Sri Sathya Sai District Latest News
-
మార్పుతోనే కుటుంబాలు బాగుపడతాయి
హిందూపురం: మార్పుతోనే కుటుంబాలు బాగుపడతాయని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. వంటగది, శుద్ధ జలప్లాంట్, బ్యారక్లు, పరిసరాలు, నిత్యావసరాలు, ఫిర్యాదుల పెట్టె తదితరాలను పరిశీలించారు. ఖైదీల పట్ల తీసుకున్న జాగ్రత్తలను సబ్జైలు అధికారి హనుమప్పతో అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రిమాండ్ ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. ఏ తప్పు చేసి జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి జైలులో ఉంటున్నారు. కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా? లేదా? బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేకపోవడం వల్ల ఎవరైనా ఇంకా జైలులోనే ఉంటున్నారా? అనే వివరాలను ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పునకు జైలులో శిక్ష అనుభవిస్తున్నారని, తరచూ తప్పులు చేసి జైలుకు వెళుతుంటే కుటుంబ మర్యాదలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. చివరకు పిల్లలను కూడా సమాజంలో చిన్నచూపు చూస్తారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రశాంతయుత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది జి.శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు జి.ఆర్.సిద్దు, పార్వతి, సంతోషికుమారి, ఈశ్వరప్ప, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
నీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తిటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని శ్రీసత్యసాయి తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. స్థానిక పంప్ హౌస్ వద్ద బుధవారం కార్మికుల సమావేశం జరిగింది. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కార్మికులు చర్చించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ క్రాంతికుమార్ను కలసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ... శ్రీసత్యసాయి నీటి సరఫరా విభాగానికి సంబంధించి రూ.8 కోట్ల బకాయిలను మున్సిపాలిటీ చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపి వేశారన్నారు. ఫలితంగా పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తిందని వివరించారు. అలాగే వెంగలమ్మ చెరువు పంప్ హౌస్ నుంచి 35 ఏళ్లుగా నీటి సరఫరా అగిపోయిందన్నారు. దీంతో కార్మికులకు చెల్లించాల్సిన నాలుగు నెలల వేతనాలు బకాయి పడ్డాయన్నారు.10నెలల పీఎఫ్ చెల్లించనందున కార్మికులు ఇబ్బందులు పడ్డారన్నారు. మున్సిపాలిటీ బకాయిలు చెల్లించక పోవడం వల్లనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించి, కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘం అధ్యక్షుడు నరేష్, నాయకులు మధునూదన్, బాలు, శివప్రసాద్, లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపు నొప్పి తాళలేక ఒకరు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వలస కార్మికుడితో పాటు మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ●● నల్లచెరువు: స్థానిక వీవర్స్ కానీకి చెందిన సుధాకర్(45) ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని దిగువపల్లికి చెందిన సుధాకర్ తన భార్య అనితతో కలసి వీవర్స్ కాలనీలో ఆరేళ్లుగా నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా హిందూపురం ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా కడుపు, వెన్ను నొప్పి కారణంగా మెడికల్ లీవ్ కింద ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరు కుమార్తెలతో కలసి భార్య అనిత తన పుట్టింటికి వెళ్లింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధాకర్ పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మక్బూల్ బాషా తెలిపారు. ● ధర్మవరం రూరల్: మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన రైతు జ్వాల లక్ష్మీరెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో బంధువుల ఇళ్లలో కుటుంబసభ్యులు ఆరా తీశారు. పొలం వద్దకెళ్లి పరిశీలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం తన పొలానికి సమీపంలో ఉన్న వంకలో కంప చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీరెడ్డిని గొర్రెల కాపరులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఉరికి వేలాడుతున్న లక్ష్మీరెడ్డి మృతదేహాన్ని గమనించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ధర్మవరం రూరల్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, లక్ష్మీరెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సిఉంది. ● ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామ పొలాల్లో బుధవారం మహారాష్ట్రకు చెందిన గణపత్ భానుదాస్ (41) ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని సుధాఘడ్ రాణిఘర్కు చెందిన భానుదాస్.. భార్యతో కలిసి వలస వచ్చి వెంకటతిమ్మాపురంలో స్థిరపడ్డాడు. కట్టెలు కాల్చి బొగ్గుల వ్యాపారం చేస్తుండేవారు. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో భార్య అలిగి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భానుదాస్ బుధవారం తాను నివాసముంటున్న గుడిసెలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పారిశ్రామిక వాడలో విద్యుత్ సమస్య
కదిరి అర్బన్: అధికారంలోకి వస్తే పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తామన్న కూటమి పెద్దలు.. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రగతి మాటను పక్కనపెట్టి ఉన్న పరిశ్రమలూ మూత పడేందుకు కారణమవుతోంది. ఇందుకు కదిరిలోని పారిశ్రామిక వాడనే నిదర్శనం. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పారిశ్రామిక వాడలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంటోంది. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా కన్నెత్తి కూడా చూడడంలేదు. దీంతో ఉన్న పరిశ్రమలు కాస్త మూతేసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. రోజూ 15 సార్లు అంతరాయం.. కదిరి పట్టణానికి ఆనుకుని ఉన్న కుమ్మరవాండ్లపల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల 25 పరిశ్రమలను ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. కవర్ల తయారీ, వేరుశనగ ప్రాసెసింగ్, బీరువాల తయారీ, సోఫాలు.. కుర్చీల తయారీ, బిందెల తయారీ, పట్టు పరిశ్రమ, ట్రాన్స్ఫార్మర్ల రిపేరు తదితర పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దాదాపు నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో తీరని అంతరాయంతో పరిశ్రమల నిర్వహణ భారమవుతోందని యజమానులు వాపోతున్నారు. రోజులో 15 సార్లు కరెంటు వచ్చి పోతోందని పేర్కొంటున్నారు. ఒక్కొసారి 5 నుంచి 10 నిమిషాల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటోందని, దీంతో యంత్రాలను ఆపడం ద్వారా ఉత్పత్తి గణనీయంగా తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని వచ్చిన తర్వాత యంత్రాలను ఆన్ చేయబోతుండగా వెంటనే సరఫరా నిలిచిపోతుంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాలు మరమ్మతుకు లోనై ఆర్థిక భారం మరింత పెరిగి పోతోందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. ప్రతి నెలా రూ.లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నా.. నాణ్యమైన విదు్య్త్ను ప్రభుత్వం అందించలేకపోతోందని ఆరోపిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యుత్ సరఫరాలో అంతరాయం రోజూ రూ.వేలలో నష్టపోతున్నామంటున్న పరిశ్రమల నిర్వాహకులు -
రోజూ రూ. 2 వేలు నష్టం
నేను నిర్వహిస్తున్న వాటర్ ప్యాకెట్ తయారీ పరిశ్రమలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రూ.2 వేలకు పైగా నష్టం వస్తోంది. సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పనిలోకి వచ్చే కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోంది. ఇది పరోక్షంగా కార్మిక కుటుంబాల జీవనంపై ప్రభావం చూపుతోంది. – నాగార్జునరెడ్డి, నీటి కవర్ల తయారీ కంపెనీ యజమాని -
ఈ పనులకు మోక్షమెన్నడో!
రామగిరి: దశాబ్దాలుగా నీటిబొట్టులేక బోసిపోయిన పేరూరు డ్యాం (అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్).. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తి జలకళను సంతరించుకుంది. ఐదేళ్ల పాటు ఆయకట్టు మురిసిపోయింది. చుట్టుపక్కల భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో వ్యవసాయ బోరు బావుల కింద వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేరూరు డ్యాం పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. నీటి కేటాయింపులు లేక డ్యాం బోసిపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్యామ్ గేట్ల మరమ్మతులకు రూ.1.21 కోట్లను మంజూరు చేసిన కూటమి సర్కార్... పనులు పూర్తి చేయించడంలో అంతులేని ఉదాసీనత కనబరుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేరూరు డ్యాంను సందర్శించి గేట్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నాలుగు నెలలు గడిచినా పనుల్లో ఏ మాత్రమూ ప్రగతి లేదు. వేసవి ముగిసింది. వర్షాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే పేరూరు డ్యాం పూర్తిగా నిండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో డ్యామ్కు గేట్లు లేకపోవడంతో ఆ నీరంతా వృథా అవుతుందని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉద్యోగులకు జీతాలూ లేవ్
ఉరవకొండ: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డలను క్షేమంగా వారి ఇంటికి చేర్చడానికి తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఆ వాహనాల డ్రైవర్లు ఎంతో భద్రంగా తల్లీబిడ్డలను తీసుకెళతారు. అలాగే రక్తహీనతతో బాధపడే గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావడం, రక్తం ఎక్కించిన తరువాత ఇంటి దగ్గర దింపే అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇంతలా సేవ చేస్తున్నా వారిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత మూడు నెలలుగా జీతాలివ్వలేదు. దీంతో వారందరూ కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 24 ఉన్నాయి. మొత్తం 32 మంది డ్రైవర్లు పనిచేస్తుండగా వీరికి గత టీడీపీ హయాంలో నెలకు రూ.7,200 చొప్పున వేతనం చెల్లించేవారు. వీరి సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 8,800కు పెంచారు. అయితే, కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. -
హామీలు సరే.. అమలేదీ?
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హామీల అమలును విస్మరిస్తూనే ఉంటారు. నాడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఇప్పుడు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి.. కొందరికే పరిమితం చేశారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని చెప్పినా అతీగతీ లేదు. ఇంటివద్దకే రేషన్ పంపిణీ రద్దు చేసి మళ్లీ పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చారు. – కవిత, ప్రశాంతి గ్రామ్, పుట్టపర్తి -
ఖరీఫ్ పెట్టుబడికి పాట్లు
మడకశిర: జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పదునైన వర్షం పడుతుండడంతో ఖరీఫ్ – 2025 సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం రూ.13,500 ఠంచన్గా అందడంతో సకాలంలో పంటలు సాగు చేసుకునేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామన్న ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయంపై ఇంతవరకూ స్పష్టత లేదు. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పంటలు పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పంటలు 2,69,152 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం.. ఖరీఫ్లో వ్యవసాయం చేయడానికి రైతులకు పెట్టుబడి చాలా ముఖ్యం. ప్రధానంగా భూములను దుక్కి దున్ను కోవడం నుంచి విత్తు వరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా వేరుశనగ సాగు చేసే భూములను దుక్కి చేసుకోవడానికి ట్రాక్టర్కు గంటకు అద్దె రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. విత్తనాలు, ,క్రిమి సంహారక మందుల కొనుగోలుకు కూడా డబ్బు అవసరం. కూలీల ఖర్చులు రూ.వేలల్లోనే ఉంటాయి. ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేయడానికి రైతులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్–2025 పంటల సాగు అంచనా.. మొత్తం సాగు అంచనా: 2,69,152 హెక్టార్లు వేరుశనగ: 1,51,824 హెక్టార్లు కంది: 28,925 హెక్టార్లు మొక్కజొన్న: 17,949 హెక్టార్లు అమలుకు నోచుకోని అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలో ఠంచన్గా పెట్టుబడి సాయం నేడు పంటలు పెట్టేందుకు డబ్బు లేక రైతుల అగచాట్లు -
పెరిగిన శ్రీవారి ఆలయ ఆదాయం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు హుండీలో వేసిన కానుకలను బుధవారం ఆలయ, బ్యాంకు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో లెక్కించారు. 62 రోజులుకు గాను రూ.1,10,69,573 నగదుతో పాటు 72 గ్రాముల బంగారు, 662 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆలయ ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ చలపతి, ఆలయాధికారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీఫార్మసీ ఫలితాలు విడుదల అనంతపురం: బీఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్ ధర్మవరం రూరల్: బాలుడి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన నరసింహులు, సుమలత దంపతుల కుమారుడు శ్రీనాగచైతన్య అనే చిన్నారి మార్చి 24న ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండాపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ నెల పదో తేదీన నాగచైతన్య ఇంటికి తిరిగి వచ్చాడు. మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు లోతుగా విచారణ చేపడితే విస్తుపోయే విషయం వెలుగుచూసింది. బాలుడిని కిడ్నాప్ చేసింది మేనమామ ప్రశాంత్, అతని మామ వెంకటరాముడు అని తేలింది. ఈ రెండు కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సుమలత చిన్నకుమారుడైన నాగచైతన్యను ప్రశాంత్, వెంకటరాముడు దాచిపెట్టారని విచారణలో బయటపడింది. దీంతో డీఎస్పీ హేమంత్కుమార్ ఆదేశాల మేరకు సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో వెళ్లి నిందితులిద్దరినీ బుధవారం అరెస్టు చేసి, రిమాండ్కు పంపించారు. 230 పోయి 19 పోస్టులు మిగిలాయి అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లకు తీరని అన్యాయం చేశారంటూ టీచర్లు వాపోయారు. 117 జీఓ ఆధారంగా వచ్చిన 230 ఇంగ్లిష్ పదోన్నతుల పోస్టులు ఇప్పుడు కేవలం 19 మాత్రమే మిగులుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో నిరసన తెలియజేశారు. విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఈఓ చాంబరును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెంరేళ్లు సర్వీస్ కోల్పోయి నష్టపోయామని, 27 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే రిటైర్డ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఓఈ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు జి.సూర్యుడు, రామాంజినేయులు, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, జయరాం నాయక్, గోపాల్ రెడ్డి, శంకరమూర్తి, కేశవరెడ్డి, ఓబులేసు, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, విజయ శ్రీ, నరసింహులు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, రసూల్ పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిలర్ గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్ మద్దతు తెలిపారు. -
యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
పుట్టపర్తి టౌన్: యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని కలెక్టర్ చేతన్, ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పుట్టపర్తిలో విద్యాగిరి రోడ్డుపై పర్యాటక యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులతో పాటు పట్టణ ప్రజలు దాదాపు రెండు వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకొందని అందులో భాగంగా జిల్లాలో రెండు చోట్ల యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా సాధన చేస్తే వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాల్లో మరింత నైపుణ్యత సాధిస్తారని తెలిపారు. చిన్న వయసు నుంచే యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం యోగా గురువును సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్, ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్, డ్వామా పీడీ విజయానంద్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి నిర్మలాజ్యోతి, మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు -
ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తచెరువు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామానికి చెందిన నరసింహులు (62)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వ్యక్తిగత పనిపై మంగళవారం కొత్తచెరువుకు వెళ్లిన ఆయన సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు నరసింహులు గతంలో లోచర్ల సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భర్త అదృశ్యంపై ఫిర్యాదు బెళుగుప్ప: మండల పరిధిలోని శీర్పి గ్రామానికి చెందిన తన భర్త మంగలి మహేష్ ఈనెల 20 నుంచి కనిపించడం లేదని భార్య రూప బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రాప్లోన్ రెన్యూవల్ కోసం కళ్యాణదుర్గం వెళ్లిన మహేష్.. తిరిగి ఇంటికి రాలేదు. చుట్టు ప్రక్కల గ్రామాలు, బంధువులను విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బాల నరసింహులు కేసు నమోదు చేశారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాలలోని ఆరు విభాగాలకు ఎన్బీఏ (నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు దక్కింది. సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్సెస్ విభాగాలకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. అక్రిడిటేషన్ రావడానికి తోడ్పాటు అందించిన విభాగాధిపతులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్బీఏ గుర్తింపు గల కళాశాల జారీ చేసే సర్టిఫికెట్కు విలువ అధికంగా ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ నిదర్శనంగా నిలుస్తుంది. -
ప్రియుడి వ్యసనాలు నచ్చక యువతి ఆత్మహత్య
అగళి: చెడు వ్యసనాలు మానాలని చెప్పినా ప్రియుడు వినకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామానికి చెందిన రాజన్న కుమారుడు పునీత్, అగళికి చెందిన దళిత సన్న భూతన్న, కారియమ్మ దంపతుల మూడో కుమార్తె రక్షిత (22) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. ఆగస్టులో ఇద్దరికీ పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిశ్చయించారు. ఈ క్రమంలో పునీత్ రోజూ రక్షితకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. మాటల్లో పునీత్ వ్యసన పరుడని రక్షిత గుర్తించింది. ఆయనకు తాగుడు అలవాటుతో పాటు ఇతర దురలవాట్లూ ఉన్నాయని తెలుసుకున్న ఆమె వాటిని మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా పునీత్లో మార్పు రాలేదు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పకోలేక తనలో తాను కుమిలిపోతూ వచ్చింది. రేపు పెళ్లి తర్వాత ఇంటి అల్లుడు వ్యసనపరుడని తెలిస్తే పుట్టింటి వారి గౌరవానికి భంగం కలుగుతుందని భావించిన ఆమె సోమవారం రాత్రి ఇంట్లోనే పైకప్పునకు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కాపాడి స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్ణాటకలోని శిరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనకు సంబంధించి సన్న భూతన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అగళి పీఎస్ ఎస్ఐ వీరేష్ తెలిపారు. -
15 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్/చిలమత్తూరు: తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం జిల్లాలోని 15 మండలాల పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా లేపాక్షి మండలంలో 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక అగళి 6.4 మి.మీ, గోరంట్ల 6.2, గుడిబండ 6, పరిగి 4.2, హిందూపరం 3.4, సీకేపల్లి 2.8, మడకశిర 2.6, రొళ్ల 2.4, అమడగూరు 2.4, బుక్కపట్నం 1.8, తనకల్లు 1.8, ముదిగుబ్బ 1.4, సోమందేపల్లి 1.4, రొద్దం మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు. జిల్లాకు వర్షసూచన.. రాగల ఐదు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన ఉందని వెల్లడించారు. గంటకు 16 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ సలహాలు.. ఈనెల 26న నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు వీచే అవకాశం ఉన్నందున అరటి, బొప్పాయి లాంటి వాటికి ఊతకర్రలు పెట్టుకోవాలని, రాలిన మామిడి కాయలు వెంటనే సేకరించి విక్రయించుకోవాలన్నారు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని భూసారం పెంచుకోవాలన్నారు. జీవాల్లో ఈటీ, షీప్ పాక్స్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున టీకాలు వేయించుకోవాలన్నారు. పిడుగులు పడే పరిస్థితి ఉన్నందున రైతులు, కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ప్రయాణికులపై ‘మహా’ దెబ్బ
మడకశిర: టీడీపీ మహానాడు దెబ్బ ఆర్టీసీ ప్రయాణికులపై పడింది. మంగళవారం కడపలో మహానాడు ప్రారంభం కాగా, గురువారం ముగింపు సభ జరగనుంది. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేయాలని టీడీపీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జ్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే జనాన్ని తరలించేందుకు ప్రైవేటు వాహనాలైతే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని భావించిన ‘తెలుగు తమ్ముళ్లు’ ఆర్టీసీ బస్సులపై దృష్టి సారించారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి దాదాపు సగం బస్సులను మహానాడుకు సిద్ధం చేశారు. దీంతో గురు, శుక్రవారాల్లో జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘పల్లె వెలుగు’లే ఎక్కువ.. జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకున్న టీడీపీ నేతలు అందులోనూ ఖర్చు తక్కువగా ఉంటుందని ‘పల్లె వెలుగు’లకే మొగ్గు చూపారు. మొత్తంగా జిల్లాలోని ధర్మవరం, కదిరి, హిందూపురం, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి డిపోల పరిధిలోని 167 బస్సులను మహానాడు కోసం తీసుకున్నారు. ఇందులో ధర్మవరం డిపో నుంచి 30, హిందూపురం డిపో నుంచి 30, కదిరి డిపో నుంచి 50, మడకశిర డిపో నుంచి 17, పెనుకొండ డిపో నుంచి 15, పుట్టపర్తి డిపో నుంచి 25 బస్సుల చొప్పున ఆర్టీసీ అధికారులు కేటాయించారు. ఇందులో ఎక్స్ప్రెస్ బస్సులు 48 ఉండగా, పల్లె వెలుగు బస్సులు 119 ఉన్నాయి. ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం.. ఆర్టీసీ అధికారులు బస్సులను అద్దెకు పంపినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను పంపాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం చూపారు. టీడీపీ అధికారంలో ఉండటంతో అడిగేవారే లేరన్నట్లు వ్యవహరించారు. మడకశిర డిపోలో మొత్తం 30 బస్సులుండగా, ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏకంగా 17 బస్సులను మహానాడుకు కేటాయించారు. కేవలం మిగిలిన 13 బస్సులు మాత్రమే ప్రయాణికులకు సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన డిపోల పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మహానాడు ప్రభావంతో కొన్ని బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. ఎక్కువగా పల్లె వెలుగు బస్సులను తీసుకోవడంతో రెండు రోజుల పాటు ప్రయాణికులు గమ్యస్థానాన్ని చేరడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.. మహానాడుకు అత్యధికంగా ఆర్టీసీ బస్సులనే వాడుకోవడం కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వందలాది ప్రైవేట్ బస్సులు, వాహనాలున్నా...ఆర్టీసీ బస్సులను మహానాడుకు వినియోగించుకోవడం ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడమేనని వాపోతున్నారు. అమరావతిలో ఇటీవల జరిగిన మోదీ సభకు కూడా ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రెండు రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ టీడీపీ నాయకులు మహానాడు పేరుతో ఆర్టీసీ బస్సులను తీసుకుని ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుండటం సర్వత్రా ఆగ్రహానికి గురిచేస్తోంది. మహానాడుకు జిల్లా నుంచి 167 ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ‘పల్లె వెలుగు’ బస్సులను పంపిన వైనం రెండు రోజులు ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు -
స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి
సాక్షి, పుట్టపర్తి కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జడలు విప్పుకుంటోంది. ఇప్పటికే కర్ణాటకలో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు అధికారులు ముందస్తు నివారణ చర్యల గురించి ప్రస్తావించకపోవడంతో మనం భద్రమేనా..అన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిహద్దు నుంచి నిత్యం రాకపోకలు.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది విద్య, ఉపాధి కోసం బెంగళూరు, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, యలహంక వెళ్లి వస్తుంటారు. కార్లు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తారు. దీంతో మనిషి నుంచి మనిషికి సులువుగా సోకే కరోనా వైరస్ ఇక్కడి ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం లేకపోలేదు. గత 2020, 2021లో కరోనా వైరస్ చేసిన మరణ మృదంగం తలుచుకుంటే ప్రజలకు నిద్ర పట్టడం లేదు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయం భయంగా గడుపుతున్నారు. జిల్లా వాసుల్లో టెన్షన్.. కరోనా వంటి ప్రమాదకర వైరస్ సమీపంలోని బెంగళూరు వరకు వచ్చిందనే విషయం తెలియగానే.. జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, పుట్టపర్తి ప్రాంతాల్లో టెన్షన్ మొదలైంది. పొరుగు రాష్ట్రంలో వైరస్ తొంగి చూడటంతో ఇక్కడి జనం ఉలిక్కిపడ్డారు. జిల్లా నుంచి రైళ్లు, బస్సులు, కార్లలో రోజూ వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి రోజూ సగటున వంద వరకు కార్లు విదేశీయులతో బెంగళూరు విమానాశ్రయం వెళ్తుంటాయి. ఈ క్రమంలో విమానాల్లో వచ్చిన వారి నుంచి వైరస్ సంక్రమిస్తుందన్న భయం అందరినీ వెంటాడుతోంది. పెరిగిన డిమాండ్.. కొత్తగా వైరస్ కేసులు పక్కనే ఉన్న బెంగళూరులో తేలడంతో మాస్క్లు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. ఎవరికి వారుగా ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో పాటు జ్వరం, జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్లు ధరించి బయటికి వస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ముందు తరహాలో అనుమతించడం లేదు. రెండు మూడు రోజుల్లోనే పుట్టపర్తిలో మార్పు వచ్చింది. గతంలో కరోనా వైరస్ విజృంభించిన తీరు గురించి పదే పదే చర్చించడం మొదలుపెట్టారు. ముందస్తు చర్యలు తీసుకోని ప్రభుత్వం.. కరోనా వంటి ప్రమాదకర వైరస్లు ప్రబలిన సమయంలో గతంలో వైఎస్సార్ సీపీ సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రజారోగ్యమే పరమావధిగా కఠినంగా వ్యవహరించింది. పాజిటివ్ కేసుల గుర్తింపు మొదలు క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స అవసరమైన వారికి ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయడం, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆహారం సరఫరా, కూరగాయల పంపిణీతో పాటు అత్యవసర సమయాల్లోనూ వలంటీర్ల ద్వారా ప్రతి నెలా పింఛన్ అందజేయడం వంటి సహాయక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలపై కూడా ఆంక్షలు విధించి జిల్లా వాసులను కాపాడింది. అయితే ప్రస్తుత కూటమి సర్కారు అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. కనీసం కరోనా టెస్టులు చేసేందుకు అవసరమైన కిట్లు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో చిన్న జ్వరం వచ్చిన వారు కూడా హడలిపోతున్నారు. పైగా ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీని కూడా రద్దు చేసింది. దీంతో ప్రజల్లో వైరస్ల భయం రెట్టింపయ్యింది. ప్రభుత్వం నుంచి భరోసా అనుమానమే అన్న భయం వెంటాడుతోంది. పుట్టపర్తికి చెందిన శ్రీనివాసులు ఉపాధి నిమిత్తం రోజూ రైలులో సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరుకు వెళ్లివచ్చేవాడు. అక్కడ కరోనా కేసులు నమోదుకావడంతో స్థానికంగానే పనులు చేసుకుంటున్నాడు. బెంగళూరుకు వెళ్తే కూలి ఎక్కువ వస్తుంది కదా అని ప్రశ్నిస్తే... ఆ డబ్బులొద్దు... ఆ జబ్బు వద్దంటున్నాడు. హిందూపురానికి చెందిన ప్రకాష్ స్థానికంగా గిఫ్ట్ అండ్ నావల్టీస్ దుకాణం నడుపుతున్నాడు. ప్రతి చిన్న పనికీ సమీపంలో ఉన్న బెంగళూరుకు వెళ్లేవాడు. కానీ ఇప్పుడు ఈ ఊరి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు. ఇటీవల అక్కడ కరోనా కేసులు బయటపడటంతో ఏదైనా కావాలంటే అనంతపురం వెళ్తున్నాడు. ..ఇలా వివిధ పనుల నిమిత్తం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగించే జిల్లా వాసులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కానీ బెంగళూరు నుంచి వచ్చేవారు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. దీంతో జిల్లా వాసులు హైరానా పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా...మనం భయపడాల్సిన పనిలేదు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జనావాస ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలి. మాస్కు లేకుంటే ఆస్పత్రుల్లో ప్రవేశం నిషిద్ధం. గతంలో కరోనా వైరస్ సమయంలో పాటించిన జాగ్రత్తలను తిరిగి కొనసాగించండి. వైరస్ సోకక ముందే అప్రమత్తంగా ఉండటం మంచిది. అయితే వైరస్తో ఏమీ కాదనే నిర్లక్ష్యం వద్దు. – డాక్టర్ ఫిరోజాబేగం, డీఎంహెచ్ఓ -
చౌకధరల దుకాణాల వద్దే రేషన్ పంపిణీ
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రశాంతి నిలయం: జూన్ నెలకు సంబంధించన రేషన్ సరుకులను చౌకధరల దుకాణాల వద్దే పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డుదారులు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల వద్ద రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. డీలర్లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరుకుల అందించాలన్నారు. ధరల్లో, తూకాల్లో తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించాలన్నారు. రేషన్ సరుకులు పంణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా ఆయా మండలాల తహసీల్దార్లు, సీఎస్డీటీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. రేపటి నుంచి రైతుల వద్దకే శాస్త్రవేత్తలుబుక్కరాయసముద్రం: ‘వికసిత్ కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాల నుంచి భూమికి అనే నినాదంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 నుంచి జూన్12వ తేదీ వరకు రైతుల వద్దకే శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి తెలిపారు. రోజూ 3 గ్రామాలు చొప్పున 32 మండలాల్లోని గ్రామాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఖరీఫ్ సీజన్లో అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఎరువుల యాజమాన్య పద్దతలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, భూసార పరీక్షలు, డ్రోన్ వినియోగం, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. బాలిక బలవన్మరణం తాడిపత్రి టౌన్: స్థానిక సీపీఐ కాలనీకి చెందిన రజని (16) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కాలనీకి చెందిన చాకలి పుల్లయ్య, రాజేశ్వరి దంపతుల కుమార్తె రజని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 500 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఫలితాలు అందిన రోజున తల్లిదండ్రులు విజయవాడలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివిస్తామని చెప్పడంతో సంతోష పడింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మూడు రోజుల క్రితం తాడిపత్రిలోనే చదువుకోవాలని తల్లిదండ్రులు సూచించారు. దీంతో క్షణికావేశానికి లోనైన బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. బలవంతపు పెళ్లిపై ఫిర్యాదు గుమ్మఘట్ట: తనకు ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు బలవంతంగా పెళ్లి చేశారంటూ పోలీసులకు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. వివరాలు.. రాయదుర్గం పట్టణానికి చెందిన వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయిని గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే మైనారిటీ తీరని రెండో అమ్మాయిని కూడా నెల రోజుల క్రితం పూలకుంట గ్రామానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే అప్పటికే అతనికి వివాహమై ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఈ పెళ్లి ఇష్టం లేని బాలిక స్థానికుల సహకారంతో తప్పించుకుని నేరుగా ఎస్పీని ఆశ్రయించింది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారని వాపోయింది. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో యువకుడి మృతి బెళుగుప్ప: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన ఆవుల హనుమంతరాయుడు (34)కు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రహదారి పక్కనే ఉన్న గోడను ఢీకొని సమీపంలోని గుంతలోకి దూసుకెళ్లాడు. ఘటనలో తలకు, చాతీకి బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న హనుమంతరాయుడిని స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ తెలిపారు. -
పుట్టపర్తిలో దాహం కేకలు
పుట్టపర్తి టౌన్: అధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన పుట్టపర్తిలో దాహం కేకలు మిన్నంటాయి. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైనా..చాలా వార్డుల్లో తాగునీటికి జనం అల్లాడిపోతున్నారు. తాజాగా మంగళవారం 5 వార్డు కుమ్మరిపేట మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నాలుగురోజులుగా తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే పల్లె సింధూరారెడ్డికి వ్యతిరేకంగా ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ...నాలుగు రోజులుగా బోరు మోటర్ మరమ్మతుకు గురైందని, దీంతో తమకు తాగునీటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. నాలుగురోజులుగా అధికారులకు, ఎమ్మెల్యే కార్యాలయానికి సమస్య చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా గతంలోనూ తమకు ఇష్టమొచ్చినప్పుడు నీరు వదిలేవారని, దీంతో కూలి చేసుకునే తాము పనులు మానుకుని నీటికోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని, లేకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళల ఆందోళన గురించి స్థానిక కౌన్సిలర్ సూర్యాగౌడ్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా... ఆయన స్పందించి త్వరగా మోటర్ మరమ్మతు చేయించి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు ఎమ్మెల్యే సింధూరారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు -
జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి
పుట్టపర్తి టౌన్: ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ చేతన్ సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి గణేష్ కూడలిలోని మైనార్టీ షాదీ మహల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు. స్వయంగా ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. యోగా చేసే వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారని, యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లే ప్రభుత్వం కూడా యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21 వరకు జిల్లాలో యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 18, 19 తేదీల్లో యోగాసన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్తో పాటు యోగా గురువులు పాల్గొన్నారు. యోగాతోనే ఒత్తిడి జయించడం సాధ్యం: కలెక్టర్ -
డీఈఈ సెట్ నిర్వహణకు రెండు కేంద్రాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈ సెట్)–2025కు జిల్లాలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఎం.ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 2న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరిగే పరీక్షలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా (చిన్మయానగర్, ప్రసన్నాయపల్లి పంచాయతీ), రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న ఎస్వీఐటీ కళాశాల కేంద్రాలుగా ఉంటాయన్నారు. https://apdeecet.apcfss.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. నిర్ణీత సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, హాల్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆధార్కార్డ్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
బాబు స్వార్థం.. సీమకు అన్యాయం
