేదన్నారు. ఇటీవల మళ్లీ ప్రజల్లో భయాందోళన కలిగించే విధంగా వ్యవహరించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రావడంతో అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. కదిరిలో గతంలో నలుగురిపై పీడీ యాక్ట్ అమలు చేసి కడప జైలుకు తరలించినట్లు వెల్లడించారు. రౌడీషీటర్లు పదే పదే నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఐ బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినుల అదృశ్యం అనంతపురం సెంట్రల్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జేఎన్టియూలో చదువుతున్నారు. నాలుగురోజుల క్రితం కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ముగ్గురు విద్యార్థినులు మాత్రమే వెళ్లారని, ఇందులో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని తెలిసింది. దీంతో జేఎన్టీయూ కాలేజీలో ఏవైనా ఇబ్బందులున్నాయా, మరే ఇతరత్ర సమస్యలతో వెళ్లారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ముగ్గురు విద్యార్థినుల్లో ఒకరు తిరిగి వచ్చినట్లు సమాచారం. అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు. -
మళ్లీ ఒక్కటైన దంపతులు
ధర్మవరం అర్బన్/ముదిగుబ్బ: విడాకులు తీసుకున్న దంపతులను డీఎస్పీ జగన్నాథ్రాజు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ ఒక్కటి చేశారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం విడిపోయిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాలు... పట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని నాగారెడ్డిపల్లికి చెందిన అశ్విని, ఆమె భర్త శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే విభేదాల కారణంగా ఏడాది క్రితం వారు విడాకులు తీసుకున్నారు. ఇటీవల నాగారెడ్డిపల్లిలో పర్యటించిన డీఎస్పీకి అశ్విని కుటుంబ సమస్యలపై విన్నవించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులుతో పాటు వారి కుటుంబ సభ్యులతో డీఎస్పీ మాట్లాడారు. అందరినీ డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. శ్రీనివాసులు తన భార్య అశ్వినితో సఖ్యతగా కుటుంబ జీవితాన్ని కొనసాగించేందుకు అంగీకరించారు. డీఎస్పీ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దంపతులను తిరిగి ఒక్కటిగా చేశారు. దీంతో అశ్విని, శ్రీనివాసులుతో పాటు వారి బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. విభేదాలతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్న అశ్విని, శ్రీనివాసులు పోలీసుల కౌన్సెలింగ్తో కలిసి జీవించేందుకు అంగీకారం -
అలరించిన ‘కవిం కవీనామ్’
ప్రశాంతి నిలయం: సత్యసాయి సేవలను ప్రతిబింబిస్తూ ‘కవిం కవీనామ్’ పేరుతో నిర్వహించిన సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఏలూరు జిల్లా సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయి యువత, బాలవికాస్ చిన్నారులు సత్యసాయి బోధనల ద్వారా మానవాళి పరివర్తనను, నిస్వార్థ సేవల ద్వారా సన్మార్గాన్ని చూపిన తీరును చక్కగా వివరించారు. అంతకుముందు ఉదయం సత్యసాయి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు చేతుల మీదుగా ఏలూరు జిల్లాలోని నిరుపేద రైతులకు ఉచితంగా వ్యవసాయ పరికరాలు అందజేశారు. -
మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు
గోరంట్ల: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్ల పట్టణంలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన, ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కక పోవడం అన్యాయమన్నారు. అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్రమాలకు కేరాఫ్ మంత్రి సవిత మంత్రి సవిత బీసీ పిల్లలపై కపట ప్రేమ కనబరుస్తున్నారని ఉషశ్రీచరణ్ విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గంలోని రాంపురంలో తన సోదరుడికి లబ్ధి చేకూర్చేందుకు బీసీ సంక్షేమ పాఠశాల ఏర్పాటు చేయించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని పావగడ, దొమ్మితిమర్రి నుంచి కియో కంపెనీకి తన అనుచరులతో అక్రమంగా డీజిల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో ఒక బాటిల్పై ఎంఆర్పీ కంటే 20 రూపాయల మేర అదనంగా అమ్మిస్తూ నెలకు రూ. 50 కోట్లకు పైగా దోచేస్తున్నట్లు ఆరోపించారు. రొద్దం, పరిగి, గోరంట్ల మండలాల నుంచి అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కంకర మిషన్లతో దోపిడీ చేస్తున్నారన్నారు. అవినీతిలో ముందంజలో ఉన్న ఆమె ప్రజల మన్ననలను పొందడంలో కూడా వెనుకబడిందని సర్వేలో ఇప్పటికే తేటతెల్లమైందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిన సవితకు ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే దాకా పోరాటం అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
రెండు బైకుల ఢీ.. దంపతులకు తీవ్రగాయాలు
● ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టారని పోలీసులకు ఫిర్యాదు బత్తలపల్లి: మండల పరిధిలోని బత్తలపల్లి–వేల్పుమడుగు మార్గమధ్యంలో ద్విచక్రవాహనాన్ని మరో ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో భార్య,భర్త తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వేల్పుమడుగు గ్రామానికి చెందిన దాసరి రాజు, ఆయన భార్య దాసరి సునీత శుక్రవారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిమీద ద్విచక్రవాహనంపై బత్తలపల్లికి వస్తున్నారు. ఇదే సమయంలో గంటాపురం గ్రామానికి చెందిన బోయ అప్పస్వామి మరో ద్విచక్రవాహనంలో వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఉన్న మనస్పర్థలను దృష్టిలో ఉంచుకుని అప్పస్వామి ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఘటనలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో రాజు, సునీతకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. చికిత్స అనంతరం శనివారం బాధితులు బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని అనుమానాస్పద మృతి పావగడ: తాలూకాలోని రంగసముద్రం గ్రామంలోని కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ప్రియాంక (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కారనాగనహట్టి గ్రామానికి చెందిన శారదమ్మ, నరసింహమూర్తి దంపతుల కుమార్తె ప్రియాంక పాఠశాల శౌచాలయంలో మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. పాఠశాల హెచ్ఎం మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలియజేయగా.. దిగ్భ్రాంతికి గురైన వారు పాఠశాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు, తహసీల్దార్ వై.రవి, ఈఓ మధుసూదన్ పాఠశాల వద్దకు చేరుకుని పరిశీలించారు. ప్రియాంక మృతదేహాన్ని తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి పాఠశాల వార్డెన్, హెచ్ఎంలే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. -
ఆంక్షలు దాటుకుని ఆందోళనకు
● హక్కుల కోసం విజయవాడలో గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు అనంతపురం క్రైం: డిమాండ్ల సాధన కోసం విజయవాడలోని ధర్నా చౌక్లో శనివారం నిర్వహించిన సభకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక ఆంక్షలు దాటుకుని వెళ్లారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేపట్టింది. సభకు వెళ్లరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టి వారు తరలకుండా అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నించింది. అయినా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన డ్యూటీ చార్ట్ రూపొందించాలని ఉమ్మడి జిల్లా సచివాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అదనపు పనులతో ఒత్తిడి పెంచరాదని స్పష్టం చేసింది. పదోన్నతులకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. ప్రభుత్వం అందించే సేవల్లో తాము ముందు వరుసలో ఉంటామని, అలాగే తమ సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. టికెట్ లేకుండా ప్రయాణం.. రూ.1.63 లక్షల జరిమానా గుంతకల్లు: ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారిపై కమర్షియల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ధనుంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో 18 మంది సిబ్బంది దాడులు చేపట్టారు. గుంతకల్లు–కడప–రేణిగుంట మధ్య నడుస్తున్న 14 ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు 260 మందిని గుర్తించి రూ.1,63,750 జరిమానా వసూలు చేశారు. టీబీ డ్యాంలో 72 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: ఉమ్మడి అనంతపురానికి వరప్రదాయినిగా ఉన్న హొస్పేట్లోని తుంగభద్ర జలాశయంలో 72.264 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. అయితే జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, అగుంబే, శృంగేరి, చిక్మంగళూరు, వరనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం 1,00,750 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో తగ్గుతూ వస్తూ శనివారం నాటికి 42,114 క్యూసెక్కులకు చేరింది. జలాశయం పూర్తి సామర్థ్యం 1,633 అడుగులుకాగా, ప్రస్తుతం 1,623.68 అడుగల మేర నీటిమట్టం ఉంది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 72.264 టీంఎసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ప్లో 42,114 క్యూసెక్కులుండగా, అవుట్ఫ్లో 1,514 క్యూసెక్కులు కొనసాగుతోందన్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. -
శ్రవణానందం.. వీణా సుధామృతం
ప్రశాంతి నిలయం: సత్యసాయిని, సర్వదేవతలను స్మరిస్తూ వీణ, పిల్లనగ్రోవితో చక్కటి స్వరాలొలికిస్తూ నిర్వహించిన వాయిద్య కచేరీ శ్రవణానందకరంగా సాగింది. ఏలూరు జిల్లా సత్యసాయి భక్తులు పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. శనివారం సత్యసాయి సన్నిధిలో సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తొలుత బాలవికాస్ చిన్నారులు సత్యసాయి సర్వ ధర్మాలను ప్రదర్శించే ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రముఖ వీణా వాయిద్య విద్వాంసురాలు దీప్తి ప్రసాద్, ప్లూట్ వాయిద్యకారుడు దుర్గా ప్రసాద్ బృందం వీణా, ప్లూట్ వాయిద్య కచేరీ నిర్వహించారు. ‘శ్రీ సత్యసాయి వీణ సుధ’ పేరుతో నిర్వహించిన సంగీత కచేరీతో భక్తకోటి పరవశించి పోయింది. కళాకారులను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు దంపతులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
సూర్యనారాయణుడి సేవలో కలెక్టర్ శ్యాంప్రసాద్
ఉరవకొండ: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బూదగవి సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి కలెక్టర్ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ చిరంజీవి, సుధా ఆధ్వర్యంలో కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఉరవకొండ తహసీల్దార్ అరుణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ● ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి వారిని కూడా కలెక్టర్ శ్యాంప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ను ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. వృద్ధుడి తలపై వెళ్లిన ఆర్టీసీ బస్సు ● తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్లో గుర్తు తెలియని వృద్ధుడిపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తల చిధ్రమై మృతి చెందాడు. వన్ టౌన్ ఎస్ఐ ఇషాక్బాష తెలిపిన మేరకు.. ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు బయటకు వచ్చే రోడ్డుపైన గుర్తు తెలియని వృద్ధుడు (70) శుక్రవారం అర్ధరాత్రి మద్యం తాగి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున పుట్టపర్తి డిపో ఆర్టీసీ బస్సు ఆ వృద్ధుడి తలపై వెళ్లింది. దీంతో అతని తల చిధ్రమై అక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్ఐ ఇషాక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి ఆచూకి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫారెస్టు అధికారులకు జింక అప్పగింత బత్తలపల్లి: గాయపడిన జింకను బత్తలపల్లి పోలీసులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం బత్తలపల్లి సమీపంలో అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై జింక రోడ్డు దాటుకుంటోంది. ఇదే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో జింక గాయపడింది. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రామలింగ, హోంగార్డు పెద్దన్నలు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన జింకకు సపర్యలు చేశారు. అనంతరం ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్ అక్కులప్పకు సమాచారం అందించగా.. ఆయన బత్తలపల్లికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఫారెస్ట్లో వదిలేస్తామని ఆయన తెలిపారు. జూదరుల అరెస్టుగోరంట్ల: మండల పరిధిలోని కొలిమిపల్లి శివారులో శనివారం 13 మంది జూదరులను అరెస్టు చేసినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.20,080 నగదుతో పాటు 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చారించారు. -
మొక్కల మాటున మాయ
రాయదుర్గం రూరల్: రాయదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల్లో సిబ్బంది విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మాయలు చేస్తూ బిల్లులు మెక్కేస్తున్నారు. రాతిబావివంక గ్రామంలో చేస్తున్న పనులే అందుకు నిదర్శనం. నాలుగు నెలల క్రితమే హైడెన్సిటీ ప్లాంటేషన్ పథకం పేరిట ఇక్కడ మొక్కలు నాటినట్లు చూపి రూ.70 వేలకు పైగా బిల్లులు కాజేశారు. ఆడిటింగ్ భయంతో శనివారం తాజాగా స్థానిక ఆంజనేయస్వామి మాన్యంలో నాసిరకం, ఎండిపోయిన మొక్కలను నాటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో పనులు చేస్తున్న కూలీల ఫొటోలు తీసి, అక్కడి నుంచి ఆంజనేయ స్వామి మాన్యం వద్దకు కూలీలను తీసుకొచ్చి మొక్కలు నాటించినట్లు చూపడం గమనార్హం. మొక్కలు నాటే పనులు పూర్తి కాగానే తిరిగి కూలీల ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ ఫొటోలు తీయడం చూస్తే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. అవినీతి పనుల్లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ మేట్ ప్రధాన సూత్రధారులని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.200 ఇస్తేనే పనులు..! మండలంలోని చదం గొల్లలదొడ్డి (సీజీ దొడ్డి) గ్రామంలో ఉపాధి పనులు కావాలంటే సోమవారం రోజు ప్రతి కూలీ రూ.200 ఇచ్చుకోవాల్సిందే. లేదంటే పనులు ఉండవు. ఒకవేళ ప్రశ్నిస్తే ఆరు రోజుల పనుల్లో మూడు రోజులు హాజరు, మిగిలిన మూడు రోజులు గైర్హాజరు వేస్తున్నారని ఉపాధి కూలీలే పేర్కొంటున్నారు. అంతే కాకుండా చేసిన పనులకు వారాంతంలో తీసే కొలతల్లో కూడా తక్కువ చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి వారం కూలీలు ఇచ్చే రెండు వందలను పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని ఫీల్డ్ అసిస్టెంట్ ఆదేశాల మేరకు సీనియర్ మేట్లు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అంతులేని అక్రమాలు మండలంలో ఉపాధి పనుల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. పనులు చేయకుండానే బిల్లులు చేయడం, చేసిన చోటే మళ్లీ పనులు చేసి బిల్లులు కాజేయడం సాధారణంగా మారింది. చాలా గ్రామాల్లో కొలతలు తీయడానికి మునుపే ప్రతివారం రూ.200 వసూలు చేస్తుండడం దారుణం. – హొన్నె మల్లికార్జున, రాయదుర్గం జెడ్పీటీసీ చర్యలు తీసుకుంటాం.. రాతిబావి వంకలో పల్లెవనాలు, హైడెన్సిటీ ప్లాంటేషన్ పనులు జరుగుతున్నాయి. సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. చదం గొల్లలదొడ్డి గ్రామంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీనియర్ మేట్లను హెచ్చరించాం. అక్రమాలు కొనసాగితే సీనియర్ మేట్లను తొలగిస్తాం. – కె.రవి, ఏపీఓ, రాయదుర్గం మండలం ఆర్బీ వంకలో ఉపాధి సిబ్బంది బరితెగింపు నాలుగు నెలల క్రితమే బిల్లు చేసి తాజాగా మొక్కలు నాటిన వైనం అది కూడా ఎండిన మొక్కలు నాటడంపై సర్వత్రా విమర్శలు -
ఎల్లారుమ్ నల్లా ఇరుక్కాంగ!
హిందూపురం: ‘‘ఎన్నమా...ఎల్లారుమ్ నల్లా ఇరుక్కాంగ’’ అంటూ ఎస్పీ సతీష్కుమార్ తమిళంలో మాట్లాడటంతో స్థానిక పళనినగర్లోని తమిళులంతా ఆనంద పడ్డారు. ఎస్పీది కూడా తమిళనాడే అని తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడారు. శనివారం సాయంత్రం ఎస్పీ సతీష్కుమార్ అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్తో కలిసి హిందూపురంలోని పళనీనగర్, ఇంద్రనగర్కాలనీల్లో పర్యటించారు. ఆయా కాలనీల్లోని తమిళులతో మాట్లాడారు. తమిళంలోనే ఆప్యాయంగా పలకరిస్తూ ‘ఎల్లారుమ్ నల్లా ఇరుక్కాంగ’ (అందరూ బాగున్నారా) అంటూ వారి జీవన పరిస్థితులు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే తనకు చెబితే పరిష్కరానికి కృషి చేస్తానన్నారు. కాలనీ వాసులతో కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు ఇతర ఇబ్బందులపై ఆరా తీశారు. ఆకతాయిలు వేధిస్తున్నారా, రాత్రివేళల్లో మద్యం సేవించి ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తున్నారా..? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించేలా చూసేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే స్థానిక పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, లేకపోతే నేరుగా తనకే తెలియజేయవచ్చన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సాగాలి గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా వాతావరణంలో, సోదరభావంతో జరుపుకుందామని ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం హిందూపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో గణేష్ వేడుకల నిర్వహణపై మంటపాల నిర్వాహకులు, పురప్రముఖలతో ఆయన సమావేశమయ్యారు. పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...గణేష్ వేడుకలను ప్రజలందరూ కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. గొడవలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు అబ్దుల్ కరీం, రాజగోపాల్ నాయుడు, జనార్దన్, ఆంజనేయులు, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హిందూపురం పళనీనగర్, ఇంద్రనగర్ కాలనీల్లో ఎస్పీ పర్యటన కాలనీలో ఉంటున్న తమిళులతో తమిళంలో మాటామంతీ గణేష్ ఉత్సవాల నిర్వహణపై నిర్వాహకులతో సమీక్ష -
‘పరిటాల’ పంచాయతీ..ఇదేం దుస్థితి!
రామగిరి: ‘రెండేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూసి చూపించాం.. రాప్తాడు రూపురేఖలు మార్చేశాం’ అంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత గొప్పలు చెప్పుకుంటుండగా... సొంత పంచాయతీ నసనకోటవాసులు మాత్రం ‘‘సాల్లే సంబడం’’ అంటూ పెదవి విరుస్తున్నారు. నెలరోజులుగా నసనకోటలో వీధిలైట్లు వెలగక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగిశాక గ్రామంలోని వీధిలైట్లు విడతల వారీగా మాడిపోయాయి. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు ఉన్నా, వీధిలైట్ల గురించి పట్టించుకునే తీరిక వారికి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గ్రామంలోని వీధిలైట్లు చాలా వరకూ కాలిపోయాయి. దీంతో సాయంత్రం తర్వాత నసనకోట వాసులంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రివేళ బయటకాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. కూతవేటు దూరంలోని వెంకటాపురంలోనే ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నా... తమ బాధలు ఆమెకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సమీపంలోని సోలార్ప్లాంట్లో పనిచేసేందుకు చత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారని, రాత్రి వేళల్లో వారి సంచారంతో భయపడిపోతున్నామని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నసనకోటలో వీధిలైట్లు వెలిగేలా చూడాలని ఆ గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే సునీత సొంత పంచాయతీలో వెలగని వీధి లైట్లు -
ఐఐబీఎంపీలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం: జర్మనీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్ రాయిట్లింగెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ(ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐదేళ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బాచిలర్స్– మాస్టర్స్ ప్రోగామ్ (ఐఐబీఎంపీ – బీటెక్ కోర్సు)లో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ(ఏ) వీసీ సుదర్శన్రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ విద్యా కార్యక్రమం కింద విద్యార్థులు దేశీయంగా బీటెక్ పూర్తి చేసి, అనంతరం జర్మనీలో మాస్టర్స్ విద్యను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఎంఎస్సీ ఇన్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జేఈఈ, ఏపీఈఏపీ, టీజీఈఏపీ సెట్ ద్వారా పొందిన ర్యాంకులు, ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టుల మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు జేఎన్టీయూలోని అడ్మిషన్స్ విభాగంలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 77027 68080, 78914 88999, 78915 88999లో సంప్రదించాలని కోరారు. పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన దుండగులుహిందూపురం: పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన దుండగులు అనంతరం ఆపకుండా వెళ్లిపోయిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. శుక్రవారం అర్ధరాత్రి హిందూపురంలోని చిన్నమార్కెట్ వద్ద సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే బెంగళూరు రోడ్డు వైపు ఓ బొలెరో వాహనం వేగంగా వెళ్లిపోయింది. సీఐ జనార్దన్ ఈ విషయంపై టౌన్ సీఐ అబ్దుల్ కరీంకు సమాచామివ్వగా.. వెంటనే ఆయన సిబ్బందితో కలిసి మార్గమధ్యంలోని ఆటోనగర్కు చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసు వాహనాన్ని అడ్డుగా ఉంచారు. అయితే, దుండగులు నిలపకుండా సీఐ వాహనాన్ని కూడా ఢీకొట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్కుమార్ శనివారం సాయంత్రం హిందూపురం వచ్చి పోలీసు అధికారులతో చర్చించారు. వాహనాన్ని పట్టుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఏఎస్పీ మహేష్తోపాటు సీఐలను ఆదేశించినట్లు తెలిసింది. దంపతుల నడుమ రాజీ కోసమే ఫ్యామిలీ కౌన్సెలింగ్ ధర్మవరం అర్బన్: భార్యాభర్తల నడుమ రాజీ చేసి వారిని తిరిగి ఒక్కటి చేయడమే పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ లక్ష్యమని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. పట్టణంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం ‘పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్’ సెంటర్ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి గొడవలకే విడిపోతున్న భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారు సజావుగా జీవించేలా కౌన్సెలింగ్ తోడ్పడుతోందన్నారు. కౌన్సెలింగ్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్రాజు, వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప, కౌన్సెలింగ్ సభ్యులు చలపతి, బాలసుందరి, గంగాభవాని, రాఘవ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధ్యాయుడి మట్టి లీలలు’పై విద్యాశాఖ సీరియస్ చిలమత్తూరు: ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయంపై విద్యాశాఖ సీరియస్ అయింది. ‘ఉపాధ్యాయుడి మట్టి లీలలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఆయనపై విచారణకు ఆదేశించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సదరు ఉపాధ్యాయుడు మాదిరెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన పభుత్వ భూమిని కబ్జా చేశాడనే విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలోనూ భూముల క్రయ విక్రయాల్లో రైతులకు డబ్బు చెల్లించకుండా సదరు టీచర్ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గుడిబండ మండలంలో పనిచేసే ఈ ఉపాధ్యాయుడు చిలమత్తూరు మండల సరిహద్దులో గల బాగేపల్లిలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ‘సాక్షి’ విలేకరికి బెదిరింపులు.. తన లీలలపై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో సదరు ఉపాధ్యాయుడు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే తన అనుచరుడు అశ్వర్థప్ప ద్వారా ‘సాక్షి’ విలేకరిపై ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘మీ కథ చూస్తాడంట’ అంటూ బెదిరించడం గమనార్హం. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
ధర్మవరం అర్బన్: ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. అత్యవసర సమయంలో ఆటోపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో సమగ్ర వివరాలతో పాటు డ్రైవర్ నంబర్ కూడా తెలుస్తుందన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అందించారు. కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎస్పీ సతీష్కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పోలీసుశాఖ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో మహిళలు, చిన్నారులు ఆటోలో ప్రయాణించేందుకు భద్రత దృష్ట్యా విముఖత వ్యక్తం చేస్తున్నారని, దీంతో నిజాయితీగా సేవలందిస్తున్న ఆటో డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం పడుతోందన్నారు. ప్రయాణికుల్లో నమ్మకం కలిగించేందుకే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆటో యజమాని, డ్రైవర్కు సంబంధించిన వివరాలను ప్రయాణికులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్రాజు, ఆర్డీఓ రాంభూపాల్రెడ్డి, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆటోలకు క్యూఆర్ కోడ్లు అందజేసిన మంత్రి సత్యకుమార్, ఎస్పీ సతీష్కుమార్ -
దీక్షాదక్షులు
10న నిరసన ర్యాలీలు డీఎస్సీ నిమాయకాల్లో అర్హులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో సాగుతున్న దశలవారీ ఉద్యమం భాగంగా ఈ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలుపుట్టపర్తి: డీఎస్సీ నియామాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షల్లో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షాదక్షులై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. శనివారం మూడోరోజు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర నియోజక వర్గాల్లోని పలు మండల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఆయా నియోజక వర్గాల సమన్వయకర్తలు తోడ్పాటునందించారు. వైఎస్సార్సీపీ నాయకులు, యువతతో కలిసి దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. రిలే దీక్షలకు అన్ని వర్గాల మద్దతు.. పెనుకొండ నియోజక వర్గంలోని రొద్దం మేజర్ పంచాయతీలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. మడకశిరలో ఏరియా ఆసుపత్రి వద్ద నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. కదిరిలో మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర యాక్టివిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మవరంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని దీక్షలు నిర్వహించారు. ముస్లింలు దీక్షా శిబిరం వద్ద ప్రత్యేక సమాజ్ చేశారు. అన్యాయంపై పోరుబాట పట్టిన వైఎస్సార్సీపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. న్యాయం జరిగే వరకూ పోరాడతాం.. డీఎస్సీ నియామకాల్లో అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు దీపిక, ఈరలక్కప్ప, నాయకులు వజ్ర భాస్కర్రెడ్డి, రమేష్రెడ్డి తదితరులు తెలిపారు. దీక్ష శిబిరాల వద్ద వారు మాట్లాడారు. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవతవకలపై నిష్పక్షపాతంగా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మెరిట్ జాబితాను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో బేరసారాలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహిస్తూ వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడడం దారుణమన్నారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కరించాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలి.. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేతలు ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో ఎన్నికల హామీ మేరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేయాలన్నారు. ఉన్నత విద్యకు అందించే వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకు కింద ఇప్పటి వరకూ ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అర్హులకు న్యాయం చేసి అక్రమార్కులకు అరదండాలు వేయాలంటూ నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు దీక్ష పూనారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలేదీక్షలకు స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ తోడుగా పోరాటం ఉధృతం చేసి జెన్జీ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. డీఎస్సీ అక్రమాలపై మూడోరోజు కొనసాగిన వైఎస్సార్సీపీ రిలే దీక్షలు స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించిన విద్యార్థులు, నిరుద్యోగులు క్రీడల కోటా పేరుతో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలి విద్యాశాఖను భ్రష్టుపట్టించిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ అర్హులకు న్యాయం చేయకపోతే జెన్జీ సత్తా చూపుతామని హెచ్చరిక -
వ్యక్తిపై కత్తులతో దాడి
తనకల్లు: మండల కేంద్రంలో శనివారం శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలు... చిన్నచెరువుపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి స్థానిక పోలీస్స్టేషన్ రోడ్డులో సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం నల్లమాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కత్తులు, కర్రలతో శ్రీనివాసులురెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసులు రెడ్డికి బలమైన గాయలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించగా, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డిని చికిత్స కోసం తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి వంద మీటర్లలోపే పోలీస్స్టేషన్ ఉన్నా దండగులు కత్తులతో దాడి చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. -
తాకట్టు బంగారానికి సంస్థదే బాధ్యత
కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): ‘తాకట్టుపెట్టిన బంగారానికి పూర్తి బాధ్యత సంస్థదే. సిబ్బంది గోల్మాల్ చేస్తే రికవరీ చేసి ఖాతాదారులకు ఇవ్వాల్సిన బాధ్యత సంస్థదే’ అని రామగిరి సీఐ మహమ్మద్ అలీ తేల్చిచెప్పారు. చెన్నేకొత్తపల్లిలోని కీర్తన గోల్డ్లోన్ సంస్థలో బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన ప్రతి ఖాతాదానికి బ్యాంకు యాజమాన్యమే న్యాయం చేయాలన్నారు. కీర్తన గోల్డ్ లోన్ సంస్థలో గోల్డ్లోన్లలో జరిగిన గోల్మాల్పై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారులు, సిబ్బందితో పాటు ఖాతాదారులను పిలిపించి పోలీసులు విచారణ చేశారు. అనంతరం స్థానిక ఎస్ఐ సత్యనారాయణతో కలసి సీఐ విలేకరులతో మాట్లాడారు. కీర్తన గోల్డ్లోన్ల సంస్థలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకోగా, కొందరు సిబ్బంది ఖాతాదారులకు తెలియకుండా అదనంగా రుణం తీసుకొని డబ్బులు కాజేరన్నారు. ఆలస్యంగా గుర్తించిన ఖాతాదారులు సంస్థ అధికారులను, సిబ్బందిని అడిగితే వారు సరిగా స్పందించకపోవటంతో స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారన్నారు. గోల్డ్లోన్లలో సుమారు రూ.90 లక్షల వరకు సిబ్బంది గోల్మాల్ చేశారని గుర్తించామన్నారు. ఇందుకు బాధ్యులైన సంస్థ ప్రతినిధి అనుదీప్, సిబ్బంది నుంచి సంబంధిత సంస్థ అధికారులే డబ్బులు రికవరీ చేసి ఖాతాదారులు ఇవ్వాలని ఆదేశించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. కీర్తన గోల్డ్లోన్ సంస్థ అధికారులకు తేల్చిచెప్పిన పోలీసులు నిందితుల నుంచి బంగారం రికవరీ చేసి ఖాతాదారులకు ఇవ్వాలని ఆదేశం -
కెనరా బ్యాంకు గోల్డ్ అప్రైజర్ అరెస్ట్
మడకశిర: స్థానిక కెనరా బ్యాంకులో నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, గోల్డ్ అప్రైజర్ సుందరేశ్చారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో హిందూపురం ఏఎస్పీ మహేష్ విలేకరులకు వెల్లడించారు. అన్నంపెట్టిన బ్యాంకుకే మోసం.. గుడిబండ మండలం ఎస్.రాయాపురం గ్రామానికి చెందన సుందరేశ్చారి మడకశిరలోని కెనరా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా బ్యాంకులో పనిచేస్తుండటంతో పలువురు బ్యాంకు ఖాతాదారులు ఆయనపై నమ్మకంతో లావాదేవీలు సాగించేవారు. ఈ క్రమంలోనే వారి పరిచయాలను ఆయన తన సొంతపనులకూ ఉపయోగించుకునేవాడు. ఇటీవల తన డబ్బు అవసరం కావడంతో సుందరేశ్చారి బ్యాంకునే మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తనకు పరిచయమున్న మడకశిర మండలానికి చెందిన ఏడుగురు ఖాతాదారులను బ్యాంకుకు పిలిపించాడు. ‘నేను బ్యాంకులో పనిచేస్తున్నందున గోల్డ్లోన్ నాపేరున రాదు. అందువల్ల మీ పేరు మీద బంగారు నగలను తాకట్టు పెట్టుకుని రుణం తీసుకుంటాను’ అని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. ఇలా ఏడుగురిపై 12 గోల్డ్లోన్ల ఖాతాలు తెరిచి 872.8 గ్రాముల నకిలీ బంగారు నగలను తాకట్టు పెట్టాడు. మొత్తంగా రూ.70.66 లక్షల రుణం తీసుకున్నాడు. ఖాతాల్లో జమ అయిన డబ్బును ఖాతాదారులతోనే డ్రా చేయించుకుని తీసుకున్నాడు. అయితే జూలై 25వ తేదీన బ్యాంకుకు రీ అప్రైజర్ల బృందం తనిఖీలు చేయగా...నకిలీ బంగారం గుట్టు బట్టబయలైంది. దీంతో అదే రోజు బ్యాంకు ఏజీఎం శ్రీనివాసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డ్ అప్రైజర్ సుందరేశ్చారితో పాటు ఏడుగురు ఖాతాదారులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. రుణం డబ్బుతో జల్సా.. బ్యాంకులో నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించగానే గోల్డ్ అప్రైజర్ సుందరేశ్చారి అక్కడి నుంచి పారిపోయాడు. రుణంగా తీనుకున్న డబ్బులతో బాగా జల్సా చేశాడు. అంతే కాకుండా హార్స్ రేసుల్లో కూడా పాల్గొన్నాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం చాలా ప్రాంతాల్లో వెతికారు. చివరకు సుందరేశ్చారి వైబీహళ్లి క్రాస్లో ఉన్నట్లు కొందరు రూరల్ సీఐ రాజ్కుమార్కి శుక్రవారం సమాచారం అందించడంతో వెంటనే ఆయన సిబ్బందితో వెళ్లి సుందరేశ్చారిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న రూ.30.20 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో బ్యాంకు ఖాతాదారులందరూ అమాయకులని, వారిని సుందరేశ్చారి నమ్మించాడని ఏఎస్పీ మహేష్ తెలిపారు. ఈ కేసుతో వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడి నుంచి మిగిలిన నగదును కూడా రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడు ఆ డబ్బుతో ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుంటామన్నారు. సమావేశంలో మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్, ఎస్ఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. నకిలీ బంగారు ఆభరణాల తాకట్టు కేసులో పురోగతి రూ.30.20 లక్షల నగదు స్వాధీనం గుర్రపు పందేలాడుతూ జల్సాగా గడిపిన నిందితుడు -
‘ఎల్నినో’ను సమర్థవంతంగా ఎదుర్కొందాం
ముదిగుబ్బ: జిల్లాలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎల్నినోను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని యాకర్లకుంటపల్లిలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ కంది, ఉలవ, అలసంద, పెసర, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవడం శ్రేయస్కరమన్నారు. పంటలు బెట్ట పరిస్థితుల్లో ఉంటే పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఈ–పంట నమోదుతో పాటు పంటల బీమాను చేయించుకోవాలన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి జయకుమార్బాబు మాట్లాడుతూ అవకాశమున్న రైతులు నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టి వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ఉత్తమమన్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్పు పద్ధతులను ఉపయోగించి సాగునీటిని ఆదా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఏడీఏ సనావుల్లా, ఏఓ రవీంద్ర, వ్యవసాయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఆఫీసర్ దుర్మరణం
రామగిరి: మండలంలోని ఎగువపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ అధికారి చిగిచెర్ల నాగార్జున (29) శుక్రవారం మృతి చెందాడు. గ్రామస్తులు, బ్యాంక్ అధికారులు తెలిపిన వివరాలమేరకు... ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చెందిన నాగార్జున పేరూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంక్లో సెకెండ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఫీల్డ్ ఆఫీసర్గా సాయిచంద్ర పనిచేస్తున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంలో ఎన్ఎస్ గేట్లోని బ్రాంచ్కు నగదును అందజేసి పేరూరుకు తిరిగి వస్తున్నారు. అయితే మార్గమధ్యలో ఎగువపల్లి సమీపంలో ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. ఫీల్డ్ ఆఫీసర్ సాయిచంద్ర తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
మొక్కితే చాలు కోర్కెలు తీరినట్లే !
నల్లచెరువు: మేజర్ పంచాయితీ పరిధిలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి శనివారం, మంగళవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 15 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పూలు అతికించి కోర్కెలు చుట్టుపక్కలు దొంగతనాలు వంటివి ఏవైనా జరిగితే స్వామి వారి సన్నిధిలో సత్య ప్రమాణాలు చేయిస్తారు. తప్పు చేసిన వారు అసత్య ప్రణాలు చేస్తే స్వామివారు వెంటనే నిజరూప దర్శనం చూపిస్తాడనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. అలాగే సంతానం లేని వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించాలని స్వామివారికి ముడుపులు కడతారు. వారి సమస్యలు పరిష్కారం అయిన వెంటనే భక్తులు స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటారు. స్వామివారి మూలవిరాట్ వద్ద పూలను అతికించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కోరికలు కోరుకున్న సమయంలో స్వామివారి కుడి చేతి నుంచి పూలు కింద పడితే తమ కోరికలు నెరవేరుతాయని, ఎడమ చేతి నుంచి పూలు పడితే కోరికలు నెరవేరవని భక్తుల నమ్మకం. శ్రావణమాస ఉత్సవాలు ప్రతి ఏటా శ్రావణమాసం ప్రారంభం నుంచి స్వామి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది 15న మొదటి శనివారం, 22న రెండో శనివారం, 29న మూడో శనివారం, సెప్టెంబర్ 5న నాల్గవ శనివారం స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆలయానికి ఇలా వెళ్లాలి .. పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకోవాలంటే కదిరి – మదనపల్లి జాతీయ రహదారిలో గత పాత రైల్వేస్టేషన్ నుంచి పి. కొత్తపల్లి, పోలేవాండ్లపల్లి, బాలేపల్లి తండా రోడ్డు గుండా 3 కిలో మీటర్లు వెళితే స్వామివారి ఆలయానికి వస్తుంది. శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ సమయంలో పాత రైల్వేస్టేషన్ నుంచి ఆలయానికి ఆటోల సౌకర్యం ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే దైవంగా పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి 15 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తులు నిర్వాహకులుపుట్ట నుంచి బయట పడిన విగ్రహం పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి కొలువైన ఈ ప్రాంతం 14వ దశాబ్దం మధ్య కాలంలో సింహపురి (నేటి నెల్లూరు)ను కాటమరాజు పరిపాలించే వారు. ఆ రోజుల్లో విపరీతమైన కరువు సంభవించింది. రాజు ఆజ్ఞ ప్రకారం పశువుల విడిది కోసం సేనాధిపతి రాజ్యమంతా తిరుగుతూ ఖాద్రీపురం(కదిరి) గ్రామానికి చేరారు. ఖాద్రీశుడిని దర్శించుకొని సేనాధిపతి తమ గుర్రాలను ఒక చోట మేతకు విడిచి గ్రామం అంతా తిరిగారు. గ్రామం మొత్తం మల్లెపూల పరిమళం, ఎటు చూసినా పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండేది. ఈ ప్రాతాన్ని కరువు విడిదిగా ఎంచుకున్న విషయాన్ని రాజుకు తెలిపారు. రాజు ఆజ్ఞ ప్రకారం పశువులను కదిరి పట్టణానికి పది మైళ్ల దూరంలో ఉన్న నల్లచెరువు గ్రామం పరిధిలోని దిన్నె మీద పశువుల కోసం పాక వేశారు. దిన్నె మీద ఉన్న గడ్డి మేయగానే పశువులు కోలుకుని సమృద్ధిగా పాలిచ్చాయి. పశువుల పాక వేసిన స్థలానికి కొద్ది దూరంలో ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట దగ్గరకు ఈనని, కట్టని గోవు వెళ్లి నిలబడగా ఆ గోవు పొదుగు నుంచి పాలు పుట్టలోకి వెళ్తున్న విషయాన్ని సేనాధిపతి గుర్తించాడు. వెంటనే పుట్టకు పూజలు చేసి అపై పుట్టను తవ్వించి చూడగా హనుమంతుడి విగ్రహం బయట పడింది. సేనాధిపతి ద్వారా విషయం తెలుసుకున్న కాటమరాజు స్వామి వారి విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించారు. ఒక్క రోజులోనే స్వామి వారి గుడి కట్టారు. సమయం లేక పోవడంతో గుడిపై మూత అలాగే వదిలేశారు. పాలు గారిన చోట ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని చుట్టు పక్కల గ్రామస్తులు స్వామివారికి పూజలు చేశారు. పాలుగారి పారిన దిన్నె పాలపాటిదిన్నెగా ప్రసిద్ధి చెందింది. -
ఉపాధ్యాయుడి ‘మట్టి లీలలు’
చిలమత్తూరు: ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా పెట్రేగిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చిలమత్తూరు మండలం స్వర్గధామంగా మారింది. మట్టి అక్రమ రవాణా చేస్తూ తమ ప్రైవేటు వెంచర్లకు వేలాది లోడ్ల మట్టిని తరలిస్తున్నారు. శుక్రవారం మండలంలోని మాదిరెడ్డిపల్లి సమీపంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనుగోలు చేసిన భూమిలో వ్యవసాయ అవసరాలకు అని అనుమతులు పొంది నిబంధనలకు పాతరేస్తూ అధికారుల కళ్లుగప్పేశారు. రెండెకరాలకు 300 ట్రాక్టర్ లోడ్ల అనుమతి తీసుకొని దాదాపు ఐదెకరాల పొలానికి ఐదువందలకు పైచిలుకు మట్టిని తోలారు. భూమిని రోడ్డుకు లెవెల్ చేసి వెంచర్ ఏర్పాటు చేసేందుకు మట్టి దందా సాగిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండదండలు ఉండటంతో ఇష్టారీతిన చెరువులో జేసీబీలను వినియోగించి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదే విషయంపై ఇరిగేషన్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. వ్యవసాయ అవసరాలకు మాత్రమే తాము అనుమతులు ఇస్తున్నామని, వాటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మాదిరెడ్డిపల్లి దగ్గర ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు -
ఉద్యోగాల పేరుతో రూ.46 లక్షలకు టోకరా
● మంత్రి సత్యకుమార్ తెలుసని నమ్మించి డబ్బు వసూలు ● నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి యువతకు బురిడీ ● గాజుల రాధపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అనంతపురం సెంట్రల్: తాను గైనకాలజిస్టునని వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్నర్సు, ఎంఎల్టీ, అటెండర్, డీఈఓ తదితర ఉద్యోగాలిప్పిస్తానని ఓ మహిళ ఏకంగా రూ.46 లక్షలకు టోకరా వేసింది. తమకు న్యాయం చేయాలని బాధితులు శుక్రవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి అదనపు ఎస్పీ నాగభూషణంకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు.. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఓ గదిని అద్దెకు తీసుకొని గాజుల రాధ (భర్త సాకే హరి) ఉంటోంది. ఆమె మెడికల్ క్యాంపులు నిర్వహించే క్రమంలో కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, ధర్మవరం, బత్తలపల్లి, తాడిపత్రి, అనంతపురం, ఉరవకొండ, వజ్రకరూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో కొందరు యువతీ యువకులను పరిచయం చేసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తనకు బాగా తెలుసని, తన అన్న కూడా ఆయన వద్ద పనిచేస్తున్నారని, విజయవాడ నుంచి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి 14 మంది నుంచి దాదాపు రూ.46 లక్షల దాకా వసూలు చేసింది. 8 నెలల తర్వాత అంటే రెండురోజుల క్రితం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది. వాటిని తీసుకున్న వారు గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే.. ఆ లెటర్లు నకిలీవని తెలిపారు. దీంతో తాము మోసపోయామని గ్రహించారు. గాజుల రాధ గురించి విచారణ చేయగా.. ఆమె గతంలో కూడా అంగన్వాడీ, డీఆర్డీఏలో ఉద్యోగాలిప్పిస్తానని, సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయిస్తానని, గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పిస్తానని చెప్పి అనేక మందిని మోసం చేసినట్లు తెలిసింది. విచారణ చేపట్టి.. తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు అదనపు ఎస్పీని కోరారు. టీబీ డ్యాంలో 68 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో శుక్రవారం నాటికి 68.776 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. మంగళవారం 1,00,895, బుధవారం, 1,00,750, గురువారం 60,751 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో శుక్రవారం నాటికి 47,559 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్మగళూరు, వరనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుతూ వస్తోంది. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను ప్రస్తుతం 1,622.55 అడుగుల మేర నీటిమట్టం ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హంద్రీ–నీవా సీఈ నాగరాజ రాజీనామా ● కడప సీఈ బాలచంద్రారెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టుకు కె.నాగరాజ రాజీనామా చేశారు. ఆయన లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలాఖరున ఆయన హంద్రీ–నీవా సీఈగా ఉద్యోగ విరమణ పొందారు. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనే కావాలని పట్టుబట్టి మరీ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏడాదిపాటు ఆయన సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ రిటైర్డు అయిన ఉద్యోగిని కొనసాగించలేదని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా రూ.వేల కోట్ల హంద్రీ–నీవా లైనింగ్ పనుల బిల్లులు మంజూరు చేసుకోవడం కోసమే ఆయన్ను సీటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన నియామకం జరిగింది. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పనితీరుపై రాష్ట్ర ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల అధికారుల సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నాగరాజ మనస్తాపం చెంది తాను కొనసాగలేనని రాజీనామా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కడప చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బాలచంద్రారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం జిల్లా జలవనరులశాఖలో హాట్టాపిక్గా మారింది. -
గోల్డ్ మెడల్ వచ్చినా ఉద్యోగం ఇవ్వరా?
చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి. అర్హులైన అభ్యర్థుల ఐడీలు ఎలా మాయమయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థులకు రాని ఉద్యోగం జాబితాలో తర్వాత ఉన్న వారికి ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పాలి. నీట్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. అర్హులకు న్యాయం జరిగేలా డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ చేయించాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు -
అర్జున్ వీరవిహారం.. దీపక్ విజృంభణ
● చిత్తూరుపై అనంత జట్టు ఘన విజయం అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామం వేదికగా జరుగుతున్న ఏసీఏ సౌత్జోన్ మల్టీడే క్రికెట్ టోర్నీలో అర్టున్ టెండుల్కర్ వీరవిహారం.. బౌలర్ దీపక్ విజృంభణతో అనంత జట్టు విజయతీరాలకు చేరింది. మూడో రౌండ్ మ్యాచ్ల్లో భాగంగా ఏసీజీ మైదానంలో శుక్రవారం అనంతపురం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. మొదటి ఇన్నింగ్స్లో చిత్తూరు జట్టు 196 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 69 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో బ్యాటింగ్ను కొనసాగించిన అనంతపురం జట్టు 46.4 ఓవర్ల వద్ద 186 పరుగులకు ఆలౌట్ అయింది. పి. గిరినాథ్రెడ్డి 54 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 32.5 ఓవర్ల వద్ద 155 పరుగులకు ఆలౌట్ అయింది. తేజారెడ్డి 58 పరుగులు, ధరణికుమార్ నాయుడు 53 పరుగులు తప్ప ఎవరూ రాణించలేదు. అనంత బౌలర్లలో ఎం.దీపక్ 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్లు 15.1 ఓవర్ల వద్ద ఒక్క వికెట్ కోల్పోయి 156 పరుగులు సాధించింది. బ్యాటర్ అర్జున్ టెండుల్కర్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం సాగిస్తూ 82 పరుగులు సాధించాడు. దీంతో అనంత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అర్జున్ టెండుల్కర్ (82 పరుగులు)దీపక్ (7 వికెట్లు) -
పరిష్కారాలు మూరెడు
కదిరి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఒక నియోజకవర్గం, ఒక నెల, నాలుగు పర్యటనలు ఇలా పేర్లు వేరైనా వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వీకరిస్తున్నారు. అయితే సమస్యలు బోలెడు ఉన్నా... పరిష్కారం మాత్రం చాలా వాటికి చూపడం లేదన్న విమర్శలున్నాయి. కదిరిలో ఒక నియోజకవర్గం కార్యక్రమం ఒక నియోజకవర్గం, ఒక నెల, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో ప్రజా ఫిర్యాదుల వేదిక ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి ఆయన ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. తీసుకున్న అర్జీలు రెండో వారం, మూడో వారం పరిష్కరిస్తామని, నాలుగో వారం పరిష్కరించిన అర్జీలు అర్జీదారులకు అందజేస్తారని పేర్కొన్నారు. పక్కా ఇళ్లు మంజూరు చేయండి ప్రభుత్వం 2013లో కదిరి గ్రామ పొలం సర్వే నంబర్ 83లో గుట్టలో తమకు పట్టాలిచ్చారు. అందరం కలిసి కష్టపడి ఆ భూమిని చదును చేసుకున్నాం. ఆ స్థలాల్లో పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఖాధ్రీ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో పలువురు దివ్యాగులు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తమకు పక్కా ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదని వారు వాపోయారు. మరికొందరు దివ్యాంగులు కూడా సొంతిళ్లు లేక అవస్థలు పడుతున్నామని, పట్టాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని వారు కోరారు. కరువు మండలాలుగా ప్రకటించండి జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు సుధాకర్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కృష్ణానాయక్, కరుణాకర్రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఉచితగడ్డి కేంద్రాలు, పశువులకు తాగునీటి తొట్టెలు ఏర్పాటు చేసి పాడిపశువులను కాపాడాలన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి కదిరిలో వేల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారని, వారికి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్యాభరద్వాజకు సీఐటీయూ నాయకులు నరసింహులు, ముస్తాక్, సుధాకర్రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించారు. -
ధర ఢమాలు.. టమాట రోడ్డు పాలు
కనగానపల్లి: ఆరుగాలం కుటుంబంతో సహా కష్టపడి పనిచేసే రైతన్నకు అన్ని కష్టాలే. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఆరుతడి పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు టమాట పంట సాగు చేశారు. అందులో ఒక్క కనగానపల్లి మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో టమాట సాగులో ఉంది. యలకుంట్ల, బద్దలాపురం, తరగకుంట, కనగానపల్లి గ్రామాల్లోని రైతులు టమాట ఎక్కువగా సాగు చేశారు. ఈసారి దిగుబడితో పాటు గిట్టుబాటు ధర కూడా తగ్గింది. అనంతపురం టమాట మండీలో మొదటి రకం టమాట కేజీ గరిష్టంగా రూ.10 కూడా ధర పలకటం లేదు. ఇక రెండో రకం, మూడో రకం టమాటను అడిగేవారే లేరు. దీంతో టమాటను మార్కెట్ వరకూ తీసుకువెళ్లినా కోత కూలీలు, రవాణా ఖర్చులు రావన్న ఉద్దేశంతో రైతులు రోడ్లపైనే పడేస్తున్నారు. -
అరటి తోటలో కొండచిలువ
యల్లనూరు: మండలంలోని దంతలపల్లికి చెందిన భాస్కర్రెడ్డి సాగుచేస్తున్న అరటితోటలో కొండ చిలువ కలకలం రేపింది. వివరాలు.. రైతు భాస్కర్రెడ్డి తనకున్న రెండు ఎకరాల్లో అరటిచెట్లను సాగు చేస్తున్నాడు. శుక్రవారం రైతు కూలీలతో కలుపు పనులు చేసుకుంటున్న సమయంలో అరటి చెట్ల మధ్య ఉన్న 15 అడుగులున్న కొండచిలువను గుర్తించారు. వెంటనే బిదునంచెర్లకు చెందిన స్నేక్ క్యాచర్ మధుసూదన్రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి వచ్చి కొండచిలువను సురక్షితంగా పట్టుకొని జమ్మలమడుగు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. గత ఆరు నెలల్లో మూడు సార్లు కొండచిలువలు కనిపించాయని రైతు భాస్కర్రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతం ఆనుకొని పొలం ఉండటంతో తరచూ కొండ చిలువలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. -
పంద్రాగస్టుకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
పుట్టపర్తి టౌన్: స్థానిక శిరసాని హిల్స్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 15వ తేదీ నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసుశాఖలోని అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరేడ్తోపాటు అన్ని కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం స్థానిక పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బంది నిర్వహిస్తున్న పరేడ్ను ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రమశిక్షణ, అంకితా భావంతో పనిచేస్తే తప్పక గుర్తింపు వస్తుందన్నారు. విధి నిర్వహణలో రాజీ పడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ సారించి శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలన్నారు. ఎస్కార్ట్ డ్యూటీల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధులకు సంబంధించి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలుంటే నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి, ఉమామహేశ్వర్రెడ్డి, ఆర్ఎస్ఐలు వీరన్న, ప్రసాద్, కృష్ణానాయక్తోపాటు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ సూచన -
డ్రగ్స్కు దూరంగా ఉండండి
కదిరి టౌన్: విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండటంతో పాటు సమాజాన్ని చైతన్య పర్చాలని ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కుటాగుళ్ల సమీపంలోని ఓబుళేశ్వర అకాడమీలో పోలీస్శాఖ ఏర్పాటు చేసిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు, కుటుంబ గౌరవం నాశనమవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ ఉన్నందున డ్రగ్స్పై అవగాహన మాత్రమే కాకుండా చట్టపరమైన పరిజ్ఞానం అవసరమని సూచించారు. దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎస్సీ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గర్ల్స్ కమాండోలు అందించిన గార్డ్ ఆఫ్ హానర్, డ్రిల్ ఫార్మేషన్స్ చూసి ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎలైట్ భద్రతా దళాలు, విదేశీ శిక్షణా విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు బి.వెంకటేశ్వర్లు, నిరంజన్రెడ్డి, నాగేంద్ర, ఎస్ఐ బాబ్జాన్, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. యువతకు ఎస్పీ సతీష్కుమార్ పిలుపు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ పరిశీలన.. పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ సతీష్కుమార్ పరిశీలించారు. ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు, కేసులు పరిష్కార ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహణ, రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి కోడూరు థామస్ మన్రో తోపు సమీపంలోని టెక్స్పోర్ట్ గార్మెంట్స్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొని కోడూరు కు చెందిన గంగమ్మ (65) మృతి చెందింది. ఫ్యాక్టరీ వద్ద వాహనాలను గమనించకుండా రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టినట్లు పోలీసులు చెబతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఇగ్నో కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై–2026 సెషన్కు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలోని ఇగ్నో అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే పీజీ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రీ–రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారా 15 వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 26895, 98669 24626 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య పుట్టపర్తి: తీవ్ర అనారోగ్యంతో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణరెడ్డి వివరాల మేరకు .. గ్రామానికి చెందిన బండ్రబోయిన అశోక్ (35) గ్రామ సమీపంలోని హైవేపై కిరాణా షాపు ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తరచూ కడుపు నొప్పి రావడం, ఎక్కడ చూపించినా బాగు కాకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున కిరాణా షాపుకు వచ్చిన ఆయన షాపు పక్కనే ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆటోకు నిప్పు పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఆటోకు నిప్పు పెట్టారు. వివరాలు.. ఎనుములపల్లికి చెందిన కరుణాకర్ గత సంవత్సరంలో రూ.మూడు లక్షలతో ఆటోను కొనుగోలు చేశాడు. గురువారం పగలు ఆటో నడిపి రాత్రి ఆటోను ఇంటి ముందు ఉంచాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆటోకు నిప్పుపెట్టారు. ఆటో 80 శాతం కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలు ఆర్పారు. తమ జీవనాధారమైన ఆటోకాలిపోవడంతో కరుణాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై శుక్రవారం పుట్టపర్తి అర్బన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వరుణ దేవా.. కరుణించు ! రొద్దం: అదును దాటుతున్నా పదును కావడంలేదు.. వేసిన పంటలు ఎండముఖం పడుతున్నాయి. దీంతో వరుణుడి కరుణ కోసం ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామ సమీపంలో వెలసిన గ్రామదేవత బాట సుంకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షం కురిసే విధంగా చూడమ్మా అని వేడుకున్నారు. పూజల అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. -
‘టెట్’కు 64 మంది గైర్హాజరు
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (ఏపీ టెట్) రెండోరోజు గురువారం 64 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. బెంగళూరులోని ఐయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో నిర్వహించిన పరీక్షలకు జిల్లా నుంచి 211 మంది హాజరు కావాల్సి ఉండగా, 147 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన తొలి సెషన్లో 11 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 200 మంది హాజరైనట్లు వెల్లడించారు. రెండు సెషన్లు కలిపి 64 మంది గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. నేటి నుంచి‘రైతన్నా మీకోసం’ ప్రశాంతి నిలయం: ‘‘ఎల్నినో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి’’ అన్న అంశంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, అనుంబంధ శాఖల అధికారులు పాల్గొంటారని, ఎల్నినో కారణంగా నెలకొన్న పరిస్థితులను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక గురించి వివరిస్తారన్నారు. రైతులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సీఐ వ్యవహారంపై విచారణహిందూపురం టౌన్: పట్టణ సీఐ రాజగోపాల్నాయుడి వ్యవహార శైలి, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. సీఐ రాజగోపాల్ నాయుడు అధికార టీడీపీతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పురంలో ‘పచ్చ’ పోలీసు శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సీఐ రాజగోపాల్ నాయుడు వ్యవహార శైలి, ఇటీవల ఓ దళిత లాయరుపై బూటుకాలితో ఆయన చేసిన దాడి తదితర వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. అంతేకాకుండా కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామి విచారణాధికారిగా నియమించారు. లాయరునే బూటుకాలితో తన్నిన సీఐ ఇటీవల గర్భిణి రమ్యశ్రీ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుకూ మృతి చెందింది. బాధితుల తరఫున అక్కడికి వచ్చిన దళిత న్యాయవాదిపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడి బూటుకాలుతో తన్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులతో పాటు న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ రాజగోపాల్నాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎస్పీ సతీష్కుమార్కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సీఐ పనితీరును వివరిస్తూ ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలోనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందితో విచారణ చేపట్టారు. ఎర్రపల్లిలో రాయల శాసనం లభ్యంగోరంట్ల: మండల పరిధిలోని ఎర్రపల్లి గ్రామంలో శ్రీకృష్ణదేవరాలయ కాలంనాటి శాసనాన్ని కనుగొన్నట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు గురువారం ఆయన ఎర్రపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ దేవత బొడ్డ్డెమ్మ విగ్రహాన్ని పరిశీలించారు. ఆ శిలపై ఉన్న శాసనాలను క్షుణంగా పరిశీలించారు. శిల రూపంలో ఉన్న బొడ్డ్డెమ్మదేవత విగ్రహం పైభాగంలో తెలుగులో రాసిన శాసనంతో పాటు కింది భాగంలో సంస్కృతంలో లిఖించిన శాసనాన్ని గుర్తించారు. శాసనంపై ఉన్న లిపి ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలకాలం నాటి శాసనంగా ఆయన నిర్ధారించారు. వాస్తవానికి గ్రామ దేవతలకు ఎలాంటి రూపం ఉండదని, కేవలం గుండ్రటి రాయిని గ్రామం మధ్యలో ఏర్పాటు చేసుకొని గ్రామస్తులు దేవతగా పూజిస్తారని మైనాస్వామి తెలిపారు. ఈక్రమంలోనే ఎర్రపల్లి వాసులు రాయలకాలం నాటి శాసనం ఉన్న రాయిని గ్రామదేవత విగ్రహంగా భావించి పూజలు చేస్తున్నారన్నారు. ఆయన వెంట గ్రామస్తులు సురేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్నినో’ పరిస్థితులను అధిగమించాలి
కనగానపల్లి: ప్రసుత్తం నెలకొన్న ఎల్నినో వాతావరణ పరిస్థితులను అధిగమించేలా వ్యవసాయ ప్రణాళికలు, పంటల సాగులో మార్పులు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులతో వర్షాలు సరిగారాక దెబ్బతిన్న ఖరీఫ్ పంటలను పరిశీలించేందుకు మంగళవారం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం మండలంలో పర్యటించింది. వేపకుంట, తగరకుంట, కనగానపల్లి, ముక్తాపురం గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో తిరిగి వర్షాభావానికి దెబ్బతిన్న వేరుశనగ, ఆముదం, కంది, జొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయశంకర్, రాధాకుమారి, నరసింహులు, నారాయణస్వామి మాట్లాడుతూ బెట్టను తట్టుకొనే స్వల్పకాలిక పంటలు, విత్తనాల రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రస్తుతం బెట్టకు గురైన పంటను కాపాడుకొనేందుకు రైతులు రక్షక తడులు అందించటంతో పాటు పోటాషియం నైట్రేట్ 5 గ్రా. లేదా 19:19:19ను 10 గ్రా. లీటరు నీటిలో కలుపుకొని పంటలపై పిచాకారీ చేసుకోవాలన్నారు. ఇది కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ద్రవ జీవామృతాలను కూడా పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. వీటిద్వారా 15 రోజుల వరకు పంట ఎండిపోకుండా చేసుకోవచ్చునన్నారు. బీడుగా ఉన్న భూములలో వచ్చే వర్షాలకు అనుగుణంగా స్వల్పకాలిక రకాలైన కొర్ర, సజ్జలు, పెసర. ఉలవ, మినుము పంటలు సాగు చేసుకోవాలన్నారు. ఏఓ మాధురి, ఎఫ్ఎంటీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్తో రాప్తాడు నేతల భేటీ
రాప్తాడు రూరల్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల ఓ అక్రమ కేసులో అరైస్టె బెయిల్పై విడుదలైన తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పటాస్ శ్రీకాంత్, తోపుదుర్తి నయనతారెడ్డి తదితరులు కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాలను వారు వైఎస్ జగన్కు వివరించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు, దాడులు, పోలీసు వేధింపులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు సునీల్ దత్తారెడ్డి కూడా వైఎస్ జగన్ని కలిశారు. -
ఒకరికి... ఒకరు
ఈ చిత్రం గాండ్లపెంట మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీ పచ్చారుమేకల తండాలోని ప్రైమరీ పాఠశాల (ఫౌండేషన్ స్కూల్)లోనిది. ఈ పాఠశాలలో 1, 2 తరగతులు నిర్వహిస్తుండగా 2వ తరగతిలో లిఖిత అనే విద్యార్థి మాత్రమే ఉంది. దీంతో ఉపాధ్యాయురాలు చంద్రకళ చిన్నారికి పాఠాలు చెబుతోంది. ఒకరికి ఒకరు తోడుగా పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు రాకపోయినా పాఠశాలకు సెలవే. గత ఏడాది కూడా ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులే ఉండేవారని, ఈ ఏడాది ఒకరు మరో పాఠశాలకు వెళ్లడంతో లిఖిత మాత్రమే మిగిలిపోయింది. కాగా ఇదే మండలంలో ఇద్దరు విద్యార్థులున్న పాఠశాలలు రెండు ఉండగా, ముగ్గురు విద్యార్థులున్న పాఠశాల ఒకటి, నలుగురు విద్యార్థులున్న పాఠశాలలు ఐదు, 10 మంది విద్యార్థులున్న పాఠశాలలు 16 ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ సర్కారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులంతా ‘ప్రైవేటు’బాట పట్టగా...ప్రభుత్వ పాఠశాలలు ఇలా వెలవెలబోతున్నాయి. – గాండ్లపెంట: -
9 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడ?
● హంపాపురం సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన ఐదు వికెట్లు తీసిన మల్లికార్జున 151 పరుగులు చేసిన వాసుదేవరాజురాప్తాడు రూరల్: మండల పరిధిలోని హంపాపురం గ్రామ సబ్స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని రైతులు గురువారం హంపాపురం సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోజుకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ అందించడం లేదని, కేవలం 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని గొందిరెడ్డిపల్లి, హంపాపురం, గొల్లపల్లి, ఎర్రగుంట గ్రామాల రైతులు కొన్ని రోజులుగా తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో 9 గంటల పాటు విద్యుత్ అందుతుండగా, తమకు మాత్రం కేవలం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. మూడు గంటలు, నాలుగు గంటల చొప్పున విడతల వారీగా సరఫరా చేస్తూ, మధ్యలో తరచూ కోతలు విధిస్తున్నారన్నారు. రెండు రోజులుగా మూడు గంటలకు పైగా అదనపు కోతలు విధించడంతో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడి పంటలను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వేరుశనగ, టమాట, అరటి, చీనీ తదితర పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సంబంధిత విద్యుత్శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్తే, ‘కరెంటు వచ్చినప్పుడే వాడుకోవాలి, మా వల్ల ఏమీ కాదు‘ అనే నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆవును ఢీ కొట్టిన ఆటో ● మహిళ మృతి అనంతపురం సెంట్రల్: గుత్తిరోడ్డు డీమార్ట్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల వివరాల మేరకు... గురువారం రాత్రి 8 గంటల సమయంలో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ దూద్పీరా గుత్తిరోడ్డు నుంచి పామిడికి బయలుదేరాడు. సోమలదొడ్డికి చెందిన బాలకొండమ్మ (45) కూడా అదే ఆటో ఎక్కింది. గుత్తిరోడ్డు డీ మార్ట్ సమీపంలోకి రాగానే ఆవు అడ్డుగా వచ్చింది. తప్పించబోయి ఆటోతో ఢీ కొట్టాడు. ఆటో ఫల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బాల కొండమ్మ ఆటో కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ దూద్పీరాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాఫిక్ సీఐ వెంకటేష్నాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మైనాపురంలో భారీ చోరీ గుంతకల్లు రూరల్: మండలంలోని ఓబుళాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో గురువారం భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాలమేరకు... మైనాపురానికి చెందిన పులికొండ అనే వ్యక్తి గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. అతడి భార్య కూడా చీనీకాయల కోత పనులకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న కుమారుడు బయటకు వెళ్తూ యథావిధిగా ఇంటికి తాళం వేసి బాత్రూములో ఒకచోట పెట్టి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన దొంగలు తాళాలు తీసుకొని ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.5.7 లక్షల నగదు, 62 తులాల వెండి, మూడు తులాల బంగారాన్ని అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారిస్తున్నారు. చెలరేగిన మల్లికార్జున అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లో బౌలర్ మల్లికార్జున రాణించాడు. గురువారం ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తేజారెడ్డి (54), మాధవరాయుడు (44) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 13.4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ దీపక్ 17 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులు సాధించింది. కాగా, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన వైఎస్సార్ కడప జట్టు 75.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. జట్టులోని వాసుదేవరాజు అద్భుతమైన ఆట తీరుతో 151 పరుగులు సాధించాడు. అదే సమయంలో వర్షం మొదలు కావడంతో ఆటను నిలిపి వేశారు. -
ముద్ద చర్మ వ్యాధి ప్రమాదకరం
అనంతపురం అగ్రికల్చర్: పశువులు, గేదెలకు సోకే ముద్ద చర్మవ్యాధి (లంపీ స్కిన్ డిసీస్–ఎల్ఎస్డీ) అత్యంత ప్రమాదకరమని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డయోగ్నస్టిక్ డిసీసెస్ ల్యాబ్–ఏడీడీఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) డాక్టర్ జి.రవిబాబు తెలిపారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కష్టమని, ముందస్తు నివారణ చర్యలే శ్రేయస్కరమన్నారు. ఇందుకోసం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఎస్డీ వ్యాక్సినేషన్ ఉచితంగా జరుగుతోందని, 3.77 లక్షల డోసుల మందు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2022లో తీవ్రంగా వ్యాపించిన ఈ వ్యాధితో మరణాలు సంభవించి రైతులకు ఆర్థిక నష్టం చేకూర్చాయని గుర్తు చేశారు. దీంతో రైతులు నాలుగు నెలల కన్నా ఎక్కువ వయస్సున్న తమ పశువులు, గేదెలకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఇవీ వ్యాధి లక్షణాలు ముద్ద చర్మ వ్యాధి ప్రమాదకరమైంది. పశువుల శరీరం, ముఖ్యంగా తల, మెడ, పొదుగు, కాళ్లపై గట్టిగా ఉండే ముద్దలు లేదా గడ్డలుగా ఏర్పడతాయి. తీవ్రమైన జ్వరం రావడం, కళ్లు, ముక్కు నుంచి చొంగ కారడం, పాలిచ్చే పశువుల్లో ఉన్నఫలంగా ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, బరువు కోల్పోవడం, నీరసించి బలహీనంగా తయారై ప్రాణనష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈగలు, దోమలు, కీటకాల ద్వారా ఒక పశువు నుంచి మరొకదానికి వ్యాపిస్తుంది. అలాగే కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నివారణకు ముందస్తు టీకాలు వేయించడం సరైన మార్గం. వ్యాధి లక్షణాలు ఉన్న వాటిని వేరుగా ఉంచడం, ఈగలు, దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర వ్యాధులు ప్రబలకుండా పశువైద్యుని సూచన మేరకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి. ఇప్పుడు ప్రధానంగా తెల్లజాతి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి. అనంతపురం డివిజన్కు 1.05 లక్షల డోసులు, ఉరవకొండ డివిజన్కు 67,800 డోసులు, ధర్మవరం డివిజన్కు 50,300 డోసులు, హిందూపురం డివిజన్కు రూ.79,900 డోసులు, పెనుకొండ డివిజన్కు 74,600 డోసుల మందు సరఫరా చేసినట్లు ఏడీడీఎల్ ఏడీ రవిబాబు పేర్కొన్నారు. ఎక్కడిక్కడ పశుశాఖ అధికారులు, డాక్టర్లు, పారాస్టాఫ్, వీఏహెచ్ఏలను సంప్రదించి నెలాఖరులోపు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఉచితంగా 3.77 లక్షల టీకాలు ముందస్తు టీకాలే శరణ్యం -