ఆత్మకూరు: జిల్లాలో రైతు మనుగడను కూటమి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే సీఎం చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాప్తాడు నియోజకవర్గ రైతులు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతల్లోనూ వ్యతిరేకత కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీ–నీవా ప్రాజెక్ట్ చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కాలువలో నీరు ప్రవహించే సమయంలో ఎంతో కొంత నీరు భూమిలోకి ఇంకడం ద్వారా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో జిల్లాలో ఉద్యాన పంటలు గణనీయంగా విస్తరించాయి. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకపోవడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. అనంతరం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు తగ్గిపోయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లైనింగ్ పనులను అడ్డుకున్నారు. వట్టిపోనున్న చెరువులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ హంద్రీ–నీవా ద్వారా కొత్త ప్రాజెక్టులకు కూడా నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు (కర్నూలు తాగునీటి పథకం)కు 3 టీఎంసీలు, డోన్లో లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 63 చెరువులకు నీరు ఇచ్చేందుకు 2 టీఎంసీలు, జిల్లాలోని శింగనమల చెరువుకు 1 టీఎంసీ, శింగనమల పాత తాలూకాలోని చెరువులకు 1.3 టీఎంసీలు, జీడిపల్లి, భైరవానితిప్ప, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు 3.7 టీఎంసీలు, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, సోమరాండ్లపల్లి రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు 4.5 టీఎంసీలు, శ్రీసత్యసాయి జిల్లాలోని 193 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 23 టీఎంసీలు కేటాయించడంతో పాటు 40 టీఎంసీల నీటిని రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు అందించేలా బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. కాలువకు లైనింగ్ పనులు చేయడం ద్వారా భవిష్యత్తులో నీరంతా దిగువకు వెళ్లిపోయి చెరువులన్నీ పూర్తిగా వట్టిపోయే ప్రమాదం నెలకొంది. హంద్రీ–నీవా లైనింగ్ పనులతో బీళ్లుగా మారనున్న రాయలసీమలోని 6 లక్షల ఎకరాలు కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడకే ముప్పు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమంటున్న ‘రాప్తాడు’ రైతులు పంటల సాగు కష్టం రాప్తాడు నియోజకవర్గంలో చాలా పొలాలు హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్నాయి. హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరిగి మా వ్యవసాయ బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగింది. దీంతో నాకున్న 4 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశా. ఇప్పుడేమో కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత లేక పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రైతు కష్టాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. లైనింగ్ పనులు ఆపి 83 టీఎంసీల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేయాలి. – సుబ్బర రామాంజినేయులు, సిద్ధరాంపురం, ఆత్మకూరు మండలం రైతుల పొట్ట కొట్టొద్దు హంద్రీ–నీవాలో నీటి ప్రవాహం వల్ల చాలా మంది బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువ పక్కన పొలాల్లో చీనీ, అరటి, టమాట, వరి, అంజూర, ద్రాక్ష, దానిమ్మ వంటి ఉద్యాన పంటల సాగు పెరిగింది. హంద్రీ–నీవా కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయితే బోర్లు ఎండి పోయే ప్రమాదముంది. రైతులు నష్టపోతారు. కాంక్రీట్ లైనింగ్ పనులతో రైతుల పొట్ట కొట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – వెంకటేష్, సింగంపల్లి, ఆత్మకూరు మండలం -
రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్
● ఆన్లైన్ అంటూనే భౌతికంగా సాగిన కౌన్సెలింగ్ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం మొదలైన జోనల్ స్థాయి ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం తెల్లవారుజాము సరిగ్గా 6 గంటలకు ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోనల్ స్థాయి కావడంతో ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు సూపరెండెండెంట్లు, 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు రిక్వెస్ట్ కింద ఐదుగురు సూపరెండెండెంట్లు. 32 మంది సీనియర్ అసిస్టెంట్లు, 26 మంది ఏడీఏలు, 122 మంది ఏఓలు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ విభాగాల అసోసియేషన్లకు చెందిన నాయకులు తరలిరావడంతో జాతరను తలపించింది. ఇందులోనూ ఎక్కువగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. 255 మందికి పైగా కౌన్సెలింగ్కు హాజరవుతున్నట్లు తెలిసినా కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం చేయడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రంతా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా ఉద్యోగులు జాగరణతో పడిగాపులు కాసేలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆన్లైన్ పక్రియ అంటూనే భౌతికంగా చేపట్టారు. ప్రతి విషయంలో ఒకరిద్దరు జేడీఏలు జోక్యం చేసుకోవడంతో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఏఓ స్థాయి అధికారులు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. అలాగే రిక్వెస్ట్ కింద, అసోసియేషన్ల వెసులుబాటు, కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులు అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. -
అన్యాయం జరుగుతోంది
హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులతో ఒక్క రాప్తాడు నియోజకవర్గమే కాదు... మొత్తం రాయలసీమకే అన్యాయం జరుగుతోంది. రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతాయి. భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా రిలే నిరాహార దీక్షలు రాప్తాడు నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తాం. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఉద్యమించాలి. ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు, పోలీసులకు అనుమతులు కోరాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
పీఆర్లో సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: పంచాయతీరాజ్ (పీఆర్) శాఖకు సంబంధించి అనంతపురంలోని పీఆర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి (రాయలసీమ జిల్లాలు) బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, బాలాజీ (తిరుపతి), చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఆ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బాలూనాయక్, ఎస్ఈ జహీర్ అస్లాం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్ఈ మురళి, ఇతర జిల్లాల ఎస్ఈలతో పాటు పీఆర్ఐ ఈఈ ప్రభాకరరెడ్డి, అనంతపురం సబ్ డివిజన్–1, 2 డీఈఈలు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి, సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఖాజా మొహిద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ బదిలీలనూ ఆమోదించారు. -
భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్హెచ్ –342, ఎన్హెచ్–716జీ రహదారులతో పాటు పలు జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూకేటాయింపు ప్రతిపాదనలపై వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక రూపొందించి రెవెన్యూ డివిజనల్ అధికారులకు, కలెక్టరేట్లో అందజేయాలని ఆదేశించారు. ఎన్హెచ్–342 జాతీయ రహదారికి సంబంధించి బుచ్చయ్యగారిపల్లి గ్రామస్తులకు ఇవ్వాల్సిన పరిహారం, పుట్టపర్తి మండలం అమగొండపాళ్యం రెవెన్యూ గ్రామస్తులకు ఇవ్వాలని పరిహారం పనులు పెండింగ్లో ఉన్నాయని, ఆ పనులన్నీ వెంటనే పూర్తి చేసి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్ కుమార్, శర్మ, మహేష్, ఎన్హెచ్ ఏఐ పీడీ అశోక్ కుమార్, అధికారులు మల్లికార్జునరావు, బి.నాగరాజు, గిడ్డయ్య, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సీటు రాదేమోనని.. విద్యార్థిని ఆత్మహత్య పరిగి: పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మండలంలోని కొడిగెనహళ్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలు మేరకు... కొడిగెనహళ్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న వెట్టి గోపాలప్ప కుమార్తె వెట్టి హేమావతి(15) 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆమెకు 379 మార్కులు వచ్చాయి. అయితే ఇంకా మంచి మార్కులు రావాల్సి ఉండేదని హేమావతి నిత్యం బాధపడేది. ఇంటర్లో చేరేందుకు మంచి కళాశాలలో సీటు వస్తుందో రాదోనని ఆందోళన చెందేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెబుతూ తరచూ బాధపడేది. ఈ నేపథ్యంలోనే ఇంటర్లో మంచి కళాశాలలో సీటు రాదేమోనన్న భయంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమావతి తండ్రి గోపాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడు తెలిపారు. ‘తమ్ముళ్ల’ చిల్లర వేషాలు ● వైఎస్సార్ సీపీ నేతల పేర్లతో టీడీపీ సభ్యత్వ కార్డులు ● వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వైనం చిలమత్తూరు: తెలుగు తమ్ముళ్లు చిల్లర వేషాలు వేస్తున్నారు. తమ మాట వినని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. చివరకు వైఎస్సార్ సీపీ నేతల పేర్లతో టీడీపీ సభ్యత్వ కార్డులు తయారు చేయించి వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీకి చెందిన చిలమత్తూరు– 2 ఎంపీటీసీ సభ్యురాలు సనమ్హుస్నా భర్త షాకీర్తో పాటు ఆయన తల్లి పేరుతో కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు పంపించారు. వాటిని టీడీపీ నేతలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన షాకీర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను ఎప్పుడూ టీడీపీ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయలేదని, పార్టీ మారాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. టీడీపీ నేతలు చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. తన రాజకీయ ప్రయాణం వైస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతల విష ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు. -
పోలీసులు న్యాయం చేయడం లేదు
పుట్టపర్తి టౌన్: కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నా.. పోలీసులు మాత్రం న్యాయం చేయడంలేదంటూ డీఎస్పీ విజయకుమార్ ఎదుట బాధితుడు చెన్నకేశవులు వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి, తన సమస్య వివరించారు. వివరాలు... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన చెన్నకేశవులు, విజయలక్ష్మి దంపతులకు అదే గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 51, 552, 553, 836, 837లో 8.70 ఎకరాల భూమి ఉంది. ఇందులో 550 మామిడి చెట్లతో పాటు వరి సాగు చేస్తున్నారు. 2005లో చెన్నకేశవులు అన్న రమణ మృతి చెందాడు. ఆయన పేరున ఉన్న భూమిని 2007లో చెన్నకేశవులు, విజయలక్ష్మి పేరుతో కొనుగోలు చేశారు. అయితే భూమిలో తమకూ హక్కు ఉందని అన్న కుమారుడు రెడ్డి కుమార్, బంధువులు రెడ్డెమ్మ, రెడ్డెప్పరెడ్డి అడ్డు తగలడంతో దీనిపై చెన్నకేశవులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో చెన్నకేశవులుకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దాయాదులు అడ్డుతగుతుండడంతో కోర్టు ఉత్తర్వులు నకళ్లను జతపరుస్తూ పోలీసులకు చెన్నకేశవులు ఫిర్యాదు చేశాడు. ఇందులో టీడీపీ నాయకులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఈ విషయంగా తమకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయకుమార్కు బాధితుడు చెన్నకేశవులు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన డీఎస్పీ వెంటనే కదిరి పీఎస్కు ఫోన్ చేసి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ద్వారా సమాచారమం అందిందని కలెక్టర్ చేతన్ తెలిపారు. మంగళవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవెన్యూ సిబ్బంది మందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండల కేంద్రం, డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 08555 289039 నంబర్కు సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి ప్రశాంతి నిలయం: తాము చేస్తున్న పనితో సంబంధం లేకుండా అరకొర జీతాలు చెల్లిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టీఎస్ చేతన్ను కలసి వినతి పత్రం అందజేసి, సమస్య వివరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 550 మంది తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. తమకు అరబిందో యాజమాన్యం చెల్లించే జీతం సరిపోవడం లేదన్నారు. గత 9 సంవత్సరాలుగా కేవలం రూ.8,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోగలమని ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్ల వేతనం రూ.18,500 చెల్లించాలని, పీఎఫ్ వాటాను యాజమాన్యమే భరించాలని, చట్ట ప్రకారం వారాంతపు సెలవులతో పాటు జాతీయ సెలవులనూ అమలు చేయాలని కోరారు. ఆరోగ్య బీమాతో పాటు, విధులలో మరణించిన డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా అందజేయాలన్నారు. పోక్సో కేసు నమోదు రాప్తాడు: స్థానిక పంచాయతీ పరిధిలోని ముస్లీం మైనార్టీ కాలనీకి చెందిన ఓ బాలికను వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. కొన్ని నెలలుగా తమ కుమార్తెను ప్రేమ పేరుతో కదిరి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన యువకుడు వేధిస్తున్నట్లు బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
హెర్బల్ పార్కుకు స్థల పరిశీలన
ధర్మవరం అర్బన్: పట్టణంలో హెర్బల్ పార్కు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని ఏపీ మెడిషనల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. పట్టణంలో సోమవారం గాంధీనగర్, రామ్నగర్లో ఉన్న మున్సిపల్ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ స్థలాల్లో 58 రకాల ఔషధ మొక్కలతో ప్రత్యేక హెర్బల్ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఏర్పాట్ల కోసం స్థలాలను పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, తహసీల్దార్ నటరాజ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్బాబు పాల్గొన్నారు. ‘మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలి’ ముదిగుబ్బ: ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వైపునకు వెళ్లే ఎన్హెచ్ 342 జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధర ప్రకారం ఎకరానికి రూ.8,90,000 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యాల్యుషన్ ప్రకారం ఎకరానికి రూ, 63,88,000 ఉందన్నారు. వీటి ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు తహసీల్దార్ నారాయణ స్వామికి వినతిపత్రం అందజేశారు. మాకు పరిహారం అందించే వరకు పనులను నిలిపివేయాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రైతులు సోమల ప్రకాష్నాయుడు, రమేష్బాబు, సనత్కుమార్, విశ్వనాథ్, ప్రభాకర్ నాయుడు, హనుమంతు, అశోక్, రాగినాయుడు, ప్రసాద్, లక్ష్మీదేవి, నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు. రైతు ఇంట చోరీ రొద్దం: మండలంలోని కంచిసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకిల క్రిష్టప్ప ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆర్డీటీ సౌజన్యంతో గ్రామంలో ఇంటిని నిర్మించుకుని అందులోనే నివాసముంటున్న క్రిష్టప్ప.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు నగలు, 12 తులాల వెండి సామగ్రి, రాగి పాత్ర అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రమాదంలో మెకానిక్ మృతి
ధర్మవరం రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని శాంతినగర్కు చెందిన జయరాములు కుమారుడు నవీన్కుమార్ కారు మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య కీర్తన ఉన్నారు. సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆయన చిగిచెర్ల రోడ్డులో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిరసన పుట్టపర్తి అర్బన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ ఎల్డీ కంప్యూటర్స్ సిబ్బంది సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లతో పని భారం పెరుగుతోందని, దీంతో ఒత్తిళ్ల కారణంగా తప్పిదాలు చోటు చేసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్లను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తక్షణమే ఉపసహరించుకోవాలని, ఉద్యోగుల పరిధిలో ఉన్న పనులను మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫిరోజ్బేగంకు వినతి పత్రం అందజేశారు. కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి తలుపుల: వీధి కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వివరాలు... ముదిగుబ్బ గ్రామానికి చెందిన మల్లికార్జున గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన గొర్రెల మందను మేపు కోసం తలుపుల మండలం మాడికవాండ్లపల్లి సమీపంలోని సూర్యనారాయణరెడ్డి పొలంలో వదిలాడు. సోమవారం 30 గొర్రె పిల్లలను జార్లీ (గంప) కింద వేసి పెద్ద గొర్రెలను మేపునకు తోలుకెళ్లారు. ఆ సమయంలో వీధి కుక్కలు జార్లీలో చొరబడి బీభత్సం సృష్టించడంతో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరో ఐదు గొర్రెపిల్లుల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఘటనపై బాధిత కాపరి మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు వేడుకలు ధర్మవరం అర్బన్: పట్టణంలోని కొత్తపేట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గణపతి సచ్చిదానంద స్వామి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధ సభ ట్రస్ట్, వలంటీర్ల ఆధ్వర్యంలో సచ్చిదానంద స్వామి చిత్రపటాన్ని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దత్త శివ, మెటికల కుళ్లాయప్ప, రామంజనేయులు, సాగా సురేష్, రంగా శ్రీనివాసులు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించడం తగదు తనకల్లు: మండలంలోని మల్లిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సోలార్ కంపెనీకి కేటాయించడం తగదని పలు గ్రామాల ప్రజలు తహసీల్దార్ శోభా సువర్ణమ్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామం సమీపంలోని సర్వే నంబర్ 63లో ఉన్న ప్రభుత్వ భూములను సోలార్ కంపెనీకి మంజూరు చేయడానికి రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలన్నారు. ఆ భూములను సోలార్కు కేటాయిస్తే దాదాపు 15 గ్రామాలకు చెందిన పశువులకు మేత, నీరు ఉండదని తెలిపారు. కార్యక్రమంలో పెండ్లుగుండుతండా, జామ్లానాయక్ తండా, పెద్దపల్లి, ఎర్రబల్లి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
బైక్ ఢీ – ఒకరి మృతి
ముదిగుబ్బ: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... కూలి పనులతో జీవనం సాగిస్తున్న నల్లచెర్లోపల్లికి చెందిన ఎం లక్ష్మన్న (59) సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మలకవేమల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో లక్ష్మన్నతో పాటు మరో ద్విచక్ర వాహనదారుడు శంకర్నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మన్న మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పదోన్నతుల ఖాళీలు తగ్గించొద్దు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఖాళీలు తగ్గించరాదని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలోని శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో నిరసన వ్యక్తం చేసి, డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. 2023లో తాత్కాలిక పదోన్నతులకు సంబంధించి ఎస్ఏ ఇంగ్లిష్లో 230 మందికి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం చేపట్టిన పదోన్నతులలో అంతకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్యుడు, నాగభూషణ, కేశవరెడ్డి, జయరాం నాయక్, సిరాజుద్దీన్, శ్రీనివాసులు నాయక్, శ్రీదేవి, విజయశ్రీ, సురేష్, కృష్ణారెడ్డి, పీరూనాయక్, వన్నారెడ్డి, సూర్యనారాయణ, క్షీరలింగేశ్వర్, వెంకటేష్, రసూల్, ఓబిరెడ్డి, నరసింహులు, విశ్వనాథరెడ్డి, రాజశేఖర్, శివప్రసాద్, మధు, రమేష్ పాల్గొన్నారు. డీఈఓను కోరిన ఉపాధ్యాయులు -
పాఠ్యపుస్తకాల దోపిడీ అరికట్టాలి
ధర్మవరం: ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల దోపిడీని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మార్సీలో సోమవారం ఎంఈఓ రాజేశ్వరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, వైఎస్సార్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పోతలయ్య, వైఎస్సార్ఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, గిరీష్ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకమునుపే అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. ఫీజు వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. భవిష్యత్తులో పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
అక్కడంతా.. ఆ ఇద్దరే!
సాక్షి, పుట్టపర్తి: ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యం చేసే ఆరోగ్య శాఖ జబ్బు బారిన పడింది. ఇద్దరు అసిస్టెంట్లు దళారీ అవతారమెత్తి.. వసూళ్లు చేస్తుండటం కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా క్లినిక్ మొదలు.. నర్సింగ్ హోం వరకు.. నెల, ఆరు నెలలు, ఏడాదికి చొప్పున టార్గెట్ పెట్టుకుని మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెలవు కావాలన్నా.. ఎఫ్ఆర్ఎస్ నమోదు కావాలన్నా.. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. కొత్త ఆస్పత్రుల రిజిస్ట్రేషన్.. పాతవి రెన్యూవల్స్తో పాటు తనిఖీ చేయకుండా ఉండాలన్నా.. అడిగినంత సమర్పించుకోవాల్సిందే. అసిస్టెంట్లే.. దళారీలుగా.. ఎఫ్ఆర్ఎస్ నమోదు నుంచి సెలవులకు అనుమతులు.. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ వరకు.. ప్రతి విషయంలో ఆ ఇద్దరు అసిస్టెంట్లు దళారీలుగా మారి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి పైసలు పంపనిదే.. ఫైలు కదలని పరిస్థితి. ఎఫ్ఆర్ఎస్, సెలవులన్నీ.. ఓ అసిస్టెంట్కు.. రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ విషయంలో మరో అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఒకరిపై మరొకరు చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నారు. పైగా తమపై ఎక్కడ ఫిర్యాదు చేసినా.. ఇబ్బంది లేదని.. కార్యాలయంలో ఖర్చులను తామే భరిస్తున్నామని.. ఎవరూ ఏమీ అనే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలుకుతున్నారు. విజయవాడకు చేరిన పంచాయితీ ఓ సీనియర్ అసిస్టెంట్ నిర్వాకంపై కొందరు మెడికల్ ఆఫీసర్లు పక్కా ఆధారాలతో జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు విన్నవించారు. ఆ తర్వాత నేరుగా విజయవాడలోని కమిషనర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ నుంచి అధికారులు సీరియస్ కావడంతో పాటు డీఎంహెచ్ఓపై కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖలో జరిగే విషయాలపై ఎందుకు స్పందించకుండా ఉన్నారని.. వెంటనే విచారణ చేయించి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ● ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లలో ఒకరిపై శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఒకరిని సోమవారం కడప రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) వద్ద సరెండర్ చేశారు. మరొకరిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. దళారీ అవతారమెత్తిన సీనియర్ అసిస్టెంట్లు డీఎంహెచ్ఓ కార్యాలయంలో వసూళ్ల పర్వం ఏ పని కావాలన్నా.. వారి వద్దకు వెళ్లాల్సిందే ఆస్పత్రుల రెన్యూవల్ విషయంలో భారీగా దందా విచారణ చేస్తున్నాం కొందరు మెడికల్ ఆఫీసర్లు ఓ సీనియర్ అసిస్టెంట్పై ఫిర్యాదు చేస్తే.. ఆయనను ఆ విధుల నుంచి తప్పించాను. ఆ తర్వాత విజయవాడకు ఎవరు ఫిర్యాదు చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. అవన్నీ తప్పుడు మెయిల్స్గా అనుమానం ఉంది. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. కార్యాలయంలో ఖర్చులకు ప్రభుత్వమే భరిస్తుంది. ఖర్చుల కోసం సిబ్బందితో వసూళ్లు చేయడం లేదు. – డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్ఓ -
జూన్లో గృహ ప్రవేశాలు లేనట్టే!
కదిరి అర్బన్: టిడ్కో గృహనిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీతో జూన్లో గృహప్రవేశాలు చేయొచ్చని లబ్ధిదారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. 2017లో కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు చెందిన దాదాపు 3వేల మంది పేదలకు కదిరి– హిందూపురం రోడ్డు పక్కన టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 75 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేసి పేదలకు అందిస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఏడేళ్లుగా ఈ భవనాలు పాడుబడిపోయాయి. గృహాలకు సంబంధించిన మెటీరియల్ చాలావరకు చోరీకి గురయింది. పనులు పూర్తయ్యేదెన్నడో..? పట్టణ శివారులోని కదిరి– హిందూపురం రహదారికి ఆనుకుని 40 ఎకరాల విస్తీర్ణంలో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా భవనాల్లో విద్యుత్, ఉడ్ వర్క్, పెయింటింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. వీధిలైట్లు, డ్రెయినేజీ, అంతర్గత రోడ్డు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంతం పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తోంది. భవనాలు విషసర్పాలకు ఆవాసంగా మారిపోయాయి. పూర్తి కాని టిడ్కో ఇళ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలూ నిల్ సొంతింటి కల మరింత ఆలస్యం మరింత సమయం పట్టొచ్చు ప్రస్తుతానికి టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై మాకు ఎలాంటి సమాచారమూ లేదు. 75 శాతం పూర్తయిన ఇళ్లను మిగిలిన 25 శాతం ఈ ఏడాది జూన్కు ఒక ఫేజ్, అక్టోబర్కు 2వ ఫేజ్లో పూర్తి చేసి ఇవ్వాలని గతేడాది రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ మున్సిపల్ కమీషనర్లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఇవి ఫైనల్ స్టేజ్లో ఉన్న భవనాలకు మాత్రమే. ఫైనల్ స్టేజ్ జాబితాలో కదిరి లేదు. ఇంకా సమయం పట్టచ్చు. – కిరణ్కుమార్, మున్సిపల్ కమిషనర్, కదిరిత్వరగా గృహాలు అప్పగించాలి టిడ్కో ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందివ్వాలి. ఇళ్ల నిర్మాణాల పూర్తి కోసం సీపీఎం ఆద్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టాం. అయినా పనుల్లో వేగం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి గృహనిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలి. – నరసింహులు, సీపీఎం పట్టణ కార్యదర్శి -
ఇదెక్కడి న్యాయం..?
కదిరి: కష్టపడి పాఠాలు చెప్పి బడిలో విద్యార్థుల సంఖ్య పెంచిన వారి కన్నా.. విధులకు డుమ్మా కొడుతూ ఆ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గి పోవడానికి కారణమైన ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఈ బదిలీల్లో 7 అదనపు పాయింట్లు కేటాయిస్తోంది. మరోవైపు బాగా పాఠాలు చెప్పి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్న ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తోంది. దీన్ని మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైన ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఇలా అదనపు పాయింట్లు కేటాయించడమేంటని వారు మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు మూడు వేల మంది దాకా ఉన్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఆన్లైన్ ద్వారానే బదిలీ ఉత్తర్వులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు ఆన్లైన్ ద్వారానే ఉత్తర్వులు అందనున్నాయి. హెచ్ఎంలకు ఈ నెల 30న, స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 4న, ఎస్జీ టీచర్లకు జూన్ 11న బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఎస్జీటీల దరఖాస్తు ప్రక్రియ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నెల 31న ఎస్జీటీల ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా విడుదల కానుంది. ఈ జాబితాపై అభ్యంతరాలను ఎస్జీటీలు ఈ నెల 28 నుంచి జూన్ 1లోగా తెలియజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బదిలీలకు సంబంధించి పాఠశాల ఎంపికకు హెచ్ఎంలు ఈ నెల 28లోగా, స్కూల్ అసిస్టెంట్లు జూన్ 1, 2వ తేదీల్లో, ఎస్జీటీలు జూన్ 7 నుంచి 10వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్–2025 ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతం ఈ బదిలీలు చేపడుతోంది. ఎస్జీ టీచర్లకు ఆఫ్లైన్ ద్వారానే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుగా పేర్కొన్నప్పటికీ.. దీనిపై ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. విద్యార్థుల సంఖ్య తగ్గించిన వారికి 7 అదనపు పాయింట్లు గందరగోళంగా మారిన ఉపాధ్యాయుల బదిలీలు నేటితో ముగియనున్న ఎస్జీటీల దరఖాస్తుల గడువు సాంకేతిక చిక్కులు బదిలీల ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ఉపాధ్యాయులను ఆందోళనకు, గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీనిపై తమకు జరిగిన అన్యాయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే తమ పరిధిలో ఏమీ లేదని, రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని పలువురు టీచర్లు వాపోతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో తమకు స్టేషన్ పాయింట్లు రావడం లేదని కొందరు, స్పౌజ్ పాయింట్ల విషయంలోనూ సమస్యలున్నాయని ఇంకొందరు అంటున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
బలవంతపు భూ సేకరణపై ఆగ్రహం
● వ్యవసాయం వీడితే వలసలే గతి ● తమ భూములను వదిలేయాలని రైతుల వేడుకోలు లేపాక్షి/ హిందూపురం: పరిశ్రమల స్థాపన కోసం వ్యవసాయ భూములను లాగేసుకోవడం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ చేయడాన్ని నిరసిస్తూ కొండూరు, తిమ్మగానిపల్లి, వడ్డిపల్లి గ్రామాల రైతులు వ్యవసాయ కార్మిక, రైతు సంఘం నాయకులతో కలిసి సోమవారం లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు భూములు లాగేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోతే జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందన్నారు. తమ భూములను తమకు వదిలేయాలని అధికారులను వేడుకున్నారు. అలాగే హిందూపురం మండలం చలివెందుల, రాచపల్లి మలుగూరు, మీనకుంటపల్లిలో బలవంతపు భూసేకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఓపీడీఆర్ నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏడాదికి మూడు పంటలు పండే 2,191 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని రైతులు మండిపడ్డారు. తమ ప్రమేయం లేకుండానే భూములు సర్వే చేయడం ఏమిటని నిలదీశారు. నాయకులు మాట్లాడుతూ బడా బాబులకు, అదాని, అంబానీ కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసమే భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించారని, అందులో ఎన్ని పరిశ్రమలు స్థాపించారంటూ ప్రశ్నించారు. హిందూపురం తహసీల్దార్ వెంకటేశులు స్పందిస్తూ రైతుల అనుమతి లేకుండా భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి ప్రశాంతి నిలయం: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేసి చక్కటి ఫలితాలు సాధించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ 224 అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇళ్లు, స్థలాలు, భూ సమస్యలు తదితర వాటిపై ఎక్కువగా అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అర్జీల పరిష్కారంలో ఫలితాలు సాధించాలన్నారు. యోగాంధ్రను విజయవంతం చేయాలి యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో విజయవంతం చేయాలని కలెక్టర్ చేతన్ కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యోగాంధ్ర షెడ్యూల్స్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న పుట్టపర్తి, జూన్ 4న కదిరి, జూన్ 6న ధర్మవరం, జూన్ 15న పెనుకొండ, జూన్ 13న హిందూపురంలో టీచర్స్–స్టూడెంట్స్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించాలన్నారు. జూన్ 21న లేపాక్షిలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఎ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమల శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్కుమార్, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్రెడ్డి, డీసీహెచ్ఎస్ తిప్పేంద్ర నాయక్, డీఎంహెచ్ఓ ఫెరోజాబేగం, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతినిధి శివరంగ ప్రసాద్, డీపీఓ సమత, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, డీఎఫ్ఓ చక్రపాణి, సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, క్రీడల శాఖ అధికారి ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు. -
సౌదీలో ధర్మవరం వాసి అవస్థలు
ధర్మవరం అర్బన్: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి ఏజెంట్ చేసిన మోసం వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. డ్రైవింగ్ కోసమని వెళ్తే ఇంటి పనుల్లో కుదిర్చారు. ఇంటి పనులు సరిగా చేయడం లేదని యజమానులు వీసా లాగేసుకుని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన భర్తను రక్షించాలని భార్య ధర్మవరం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు... బోయవీధికి చెందిన సయ్యద్ ఫరూఖ్, హర్షియా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఉపాధి కోసం సౌదీకి వెళ్లేందుకు పుట్టపర్తికి చెందిన ఏజెంట్ ఖలీల్ను సంప్రదించాడు. డ్రైవింగ్ పని ఇప్పిస్తానని చెప్పి అతని నుంచి ఏజెంట్ రూ.1.40 లక్షలు తీసుకున్నాడు. వీసాలో మోసం.. డ్రైవింగ్ వీసా స్థానంలో ఏజెంట్ ‘ఫ్రీ వీసా’ ఇచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 23న ఫరూఖ్ను విమానంలో సౌదీకి పంపించాడు. అక్కడి ఎయిర్పోర్టులో దిగిన ఫరూఖ్ను తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఏజెంట్ను ఫోన్లో సంప్రదించాడు. ఏజెంట్ మరో వ్యక్తిని ఫరూఖ్ దగ్గరకు పంపించాడు. అతను ఫరూఖ్ను తీసుకెళ్లి వాళ్లకు సంబంధించిన పెద్ద భవనాల్లో శుభ్రం చేసేందుకు, ఇంటి పనులు చేసేందుకు నియమించాడు. తాను డ్రైవింగ్ పని కోసం వచ్చానని, ఇంటి పనులు చేయనని మొండికేయడంతో ఆగ్రహించిన యజమానులు అతని వద్దనున్న ఫ్రీవీసా లాక్కున్నారు. బెల్టు, స్టీల్ పైపులతో చితకబాదేవారు. రోజూ మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను శుభ్రం చేసినా.. చిన్నపాటి దుమ్ము, ధూళి కనిపిస్తే యజమానులు మరోసారి శుభ్రం చేయించేవారు. జరిమానా విధించిన సౌదీ ప్రభుత్వం ఓ రోజు ఇంటి పనులు ముగించుకుని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గదికి నడుచుకుంటూ వెళ్తున్న ఫరూఖ్ను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకుని, వీసా లేదని కేసు నమోదు చేశారు. 20 వేల దినార్లు (రూ.4.50 లక్షలు) జరిమానా విధించారు. ఆ డబ్బు చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో ఫరూఖ్ తన భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ప్రస్తుతం సౌదీలోని మదరసాలో ఉంటున్నానని తెలిపాడు. భర్తను విడిపించాలని వేడుకోలు సౌదీలో బందీ అయిన తన భర్తను విడిపించడంతో పాటు వీసా పేరిట మోసం చేసిన ఏజెంట్ ఖలీల్పై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ భార్య హర్షియా సోమవారం ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఏజెంట్ ద్వారా ఫరూఖ్ను ఇండియాకి రప్పిస్తామని సీఐ హామీ ఇచ్చారు. అనంతరం ఫరూఖ్ కుటుంబ సభ్యులు మంత్రి సత్యకుమార్యాదవ్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్కు లేఖ రాసి.. ఫరూఖ్ను కాపాడాలని, అతని పాస్పోర్టును తిరిగి అందించాలని, భారత దౌత్య కార్యాలయం ద్వారా నిరంతర కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగం పేరిట ఏజెంట్ మోసం డ్రైవర్ జాబ్ అని.. ఇంటి పనికి కుదిర్చిన వైనం పని చేయలేక యజమానుల చేతిలో చిత్రహింసలు -
వ్యవసాయ శాఖలో ‘బదిలీల జాతర’
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖలో సోమవారం బదిలీల జాతర జరిగింది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన జోనల్స్థాయి కౌన్సెలింగ్కు రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్, సిఫారసుల కింద కూడా కొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో అర్హత కలిగిన 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు 120 మందికి పైగా రిక్వెస్ట్ కింద బదిలీ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన అడిషినల్ డైరెక్టర్ శ్రీధర్ సమక్షంలో అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, నాగేశ్వరరావు, చంద్రానాయక్, మురళీక్రిష్ణ, వరలక్ష్మి, ప్రసాదరావు, జే.మురళిక్రిష్ణతో పాటు ఆయా జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్లు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా, కౌన్సెలింగ్ జరుగుతున్న తీరుపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొందరివి పరిగణలోకి తీసుకుంటున్నా... మరికొందరివి తీసుకోవడం లేదన్నారు. అలాగే తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుశాఖలో.. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, 23 మంది ఆఫీస్ సబార్డినేట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, ఆఫీస్ మేనేజర్, సూపరెండెండెంట్లు పాల్గొన్నారు. -
జిల్లా పరిధిలో సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది.