మామిడి రైతులను ఆదుకోండి
ప్రశాంతి నిలయం: పంట కోల్పోయిన మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్ శ్యాంప్రసాద్ను కోరారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం చెల్లించిన మామిడి రైతులకు వెంటనే బీమా పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో 2024–25 సంవత్సరంలో 2,353 మంది రైతులు మామిడి పంటకు సంబంధించి రూ.90.65 లక్షల ప్రీమియం చెల్లించారని, ప్రభుత్వం ఇంత వరకు బీమా పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిహారం చెల్లించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవుటాల రమణారెడ్డి మాట్లాడుతూ, పంటలు కోల్పోయి ఏడాది దాటినా పరిహారం ప్రకటించలేదన్నారు. ఇదే విషయమై గతంలో బీమా కంపెనీ(ఏఐసీ) ప్రతినిధులను సంప్రదించగా... ప్రభుత్వం రెయిన్ ఫాల్ డేటా ఇవ్వలేదని తెలిపారన్నారు. ప్రస్తుతం ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయ్యే వరకూ 2025 బీమా పరిహారం చెల్లింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తగదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బీమా పరిహారం అందేలా చూసి మామిడి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ను కోరామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సాయి, మాజీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరసింహులు, ఎస్సీ సెల్ నియోజకవర్గ ప్రదాన కార్యదర్శి రామయ్య, బుక్కపట్నం మండల పార్టీ ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, రైతులు సందీప్ చౌదరి, గోపాల్రెడ్డి, చిన్న గోపాల్రెడ్డి, చిన్నపరెడ్డి, వెంకటరెడ్డి, నాగ ప్రసాద్రెడ్డి, రాఘవరెడ్డి, దామోదర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024–25లో ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం ఇప్పించండి కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నాయకులు -
అంబేడ్కర్కు అవమానం
పెనుకొండ రూరల్: జయంతి, వర్ధంతి రోజుల్లో అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు ఆ మహనీయుడి విగ్రహం కళ్లముందే చెత్త వాహనాల మధ్య కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న వారు బాబాసాహెబ్ విగ్రహం దుస్థితి చూసి అధికారులపై పెదవి విరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెనుకొండలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి నిర్ణయించారు. ఇందుకోసం ఇతర ప్రాంతం నుంచి ఆ మహనీయుడి విగ్రహాన్ని తెప్పించారు. ఆ తర్వాత ఆ అధికారి బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన అధికారులెవరూ అంబేడ్కర్ విగ్రహం గురించి పట్టించుకోలేదు. దీంతో రాజ్యాంగ నిర్మాత విగ్రహం చెత్త తరలించే వాహనాల మధ్యకు చేరింది. నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలోని ఆర్డీఓ సమావేశ భవనం పక్కనే ఉన్న ఈ విగ్రహం అందరికీ కనిపిస్తున్నా...ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు ఇంతపెద్ద ఊళ్లో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి చోటే లేదా...అధికారులకు అంత తీరిక లేదా అని మండిపడుతున్నారు. చెత్త వాహనాల మధ్య రాజ్యాంగ నిర్మాత విగ్రహం -
పట్టాదారు పాసు పుస్తకం రైతుల హక్కు
● జేసీ మౌర్యభరద్వాజ్ గాండ్లపెంట: రైతు భూమిపై సర్వ హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూ రీసర్వే చేసి పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తోందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని వేపరాల పంచాయతీ కేంద్రంలో పంచాయతీకి సంబంధించిన 448 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలతో రైతుకు ఆ భూమిపై సర్వ హక్కులు సంక్రమిస్తాయన్నారు. రైతులు భూ రీసర్వేపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం కొందరు రైతులకు జేసీ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కదిరి ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ నరసింహులు, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు గాండ్లపెంట: అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నట్లు కదిరి నియోజకవర్గ క్రీడల కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ నెల 7న బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెనుకొండ కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయన్నారు. అలాగే 11న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు హిందూపురం సమీపంలోని బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 12న హాకీ, ఆర్చరీ, యోగా, బాక్సింగ్, చెస్, బాస్కెట్బాల్ పోటీలు ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గస్థాయి క్రీడల్లో ఎంపికై న క్రీడాకారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు. హైరిస్క్ గర్భిణుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి పుట్టపర్తి అర్బన్: హైరిస్క్ ఉన్న గర్భిణుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంపై గురువారం హైరిస్క్ గర్భిణుల కేసులు ఎలా గుర్తించాలి, ప్రాథమిక చరిత్ర తదితర వాటిపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గర్భిణులను కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. గర్భిణీగా నమోదైనప్పటి నుంచి ఆమెకు వచ్చే వ్యాధులు, ఉన్న వ్యాధులను పూర్తిస్థాయిలో గుర్తించాలన్నారు. గర్భిణులను రక్షించుకోగలిగితే శిశువులను సురక్షితంగా ప్రసవం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారి చెన్నారెడ్డి, ఆర్మన్ సంస్థ ప్రతినిధి చరణ్ తేజ్, వైద్యాధికారులు గాయత్రి, దీప్తి రెడ్డి, ప్రోగ్రాం అధికారులు సునీల్, పద్మజ, డీపీఎం నాగరాజు, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సీహెచ్ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు. అప్పు చెల్లించాలన్నందుకు వ్యక్తిపై దాడి ముదిగుబ్బ: మండల కేంద్రమైన ముదిగుబ్బకు చెందిన బీసీ కురుబ మునిస్వామిపై సొంత చెల్లెలు కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు మునిస్వామి వివరాల మేరకు.. తన చెల్లెలు లక్ష్మీ టీ హోటల్ నిర్వహించుకునేందుకు సుమారు 20 నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తన కుమారుడి కళాశాల ఫీజులు చెల్లించాల్సి ఉండటంతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అయితే తన చెల్లెలి భర్త రవి, కుమారుడు హేమంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చంపేస్తామని ఫోన్లో బెదిరించారన్నారు. అనంతరం బుధవారం రాత్రి ఐదుగురు వ్యక్తులతో కలిసి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. దాడిలో తన కాలు, చేయి, ఉంగరపు వేలు విరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మునిస్వామిని కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మునిస్వామి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పురం గణేష్ ఉత్సవాలు
● ప్రతియేటా కొత్తదనంతో ముందుకు వస్తున్న మండప నిర్వాహకులు ● పోస్టర్ లాంచ్, థీమ్ వీడియోలతో మొదలైన సందడి ట్రెండ్ సెట్టర్గాహిందూపురం టౌన్: రాష్ట్రంలోనే గణేష్ ఉత్సవాల నిర్వహణలో హిందూపురం పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి వినాయక చవితికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నా ఇప్పటికే సందడి మొదలైంది. గణేష్ ఆగమనాన్ని ఘనంగా స్వాగతించేందుకు వివిధ మండపాల నిర్వాహకులు వినూత్న ఆలోచనలతో పోస్టర్ లాంచ్, ఏఐ ఆధారిత కాన్సెప్ట్ వీడియోలను విడుదల చేసి అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. గతానికి భిన్నంగా... గతంలో సాధారణ పోస్టర్లతో సరిపెట్టుకున్న నిర్వాహకులు ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి మండపం తమ ప్రత్యేకతను చాటిచెప్పేలా కొత్త కాన్సెప్ట్ను రూపొందిస్తూ.. తాము ప్రతిష్ఠించబోయే వినాయక విగ్రహం ఎలా ఉండబోతోంది, మండప అలంకరణ ఎలా ఉండనుంది, ఈ ఏడాది థీమ్ ఏమిటి అనే అంశాలను అత్యాధునిక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సినీ ట్రైలర్ను తలపించేలా వీడియోలను ఆవిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో వీటికి ఎంతో ఆదరణ లభిస్తోంది. థియేటర్లో లాంచింగ్లు తమ మండపం అందరికంటే భిన్నంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎవరికి వారు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. గత ఏడాది ముక్కడిపేటలోని యువసేన వినాయక మండప నిర్వాహకులు తమ వినాయకుడి పోస్టర్ లాంచ్ను థియేటర్లో నిర్వహించి ట్రెండ్ సెట్ చేశారు. అలాగే ప్రస్తుతం కట్టకింద ఏర్పాటు చేసే మహాగణాథిపతి సేవా సమితి వినాయకుడి మండప నిర్వాహకులు ఏకంగా ఏఐ సాంకేతికతో సినిమా ట్రైలర్ తరహాలో థీమ్ను సిద్ధం చేసి సినిమా థియేటర్లో విడుదల చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియో తెగ వైరల్గా మారి ఏకంగా 7 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. ముక్కడిపేటలోని యువసేన వినాయకుడి పోస్టర్ లాంచ్ సైతం నిర్వాహకులు ఒక చిన్నపాటి సినిమా సెట్ తలపించేలా ఏర్పాటు చేసి వేడుకలా నిర్వహించారు. సామాజిక మాధ్యమంలోనూ లక్షల్లో వ్యూస్ సాధించింది. అలాగే త్యాగరాజ్నగర్లో ప్రతిష్ఠించే విశ్వసేన వినాయక మండప నిర్వాహకులు పోస్టర్ లాంచ్ను ఘనంగా చేశారు. రూ.3 కోట్ల దాకా ఖర్చు హిందూపురంలో ప్రతి ఏడాది దాదాపు 200కుపైగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. భారీ విగ్రహాలు, ఆకర్షణీయమైన మండపాలు, వైవిధ్యమైన థీమ్లతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఉత్సవాల చివరి రోజు జరిగే మహా నిమజ్జన శోభాయాత్ర రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. భారీ డీజేలు, కనువిందు చేసే విద్యుత్ అలంకరణలు, రంగురంగుల లైటింగ్, ప్రదర్శనలు, వివిధ రకాల దుస్తులు ధరించి నృత్యాల మధ్య నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. హిందూపురం మాత్రమే కాకుండా పరిసర మండలాలు, అనంతపురం, పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా వేలాదిగా ప్రజలు ఈ వేడుకలను తిలకించేందుకు తరలివస్తుంటారు. ప్రతి ఏడాది ఉత్సవాల నిర్వహణ కోసం రూ.3 కోట్లకు పైగా వ్యయం చేస్తున్నట్లు అంచనా. ఈసారి కూడా విగ్రహాలు, అలంకరణలు, లైటింగ్, శోభాయాత్ర ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. -
‘ఉపాధి’ పనులు పెంచండి
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం ప్రశాంతి నిలయం: వీబీజీ రామ్జీ పథకం కింద గ్రామాల్లో ఉపాధి పనులు పెంచాలని, ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీబీజీ రామ్జీ, ఉద్యాన తోటల పెంపకం, పశుసంవర్దక శాఖ పనితీరుపై సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, లక్ష్యాలు, పురోగతిపై చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీబీజీ రామ్జీ పథకం అమలులో కదిరి, నల్లచెరువు, ఓబులదేవర చెరువు, రొద్దం మండలాలు వెనుకబడి ఉన్నాయని, ఆయా మండలాల్లో ఉపాధి పనుల పురోగతి పెంచాలన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నందున ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో గడ్డి పెంచాలన్నారు. పాడి రైతులకు 30 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు ఉచితంగా అందించాలని, 50 శాతం సబ్సిడీపై 800 మెట్రిక్ టన్నుల దాణా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పూడికతీత పనులను వేగవంతం చేయండి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో చేపట్టిన మురుగుకాల్వల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. 9 నుంచి జిల్లాలో ‘హర్ ఘర్ తిరంగా’ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా–2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. 17వ తేదీ వరకూ విస్తృత స్థాయిలో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత, జాతీయ పతాకంపై గౌరవాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో తిరంగా ర్యాలీలు బైక్, సైకిల్, ఈ–బైక్ ర్యాలీలు, దేశభక్తి పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, వందేమాతర గీతం సామూహిక గానం, సెల్ఫీ విత్ తిరంగా ప్రచారం, తిరంగా ప్రదర్శనలు, ప్రభుత్వ భవనాలకు తివర్ణంలో విద్యుత్ దీపాలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 14వ తేదీన విభజన బీభత్స స్మృతి దినం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ‘బాలికే భవిష్యత్తు’ను విజయవంతం చేయండి -
టీబీ డ్యాంలో 64 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం నాటికి 1,00,700 క్యూసెక్కుల ఉన్న ఇన్ఫ్లో గురువారం నాటికి 60,751 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయశం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్కమగళూరు, వరనాడులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో డ్యాంకు వరద చేరుతోంది. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగుల మట్టానికి గాను 1621.22 అడుగులకు నీరు చేరింది. ఇన్ఫ్లో 60,751 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1499 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఆగని ఇసుక దందా
రొద్దం: పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుక దందా ఆగడం లేదు. మండలంలోని పెద్దమంతూరు, రొద్దం, చిన్నమంతూరు పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. అనుమతులు లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో అధికారులను బురిడీ కొట్టిస్తూ యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. పెన్నానదిలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులే దర్శనమిస్తున్నాయి. పెద్దమంతూరు రొప్పాల, పి.కొత్తపల్లి, పెద్దకోడిపల్లి, సుబ్బరాయప్ప కొట్టాల గ్రామాలకు చెందిన అక్రమార్కులు ఇసుక దందా చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పెన్నానదిలో బోర్ల ద్వారా వందలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు తెలియజేస్తున్నారు. నదిలో ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రకృతి వనరులను దోచేస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే రైతు కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోజూ వందల ట్రాక్టర్లలో అక్రమ రవాణా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆవేదన -
సర్వే వివరాలు పక్కాగా ఉండాలి
లేపాక్షి: భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రీసర్వే వివరాలు పక్కాగా ఉండాలని, అప్పుడే తప్పుల్లేని పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేయడం సాధ్యమవుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన లేపాక్షి మండలంలో పర్యటించారు. తొలుత స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వర్షపు నీరు ఇంకేలా వీబీజీ రాంజీ పథకంలో తవ్వుతున్న ఇంకుడు గుంత నిర్మాణ పనికి భూమి పూజ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ‘సర్’కు సంబంధించి బీఎల్ఓ, బీఎల్ఏ సమావేశ రికార్డులు పరిశీలించారు. అన్కలెక్టబుల్ ఓటర్లుగా వర్గీకరించిన జాబితాలోని మృతులు, ఆచూకీలేని వారు, మరో ప్రాంతంలో ఓటు నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. అనంతరం శిరివరంలోని జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూథిలింగ్ పనులు కలెక్టర్ పరిశీలించారు. సర్వేపై రైతులకు, సిబ్బంది తగిన సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మొక్కజొన్న పంట నమోదును ఆయన పరిశీలించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరు, హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ వాసుదేవరెడ్డి, ఏపీడీ శివానందనాయక్తో పాటు అధికారులు ఉన్నారు. రీసర్వే సిబ్బందికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
గణేష్ ఉత్సవాలను వైభవంగా చేద్దాం
హిందూపురం: ‘‘గణేష్ ఉత్సవాల్లో మతసామరస్యాన్ని చాటుదాం. ఉమ్మడి జిల్లాకు స్ఫూర్తిగా నిలుద్దాం. మండపంలో వినాయకుడిని కొలువుదీర్చిన రోజు నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకూ అందరూ నిబంధనలు పాటించాలి. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి’’ అని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఏఎస్పీ అంకితా సురానా పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక గుడ్డం కల్యాణ మండపంలో హిందూపురం ఏఎస్పీ కేవీ మహేష్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ మాట్లాడుతూ...ప్రతి ఉత్సవ కమిటీ ప్రభుత్వం, పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్టాపన, నిమజ్జన కార్యక్రమాలను నిర్ణీత సమయాల్లోనే నిర్వహించాలని, శోభాయాత్రలోనూ శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఊరేగింపులో డీజేలు, అధిక శబ్ధంతో కూడిన సౌండ్ సిస్టమ్లకు అనుమతి లేదన్నారు. రహదారుల్లో ట్రాఫిక్కు ఆటంకం లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్లకు తావులేకుండా విద్యుత్తు సరఫరా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రతి మండపం వద్ద పారిశుధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు.. మత సామరస్యానికి భంగం కలిగించే వ్యాఖ్యలు, నినాదాలు, కార్యక్రమాలు మండపాల వద్ద నిర్వహించకూడదని ఏఎస్పీ అంతికా సురానా తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర సమయంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శోభా యాత్రలో మద్యం సేవించడం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం, శాంతిభద్రతలకు భంగం కల్గించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. పోలీసు శాఖ సూచించిన మార్గం, సమయంలోనే నిమజ్జనం జరగాలన్నారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారి కరుణసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, సీఐలు అబ్దుల్ కరీం, జనార్దన్, రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, ఎస్ఐ రాజేష్తోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పట్టణ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. మతసామరస్యం చాటి ఇతరులకు స్ఫూర్తిగా నిలుద్దాం హిందూపురం గణేష్ మండపాల నిర్వాహకులకు జేసీ, ఏఎస్పీ పిలుపు శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని వెల్లడి -
బీఎల్ఓలు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం మంజూరు
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో పాలుపంచుకున్న బీఎల్ఓలకు, 2021లో విధులు నిర్వర్తించిన సూపర్వైజర్లకు గౌరవ వేతనాన్ని ఎన్నికల సంఘం మంజూరు చేసింది. జిల్లాకు 1,69,20,000, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.1,19,80,000 విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖాతాలో నిధులు జమ చేశారు. బీఎల్ఓకు రూ.7 వేలు, సూపర్వైజర్కు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం నిర్ణయించారు. జిల్లాలో 2,226 మంది బీఎల్ఓలకు రూ.1,55,82,000, సూపర్వైజర్లు 223 మందికి 13.38 లక్షలు మొత్తం రూ.1,55,82,000, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,576 మంది బీఎల్ఓలకు రూ.1,10,32,000, సూపర్వైజర్లు 158 మందికి రూ.9.48 లక్షలు మొత్తం రూ.1,19,870,000 విడుదల చేశారు. పెద్దమ్మ ఆలయంలో చోరీబత్తలపల్లి: మండలంలోని అప్పరాచెరువు సమీపంలో ఉన్న పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు అమ్మవారికి అలంకరించిన 13 తులాల వెండి ఆభరణాలు, ఉరుముల డబ్బు రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. వెండి ఆభరణాల విలువ రూ.26 వేలు ఉంటుంది. ఈ విషయంపై ఆలయ పూజారి కొండారుపల్లి సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సోమశేఖర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరుణించు వరుణదేవా..అమరాపురం: వరుణుడి కటాక్షం కోసం ప్రజలు వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని తమ్మడేపల్లి పొలిమేరలో ఉన్న భూతప్పస్వామిని భక్తులు పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వంటా వార్పు చేసి దేవునికి నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు. వర్షం కురవకపోవడంతో పంటలు పండక, పశువులకు మేత దొరకక, తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తమ్మడేపల్లి, వీరాపురం, వలస గ్రామస్తులు పాల్గొన్నారు. ఫొటో, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ పుట్టపర్తి టౌన్: కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఫొటో, వీడియోగ్రఫీపై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారికి పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కార్యాలయంలో శిక్షణ ఉంటుదన్నారు. భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, బ్యాంక్ పాస్బుక్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9391486269, 08555–286427 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య శెట్టూరు: మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సుమన్ తెలిపిన మేరకు.. మండలంలోని లక్ష్మంపల్లికి చెందిన నాగభూషణ (45) ఈ నెల 2న తన భార్య లక్ష్మిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అప్పటికే అతను ఎక్కువగా మద్యం సేవించి ఉండటంతో డబ్బు ఇవ్వనని భార్య చెప్పింది. దీంతో తాను చనిపోతానంటూ భార్యను బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగభూషణ తిరిగి రాలేదు. చుట్టాల ఊరికి వెళ్లి ఉంటాడని భార్య భావించింది. ఈ క్రమంలోనే బుధవారం గ్రామానికి చెందిన బోయ బొజ్పప్ప పొలంలోని కంప చెట్లలో ఉరివేసుకుని నాగభూషణ మృతి చెందినట్లు గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సుమన్ పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
బోరుమంటున్న రైతన్న
మడకశిర: ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలల గడుస్తున్నా సరైన వర్షం కురవలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భజలం అడుగంటి పోయింది. ముఖ్యంగా మడకశిర నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉద్యాన తోటలు ఎక్కువగా సాగుచేసే మడకశిర రైతులు బోరుబావులపై ఆధారపడ్డారు. వర్షాలు సమృద్ధిగా వస్తే భూగర్భజలమట్టం పెరిగి బోర్లులో నీరు పుష్కలంగా ఉండేది. ఈసారి సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో బోర్లన్నీ ఎండిపోగా, రైతు పరిస్థితి ఆగమ్యగోచరమైంది. దిష్టిబొమ్మలా మారిన బోర్లు.. నియోజకవర్గంలో పంటల సాగుకు రైతులు వేసుకున్న బోర్లు 28 వేల వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఎండిపోయాయి. మరికొన్ని బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గి పోయింది. భూగర్భ జలం ఇంకి పోతుండడంతో ఉన్న ఫళంగా నీరు రావడం నిలిచిపోతోంది. దీంతో పొలంలో బోరు ఉన్నా...దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో వక్క, దానిమ్మ, మల్బరీ తదితర పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొత్తబోర్లు.. పెరుగుతున్న అప్పులు.. ఇప్పటికే వేసిన బోర్లు ఎండిపోగా, పంటలు కాపాడుకునేందుకు రైతులు నూతన బోర్లు వేస్తున్నారు. ఇందుకోసం భారీగా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో వేలాది మంది రైతులు నూతన బోర్లు వేయించారు. అయితే 100 బోర్లు వేస్తే అందులో 80 బోర్లలో నీళ్లు పడటం లేదు. మిగిలిన 20 బోర్లలోనూ నామమాత్రంగా నీరు వస్తోంది. ఒక్కో రైతు తన అవసరాన్ని బట్టి ఒకటి నుంచి 5 వరకు బోర్లు వేయించి రూ.లక్షలు నష్ట పోయారు. ఒక్కో బోరుకు రూ.7 లక్షల వరకు ఖర్చు.. కొత్తగా బోరువేసి మోటరు బిగించి నీళ్లు పారించాలంటే ఒక్కోబోరుకు సుమారుగా రూ.7 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రధానంగా బోరు తవ్వకానికి అడుగుల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 300 వరకు అడుగుకు రూ.130 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 100 అడుగులకు ధర పెరుగుతుంది. 1,000 అడుగుల మేర బోరు తవ్విస్తే రూ.2.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. నీరు పడితే మోటార్, పైపులు, కేబుల్ వాటికి మరో రూ.4.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మొత్తంగా ఒకబోరు వేస్తే రూ.7 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని రైతు చెబుతున్నారు. ఇంతచేసినా నీరు పడకపోవడంతో బోరుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు కుటుంబాలతో వలస బాట పట్టారు. వర్షాభావం.. అడుగంటిన భూగర్భజలం ఎండిపోయిన వేలాది బోరుబావులు పంటలు కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు కొత్తగా బోర్లు వేయిస్తున్నా... నీళ్లు పడని వైనం బోర్లకే రూ.లక్షలు ఖర్చు చేస్తున్న అన్నదాతలు అప్పులు తీర్చేందుకు కుటుంబాలతో వలసబాట -
వేరుశనగ జోలికి వెళ్లకండి
● వ్యవసాయ శాఖ అధికారుల సూచన పుట్టపర్తి అర్బన్: ‘‘వర్షాలు లేక అదును దాటిపోయింది.. ఇక వేరుశనగ జోలికి వెళ్లకండి. ఇప్పుడు పంట వేసినా దిగుబడి రాదు. వర్షాలు కురిసినా ప్రత్యామ్నాయ పంటలైన కొర్ర, పెసర, సజ్జ, జొన్న పంటలు సాగుచేయండి’’ అని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కొత్తచెరువు మండలం కొడపగానిపల్లి రైతు సేవా కేంద్రంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాంఫాం నుంచి విచ్చేసిన డాక్టర్ సంపత్ కుమార్, ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఖరీఫ్లో ఇప్పటికే వేరుశనగ, కంది, ఆముదం తదితర పంటలను సాగు చేసిన రైతులు బెట్ట తగలకుండా సాళ్ల మధ్యలో గడ్డిని పూర్తిగా తొలగించడంతో పాటు మొక్కల సంఖ్యను తగ్గించాలన్నారు. పంటలు పూర్తిగా ఎండిపోకుండా ఉండేందుకు లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. సదస్సులో తాడిపత్రి వ్యవసాయ కళాశాల అధికారులు మల్లేశ్వరి, భార్గవ్ రామిరెడ్డి, ఏఓ సతీష్, ఏఈఓ సునీత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు బుక్కపట్నం మండలం మారాల, క్రిష్ణాపురం గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పంటు వేసుకోవాలని సూచించారు. ‘టెట్’కు తొలిరోజు 12 మంది గైర్హాజరు ● జిల్లా అభ్యర్థులకు బెంగళూరు సెంటర్లో పరీక్ష పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు బెంగళూరులోని ఐయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో నిర్వహించిన పరీక్షలకు 46 మందికి గాను 34 మంది హాజరయ్యారని, 12 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన తొలి సెషన్లో 27 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 12 మంది హాజరైనట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలకుండా పరీక్ష కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు డీఈఓ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని వెల్లడించారు. -
12 మండలాల్లో తుంపర
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని 12 మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ తుంపర వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురం మండలంలో 16.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే లేపాక్షి మండలంలో 8 మి.మీ, అమడగూరు 7.8, చిలమత్తూరు 6.8, రొళ్ల 5.4, సోమందేపల్లి 4.8, గుడిబండ 3.4, బత్తలపల్లి 2.2, నల్లచెరువు 2.2, రొద్దం 1.6, మడకశిర 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. మొత్తంగా 65.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ‘స్కిల్ కాంపిటీషన్’ను సద్వినియోగం చేసుకోండి ప్రశాంతి నిలయం: యువతలో దాగి ఉన్న వృత్తి నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్–2026’ను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి ఇదో మంచి అవకాశమన్నారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారన్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇతర సంప్రదాయ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు tinyurl.com/indiaskill లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
రైతుకు ఆ‘ధర’ణ కరువు
రూ.6 లక్షలు ఖర్చయ్యింది నేను ఏడు ఎకరాల్లో టమాట, వంకాయ సాగు చేశా. ఇందుకు రూ.6 వరకూ పెట్టుబడి అయ్యింది. నెలన్నర నుంచి కోతలు కోస్తూ మార్కెట్కు తరలిస్తున్నా. గిట్టుబాటు ధర రావడం లేదు. ఇప్పటి వరకూ రూ.లక్ష చేతికందింది. కానీ కూలీలకు, పంట రవాణాకు నెలకు రూ.1.50 లక్షల ఖర్చు అవుతోంది. నారు నుంచి మొదలిపెడితే కలువుతీత, మందులు, ఎరువులకు చాలానే ఖర్చు చేశా. ధరలు ఇంత అధ్వానంగా పడి పోవడం గతంలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. – నారాయణస్వామి, గోరంట్ల చెట్లలోనే వదిలేశా టమాటకు గిట్టుబాటు ధరలు లేవు. పంటను మార్కెట్కు తీసుకువెళ్తే కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడంలేదు. కాయలు నాణ్యంగా ఉన్నా...ఎవరూ కొనుగోలు చేయడం లేదు. అందుకే కాయలను చెట్లపైనే వదిలేశా. ఇలాగైతే రైతులు ఎప్పుడు బాగుపడతారు. – జనార్దన్రెడ్డి, పెడపల్లి పుట్టపర్తి అర్బన్: సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పిన చాలా మంది జిల్లా రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తున్నారు. సమీపంలోని బెంగళూరు మెట్రో సిటీతో పాటు చిక్బళ్లాపూర్, బాగేపల్లి, డీ క్రాస్ మార్కెట్లకు కూరగాయలను తరలించి పంటలను విక్రయించేవారు. గతంలో కాస్తాకూస్తో లాభాలు వచ్చేవి. కానీ రెండేళ్లుగా సరైన వర్షాలు కురవక, తెగుళ్లు సోకి దిగుబడి భారీగా తగ్గింది. మరోవైపు మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు నెలల నుంచి ధరలు అమాంతం పడిపోవడంతో చాలా మంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. టమాటకు రవాణా చార్జీలు రాక... ప్రసుత్తం టమాట 15 కిలోల బాక్సు మొదటి రకం రూ.130 పలుకుతుండగా.. రెండు, మూడో రకం టమాట 15 కిలోల బాక్సు రూ.70 నుంచి రూ.80 మధ్య పలుకుతున్నాయి. ధర అమాంతం తగ్గడంతో కూలీ ఖర్చులు, రవాణా చార్జీలు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. తోటలో వదిలేస్తే రోగాలు వ్యాప్తి చెందుతాయని కాయలు కోసి మార్కెట్కు తరలిస్తుంటే తీవ్ర నష్టాలు వస్తున్నాయంటున్నారు. కూలీల ఖర్చు కూడా రావడం లేదు.. వంకాయ 10 కిలోల బస్తా రూ.100 నుంచి రూ.120 వరకూ పలుకుతున్నాయి. వీటిని కోసి, గ్రేడింగ్ చేసి మార్కెట్కు తరలిస్తే పెట్టుబడి రాక పోగా కూలీలకు కూడా చేతినుంచి ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించక వంకాయకు తెగుళ్లు సోకి కాయలన్నీ రంధ్రాలు పడ్డాయని, దీంతో మార్కెట్కు తీసుకు వెళ్లినా ఎవరూ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే చాలా మంది వంకాయలను కోసి పారబోస్తున్నారు. తెగుళ్లతో తగ్గిన కూరగాయల పంటల దిగుబడి అరకొర పంటకూ మార్కెట్లో దక్కని గిట్టుబాటుధర కూలీల ఖర్చులు కూడా గిట్టక పొలంలోనే వదిలేస్తున్న రైతులు -
17 ఆసుపత్రుల్లో ఎంటీపీ సేవలు
పుట్టపర్తి అర్బన్: సమస్యలతో కూడిన, అవాంఛిత గర్భాన్ని తొలగించే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) సేవల నిమిత్తం జిల్లాలో 17 ఆసుపత్రులకు ఆమోదం తెలిపినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం తెలిపారు. బుధవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంటీపీ కమిటీ, జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 17 ప్రైవేటు ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా కమిటీ పరిశీలించి అనుమతిచ్చిందన్నారు. కమిటీలో ఓ గైనకాలజిస్ట్, ఓ పీడీయాట్రీషన్, ఓ ఫిజీషియన్తో పాటు కదిరి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ సభ్యులుగా ఉన్నారన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని (పీసీపీఎన్డీటీ) కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించి ప్రజల్లో చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ కళాధర్, డిప్యూటీ డెమో సుబ్రమణ్యం, డిప్యూటీ హెచ్ఓ రామలక్ష్మి, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాలకు దరఖాస్తులు
‘వ్యవసాయ’ కళాశాలల్లోమడకశిరరూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మడకశిర ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఏడుకొండలు బుధవారం తెలిపారు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్లో ఎంపీసీ–రైతు కోటా కింద బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 27 సీట్లు, మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో 20 సీట్లు (2– ఈడబ్యూఎస్) అందుబాటులో ఉన్నాయి. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో బైపీసీ అభ్యర్థులకు 73 సీట్లు, ఎంపీసీ రైతు కోటా కింద బాపట్ల, పులివెందుల కళాశాలల్లో 32 సీట్లు ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి జనరల్–ఓసీ అభ్యర్థుల వయోపరిమితి 17 నుంచి 22 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. రైతు కోటా నిబంధనలిలా.. రైతు కోటా కింద దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించి అభ్యర్థి తండ్రి లేదా తల్లి లేదా విద్యార్థి పేరున ఎకరా పొలంతో పాటు విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ నాన్– మున్సిపాలిటీ ప్రాంతంలోని పాఠశాలలో 4 సంవత్సరాలు చదివి ఉండాలి. తహసీల్దార్ ధ్రువీకరించిన ఫారం–1, పాఠశాల హెచ్ఎం ధ్రువీకరించిన ఫారం–2, మీ భూమి అడంగల్, వన్– బీ కాపీలతో పాటు నాన్ మున్సిపాలిటీ స్టడీ సర్టిఫికెట్లు జత చేయాలి. అభ్యర్థులు ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు, ఫీజు చెల్లింపు రసీదు జత చేసి ఈ నెల 10 సాయంత్రంలోపు ‘‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, లాం, గుంటూరు–522034’’ చిరునామాకు చేరేలా రిజిస్టర్ పోస్టు చేయడం లేదా నేరుగా అందజేయవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1,000 రుసుం చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం విశ్వ విద్యాలయం వెబ్సైట్ anfrauac.in లేదా 81257 29592, 78935 20988 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ప్రాజెక్టులకు నీరు వదలాలని వినతి
ప్రశాంతి నిలయం: ఎన్నినో ప్రభావంతో వర్షాలు లేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగు, సాగునీటి ఎద్దడి నెలకొంటోందని, వెంటనే ప్రాజెక్ట్లకు నీటిని వదిలి ప్రజలను రక్షించాలని జలసాధన సమితి నాయకుడు శ్రీనివాసులు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో డీఆర్ఓను కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగు, సాగు నీటికి హంద్రీ–నీవా జలాలే శరణ్యమన్నారు. వెంటనే కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్ట్లోకి కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందికి వదిలివేస్తున్నారని, డెల్టా ప్రాంతానికి సాగునీరు అందిస్తున్నారని, కానీ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాజెక్ట్లకు నీరు వదలడం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్ల ద్వారా రాయలసీమలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు, రాయలసీమ, చైన్నె నగరంలో కోటి మందికి తాగునీరు అందే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 11లో తాగు, సాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే విద్యుత్ ఉత్పత్తికి వాడాలని స్పష్టంగా తెలియజేశారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని వెంటనే నీటిని ప్రాజెక్ట్లకు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి ఖాసీం, సుధాకర్, సురేష్, చెన్నకేశవులు, ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వృద్ధుడి మృతి
బత్తలపల్లి: మండల పరిధిలోని సూర్యచంద్రాపురం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సూర్యచంద్రాపురం గ్రామానికి చెందిన గుజ్జల నారాయణ (74) స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం సరుకులు తీసుకొచ్చేందుకు ముదిగుబ్బకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతున్న అతడిని అనంతపురం నుంచి ముదిగుబ్బ వైపు వెళ్తున్న టయోటా ఇన్నోవా కారు అతివేగంగా ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన నారాయణను స్థానికులు ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుడు ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య నారాయణమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నివాళులర్పించిన కేతిరెడ్డి.. సమాచారం అందుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూర్యచంద్రాపురం చేరుకుని గుజ్జల నారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ధర్మవరం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి, ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, నాయకులు చల్లా కృష్ణమనాయుడు, మంజుల రమణ, రవీంద్రనాయుడు, చిరంజీవి తదితరులు ఉన్నారు. -
సమస్య ఏదైనా పోలీసుల దృష్టికి తీసుకురండి
● ఎస్పీ సతీష్ కుమార్ పెనుకొండ రూరల్: సమస్య ఏదైనా సరే సంకోచించకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన కియా పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం మునిమడుగు గ్రామంలో ఎస్పీ పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని, బాధితులకు అండగా నిలబడతామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గృహ హింస, బెదిరింపులు, ఇతర ఇబ్బందులపై మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐ డి. రాఘవయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో రైటప్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలుపుట్టపర్తి టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. 10 మందికి రూ.లక్ష జరిమానా విధించగా, ఒక వ్యక్తిని 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామన్నారు. తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 10న ‘కేఎస్ఎన్’లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్–ఇన్ అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మ్యాథ్స్, కామర్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రగతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన వారికి, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు. యువతి బలవన్మరణం శెట్టూరు: యువతి బలవన్మరణం పొందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. శెట్టూరుకు చెందిన వడ్డే దైవాధీనం, లక్ష్మీదేవి దంపతులకు కుమార్తె జ్యోతి(37)తో పాటు ఒక కుమారుడు ఉన్నారు. జ్యోతి నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. చాలా సంవత్సరాలుగా కుమార్తెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
అక్కను వేధిస్తున్నాడని బావను హతమార్చారు
తనకల్లు: అక్కను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న బావను బావమరుదులే హతమార్చారు. బుధవారం కదిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణస్వామి వివరాలను వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సునీల్ సీతారై, సంజీవ్ సీతారై అన్నదమ్ములు. వీరు తనకల్లు మండలంలోని చీకటిమానిపల్లి వద్ద ఉన్న ఆత్మికా పేపర్ మిల్లో కూలీలుగా పనిచేయడానికి వచ్చారు. వీరికి సుమిత్రా సితారై అనే అక్క ఉంది. ఆమెను అదే రాష్ట్రానికి చెందిన మంద్రాజ్ థతేరా అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. మంద్రాజ్ థతేరా తన భార్య సుమిత్రా సితారైను తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో థతేరాను ఎలాగైనా చంపాలని సునీల్ సీతారై, సంజీవ్ సీతారై నిర్ణయించుకున్నారు. పేపర్ ఫ్యాక్టరీలో పని ఇప్పిస్తామని బావను నమ్మబలికి జూలై 24న జార్ఖండ్ నుంచి రప్పించారు. తర్వాతి రోజు రాత్రి 11 గంటల సమయంలో తమ స్నేహితులైన సింగారి సితారై, బసు బాల్ముచు, జెనారామ్ తిరియాతో కలిసి మంద్రాజ్ థతేరాకు మద్యం తాగించి పడమటివారిపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మంద్రాజ్ థతేరాను రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి కొంతదూరంలో ఉన్న కానుగ చెట్టు వద్ద పడేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో గత నెల 28న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో బావ మంద్రాజ్ థతేరాను బావమరుదలు తమ స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు. కదిరి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగేంద్ర, ఎస్ఐ దిలీప్కుమార్ పాల్గొన్నారు. హత్య కేసులో ఐదుగురి అరెస్ట్ -
ఉన్నత స్థాయికి ఎదగాలి
లేపాక్షి: ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి తమ వంతు సేవ చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ లేపాక్షి నవోదయ విద్యాలయం విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. జూడో క్రీడలో 24 మంది జాతీయ స్థాయిలో ఆడడం ప్రశంసనీయమన్నారు. విద్య అంటే కేవలం పుస్తకాలను బట్టీ పట్టడమే కాదని, ఆలోచించడం, విశ్లేషించడం, కొత్త ఆవిష్కరణలు చేయడమే అసలైన విద్య అని పేర్కొన్నారు. గురువులతో పాటు సమాజంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. అనంతరం విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులు కే.లాస్యరెడ్డి, కే.కిరణ్తేజ, యస్.అభిరాం, వై.స్నేహలత, ఇంటర్ విద్యార్థులు యస్.చిత్రలేఖ, పి.హేమలత, ఎన్.కార్తీక్సాయిని సత్కరించారు. విద్యార్థులు చేపట్టిన యోగాభ్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాజు, నాసిన్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ బట్నా కృష్ణారావు, ఎంఈఓ నాగరాజు, అల్యూమిని సభ్యులు వేమనారాయణ, డాక్టర్ వెంకటరమణ, రాజారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు -
పిల్లలను హెచ్ఎం కొడుతోందని టవర్ ఎక్కిన తండ్రి
తలుపుల: తన పిల్లలను పాఠశాల హెచ్ఎం నిత్యం కొడుతోందంటూ ఓ తండ్రి సెల్టవర్ ఎక్కాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని పెద్దన్నవారిపల్లికి చెందిన ఓబులపతి పిల్లలు వర్షిత, శశివర్దన్లు అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. స్కూల్ హెచ్ఎం హేమలత రోజూ వీరిని కొడుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎంఈఓ వెంకట్రాముడుకు ఓబులపతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం స్థానిక ఓబీఆర్ రోడ్డులోని సెల్ టవర్ ఎక్కాడు. ఏఎస్ఐ వెంకటగిరి, కానిస్టేబుల్ రమేష్లు అక్కడికి చేరుకుని ఓబులపతికి నచ్చజెప్పి కిందికి దించారు. స్టేషన్లో ఎస్ఐ చెన్నయ్య కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సద్దుమణిగిన గొడవపుట్టపర్తి అర్బన్: వైద్యులు, ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న గొడవ ఎట్టకేలకు సద్దుమణిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వైద్యులు, ఉద్యోగ సంఘాలకు మధ్య గొడవలు మంచిది కాదంటూ బలవంతంగా సారీ చెప్పించి ఒప్పించడం గమనార్హం. తనను ఉద్యోగ సంఘాల నాయకులు లింగా రామమోహన్, మరో వ్యక్తి చంపుతానని బెదిరించారంటూ పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఆస్పత్రి వైద్యుడు దిలీప్ కుమార్ సోమవారం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం స్టాఫ్ నర్సులతో మొదలైన గొడవ చంపుతామంటూ బెదిరించే వరకూ వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో డాక్టర్ దిలీప్ కుమార్పై కేసు నమోదు చేయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. దీనిపై మంగళవారం రాత్రి డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం దిలీప్ కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడారు. డాక్టర్కు ఉద్యోగ సంఘాల నాయకులతో సారీ చెప్పించడంతో ఆయన చల్లబడ్డారు. రేపటి నుంచి పాదయాత్రలు ● సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ కదిరి టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార పాదయాత్రలు చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమ వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం వేమయ్యయాదవ్ మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కులమతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను శాసిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ తాము నిర్వహించే ప్రచార జాతాలు, పాదయాత్రలు, చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రజలను ఏకం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పవన్, కదిరప్ప, మధునాయక్, లియాఖత్, హాసన్, అంజన్బాబు, ఈశ్వరయ్య, మనోహర్, రమణ, రవి, రెడ్డప్ప, హనుమంతరెడ్డి, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగల అరెస్టు
కళ్యాణదుర్గం: చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో సీఐలు హరినాథ్, నీలకంఠేశ్వర్ వివరాలు వెల్లడించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మారెంపల్లి కాలనీకి చెందిన బోయ నరసింహ, బోయ మధుసూదన్, ఒంటిమిద్దికి చెందిన పిట్టి తిప్పేస్వామి, పార్వతీనగర్కు చెందిన బలిజ అచ్చయ్యలు బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలు తీర్చుకునేందుకు చోరీల బాట పట్టారు. మారెంపల్లి, పార్వతీ నగర్, ఒంటిమిద్దిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ చొరబడి బంగారు ఆభరణాలు, వెండి అపహరించారు. మంగళవారం మధ్యాహ్నం నలుగురూ స్థానిక అక్కమ్మ గార్ల బస్ స్టాప్ వద్ద ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నెక్లెస్, గొలుసు, ఉంగరాలు, చెవి కమ్మలు, చైన్తో పాటు 129.6 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసకున్నట్లు సీఐలు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
సస్యరక్షణతో మల్బరీలో అధిక దిగుబడులు
ధర్మవరం రూరల్: మల్బరీ సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చునని అనంతపురం పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీఎస్ రమ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రేగాటిపల్లిలో ‘నా పట్టు–నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్బరీలో సమగ్ర కీటక, వ్యాధి నిర్వహణపై సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పట్టు శాఖ సంయుక్త సంచాలకురాలు శోభారాణి, ధర్మవరం సహాయ సంచాలకురాలు రాజేశ్వరి, పట్టు అభివృద్ధి అధికారి దామోదర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్బరీలో ప్రధాన కీటకాలు, వ్యాధుల ఉత్పత్తి కారణాలు, వాటి ఆర్థిక ప్రాధాన్యం, శాసీ్త్రయ నివారణ, నిర్వహణ పద్ధతులపై రైతులకు ఆమె అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు అధికంగా ఎదుర్కొంటున్న వేరుకుళ్లు వ్యాధి గురించి వివరించారు. నేలలో సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. వేరు కుళ్లు వ్యాధి సమగ్ర నివారణకు సాఫ్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల అడుగు భాగంలో ద్రావణాన్ని పోయాలన్నారు. 10 రోజుల వ్యవధిలో మరో సారి కూడా పోయాలన్నారు. మూడో విడవ విడతలో మిస్టర్ ప్రో లీటర్ నీటికి 5 మి.లీ కలిపి వ్యాధి సోకిన ప్రతి మొక్కకు 10 లీటర్ల ద్రావణం, అలాగే ఆరోగ్యకరమైన ప్రతి మొక్కకు 5 లీటర్ల ద్రావణాన్ని నేలపై పోయాలన్నారు. పలువురు పట్టు రైతులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఉత్తమ రైతు చంద్రశేఖర్రెడ్డి, మల్బరీ రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీఎస్ రమ్య -
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ’తో ఒప్పందం
ప్రశాంతి నిలయం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు శిక్షణ అందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో ఒప్పందం కుదిరిందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఏడాది పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు కుమార్ నాయక్, కుమార్ నాయుడు, ప్రవీణ్ కుమార్లతో ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ప్రతిభలో ఎవరికి తీసిపోరన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ.. ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్ నాయక్, బీసీ సంక్షేమశాఖ ఆధికారి రాజేంద్రకుమార్రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీరాములునాయక్, గురుకుల పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. -
వాతావరణానికి అనుగుణంగా పంటలు వేయాలి
రొళ్ల: ఎల్నినో నేపథ్యంలో వాతావరణానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకోవాలని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ లక్ష్మీకల్యాణి, డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం రొళ్ల మండల పరిధిలోని బీజీ హళ్లి, హొట్టేబెట్ట, రత్నగిరి, గుడ్డగురికి, హులికుంట తదితర గ్రామాల్లో వేరుశనగ, రాగి, కంది, మొక్కజొన్న, ఉలవ పంటలను ఏఓ వెంకటబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. రైతులకు అవగాహన కల్పించారు. ఎర్రనేలల్లో పంటపై 15 రోజులకు ఒకసారి 5 శాతం పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసుకోవాలన్నారు. వేరుశనగ, కంది, మొక్కజొన్న, రాగితో పాటు ఉలవలు బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి రక్షక తడులు ఇవ్వాలన్నారు. వాలుగా దున్నడం, అంతర కృషి చేయడం వల్ల నీళ్లు వృథా కాకుండా భూమిలోకి ఇంకిపోతాయని తెలియజేశారు. భూమిలో తగినంత తేమ దొరికే వరకు ఎరువుల వాడకాన్ని నిలిపివేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నారు. పంటసాగులో ఎదురయ్యే సమస్యలను స్థానికంగా ఉన్న వ్యవసాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవాలన్నారు. పంట వివరాలను ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. పంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడి సాధించాలని తెలియజేశారు. కార్యక్రమంలో సోమసుందర్, ఎస్జేవీ సూర్యతేజ పాల్గొన్నారు. -
ఇలా చేయాలి..