జవాన్ భూమి కబ్జా ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు ప్రశాంతి నిలయం: దేశ భద్రత కోసం సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్ భూమిని కొందరు కబ్జా చేశారు. మూడేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మండలం పాలసముద్రం పంచాయతీ రాగిమేకలపల్లికి చెందిన చౌడేష్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ఈయనకు రాగిమేకల పల్లి రెవెన్యూ గ్రామ ఎల్పీఎం నంబర్ 72లో 4.92 ఎకరాల పొలం ఉంది. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన కొందరు ఈ భూమిని కబ్జా చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతేకాదు ప్రశ్నిస్తే కబ్జాదారులు జవాన్ తల్లి, కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నారు. మూడేళ్లు అవుతున్నా సమస్య అలానే ఉండిపోవడంతో న్యాయం చేయాలని జవాన్ చౌడేష్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశారు. దేశం కోసం పాటుపడుతున్న తన ఆస్తులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సజావుగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా సాగుతున్నాయని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు 2,911 మంది విద్యార్థులకు గాను 2,466 మంది హాజరయ్యారని తెలిపారు. 445 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షల చీఫ్ అశ్వర్థరెడ్డి ఎనుములపల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ నెల 28వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. పోలీస్ కార్యాలయంలో.... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అందజేయవచ్చని సూచించారు. చిన్నారిని మింగిన కరెంట్ పెనుకొండ: అభం శుభం తెలియని చిన్నారిని కరెంట్ షాక్ బలిగొంది. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూరు తాలూకా మళ్లియకరై గ్రామానికి చెందిన అశోక్ పెనుకొండ నగర పంచాయతీ వెంకటాపురం తండా వద్ద ఉన్న రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పక్కనే ఉన్న క్వార్టర్స్లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. ఆదివారం అశోక్ పని నిమిత్తం ఫ్యాక్టరీలోకి వెళ్లాడు. భార్య గాయత్రి బకెట్లో నీళ్లు పెట్టి వాటర్ హీటర్ స్విచ్ వేసింది. కాసేపటి తర్వాత పెద్ద కూతురు సెల్వ మౌలిక (7) అటువైపు వచ్చి బకెట్లోకి చేయి పెట్టగానే విద్యుత్షాక్కు గురైంది. వెంటనే భర్తను పిలిపించి కూతురును పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మౌలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలరించిన సంగీత కచేరీప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఆలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఒడిశా బాల వికాస్ చిన్నారులు ఆదివారం సత్యసాయి సన్నిధిలో సంగీత కచేరీ నిర్వహించారు. భక్తి గీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు. 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ అనంతపురం అగ్రికల్చర్: రైతులకు విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది 50,592 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కే–6తో పాటు టీసీజీఎస్–1,694, కదిరి–లేపాక్షి (కే–1,812) విత్తన రకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కే–6, టీసీజీఎస్–1,694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా అందులో 40 శాతం రూ. 3,720 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కే–1,812 రకం పూర్తి ధర రూ.8,200 కాగా రూ.3,280 రాయితీ పోనూ రైతులు రూ.4,920 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (ఒక్కోటి 30 కిలోలు) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు, 50 శాతం రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు జూన్ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
కఠిన చర్యలు తీసుకుంటాం
సాక్షి, పుట్టపర్తి కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లను భారంగా భావిస్తున్నారు. పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే కడతేరుస్తున్నారు. వారసత్వం అంటే కేవలం మగబిడ్డ అనే నమ్మకంలో చాలామంది ఉండటం దౌర్భాగ్యం. దీన్ని ఆసరా చేసుకుని ల్యాబ్ నిర్వాహకులు అధిక ఆదాయం కోసం లింగ నిర్ధారణను గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. జిల్లాలో చాలా ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు సమాచారం. ఆయా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి.. టెక్నీషియన్ల అర్హతలు, బాధితుల నుంచి నమూనాలు సేకరిస్తున్న తీరు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రిపోర్టుల జారీ వంటి అంశాలను పరిశీలించాల్సిన వైద్య ఆరోగ్య శాఖాధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో లింగ నిర్ధారణ యథేచ్ఛగా సాగుతోంది. రెన్యూవల్స్ కోసం కూడా వెళ్లకుండా.. ప్రైవేటు ఆస్పత్రులు ప్రతి ఐదేళ్లకు ఓసారి అనుమతులు రెన్యూవల్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అడిగేవారు లేకపోవడంతో పదేళ్లు అయిన ఆస్పత్రులు కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల్లో చాలామంది ప్రభుత్వ జీతం తీసుకునే వారే కావడం విశేషం. డ్యూటీ సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి.. అక్కడి నుంచి రోగులను తెచ్చుకుని ప్రైవేటుగా వైద్యం చేసి డబ్బులు గుంజుతున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్హతలు మరచి.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే టెక్నీషియన్లు, ల్యాబ్ నిర్వాహకులు చాలామంది అర్హత లేనివారే. వారిచ్చే తెలిసీ తెలియని రిపోర్టు ఆధారంగా రోగులకు డాక్టర్ మందులు (ఔషధాలు) రాసిస్తారు. వాటిని వాడిన తర్వాత రోగులకు కొత్త అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా అదే డాక్టర్ వద్దకు వెళ్లినా.. గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. అబార్షన్ చేయించుకున్న తర్వాత చాలామంది అనారోగ్యం బారిన పడిన దాఖలాలు ఉన్నాయి. కోడ్ భాష ద్వారా.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్ చేస్తారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేసి వివరాలు రహస్యంగా వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘కోడ్’ భాష వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఆడబిడ్డ అయితే శుక్రవారం, మగబిడ్డ అయితే సోమవారం అనే భాషలో మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. అటకెక్కిన పీఎన్డీటీ చట్టం పీఎన్డీటీ (ప్రీ–నాటల్ డయాగ్నస్టిక్స్ టెక్నిక్స్) – చట్టం– 1994ను అటకెక్కించారు. లింగ నిర్ధారణ చేస్తే చట్టం ప్రకారం రూ.50 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి.. జన్యుపరమైన విషయాలను మాత్రమే వెల్లడించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడ, మగ అనే విషయాలు వెల్లడించరాదు. లింగ నిర్ధారణ చేసే కేంద్రాల గురించి సమాచారం ఎవరు ఇచ్చినా.. వారి పేర్లు గోప్యంగా ఉంచి.. దాడులు చేసి జరిమానాతో పాటు కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం కాసుల కోసం ల్యాబ్ నిర్వాహకుల కక్కుర్తి ఆడపిల్ల అంటే.. ఆలస్యం లేకుండా అబార్షన్! జిల్లాలో 190 ల్యాబ్లకు అనుమతులు ఉన్నాయి. అయితే ఎక్కడా లింగ నిర్ధారణ చేయరాదు. గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేసే ఆస్పత్రుల వివరాలు చెబితే తనిఖీలు చేసి కేసుల నమోదుకు సిఫారసు చేస్తాం. లింగ నిర్ధారణ నేరం. ఎవరూ చేయించుకోకూడదు. గర్భం దాల్చిన మహిళ కూడా ముందు ఆడబిడ్డ అనే విషయం గుర్తుంచుకోవాలి. భ్రూణ హత్యలు చేయరాదు. అలాంటి ల్యాబ్లను తప్పకుండా సీజ్ చేస్తాం. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, పుట్టపర్తి -
చిరుత సంచారంతో కలవరం
అగళి: హెచ్డీ హళ్ళి పంచాయతీ గాయత్రి కాలనీ గ్రామ సమీపాన ఫారెస్ట్లో తరచూ చిరుత సంచరిస్తోంది. ఆదివారం రాత్రి కాలనీకి వెళ్లే రోడ్డు పక్కన చిరుతను గమనించి కొందరు వీడియో తీశారు. గొర్రెల మందలపై దాడి చేసి గొర్రెను లాక్కువెళుతుండాగా ప్రజలు కేకలు వేయండంతో వదలి వెళ్లిపోయింది. అయితే రెండు చిరుత పిల్లలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లి చిరుత గ్రామంలోకి ఎప్పుడు వస్తుందోనన్న కలవరం వారిలో మొదలైంది. వ్యవసాయ పనులు, పశువుల, గొర్రెలను మేపడానికి వెళ్లేవారు భయాందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని కరిదాసనపల్లి సమీపంలో పెద్దబండలో కూడా ఇదే మాదిరిగా చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు స్పందించి గ్రామాల్లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉదుగూరులోనూ చిరుత అలజడి అమరాపురం: ఉదుగూరులో చిరుత అలజడి రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రామ పొలి మేరలోకి చిరుత వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్కను చంపినట్లు, చిరుత కాలినడకన వెళ్లినట్లు ఆనవాళ్లను గుర్తించారు. రాత్రిపూట పొలాలు, బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకుని అడవుల్లో వదిలేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జగన్ ఫొటో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం
మడకశిర: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫొటోను చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంటోందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్, మడకశిర ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్ రాజు.. జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చాంబర్లోకి దౌర్జన్యంగా వెళ్లి వైఎస్ జగన్ ఫొటోను తొలగించి.. చెత్త రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. మహిళా అనే గౌరవం లేకుండా చాంబర్లోకి అక్రమంగా చొరబడడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేయడమేనని మండిపడ్డారు. వెంటనే పోలీసులు సదరు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక అడుగు ముందుకేసి దుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. మడకశిర నియోజకవర్గంలోని ప్రజలు ఎమ్మెల్యే వ్యవహార శైలిని గమనిస్తున్నారని తెలిపారు. జెడ్పీ నుంచి నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే కృషి చేయకుండా చైర్పర్సన్ చాంబర్లోకి దౌర్జన్యంగా వెళ్లి రభస సృష్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే తన వ్యవహార శైలి మార్చుకోకపోతే రాజకీయాల్లో కనుమరుగు కావడం ఖాయమని పేర్కొన్నారు. సంక్షేమ పాలనతో వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని గుర్తు చేస్తూ.. ఫొటో తీసేసినంత మాత్రాన ఏమీ కాదని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడం మాని నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించాలని ఎంఎస్ రాజుకు ఈరలక్కప్ప సూచించారు. అభివృద్ధి పనులు చేయకుండా చెత్త రాజకీయాలు చేస్తున్నారు వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం -
చిత్ర విచిత్రాలు.. టీచర్ల గగ్గోలు
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీ దరఖాస్తులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి ఏ పాయింట్లు నమోదవుతున్నాయో, అవి ఎప్పుడు తొలగిపోతాయో అంతుచిక్కడం లేదు. దీంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల దరఖాస్తు ప్రక్రియను సాంకేతికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి. దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన పాయింట్లు హార్డ్కాపీ ప్రింట్ తీసుకునేలోపు మాయమవుతున్నాయి. పాఠశాల ఒక కేటగిరి కింద ఉంటే...వెబ్సైట్లో మరో కేటగిరీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రీ అపోర్షన్కు గురైన టీచర్లకు స్పెషల్ పాయింట్లు కనిపించడం లేదు. జనరేట్ అయిన స్పౌజ్ ప్రత్యేక పాయింట్లు గల్లంతయ్యాయి. గార్లదిన్నె మండలంలో ఓగణితం టీచరుకు దరఖాస్తు చేసుకున్న రోజు 43.4898 పాయింట్లు చూపించగా రెండోరోజు 43.4713 పాయింట్లు, మూడోరోజు (ఆదివారం) 38.4713 పాయింట్లు చూపిస్తోంది. ఇక సోమవారం (నేడు) ఎన్ని పాయింట్లు కనిపిస్తాయోనని సదరు టీచరు బెంబేలెత్తుతున్నారు. చివరకు కొందరు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసిన ఫారాలు కూడా వెబ్సైట్లో కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ‘టీచర్ల బదిలీ చట్టం–2025’ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ టీచర్లకు సమస్యగా మారింది. దరఖాస్తు గడువు ముంచుకొస్తుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అనంతపురంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న శారదా స్కూల్కు పరుగులు పెడుతున్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేదంటూ ఇక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎం దరఖాస్తులు మాయం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసి... హార్డ్కాపీలు ప్రింట్ తీసుకుని అధికారులకు అందజేసి నిర్ధారణ చేసిన తర్వాత కొందరు హెచ్ఎంల పేర్లు తాత్కాలిక సీనియార్టీ జాబితాలో కనిపించలేదు. తాడిపత్రి మండలం చుక్కలూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి.సుధాకర్ ఈనెల 21న ఆన్లైన్లో దరఖాస్తు చేశారుు. డౌన్లోడ్ చేసుకుని 22న గుత్తి డీవై ఈఓకు సబ్మిట్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తు అటు డీవైఈఓ లాగిన్లోనూ, ఇటు డీఈఓ లాగిన్లోనూ కనిపించలేదు. ఈలోగా గడువు ముగిసి తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలైంది. ఇందులో సుధాకర్ పేరే లేదు. డీఈఓను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కాగా సుధాకర్ రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నాడు. అదే తప్పనిసరి బదిలీ అయి ఉండి ఇలా ఆన్లైన్లో దరఖాస్తు కనిపించకపోతే పెద్ద సమస్య అయ్యేదని టీచర్లు చెబుతున్నారు. మరో 10 మందిదాకా హెచ్ఎంలు సుధాకర్ లాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. స్కూల్ 3వ కేటగిరీ.. పాయింట్లు ఒకటో కేటగిరీవి.. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం టీచరు బి.రామాంజనేయులు 8 ఏళ్లు పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకున్నాడు. అగ్రహారం జెడ్పీహెచ్ఎస్ 3వ కేటగిరీలో ఉంది. అంటే ఏడాదికి మూడు పాయింట్లు చొప్పున 24 పాయింట్లు రావాల్సి ఉంది. ఆన్లైన్లో ఈ స్కూల్ కేటగిరీ–1లో ఉన్నట్టు చూపిస్తోంది. కేటగిరీ–1కు ఏడాదికి ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఈ లెక్కన మొత్తం 8 పాయింట్లు మాత్రమే చూపిస్తోంది. మూడు రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... ఏ ఒక్కరూ స్పందించడం లేదని వాపోతున్నాడు. టీచర్ల బదిలీ ఆన్లైన్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు మాయమైపోతున్న పాయింట్లు ఉన్న పాయింట్లు చూపని వెబ్సైట్ చివరకు దరఖాస్తులూ కనిపించని వైనం డీఈఓ కార్యాలయం చుట్టూ ఉపాధ్యాయుల ప్రదక్షిణలు తమ చేతుల్లో లేదంటున్న అధికారులు -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్/అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయించారు. కాగా.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సాగిన పరీక్షలో అభ్యర్థుల హాజరు 59.50 శాతంగా నమోదైంది. 2,546 మంది హాజరవ్వాల్సి ఉండగా ఉదయం పేపర్–1 పరీక్షకు కేవలం 1,522 మంది హాజరయ్యారు. 1,024 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,515 మంది హాజరుకాగా 1,031 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు ఎంఎం నాయక్, కలెక్టర్ వి.వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సందర్శించారు. 59.50 శాతం అభ్యర్థుల హాజరు ప్చ్.. అదృష్టం లేదు! యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరీక్ష సమయానికి కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. ఉదయం 9 తరువాత, మధ్యాహ్నం 2 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే కొందరు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాల్సిన కదిరికి చెందిన షర్మిల, కర్నూలుకు చెందిన కిరణ్, అనంతపురం నగరానికి చెందిన స్రవంతి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మరికొన్ని కేంద్రాల్లోనూ ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. -
గ్రంథాలయాలపై పాలకుల నిర్లక్ష్యం
ఇలాంటి ఘటనలు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వెలుగు చూస్తున్నాయి. కాసుల కోసం కొంతమంది ల్యాబ్ నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. సోమందేపల్లి: ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. శిథిల దశకు చేరుకున్న భవనాల మరమ్మతులకు నిధుల కొరత వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. ఇందులో 23 పాతబడిన, పక్కా భవనాలు, 8 రెంటెండ్ ఫ్రీ భవనాలు, 5 అద్దె భవనాల్లో గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. కొన్ని భవనాలు ఇరుకుగా ఉంటుండటంతో పత్రికలు, పుస్తకాలు చదవడానికి పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీల కొరత కారణంగా కొందరు నిల్చునే చదువుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే శిథిలమైన భవనాల గోడలు, పై కప్పులు కూలే ప్రమాదం లేకపోలేదు. కొన్ని చోట్ల గ్రంథాలయాల భవనాల ముందు స్థలాలు ఆక్రమణకు గురవుతుండటంతో పాఠకుల వాహనాల పార్కింగ్కు సమస్య ఏర్పడుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత గ్రంథాలయాలకు సిబ్బంది కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఒకే గ్రంథాలయ అధికారి రెండు మూడు చోట్ల ఇన్చార్జ్లుగా పనిచేస్తున్నారు. తద్వార లైబ్రరీల ద్వారా సరైన విధంగా పాఠకులకు సేవలు అందే పరిస్థితి లేదు. జిల్లాలో దాదాపు 20 చోట్ల గ్రంథాలయ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ కలేనా? ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ లైబ్రరీలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. అయితే శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్క చోట కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయలేదు. ఉన్న గ్రంథాలయాల్లో తగిన పుస్తకాలు అందుబాటులో లేవు. మరుగుదొడ్లు, తాగునీటి తదితర సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. శిథిల దశకు చేరుకున్న భవనాలు భారీ వర్షాలకు కూలే ప్రమాదం మరమ్మతులకు వేధిస్తున్న నిధుల కొరత -
ఏలుకుంట్లలో ఘర్షణ
ధర్మవరం రూరల్: వివాహేతర సంబంధం కారణంగా ధర్మవరం మండలం ఏలుకుంట్లలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఓ వర్గానికి చెందిన విజయ్, శ్రీనివాసులు, అప్పస్వామి, లక్ష్మీనారాయణ, మరో వర్గానికి చెందిన బొగ్గు నాగరాజు, దామోదర్, సత్యమయ్య, ఓబుళమ్మకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిరుత దాడితో జింక మృతిఓడీచెరువు: తంగేడుకుంట పంచాయతీ గొల్లవారిపల్లిలో శనివారం సాయంత్రం ఓ చిరుత దాడిలో జింకపిల్ల మృతి చెందింది. వ్యవసాయ బోరు వద్ద పడి ఉన్న సగం జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ రొళ్ల: మండలంలోని కె.బ్యాడిగెర గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం రొళ్ల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మడకశిర రూరల్ పీఎస్ సీఐ రాజ్కుమార్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఆదివారం కె.బ్యాడిగెర గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద చింత చెట్టు కింద క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఆరుగురు పట్టుపడ్డారు. వీరి నుంచి రూ.1.02 లక్షల నగదు, ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రిపోర్టర్ మృతిఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ బోయ నాగరాజు (32) మృతిచెందాడు. బూదగవి గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. -
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు.. రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మాల రామచంద్ర (61) మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేయడానికి అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి తూర్పున శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గుంత తీసేందుకు కొందరు దళితులు అక్కడికి వెళ్లడంతో ఆ స్థలం తమదంటూ అదే గ్రామానికి చెందిన పలువురు కాలువ గొంచి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలంటూ రోడ్డుపై మృతదేహన్ని ఉంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాప్తాడు, రూరల్ సీఐలు శ్రీహర్ష, శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వందేళ్లుగా తమ పూర్వీకుల అనుభవంలో ఉంటూ వచ్చిన భూమిని దళితుల శ్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారంటూ కాలువగొంచి నిర్వాహకులు మండిపడ్డారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను గత ఏడాది ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి తూర్పున ఉన్న సర్వే నంబర్ 281–4లో 1.08 ఎకరాలను దళితుల శ్మశాన వాటికకు కేటాయించాలంటూ అప్పట్లో ఆర్డీఓకు ఎమ్మెల్యే సూచించారని, దీంతో నాలుగు నెలల క్రితం శ్మశాన వాటికకు కేటాయిస్తూ తహసీల్దార్ విజయకుమారి పట్టాను ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగానే తమకు ఇప్పించారంటూ దళితులు ప్రతిగా స్పందించారు. ఈ విషయంపైనే తాము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్లుగా కాలువగొంచి రైతులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోర్టు స్టే ఆర్డర్ను చూపారు. గ్రామానికి దక్షిణం వైపు 3.80 ఎకరాల శ్మశాన వాటిక ఉందని, అక్కడికెళ్లి ఖననం చేసుకోవాలని సూచించారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమారి అక్కడకు చేరుకుని దళితులతో చర్చించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. ఈ అంశంలో న్యాయం చేస్తానని, శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించి పాత శ్మశాన వాటికలోనే రామచంద్ర మతృదేహాన్ని ఖననం చేశారు. కాగా, ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను ఎమ్మెల్యే పరిటాల సునీత మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నాసిరకం సాఫ్ట్వేర్తో బెంబేలు ● రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో గడువు ముగుస్తున్నా దరఖాస్తు చేసుకోవడానికి కొందరు ఉపాధ్యాయులకు ఆన్లైన్ ఓపెన్ కావడం లేదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి వాపోయారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్లికేషన్ పూర్తి చేయడానికి పీఈటీలు, ఎల్పీటీలు ప్రయత్నిస్తే సైట్ ఓపెన్ కావడం లేదన్నారు. రిఅపోర్షన్కు ఎఫెక్ట్ అయినవారికి పాత స్టేషన్ పాయింట్స్ ఉపయోగించుకునేలా ఉంచిన ఎస్ బటన్ క్లిక్ చేసినా ‘0’ పాయింట్స్ వస్తున్నాయన్నారు. సబ్మిట్ చేయడానికి వెళ్తే ఎర్రర్ అని వస్తోందన్నారు. డీఈఓ ఏర్పాటు చేసిన సెంటర్కు వెళ్లి గ్రీవెన్స్ ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందన్నారు. లీగలీ సెపరేట్ అయిన మహిళా ఉపాధ్యాయులు, రెండు సార్లు రీ అపోర్షన్కు గురై బదిలీకి దరఖాస్తు చేస్తే ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ ‘0’ పాయింట్స్ వస్తున్నాయన్నారు. నాసిరకం సాఫ్ట్వేర్తో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ● వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే వాల్మీకుల అభివృద్ధి● ఉమ్మడి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కులప్ప బుక్కరాయసముద్రం: సమష్టి కృషితోనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కులప్ప అన్నారు. ఆదివారం స్థానిక వాల్మీకి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన 2 వేల మంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు చైతన్యకుమార్, పవన్కుమార్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, న్యాయవాది చంద్రశ్చర్ల హరి, కోనయ్య, అక్కులప్ప, సాకే నరేష్, తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో ఇద్దరి మృతిశెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కర్ణాటక సరిహద్దున శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
● ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠం
పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇంత కాలం ప్రభుత్వం స్పందించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలా కాకున్నా... కనీసం మరమ్మతులైనా చేపడుతుందని గ్రామీణులు ఆశించారు. అయినా కనుచూపు మేరలో అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రహదారి మరింతగా దెబ్బతినింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు పడరాని పాట్లు పడేవారు. ఇలాంటి తరుణంలో రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపట్టాలంటే ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. విషయాన్ని గమనించిన ఎల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ గంగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్వయంగా రంగంలో దిగి తన రోజు వారి సంపాదన రూ.1,200 చొప్పున రెండు రోజుల ఆదాయం రూ.2,400 వదులుకుని ఒంటరిగానే మట్టితో గుంతలను పూడ్చి వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులు ‘ఏందయ్యా గంగరాజు... ఏమిటీ పని ఒప్పుకున్నావా?’ అన్ని ప్రశ్నిస్తే.. ‘గుంతల వల్ల రోజూ ఎవరో ఒకరు కిందపడుతూనే ఉన్నారు కదన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాలు ఏవీ జరగకూడదని మట్టితో గుంతలను పూడుస్తున్నా’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది చూసిన పలువురు శభాష్ గంగరాజు అంటూ మెచ్చుకున్నారు. -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, కాలువ గట్లతో పాటు రాయలచెరువు గ్రామ సమీపంలోని చెరువులో మట్టినీ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి, సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులో రోజూ 500 టిప్పర్ల మట్టిని తోలుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఇరిగేషన్ అధికారులు హడావుడి చేసి.. మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాట నిలబెట్టుకున్న పెద్దారెడ్డి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలచెరువు గ్రామ సమీపంలో రిజర్వు కొండ, ఊరుగట్ట, పిచ్చల కొండల మధ్య సర్వే నంబర్ 705లో 525 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ మూడు కొండల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. తవ్వకాలు చేపట్టిన తర్వాత నుంచి క్రమేణా కొండల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. 2017లో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండలం బోగాలకట్ట నుంచి రాయలచెరువు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చెరువును నింపి.. సమీపంలోని కాలువలకు నీటిని విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే అయ్యాక నాలుగు సార్లు రాయలచెరువు చెరువును నింపి.. కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. చెరువును విస్మరించిన జేసీ కుటుంబం తాడిపత్రి నియోజకవర్గం నుంచి గెలిచిన జేసీ సోదరులు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయలచెరువును పూర్తిగా విస్మరించారు. తమ స్వలాభం కోసం చెరువును నీటితో నింపకుండా వదిలేశారు. ఇక్కడ రైతులు, కూలీలు ఎప్పుడూ దయనీయ స్థితిలో ఉండటమే వారు కోరుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పలు సందర్భాల్లో జేసీ సోదరులను విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజల వద్దకు వెళ్లరని, వారికి ఏదైనా సమస్యను చెప్పాలన్నా ప్రజలు భయపడిపోయేవారని అన్నారు. చెరువు మట్టిని దోచేస్తున్నారిలా.. అధికార పార్టీకి చెందిన యాడికి మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్ నుంచి మట్టి దోపిడీ కొనసాగుతోంది. మూడు హిటాచీలతో రోజుకు 500 టిప్పర్ల మేర రాయలచెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వేసినట్లు తెలుస్తోంది. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలైతే టిప్పర్కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి రూ.10వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా పొలాలకు తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరతోనే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు రాయలచెరువు 525 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతులు లేవు. అయితే కొంతమంది రైతులు తమ పొలాలకు మట్టి కావాలని కోరితే ఇరిగేషన్ శాఖ అధికారులకు నివేదిక పంపించాం. – ప్రతాప్రెడ్డి, తహసీల్దార్, యాడికి రాయలచెరువు గ్రామ సరిహద్దులో ఆగని మట్టి దోపిడీ 24 గంటలూ హిటాచీ, జేసీబీలతో తవ్వకాలు రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం -
రాప్తాడులో రౌడీ రాజ్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ నాయకులు భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టి కృష్ణా జలాలను జిల్లాకు అందించారని గుర్తు చేశారు. ఈ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులు ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 టీఎంసీలకే పరిమితం చేస్తూ కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారని తెలిపారు. కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, హిందూపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 29వ తేదీ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతులతో కలసి ఆయా మండలంలోనే రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతా అక్రమ ఆదాయమే.. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు హతమార్చారన్నారు. 300కు పైగా అక్రమ కేసులతో దౌర్జన్యాలకు దిగారన్నారు. ఇక దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నారు. లేని భూ సమస్యలను సృష్టించి సెటిల్మెంట్లకు రాకపోతే హత్యలు చేయిస్తున్నారన్నారు. రూ.లక్షల్లోనే మట్టి దోపిడీలు సాగిస్తున్నారన్నారు. కక్కలపల్లి టమాట మండిలో శ్రీరామ్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో బాటిల్పై రూ.10 శ్రీరామ్ ట్యాక్స్ అంటూ వసూలు చేస్తున్నారన్నారు. కంకర మిషన్ నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక అమ్ముకునేందుకు వీలుగా పేరూరు డ్యాంకు నీరు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి తప్ప కూటమి ప్రభుత్వంలో కాదన్నారు. జీడిపల్లి నుంచి ఆత్మకూరుకు నీటిని అందించేందుకు రూ.170 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు సబ్ స్టేషన్లు తీసుకురాగా, వీటిలో తోపుదుర్తి, గొరిదిండ్ల సబ్స్టేషన్ల పనులను ఈ ప్రభుత్వం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. అనంతపురం – తగరకుంట మార్గంలో సగం రోడ్డు పూర్తి చేస్తే ఆ తర్వాత సగం రోడ్డు పనులకు కనీసం కంకర కూడా వేయలేదన్నారు. పీఏబీఆర్ నుంచి రూ.67 కోట్లతో తాగునీటి పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా... నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రకాష్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిటాల సునీత నేతృత్వంలోనే అనంతపురం రూరల్ పరిధిలో ఇళ్లు కూల్చారని, దోపిడీలు, హత్యలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గార్మెంట్ పరిశ్రమ తీసుకువచ్చామని, అలాగే చేతనైతే పరిటాల సునీత కూడా నియోజకవర్గానికి నూతన పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో 68 సెంట్లలో 20 ఇళ్లు కూల్చేసి ఆ స్థలంపై కన్నేస్తే బాధితుల పక్షాన నిలిచి కోర్డుకు వెళ్లి స్టే ఆర్డర్ తెప్పించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రకాష్రెడ్డిని విమర్శించడం మాని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిపెట్టాలని హితవు పలికారు. భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలు హంద్రీ నీవా లైనింగ్ పనులతో రైతులకు తీరని అన్యాయం న్యాయం కోరుతూ ఈ నెల 29 నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు వైఎస్సార్సీపీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం
గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య రోజా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, తాగునీటి పథకం కార్మికుల సంఘం నాయకుడు పి.చిన్న బాబయ్య గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచిన సూరప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సూరప్ప మృతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు తిమ్మప్ప, సురేంద్ర, కె.రామాంజినేయులు, వెంకటాద్రి, సంతోష్ ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
అనంతపురం మెడికల్/కదిరి అర్బన్: కదిరి పట్టణానికి చెందిన యషిక సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ వివరాల మేరకు.. కదిరికి చెందిన లక్ష్మీనారాయణ, శిరీష దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శిరీషకు సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ తదితరులను పోలీసుస్టేషన్కు రావాలని పిలుపుస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం యషికకు సీఐ నారాయణరెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో ఆమె స్టేషన్కు వెళ్లింది. అక్కడ సీఐతో పాటు ఎస్ఐ బాబ్జాన్ నానా మాటలు అనడంతో మనస్థాపంతో యషిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తమను వేధిస్తున్నారని, శిరీషతో ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా.. తాను తన మిత్రుడితో కలసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశారని శిరీష కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. శిరీష ఫిర్యాదు మేరకు ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమార్తె యషిక, ఆమె భర్త శివ, జగదీష్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ, ఎస్ఐలే కారణమంటున్న బాధితురాలు -
అదృశ్యమైన మహిళలు ఉరవకొండలో ప్రత్యక్షం
ఉరవకొండ: కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో ఉన్న ఉజ్వల హోం నుంచి ఈనెల 22న అదృశ్యమైన ఇద్దరు మహిళల ఆచూకీ లభించింది. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది వివరాల మేరకు.. కుందుర్పి, కణేకల్లు మండలాలకు చెందిన యువతులు కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోం నుంచి అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఉరవకొండ బస్టాండ్లో వారిని స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే వారిని కళ్యాణదుర్గం పోలీసులకు అప్పగించామన్నారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి విడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోని 67వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఈరన్న (42) మృతి చెందాడు. కర్ణాటకలోని కంప్లీ నుంచి గుంతకల్లు వైపు వెళ్తున్న లారీ మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని ఆపీ టైరు కింద రాళ్ళను పెట్టేందుకు వెనుక వైపునకు వెళ్ళాడు. అదే సమయంలో గుంతకల్లు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి పంక్చరైన లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ ఈరన్న అక్కడికక్కడే చనిపోయాడు. విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తికి బాలుడి ప్రాణాలు బలి● బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత జగదీష్ డిమాండ్ గుంతకల్లు: నాసిరకం నిర్మాణ పనులతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ.జగదీష్ విమర్శించారు. శుక్రవారం గుంతకల్లు రైల్వేస్టేషన్లో పెచ్చులూడి పడి మణికంఠ అనే బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం నాయకుల బృందం వేర్వురుగా స్థానిక రైల్వేస్టేషన్లోని 6–7 నంబర్లు ప్లాట్ఫారాల్లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సీపీఐ నేత జగదీష్ విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వేస్టేషన్ను రూ.కోట్ల ఖర్చుతో ఆధునీకరించారన్నారు. రైల్వే అధికారులు కమీషన్లు, పర్సంటేజీలకు కక్కుర్తిపడి నాసిరకం నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్ట్రును బ్లాక్లిస్ట్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. అంతకుముందు సీపీఐ నాయకుల బృందాన్ని రైల్వేస్టేషన్లోకి వెళ్లాకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్పై అధికారి అనుమతితో వారిని స్టేషన్లోపలికి అనుమతి ఇచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, రామురాయల్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. ఎలుగు దాడిలో వ్యక్తికి గాయాలు కళ్యాణదుర్గం రూరల్: ఎలుగు బంటి దాడిలో వ్యక్తి గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని మోరేపల్లికి చెందిన బాలరాయుడు తెల్లవారుజామున బహిర్బూమికి వెళ్లిన సమయంలో ఎలుగు బంటి దాడిచేసింది. ఆయన కేకలు వేయటంతో ఎలుగు బంటి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. గాయపడిన బాలరాయుడు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
● మరువపల్లిలో వంద మందికి పైగా ఆ పేర్లతోనే.. ● గ్రామమంతా వన్నూరుస్వామిని కొలుస్తున్న వైనం ● ఏ శుభ కార్యమైనా ఆలయం వద్ద చక్కెర చదివింపులు
వన్నూరప్ప అని పిలిస్తే ఆ గ్రామంలో వంద మంది పలుకుతారు. వన్నూరప్ప, వన్నూరమ్మ, వన్నూర్రెడ్డి, వన్నూరక్క ఇలా.. హజరత్ వన్నూరు వలి సాహెబ్ను కొలిచేవారందరూ ఆయన పేరే పెట్టుకున్నారు. 30 ఏళ్లు పైబడిన సుమారు 100 మంది దాకా స్వామి పేరునే పెట్టుకున్నారంటే ఆయన మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది.మరవపల్లి గ్రామం వ్యూతాడిమర్రి: మండలంలోని మరవపల్లి గ్రామంలో వెలసిన హజరత్ వన్నూరు వలి సాహెబ్ (వన్నూరు స్వామి) కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మండలంలోని మరవపల్లి గ్రామ ఇలవేల్పుగా స్వామి వెలుగొందుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపదలు, జబ్బులు రాకుండా కాపాడుతున్నాడు. దీంతో గ్రామంలో ఎక్కువ మంది స్వామి పేరు కలసి వచ్చేలా పేర్లను పెట్టుకుంటున్నారు. 200 ఏళ్ల క్రితం వెలసిన వన్నూరు స్వామి ఇప్పుడున్న మరవపల్లి గ్రామంలో 200 ఏళ్ల కిత్రం రెండు, మూడు గుడిసెలు ఉండేవట. ఆ కాలంలో ఇప్పుడున్న ఎం.అగ్రహారం గ్రామం చెరువు పనులు జరుగుతుండగా కడప జిల్లా లింగాల మండలం అంకేన్పల్లికి చెందిన కొందరు ఇక్కడ చెరువు పనులు చేస్తూ గుడిసెల్లో ఉండేవారని పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలోనే కణేకల్లు సమీపంలోని వన్నూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి గుర్రంపై తూర్పు ప్రాంతానికి యుద్ధానికి వెళ్లారట. తిరుగు ప్రయాణంలో గుడిసెల వద్ద ఆగి వేపపుల్లతో పళ్లు తోముకుని పళ్లు తోముకున్న పుల్లను ఓ చోట భూమిపై గుచ్చారని అంటున్నారు. దీంతో అక్కడ వేపమాను మహావృక్షమైందని అంటున్నారు. ఆ మహనీయుడు అక్కడే ఉన్న బావిలో ముఖం కడుక్కొని ఆయన అక్కడే పాదరక్షలు వదిలి వెళ్లిపోయారట. గుడిసెల్లో ఉన్నవారు ఆ వృక్షం వద్ద పూజలు చేస్తూ వచ్చారని, దీంతో గ్రామస్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా వన్నూరుస్వామి కాపాడుతూ వచ్చరని భక్తుల నమ్మకం. స్వామి మహిమలు ఇలా.. సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎం.అగ్రహారంలో కలరా వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కలరాతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారట. అలాంటి విపత్కర సమయంలో కూడా మరవపల్లిలో ఒక్కరికీ కూడా కలరా సోకలేదని అంటున్నారు. ఆలయం పక్కన ఉన్న బావిలో వన్నూరుస్వామి ముఖం కడుక్కోవడంతో ఆ బావిలో మహిమలు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతారు. పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన అంధురాలు లింగమ్మ జీవితంపై విరక్తితో చనిపోవాలని బావిలోకి దూకిందట. దేవుని మహిమతో ఆమె ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడిందని చెబుతున్నారు. అలాగే బావి ఒడ్డున ఉన్న అరుగుపై పలువురు పిల్లలు ఆడుకుంటూ బావిలో పడిని చిన్నపాటి గాయం కూడా కాలేదంటున్నారు. దీంతో బావి రోడ్డు పక్కన ఉన్నప్పటికీ పూడ్చకుండా అలాగే ఉంచారు. నార్పలకు చెందిన శంకరయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం తన భార్యకు ఆరోగ్యం బాగాలేక లక్షలు ఖర్చుచేసి ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జబ్బు నయం కాలేదు. చివరకు గ్రామస్తుల ద్వారా స్వామి మహిమ గురించి తెలుసుకుని భార్యాభర్తలు కొన్నాళ్లపాటు ఆలయానికి వచ్చి పూజలు చేసి, అక్కడే నిద్రించారు. దీంతో ఆమె ఆరోగ్యం కుదుట పడింది. దీంతో ఆయన అప్పటి నుంచి ప్రతి గురువారం గ్రామానికి వచ్చి 10, 20 కిలోలు చక్కెర తీసుకొచ్చి స్వామికి చదివించి వెళుతున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు వన్నూరుస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో గ్రామస్తులే పూజలు చేసేవారు. కొంత కాలంగా మరవపల్లికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన ప్రతి గురువారం స్వామికి దీపాలను వెలిగించి చక్కెర చదివించి భక్తులకు పంచి పెడతారు. అలాగే కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి పొట్టేళ్లను కొట్టి గ్రామస్తులకు పంచుతారు. కందూరి చేసినప్పుడు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఉత్సవ పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం, శుభకార్యాలు జరినప్పుడు గ్రామస్తులు ముందుగా ఆలయంలో చక్కెర చదివించి ప్రారంభిస్తారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు, శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
పుట్టపర్తి టౌన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు సర్వీసులు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ప్లాట్ఫారం, మౌలిక వసతుల కల్పన తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరుగుదొడ్ల స్థితగతులు, హోటళ్లు, సమాచార కేంద్రం, రిజర్వేషన్ కౌంటర్ల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు గురించి ప్రయాణికులనే అడిగి తెలుసుకున్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలును కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్టీసీ బస్టాండ్ను స్వచ్ఛతకు చిరునామాగా మార్చాలన్నారు. ఇందుకోసం మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలన్నారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆర్టీసీ సముదాయంలోని హోటళ్లు దుకాణాల వద్ద చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బస్టాండ్ నుంచి సర్వీసులు బయలుదేరు వేళల వివరాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీపీటీఓ మధుసూదన్, డీఎం ఇనయతుల్లా, ఏఓ ఉషారాణి, అసిస్టెంట్ మేనేజర్ హరితతో పాటు సిబ్బంది ఉన్నారు. యోగాపై అవగాహన పెంపొందించుకోవాలి ప్రశాంతి నిలయం: ప్రతి ఒక్కరూ వయసుతో పని లేకుండా యోగాసనాలపై అవగాహన పెంపొందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలసి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ప్రతి మనిషి తమ దైనందిన జీవితంలో యోగాకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకొని ఇంటింటికీ వెళ్లి యోగాపై అవగాహన కల్పించాలన్నారు. యోగా డే సందర్భంగా జూన్ 21న జిల్లాలో యోగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పుట్టపర్తిలో ఆ నెల 28న, కదిరిలో జూన్ 4 , ధర్మవరంలో జూన్ 10, పెనుకొండలో జూన్ 17న యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన -
రేషన్ పంపిణీలో అక్రమాలు సహించం
● జూన్ నుంచి రేషన్ దుకాణాల వద్దే సరుకుల పంపిణీ ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను సహించబోమని కలెక్టర్ చేతన్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలసి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాల శాఖ సీఎస్డీటీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,367 రేషన్ దుకాణాలున్నాయని, ఆయా దుకాణాల పరిధిలోని కార్డుదారులందరికీ రేషన్ సరుకులు పంపిణీ పక్కాగా జరగాలన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల వద్దే నిత్యావసరాలు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుండీ 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద ధరల పట్టిక, సరుకుల నిల్వలను సూచించే బోర్డులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, జిల్లాలోని పలువురు సీఎస్డీటీలు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే యువతకు ఉపాధి పారిశ్రామిక ప్రగతితోనే యువతకు ఉపాధి కల్పన సాధ్యమవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో పరిశ్రమల స్థాపన, సోలార్ ప్రాజెక్ట్ భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్ట్కు అవసరమైన భూసేకరణను వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలో 7,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు 35 వేల ఎకరాలు అవసరం కాగా, మడకశిర ప్రాంతంలో 25 వేల ఎకరాలు గుర్తించామన్నారు. భూసేకరణకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. రైతుల భూములు సేకరించాల్సిన చోట వారికి అవగాహన కల్పించి... అనుమతులను నివేదిక రూపంలో జూన్ 15వ తేదీలోపు సమర్పించాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, శర్మ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, సోలార్ ప్రాజెక్ట్ పీడీ శివశంకర్ నాయుడు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య
ధర్మవరం రూరల్: ధర్మవరం పట్టణంలోని శివానగర్కు చెందిన ఉడతనపల్లి లలిత (56) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తితో శుక్రవారం ధర్మవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ సీఐ పి. నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు .. మృతురాలు కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుండేది. షుగర్ వ్యాధి వల్ల ఆమె కుడి కాలు ఇన్ఫెక్షన్ అయి కాలికి ఉన్న రెండు వేళ్లను తొలగించారు. నొప్పిని భరించలేక మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లి చెరువు కట్ట వద్ద ఉన్న శివాలయం సమీపంలో చెరువులోకి దూకి చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు ధర్మవరం రూరల్: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ధర్మవరం పట్టణంలోని స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత సహకార కేంద్రం ఏర్పాటు చేసినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని తీసుకొచ్చి బదిలీలు చేస్తోందని, బదిలీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ఆన్లైన్లో అప్లికేషన్ నమోదుకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి యూటీఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సేవలు అన్ని ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రామకృష్ణనాయక్, లతాదేవి, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మేరీ వరకుమారి, ధర్మవరం డివిజన్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్కు చేరిన కిడ్నాప్ కథ తాడిపత్రిటౌన్: పట్టణంలో కేబుల్ ఆపరేటర్ యజమానుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్త యాసిన్ను కొందరు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డితో పాటు యాసిన్ తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని తనను టీడీపీ నాయకులు ధనుంజయరెడ్డి, పవన్కుమార్రెడ్డి, రామాంజులరెడ్డి, బేల్దారి ప్రసాద్ కిడ్నాప్ చేసి రూములో బంధించి ఇసుప పైపులు, కట్టెలతో చావబాదారని, గురువారం రాత్రి సమయంలో వదిలేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకొన్న తనకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వచ్చానని పేర్కొన్నారు. డిష్ గొడవలు ఉంటే యజమాన్యాలు చూసుకోవాలి కాని అందులో పనిచేసే తమకు ఏం సంబంధం ఉంటుందని యాషిన్ పోలీసుల ముందు వాపోయారు. -
ఆక్రమణల ‘తమ్ముడు’..అడిగేవారే లేరు
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆక్రమణలకు అంతేలేకుండా పోతోంది. ముఖ్యంగా బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఆ పార్టీ నేతలు ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ఇక మోతుకపల్లికి చెందిన టీడీపీ నేత చంద్రమోహన్ ఏకంగా ఆస్తులపై కన్నేసి మరీ ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నాడు. డ్రైన్ను పూడ్చేసి... చదును చేసి హిందూపురం – పరిగి ప్రధాన రహదారి కొడిగేపల్లి పంచాయతీ పరిధిలో చంద్రమోహన్కు పెట్రోల్ బంక్ ఉంది. ఈ బంకు వద్ద డ్రైన్ నిర్మించేందుకు గతంలో అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆపై కూటమి అధికారంలోకి రావడంతో చంద్రమోహన్ రెచ్చిపోయాడు. తాజాగా ఏకంగా పాత డ్రైన్ను పూడ్చి వేసి భూమిని చదును చేయించి రోడ్డునే ఆక్రమించాడు. ఆయనకు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండ ఉండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఆయన దుర్మార్గంపై కనీసం నోరు మెదపలేకపోతున్నారు. పురంలో రెచ్చిపోతున్న టీడీపీ నేత చంద్రమోహన్ డ్రైన్ వెయ్యనీయకుండా అడ్డుకుని రోడ్డు ఆక్రమణ -
‘మా ప్రభుత్వం.. మాదే రాజ్యం.. ప్రశ్నించకూడదు.. ఎదురు చెప్పకూడదు’ అన్నట్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు వ్యవహరిస్తున్నారు. వంగివంగి దండాలు పెడితే సరి.. లేకపోతే దండనకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు పంపుతున్నారు. తప్పు చేయకపోయినా కుట్ర చేసి మరీ బదిలీ బహుమాన
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా.. ముక్కుసూటిగా పని చేయడంతో పాటు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. నంద్యాల జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన్ను కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అనంతపురం జెడ్పీ సీఈఓగా బదిలీ చేసింది. డిసెంబర్ 28న ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పని చేశారు. అనతి కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. అలాంటి అధికారిని అధికార టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఎలాగైనా జిల్లా దాటించాలని కంకణం కట్టుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో సీఎం ఫొటో సరైన స్థానంలో లేదంటూ రచ్చచేసి... దానికి సీఈఓను బాధ్యున్ని చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. రామచంద్రారెడ్డిపై కక్ష ఎందుకంటే.. వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల పదవులకు ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) స్థానానికీ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్కడి ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. ‘ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయం. మా చేతుల్లో ఏమీ ఉండదు సర్’ అంటూ అక్కడి అధికారి సమాధానమిచ్చారని తెలిసింది. దీంతో జెడ్పీ సీఈఓ ద్వారా ఎన్నిక వాయిదా వేయించాలనుకున్నా... అందుకు సీఈఓ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జిల్లాలో 15 మంది డిప్యూటీ ఎంపీడీఓ(ఈఓపీఆర్డీలు)లు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు రాగా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పదోన్నతిపై మరో ఐదుగురు ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వారికి పోస్టింగ్ వేసే క్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ఎంపీడీఓగా విజయసింహారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ముందు ఎమ్మెల్యే తనయుడితో పాటు పీఏకూ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే కూతురి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే తనకు తెలియకుండా ఎంపీడీఓకు పోస్టింగ్ ఇచ్చారని ఆగ్రహించి విజయ సింహారెడ్డిని వెనక్కి పంపేశారని సమాచారం. ఈ రెండు అంశాలను మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు.. మడకశిర, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ను కలుపుకొని.. సీఈఓ రామచంద్రారెడ్డిపై కక్ష గట్టినట్లు స్పష్టమవుతోంది. మహిళా చైర్పర్సన్ చాంబర్లోకి ప్రవేశించి.. బోయ సామాజిక వర్గానికి చెందిన గిరిజమ్మ వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఆమె పదవీకాలం ఇంకా 15 నెలలు ఉంది. బీసీ కులం నుంచి వచ్చిన గిరిజమ్మ తమ అభిమాన నేత, మాజీ సీఎం జగన్ ఫొటోను తన చాంబర్లో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా తన చాంబర్లో ఏర్పాటు చేయించారు. అయితే ఈ నెల 21న జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే...ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి తదితరులు జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రజాప్రతినిధి చాంబర్లోకి దూసుకెళ్లి చంద్రబాబు ఫొటో ఎక్కడంటూ రచ్చ చేశారు. ఈ సమయంలోనే జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. గ్రూప్–1 అధికారి అన్న గౌరవం కూడా లేకుండా అవమానించారు. ఆ తరువాత మాజీ సీఎం జగన్ ఫొటోను బలవంతంగా తీయించి, గాంధీజీ ఫొటో స్థానంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టించారు. అంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కూడబలుక్కొని.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. జెడ్పీ సీఈఓపై కోపం చల్లారని ముగ్గురు ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒకే రోజు వ్యవధిలో ఆయన్ను బదిలీ చేయించి తమ పంతం నెగ్గించుకున్నారు. దీన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం తప్పుబడుతున్నారు. నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే.. అది ప్రభుత్వానికే ముప్పుగా పరిణమిస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయాలకు జెడ్పీ సీఈఓను బలిచేయడం దుర్మార్గమంటున్నారు. ఇలాగైతే జిల్లాలో పనిచేసే పరిస్థితులు ఉండవని, ఈ పరిణామాలన్నీ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతాయంటున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల దెబ్బకు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి బదిలీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సహకరించలేదని అక్కసు ఓ ఎంపీడీఓకు పోస్టింగ్ విషయంలోనూ ఎమ్మెల్యే అమిలినేని అసంతృప్తి జెడ్పీ సమావేశానికి వచ్చి చైర్పర్సన్ చాంబర్లో చంద్రబాబు ఫొటో లేదంటూ రగడ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... పోస్టింగ్ కూడా ఇవ్వకుండా కసి తీర్చుకున్న వైనం నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారంటున్న ఉద్యోగులు -
మడకశిరలో ఎలుగుబంటి హల్చల్
మడకశిర: పట్టణంలో గురువారం రాత్రి ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. అటుఇటూ తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ ఎలుగుబంటి కనిపించింది. అనంతరం అది సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో అటూ ఇటూ తిరుగుతుండగా... భయపడిన స్థానికులు పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ దాన్ని కొండ ప్రాంతంలోకి తరిమి వేశారు. గతంలో కూడా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్ల కనిపించాయి. పట్టణానికి ఆనుకుని కొండ ఉండటం, కొండపై ఉన్న ఎలుగుబంట్లు తాగునీరు, ఆహారం కోసం తరచూ పట్టణంలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు పట్టణంలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి ● విత్తన ప్రాసెసింగ్ను పరిశీలించిన డీఏఓ సుబ్బారావు ధర్మవరం రూరల్: ఖరీఫ్లో వేరుశనగ సాగుచేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) వైవీ సుబ్బారావు ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు సనావుల్లా, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్యతో కలిసి మండలంలోని విజేత అగ్రిటెక్, సాయి సీడ్స్ విత్తన వేరుశనగ ప్రాసెసింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. మొలకశాతం పరిశీలించిన తర్వాతే విత్తనాలు పంపిణీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో వేరుశనగ కాయలను నిల్వ ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా విత్తన సంచుల తూకాలు, తేమ శాతం తదితర వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ ముస్తఫా, ఏఈఓ అశ్వని, ఏపీ సీడ్స్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీజింగ్ పేరుతో 8 ఏళ్లకే సర్వీస్ పాయింట్లు అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–2014లో ఎంపికై న ఉపాధ్యాయులు 2016 జూన్లో జాయిన్ అయ్యారు. వారికి 2024 మే 31 నాటికి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే తప్పనిసరిగా బదిలీ కావాలి. 2024 లో ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు జరపలేదు. దీంతో లాంగ్ స్టాండింగ్ అయినా అదే స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటికి వారి సర్వీస్ 9 సంవత్సరాలు పూర్తయింది. అయితే ప్రస్తుత బదిలీల్లో ఫ్రీజింగ్ పేరుతో ఎనిమిది సంవత్సరాలకే పాయింట్లను కేటాయిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని 2014 డీఎస్సీ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. స్టేషన్ పాయింట్ల విషయంలో ఉపాధ్యాయుడు ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలు కేటాయించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జల శివయ్య, ప్రధాన కార్యదర్శి డేగావత్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీ కోసం పెట్టుకొనే అప్లికేషన్లో స్టేషన్ సీనియారిటీ పాయింట్లు, సర్వీస్ సీనియారిటీ పాయింట్లలో పూర్తయిన సంవత్సరాలకు మాత్రమే పాయింట్లు వస్తున్నాయన్నారు. నెలలు, రోజులకు పాయింట్లు రావడం లేదన్నారు. ఫలితంగా టీచర్లు బదిలీల్లో నష్టపోతారన్నారు. ప్రస్తుత స్టేషన్ లో ఎన్ని సంవత్సరాలు పని చేస్తే పూర్తి కాలానికి పాయింట్స్ కేటాయించాలన్నారు. నియామక జాబితాలు లేవట! డీఎస్సీ–2002కు సంబంధించిన టీచర్ల నియామక జాబితాలు డీఈఓ కార్యాలయంలో లేవని చెబుతున్నారని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, జిల్లా నాయకులు వై.ఆదిశేషయ్య, నరసింహారెడ్డి, ఆపస్ నాయకులు ఎర్రిస్వామి మండిపడ్డారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచుకోకపోతే ఎలా? అని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సందేహాల నివృత్తికి డీఎస్సీల వారీగా మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచి అడక్వసి ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీపి కబురు చెబుతోంది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈసారి ఈ నెల 26నే తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈ నెల 29 నాటికే ఉమ్మడి ‘అనంత’లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. జూన్ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్స్) అత్యంత కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదు కావాల్సి ఉంటుంది. నైరుతి వర్షాలపై గంపెడాశలు ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 7 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ కాలంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. సాధారణంగా జూన్ రెండో వారంలోనే జిల్లాకు రుతుపవనాలు అయితే ఈ సారి ఈ నెలాఖరుకే ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తల వెల్లడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ‘ఖరీఫ్’కు నైరుతి ప్రభావంతో వర్షాలు 319.6 మి.మీ సాధారణం కన్నా అధిక వర్షపాతంపై అన్నదాత ఆశలు -
21 మండలాల్లో వర్షం
ప్రశాంతి నిలయం: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ 21 మండలాల పరిధిలో 306.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గోరంట్ల మండలంలో 48.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రొద్దం మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక నల్లచెరువు మండలంలో 45.2 మి.మీ, ఓబులదేవర చెరువు 44.2, కనగానపల్లి, ఎన్పీకుంట 24.2, సోమందేపల్లి 21.4, అమడగూరు 16.4, పెనుకొండ 14.0, కొత్తచెరువు 12.8, పుట్టపర్తి 10.6, గాండ్లపెంట 9.6, బత్తలపల్లి 8.2, తలుపుల 4.2, కదిరి 4.0, తనకల్లు 3.6, ధర్మవరం, బుక్కపట్నం మండలాల్లో 3.4 మి.మీ, రామగిరి 3.2, చిలమత్తూరు 2.8, చెన్నేకొత్తపల్లి మండలంలో 1.6 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. -
ఉమ్మడి జిల్లాలో చెరువులను పూర్వస్థితికి తేవాలి
అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 507 చెరువులను పూర్వస్థితికి తేవాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణకు కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఐ అండ్ ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వ నిధులతో శ్రీ సత్యసాయి జిల్లాలో 411 చెరువులు, అనంతపురం జిల్లాలో 96 చెరువులను పూర్వస్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. చెరువులను గుర్తించి పనులకు సంబంధించి ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీకి పంపించాలన్నారు. ఇప్పటికే 29 చెరువులను గుర్తించారని, మిగిలిన చెరువులను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండమేరు పైభాగాన, మరువ వంక, నడిమి వంక పైభాగన ఉన్న చెరువులను కూడా బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, డ్వామా పీడీ సలీంబాషా, భూగర్భ జల శాఖ డీడీ తిప్పేస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, కేంద్ర భూగర్భజల బోర్డు అధికారి స్వరూప్ కళ్యాణ్, కేంద్రీయ జలసంఘం ఏడీ సీహెచ్ సంజీవ్, మైనర్ ఇరిగేషన్ ఈఈ రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం -
భూసేకరణపై రైతుల నిరసనాగ్రహం
హిందూపురం: పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ఏడాదిలో మూడు పంటలు పండే పొలాలను సేకరించేందుకు సిద్ధం కాగా రైతులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం హిందూపురం మండలం మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి, కొండూరు గ్రామాల్లో భూములు సేకరించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే ఇటీవల కొందరు అధికారులు రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా సర్వేకు సిద్ధమయ్యారు. తమ జీవనాధారమైన భూములు తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిరసిస్తూ ఆయా గ్రామాల నుంచి వందలాది మంది రైతులు బుధవారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదురుగా బైఠాయించి లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడారు. చంద్రబాబూ.. వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయకు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతే... దేశానికి వెన్నముక అంటారని, అలాంటి రైతుల పొలాలను లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను లాక్కుంటే వ్యవసాయమే జీవనాధారంగా బతికే వందలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి తలెత్తుతుందన్నారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు ఈ భూములు లేకపోతే రోడ్డున పడతామన్నారు. సమాచారం ఇవ్వకుండా సర్వే ఎందుకు మలుగూరు రెవెన్యూ పొలాల్లో రైతులకు తెలియకుండానే భూ సర్వే చేయించడమేమిటి రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. రైతులు గంటల తరబడి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే కార్యాలయంలోనికి వెళ్లారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్ కల్పించుకుని తనకు పూర్తి విషయం తెలియదని, అయితే అనుమతి లేకుండా ఎవరి భూములూ సేకరించబోమని తెలిపారు. భూసేకరణ ఏదైనా ఉంటే తప్పక తెలిజేస్తామంటూ రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తహసీల్దార్ చిలమత్తూరు ఆఫీసుకు వెళ్లారని, ఆయన వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తారని సమాధానం చెప్పారు. అయితే రైతులు దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సర్వే నిర్వహించేందుకు తహసీల్దార్ రాగా, తామే కార్యాలయానికి వస్తామని, అప్పుడే సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పుడు ఆయనే కార్యాలయంలో లేకుండా వెళ్లిపోవడం చూస్తే ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదని లేదన్నారు. తహసీల్దార్ ఏమైనా చెప్పాలనుకుంటే ఆయనే, తమ గ్రామానికి రావాలని చెప్పారు. అనంతరం తమ భూములు సేకరించవద్దని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. రైతుల నిరసనకు రైతు సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డి, ఓడీడీఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, సోమకుమార్, రవీంద్రరెడ్డి, పెద్దన్న, వెంకటరెడ్డి, అంజన్రెడ్డి, బీఎస్పీ శ్రీరాములు పాల్గొన్నారు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి మూడు గ్రామాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన రైతులు తమకు తెలియకుండానే భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యవసాయం నుంచి తమను దూరం చేయకండని వేడుకోలుభూ సేకరణను అడ్డుకున్న రైతులు లేపాక్షి: మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణను రైతులు బుధవారం అడ్డుకున్నారు. భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను వెనక్కు పంపారు. అనంతరం తమ జీవనాధారమైన భూములను సేకరించవద్దని తహసీల్దార్ సౌజన్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. -
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా! ● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి ● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’ ● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు ● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది. అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’ అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. -
నిరక్షరాస్యులైనా.. పిల్లలను చదివించుకున్నారు
అమడగూరు: అదో కుగ్రామం. అక్కడ నివసిస్తున్న వారంతా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారే. గతంలో ఒకే కుటుంబంలా ఉన్నవారు.. నేడు వంద కుటుంబాల వరకు విస్తరించారు. ఇందులో 90 ఇళ్లకు చెందినవారు గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. అమడగూరు మండలంలో పుట్టగోసులపల్లిగా పిలిచే ఊరు కాల క్రమేణా హరిపురంగా రూపాంతరం చెందింది. అన్ని కుటుంబాల్లోనూ తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తమ పిల్లలను కష్టపడి చదివించారు. ఇప్పుడు ఆ గ్రామంలో 15 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. మరో 35 మంది ప్రైవేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, మేనేజర్లుగా, సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలో ఉన్న యువతీ యువకులంతా ఉద్యోగాల కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఇంటికో ఉద్యోగమే లక్ష్యంగ్రామంలో 40 మంది యువకులతో పాటు 33 మంది యువతులు ఉండగా.. వారంతా డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్యావంతులుగా ఉన్న వారంతా తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే తపనతో అందరూ నూతన గృహాలను నిర్మించుకోవడంతో పాటు చందాల ద్వారా రూ.75 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. జేకే పల్లి పంచాయతీలో మారుమూల గ్రామంగా ఉన్న హరిపురానికి గ్రామస్తులంతా కలసికట్టుగా ఉంటూ కందుకూరిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పొగాకుతోపు నుంచి తనకంటిపల్లి మీదుగా తారు రోడ్డు వేయించుకున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో గ్రామంలోని ఇంటికో ఉద్యోగం ఉందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు చర్చించు కొంటున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
తాడిమర్రి: నిడిగల్లు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... ధర్మవరానికి చెందిన షబ్బీర్ బుధవారం ఉదయం కారులో ఎరువులు వేసుకుని దాడితోటలో ఓ రైతుకు అందించి తిరిగి ధర్మవరం వెళుతున్నాడు. నిడిగల్లు సమీపంలోని చింతతోపు వద్దకు రాగానే కారు అదపుతప్పి సోలార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగ్గానే బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలి గుంతకల్లు: ఉగ్రవాదాన్ని అంతమొందించేందకు ప్రభుత్వం కృషి చేయాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా కోరారు. బుధవారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో యాంటీ టెర్రిరిజంపై ఉద్యోగులతో డీఆర్ఎం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత పిచ్చితో ఉగ్రవాదులు చేసే దుశ్చర్యలకు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, ఆర్పీఎఫ్లు తదితరులు పాల్గొన్నారు. బాలికపై అత్యాచారయత్నం హిందూపురం: ఆరుబయట ఆడుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు విన్న స్థానికులు గమనించి అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ బాలిక ఆడుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి తినుబండారాల ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, బంధువులు గమనించి పరుగున వచ్చారు. వారిని చూసి ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసినా.. వెంటాడి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించేందుకు ఇప్పటి వరకు 20 రకాల అంశాలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. డైవర్షన్ కోసమే.. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. ఆర్డీటీకి అండగా ఉందామన్నారు. ప్రజానీకానికి ఆర్డీటీ అందిస్తున్న సేవలను ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు ఆ సంస్థ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడుదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు. -
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు పాల్గొన్నారు. -
మహిళను బలిగొన్న కరెంట్ షాక్
మడకశిరరూరల్: దిగువ అచ్చంపల్లికి చెందిన మహిళ పుష్పావతి (36) బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి ఆవరణలో సింగిల్ పేజ్ మోటార్ ఆన్ చేసి సంపు వద్ద నీటిని పట్టుకోవడానికి వెళ్లే సమయంలో పుష్పావతి కరెంట్ షాక్కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మడకశిర ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్షితకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు అమరాపురం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో హలుకూరు సమీపంలోని కేజీబీవీ విద్యార్థిని అక్షిత 600కు 586 మార్కులతో రాష్ట్రంలోనే కేజీబీవీల్లో రెండో స్థానంలో నిలిచి ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విద్యార్థినికి అవార్డును అందజేసినట్లు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. మారుమూలన, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చదువుకున్న విద్యార్థినికి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల మంత్రి ప్రశంసల జల్లు కురిపించారని పేర్కొన్నారు. ఈమె తల్లిదండ్రులు చిత్తయ్య, ఎర్రక్కలు కుందుర్పి మండలం నిజవల్లి గ్రామానికి చెందిన వారన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా కేజీబీవీ టీచర్లు, సిబ్బంది అక్షితను అభినందించారు. అదనపు కట్నం వేధింపుౖలపె కేసు హిందూపురం: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త సయ్యద్ అతావుల్లాపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల క్రితం హస్నాబాద్లో నివాసముంటున్న సానియాతో అతావుల్లాకు వివాహమైంది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు వరకట్నం తదితర కానుకలను అందజేశారు. అయినా ఇంకా అదనపు కట్నం కావాలని అతావుల్లా వేధిస్తుండటంతో భరించలేకపోయిన భార్య వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి, అతావుల్లాను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా? అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జ్ (ఎఫ్ఏసీ) ఎస్ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ఫొటోల కోసం పాకులాడటమేంటి?
అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివాటిపై పాలకులు నోరు మొదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు. -
లేపాక్షిలో జిల్లా స్థాయి యోగా దినోత్సవం
● కలెక్టర్ టీఎస్ చేతన్ లేపాక్షి: జిల్లా స్థాయి యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లేపాక్షిలో యోగా దినోత్సవ ఏర్పాట్ల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగా నంది విగ్రహం, జఠాయువు, వీరభద్రస్వామి దేవాలయ ఆవరణ, ఆర్టీసీ బస్టాండు, నవోదయ విద్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నవోదయ విద్యాలయలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి నెలరోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం నుంచి తహసీల్దార్, ప్రిన్సిపాల్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయలో యోగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ చేతన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. యోగా జీవితంలో భాగం కావాలి పుట్టపర్తి టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించే ‘యోగా మంత్’ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్ బుధవారం స్థానిక సాయి ఆరామంలో ప్రారంభించి యోగాసనాలు వేశారు. ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. -
శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారు మంగళవారం శ్రీగంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేకువ జామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీగంధం అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త వేద పారాయణం, శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాల అనంతరం మన్యుసూక్త హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా చూడాలని కోరారు. డీఎంఈ నరసింహం -
టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగం ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది. టీచర్ల బదిలీలకు వేళాయె ● నేటి నుంచి హెచ్ఎంల బదిలీలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్హెచ్ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. హెచ్ఎం పోస్టులు 178 ఖాలీలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లో రెండేళ్లు పూర్తయిండాలి) కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశంఅనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి మంగళవారం సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. -
అధినేతతో రామగిరి ఎంపీటీసీల భేటీ
రామగిరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన రామగిరి మండల ఎంపీటీసీ సభ్యులు మంగళవారం కలిశారు. రామగిరి ఎంపీపీ స్థానాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సాగిస్తున్న కుట్రను భగ్నం చేస్తూ ఎన్నికకు ఎంపీటీసీలందరూ గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామగిరి మండలంలో నెలకొన్న పరిస్థితులను వారు వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యులు సుజాతమ్మ, భారతి, వెంకటలక్ష్మమ్మ, ఆదిలక్ష్మి, బాలకొండయ్య, సాయిలీల, వైఎస్సార్సీపీ నాయకులు జయచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, శంకరయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
దీక్షిత్.. కొట్టాడు ఐఎఫ్ఎస్
అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు. మధ్య తరగతి కుటుంబం.. పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా... దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు. ఇంట్లో ఉంటూ చదువుకుని.. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్తో దీక్షిత్కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో ...ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు. కష్టాన్ని మరిపించిన ఫలితం.. యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు. మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటిన అమరాపురం యువకుడు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 30వ ర్యాంకు కై వసం అమ్మానాన్నకు అంకితం ఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్ -
‘సూర్యఘర్’తో విద్యుత్ బిల్లు ఆదా
పుట్టపర్తి టౌన్: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటిపై కప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు ఆదా అవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సాయిఆరామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం సోలార్ విద్యుత్ స్టాల్స్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు కరెంట్ ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకొని విద్యుత్పొదుపుతో పాటు బిల్లులు కూడా తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యుత్ శాఖ డీఈలు శివరాములు, మోసస్పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘పల్లె’వించిన కక్ష రాజకీయం
సాక్షి, పుట్టపర్తి: ఆయనో విద్యాధికుడు...కొన్నేళ్ల పాటు పిల్లలకు పాఠాలు చెప్పారు. కానీ రాజకీయంలోకి దిగాక కొత్త పాఠం నేర్చుకున్నారు. ప్రశ్నిస్తే బెదిరించడం... ఎదురొస్తే దాడులు చేయించడం ద్వారా తనకు ఎదురేలేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమిలోని జనసేన, బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. ‘ఇది కూటమి ప్రభుత్వం... మేమంతా ఒక్కటే’ అంటూ ఆయా పార్టీల నేతలు ఊరూరా చెప్పుకుంటూ తిరుగుతుండగా... పుట్టపర్తిలో మాత్రం ‘పల్లె’ మిత్రపక్షాల నేతలను టార్గెట్ చేశారు. అధికారం అడ్డు పెట్టుకుని.. పోలీసులతో రాజకీయం చేస్తూ కేసులు, అరెస్టులు అంటూ బీజేపీ, జనసేత నేతలను నిత్యం వేధిస్తున్నారు. తమ ప్రభుత్వంలో తమపైనే దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. బీజేపీ నేతలపై కక్ష సాధింపు.. పెనుకొండ సమీపంలోని ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద గతంలో తన అనుచరులు, స్నేహితులను కలుపుకుని వందల ఎకరాల భూమి కొన్నారు. ఆ తర్వాత విలువ ఆధారంగా పంపకాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వాటాల్లో తేడా కారణంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అడ్డం తిరిగినట్లు ఆరోపణలున్నాయి. కొందరు అల్లరిమూకలను రెచ్చగొట్టి.. పదే పదే రోడ్లు ధ్వంసం చేయించడం.. బీజేపీ నేత ఆదినారాయణయాదవ్పై కేసు నమోదు చేయించడం పనిగా పెట్టుకున్నాడు. సుమారు రూ.80 కోట్లు విలువ చేసే భూమిని పల్లె రఘునాథరెడ్డి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆదియాదవ్ ఆరోపిస్తున్నారు. గత ఆర్నెల్లుగా ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన నేతను చితకబాదించి.. అమడగూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు పసుపులేటి రమేష్పై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కక్షగట్టారు. ‘పల్లె’ అవినీతికి సంబంధించిన సమాచారం మొత్తం తన వద్ద ఉందని రమేష్ చెప్పడంతో.. పల్లె భయపడిపోయినట్లు సమాచారం. అవన్నీ ఎక్కడ దాచారో చెప్పేవరకు చితకబాదాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై గతంలో పల్లె రఘునాథరెడ్డి చేసిన వ్యాఖ్యలను పసుపులేటి రమేష్ ఖండించినందుకే ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అక్కడి నుంచి రమేష్పై కక్ష సాధింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే షరతులతో కూడిన బెయిల్పై బయటికి వచ్చిన రమేష్ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్టు చూపలేదు. దీంతో అతని తండ్రి ‘నా కొడుకు ఆచూకీ తెలపండి స్వామీ, నా కొడుకు ఏమైపోయాడో అని అన్నహారాలు మాని ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆవేదన చెందుతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత్రికేయులకూ బెదిరింపులు.. తన అవినీతి బాగోతాలన్నీ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చిన పాత్రికేయులపైనా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొందరు అల్లరి మూకలతో భౌతికదాడి చేయించేందుకు కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ పత్రికా ప్రతినిధిపై కక్ష గట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ‘పల్లె’ కనుసన్నల్లోనే పోలీసులు.. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతోనే పోలీసు వ్యవస్థ నడుస్తోందనే విమర్శలున్నాయి. ఎలాంటి హోదా లేకున్నా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పోలీసులతో సెల్యూట్ చేయించుకుంటున్నారు. ఎలాంటి కేసయినా సరే తనకు చెప్పిన తర్వాతే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తనమాట వినని ఓ ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పుట్టపర్తిలో బీజేపీ, జనసేన నేతలను టార్గెట్ చేసిన ‘పల్లె’ ఎదురొస్తే తాట తీయిస్తానంటూ బెదిరింపులు ఇప్పటికే బీజేపీ నేత ఆదియాదవ్కు ఇబ్బందులు తాజాగా జనసేన నేత పసుపులేటి రమేశ్ అరెస్టు మాజీ మంత్రి దెబ్బకు అల్లాడిపోతున్న కూటమి నేతలు -
కేబుల్ దొంగల అరెస్టు
పావగడ: తిరుమణి సోలార్ పార్క్కు చెందిన వళ్లూరు గ్రామం అవధా సోలార్ ప్లాంట్లో కేబుల్ అపహరించిన దొంగలు పోలీసులకు చిక్కారు. రూరల్ సీఐ గిరీశ్ వివరాల మేరకు.. జనవరి 20న రాత్రి అవధా సోలార్ కంపెనీ సోలార్ ప్యానల్కు ఏర్పాటు చేసిన సుమారు రూ .2 లక్షల విలువ చేసే సుమారు 2,500 మీటర్ల డీసీ కేబుల్ వైరు చోరీకి గురైందన్నారు. దొంగతనానికి పాల్పడ్డ పావగడ పట్టణంలోని ఆఫ్ బండ ప్రాంతానికి చెందిన చోరులు మల్లేష్ అలియాస్ మల్లికార్జున, బాబు అలియాస్ బాబురావ్, మంజ అలియాస్ అణ్ణప్పలను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి డీసీ కేబుల్తో దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నాగరాజును త్వరలో పట్టుకుంటామన్నారు. -
నీట మునిగి వ్యక్తి మృతి
లేపాక్షి: మండలంలోని చోళసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగానిపల్లికి చెందిన శివప్ప(56) నీట మునిగి మృతిచెందాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న నీటి కుంట వద్దకు బహిర్భూమి కోసం వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. శివప్పకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.‘బెట్టింగ్’ అప్పులు తీర్చలేక యువకుడి పరారీబత్తలపల్లి: ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యువకుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇల్లు విడిచి పారిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామానికి చెందిన చింతపంటి చెన్నారెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి ఆన్లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో బెట్టింగ్కు పెట్టుబడుల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ అప్పులకు వడ్డీల భారం పెరగడంతో తీర్చలేక ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. బంధువులు, సన్నిహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి చెన్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.విద్యుదాఘాతంతో గేదె మృతిచెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం గేదె మృతి చెందింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఓబుగారి సుబ్బిరెడ్డి పాడి పెంపకంతో కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పచ్చగడి పెరగడంతో మేత కోసం రెండు గేదెలను గ్రామ నడిబొడ్డులో ఉన్న బయలు ప్రాంతానికి వదిలాడు. గేదెలు పచ్చగడ్డిని మేస్తూ ఉండగా అందులో ఒక గేదె సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభానికి ఏర్పాటు చేసిన స్టే వైర్ను తాకింది. స్టేవైర్కు విద్యుత్ ప్రసరించడంతో గేదె షాక్తో అక్కడి కక్కడే మృతి చెందింది. ఘటనలో రూ.80 వేలు నష్టపోయినట్ల బాధితుడు వాపోయాడు.వ్యక్తిపై కేసు నమోదుగార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
ముగిసిన పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తులను భారీ ఊరేగింపుతో ఆమిద్యాల గ్రామానికి తరలించారు. ఉదయం ఆలయంలో స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనృసింహుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీలో ఆమిద్యాలకు తరలించారు. ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబుళేసుడి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడ కొలువుదీర్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకేరమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు. హుండీ కానుకల లెక్కింపు.. పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ కానుకలు మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి పాండురంగారెడ్డి, దేవదాయ శాఖ పర్యవేక్షణ అదికారులు వన్నూరుస్వామి, కె.రాణి, ఆలయ ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో కానుకలు లెక్కించారు. 13 రోజులకు గాను కానుకల రూపంలో రూ.15.85 లక్షలు, అన్నదానం హుండీ ద్వారా రూ.8,212 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లుకు చెందిన హనుమాన్ సేవా సమితి, ఉరవకొండ షిర్డీ సాయి ఆలయం, అనంతపురం ఫస్ట్రోడ్డు శివాలయం సేవా సమితి వారు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
ప్రశాంతి నిలయం: ‘‘పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలంతా రోగాలకు దూరంగా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలి. ఎంపీడీఓలంతా ఈ కార్యక్రమాలు పర్యవేక్షించాలి. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించలేది లేదు. కఠిన చర్యలకూ వెనుకాడబోం’’ అంటూ కలెక్టర్ చేతన్ ఎంపీడీఓలను హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ‘నీరు–మీరు’ అనే థీమ్తో నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలు, బహిరంగ ప్రదేశాల్లోని నీటి సేకరణ నిర్మాణాలను శుభ్రపరచడంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటి సేకరణను ఉపయోగించుకోవడానికి ఈ మూడు వారాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు, భూగర్భ జల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ 100 శాతం జరగాలన్నారు. లేపాక్షి, హిందూపురం, రొళ్ల, అగళి, నల్లమాడ, తనకల్లు, కొత్తచెరువు మండలాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి పైప్లైన్ లీకేజీ కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా చెత్త సేకరణ, రవాణాకు ఉపయోగించే పరికరాలు నిరుపయోగంగా ఉండకూడదన్నారు. సమావేశంలో డీపీఓ సమత, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జునప్ప, గ్రామ/వార్డు సచివాలయాల నోడ్ అధికారి సుధాకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి పడేలా పథకాలు అమలు చేయాలి.. సంక్షేమ పథకాలు ప్రజలు సంతృప్తి పడేలా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ మెరుగుదలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయాలన్నారు. అన్న క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ‘దీపం’ పథకం కింద గ్యాస్ డెలివరీకి అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్ స్వచ్ఛతా కార్యక్రమాలతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశం -
అన్నదాతలకు వ్యథ
వ్యవసాయం భారం తలుపుల: వ్యవసాయ రంగాన్ని రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతులపై పెట్టుబడుల భారం పెరిగిపోతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా పొలం పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలన్న నీతి అయోగ్ ఆలోచన ఎనిమిదేండ్లు అవుతున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేక పోతోంది. దీంతో కూలీల కొరత కారణంగా పంటల సాగు వ్యయం పెరిగి.. వ్యవసాయం భారమవుతోంది. కూలీల కొరత తీవ్రం.. కూలీలు ఎక్కువగా ఉపాధి పనులకు పోతుండడంతో వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేయలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,69,152 హెక్టార్లలో సాగు భూమి ఉండగా... వేరుశనగ, వరి, మొక్కజొన్న, మిరప,బొప్పాయి, కర్బూజా, టమాటా తదితర పంటలు సాగుచేస్తున్నారు. సాధారణగా ఖరీఫ్ సీజన్లో వరి సాగుకు ఎకరాకు రూ.25 వేలు ఖర్చు అవుతుంది. అలాగే మొక్కజొన్న, మిరప, వేరుశనగ తదితర పంటలకూ అంతే మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని రైతులు అంటున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే వారికి భోజనంతో పాటు రోజుకి ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తామన్నా.. కూలీలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనుల వైపే కూలీలు మొగ్గు చూపుతుండడంతో వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు ఆర్థిక ప్రయోజనాలూ చేకూరుతాయని మేధావులు అంటున్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రైతులూ కోరుతున్నారు. జిల్లా సమాచారం... జిల్లాలో సాగుభూముల విస్తీర్ణం : 2,69,152 హెక్టార్లు ప్రధానంగా సాగు చేసే పంటలు : వేరుశనగ, వరి, మామిడి, ఉలవ, టమాట తదితర పంటలు ఉపాధి కూలీల సంఖ్య : 55,857 -
కోల్డ్స్టోరేజ్లో కుళ్లిన బ్యాడిగ మిర్చి
కూడేరు: కర్ణాటక రాష్ట్రం బ్యాడిగికి చెందిన కోల్డ్స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతు మల్లికార్జున నష్టపోయాడు. ఇప్పేరుకు చెందిన రైతు మల్లికార్జున సోమవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఎకరాల్లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి బ్యాడిగ మిర్చి సాగు చేశానన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఏప్రిల్ నెలలో బ్యాడిగిలో కోల్డ్ స్టోరేజ్లో 60 క్వింటాళ్ల మిర్చిని నిల్వ ఉంచానన్నాడు. క్వింటా రూ.15 వేలు వరకు ధర ఉండడంతో రెండు రోజులు క్రితం కోల్డ్ స్టోరేజ్కు వెళ్లి విక్రయించేందుకు వెళ్తే నిల్వ ఉంచిన మిర్చి కుళ్లిపోయిందన్నారు. సరుకు నాణ్యతగా లేకపోవడంతో క్వింటా రూ.4 వేలుతో వ్యాపారులు అడుగుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.9 లక్షలు వరకు వచ్చేదని, కోల్డ్స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయానని రైతు వాపోయాడు. -
కోర్టు తీర్పును అమలు చేయండి
● మత్స్యకార సహకార సంఘం సభ్యుల వినతి పుట్టపర్తి అర్బన్: కోర్టు తీర్పును అమలు చేసి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీని వెంగళమ్మచెరువు మత్స్యకార సహకార సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు కోర్టు తీర్పు నకళ్లను సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వేర్వేరుగా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నను కలసి అందజేసి, మాట్లాడారు. సంఘంలో మొత్తం 41 మంది సభ్యులు ఉండగా తమ గ్రామానికి చెందిన చెరువులో చేపలు పట్టనీయకుండా టీడీపీకి చెందిన సభ్యులు అడ్డుకున్నారని, దీంతో కేవలం 25 మంది మాత్రమే చేపలను పడుతూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా మత్స్యకార సహకార సంఘం అధికారులకు, పుట్టపర్తి రూరల్ పోలీసులకు విన్నవించినా తమకు న్యాయం జరగలేదన్నారు. వదిలిన చేపలను పట్టుకోనీయకుండా అడ్డుకోవడంతో మిగిలిన 16 మంది సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో చేపలు పట్టేందుకు హక్కు కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు చేపలు పట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాల ప్రహరీ కూల్చివేత గోరంట్ల: స్థానిక ఆస్పత్రిలో సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీని టీడీపీ మద్దతుదారులు శివప్ప, బాలచందర్ ఆదివారం జేసీబీలను ఏర్పాటు చేసి కూల్చివేశారు. పాఠశాల ఎదుట శివప్ప, బాలచందర్ పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో తమ సొంత స్థలంలో ప్రహరీ నిర్మించారంటూ దాదాపు 50 మీటర్లకు పైగా గోడను నేలమట్టంచేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తహసీల్దార్ మారుతీ ప్రసాద్ను వివరణ కోరగా... పట్టా స్థలంలో కొంత మేర ఆక్రమించి పాఠశాల ప్రహరీ నిర్మించారని, దీనిని తొలగించాలని ఇటీవల కలెక్టర్కు గ్రీవెన్స్లో బాలచందర్ ఫిర్యాదు చేశారన్నారు. సర్వే చేసిన తర్వాత పాఠశాల హద్దు మేరకు నూతనంగా ప్రహరీ నిర్మించిన తర్వాత పాత గోడను తొలగించి ఇస్తామని ఫిర్యాదుదారుకు తెలిపామన్నారు. ఈ లోపు శివప్ప, బాలచందర్ ఏకంగా 50 మీటర్ల ప్రహరీని తొలగించారని, దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువకుడి బలవన్మరణం గోరంట్ల: మండలంలోని బూచేపల్లికి చెందిన చరణ్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం సొంతూరిలోనే వివాహం చేసుకున్న చరణ్... కుటుంబకలహాలతో విసుగు చెంది ఆదివారం రాత్రి పొద్దుయిన తర్వాత గ్రామంలోని నీటి ట్యాంక్ సమీపంలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, చరణ్ గతంలో వలంటీర్గా బూచేపల్లి గ్రామంలో పనిచేశారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైలు కిందపడి వృద్ధురాలు.. హిందూపురం: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆంజినమ్మ(69) సోమవారం సాయంత్రం ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు రైల్వే ఎస్ఐ సజ్జప్ప తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ లభ్యం ధర్మవరం అర్బన్: స్థానిక లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని కురుబ కల్యాణమంటపం వెనుక ఉన్న పట్టాలపై ఆదివారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడిని ధర్మవరంలోని సిద్దయ్యగుట్టకు చెందిన శ్రీనివాసులు (63)గా గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ ఎర్రిస్వామి సోమవారం వెల్లడించారు. బార్బర్ వృత్తితో జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా తరచూ అనారోగ్యం వెన్నాడుతుండడంతో జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయిందన్నారు. మృతుడి భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో చోటు పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ విభాగాల్లో చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రెటరీగా కదిరి నియోజకవర్గానికి చెందిన పూల ప్రవీణ్కుమార్రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రెటరీగా హిందూపురం నియోజక వర్గానికి చెందిన అక్కంపల్లి నాగేంద్రకుమార్ను నియమించారు. పాఠశాలపై కూలిన చెట్టు సోమందేపల్లి: మండలంలోని వెలిదడకల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలపై చెట్టు కూలింది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో పాటు గాలులు బలంగా వీచడంతో చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు పడడంతో పాఠశాల భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
డ్రైప్రూట్స్ అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని రెండో రోజు డ్రైప్రూట్స్తో అలంకరించారు. సోమవారం వేకువజామునే ఆలయంలో మూలవిరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మంటపంలో కొలువుదీర్చి తమలపాకులతో లక్షార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. సజావుగా సప్లమెంటరీ పరీక్షలు పుట్టపర్తి: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలి రోజు తెలుగు పరీక్ష సజావుగా జరిగినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు 1,554 మంది పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా 1,135 మంది హాజరయ్యారన్నారు. నకిలీ అక్రిడిటేషన్ వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్ అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్నాయక్ కోసం గాలిస్తున్నారు. -
ఉన్నతాధికారులు వేధిస్తున్నారు
పుట్టపర్తి టౌన్: పైస్థాయి ఉద్యోగుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కన్నీటి పర్యంతమైంది. వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ రత్నను కలసి విన్నవించుకుంది. వివరాలు... లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన ప్రభావతి హిందూపురంలోని ఆర్టీసీ డిపోలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో అదే డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు డి.వి.నారాయణ, భరత్కుమార్రెడ్డి, జీవీ రమణ తరచూ ఆమెను లైగింక వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. వారి కోరిక తీర్చకపోవడంతో ఉద్యోగ పరంగా ఇబ్బందులు పెట్టసాగారు. ఈ విషయంపై గతంలో హిందూపురం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. విచారణ పేరుతో కాలయాపన చేసిన పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. చివరకు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తనను కాపాడాలంటూ బాధితురాలు సోమవారం ఎస్పీని కలసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే హిందూపురం డీఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి.. బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ సురేస్ పాల్గొన్నారు. న్యాయం చేయాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేడుకోలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీకి వినతి -
వైభవంగా వసంతోత్సవం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీవారు పదోరోజు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, వసంతోత్సవం, కంకణ విసర్జన, చక్రస్నానం, మహా మంగళహారతి తదితర పూజలు చేశారు. ఉదయం ఆలయం వద్ద నుంచి లక్ష్మీబజారు వరకు వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం సాయంత్రం మయూర వాహనంపై దేవేరులతో శ్రీవారిని ప్రత్యేక రథంపై ఆశీనులు చేసి పురవీధుల్లో ఊరేగించారు. విశ్వ హిందూ పరిషత్, రజక సంఘం, హరిజన, మాల, హట్కారి కెత్తర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మయూర వాహన సేవ కొనసాగింది. చివరి రోజు మంగళవారం సప్తప్రాకారోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. -
పోలీసుల అత్యుత్సాహం..