పుట్టపర్తి అర్బన్: పచ్చి రొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర, ఉలవ నేలకు ఎంతో మంచి చేస్తాయి. నేల భౌతిక స్థితిని, స్థూల, సూక్ష్మ సాంద్రతను మారుస్తాయి. నీటి నిల్వ శక్తిని పెంచడంతో పాటు గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరిస్తాయి. పైపాటుగా వేసే 25 శాతం నత్రజని ఎరువులు తగ్గించుకోవచ్చు. భూమిలో వేరు బుడిపెలతో సారం పెరుగుతుంది. ఎరువులు వేసినప్పుడు నత్రజని, పొటాషియం, భాస్వరం మాత్రమే అందితే పచ్చిరొట్ట ఎరువులతో మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు అందుతాయి. భూముల్లో చౌడును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నేలలో మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, వానపాముల పెంపునకు అనుకూలించి భూమి ఆరోగ్యాన్ని పెంచుతాయి. జీలుగతో సరిపెట్టిన సర్కారు.. గత ప్రభుత్వంలో పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీతో అందించేవారు. అప్పట్లో వాతావరణం అనుకూలించడంతో ఏటా 3 వేల క్వింటాళ్లకు పైగా పచ్చిరొట్ట విత్తనాలను రైతులు కొనుగోలు చేసేవారు. ఈసారి చంద్రబాబు ప్రభుత్వం కేవలం జీలుగ మాత్రమే అందజేయడంతో రైతులు 160.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. వీటి పూర్తి ధర కిలో రూ.80 కాగా 50 శాతం సబ్సిడీతో రూ.40 చొప్పున అందజేశారు. అన్ని విత్తనాలు అందజేయకుండా కేవలం జీలుగతోనే సరిపెట్టడంపై రైతులు పెదవివిరుస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులతో అనేక ప్రయోజనాలు భూసారం పెంచుకోవచ్చు జీలుగతోనే సర్కారు సరిపెట్టడంపై రైతుల పెదవివిరుపు పచ్చిరొట్ట విత్తనాలను ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. సాగు చేసిన నెలన్నర వరకూ భూమిలోకి కలయదున్నాలి. ముఖ్యంగా వరి పైరు పోయగానే పచ్చిరొట్ట విత్తనాలు చల్లి పైరు నాటడానికి సిద్ధం కాగానే కలయ దున్నవచ్చు. ఇది నీటి కింద పడిపోయి రెండు వారాల్లో ఎరువుగా మారిపోతుంది. మెట్ట భూముల్లో అయితే, సాగు చేసిన పచ్చిరొట్టను కోసి కంపోస్ట్ చేసిన తరువాత పంటలకు వినియోగించాలి. రోటావేటర్తో కలయ దున్నడంతో పంట సాగులో పుల్లలు అడ్డం వచ్చే పరిస్థితి ఉంటుంది. పచ్చి రొట్ట ఎరువులను ఉద్యాన పంటలకూ ఉపయోగించవచ్చు. సాగు చేసి పెరిగిన తరువాత జీలుగ జనుమును కోసి మొక్కల చుట్టూ గుంతలు తీసి అందులో వేసి మట్టి కప్పితే ఎరువుగా మారి మొక్కలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. -
మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డుల ప్రదానం
గుంతకల్లు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేసిన పలువురు ఉద్యోగులకు మంగళవారం మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా ప్రదానం చేశారు. ఎర్రగుంట్లకు చెందిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసులు, సబ్ ఇన్స్పెక్టర్ గోవిందప్ప, కానిస్టేబుల్ ఎస్. వెంకటరెడ్డితోపాటు గుంతకల్లు ట్రైనీ మేనేజర్ సురేష్బాబు, పాయింట్స్మెన్లు జ్యోతీ ప్రతాప్ (ఎర్రగుడిపాడు), వై.పురుషోత్తం (గుత్తి), ఎం.శ్రీహరి (స్టేషన్ మాస్టర్, అనంత రాజుపేట), మల్లేషన్ (టెక్నీషియన్–3,మంత్రా లయం)కు అవార్డులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కారు ఢీకొని యువకుడి మృతిపెనుకొండ రూరల్: కారు ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కియా పోలీసుస్టేషన్ ఎస్ఐ డి. రాఘవయ్య తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన ఉపేంద్ర (20) పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలోని కోకాన్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం పని ముగిసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న అతడిని ఓ కారు వేగంగా ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి నాగభూషణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆలయంలో వెండి ఆభరణాల అపహరణ కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వెంకటంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. వెంకటంపల్లి నడిబొడ్డున ఆంజనేయస్వామి ఆలయం ఉంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 30 తులాల వెండి కిరీటం, 20 తులాల వెండి మలతాడు, హస్తం ఎత్తుకెళ్లారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఉన్నా వాటికి చిక్కకుండా చోరీకి పాల్పడటం గమనార్హం. దీనిపై మంగళవారం చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. బాండ్ షరతుల ఉల్లంఘన.. వ్యక్తికి రిమాండ్ కదిరి టౌన్: భద్రతా బాండ్ షరతులను ఉల్లంఘించిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. మంగళవారం కదిరి టౌన్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కదిరికి చెందిన షేక్ వలిబాషా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతను బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 126 కింద సంవత్సరం పాటు మంచి ప్రవర్తనతో నడుచుకుంటానంటూ రూ.5 లక్షల విలువైన భద్రతా బాండ్ సమర్పించాడు. బాండ్ అమలులో ఉండగానే కదిరి రూరల్ పోలీస్స్టేషన్లో నమోదైన ఓ హత్య కేసులో తలదూర్చాడు. పోలీసులు పోకాజ్ నోటీస్ ఇచ్చినా స్పందించలేదు. బాండ్ మొత్తం కూడా చెల్లించలేదు. దీంతో షేక్ వలిబాషాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి కదిరి సబ్ జైలులో 65 రోజుల రిమాండ్కు పంపారు. కార్యక్రమంలో కదిరి టౌన్ సీఐ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ‘కేఎస్ఎన్’లో 11 వరకు డిగ్రీ ప్రవేశాలు అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రగతి తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనతో పాటు ఆధునిక ప్రయోగశాలలు, విశాలమైన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, కెరీర్ గైడెన్స్ సెల్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా ర్థినులకు అందుబాటులో ఉన్నాయన్నారు. -
7 నుంచి జిల్లాస్థాయి క్రీడా పోటీలు
ప్రశాంతి నిలయం: అమరావతి చాంపియన్స్ కప్లో భాగంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 7 నుంచి 12 దాకా మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. 7న పెనుకొండలోని కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, 11న హిందూపురం మండలం కె.బసస్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. 12న ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ, ఆర్చరీ, యోగా, బాక్సింగ్, చెస్, బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి వేదిక వద్ద హాజరు కావాలని కోరారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కేజీబీవీ ప్రిన్సిపాల్, టీచర్పై వేటుపుట్టపర్తి: ‘వివాదాలకు కేరాఫ్గా ఎన్పీ కుంట కేజీబీవీ’ అన్న శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై ప్రత్యేక కమిటీ విచారణ జరిపి డీఈఓ కిష్టప్పకు రిపోర్టు అందించింది. ఇందులో భాగంగానే ప్రిన్సిపాల్ రెహానా, హిందీ టీచర్ రూపారాణిపై వేటు పడింది. పాఠశాల విద్యార్థులతో అమర్యాదగా ఉండడం, వచ్చిన నిధులను సద్వినియోగం చేయక పోవడం, నిధులు పక్కదారి పట్టడంతో ప్రిన్సిపాల్, టీచర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా విధి నిర్వహణలో అలసత్వం, ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు తేలడంతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ఇద్దరి కాంట్రాక్ట్ సేవలను రద్దు చేశామన్నారు. -
లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు
పుట్టపర్తి టౌన్: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్రాహ్మణపల్లి లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న జగనన్న లేఅవుట్ను తనిఖీ చేశారు. గృహనిర్మాణాల పురోగతని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్లో ఆన్లైన్ డేటా ఆధారంగా బేసేమెంట్ లెవల్ నుంచి ఇళ్లు పూర్తయ్యేస్థాయి వరకు ఉన్న గృహ నిర్మాణాల లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సేకరించి ఆగిపోయిన గృహ నిర్మాణాలు వెంటనే పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. అలాగే కాలనీలో మౌలిక సదుపాయలపై దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ అధికారి వెంకటనారాయణ, తహసీల్దార్ సంహిత, ఏఈ ప్రవళ్లికతో పాటు మున్సిపల్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ తప్పనిసరి : జేసీ ఓడీచెరువు: ప్రభుత్వం చౌకధాన్యం సరఫరాలో నూతనంగా చేపట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని తప్పనిసరి అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌక ధాన్యపు గిడ్డంగిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉన్న చౌక బియ్యం, ఇతర సరుకుల వివరాలు స్టాకిస్ట్ నవీన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండకమర్లలోని 30వ ఎఫ్పీ షాపును తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ధర్మవరం రూరల్: మండల పరిధిలోని దర్శనమల పీహెచ్సీని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఆశా డే కార్యక్రమంపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. అనంతరం పీహెచ్సీలోని రికార్డులను తనిఖీ చేసి పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్, హెల్త్ సూపర్వైజర్ రాజశేేఖర్రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం
ముదిగుబ్బ: బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లికి చెందిన మందుగుండు కమలాకర్ (55) వ్యాపార నిమిత్తం ముదిగుబ్బకు వచ్చి స్థిరపడ్డాడు. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం ఉదయం దొరిగిల్లు రోడ్డు సమీపంలో ఉన్న వ్యవసాయ తోటకు వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పులివెందుల డిపో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో కమలాకర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రేణుక, కుమారుడు సాయి నవీన్, కుమార్తె దివ్యశ్రీలు ఉన్నారు. 15 మంది బైండోవర్తలుపుల: తహసీల్దార్ ఎదుట 15 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. మండలంలోని మామిళ్లవారిపల్లికి చెందిన ఇరువర్గాలు తాగునీటి పైప్లైన్ విషయమై మంగళవారం గొడవ పడ్డారు. ఈ క్రమంలో భవిష్యత్లో మళ్లీ గొడవ పడకుండా ఇరువర్గాలకు చెందిన 15 మందిని ఎస్ఐ చెన్నయ్య తహసీల్దార్ మురళీకృష్ణ వద్ద బైండోవర్ చేశారు. గ్రామాల్లో ఎవరూ గొడవ పడవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాకదిరి టౌన్: మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా తప్పదని కదిరి పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60,000 జరిమానా విధించారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు. పురంలో ముగ్గురికి జరిమానా.. హిందూపురం: మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీసులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.30 వేల జరిమానా విధించారు. ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ కేవీ మహేష్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హిందూపురం రూరల్ పరిధిలోని బిసలమానేపల్లి వద్ద రోడ్డు భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో జాతీయ రహదారిలో ట్రాఫిక్ డ్రమ్లను ఏర్పాటు చేసినట్లు సీఐ జనార్దన్ పేర్కొన్నారు. వాహనదారులు నిర్దేశిత వేగ పరిమితులను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. -
చంద్రబాబు సర్కార్పై అన్ని వర్గాల్లో అసంతృప్తి
మడకశిర: చంద్రబాబు సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. ఆమె మంగళవారం మడకశిరకు విచ్చేశారు. ఈ సందర్భంగా వాల్మీకీ సర్కిల్లో పార్టీ మండల కన్వీనర్ శ్రీరాములు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి నాగభూషణ్రెడ్డి, రాష్ట్ర విభాగం రైతు కార్యదర్శి రామిరెడ్డి, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధను, పట్టణ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు రఘునందన్, రైతు విభాగం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి బాల్రెడ్డి, బీఎల్ఏ నరసింహమూర్తి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సరైన సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, 2029 ఎన్నికల్లో జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తదితర అంశాలపై జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే, 10వ తేదీన జరిగే నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం
రెండు నెలల నుంచి జీతాలు అందక సమగ్ర శిక్ష ఉద్యోగులందరమూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వానికి చిరుద్యోగులమనే కనికరం కూడా లేదు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. పిల్లల చదువులు, వ్యవసాయ రుణాలు, ఇంటి అద్దెలు, నిత్యావసరాలు ఇలా అన్నీ జీతంతోనే ముడిపడ్డాయి. కనీసం ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలి. ఉద్యోగులను ఇబ్బంది పెడితే మాత్రం ఉద్యమిస్తాం. – వి.ఓబిరెడ్డి, సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా జేఏసీ అధ్యక్షుడు జీతాలివ్వకపోతే ఎలా బతకాలి? ఎన్నో ఏళ్ల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. ఏడాదికి సరిపడా జీతాల నిధులను బడ్జెట్లో కేటాయించకపోవడం బాధాకరం. చిరుద్యోగుకు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా ఉద్యోగలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ఇలాగే ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఉద్యమాలు మొదలవుతాయి. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి. – హెచ్ రామన్న, సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి -
డీఎస్సీ అభ్యర్థులతో ఆటలొద్దు
సాక్షి, పుట్టపర్తి: ఎందరో ఉన్నత విద్యావంతులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తికి ఎంపికై న అర్హులకు అన్యాయం చేసి రూ.లక్షలు దండుకుని అక్రమ మార్గంలో నియామకాలు చేపట్టడంపై వైఎస్సార్సీపీ నాయకులు కన్నెర్రజేశారు. వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలకు మంచి స్పందన లభించింది. మంగళవారం హిందూపురం, కదిరి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారని, అదే రీతిలో డీఎస్సీలో అక్రమ నియామకాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 6వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీబీఐతో విచారణ చేయించాలి : మక్బూల్ డీఎస్సీలో అక్రమ నియామకాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయర్త బీఎస్ మక్బూల్ డిమాండ్ చేశారు. కదిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మక్బుల్ మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యతవహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడంతో పాటు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. సీబీఐతో సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అభ్యర్థుల జీవితాలను దగా చేశారన్నారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహించి 10న భారీ ర్యాలీ చేయనున్నట్లు వెల్లడించారు. అక్రమ నియామకాలపై వైఎస్సార్సీపీ నేతల కన్నెర్ర మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలకు స్పందన -
నేటి నుంచి ‘టెట్’
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,324 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. బీఈడీ, డీఎడ్ చేసిన నిరుద్యోగ అఽభ్యర్థులతో పాటు ప్రభుత్వ టీచర్లూ పరీక్షలకు హాజరుకానున్నారు. సుప్రీం కోర్టు నేపథ్యంలో టెట్ అర్హత లేని టీచర్లందరూ పరీక్షలు రాయాల్సి వస్తోంది. రోజూ రెండు విడతలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. పుట్టపర్తిలోని సంస్కృతీ ఇంజనీరింగ్ కాలేజ్, బెంగళూరులోని ఇయాన్ డిజిటల్ జోన్ ఐడీ జెడ్, కేబీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ప్రతి కేంద్రంలోనూ తగినన్ని కంప్యూటర్లు, నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ, సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు హాల్టికెట్లతో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ తదితర) తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇబ్బంది లేకుండా కనీసం గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెబుతున్నారు. జిల్లాలో పరీక్షలు రాయనున్న 2,324 మంది అభ్యర్థులు -
శరవేగంగా తుంగభద్రకు వరద
బొమ్మనహాళ్: ఎగువన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద శరవేగంగా వస్తోంది. సోమవారం 0,705 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో మంగళవారం సాయంత్రానికి 1,00,895 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఒక్కరోజులోనే పది టీఎంసీల రావడంతో డ్యాంలో నీటిమట్టం 53.65 టీఎంసీలకు చేరుకుంది. వరద పోటెత్తుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయం నుంచి 1,447 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ, రాయబసవన కెనాల్కు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 1626.06 అడుగుల నీటి మట్టంతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 24,130 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 23,669 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేదని అధికారులు తెలిపారు. ఆంధ్ర సరిహద్దులో తుంగభద్ర జలాల నిలిపివేత తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేసిన నీళ్లు మంగళవారం వేకువజామున ఆంధ్రా సరిహద్దు 105–272 కిలోమీటర్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నాయి. హెచ్చెల్సీ జిల్లా అధికారుల నుంచి ఆంధ్రాకు ఇండెంట్ సమర్పించలేదు. దీంతో కర్ణాటక హెచ్చెల్సీ అధికారులు మంగళవారం ఆంధ్రా సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కిందకు దింపి నీటిని బంద్ చేశారు. హెచ్చెల్సీలో మరమ్మతులు జరుగుతుండటంతో ఆంధ్రాకు ఇండెంట్ నీటిని ఈ నెల 10 నుంచి తీసుకోనున్నట్లు హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. అది కూడా తాగునీటి అవసరాల కోసం సరిహద్దులో 1,500 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలన్న ఇండెంట్ను టీబీ బోర్డుకు పంపిన్నట్లు ఆంధ్ర హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. ఒక్క రోజులోనే 10 టీఎంసీల నీరు రాక 1,00,895 క్యూసెక్కుల ఇన్ఫ్లో 53.65 టీఎంసీలకు చేరిన నీరు -
శంకరనారాయణ హౌస్ అరెస్ట్
సాక్షి పుట్టపర్తి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ శంకర నారాయణను పెనుకొండ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల భూదందాలు, అక్రమాలు, అణచివేతలను నిరసిస్తూ సోమవారం ఉరవకొండలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల పేరుతో శంకరనారాయణను హౌస్ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం సీఐ రాఘవన్ మాజీమంత్రి నివాసానికి చేరుకుని ఉరవకొండ నిరసన ర్యాలీకి అనుమతులు లేవని, అందువల్ల అక్కడకు వెళ్లేందుకు వీలు లేదంటూ ఇంట్లోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా శంకరనారాయణ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దౌర్జన్యాలు, దాడులు చేయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందన్నారు. కనీసం నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉరవకొండలో జరిగే శాంతియుత ర్యాలీని అనుమతుల పేరుతో నిలువరించారన్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్ సీసీ నాయకులను అరెస్ట్లు చేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యకాండను, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ అరెస్టులను ఆపకపోతే రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.పెనుకొండ రూరల్: మండల పరిధిలోని అమ్మవారిపల్లి గ్రామంలోని నరసింహ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న ముళ్ల పొదల్లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఓ పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. ఆడుకునేందుకు అటుగా వెళ్లిన చిన్నారులు శిశువు ఏడ్పువిని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అంగన్వాడీ సిబ్బందిని తీసుకుని అక్కడికి చేరుకుని పరిశీలించగా...నవజాత మగశిశువు కనిపించింది. దీంతో వారు శిశువును చేరదీసి గుట్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు చికిత్స అందించి పాలు పట్టారు. అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శిశువు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనంతపురంలోని జీజీహెచ్కు రెఫర్ చేయడంతో అంగన్వాడీ సూపర్ వైజర్ విజయలక్ష్మి శిశువును అక్కడికి తరలించారు. అయితే ఆ శిశువును వదిలివెళ్లిన వారు ఎవరు.. ఎందుకని ఇలా చేశారు...అన్న వివరాలు తెలియరాలేదు. అంగన్వాడీ సిబ్బంది సమాచారంతో కియా స్టేషన్ ఎస్ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంచానికే పరిమితమైనా పింఛన్ ఇవ్వరా..?