సాక్షి, పుట్టపర్తి/గాండ్లపెంట/కదిరి టౌన్: అధికార మదంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. మండల పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి తమ పార్టీ తరఫున ఒక్క ఎంపీటీసీ ఉన్నప్పటికీ బరిలో నిలిచి.. ప్రత్యర్థి పార్టీలోని సభ్యులను బెదిరించి ఓట్లు వేయించుకుని పీఠం కైవసం చేసుకున్నారు. ప్రలోభాలు, డబ్బులు, పదవులు ఆఫర్ చేసి.. వినకుంటే బెదిరించి తమ వైపు తిరిగేలా చేశారు. అక్రమ కేసులు, దాడుల భయం చూపి పార్టీ ఫిరాయించేలా చేసి.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను దక్కించుకున్నారు. అధికార మదంతో అధికారులను అడ్డు పెట్టుకుని మెజారిటీ లేకున్నా.. గెలిచినట్లు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి పరోక్షంగా.. ప్రత్యక్షంగా సహకరిస్తూ వంతపాడారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ గూండాలు మీడియా ప్రతినిధులను సైతం అడ్డుకుని వెనక్కుపంపారు. పైగా.. నిబంధనలను తుంగలో తొక్కి పోలీసులు రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లడం విమర్శలకు దారి తీస్తోంది. ఒక్క సీటుతో చక్రం.. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలుండగా, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలు దక్కించుకోగా, టీడీపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నాయకులు ఎంపీపీ పీఠంపై కన్నేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. దీంతో ముగ్గురు టీడీపీ కండువా కప్పుకున్నారు. సోమవారం జరిగిన ఎన్నికను ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు (వైఎస్సార్ సీపీ) బహిష్కరించారు. మిగతా నలుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు. టీడీపీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎంపీటీసీ సభ్యుడు (సోమయాజులపల్లి) జయరామిరెడ్డి ఎంపీపీగా సోమశేఖరరెడ్డి పేరును ప్రతిపాదించగా, మలమీదపల్లి ఎంపీటీసీ సభ్యురాలు భారతి బలపరిచారు. దీంతో ఎంపీపీగా సోమశేఖరరెడ్డి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కాగా, ఎంపీపీ పదవి ఆఫర్ చేసి ముగ్గురు ఎంపీటీసీలను లాక్కున్న టీడీపీ నేతలు...అందులో కేవలం ఒకరికి మాత్రమే పదవి కట్టబెట్టి.. మిగతా ఇద్దరికీ మొండిచెయ్యి చూపారు. ఫిరాయింపు ఓట్లతో మున్సిపాలిటీ కై వసం.. కదిరి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 30 స్థానాల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకోగా, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైర్మన్గా నజీమున్నీసా, వైస్ చైర్మన్లుగా కొమ్ముగంగాదేవి, రాజశేఖర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరగానే టీడీపీ నాయకులు మున్సిపల్ పీఠంపై కన్నేశారు. కేవలం ఐదుగురు సభ్యులతో చైర్మన్ గిరీ కోసం నిసిగ్గురాజకీయానికి తెరతీశారు. బరితెగించి...భయపెట్టి పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని పచ్చకండువా వేశారు. అవిశ్వాస తీర్మానం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లను దించేశారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించగా... మున్సిపల్ చైర్పర్సన్గా టీడీపీకి చెందిన దిల్షా దున్నీషా, వైస్ చైర్మన్లుగా 21వార్డు కౌన్సిలర్ సేగు సుధారాణి, 19 వార్డు కౌన్సిలర్ మద్దేపల్లి రాజశేఖర ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో ఆర్డీఓ వీవీఎస్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ అప్రజాస్వామ్య ఎన్నికను నిరసిస్తూ వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు బహిష్కరించారు. రామగిరిలో అభ్యర్థి లేకున్నా.. రామగిరి మండలంలో మొత్తం 10 స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఎంపీపీగా పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకున్నా.. ప్రలోభాలతో పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత భావించారు. అయితే కోరం లేక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక సోమవారం మళ్లీ నిర్వహించారు. రిజర్వేషన్ ప్రకారం ఎంపీపీ స్థానం మహిళకు కేటాయించడం... టీడీపీ తరఫున మహిళలెవరూ విజయం సాధించకపోవడంతో టీడీపీ డైలమాలో పడింది. వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీటీసీలను భయపెట్టి, పదవులు, డబ్బులు ఆఫర్ చేసి ఎంపీపీ సీటు కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు ఏ ఒక్కరూ ఎన్నికకు రాలేదు. దీంతో అభ్యర్థి లేరని.. ఎన్నికను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారి సంజీవయ్య ప్రకటించారు. రామగిరి వైస్ సర్పంచ్పై రౌడీషీటర్ దాడి.. ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో రామగిరికి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బోయ రామాంజినేయులపై రౌడీషీటర్ శివకుమార్ తన అనుచరులతో కలసి సోమవారం దాడి చేశాడు. టీ తాగేందుకని ఓ హోటల్కు వెళ్లగా సమీపంలో ఉన్న 30 మంది టీడీపీ శ్రేణులు ఒక్క సారిగా శివకుమార్ ఆధ్వర్యంలో రామంజినేయులును చుట్టముట్టారు. ‘‘ఇక్కడ నీకేం పని’’ అని ప్రశ్నిస్తూ పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయినా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఎంపీటీసీ సభ్యులతోపాటు ఎన్నికల అధికారులు, మీడియా సిబ్బందికి మాత్రమే హాలులోకి అనుమతి ఉంది. పోలీసులు సైతం ఎన్నిక గది బయటే విధులు నిర్వర్తించాలి. అయితే ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలోతొక్కి ఏకంగా ఎన్నిక జరిగే గదిలోకి ప్రవేశించి వీడియోలు తీయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక వివాదాస్పద రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పదే పదే పోలీసులకు సలహాలు, సూచనలిస్తూ హడావుడి చేయడం గమనార్హం. అయినా ఎన్నికల అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. గాండ్లపెంట ఎంపీపీ గజ్జల సోమశేఖరరెడ్డి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ దిల్షాదున్నీషా మండల పరిషత్ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు బలం లేకున్నా గాండ్లపెంట ఎంపీపీ టీడీపీ కై వసం కదిరి మున్సిపాలిటీలోనూ ఫిరాయింపు రాజకీయం సీట్లు లేకున్నా.. బెదిరింపులతో పదవులు దక్కించుకున్న టీడీపీ రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం మహిళా అభ్యర్థి లేకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా -
ముందస్తు మురిపెమేనా?
పుట్టపర్తి అర్బన్: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా చెరువుల్లో నీరు చేరింది. అయితే ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులను వర్షాలు ఊరిస్తుండగా...సాగుకు ముందుకు సాగలేకపోతున్నారు. కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటన్న సందిగ్ధంలో మునిగిపోయారు. గత ఏడాదీ మురిపించి... ఆపై ముంచేసి జూన్ సాధారణ జిల్లా వర్షపాతం 66 మి.మీ కాగా, గత ఏడాది ఏకంగా 100 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో విత్తనాలు వేశారు. అయితే ఆ తర్వాత దాదాపు 52 రోజులు చుక్కవర్షం లేదు. దీంతో విత్తనం మొలకెత్తలేదు. రైతులు అప్పులు చేసిన పెట్టిన పెట్టుబడులు నేలపాలయ్యాయి. తాజా వర్షాలు ఊరిస్తున్నా... ఖరీఫ్లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాస్తవానికి మే నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ వర్షపాతం కాగా, ఇప్పటివరకూ 94 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షసూచన చెబుతున్నారు. అలాగే కీలకమైన నైరుతీ రుతుపవనాలు ఈ సారి ముందస్తుగానే అంటే ఈనెల 27న కేరళను తాకుతాయని వారం కిందటే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. అలాగే రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉన్నందు ఇంకా ముందుగానే అంటే 24న కేరళను తాకవచ్చని తాజాగా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెలాఖరుకు జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. తాజా వర్షాలతో రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నా...గత ఏడాది పరిస్థితి గుర్తు తెచ్చుకుని సందిగ్ధంలో పడిపోయారు. ఇక ఈ వర్షాలకే విత్తు వేసేందుకు కొందరు రైతులు ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం నేటికీ విత్తన పంపిణీపై దృష్టి సారించలేదు. పోనీ మార్కెట్లో విత్తనం కొని వేద్దామంటే ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటని రైతుల మనసులను తొలుస్తోంది. 29 మండలాల పరిధిలో వర్షం.. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిలాల్లోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా గుడిబండల మండలంలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. తనకల్లు 50.6, నల్లచెరువు 45.4, తలుపుల 28.2, నల్లమాడ 19.8, మడకశిర 19.6, రొళ్ల 18.2, అమడగూరు 17.6, అమరాపురం 15.6, ముదిగుబ్బ 14.6, అగళి 14.4, గాండ్లపెంట 13, గోరంట్ల 12.2, రొద్దం 10.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ 10.6 మి.మీ నుంచి 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. రానున్న రెండు రోజులూ ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాలు సందిగ్ధంలో పడిన రైతులు అదనులో వరుణుడు ముఖం చాటేస్తాడేమోనని ఆందోళన నేటికీ విత్తన పంపిణీ చేపట్టని కూటమి సర్కార్ -
జంట హత్యల కేసులో ఆరుగురి అరెస్టు
రాప్తాడు: రైతు దంపతుల హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడు పీఎస్లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. భూ వివాదమే కారణం.. గంగలకుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 78–3లో 6.20 ఎకరాల భూమిని ఎకరాకు రూ.56.50 లక్షల చొప్పున కొనుగోలు చేసేలా రాప్తాడుకు చెందిన నీరుగంటి పుల్లమ్మ, అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరుకు చెందిన నాగలక్ష్మమ్మ, బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన వెంకటలక్ష్మికి రూ.79 లక్షలు చెల్లించి రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల కొండప్ప, పామల్ల ఇంద్రశేఖర్, గోనిపట్ల శీన, పామల్ల పండయ్య, గొల్లపల్లి జగదీష్, లక్ష్మీనారాయణ, నంద కుమార్, బుల్లే నగేష్ 2024 సెప్టెంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. హతుడు చిగిచెర్ల నారాయణ రెడ్డి తండ్రి చిగిచెర్ల నారాయణరెడ్డి నుంచి 1997లో ఎకరా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.93 వేలతో కొనుగోలు అగ్రిమెంట్ను పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మమ్మ రాయించుకున్నారు. అయితే చిగిచెర్ల నారాయణరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించకుండా ఉండడంతో ముగ్గురు మహిళలు కోర్టులో దావా వేశారు. 2012లో కోర్టులో ముగ్గురు మహిళల పక్షాన డిక్రీ చేస్తూ వాళ్ల పేరుపై కోర్టు రిజిస్ట్రేషన్ చేయిం చింది. అనంతరం ఇదే భూమిని చిగిచెర్ల నారాయణ రెడ్డి తన బావ ఓబిరెడ్డి ద్వారా అతని భార్య నారాయణమ్మకు చెందుతుందని కోర్టులో దావా వేయించాడు. ఈ వివాదంపై 2022లో ముగ్గురు మహిళలకు భూమి చెందుతుందని కోర్టు తీర్పు వెలువరించగా.. దీన్ని సవాల్ చేస్తూ నారాయణ రెడ్డి అదే ఏడాది ఫ్యామిలీ కోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ప్రస్తుతం ఆ భూమిలో నారాయణరెడ్డి దానిమ్మ చెట్లు సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో భూమిని తమ పేరుపై మ్యుటేషన్ చేయాలని ముగ్గురు మహిళలు ఈ ఏడాది హైకోర్టులో పిల్ వేయగా.. సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్డీఓకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివాదం కొలిక్కి రాకనే.... వివాదం కొలిక్కి రాకనే ముగ్గురు మహిళల నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు నెల రోజుల క్రితం మళ్లీ సదరు మహిళలకు రూ.1.01 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఓ సిఫారసుల మేరకు సదరు భూమిని ఆన్లైన్లో నారాయణరెడ్డి పేరు తొలగించి ముగ్గురు మహిళల పేరు ఎక్కించాలని గత నెల 29న డీఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ నారాయణరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే డీఆర్ఓ ఆదేశాల మేరకు గత నెల 14న నీరుగంటి పుల్లమ్మ పేరును రాప్తాడు తహసీల్దార్ ఆన్లైన్లో ఎక్కించారు. 16న పామల్ల ధనుంజయ, పామల్ల కొండప్ప, గోనిపట్ల శీన, పామల్ల పండయ్య, హనుమంతరెడ్డి, బాల నరసింహరెడ్డి, నిరంజన్రెడ్డి, పుల్లమ్మ, నాగలక్ష్మమ్మ, దండు నరేంద్ర, గొల్లపల్లి జగదీష్, గంగలకుంట లక్ష్మీనారాయణ, బుల్లె నగేష్ సదరు పొలం దగ్గరికి వెళ్లి నారాయణరెడ్డి, ఆయన భార్య ముత్యాలమ్మను భూమిలోకి కాలు పెడితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నెల 17న ఉదయం 9.30 గంటలకు జేసీబీతో పొలంలో దానిమ్మ చెట్లను తొలగిస్తుండగా నారాయణరెడ్డి, ముత్యాలమ్మ, వారి కుమారుడు ప్రదీప్కుమార్ రెడ్డి, బావమరిది ప్రతాప్రెడ్డి, శంకర్రెడ్డి, వెంగల్రెడ్డి తదితరులు అక్కడకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న వేటకొడవళ్లు, కట్టెలతో ముత్యాలమ్మ, నారాయణరెడ్డిపై విచక్షణారహితంగా దాడికి తెగబడడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రతాప్రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారం గంగలకుంట క్రాస్ వద్ద పామల్ల ధనుంజయ, ఇంద్రశేఖర్, నిరంజన్రెడ్డి, దండు నరేంద్ర, బుడగ లక్ష్మీనారాయణ, కందుకూరుకు చెందిన దయ్యం హనుమంతరెడ్డిని అరెస్ట్ చేశారు. వివరాలు వెల్లడించిన రూరల్ డీఎస్పీ వెంకటేశులు -
కిచెన్, రూఫ్ గార్డెన్తో లాభాలు
పుట్టపర్తి అర్బన్: స్వంతంగా తయారు చేసుకునే కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్తో ఎన్నో లాభాలు ఉన్నాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఎనుములపల్లిలో కిచెన్ గార్డెలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, పండ్ల మొక్కలు వేసుకోవడంతో ఇంటికి సరిపడా కూరగాయలు పండ్లు అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో మార్కెట్ ధరలు సాధారణ స్థితికి వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెలను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యాన అధికారి నవీన్కుమార్, సహాయకులు వేమారెడ్డి , రామాంజనేయులు, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ‘కియా’లో సినిమా షూటింగ్ పెనుకొండ రూరల్: వరుణ్ తేజ్ హీరోగా నూతనంగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్లోని పలు సన్నివేశాలను కియా పరిశ్రమలోని ఆవరణలో శనివారం చిత్రీకరించారు. పరిశ్రమలోనే మరో రెండు రోజుల పాటు సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
టీడీపీ కార్యకర్త దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బి.ముత్యాలప్పపై ఆయన బంధువు, టీడీపీ కార్యకర్త తిరుపాలు కట్టెతో దాడి చేయడంతో కాలు విరిగింది. బాధితుడు సర్వజన ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈనెల 13న జరిగిన దాడి ఘటనకు సంబంధించి బాధితుడు ముత్యాలప్ప, ఆయన కుటుంబ సభ్యుల వివరాల మేరకు... ముత్యాలప్పకు ఇద్దరు సోదరులున్నారు. వీరి ముగ్గురికి కలిపి 12 ఎకరాల భూమి ఉంది. ఎవరికి వారు భాగపరిష్కారాలు చేసుకున్నారు. పెద్దవాడు అయిన ముత్యాలప్ప తన భాగానికి వచ్చిన ఆస్తిని విక్రయానికి పెట్టాడు. ఇటీవల ముత్యాలప్ప సోదరుడి అల్లుడు, టీడీపీ కార్యకర్త తిరుపాలు కలగజేసుకుని మధ్యవర్తిగా ఉంటూ కొనుగోలుదారుడిని పిలిపించాడు. ముత్యాలప్ప చెప్పిన ధరకంటే చాలా తక్కువకు అడగడంతో అమ్మేందుకు ముత్యాలప్ప, ఆయన కుమారులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి తిరుపాలు కోపంతో రగలిపోతున్నాడు. ఈనెల 13న రాత్రి 7 గంటల సమయంలో ముత్యాలప్ప కుమారుడు, ఆయన తమ్ముడి కుమారుడు కలిసి భూమి అమ్మకం విషయమై మాట్లాడుకుంటుండగా... అక్కడికి వచ్చిన తిరుపాలు కట్టెతో దాడి చేశాడు. ఈ దాడిలో ముత్యాలప్ప కుడి కాలు విరిగి తీవ్రగాయమైంది. 108 సకాలంలో రాకపోవడంతో అందుబాటులో ఉన్న ఆటోను పిలవగా... వెళ్లకూడదంటూ ఆటో డ్రైవర్ను తిరుపాలు బెదిరించాడు. అప్పటికే సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆటోలో పంపేలా చర్యలు తీసుకున్నారు. సర్వజన ఆస్పత్రిలో ముత్యాలప్ప చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనపై రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. -
కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు
● మాజీ మంత్రి శంకర నారాయణ సాక్షి, పుట్టపర్తి: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్రమ మద్యం కేసులో సాక్ష్యాలు లేకున్న తప్పుడు వాంగ్మూలాలను అడ్డు పెట్టుకొని విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్లను వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్సీసీ హయాంలో మద్యం కల్తీ జరిగితే, నేడు కూటమి ప్రభుత్వం అవే డిస్టిలరీల నుంచి మద్యం ఎందుకు కోనుగోలు చేస్తోందో చెప్పాలన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే రిటైర్డ్ అధికారులు, సీనియర్ సిటిజన్లను వేధిస్తోందన్నారు. ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకొని సస్పెన్షన్ వేటు కూడా వేశారన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే అక్రమ అరెస్ట్లు చేస్తున్నారన్నారు. -
ఎద్దుల పోటీలు ప్రారంభం
ముదిగుబ్బ: మండల పరిధిలోని నాగారెడ్డిపల్లిలో శనివారం శ్రీరాముల ఉత్సవాల్లో భాగంగా ఎద్దుల పోటీలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. కాసేపు అక్కడే ఉండి పోటీలను తిలకించారు. ఆ తర్వాత ముదిగుబ్బ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వాలంభన కోసం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముదిగుబ్బ మండలానికి 500 కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. హైపర్ టెన్షన్తో జాగ్రత్త పుట్టపర్తి అర్బన్: హైపర్ టెన్షన్తో ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం వరల్డ్ హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడులు, నిద్రలేమి, జంక్ ఫుడ్, జన్యుపరమైన కారణాలతో జీవన విధానంలో మార్పులు వచ్చాయన్నారు. హైబీపీతో ఒక్కోసారి రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉందన్నారు. వైద్యారోగ్యశాఖ 2023లో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 64,471 మంది బీపీ బారిన పడినట్లు తేలిందన్నారు. అదే 2024లో స్క్రీనింగ్ చేయగా 1.05 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారించారన్నారు. నిద్రలేమి, అధిక ఉప్పు, శారీరక శ్రమ లేకున్నా, ఊబకాయ సమస్యలతో బీపీ వస్తోందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. యర్రగుంటపల్లిలో చోరీ నల్లచెరువు: మండల పరిధిలోని యర్రగుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుల వివరాలమేరకు.. యర్రగుంటపల్లికి చెందిన వెంకట మల్లయ్య దంపతులు శుక్రవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రపోయేందుకు ఇంటిపైకి వెళ్లారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా ఇంట్లోని బీరువాను సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులోని రూ.1. 30 లక్షల నగదు, తులం బంగారు అపహరించారు. ఉదయం ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ మక్బూల్ బాషా పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జిల్లాలో ఐదు పారిశ్రామిక హబ్లు
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఐదు పారిశ్రామిక హబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘జిల్లాలో పరిశ్రమల స్థాపన... భూసేకరణ’ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు 35 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీలైనంత త్వరగా భూసేకరణ జరపాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 5 బ్లాక్లను గుర్తించాలని, ఆయా మండలాల్లో ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో వాటిని త్వరితగతిన ఏపీఐఐసీకి అప్పగించాలన్నారు. హిందూపురం–లేపాక్షి, చిలమత్తూరు–గోరంట్ల పారిశ్రామిక హబ్లతో పాటు మడకశిర హబ్, పెనుకొండ–కియా హబ్, పుట్టపర్తి హబ్లు అబివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారి నుంచి 2 కిలోమీటర్లు దూరంలో పంటలు సాగుచేయని 10 నుంచి 15 వేల ఎకరాల డీ పట్టా భూములున్నాయని, వాటిని గుర్తించి పరిశ్రమల స్థాపనకు భూసేకరించాలన్నారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో సోలార్ పార్కుల కోసం భుమిని గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. పరిశుభ్రత జీవితంలో భాగం కావాలికొత్తచెరువు: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం కొత్తచెరువులో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. బస్టాండులో చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీట్ ద హీట్’ పేరుతో నెల రోజుల పాటు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని రావులుడికి గ్రామంలో రైతు శివశంకర్రెడ్డి (56) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. శివశంకర్రెడ్డి ఉదయాన్నే రైతులు పుల్లారెడ్డి, ప్రతాప్రెడ్డి లతో కలిసి తోట వద్దకు వెళ్లారు. మృతుడు తన పొలం వద్దకు వెళ్లాడు. నీటి తొట్టెలో నీళ్లు లేకపోవడంతో మోటర్ వద్దకు వెళ్లాడు. కరెంటు లేకపోవడంతో సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఫీజు కట్ అయి ఉండటంతో ఫీజు వేసేందుకు యత్నించగా విద్యుదాఘాతంతో అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జమెదారు అన్వర్బాషా తెలిపారు. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
● ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాగూర్ ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాగూర్ తెలిపారు. శనివారం ఆమె స్థానిక రైల్వేస్టేషన్లోని ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ పరిధిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పూర్తి చేసిన కేసుల వివరాలను ఆర్పీఎఫ్ సీఐ నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్ మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఆర్పీఎఫ్ విభాగంలో పనిచేసే మహిళలకు మరింత భద్రతను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు డివిజన్ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అనిల్కుమార్సింగ్, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్రెడ్డి, ఆర్పీఎఫ్ ఎస్ఐ రోహిత్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు రికార్డులు సక్రమంగా భద్రపర్చాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు హిందూపురం: వివిధ కేసులకు సంబంధించి కోర్టు రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు సూచించారు. కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఇటీవలే పాత న్యాయస్థాన సముదాయంలోని కోర్టులను పశుసంవర్ధక కార్యాలయ భవనంలోకి మార్పు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా జడ్జి భీమారావు, అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజతో కలిసి నూతన కోర్టు భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంలోనే జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటాన్ని చూసి జిల్లా జడ్జి విస్మయం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణలో అశ్రద్ధ పనికిరాదన్నారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి పలు న్యాయస్థానాలు, న్యాయమూర్తుల గదులను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితా లక్ష్మిహారిక, ప్రత్యేక మెజిస్ట్రేట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. భయపెట్టి.. పోలీసులతో బెదిరించి ● పింఛన్ కోసం లంచంలో మరో ట్విస్ట్ ● మహిళను బెదిరించి మరో వీడియో చేయించిన వైనం చిలమత్తూరు: పింఛన్ మంజూరు కోసం ఓ మహిళ నుంచి ఏకంగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన ఘటన వైరల్ కావడంతో టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. వీడియోలో మాట్లాడిన మహిళను టీడీపీ నేతలు భయపెట్టడంతో పాటు పోలీసులతోనే బెదిరించి మరో వీడియో రూపొందించి సోషల్ మీడియాలో ఉంచారు. తీవ్ర చర్చనీయాంశమైన సాక్షి కథనం.. పింఛన్ కోసం లంచం అడిగారని, అంత డబ్బు తనవద్ద లేక చెవిదుద్దులు తాకట్టు పెట్టేందుకు వచ్చానంటూ హిందూపురం 12 వార్డుకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కాగా, దీనిపై శనివారం ‘సాక్షి’లో ‘పింఛన్ కోసం లంచం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కూటమి పాలనకు అద్దం పడుతున్న ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు రంగంలోకి దిగారు. మరోవైపు ఉదయం నుంచే పోలీసులు, టీడీపీ ప్రజాప్రతినిధులు సదరు మహిళను నేరుగా, ఫోన్ల ద్వారా సంప్రదించి బెదరగొట్టేశారు. ఇక రెండో పట్టణ సీఐ కూడా ఆమెను భయపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బలవంతంగా ఆమెతో మరో వీడియో చేయించారు. అందులో తనను ఎవరూ లంచం అడగలేదని చెప్పించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ నేతలు... ఇలా ఓ మహిళను భయపెట్టి తమకు అనుకూలంగా వీడియో చేయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. -
జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
నమో నారసింహపెన్నోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.టన్ను చీనీ రూ.37 వేలు అనంతపురం మార్కెట్యార్డులో శనివారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.37 వేలు, కనిష్టంగా రూ.5 వేల ప్రకారం ధర పలికాయి. ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025● సందడిగా జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం ● చాన్స్లర్ హోదాలో హాజరైన గవర్నర్ జస్టిస్ నజీర్ ● డాక్టర్ చావా సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం ● విద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ అనంతపురం: జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చాన్స్లర్ హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ చావా సత్యనారాయణ, వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, ముఖ్య అతిథి, కాన్పూర్ ఐఐటీ ఎమిరటర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఆర్. మాధవ్, పాలకమండలి సభ్యులు, డీన్లు వేదికపై ఆశీనులయ్యారు. చాన్స్లర్ హోదాలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతమూ విద్యార్థులు చప్పట్లతో హోరెత్తించారు. ప్రసంగం ప్రారంభంలో ‘జేఎన్టీయూ విద్యార్థులు బంగారు బిడ్డలు’ అంటూ గవర్నర్ అనడం ఆకట్టుకుంది. డాక్టర్ చావా సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ద్వారా వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సందడే.. సందడి స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పీజీ, పీహెచ్డీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 41 బంగారు పతకాలు ఇవ్వగా, 27 బంగారు పతకాలు అమ్మాయిలే సాధించడం గమనార్హం. ఈ సందర్భంగా విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘బంగారు’ క్షణాలను సెల్ఫీలు తీసుకుని పదిలపరచుకున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులతో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. పతకాలు పొందిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. దక్షిణాదిలోనే ఘనత.. జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. ఏకంగా 90 వేల మంది వర్సిటీ విద్యార్థులు నైపుణ్య కోర్సులను పూర్తి చేశారని, దక్షిణ భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి వర్సిటీగా జేఎన్టీయూ ఖ్యాతి దక్కించుకుందన్నారు. ‘ద టైమ్స్ ఇండియా వరల్డ్ ర్యాంకింగ్’లో 801–1,000 ర్యాంకు దక్కించుకుందన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో మైనర్ డిగ్రీని ప్రవేశపెట్టామని,అపార్ అనుసంధానంతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ను ఏర్పాటు చేశామన్నారు. రూ.22 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. గేట్– 2024లో జాతీయ స్థాయిలో 25 ర్యాంకులు వచ్చాయని, జాతీయ స్థాయిలో పి. హేమంత్ రెడ్డి ఏడో ర్యాంకు,కే. జ్ఞానేశ్వర రెడ్డి 144వ ర్యాంకు సాధించి వర్సిటీ కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. మొత్తం 33 పేటెంట్లు, 354 జర్నల్స్, 72 పుస్తకాలు, 1,500 పేపర్లు పబ్లిష్ చేసినట్లు పేర్కొన్నారు. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’లో వర్సిటీ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. గవర్నర్ ప్రశఽంస.. స్నాతకోత్సవ నిర్వహణపై గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో ఉన్నారంటూ ప్రశంసలు గుప్పించారు. ఇంతటి చక్కటి వాతావరణంలో సాగిన కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ చూడలేదంటూ కితాబిచ్చారు. విజయవంతం.. స్నాతకోత్సవం నిర్దేశించిన సమయానికి ప్రారంభమైంది. ఎలాంటి చిన్న తప్పిదం లేకుండా విజయవంతంగా ముగిసింది. బంగారు పతకాలు దక్కించుకున్న విద్యార్థులతో గవర్నర్ సరదాగా ముచ్చటించారు. ఆరు పతకాలు దక్కించుకున్న విద్యార్థి నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డిని ఉద్దే శించి.. బంగారు పతకాలు చాలా బరువుగా ఉన్నాయంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. న్యూస్రీల్లక్ష్యం వైపు దృష్టి నిలిపారు. ఆత్మవిశ్వాసం, కృషితో ‘బంగారు’ కలను నెరవేర్చుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా పతకాలనందుకుని కేరింతలు కొట్టారు. తల్లిదండ్రులకు సంతోషం పంచారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అతిథుల స్ఫూర్తివంతమైన మాటలను విని ఉప్పొంగారు. రాయలసీమకే తలమానికంగా నిలిచిన అనంతపురం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. ‘బంగారు’ కొండలు వీరే.. -
తిరంగా.. మదినిండా
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావం ఉప్పొంగింది. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదం మార్మోగింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం చేసిన సైనికులకు మద్దతుగా శనివారం పుట్టపర్తిలో నిర్వహించిన తిరంగా యాత్ర ఆధ్యంతం దేశభక్తిని చాటింది. కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరంగా యాత్ర ర్యాలీ పట్టణంలో హనుమాన్ కూడలి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న యువత, విద్యార్థులు, పట్టణ ప్రజలు ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’, ‘మరళీనాయక్ అమర్ రహే’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏక తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. మనమంతా సురక్షితంగా ఉండేందుకు ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు అందరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో మన సైనికుల పోరాటం మరువలేనిదన్నారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీ పడబోదన్న సందేశాన్ని మన సైనికులు ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. సైనికులకు మనమంతా నిలుద్దామని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఘనంగా తిరంగా ర్యాలీ సైనికులకు అండగా నిలుద్దామని కలెక్టర్, ఎస్పీ పిలుపు -
ఈదురు గాలులతో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/తాడిమర్రి: ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే పలకిరించిన వరుణుడు ముందస్తుగా మురిపిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జిల్లా కేంద్రం పుట్టపర్తిలో భారీ వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ఇక శుక్రవారం రాత్రి జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా సోమందేపల్లి మండలంలో 29.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పెనుకొండ మండలంలో 26 మి.మీ, బత్తలపల్లి 24.4, ముదిగుబ్బ 22.4, సీకే పల్లి 16.6, తాడిమర్రి 6.2, గాండ్లపెంట 2, ఎన్పీ కుంట 1.6, ధర్మవరం 1.2, పరిగి మండలంలో ఒక మి.మీ చొప్పున వర్షం కురిసింది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తాడిమర్రి మండలంలో కురిసిన వర్షానికి గుడ్డంపల్లి గ్రామంలో కోడిమూర్తి ఓబుళపతికి చెందిన అరటితోటలో తీవ్రంగా దెబ్బతినింది. కాపునకు వచ్చిన 4,000 అరటిచెట్లు నేలకు ఒరిగాయి. దీంతో రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమందేపల్లిలో 29.2 మి.మీ వర్షపాతం నమోదు తాడిమర్రిలో నేలకొరిగిన అరటిచెట్లు -
మంత్రి సవిత వల్లే ‘ప్రీకాట్’ మూత
పరిగి: నాలుగు దశాబ్దాలకుపైగా వేలాది మంది కార్మికులు, కూలీలకు ఉపాధి కల్పించిన కొడిగెనహళ్లి ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు మూత పడటానికి మంత్రి సవిత వైఖరే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆరోపించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీల రాయితీ ఇవ్వకపోవడంతో మిల్లు పడింది. ప్రభుత్వ వైఖరిని, మంత్రి సవిత నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ శనివారం ఉషశ్రీచరణ్ ప్రీకాట్ మిల్లు గేటు వద్ద కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లతో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, నూతన పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పిన కూటమి పార్టీల నేతలు ఇప్పుడు ఉన్న కంపెనీలను మూసివేస్తూ ఉపాధిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా సవిత బాధ్యతలను స్వీకరించిన తరువాత నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలేదన్నారు. వేలాది కుటుంబాలను పోషించిన మిల్లు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ అండగా నిలిచిందని ఉషశ్రీచరణ్ తెలిపారు. అలాంటి మిల్లుకు కూటమి ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇవ్వకపోవడంతో యాజమాన్యం మూసివేసిందన్నారు. దీంతో మిల్లు కార్మికుల కుటుంబాలు నేడు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇందుకు కూటమి సర్కార్ వైఖరితో పాటు మంత్రి సవిత చేతకాని తనమే కారణమన్నారు. ఇప్పటికై నా మంత్రి సవిత ప్రత్యేక చొరవ చూపి ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లును తెరిపించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల, కర్షకుల ఉసురు ఊరికేపోదని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున మిల్లు కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఉసురు కూటమి పెద్దలకు తగులుతుంది మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మిల్లు గేటు ఎదుట కార్మికులు, పార్టీ నేతలతో కలిసి ఆందోళన -
నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం
ఉరవకొండ/రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం వైభవంగా జరగనుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. దీంతో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి పెన్నహోబిలం ఆలయానికి ప్రత్యేకంగా 42 ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ హంపయ్య తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది తెలిపారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో సీఐ, ఎస్లతో పాటు స్పెషల్పార్టీ పోలీసులు అందుబాటులో ఉంటారు. వేలాదిగా తరలిరానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు -
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
ప్రతి స్నాతకోత్సవానికి విశిష్ట వ్యక్తులను గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జేఎన్టీయూ(ఏ) ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 14వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్ను వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావాకు అందజేయనున్నారు. ర్యాన్బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ చావా విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎదిగారు. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి దిశాదర్శకులయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను 2021లో సాక్షి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఘనంగా సత్కరించింది. 18 సంవత్సరాల క్రితం ఏర్పాటైన లారస్ ల్యాబ్స్ కంపెనీలో ఇప్పటి వరకూ 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు ప్రాధాన్యత అంశాలుగా ల్యాబ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. -
చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్లో టాపర్గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం టాపర్ (ఒక గోల్డ్మెడల్), ఎండోమెంట్ గోల్డ్మెడల్ ఫర్ బెస్ట్ అకడమిక్ ఫర్ఫార్మెన్స్ అమాంగ్ బాయ్స్ (ఒక గోల్డ్మెడల్), చల్లా సుబ్బారాయుడు ఎండోమెంట్ గోల్డ్మెడల్, ప్రొఫెసర్ వి. పాండురంగడు గోల్డ్మెడల్ (థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో టాపర్), 1992 బ్యాచ్ స్పాన్సర్డ్ గోల్డ్మెడల్ , చుండుపల్లి వెంకట్రాయలు.. సరోజమ్మ గోల్డ్మెడల్ ఇలా మొత్తం ఆరు గోల్డ్మెడల్స్ దక్కాయి. అంతేకాక కోర్సు పూర్తికాగానే ఎల్అండ్టీ కంపెనీలో ట్రైనీ ఇంజినీర్గా ఎంపికయ్యాను. – నంద్యాల పూజిత్ కుమార్రెడ్డి -
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) మరో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను దేశానికి అందించిన జేఎన్టీయూ(ఏ)14వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరగనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. అలాగే పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్లు అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 68 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు, 43 ఫార్మసీ కళాశాలలు, 24 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఏటా 1.30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్ , పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో గణనీయమైన ర్యాంకు దక్కించుకుని అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. చేయూత అ‘పూర్వ’ం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వర్సిటీ పురోగతికి చేయూతనందించారు. రూ.8 కోట్ల వ్యయంతో 100 గదులతో కూడిన హాస్టల్ను పూర్వ విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్నూ ఏర్పాటు చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలలో 2024–25లో బీటెక్ పూర్తి చేసిన మొత్తం 226 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చాటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 10 మందికి ఏడాదికి రూ.11 లక్షల వేతనంతో కూడిన కొలువులు దక్కడం విశేషం. జేఎన్టీయూ బంగారాలు: జేఎన్టీయూ అనంతపురం వర్సిటీ పరిధిలో 18 మందికి, జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల పరిధిలో ఏడుగురికి మొత్తం 49 బంగారు పతకాలు, ఎంటెక్లో ఒకరు, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదుగురి బంగారు పతకాలు దక్కాయి. వీరిలో జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి ఏకంగా ఆరు బంగారు పతకాలు దక్కించుకుని వర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాన్పూర్లోని ఐఐటీలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ హాజరుకానున్నారు. అలాగే జేఎన్టీయూ (ఏ) పాలకమండలి సభ్యులు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ముఖ్య అతిథిగా హాజరవుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపన్యాసం చేయనున్నారు. లైవ్స్ట్రీమ్ ద్వారా స్నాతకోత్సవాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అగ్రగామిగా తీర్చిదిద్దాలి అన్ని రంగాల్లో జేఎన్టీయూ (ఏ)అగ్రగామిగా తీర్చిదిద్దాలని వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. శుక్రవారం ఆయన జేఎన్టీయూలోని పాలకభవనంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికలో సమూలంగా మార్పు చేశామన్నారు. గౌరవ డాక్టరేట్ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేయడం గర్వంగా ఉందన్నారు. స్నాతకోత్సవ సందర్భంగా డిగ్రీలు అందుకునే విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. నేడు జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం చాన్సలర్ హోదాలో ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ 40,109 మంది విద్యార్థులకు డిగ్రీలు, 167 మందికి పీహెచ్డీల ప్రదానం -
బదిలీ నిబంధనల్లో అసంబద్ధాలను తొలగించాలి
ధర్మవరం అర్బన్: ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో నెలకొన్న అసంబద్ధాలను తొలగించాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సాయికృప జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్జీటీలకు సెమీ మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లకు బదులు ఎల్ఎఫ్ఎల్ పదోన్నతుల ద్వారా ఎస్జీటీలను నియమించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల స్థాయిని దిగజార్చకుండా వారిని యూపీ, ఉన్నత పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. 2023లో రేషనలైజేషన్ అయి ప్రమోషన్ పొందిన వారికి, 2025లో రేషనలైజేషన్ అవుతున్న వారికి బదిలీల్లో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. స్టడీ లీవ్లో ఉన్న వారి పోస్టులను వేకెంట్ చూపరాదన్నారు. అంతర్ జిల్లా బదిలీలు కూడా వెంటనే చేపట్టాలన్నారు. మూడేళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్నవాళ్లను బదిలీ నుంచి మినహాయించాలన్నారు. కౌన్సిలింగ్కు ముందే హైస్కూల్ ప్లస్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఆఫ్లైన్లో ఓఎంఆర్ ద్వారా డీఎస్సీని నిర్వహించాలన్నారు. అనంతరం డీఎస్సీ మోడల్ ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు సి.రామకృష్ణారెడ్డి, విజయ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, చెన్నారెడ్డి, నారాయణస్వామి, సౌదామిని, శివారెడ్డి, సంజీవ్, శ్రీరామ్నాయక్, చిదంబరరెడ్డి, బాలకృష్ణ, రామయ్య, రమణ, ఓబిరెడ్డి, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, రామ్మోహన్రెడ్డి, సాలెహ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య -
●తాగునీటి కోసం ఆందోళన
రొళ్ల మండలంలోని రత్నగిరి పంచాయతీ ఉజ్జినీపురం గ్రామంలో మహిళలు నీటి కోసం ఆందోళనకు దిగారు. గ్రామంలో వాటర్ వర్క్స్ బోరుబావికి అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. వారం రోజులు గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్ బిగించి సమస్యను పరిష్కరించలేదు. దీంతో నీటి సరఫరా నిలిచిపోగా శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రెండో రోజుల్లోగా నీటి సమస్య పరిష్కరించకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. – రొళ్ల: -
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
● డీఎస్పీ విజయ్కుమార్ పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితో జిల్లాను డ్రగ్స్ రహితంగా మారుద్దామంటూ పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సాయిఆరామం వేదికగా ఈగల్ యాంటీ టాస్క్ఫోర్ప్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయికి అలవాటు పడి చాలా మంది తమ జీవితాలను నాశనంచేసుకుంటున్నారన్నారు. అలాంటి వారు తమ కుటుంబాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం తదితర వివరాలు గురించి తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐలు సునీత, సురేష్, ఈగల్ యాంటీ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్ఐ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిజాయితీ చాటుకున్న విద్యార్థులు అగళి: నడిరోడ్డుపై తమకు దొరికిన సంచిలో ఉన్న నగదును పోలీసుల ద్వారా సంబంధీకుడికి అప్పగించి, విద్యార్థులు తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాలు.. అగళి మండలం ఆలూడి గ్రామానికి చెందిన నరసింహ, మలుర... స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షలు రాసి తిరుగు ప్రయాణమయ్యారు. కర్ణాటక బ్యాంక్ వద్దకు చేరుకోగానే నడిరోడ్డుపై ఓ బ్యాగ్ కనిపించడంతో తీసుకుని పరిశీలించారు. అందులో పెద్ద మొత్తంలో నగదు ఉండడంతో నేరుగా పోలీస్స్టేషన్కు చేరుకుని ఆ బ్యాగ్ను అందజేసి, విషయాన్ని వివరించారు. బ్యాగ్లో ఉన్న బ్యాంక్ పాస్ పుస్తకాన్ని పరిశీలించిన పోలీసులు ఆ నగదు గ్యార గుండానపల్లి చెందిన శివన్నది గుర్తించి, పీఎస్కు రప్పించుకుని ఆరా తీశారు. గ్రామంలోని మహాత్మా గాంధీ మహిళ సంఘానికి చెందిన డబ్బును అగళిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో కట్టేందుకు తీసుకువచ్చినంట్లు వివరించాడు. అయితే నగదు ఉన్న బ్యాగ్ను పొగొట్టుకోవడంతో దిక్కు తోచలేదని, అందులో రూ.49,310 నగదు ఉండాలని తెలిపాడు. దీంతో లెక్కించిన పోలీసులు ఆ మొత్తం అందులో ఉండడంతో విద్యార్థుల చేతుల మీదుగా ఆయనకు అందజేయించారు. నిజాయితీ చాటుకున్న విద్యార్థులను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు. వాహనం బోల్తా.. ఒకరి మృతి తాడిపత్రి: మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆటో బోల్తాపడిన ఘటనలో మరొకరు.. పామిడి: మండలంలోని రామరాజుపల్లి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన నాగేంద్ర తన సొంత ఆటోలో కుటుంబసభ్యులతో కలసి పెన్నహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లాడు. శుక్రవారం ఆలయం వద్ద పూజలు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు... పామిడి మండలం రామరాజుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో నాగేంద్ర కుమార్తె శైలజ (15) అక్కడికక్కడే మృతి చెందింది. నాగేంద్ర, సుదర్శన్, మోక్షిత, రాధమ్మకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలి
హిందూపురం: హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులక పెంచితేనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని జలసాధన సమితి సభ్యులు అన్నారు. ‘సాగునీటి సమస్యలు – పరిష్కార మార్గాలు’ అంశంపై స్థానిక పెన్షనర్స్ భవన్లో శుక్రవారం సదస్సు జరిగింది. జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సమితి నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. అత్యంత అల్ప వర్షపాతంలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రీ–నీవా వరదాయినిగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. జీడిపల్లి నుంచి దిగువకు కాలువ వెడల్పు చేయకుండానే లైనింగ్ పనులు ప్రారంభించడం వల్ల నీటి సామర్థ్యాన్ని పెంచే యోచనకు కూటమి ప్రభుత్వం సమాధి కట్టినట్లుగా తెలుస్తోందన్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జీఓ జారీ చేశారని, పనులకు సంబంధించి రూ.6182 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ప్రభుత్వ జారీ చేసిన జీఓను రద్దు చేయడమే కాక, 3,850 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి పరిమితం చేయడం వెనుక అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో పక్కనే ఉన్న కృష్ణానది జలాలను కాదని, రూ.80వేల కోట్లు ఖర్చుతో పోలవరం నుంచి గోదావరి జలాలను 465 కి.మీ. దూరంలో ఉన్న బనకచర్లకు తరలించి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారని ప్రశ్నించారు. పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపు ఆలోచనను విరమించుకుని మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు జీడిపల్లి నుంచి దిగువకు 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం, మడకశిర బ్రాంచ్ కెనాల్ 1,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా కాలువలు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 3.45లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించాలన్నారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.50వేల కోట్లు కేటాయించి రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మృతనదిగా మారబోతున్న పెన్నాను బతికించుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలనే డిమాండ్తో ఈ నెల 31న సంగమేశ్వరం వద్ద జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని రైతులు, మేధావులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జలసాధన సమితి నాయకులు నవీన్, జమీల్, ఆదినారాయణ, అమానుల్లా, జయరామరెడ్డి, హనుమంతరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజశేఖరరెడ్డి, లెక్చరర్ గంగిరెడ్డి, తూమకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం నాయకుడు రవికుమార్, పీడీఎస్యూ బాబావలి, ఏఐటీయూసీ వినోద్, చలివెందుల లక్ష్మీనారాయణరెడ్డి, తిప్పేస్వామి, పలువురు ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాలువ లైనింగ్ పనులతో భవిష్యత్తుకు సమాధి 31న కృష్ణానది సంగమేశ్వరం వద్ద బహిరంగ సభ విజయవంతం చేయండి -
ఈ–కేవైసీ పూర్తయ్యేదెన్నడో ?
ప్రశాంతి నిలయం: రేషన్కార్డులో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులందరూ ఈ–కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. గత ఐదు నెలలుగా ఈ–కేవైసీ పూర్తి చేసే ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతోంది. రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గడువును కూడా జూన్ 30 వరకూ పొడిగించారు. అయితే జిల్లాలో ఇప్పటికీ 99,872 మంది లబ్ధిదారులు ఇంకా ఈ– కేవైసీ చేయించుకోలేదు. వందశాతం కష్టమే.. జిల్లాలో 5,66,971 రేషన్ కార్డులు ఉండగా 16,89,531 మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరితో ఈ–కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ 99,872 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయలేదు. గడువులోపు ఈ–కేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ సరుకులు అందించబోమని ప్రభుత్వం చెబుతోంది. వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడంతో ఇబ్బంది వస్తోంది. గడువులోపు పూర్తిచేయకపోతే వారంతా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో వంద శాతం ఈ–కేవైసీ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతోనే .. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్ వ్యవస్థ చురుగ్గా పనిచేసేది. క్షేత్రస్థాయిలో ఏపనైనా సకాలంలో వలంటీర్లు పూర్తి చేసే వారు. అయితే ఇప్పడు కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం క్షేత్రస్థాయిలో సర్వేలు సహా ఏ ఇతర పనులు కూడా సక్రమంగా జరగడం లేదన్న విమర్శలున్నాయి. వలంటీర్లు లేకపోవడంతో ఈ–కేవైసీని రేషన్ డీలర్లకు అప్పగించారు. వారు పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోవడంతో ఈ–కేవైసీ పూర్తిచేయని వారి సంఖ్య అధికంగా ఉందంటున్నారు. నేటికీ వివరాలు నమోదు చేయని 99,872 మంది లబ్ధిదారులు జూన్ 30 వరకూ గడువు గడువులోగా పూర్తి చేస్తాం రేషన్ లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేసేందుకు జూన్ 30 వరకూ గడువు ఉంది. క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్ల ద్వారా గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. లబ్ధిదారులు కూడా ఈ–కేవైసీ పూర్తి చేయించుకునేందుకు సహకరించాలి. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రాంతానికి వచ్చి ఈ–కేవైసీ చేయించుకోవాలి. – వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి -
తప్పుల్లేని ఓటరు జాబితానే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘తప్పుల్లేని ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్ఓ విజయసారథి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తప్పులు లేని ఓటరు జాబితా, పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఓటరు నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లెయిమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, వివరాలు సేకరించి సన్నద్ధంగా ఉంటే ప్రక్రియను సులువుగా పూర్తిచేయొచ్చన్నారు. వైఎస్సార్సీపీ తరఫున రవినాయక్, టీడీపీ తరఫున ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ ప్రతినిధి అబ్దుల్ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ కార్డుపై లేపాక్షి నంది లేపాక్షి: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేపాక్షి విశిష్టత ప్రపంచానికి తెలియజేయడానికి నంది చిత్రం కలిగిన పోస్టుకార్డు ఎంతో దోహపడతుందని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక లేపాక్షిలోని చేతన కన్వెన్స్న్ హాల్లో నంది చిత్రంతో కూడిన శాశ్వత తపాలా ముద్రను, వీరభద్రస్వామి దేవస్థానంపై ప్రత్యేక కార్డులను ఆయన విడుదల చేశారు. ముందుగా ఇటీవల ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీనాయక్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్మినెంట్ పిక్టోరియల్ కాన్సిలేషన్ ద్వారా కార్డులు విడుదల చేయడం సంతోషంగా ఉదన్నారు. ఇది లేపాక్షికి ప్రత్యేకమైన రోజన్నారు. లేపాక్షి పోస్ట్ ఆఫీసు నుంచి ఏ ఉత్తరం వచ్చినా ఈ కాన్సిలేషన్ ద్వారా ఆ ఉత్తరం వెళ్లడం జరుగుతుందన్నారు. దేశం మొత్తానికి ఈ కార్డులను పంపించవచ్చన్నారు. నంది విగ్రహం, కల్యాణ మంటపం, వినాయక విగ్రహం, ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, సీతమ్మ పాదం, వేలాడే స్తంభం చిత్రాల కార్డులను విడుదల చేశారు. ఈ కార్డులను శుభకార్యాలకు, స్నేహితులు, ఇతరులకు బహమతి ఇవ్వచ్చన్నారు. ఈ కార్డులు స్థానిక పోస్టు ఆఫీసులో అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం లేపాక్షి విశిష్టతను తెలిపేలా కవి సడ్లపల్లి చిదంబరరెడ్డి రాసిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు రీజినల్ పోస్టుమాస్టర్ జనరల్ వెన్నం ఉపేంద్ర, పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీఆర్ఎస్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు షైనింగ్ స్టార్–2025 అవార్డులకు ఎంపికయ్యారు. 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలో నిర్వహించిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన ప్రభుత్వ పాఠశాలల్లోని టాప్ ర్యాంకర్లను ఎంపిక చేసి, షైనింగ్ స్టార్ అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఈ క్రమంలో ఏపీఆర్ఎస్కు చెందిన డి.అఫ్రీద్, ఎస్.అహమ్మద్ హుస్సేన్, కె.లక్ష్మీనరసింహారెడ్డి, వై.విశ్వకిరణ్, కె.అశోక్కు అవార్డులు దక్కాయి. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్బాబుతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. లైనింగ్ పనులు త్వరగా పూర్తి చేయండితనకల్లు: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొక్కంటిక్రాస్ వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లైనింగ్ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అనంతరం ఇంతవరకు ఎన్ని కిలోమీటర్ల పనులు చేశారని, ఏఏ యంత్రాలను పనులకు కోసం వినియోగిస్తున్నారని ఆరా తీశారు. యువకుడి దుర్మరణం పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంకటగారిపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన సాయినాథ్ (26) సీసీ కెమెరాల మరమ్మతు పనితో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి ప్రయాణమైన సాయినాథ్... వెంకటగారిపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వామనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సంప్లో పడి వృద్ధురాలి మృతి పుట్టపర్తి అర్బన్: ప్రమాదవశాత్తు నీటి సంప్లో పడి ఓ వృద్ధురాలు మృతిచెందింది. వివరాలు.. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామానికి చెందిన ఫకృద్దీన్ ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్య ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో భార్య చక్కీరమ్మ (70)తో కలిసి ప్రశాంతిగ్రామంలోని జానకీరాం కాలనీలో స్ధిరపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సంప్లోని నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన చక్కీరమ్మ అదుపు తప్పి అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతిచెందారు. ఘటనపై పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. పలు మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని గుడిబండ మండలంలో అత్యధికంగా 35.2 మి.మీటర్లు, రొళ్ల 21.2, గాండ్లపెంట 20, మడకశిర 6, అగళి మండలంలో 5.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
హిందూపూరం టౌన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్ తెలిపారు. స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగం, ఫార్మసీ, డయాలసిస్ యూనిట్తో పాటు నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న మార్చురీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో వైద్యులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వైద్యులకు అవసరమైన పరికరాలు, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కావాల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ యూనిట్లో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులు గమనించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో ఏసీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 5 నెలల్లో అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో పలు రకాల వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మరో ఐదు నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించినట్లు పేర్కొన్నారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందించడంతో పాటు వార్డుల్లో ఇన్పేషంట్ సేవలు మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రిలో అందించే ప్రతి చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదు చేయాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. వైద్యుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. అలాగే నెల రోజుల్లోపు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఫార్మసీలో అన్ని మందులను అందుబాటులోకి తీసుకు వచ్చామని, ముఖ్యంగా గుండె నొప్పితో బాధపడేవారు ఆసుపత్రిలో స్టేమీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక మార్చురీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్స్ కింద ఆస్పత్రికి అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, నియామకాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్న, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్ -
ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు
హిందూపురం: స్థానిక ఇందిరమ్మ కాలనీ సమీపంలోని జాతీయ రహదారిలో గురువారం ఉదయం ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. అధిక లోడు కారణంగా వేగంగా వెళుతున్న సమయంలో కుదుపులకు బోల్తాపడడంతో ట్రాలీపై ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో గాయపడిన వారిలో కిష్టప్పకు కాళ్లకు బలమైన గాయలు కావడంతో చికిత్సలు అందిస్తున్నారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దాడి కేసులో ఐదుగురికి జరిమానా రొద్దం: వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురికి జరిమానా విధిస్తూ పెనుకొండ ప్రిన్సిపుల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బొజ్జప్ప గురువారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్ఐ నరేంద్ర గురువారం వెల్లడించారు. రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన కురుబ అంజినరెడ్డి కుమార్తెను 2014లో రామగిరి మండలం కనివాండ్లపల్లి గ్రామానికి చెందిన కురుబ శివశంకర్ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్యను పలకరించేందుకు తరచూ రాచూరుకు శివకుమార్ వచ్చివెళ్లేవాడు. ఓ రోజు తన అత్త సుశీలమ్మతో ఇంటి బయట మాట్లాడుతున్న శివశంకర్పై రాచూరు గ్రామానికి చెందిన గొల్ల ధనుంజయ, రవి, సుధాకర్, పరంధామ, బోయ శ్రీరాములు దాడి చేసి గాయపరిచారు. ఘటనకు సంబంధించి 2015లో అప్పటి ఎస్ఐ దస్తగిరి కేసు నమోదు చేసి, ఛార్జీషీట్ను కోర్టులో దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున జరిమానా, జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్యామల వాదనలు వినిపించారు. -
ప్రమాదంలో వ్యక్తి మృతి
అమరాపురం: మండలంలోని ఉదుగూరు – కాచికుంట గ్రామాల మధ్య చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిబండ మండలం గుడ్డదహళ్లి గ్రామానికి చెందిన నవీన్కుమార్ (43) అమరాపురం మండలం కెంకెర గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. గురువారం వ్యక్తిగత పనిపై అమరాపురం గ్రామానికి వెళ్లిన ఆయన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై కెంకర గ్రామానికి బయలుదేరాడు. ఉదుగూరు – కాచికుంట గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా.. ద్విచక్ర వాహనం అదుపు తప్పి మోరీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలుఅనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు నక్కారామారావు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్ట్ బోర్డు, యాదవ సంఘం, యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, బి.రామకృష్ణ, ఎం.శ్రీరాములు, ఉమాశంకర్, హేమంత్, లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతిలో 400పైబడి మార్కులు, ఇంటర్లో 700పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. జూన్ 1న పురస్కారాలు అందజేయనున్నారు. మరింత సమాచారానికి 83094 75846, 94922 87710లో సంప్రదించవచ్చు. వీరజవాన్ కుటుంబ సభ్యులకు పరామర్శ గోరంట్ల: వీరజవాన్ మురళీనాయక్ కుటుంబసభ్యులను ప్రముఖ నటుడు శివారెడ్డి పరామర్శించారు. గురువారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీనాయక్ తల్లి జ్యోతిబాయిని పరామర్శించారు. మురళీనాయక్ త్యాగం మరువలేనిదని కొనియాడారు. అనంతరం ప్రముఖ ఆర్టిస్ట్ వాసు గీచిన మురళీనాయక్ చిత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్థానిక సర్పంచ్ వాసునాయక్ ఉన్నారు. కారు దగ్ధం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వెనిల్ అనే వ్యక్తితో కలసి మరో వ్యక్తి అనంతపురం నుంచి కారులో ధర్మవరానికి బయలుదేరాడు. చిగిచెర్ల సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి పొగలు రాసాగాయి. గమనించిన వారు కారు ఆపి కిందకు దిగారు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ‘కియా’కు సమ్మె నోటీసు పెనుకొండ రూరల్: దేశ వ్యాప్తంగా ఈ నెల 20 తేదీన చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. కియా కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేలా కియా పరిశ్రమకు నోటీసులు అతికించారు. నాయకులు మాట్లాడుతు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లుగా బిల్లు తీసుకొచ్చిందన్నారు. కార్మికుల కష్టాన్ని పెట్టుబడి దారులకు దోచిపెట్టేందుకే లేబర్ కోడ్లును తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయి కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. సమ్మె విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హరి, బాబావలి, సాంబ శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఉరవకొండ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ప్రధాన అర్చకుడు ద్వారకనాథచార్యులు, ఈఓ సాకే రమేష్బాబు అధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అంతకు ముందు దేవేరులతో కలసి గరుడ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనిమిచ్చారు. -
మధుర ఫలం.. విషతుల్యం
హిందూపురం: మామిడికి ఇప్పుడిప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఇంత కాలం ఎండల తీవ్రత కారణంగా మామిడిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భయపడుతూ వచ్చారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్లో మామిడి కొనుగోలు దారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో వ్యాపారులు సహజ సిద్ధంగా కాకుండా ప్రమాదకర కాల్షియం కార్బైడ్తో మాగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దిగుబడి సైతం మోస్తారుగానే ఈ ఏడాది మామిడి దిగుబడులు ఓ మోస్తరుగా ఉన్నాయని ఉద్యాన శాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ ప్రభావం కారణంగా ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో స్థానికంగానే మార్కెట్లో మామిడి విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఎండలు తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఇంత కాలం మామిడి కొనుగోలు చేసేందుకు పలువురు వెనుకంజ వేస్తూ వచ్చారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో డిమాండ్కు అనుగుణంగా మామిడిని అందుబాటులో ఉంచేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టారు. పెనుగాలులు, వర్షాలకు నేలరాలిన కాయలను తక్కువ ధరకే వ్యాపారులు కొనుగోలు చేసి త్వరగా పక్వానికి వచ్చేలా విషపూరిత కాల్షియం కార్బైడ్ను విచ్ఛలవిడిగా వినియోగిస్తున్నట్లుగా సమాచారం. వీటిని తిన్న వృద్ధులు, చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రమాదకర రసాయనంతో మామిడిని మాగబెడుతున్న వ్యాపారులు వర్షాలు కురిసిన నేపథ్యంలో మామిడి కొనుగోలుకు ఎగబడుతున్న ప్రజలు కొనుగోలు సమయంలో నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు నాణ్యతను గుర్తించండి ఇలా.. సహజ సిద్ధంగా మాగిన మామిడి మొత్తం ఒకే రంగులో ఉండదు. పండిన వాసనతో కోసినప్పుడు లోపలి భాగం మొత్తం ఒకే రకమైన పక్వత కనిపిస్తుంది. ప్రమాదకర రసాయనంతో మాగేసిన పండ్లు మొత్తం ఒకే రంగులో ఉంటాయి. కోసినప్పుడు లోపలి భాగం చుట్టూ కొద్ది పక్వత కలిగి, మిగిలిన భాగం అపరిపక్వంగా ఉంటాయి. ఇథిలీన్ వాయివుతో చాంబర్లో మాగిన పండ్లు ఆరోగ్యానికి మంచిది. ఇవి సహజ పరిపక్వతకు దగ్గరగా ఉంటాయి. మామిడిని కొళాయి నుంచి వదిలే నీటిలో మూడు నిమిషాలు ఉంచి శుభ్రం చేసిన తర్వాత తొక్కను తీసి తినాలి. నాణ్యత ఉన్న వాటినే కొనుగోలు చేయండి మామిడిని సహజ సిద్ధంగా పండించాలి. రసాయనాలతో మాగించిన పండ్ల తొక్క ముడతలు లేకుండా గట్టిగా ఉంటుంది. ఇలాంటి పండ్లు ప్రమాదకరం. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిముషాలు ఉంచి తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. – మహేష్, ఉద్యానాధికారి, హిందూపురం -
ప్రాజెక్ట్ల స్థాపనకు భూములు సిద్ధం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూసేకరణకు అనువైన భూములు జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన ప్రాజెక్ట్ల భూసేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. చేతన్ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో 4 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమై భూమి సేకరించాల్సి ఉందన్నారు. సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వ భూమి లభ్యత ఎంత ఉందో వివరాలు సేకరించాలన్నారు. పట్టా ఉన్న రైతులు తమ భూమిని లీజుకు ఇస్తే ఎకరానికి ఏడాదికి రూ.31 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. లీజుకు అంగీకరించే రైతుల భూముల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 20లోపు భూముల జాబితాలు సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించాలని చెప్పారు. 22న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిగుబ్బ, తలుపుల, రొద్దం, గుడిబండ, కనగానపల్లి, చిలమత్తూరు, హిందూపురం, అగళి, రామగిరి, మండలాల్లో భూసేకరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్, కదిరి, ధర్మవరం, పెనుకొండ ఆర్డీఓలు శర్మ, మహేష్, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