● కుమారుడి పరిస్థితి చెబుతూ కన్నీటి పర్యంతమైన మహిళ పుట్టపర్తి అర్బన్: ‘‘నా కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నుపూస దెబ్బతినడంతో రెండుకాళ్లూ కదపలేని స్థితి ఉన్నాడు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అయినా పింఛన్ ఇవ్వరా’’ అంటూ ఓ మహిళ తన కుమారుడిని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు ఆటోలో తీసుకువచ్చి మరీ అధికారులను ప్రశ్నించింది. వివరాల్లోకి వెళితే..బుక్కపట్నంకు చెందిన ఓబుళపతి, నారాయణమ్మ దంపతుల కుమారుడు సురేష్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. భార్య చందన, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణకు సురేష్ కొత్తచెరువులోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా చేరాడు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేష్కు వెన్నుపూస దెబ్బతినింది. కుమారుడి చికిత్స కోసం ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న బంగారు, కొద్ది పాటి భూమిని అమ్మారు. అయినా అతని పరిస్థితిలో మార్పు రాలేదు. శరీరం సహకరించక పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కనీసం పింఛన్ అయినా ఇచ్చి ఆదుకోండని సురేష్ తల్లి నారాయణమ్మ అధికారులను వేడుకుంది. అయినా ఎవరూ కనికరించలేదు. ఒక సారి సదరం నిమిత్తం మదనపల్లికి పంపారు. అక్కడి వరకూ వెళ్లి వచ్చినా పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో నారాయణమ్మ సోమవారం తన కుమారుడు సురేష్ను ఆటోలో వేసుకుని నేరుగా రెవెన్యూ భవన్కు వచ్చి కలెక్టర్ శ్యాం ప్రసాద్కు చూపించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంది. వెంటనే డీసీహెచ్ఎస్ మధుసూదన్ వచ్చి వివరాలు సేకరించారు. -
రీ సర్వే తప్పులు.. తిప్పలు
పుట్టపర్తి అర్బన్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన సమగ్ర రీ సర్వే అపహాస్యమైంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా గాడి తప్పింది. భూ సమస్యలు తీర్చేందుకు చేపట్టిన ప్రాజెక్టు రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక రీసర్వే అంతా తూతూ మంత్రంగా మారింది. రైతులకు తెలియకుండానే సర్వే పూర్తి చేసిన అధికారులు భూ విస్తీర్ణం ఇష్టానుసారం నమోదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి, పాసుపుస్తకంలో నమోదైన భూమికి పొంతన ఉండటం లేదు. దీంతో రుణాలతో పాటు ఇతర పథకాలకూ రైతులు దూరమవుతున్నారు. మా తప్పేం లేదు.. పాసుపుస్తకంలో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైందని, మార్చి ఇవ్వాలని రైతులు వీఆర్ఓలను కోరితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారు. అక్కడికి వెళితే అదంతా సర్వే శాఖ చేసిన తప్పిదమని తమ తప్పేంలేదని చెబుతున్నారు. గట్టిగా నిలదీస్తే కలెక్టరేట్కు వెళ్లమని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు చివరకు ఆందోళనకు దిగుతున్నారు. రెవెన్యూ భవన్ ముట్టడి.. పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన రీ సర్వేలు తప్పులు జరిగాయని పలువురు రైతులు సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరుగుతున్న రెవెన్యూ భవన్ను ముట్టడించారు. నల్లమాడ మండలం వేళ్లమద్ది, గుట్టకింద తండా, కొత్తపల్లి, యర్రవంకపల్లి, తదితర గ్రామాలకు చెందిన రైతులు పదుల సంఖ్యలో విచ్చేశారు. తమకు తెలియకుండానే రీసర్వే చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారని, అందులో భూముల విస్తీర్ణం తగ్గించి చూపారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఓలను, తహసీల్దార్లను అడిగినా సరైన సమాధానం లేక పోవడంతో కలెక్టర్ వద్దకు వచ్చినట్లు వెల్లడించారు. తాము తాతల కాలం నుంచి పట్టాభూములను సాగు చేసుకుంటూ పంటలను పండించుకుంటున్నామని, అయితే ఇటీవల జరిగిన రీ సర్వే అనంతరం వచ్చిన పాస్ పుస్తకాలలో తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. తమ దగ్గర ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలకూ ప్రస్తుతం వచ్చిన పాస్ పుస్తకాలకు చాలా తేడాలున్నాయని తెలిపారు. తప్పులతడకగా ఉన్న పాస్ పుస్తకాలతో మ్యుటేషన్లు సైతం కాలేదన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే తమకు సంబంధం లేనట్లు అధికారులు చెప్తున్నారన్నారు. ఒక్కో రైతుకు సంబంధించి అర ఎకరా నుంచి 3 ఎకరాల వరకూ తగ్గించి పట్టాదారు పాసుపుస్తకాల్లో విస్తీర్ణం చూపారన్నారు. ఇప్పటికై నా తమ సమస్యను పరిష్కరించక పోతే జాతీయ ఎస్టీ కమిషన్ సహకారంతో ఢిల్లీకి వెళ్లి కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడతామన్నారు. ఈ చిత్రంలోని రైతు పేరు రమణానాయక్. నల్లమాడ మండలం వేళ్లమద్ది స్వగ్రామం. అతనికి మూడు సర్వే నంబర్లలో 3.80 ఎకరాలు ఉంది. ఇది తాతలకాలం నాటి నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. కానీ ఇటీవల భూమిని సర్వే చేసిన అధికారులు పట్టాదారు పాసుపుస్తకంలో కేవలం 2.06 ఎకరాలు మాత్రం చూపారు. తక్కిన 1.74 ఎకరాల భూమిని మాయం చేశారు. ఇప్పటికే రమణానాయక్ పాసుపుస్తకాలు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల రెన్యూవల్కు వెళ్తే వన్బీలో విస్తీర్ణం తగ్గడంతో బ్యాంక్ మేనేజర్ రుణం మొత్తం చెల్లించాలని చెప్పారు. తనకు 3.80 ఎకరాల భూమి ఉందని చెప్పినా వినిపించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ...రమణానాయక్ లాగే జిల్లాలో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీసర్వే అనంతరం అధికారులు ఇష్టానుసారం భూవిస్తీర్ణం నమోదు చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఒక్కో రైతు పాసుపుస్తకం నుంచి 5 సెంట్లు, 10 సెంట్లు నుంచి ఎకరాలకు ఎకరాలే మాయం చేశారు. అడిగితే ప్రింట్ చేసిన చోట టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, మళ్లీ పంపుతామని సర్ది చెప్తున్నారు. అపహాస్యమవుతున్న రీ సర్వే ప్రాజెక్టు పాసుపుస్తకంలో భూ విస్తీర్ణం తగ్గించి చూపిన వైనం వన్బీలు కూడా రాక పథకాలు పొందలేకపోతున్న రైతులు తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించినా స్పందన శూన్యం సోమవారం కలెక్టరేట్ను ముట్టడించిన గిరిజన రైతులు -
దగా డీఎస్సీపై ధర్మాగ్రహం
సాక్షి, పుట్టపర్తి మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవకతవకలపై బాధిత అభ్యర్థుల తరఫున వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ఆందోళనలను తీవ్రతరం చేసింది. సోమవారం పెనుకొండ, మడకశిర, ధర్మవరంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని చంద్రబాబు సర్కార్ తీరును నిరసించారు. అర్హులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ చేసే ప్రతి పోరాటంలోనూ పాలుపంచుకుంటామన్నారు. లోకేష్ రాజీనామా చేయాలి.. దగా డీఎస్సీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవతవకలను నిరసిస్తూ ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో పెనుకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏళ్లుగా కష్టపడి చదివి పరీక్ష రాసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్కో పోస్టును రూ.లక్షలకు అమ్ముకుందని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ అనంతరం పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ పోస్టింగులు ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తరహాలో డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదో మాయని మచ్చ : కేతిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు చేసి అర్హులకు అన్యాయం చేసిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ధర్మవరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రముఖులతో రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ పోస్టులను కూటమి నేతలు అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన కుంభకోణం రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ అన్నారు. ఈనెల 6 నుంచి ధర్మవరంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు కేతిరెడ్డి వెల్లడించారు. ఇది సాక్ష్యం కాదా? ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో భాగమైన పురమ నవీన్ అనే అభ్యర్థికి సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్–2లో ఆరో ర్యాంక్గా నిలవడం చూస్తే ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గతంలో స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండేదని, కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ తెచ్చి స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడంతో పాటు అభ్యర్థులకు రాత పరీక్షను ఎత్తి వేయడం అక్రమాలకు నిదర్శనం కాదా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అనర్హులకు కట్టబెట్టింది వాస్తవం కాదా ప్రశ్నించారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ సాధించిన దుర్గయ్యను ఇంటర్వ్యూలకు పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని కేతిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేయాలి : ఈరలక్కప్ప డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. మడకశిరలోని టౌన్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఆందోళనలో భాగంగా ఈనెల 6, 7, 8, 9 తేదీల్లో మడకశిరలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశాలు డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నేతల డిమాండ్ -
‘టెట్’ జిల్లా పరిశీలకుల నియామకం
అనంతపురం ఎడ్యుకేషన్: రేపటి నుంచి ప్రారంభం కానున్న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణ పర్యవేక్షణకు జిల్లాల వారీగా పరిశీలకులను నియమించారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్.నరసింహారావు, శ్రీసత్యసాయి జిల్లా పరిశీలకులుగా సమగ్ర శిక్ష ఎస్పీడీ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ విజయేంద్రరావును నియమించారు. సీబీటీ విధానంలో నిర్వహించే టెట్ పరీక్షలను నిస్పక్షపాతంగా విజయంతంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి పరిశీలకులను నియమించినట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ● అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలో పేర్కొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తంగా 317 అర్జీలు అందించారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, ఎస్డీసీ విజయకుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఈఓ కిష్టప్ప, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమయ్యారు. మౌలిక వసతుల కల్పన కల్పించేందుకు జిల్లాలో 344 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించి తదుపరి ప్రక్రియలన్నింటినీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దే వద్దు
వర్షాల కోసం మహాయాగంవిద్యార్థుల భవితకు బాటలు వేయాలి పుట్టపర్తి అర్బన్: విద్యారంగంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఎంఈఓలు, క్లష్టర్ హెచ్ఎంలకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో పాఠశాలల విద్యా ప్రగతి సూచీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ...విద్యలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుని జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల విద్యే పునాది లాంటిదని, దీన్ని గుర్తించి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. స్టార్ రేటింగ్ తక్కువగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్ ప్రమాణాలు పెంచాలన్నారు. విద్యాకిట్లు వంద శాతం అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, సమగ్ర శిక్ష అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. మందుబాబులపై కేసుకదిరి టౌన్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం నిందితులను కదిరి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా, మరొకరికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. అలాగే, కదిరిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించిన 15 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి జరిమానా విధించారన్నారు. మద్యం తాగి బైక్ నడిపిన ఇద్దరికి జైలు తలుపుల : మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన తలుపులలోని కుమ్మరపేట, ఎస్టీ కాలనీలకు చెందిన ఓబులేసు, సాయి అనే యువకులకు కదిరి మెజిస్టేట్ కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. రూ.10వేల జరిమానా విధించినా కట్టనందున వీరికి ఐదు రోజుల శిక్ష నిమిత్తం సబ్జైలుకు పంపినట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీపుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై చట్టపరిధిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురనా, సీఐ బొజ్జప్ప, డీటీఆర్బీఐ లక్ష్మీకాంత్రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. టెట్ రద్దు చేయాలి పుట్టపర్తి: 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదంటే పూర్తిగా టెట్ను రద్దు చేయాలని వైఎస్సార్టీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి బడా హరిప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బుక్కపట్నం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐఆర్ ప్రకటించాలని, యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రతాప్రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సీనియర్ నాయకులు వెంకటేష్ బాబు, మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. జీనులకుంటలో మంచినీటి ఎద్దడిని నివారించాలిగాండ్లపెంట: మండల పరిధిలోని జీనులకుంట పంచాయతీ కేంద్రంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించాలంటూ సోమవారం పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మండల కేంద్రానికి తరలివచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎలుగూటివారిపల్లికి చెందిన రైతు చంద్రశేఖరరెడ్డి జీనులకుంటకు నీరు వెళ్లకుండా పైపులైన్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. రైతుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సుమతి, ఎంపీడీఓ రామక్రిష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రైతు చంద్రశేఖరరెడ్డిని ఎంపీడీఓ కార్యాలయం వద్దకు పిలిపించి ఎంపీడీఓ, ఎస్ఐలు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం నేరమని హెచ్చరించారు. 4 రోజుల్లో పైపులైన్ను పునరుద్ధరిస్తానని అతను హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. చంపుతామంటూ మెడికల్ ఆఫీసర్కు బెదిరింపులు ● పోలీసులను ఆశ్రయించిన బాధితుడు పుట్టపర్తి అర్బన్: చంపుతామంటూ మెడికల్ ఆఫీసర్ను పలువురు బెదిరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, బాధితుడు డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపిన మేరకు.. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పుట్టపర్తిలో డీఎంహెచ్ఓ ఫైరోజ బేగం అధ్యక్షతన జరిగిన సమావేశానికి దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనకు 9494457409 నంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తి తాను లింగా రామమోహన్ అని పరిచయం చేసుకున్నాడు. అసభ్యకరంగా దూషించాడు. మరో వ్యక్తి నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే ఒక వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంగళమ్మచెరువు పీహెచ్సీకి వెళ్లి తన గురించి విచారించినట్లు బాధిత డాక్టర్ తెలిపారు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో అమర్యాదగా మాట్లాడారని వాపోయారు. తనకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం వద్ద మొర పెట్టుకున్నారు. ఆమె సూచనలతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ యువరాజ్ పేర్కొన్నారు. ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మందిరంలో ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్తో కలసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పతాకావిష్కరణ, వేదిక ఏర్పాట్లు, అలంకరణ పనులను సుందరంగా చేపట్టాలన్నారు. పరేడ్ మైదానంలో బారికేడింగ్ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రత్యేక అతిథులను గౌరవప్రదంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆహ్వాన పత్రికలు, ప్రొటోకాల్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వేడుకలను విజయవంతం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ అంకిత సురానా, డీఆర్ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కష్టకాలంలోనూ రైతుపై బీమా బండ● రూ.55.79 కోట్ల ప్రీమియం చెల్లింపు ● ఈనెల 15 తర్వాత వెల్లడికానున్న ఫసల్బీమా ప్రీమియం అనంతపురం అగ్రికల్చర్: కష్టకాలంలోనూ చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కోట్ల రూపాయల భారం మోపింది. 2019–2024 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులపై ఎలాంటి భారం మోపకుండా ఉచితంగా పంటల బీమా పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. పంట సాగు చేసి ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలు బీమా వర్తింపజేసి పెద్ద మొత్తంలో పరిహారం కూడా అందించి ఆదుకున్నారు. అలా వైఎస్ జగన్ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14.20 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,883 కోట్ల పరిహారం అందించి ఔరా అనిపించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టగానే ఉచిత పంటల బీమా పథకాలకు మంగళం పాడేసింది. రైతులపై ప్రీమియం భారం మోపడంతో పాటు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తుండటంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎల్–నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత ఖరీఫ్లో బీమా పథకాలు ఆదుకుంటాయనే ఆశతో అప్పులు చేసి ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం, బీమా కంపెనీలు సరైన ఏర్పాట్లు చేయకున్నా బ్యాంకులు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్సీ సెంటర్లు, వ్యవసాయశాఖ కార్యాలయాలు, ఆర్ఎస్కేల వద్ద పడిగాపులు కాసి ప్రీమియం కట్టారు. రూ.55.79 కోట్ల ప్రీమియం.. వాతావరణ బీమా పథకం కింద నోటిఫై చేసిన వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, అరటి, టమాట పంటలకు ప్రీమియం గడువు ఆగస్టు ఒకటితో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,70,967 మంది రైతులు తమ వాటా కింద రూ.55.79 కోట్ల ప్రీమియం చెల్లించారు. అందులో అనంతపురం జిల్లాలో 78,765 మంది రైతులు రూ.33.32 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 92,202 మంది రైతులు రూ.22.47 కోట్ల ప్రీమియం కట్టారు. ఆర్థికంగా చితికిపోయినా రూ.55.79 కోట్లు బీమా కంపెనీకి చెల్లించాల్సి వచ్చింది. రైతు ప్రీమియం కట్టిన తరువాత బీమా కంపెనీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లాలో 1.15 లక్షల హెక్టార్లకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 1.18 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించడంతో వాటి ఆధారంగా జిల్లాలో రూ.1,083 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.979 కోట్లు... వెరసి రూ.2,062 కోట్ల విలువ చేసే పంటలకు ప్రీమియం చెల్లించారు. ఇది కేవలం వాతావరణ బీమా పంటలకే. ఇంకా ఫసల్బీమా కింద నోటిఫై అయిన పంటలకు ఈనెల 15 వరకు గడువు ఉన్నందున ఎంతనేది ఆ తర్వాత వెల్లడి కానుంది. కక్ష సాధింపులపై విమర్శల పర్వం సాక్షి, టాస్క్ఫోర్స్: వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్పై చందబ్రాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ గౌడ్ వైఎస్సార్సీపీ నిరసనల్లో పాల్గొంటుండటంతో ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలతో గతంలో అక్రమ కేసులు బనాయించారు. రెండు రోజుల క్రితం జరిగిన చిన్న గొడవలో తలదూర్చాడనే కారణంతో ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేసిన హిందూపురం పోలీసులు, అందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి ప్రశాంత్ గౌడ్ను మాత్రం రిమాండ్కు తరలించారు. ఈ విషయంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది. పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఏపీపీటీడీ జేఏసీ పేర్కొంది. సోమవారం సంతకాల సేకరణ పుస్తకాన్ని కలెక్టర్కు అందజేసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం రెవెన్యూ భవన్లో చంద్రబాబు చిత్రపటం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం నేపథ్యంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సహకారం అందిస్తున్నామన్నారు. ప్రయాణికులు పెరిగినా ఒక్క బస్సు గాని, సిబ్బందిని గానీ పెంచలేదన్నారు. పథకాన్ని సాకుగా చూపి ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు వాటిని ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు కొత్త బస్సులు నడపాలన్నారు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. విద్యుత్ బస్సులతో కార్గో ఆదాయంలో నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటుకు ఇవ్వకుండా కాపాడాలన్నారు. 12వ పీఆర్సీ అమలు, ఐఆర్, పెండింగ్ డీఏలను ప్రకటించాలని, పెండింగ్ అరియర్స్, సరెండర్ లీవులు, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వైపీ రావు, శ్రీరాంనాయక్, శ్రీనివాసులు, షబ్బీర్ తదితరులు ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండిపుట్టపర్తి అర్బన్: ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఏర్పడినందున వేరుశనగ సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి వ్యవసాయాధికారి శ్రీవాణి అధ్యక్షతన పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు, బీడుపల్లి గ్రామాల్లో వివిధ పంటలను పరిశీలించి ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే ఆముదం, అలసంద, ఉలవ, పెసర తదితర పంటలను సాగు చేయాలన్నారు. ఖరీఫ్లో సాగు చేసిన పంటలను ఆర్ఎస్కే సిబ్బందితో నమోదు చేయించాలన్నారు. వాతావరణ బీమా ఈ నెల 15 వరకూ ఉన్నందున ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రీమియాన్ని సీఎస్పీ సెంటర్లలో చెల్లించాలన్నారు. వేరుశనగ, కందికి బెట్ట తగలకుండా పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సాళ్ల మధ్యలో కలుపు లేకుండా చూసుకోవాలన్నారు. నీటి సదుపాయం ఉంటే ఒక తడిని ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ నాయక్, వ్యవసాయ కళాశాలల ప్రిన్సిపాళ్లు రవికుమార్, పీటర్, ఆర్ఎస్కే సిబ్బంది వేమారెడ్డి, చంపకలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు శ్రీరామరెడ్డి తదితరులు ఉన్నారు. కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన ఉమామహేశ్వర ఆలయం(శివాలయం)లో వర్షాల కోసం సోమవారం అర్చకులు మహాయాగం నిర్వహించారు. ఖాద్రీ ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకుల నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువతి అదృశ్యంపెనుకొండ రూరల్: మండలంలోని గుట్టూరు గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. కియా పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దేవరాజు కుమార్తె ఆదివారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయింది. పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. రాఘవయ్య తెలిపారు. -
పర్యాటక కేంద్రం.. ఘోరం
జఠాయువు రోడ్డులో పడేసిన వ్యర్థ పదార్థాలు ఆలయం వెనుక భాగంలో చెత్తాచెదారంలేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి రోజూ అనేక మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ప్రతి ఆది, శనివారాల్లో వేలాది మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. అలాంటి పర్యాటక కేంద్రంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పర్యాటకులు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరభద్రస్వామి దేవాలయం తూర్పు ద్వారం నుంచి జఠాయువు పక్షి విగ్రహానికి వెళ్లే రహదారికి ఇరువైపులా చెత్తతో పాటు మాంసపు ముద్దలు, వ్యర్థ పదార్థాలు పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పర్యాటకులు ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కంచిసముద్రం రోడ్డు, జఠాయువు పక్షి రోడ్డుకు ఇరువైపులా అపరిశుభ్రత తాండవిస్తోంది. అదేవిధంగా ఆలయం పడమర ద్వారంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో పర్యాటకులు భయకంపితులవుతున్నారు. పరిసరాలను శుభ్రం చేయాల్సిన పంచాయతీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తులు ఆహ్లాదం పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లుకర్కశత్వానికి బలైన శిశువు అనంతపురం సిటీ: నానమ్మ కర్కశత్వానికి చిన్నారి బలైంది. వివరాలు.. లేపాక్షి మండలం మామిడాకులపల్లికి చెందిన అశోక్కుమార్, పూజిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అశోక్కుమార్ తల్లికి ఇష్టం లేదని తెలిసింది. అయినా కుమారుడి కోసమని ఆమె మౌనంగానే ఉంటూ వచ్చారు. గర్భం దాల్చిన పూజిత గత మే నెల 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న అశోక్కుమార్ తల్లి లోలోన రగిలిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఈ క్రమంలోనే శిశువుకు ఫిట్స్ వస్తుండడంతో తల్లిదండ్రులు జూలై 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రెండో అంతస్తులో ఉన్న పీడియాట్రిక్ వార్డులో వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తూ వచ్చారు. 28వ తేదీ వేకువజాము తల్లి నిద్రిస్తుండగా.. నానమ్మ ఆ శిశువును తీసుకెళ్లి రెండో అంతస్తుపై నుంచి కిందకు విసిరేసింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. లేత శరీరం లోపల తీవ్రమైన గాయాలు ఉండడంతో శిశువు కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందింది. లేపాక్షిలో తాండవిస్తున్న అపరిశుభ్రత పర్యాటకులు, భక్తులకు తప్పని ఇక్కట్లు పట్టించుకోని అధికారులు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ -
అగ్ని ప్రమాదంలో గుడిసెల దగ్ధం
అమరాపురం: మండల పరిధిలోని పుల్లీకుంట గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో రూ.నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బాధితులు నందీష్, రత్నమ్మ వివరాల మేరకు... పుల్లీకుంట ఇందిరమ్మ కాలనీలో గుడిసెలో నందీష్, రత్నమ్మ నివాసం ఉంటున్నారు. యథావిధిగా శనివారం రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారు జామున ఉన్నఫలంగా మంటలు చెలరేగిన శబ్ధం వినిపించింది. వెంటనే భార్యా పిల్లలతో పాటు బయటికి వచ్చి చూడగా గుడిసె అగ్గి రాజుకొని మంటలు చెలరేగాయి. దీంతో ఇరుగు పొరుగు వారిని పిలిచే లోపు మొత్తం గుడిసె కాలి పోయిందని బాధితులు వాపోయారు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.90 వేలు నగదు, భార్య తిప్పమ్మకు చెందిన బంగారు నగదు, వంట సామగ్రి, వస్తువులు కాలిపోయాయని వాపోయారు. దీంతో రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందన్నారు. అలాగే తమ ఇంట్లో అగ్గి రాజుకుని పొరుగున ఉన్న రత్నమ్మ నివాసం ఉంటున్న వారుపాక పూర్తిగా కాలిపోయిందన్నారు. దీంతో రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు రత్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా.. లేక ఎవరైనా నిప్పుపెట్టారా.. అన్నది తేలాల్సి ఉంది. అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని విద్యుత్శాఖ ఏఈ సిద్దేశ్వర పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరగలేదని, ఇంటిలోనే దీపం వెలిగి కాలి ఉండవచ్చని ఏఈ తెలిపారు. -
గుప్తనిధుల తవ్వకాలు భగ్నం
● కాపు కాసి వాహన డ్రైవర్ను పట్టుకున్న గ్రామస్తులు బత్తలపల్లి: గుప్తనిధుల తవ్వకాలను గ్రామస్తులు భగ్నం చేశారు. ముఠాకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. మండలంలోని అప్రాచెరువు గ్రామ సమీపంలో ఉన్న అపరాదయ్య బండ వద్ద కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు సాగిస్తున్నారు. శనివారం రాత్రి వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు సూలా నరసింహులు,బుట్రా గోపాల్, సంగాల నాగరాజు, సూలా ఓబన్న ఆ ప్రాంతంలో మాటువేయగా.. అర్ధరాత్రి సమయంలో టవేరా వాహనంలో ఏడుగురు దుండగలు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలియగానే అపరాదయ్య బండ వద్దకు గ్రామస్తులతో కలిసి సింగిల్విండో అధ్యక్షుడు ఆకులేటి వీరనారప్ప వచ్చారు.అందరూ కలిసి దుండగులను పట్టుకునేందుకు యత్నించగా వారు పారిపోయారు. డ్రైవర్ వాహనంతో పాటు పారిపోతుండగా గ్రామస్తులు వాహనాల్లో వెంబడించారు. జాతీయ రహదారిపై సంకేపల్లి వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి కుమారుడు కొండూరు సుధీర్రెడ్డిగా గుర్తించారు. పోలీసులు టవేరా వాహనంతోపాటు తవ్వకాల కోసం తెచ్చిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల కోసం పామిడికి చెందిన ఇద్దరు, కల్లూరుకు చెందిన ఇద్దరు, అనంతపురానికి చెందిన ఇద్దరు వచ్చినట్లు తెలిసింది. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
పరిగి: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ మాటున దగా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. మండలంలోని శ్రీరంగరాజుపల్లి పంచాయతీ పరిధి ముల్లమోతుకపల్లిలో ఆదివారం సాయంత్రం కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులతో కలిసి గొరవనహళ్లి గేట్ నుంచి రెండు కిలోమీటర్ల మేర బైకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ప్రతి గడపకూ వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తామంతా జగనన్నకు తోడుగా ఉంటామని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ప్రజలు ఉషశ్రీచరణ్కు తెలిపారు. మోసం చేయడం బాబుకు మామూలే.. మోసానికి చంద్రబాబు నిలువెత్తు రూపమని, ఆయన నోటి వెంట అబద్ధాలు తప్ప నిజాలు రావని ఉషశ్రీచరణ్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నిరుద్యోగ యువతను నిండా ముంచారన్నారు. ఏళ్లుగా కష్టపడి చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగాలివ్వకుండా అనర్హులకు జాబులిచ్చి కోట్లాది రూపాయల స్కామ్కు పాల్పడిన మంత్రి ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని, లేకపోతే ఉద్యోగార్థులే పదవిని ఊడగొడతారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు సర్కార్కు వారి శాపం తగులుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో దశలవారీగా పోరాటాన్ని కొనసాగిస్తామని, నిరుద్యోగ యువత కదిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే, అంతకంటే ఎక్కువ స్కామ్కు పాల్పడి అడ్డంగా దొరికిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. బాబొస్తే కరువు.. దేశమంతా వర్షాలు పడుతున్నా ఆంధ్రప్రదేశ్లో వరుణదేవుడు కరుణించపోవడానికి కారణం చంద్రబాబేనని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉన్నారన్నారు. నేడు కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నను చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆదుకోవడం లేదన్నారు. ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం లేదని, అన్నదాత సుఖీభవ పథకంలో అరకొర నిధులు మంజూరు చేసి మోసగించిన ఈ ప్రభుత్వాన్ని రైతులే కూలగొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని జనం చెబుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
రాజు రాజ్యం.. నిత్య నరకం!
సాక్షి, పుట్టపర్తి: ప్రజల నుంచి ఓట్లు దండుకుని గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలియదు. గెలిపించిన పాపానికి ప్రజలను గాలికొదిలేశారు. పొరుగు జిల్లాలో అక్రమాస్తులు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారనే ఆరోపణలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గంలో పాలన అటకెక్కి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎక్కడుంటారో.. ఏమో? జిల్లా వ్యాప్తంగా వాల్టా చట్టం పరిధిలో 51 గ్రామాలు ఉండగా.. అందులో మడకశిర నియోజకవర్గ పరిధిలో 15 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బోరుబావులు తవ్వేందుకు అనుమతులు లేవు. తాగునీటి సమస్య నెలకొన్న ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. స్థానికంగా కూటమి పార్టీల నాయకులకు ఎమ్మెల్యే రాజుతో విభేదాలు నెలకొనడం, మిత్రులకు కూడా ‘గుండు’సున్నా పెట్టడంతో ప్రజా సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక నాయకుడైతే ఇంటికే వెళ్లి నిలదీసే వారమని, కనీసం నియోజక వర్గంలో ఆయన ఇల్లు ఎక్కడుందో కూడా తెలియకపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోతున్నామని ప్రజలు నిట్టూరుస్తున్నారు. నీటి పారుదల చేయలేని రాజు నోటి పారుదలలో మాత్రం ముందు వరుసలో ఉన్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర వ్యాప్తంగా క‘న్నీటి’ కష్టాలు నిత్యం ఏదో ఒక చోట ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్న మహిళలు సమస్యతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా అడ్రెస్ లేని ఎమ్మెల్యే రాజు గెలిపించిన పాపానికి గాలికొదిలిన వైనం మండిపడుతున్న ప్రజానీకం మడకశిర నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్న గ్రామాలు రొళ్ల మండలంలో ఎం.రాయపురం, హెచ్టీ హళ్లి, టీడీ పల్లిలోని ఇందిరమ్మ కాలనీ, కొడ గార్లగుట్ట, బాజయ్య పాళ్యం, రత్నగిరి ఇందిరమ్మ కాలనీ, కాకి దొడ్డేరి, పిల్లిగుండ్ల కాలనీ. అమరాపురం మండలం బసవనపల్లి, తమ్మడేపల్లి. గుడిబండ మండలంలో ఫళారం, కేకాతి, బూదిపల్లి, మండల కేంద్రంలోని రాజు కాలనీ, మోపురుగుండు, గుణేమోరుబాగల్, ఎస్.రాయపురం. అగళి మండలంలోని హుళికేర దేవరహళ్లి, ఇనగలూరు, మధూడి, నరసంబూది, పి. బ్యాడిగెర, రావుడి. మడకశిర మండలంలోని మూడు గ్రామాల్లో నీటి సమస్య ఉంది. మున్సిపాలిటీలోని 6వ వార్డు ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. -
వైభవం.. సప్తమాతృకల ఉత్సవం
గద్దైపె పూజా కార్యక్రమాలను తిలకిస్తున్న భక్తులు ప్రత్యేక అలంకరణలో అక్కమ్మ దేవతల విగ్రహాలు పుట్టపర్తి అర్బన్: ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని ఏడాదికి ఒక్కసారి జరిగే సప్త మాతృకల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీ పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం చౌటవంకలో కొలువై ఉన్న సప్తమాతృక అక్కమహా దేవతల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన బాలికల కుంకుమార్చన, బాలుర నెమలి ఈకల నివేదన కార్యక్రమంతో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 7 మంది అక్కమహాదేవతల మూల విరాట్టులకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. వెండి, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేసి పూజలు చేశారు. ఆదివారం సాయంత్రం అక్కమ్మ దేవతలకు ప్రతీకగా ఏడుగురు బాలికలకు పూజలు నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దైపె కుంకాలు చెరిగారు. తర్వాత వారికి చేటలు ఇచ్చి అందులో పూజా సామగ్రిని ఉంచి కుంకాలు చెరిగే కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎడ్ల బండ్లు ఊరేగించారు. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. చౌటవంకకు పోటెత్తిన భక్తులు -
దగా సర్కారుపై ‘మహా’ సంగ్రామం
మడకశిర: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా పట్టు రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు. ఇప్పటికే పలుమార్లు బాధిత రైతులు ఆందోళనలు, నిరసనలు చేసినా దిగిరాలేదు. దీంతో పట్టు రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 28 వేల మంది పట్టు రైతులు ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఏటా రికార్డు స్థాయిలో బైవోల్టిన్ పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్ ప్రసిద్ధి గాంచింది. రైతులు ఇక్కడ విక్రయించే బైవోల్టిన్ పట్టుగూళ్లకు కేజీకి రూ.50 చొప్పున ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పైసా చెల్లించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహక బకాయిలు రూ.60 కోట్లకుపైగా పేరుకుపోగా.. జిల్లాలో రూ.25 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. సబ్సిడీలోనూ అంతే.. పట్టు రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయి. సెంట్రల్ సిల్క్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పథకాలు అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా రేరింగ్ షెడ్లు, ప్లాంటేషన్, మందులు తదితర వాటికి సబ్సిడీ అందించాల్సి ఉన్నా ఏడాది నుంచి అందలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో రూ.13 కోట్ల వరకు బకాయిలున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తన వాటా ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5న మహా ర్యాలీ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు పట్టు రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వినతి పత్రాలు అందించారు. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంతో పట్టు రైతులు ఈ నెల 5న హిందూపురంలో మహార్యాలీకి సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వేలాది మంది పట్టు రైతులు ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వంలో బైవోల్టిన్ రైతులకు అందని ప్రోత్సాహకం పేరుకు పోయిన బకాయిలు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం సమస్యల పరిష్కారానికి 5న ‘పురం’లో మహార్యాలీ ప్రభుత్వ కళ్లు తెరిపిస్తాం పట్టు రైతుల సమస్యలపై గతంలో ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. తాజాగా హిందూపురంలో నిర్వహించే మహార్యాలీ ప్రభుత్వ కళ్లు తెరిపిస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ‘పురం’ పట్టుగూళ్ల మార్కెట్ నిర్మాణానికి నిధులివ్వాలి. –సోమ్కుమార్, జిల్లా పట్టు రైతుల సంఘం అధ్యక్షుడు ఆదుకోకుంటే కనుమరుగే కొన్నేళ్లుగా బైవోల్టిన్ పట్టుగూళ్లను పండిస్తున్నా. ప్రభుత్వం నుంచి నాకు రూ.లక్షల్లో ప్రోత్సాహక నగదు అందాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం పట్టు రైతులకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలి. లేకపోతే పట్టు పరిశ్రమే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. – సన్నమారప్ప, కొత్తపాళ్యం, రొళ్ల మండలం ఇతని పేరు దశనాథరెడ్డి. మడకశిర మండలం పాప సానిపల్లికి చెందిన ఈయనకు రెండెకరాల మల్బరీ తోట ఉంది. ఏటా 1,000 కేజీల బైవోల్టిన్ పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తాడు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్లో విక్రయించిన ప్రతి కేజీకి రూ.50 చొప్పున అదనంగా ప్రోత్సాహకం అందించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వంలో పైసా అందలేదని దశనాథ రెడ్డి వాపోతున్నాడు. -
తిరుపతి–మంత్రాలయం మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ఆర్ఆర్బీ పరీక్షలు రాసే విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు తిరుపతి–మంత్రాలయం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (07429) రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మంత్రాలయం చేరుతుంది. తిరిగి మరో ప్రత్యేక రైలు (07430) మంత్రాలయం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజూమున 2 గంటలకు తిరుపతి జంక్షన్కు చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, కోడూరు, ఓబుళవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, బాక్రాయిపేట, కడప, కమలాపురం, యర్రగుంట్ల,ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, నక్కనదొడ్డి, గుంతకల్లు, ఆదోని, కోసిగి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ముగిసిన బాలవికాస్ గురువుల సదస్సుప్రశాంతి నిలయం: బాలవికాస్ గురువుల సదస్సు ఆదివారం ముగిసింది. ప్రశాంతి నిలయంలో మూడు రోజుల పాటు బాలవికాస్ విద్యా లక్ష్యాలు, మరింత అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తూ సదస్సు సాగింది. సత్యసాయి బోధనలకు అనుగుణంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తీర్మానించారు. తమ కర్తవ్యాన్ని, సత్యసాయి సూచించిన లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని గురువులు ప్రతిజ్ఞ చేశారు. బాలవికాస్ చిన్నారులు, పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు వైఎస్ జగన్ కృషిచిలమత్తూరు: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయ సాధనకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ కృషి చేస్తుందని పార్టీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని గొల్లాపురంలో ఆదివారం నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్తో కలిసి టీఎన్ దీపిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దీపిక మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ కృషి చేశారని కొనియాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. అణగారిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి తిప్పేరుద్రయ్య, పట్టణ కన్వీనర్ శ్రీరాములు, ఎస్సీ సెల్ జిల్లా నేత జంగం చందు, రామాంజి, మాజీ సర్పంచ్ దేవరాజు, నాయకులు శివారెడ్డి, రంగనాథ్, శివ, గంగాధర్, జయచంద్ర, మంజు, హయత్ భాషా పాల్గొన్నారు. -
టీచర్లకు టెట్ టెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంటే ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల పరీక్షగానే భావించేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో టెట్ రాయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోధన చేసే టీచర్లందరికీ టెట్ అర్హత తప్పనిసరి. దీంతో టెట్ అర్హత లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు టెట్ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం మూడు టెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుట్టపర్తి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు బెంగళూరులో ఐయాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్, హెచ్కేబీకే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లలో ఈనెల 5 నుంచి 16 వరకు అన్ని రోజులూ కలిపి రెగ్యులర్ టీచర్లతో పాటు, బీఈడీ, డీఎడ్ చేసిన అభ్యర్థులు 2,324 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మూడు కేంద్రాలకు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. పుట్టపర్తిలో కేంద్రానికి కొత్తచెరువు ఎంఈఓ–2 పి.జయచంద్ర, బెంగళూరు కేంద్రాలకు చిలమత్తూరు ఎంఈఓ–2 జి.సాల్మన్రాజు డిపార్ట్మెంటల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. టెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ జి.కృష్ణప్ప తెలిపారు. టీచర్లకు సవాల్ పది, పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న కొందరు ఉపాధ్యాయులు మళ్లీ టెట్ రూపంలో పోటీ పరీక్ష రాయాల్సి రావడం వారికి మానసికంగా సవాల్గా మారింది. కొత్త సిలబస్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), సమయ నిర్వహణ వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పడం, పాఠశాలల పరిపాలనా పనులు, రికార్డుల నిర్వహణ, ఎఫ్ఏ–1 పరీక్షల ఏర్పాట్లు, సమావేశాలు, సమీక్షలు... ఇలా రోజంతా విధుల్లోనే గడుస్తోంది. ఇంటికి చేరుకున్న తర్వాతే టెట్ పుస్తకాలు చేతిలోకి తీసుకుంటున్నారు. కొందరు తెల్లవారుజామునే లేచి చదువుతుంటే, మరికొందరు అర్ధరాత్రి వరకు మాక్ టెస్టులు రాస్తూ సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులకు సూచనలు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తారు. హాల్టికెట్లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా గుర్తింపు కార్డును పరిశీలించి రెండు ఫొటోలు, డిక్లరేషన్ తీసుకుని పరీక్షకు అనుమతిస్తారు. స్క్రైబ్స్ జాబితాలో ఉన్న దివ్యాంగ అభ్యర్థులకు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన విద్యార్థులను మాత్రమే స్క్రైబ్స్గా కేటాయించాలి. వీహెచ్, ఓహెచ్ (రెండు చేతులు లేనివారు) అభ్యర్థులకు 50 నిముషాల అదనపు సమయం కేటాయిస్తారు. అభ్యర్థులతో పాటు ప్రభుత్వ టీచర్లకూ తప్పనిసరి పరీక్ష ఈ నెల 5 నుంచి 16 వరకు పరీక్షల నిర్వహణ జిల్లాలో 3 సెంటర్లలో పరీక్షలు హాజరుకానున్న 2,324 మంది అభ్యర్థులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాయదుర్గం రూరల్: మండల పరిధిలోని 74 ఉడేగోళం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిదురు బొమ్మయ్య కుమారుడు బి.ఓబయ్య (38) మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు ఓబయ్య గ్రామంలో నుంచి సబ్స్టేషన్ వెనుక భాగాన ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనం బయలుదేరాడు. అయితే హైవేపై రోడ్డు దాటుతుండగా రాయదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 39జడ్ 0704) ఢీ కొంది. స్థానికులు రాయదుర్గం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఓబయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడన్నారు. మృతుడికి భార్య సూరమ్మ, 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్లొస్తానని చెప్పి , తిరిగరాని లోకాలకు వెళ్లావా అంటూ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రూరల్ సీఐ వెంకటరమణ, అర్బన్ ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేను దుర్మార్గుడినే ● ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదలను ● జేసీ ప్రభాకర్రెడ్డి బరితెగింపు తాడిపత్రిటౌన్: నేను దుర్మార్గుడినే..దుష్టుడినే ఏమన్నా అనుకోండి.. ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదు అంటూ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, లీగల్సెల్ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాగే తాడిపత్రి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన 24 మంది పేర్లు చదువుతూ వారిలో ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేతిరెడ్డికి నాకు మాత్రమే ఫైట్ అని, ఇది టీడీపీ, వైఎస్సార్సీపీ సమస్య కాదన్నారు. వైఎస్సార్సీపీలోని ఆ 24 మంది వచ్చే స్థానిక ఎన్నికల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఈనెల 6న తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట 24 మంది వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. మహిళపై అత్యాచారయత్నం యల్లనూరు: మండల పరిధిలోని జంగంపల్లిలో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. ఏఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాలమేరకు... ఏఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. జంగంపల్లికి చెందిన సురేష్ భార్య లింగుట్ల జ్యోతి శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి కాంపౌండులో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన తాయన్న ... జ్యోతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో తాయన్న పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాయన్నపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలి. లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఆదివారం కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి , జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒకవైపు చెబుతూనే... మరోవైపు వెన్నుపోటు పొడుస్తోందని మండి పడ్డారు. ఇటీవల జరిగిన మంత్రుల చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదన్నారు. పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు 29 శాతం మధ్యంతర భృతి, పెండింగ్లో ఉన్న 5 డీఏల చెల్లింపు, సంపాదిత సెలవుల మంజూరు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత ఏడాది బదిలీ అయిన కొందరు ఉపాధ్యాయులు రిలీవర్లు లేక పాతస్థానాల్లోనే కొనసాగుతున్నారని చెప్పారు. 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును ఇవ్వాలన్నారు. కేంద్రంతో చర్చించి విద్యాహక్కు చట్టం 23 (1)కి సవరణ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, సహాధ్యక్షుడు బాబు, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లు తాహిర్వళి, మహంతేశ్వర్, జిల్లా కార్యదర్శులు అమర్ నారాయణరెడ్డి, నరసింహప్ప, మురళీ, మల్లిఖార్జున, రవివర్ధన్రెడ్డి, చెన్నకేశవులు, బాబు, జిల్లా పూర్వపు కార్యదర్శి సుధాకర్, యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, నారాయణస్వామి, భాస్కరయ్య, పాలయ్య, తదితరులు పాల్గొన్నారు. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు యూటీఎఫ్ నాయకుల హెచ్చరిక -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: పుట్టపర్తి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పుర్రె లభ్యం
లేపాక్షి: మండలంలోని నాగేపల్లి సమీపంలోని నీటి వంకలో ఆదివారం పురుషుని పుర్రె లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థఽలానికి చేరుకుని పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన పుర్రెను ఫోరెనిక్స్ పరీక్షల కోసం పంపించామని, డీఎన్ఏలో వచ్చిన ఆధారాల బట్టి అది ఎవరిదనే విషయం తెలుస్తుందని ఎస్ఐ పేర్కొన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ రామగిరి: మండలంలోని మక్కినవారిపల్లిలో శనివారం అర్ధరాత్రి అశ్వర్థమ్మ అనే మహిళ మెడలోని నగలను దొంగలు అపహరించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలో అశ్వర్థమ్మ బహిర్బూమికి వెళ్లింది. ఈ సమయంలోనే దుండగులు ఆమె మెడలోని తాళిబొట్టు చైన్ను లాక్కెళ్లారు. చైన్ సుమారు మూడు తులాల ఉంటుందని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి పెనుకొండ రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ సమీపం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసుల వివరాల మేరకు... తిమ్మాపురం గ్రామానికి చెందిన నడిపి వెంకటేష్ (50) మేకలు మేపుకొంటు జీవనం సాగించేవాడు. ఆదివారం తెల్లవారుజామున మేక పిల్లల మేత కోసం రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా తిమ్మాపురం క్రాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికిభార్య లక్ష్మిదేవి, కుమారులు మురళి, నరసింహమూర్తి ఉన్నారు. పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికపుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతిమదనపల్లె టౌన్: బి.కొత్తకోట మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు.. తలుపుల మండలం సిద్ధ గురుపల్లికి చెందిన వీరాంజనేయులు (33) బి.కొత్తకోటలో భార్య మల్లీశ్వరితో కలిసి కాపురం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పాల డైరీలో పనిచేస్తున్న వీరాంజనేయులు శనివారం రాత్రి పీటీఎం రోడ్డులో బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బి. కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దబ్బర అశోక్ (30) అనంతపురంలోని హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు కమీషన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి నగ్నంగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఆస్పత్రి వారు తెలిపారు. ఆ రాత్రి ఏం జరిగింది..? అశోక్ను ఆస్పత్రికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఓ వివాహిత భర్త, మరో రౌడీషీటర్ కలిసి ఆస్పత్రిలోనే ఓ గదిలో బంధించి.. బట్టలూడదీసి చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. నేరుగా చంపకుండా.. భవనంపై నుంచి దూకి చనిపోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. అయితే అశోక్ భవనంపై నుంచి దూకినా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణభయంతో పైకిలేచి నడుస్తూ రాగా.. క్షణాల్లో కొందరు వచ్చి ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు ఆస్పత్రిలో ఆ యువకుడి ఊపిరి తీసేశారని తెలిసింది. మృతి చెందిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి బంధువులు వచ్చి ఆందోళన చేసి, డయల్ 100కు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి వీపుపై వాతలు, బలమైన దెబ్బలు ఉండటం కనిపించింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ప్రేమాయణమా.. అప్పుల వారి పనా..? యువకుడి మృతికి ప్రేమాయణం.. లేదా అప్పులే కారణమై ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అశోక్ ఓ వివాహితతో వాట్సాప్ చాటింగ్ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రేమకు దారి తీసి ఉండవచ్చని, విషయం తెలిసిన తర్వాత అతడి అడ్డు తొలగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అప్పులు కూడా చేశాడని, వసూలు చేసే క్రమంలో ఇలా చావబాది.. ఊపిరి తీసేశారా అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నిందితులను కాపాడేందుకు ఒత్తిళ్లు.. ఈ కేసులోని నిందితుల్లో హాస్పిటల్కు చెందిన ప్రముఖుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు, శింగనమల నియోజకవర్గంలోని ప్రముఖ వ్యక్తికి సదరు వ్యక్తి బంధువు. దీంతో అతన్ని కాపాడేందు కోసం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది. త్వరలోనే అన్నీ తెలుస్తాయి హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడో అంతస్తు నుంచి అశోక్ అనే యువకుడు దూకి.. చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికే కీలకం. ఒత్తిళ్లకు తలొగ్గం. నిబంధనల ప్రకారమే కేసు దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. – కౌలుట్లయ్య, సీఐ, త్రీటౌన్ పోలీసుస్టేషన్, అనంతపురం హిత హాస్పిటల్లో యువకుడి మృతిపై అనుమానాలు -
అక్రమాలకు ‘ఆదర్శం’
నల్లచెరువు: మండల పరిధిలోని దేవిరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాలకు పీఎంశ్రీ నిధులు, టైప్–4 నిధులు రూ.20 లక్షలకుపైగా మంజూరయ్యాయి. నిబంధనల మేరకు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను పేరెంట్స్ టీచర్స్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు కమిటీ ఆమోదం లేకుండానే పాఠశాలలోని కొందరి సాయంతో పనులు పూర్తి చేశారు. ఆదర్శ పాఠశాలలో పీఎం శ్రీ నిధులతో మరుగు దొడ్లు, నీటి కొళాయిలు, ఇతరాత్ర చిన్నచిన్న మరమ్మతులు చేయించాలి. కానీ అలాంటి పనులు చేయలేదు. పీఎం శ్రీ నిధులు రూ. 4.75 లక్షలతో దేవిరెడ్డిపల్లిలోని ఆదర్శ పాఠశాలకు ఆట మైదానం, రూ. 70 వేలతో ర్యాంపు నిర్మాణం, రూ.లక్షతో పాఠశాల ఆవరణలో ఇంకుడుగుంత పనులు చేశారు. ఇందులో పాఠశాల ర్యాంపు మినహాయిస్తే ఇంకుడు గుంత, మైదానం పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులే చెబుతున్నారు. ఈ పనులకు రూ.2 లక్షలు కూడా ఎక్కువే అంటున్నారు. ఆదర్శపాఠశాలకు పీఎం శ్రీ నిధులు టైప్–4 కింద రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలలో ల్యాబ్కు సంబంధించిన పనులు, స్మార్ట్ క్లాస్ రూములు, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సోలార్ ప్యానల్, వర్షపు నీటి సంరక్షణ పనులు చేయాల్సి ఉంది. అయితే పాఠశాలలో ఈ పనులు చేసిన ఆనవాళ్లే కనిపించడం లేదు. పాఠశాలకు భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసినా... పాఠశాలలో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మైదానం మొత్తం రాళ్లతో నిండిపోయింది, పాఠశాలలో ఎటు చూసినా పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్నాయి. మరుగునీరు పాఠశాల ముందే పారతుండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన కొడుతోంది. వంట గది కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆరుబయటే వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఇలాంటి అత్యవసర పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంది. కానీ వాటిని పక్కన పెట్టి రికార్డుల్లో మాత్రం పనులు చేసినట్లు చూపి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో చేసిన పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేవిరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాలకు మంజూరైన నిధులు స్వాహా తూతూ మంత్రంగా పనులు చేసి నిధులు మింగేసిన టీడీపీ నాయకులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడి సమస్యలు అక్కడే.. నాసిరకంగా పనులు.. టైప్–4 నిధులూ స్వాహా.. -
భూసేకరణ వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, పారిశ్రామిక పార్కుల ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ఆయా డివిజన్లలో చేపట్టిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పారిశ్రామిక వాడల ఫీజుబులిటీ నివేదికల వివరాలను ఆయా డివిజన్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాల్లో భూలభ్యతపై నివేదికలను అందజేయాలన్నారు. పారిశ్రామికాభివృద్ధికి భూకేటాయింపు ఎంతో కీలకమైన అంశమన్నారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ పరిహారాన్ని త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు సూచించారు. కోర్టు పరిధిలో లేని భూముల చెల్లింపుల ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించాలి.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి పీఎం–రహత్ పథకం ద్వారా తక్షణం నగదు రహిత అత్యవసర వైద్య చికిత్స అందేలా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబ్బు కారణంగా ఏ ప్రమాద బాధితుడూ చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే పీఎం–రహత్ పథకం అమలు చేస్తున్నారన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రిలో చేరిన బాధితుడికి ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత సేవలు అందిస్తారన్నారు. అర్హులకు చికిత్స అందించేందుకు నిరాకరించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ దేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, డీపీఎంఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