సాగుకు సర్కార్ సాయం కరువు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాలు మురిపిస్తున్నాయి. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన విత్తన వేరుశనగను ప్రభుత్వం సకాలంలో అందిస్తే రైతులకు ఎంతో ఉపయోగం. గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముందుచూపుతో మే 20 నుంచే విత్తనకాయల పంపిణీకి రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడంతో పాటు అదే నెలలో విత్తనకాయలు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రైతులను సందిగ్ధంలోకి నెడుతోంది. బోరు బావులున్న రైతులు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసుకున్నా నాణ్యమైన విత్తన కాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో లేని విత్తనం సాధారణంగా ప్రతి ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వేరుశనగ, కంది, ఉలవలు, అలసంద, పెసర, మినుములు వంటి విత్తనాలను సరఫరా చేస్తుంది. జిల్లాలో ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తారు. ఈ రబీలో సాగు చేసిన వేరుశనగ కాయలను అధిక ధరలకు వెచ్చించి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించేశారు. దీంతో ముందస్తు వర్షాలు కురిసినా వేరుశనగ సాగు చేయడానికి అవసరమైన విత్తనం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సాయం అందేనా? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సంక్షేమ పథకమూ అమలు కాలేదు. దీంతో రైతుల వద్ద చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేసే నాటికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ (రైతు భరోసా) పథకం కింద ఒకే దఫాలో రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగుకు రైతుల సన్నద్ధం సబ్సిడీ విత్తనకాయల కోసం ఎదురుచూపు సకాలంలో పంపిణీ చేయాలని వేడుకోలు ప్రభుత్వానికి చేరిన నివేదిక జిల్లాలో ఖరీఫ్–2025లో 2,69,152 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క వేరుశనగ పంట 1,51,824 హెక్టార్లు, కంది 28,925 హెక్టార్లు, మొక్క జొన్న 17,949 హెక్టార్లు, తదితర పంటలు అధికంగా సాగు చేయవచ్చని భావిస్తున్నారు. ఇందుకు తగినట్టుగా వేరుశనగ విత్తన కాయలు 75,895 క్వింటాళ్లు, కంది 1,275 క్వింటాళ్లు, పప్పుశనగ 796 క్వింటాళ్లు, ఉలవలు 300 క్వింటాళ్లు, పెసర, అలసంద వంద క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి విత్తన కేటాయింపులు, ధర ఖరారు, పంపిణీ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో విత్తనకాయలు అందిస్తే సరి.. లేకుంటే బహిరంగ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ధరలతో విత్తనాలు కొని పంటలు సాగు చేయడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. సబ్సిడీ విత్తన పంపిణీపై త్వరగా స్పందించాలని కోరుతున్నారు. -
జిల్లాలో విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారు జామున 24 మండలాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 75.2 మి.మీటర్లు, ధర్మవరం 71.6, బుక్కపట్నం 46, తాడిమర్రి 41.2, బత్తలపల్లి 36.2, పుట్టపర్తి 33.2, చిలమత్తూరు 33.2, కొత్తచెరువు 27.6, గాండ్లపెంట 24.4, కదిరి 21.2, అమడగూరు మండలంలో 20.8 మి.మీటర్ల వర్షం కురిసింది. అలాగే ఓడీచెరువు మండలంలో 16.4, సీకేపల్లి 16.2, ముదిగుబ్బ 12.6, రామగిరి 11.8, తలుపుల 9.4, నల్లచెరువు 7.2, గోరంట్ల 5.4, తనకల్లు 4.8, నల్లమాడ 4.2, సోమందేపల్లి 3.8, పెనుకొండ 2.8, ఎన్పీ కుంట 2.4, రొద్దం మండలంలో 2 మి.మీటర్ల వర్షం కురిసింది. వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముంగారు సేద్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన 9 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రజా కోర్టులో శిక్ష పడడం ఖాయం. పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడం అన్యాయం. కూటమి నేతలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలో గెలవాలి. అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకోవడం చేతగాని తనం. కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగంతో రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలే వారి పతనానికి కారణమవుతాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా అవి తాత్కాలికమే. భవిష్యత్ వైఎస్సార్సీపీదే. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
21న జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ ప్రధాన మందిరంలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారని, గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారా లీగల్ వలంటీర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం హిందూపురం: చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ తెలిపారు. హిందూపురం ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కల్గి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హిందూపురం జిల్లా అదనపు జడ్జి న్యాయ సముదాయంలో ఉన్న లోక్ అదాలత్ విభాగంలో అందజేయాలని తెలియజేశారు. పాలిసెట్లో 94.03 శాతం ఉత్తీర్ణత ధర్మవరం అర్బన్: జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2025లో జిల్లా వ్యాప్తంగా 94.03 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,704 మంది బాలురు, 1,989 మంది బాలికలు మొత్తం 4,693 మంది పరీక్షలు రాశారన్నారు. వారిలో 2,510 మంది బాలురు, 1,903 మంది బాలికలు మొత్తం 4413 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలురు 92.83 శాతం, బాలికలు 95.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 94.03 శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమన్నారు. నేడు లేపాక్షి నంది పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ లేపాక్షి: భారత తపాలాశాఖ హిందూపురం డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక చేతన కన్వెన్షన్హాల్లో లేపాక్షి ఆలయ నమూనాతో పోస్టు కార్డు విడుదల చేయనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ యూ.విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరభద్రస్వామి దేవస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన పిక్చర్ పోస్టుకార్డుతో పాటు లేపాక్షి నంది నమునాతో పర్మనెంట్ పిక్టోరియల్ కాన్సిలేషన్ (పోస్టల్ మార్క్/స్టాంప్)ను ఆవిష్కరించన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కె.ప్రకాష్తో పాటు రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ వనం ఉపేంద్ర ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. -
యథేచ్ఛగా ఎర్రమట్టి దోపిడీ
రాయదుర్గం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దోపిడీకి అంతులేకుండా పోతోంది. సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టి రూ. కోట్లలో దోచేస్తున్నారు. టీడీపీ నేతల స్వార్థానికి రాయదుర్గం నియోజకవర్గంలో సహజ సిద్దంగా ఏర్పడిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాయదుర్గంలోని శనీశ్వరాలయం వెనుక ఉన్న హౌసింగ్ లే అవుట్కు ఆనుకుని కొండ ప్రాంతంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో కొండ పొరంబోకు స్థలంలో భారీ విస్తీర్ణాన్ని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఓ టీడీపీ నాయకుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. ఎంసీఏ కళాశాల, ఇందిరమ్మ లేఅవుట్లు, గౌడ లేవుట్ సమీపంలో ఉన్న కొండల్లో నుంచి గ్రావెల్ తవ్వకాలు పెరిగిపోయాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులు తమ స్థలాలను ప్లాట్లు వేసి, రోడ్లను చదును చేసేందుకు కొండల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అంధకారంలో 20 పల్లెలు
ముదిగుబ్బ: మండలంలోని మల్లేపల్లి సబ్స్టేషన్ పరిధిలోని 20 పల్లెల్లో అంధకారం అలుముకుంది. మూడు రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన వర్షాలకు తప్పెటవారిపల్లి సమీపంలో 33 కేవీ లైన్కు సంబంధించిన మూడు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అదే సమయంలో సబ్స్టేషన్లోనూ కొన్నిచోట్ల డ్యామేజీ జరిగింది. దీంతో మల్లేపల్లి, తప్పెటవారిపల్లి, ఒడ్డుకింద తండా, కొండగట్టుపల్లి పంచాయతీల పరిధిలోని 20 గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ రాత్రంతా చీకట్లోనే ఇబ్బందిపడిన ప్రజలు మంగళవారం ఉదయం లైన్మెన్లను ఆరా తీశారు. ఇదిగో గంటలో కరెంట్ వస్తుంది.. మధ్యాహ్నం.. సాయంత్రం ఇలా చెప్పుకుంటూ వచ్చారు. గంటలు పోయి.. రోజులు గడుస్తున్నా ఎటువంటి పురోగతీ లేదు. మూడు రోజులైనా అధికారులు స్పందించకపోవడం, ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోవడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలే వేసవి. ఉక్కపోత అధికంగా ఉంది. కరెంటు లేక ఫ్యాన్లు, కూలర్లు ఆగిపోయాయి. జనం అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటోంది. సెల్ఫోన్లు కూడా చార్జింగ్ అయిపోయాయి. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించి కరెంటు సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈదురుగాలులతో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు మూడు రోజులుగా అంధకారంలోనే మగ్గుతున్న ప్రజలు విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో అధికారుల తాత్సారం -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరుల లూటీ విచ్చలవిడిగా జరుగుతోంది. మట్టి, ఇసుక, గ్రావెల్ మొదలుకొని అన్నింటినీ ‘తెలుగు తమ్ముళ్లు’ దోపిడీ చేస్తున్నారు. ‘పచ్చ’ నేతల హస్తం ఉండటంతో తనిఖీలకు వెళ్లేందుకు మైనింగ్ అధికారులు జంకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్టి, ఇసుక, గ్రావెల్ తదితర వాటిని వాణిజ్య అవసరాలకు తరలించే వాహనాల నుంచి రాయల్టీ డబ్బు వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజు కట్టబెట్టేది. లీజు దక్కించుకున్న సంస్థ నెలానెలా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో కొంత మొత్తం చెల్లించేది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం లభించేది. అయితే, జిల్లాలో ప్రైవేటు సంస్థ లీజు గడువు మార్చితోనే ముగిసింది. తర్వాత ఇప్పటివరకూ ఎవ రికీ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి సహజ వనరుల అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 11 మాసాల్లోనే కొండల నేలమట్టం.. ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే అనంతపురం సమీప ప్రాంతాల్లో కొండలు కరిగిపోయాయి. గుట్టలు నేల మట్టమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గుట్టలను కరిగించేశారు. రోజూ ఇక్కడి నుంచి వంద నుంచి 150 టిప్పర్ల మట్టి కర్ణాటకకు పంపిస్తున్నారు. ఇక్కడికి ఇద్దరు మైనింగ్ అధికారులు వెళ్లి వెనక్కు వచ్చారు. మహిళా అధికారులు మట్టి దొంగలను నిలువరించలేకపోయారు. ఇక.. ఆలమూరు కొండలంటే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. పశుపక్ష్యాదులకు ఆలవాలంగా ఉండటమే కాదు రాప్తాడు, అనంతపురం ప్రాంతాలకు రక్షణ కవచంలా ఉండేవి. అలాంటి కొండలను నేలమట్టం చేశారు. చివరకు కరెంటు పోళ్లు కూడా కిందపడిపోయేలా మట్టిని తవ్వారు. స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ వ్యవహారం ఇష్టారాజ్యంగా జరుగుతోంది. కరిగిపోయిన నేమకల్లు గుట్టలు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో జరుగుతున్న మైనింగ్.. రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా చెప్పొచ్చు. మైనింగ్ డాన్గా పేరుగాంచిన టీడీపీ నేతలిద్దరు భారీగా క్రషర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. ఆరు హెక్టార్లు లీజు ఉంటే 50 ఎకరాల్లో తవ్వుతున్నారు. రూ.20 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని మాఫీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ‘తాడిపత్రి’లో విచ్చలవిడిగా... తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లి, తిమ్మనచెరువు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునేవారే లేరు. ఆత్మకూరు మండలంలో తారస్థాయికి.. ఆత్మకూరు మండలంలో ఎర్రమట్టి దందా తారస్థాయికి చేరింది. ‘తెలుగు తమ్ముళ్లు’ మట్టి దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతం మొత్తం ఇప్పటికే వెంచర్లతో నిండిపోయింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఎలాంటి గ్రావెల్ లీజులు లేకుండానే కొండలను పిండి చేసి అక్రమంగా మట్టి రవాణా సాగిస్తున్నారు. హిందూపురంలో పట్ట పగలే దోపిడీ.. హిందూపురం పట్టణం చుట్టూ ఉన్న రూరల్ ప్రాంతాల నుంచి మట్టి యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వినకుండా మట్టి తోలుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక టన్నుల కొద్దీ కర్ణాటకకు వెళ్లిపోతోంది. ధర్మవరం నియోజకవర్గంలో.. ధర్మవరం నియోజకవర్గలోని చిత్రావతి నది నుంచి రోజూ వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తోలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ప్రధాన హైవేలోనే నిర్భయంగా టిప్పర్లు వెళుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ వాహనాలను పట్టుకోలేదు. టీడీపీ వాహనాలు అనగానే పోలీసులు వాటికి రాచబాట వేసి మరీ బార్డరు దాటిస్తున్నారు. సహజ వనరుల స్వాహాపర్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు కొండలు కరిగిపోతున్నా.. గుట్టలు నేలమట్టమవుతున్నా ఎవరికీ పట్టని వైనం -
మడకశిరలో ప్రజాస్వామ్యం ఖూనీ
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకై నా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని అప్రజాస్వామికంగా కై వసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఐదుగురితో అధికారం దక్కించుకోవాలని.. మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్పర్సన్గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలని చూస్తున్నారు. నేడు చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం.. మడకశిర మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై గురువారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారి హోదాలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్కుమార్ హాజరు కానున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ.. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్సార్ సీపీకి చెందిన 15 మంది కౌన్సిలర్లకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విప్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మడకశిర మున్సిపల్ కమిషనర్ రంగస్వామికి మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. అదే విధంగా కౌన్సిలర్లకు కూడా విప్ పత్రాలను అందజేశారు. అడ్డదారుల్లో మున్సిపాలిటీ కై వసానికి కూటమి కుట్ర వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు.. క్యాంపునకు తరలింపు నేడు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన పార్టీ హైకమాండ్ విప్ ధిక్కరిస్తే పదవులకు చేటే మడకశిరలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి అడ్డదారుల్లో మున్సిపాలిటీని కై వసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం దారుణం. మేం 15 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు విప్జారీ చేశాం. ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవులు కోల్పోవడం తథ్యం. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
అందరికీ ధన్యవాదాలు
గోరంట్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ తెలిపారు. ఆ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబీకులను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ కల్లితండా రాగా, జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి అశేష ప్రజానీకం వచ్చి జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.‘ఓపెన్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి● డీఆర్ఓ విజయ సారథి ఆదేశంప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ విజయ సారథి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మే 19 నుంచి 24వ తేదీ వరకు ఓపెన్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా నుంచి 7,056 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకానుండగా, 45 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. సమావేశంలో డీఈఓ కృష్టప్ప, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పీఠం అధికారులు పాల్గొన్నారు.ముజఫర్ అలీ కన్నుమూతకదిరి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కదిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ముజఫర్ అలీ(62) బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన... రెండేళ్లుగా భార్యతో కలిసి కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడే కన్నుమూశారు. ఆయన తండ్రి నిజాంవలీ కదిరి మున్సిపల్ చైర్మన్గా, రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. తండ్రి మరణానంతరం ముజఫర్ అలీ చిన్న వయసులోనే కదిరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. ముజఫర్ అలీ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు ఆదోనికి వెళ్లి భౌతిక కాయాన్ని కదిరికి తీసుకొచ్చి ఖననం చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు ముజఫర్ అలీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 73.77 శాతం, మూడో సెమిస్టర్లో 82.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్లో చూడవచ్చు. అలాగే బీఎస్సీ, బీకాం, బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్ధేశించినట్లు అనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఈ.రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొపెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.లోకేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.ఆటో ఢీకొని బాలుడి మృతికదిరి టౌన్: ఆటో ఢీకొన్న ఘటనలో సైకిల్పై వెళుతున్న ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరిలోని కుమ్మర వీధికి చెందిన వేమారెడ్డి కుమారుడు దినేష్కుమార్రెడ్డి (11) బుధవారం ఉదయం ట్యూషన్కు వెళ్లి తిరిగి సైకిల్పై ఇంటికి బయలుదేరాడు. స్థానిక మౌనిక థియేటర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే వెనుకనే వేగంగా వస్తున్న ఆటో ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన దినేష్కుమార్రెడ్డిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. బాలుడి తాత ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.యువకుడి బలవన్మరణంమడకశిర రూరల్: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన లోకేష్నాయక్ (18) ఆలియాస్ పరమేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలోని ఓ పశువుల షెడ్డులో పనిచేస్తున్న లోకేష్ నాయక్... ఇటీవల ఇంటికి వచ్చి తిరిగి పనికి వెళ్లలేదు. జీతం బాగా ఇస్తున్న పనిని వదిలి ఎందుకు వచ్చావంటూ తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన లోకేష్నాయక్... బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అయ్యప్పస్వామి బంగారు విగ్రహ ప్రతిష్ట
ధర్మవరం అర్బన్: స్థానిక కేశవనగర్లో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయం ప్రారంభోత్సవంతో పాటు మణికంఠుడి బంగారు విగ్రహన్ని బుధవారం వేదమంత్రాల నడుమ ప్రతిష్టించారు. ఆలయ వ్యవస్థాపకులు, గురుస్వామి పీజే విజయ్కుమార్, సభ్యులు బండ్లపల్లి వెంకటజయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. సాయంత్రం అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై కొలువుదీర్చి పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. టీడీపీ నేత దౌర్జన్యం కనగానపల్లి: మండలంలోని కోనాపురం చెరువు కట్ట సమీపంలో దోభీఘాట్ వద్ద పంచాయతీ నిధులతో రజకుల కోసం ఏర్పాటు చేసిన బోరుబావిని స్థానిక టీడీపీ నేత కబ్జా చేశాడు. బోరుబావి నుంచి ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని తన పొలానికి మళ్లించుకుంటున్నాడు. దీంతో నీటి సౌకర్యం లేక రజకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ ఇదే బోరుబావి నుంచి గ్రామంలోని ఓ రైతు కొన్ని రోజుల పాటు తన పొలానికి నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో అభ్యంతరం తెలిపిన స్థానిక టీడీపీ నాయకులు తిరిగి ఆ పార్టీకి చెందిన వ్యక్తి దౌర్జన్యంగా నీరు మళ్లించుకుంటుంటే ఎందుకు మాట్లాడటం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్ను వివరణ కోరగా... ఇప్పటికే ఈ విషయంపై ఫిర్యాదులు అందాయని, బోరు కబ్జా చేసిన వ్యక్తికి నోటీసులు అందజేసి పైపులైన్ తొలగిస్తామని పేర్కొన్నారు. మామిడి చెట్ల నరికివేత లేపాక్షి: స్థానిక బింగిపల్లి మార్గంలో రైతు ముక్తియార్కు చెందిన మామిడి తోటలో 42 చెట్లను మంగళవారం రాత్రి దుండగులు నరికి వేశారు. బాధితుడు తెలిపిన మేరకు... తనకున్న 2.50 ఎకరాల పొలంలో మూడేళ్లుగా మామిడి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది కాపు దశకు వచ్చాయన్నారు. బుధవారం ఉదయం తోట వద్దకు చేరుకోగా 175 మామిడి చెట్లలో 42 మామిడి చెట్లను నరికి వేసినట్లుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. రైతు ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
పూర్వపు డీఈఓ ఆనందమూర్తి మృతి
అనంతపురం ఎడ్యుకేషన్: పూర్వపు జిల్లా విద్యాశాఖ విశ్రాంత అధికారి సెట్టేల ఆనందమూర్తి (74) కన్నుమూశారు. అనంతపురంలోని ఆరవిందనగర్లో ఆయన నివాసం ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందారు. ఆనందమూర్తి సొంతూరు శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. భార్య 2008లోనే మృతి చెందారు. ముగ్గురు కుమారులు సంతానం కాగా... ఇద్దరు హిందీ పండిట్లుగా, ఒకరు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. 1980లో జేఎల్గా ఉద్యోగంలోకి చేరిన ఆనందమూర్తి పదోన్నతి పొంది 1996 నుంచి 2004 వరకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2006 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐటీడీఏ, ఎస్సీఈఆర్టీలో పని చేసి 2008లో రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతిపై ఎంఈఎఫ్ నాయకులు బండారు శంకర్, హనుమంతరావు, రమేష్, రామన్న తదితరులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘సింగిల్ ఆర్డర్ల’తో సంచలనం.. ఆనందమూర్తి డీఈఓగా పనిచేసిన కాలంలో జిల్లాలో టీచర్ల బదిలీలకు సంబంధించి ‘సింగిల్ ఆర్డర్ల’ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీలతో పాటు ఆయా ఖాళీలకు డీఈఓ సింగిల్ ఆర్డర్ ఇచ్చి బదిలీలు చేశారు. ఒత్తిళ్ల కారణంగా డీఈఓ కొన్ని ఆర్డర్లు ఇస్తే వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అప్పట్లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు అనుకూలమైన వారికి చాలా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. కొందరు డీఈఓ సంతకాలను ఫోర్జరీ చేసి ఆర్డర్లు ఇచ్చిన అంశం దుమారం రేగడంతో ఆయనను విశాఖ జిల్లా అరకు ఐటీడీఏకు బదిలీ చేశారు. చికిత్సకు స్పందించక కియా ఉద్యోగి మృతి ధర్మవరం అర్బన్: ఉద్యోగంలో పని ఒత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన కియా ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని పీఆర్టీ వీధికి చెందిన కావలి గౌరీప్రసాద్ (23) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేక కియా పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. పరిశ్రమలో పని ఒత్తిడి తాళలేక చనిపోయావలని అనుకుంటున్నట్లు పలుమార్లు కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడ్డాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు నచ్చ చెప్పడంతో సర్దుకుపోతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గత మంగళవారం మధ్యాహ్నం తన అన్న ఫృథ్వీరాజ్కు ఫోన్ చేసి, తాను విషపూరిత ద్రావకం తాగినట్లు తెలిపాడు. దీంతో ఫృథ్వీరాజ్ ఇంటికి చేరుకుని అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్న గౌరీప్రసాద్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రిలో మృతిచెందాడు. ఘటనపై సీఐ నాగేంద్రప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. కుక్కను తప్పించబోయి వ్యక్తి... మడకశిర రూరల్: రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. వివరాలు.. మడకశిరకు చెందిన అమానుల్లా (54), బాబు బుధవారం ఉదయం వ్యక్తిగత పనిపై హిందూపురానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు... మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోని త్రిమూర్తి ఫామ్హౌస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పిచబోయి ద్విచక్రవాహనం అదుపు తప్పిడంతో కిందపడ్డారు. తీవ్ర గాయాలైనా అమానుల్లా, బాబును స్థానికులు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమానూల్లాను హిందూపురంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. -
గ్రంథాలయాలు... విజ్ఞాన వీచికలు
పుట్టపర్తి టౌన్: వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసమే పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత బాల్యం సెల్ఫోన్కు బందీ అయింది. దీంతో బాల్యానికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలిత్యం దూరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు దూరమైన బాల్యం యొక్క మాధుర్యాన్ని రుచి చూపించేలా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రంథాలయాల్లో జూన్ 6వ తేదీ వరకు 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వివిథ తరగతులకు చెందిన 2,200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వినోదంతో పాటు బాలల సాహిత్యం, కథలు వినడం, కథలు చెప్పడం, కథలు చదివించడం, పుస్తక సమీక్ష, చిత్రలేఖనం, రంగులు వేయడం, కాగితంతో కళారూపాలు తయారు చేయడం, సంగీతం, బొమ్మల తయారీ, నటన, యోగా, చదరంగం, క్యారమ్స్, క్విజ్, జీకే, స్పోకెన్ ఇంగ్లిష్, మొదలగు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పలు పాఠశాలలకు చెందిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యం మండలాల వారీగా ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరాలు ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు -
జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటా
చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. నా ఆసక్తిని గమనించి అమ్మ, నాన్న ప్రోత్సహించారు. పీఈటీ సూచనలతో సాధన చేసి ఆటలోని మెలకువలను తెలుసుకున్నా. అండర్ –14 బాలుర విభాగంలో 2024, అక్టోబర్లో హిందూపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపాను. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా – పి.లోకేష్బాబు, ఎంజీఎం పాఠశాల, హిందూపురం -
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
కదిరి: మరణానంతరం నేత్రదానంతో మరో ఇద్దరికి కంటి చూపునివ్వాలనే సదుద్దేశ్యంతో ఓ మహిళ తన నేత్రాలను దానం చేసింది. వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న కదిరిలోని అడపాలవీధికి చెందిన పద్మావతమ్మ(75) బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. అయితే తాను మరణించాక తన నేత్రాలను దానం చేయాలని ఆమె జీవించి ఉన్న సమయంలోనే కోరడంతో ఆ మేరకు కుటుంబసభ్యులు స్పందిస్తూ ఆమె నేత్రాలను బెంగళూరులోని శంకర్ నేత్రాలయానికి అందజేశారు. ఆమెకు భర్త వెంకటరెడ్డి (సెరికల్చర్ విశ్రాంత ఉద్యోగి), కుమారువు దేవనందన్రెడ్డి, కుమార్తె శ్రీదేవి ఉన్నారు. ఆమె అంత్యక్రియలను బుధవారం ఉదయం 9 గంటలకు కదిరిలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
ఆ మూడు స్థానాలకు 19న ఎన్నికలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ స్థానానికి ఈ నెల 19న మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ ఇచ్చి, 19న ఎన్నిక నిర్వహించేందుకు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎన్నికల అధికారులు రాజోలి రామచంద్రారెడ్డి, జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. కాగా.. గతంలో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల స్థానాలకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించారు. అయితే గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలతో పాటు కంబదూరు వైస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఆయా స్థానాలకు మార్చి 28న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు చర్యలు తీసుకున్నా.. రాజకీయ కారణాలతో వాయిదా పడ్డాయి. వైఎస్సార్సీపీ నేత షెడ్డుకు నిప్పు ధర్మవరం రూరల్: మండలంలోని బిల్వంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు హరిని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ఆయన వ్యవసాయ బావి వద్ద ఉన్న షెడ్డుకు మంగళవారం దుండగులు నిప్పు పెట్టారు. మంగళవారం వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలసి ఆయన తరలివెళ్లాడు. హరి గ్రామంలో లేడని తెలుసుకున్న దుండగులు పొలంలో ఉన్న షెడ్డుకు నిప్పు పెట్టడంతో అందులో నిల్వ చేసిన వేరుశనగ బస్తాలు, డ్రిప్పు పరికరాలు, స్ప్రింక్లర్ల పైపులు, ఇతర వ్యవసాయ పనిముట్లు కాలిబూడిదయ్యాయి. సమీపంలో ఉన్న రైతులు నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ‘బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలి’ ఓడీచెరువు: ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాని ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేయాల్సి వస్తే వారికి ఎనిమిదేళ్ల స్టేషన్ పాయింట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షర్ఫుద్దీన్, జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు.2017, ఆగస్టులో బదిలీ పొందిన ఉపాధ్యాయులను ఎనిమిదేళ్లు పూర్తి కాకుండానే బదిలీల జాబితాలో చేర్చారన్నారు. అలాంటప్పుడు వారికి ఎనిమిదేళ్ల స్టేషన్ పాయింట్లు కేటాయించాలని కోరారు. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. -
జిల్లాలో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/చెన్నేకొత్తపల్లి: మండు వేసవిలో వరుణుడు ప్రతాపం చూపాడు. ఖరీఫ్ పంటలకు మేలు జరిగేలా ముందస్తుగా వర్షించి అందరినీ మురిపించాడు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడి భగభగ మండగా, సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి ఉరములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మంగళవారం ఉదయం వరకూ జిల్లాలోని 17 మండలాల పరిధిలో 13 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తచెరువు మండలంలో 77.6 మి.మీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక సీకేపల్లి మండలంలో 74.6 మి.మీ, బుక్కపట్నం 59.4, పుట్టపర్తి 36.2, ధర్మవరం 34.6, నల్లమాడ 24, రామగిరి 23.6, కనగానపల్లి 15.2, కదిరి 15.2, పరిగి 11.6, అగళి 10.2, తలుపుల 7.4, రొళ్ల 7.4, ముదిగుబ్బ 6.8, ఓడీ చెరువు 6.4, పెనుకొండ 2.6, బత్తలపల్లి 1.2, తాడిమర్రి మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చెన్నేకొత్తపల్లిలో పొంగిపొర్లిన వాగులు, వంకలు.. చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు వాన కుమ్మేయడంతో ఏకంగా 74.06 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో చెన్నేకొత్తపల్లి నుంచి వెంకటంపల్లికి వెళ్లే దారిలో ఉన్న వంక పారింది. అలాగే మేడాపురం పంచాయతీ పరిధిలోని పెద్దమొగలాయిపల్లి, చిన్నమొగలాయిపల్లి గ్రామాల వద్ద వంకలు పొంగి ప్రవహించాయి. మేడాపురం, నాగసముద్రం తదితర గ్రామాల చెరువులకు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. తాజా వర్షంతో ముంగారు సేద్యానికి రైతులు సిద్ధమవుతుండగా...మూగజీవాలకు మేతతో పాటు అటవీ ప్రాంతంలో తాగునీరు లభిస్తుందని పశువుల కాపరులు చెబుతున్నారు. కాగా, రాగల ఐదు రోజులూ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 17 మండలాల పరిధిలో 13 మి.మీ సగటు వర్షపాతం నమోదు రాగల ఐదు రోజులూ వర్ష సూచన -
‘ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేయాలి’
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రతా సర్క్యులర్ను వెంటనే అమలు చేయాలని ఎన్ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి, జాయింట్ సెక్రటరీ నాగరాజు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చలో డీపీటీఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. చిన్నపాటి కారణాలతో కార్మికులపై వేధింపులకు గురి చేయడం సబబు కాదన్నారు. సిబ్బందికి చెల్లించాల్సిన పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, మహిళా సిబ్బందికి చైల్డ్కేర్ లీవ్లు మంజూరు చేయాలని, గ్యారేజ్ సిబ్బందిపై వేధింపులు మానాలని, ఆఫీస్ సిబ్బందికి సరైన కంప్యూటర్లు, ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని, సంస్థలో ఖాళీగా ఉన్న 12వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎంయూఏ జోనల్ అధ్యక్షుడు నాగశేఖర్, జిల్లా అధ్యక్షుడు ముత్యాలప్ప, శ్రీరామనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి షబ్బీర్, రీజనల్ ఉపాధ్యక్షుడు తిరుపతమ్మ, జాయింట్ సెక్రటరీ విజయమ్మ,తో పాటు ఆరు డిపోల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
● మంత్రి సవిత రొద్దం: జిల్లాలోని ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేపట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళీ శాఖ మంత్రి సవిత అన్నారు. రొద్దం మండలం బొక్సంపల్లి క్రాస్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు మంగళవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. సొంత ఊళ్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
జీజీహట్టిలో కొలిక్కిరాని అతిసారం
రొళ్ల: పది రోజులుగా రొళ్ల మండలం జీజీహట్టి గ్రామాన్ని వేధిస్తున్న అతిసారం మరోసారి తన ఉనికిని చాటింది. ఇప్పటికే దాదాపు 40 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇందులో అమూల్య (11) మృతి చెందింది. మరికొందరు కోలుకొంటున్నారు. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన శశికళ, చిక్కమ్మ, దొడ్డపూజారప్ప గారి మారన్న అతిసారం బారిన పడడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. ఆగమేఘాలపై గ్రామానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి, తహసీల్దార్ షెక్సావలి, ఎంపీడీఓ రామారావు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మారన్నను మధుగిరిలోని ఆస్పత్రికి, శశికళ, చిక్కమ్మను రొళ్లలోని సీహెచ్సీకి తరలించారు. అలాగే అతిసారం లక్షణాలతో బాధపడుతున్న చిక్కీరప్పను హిందూపురం, ఈరమ్మను మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ వ్యవసాయ బోరుబావిలో నీటిని తాగడం వలనే వాంతులు, విరేచనాలతో ప్రజలు బాధపడుతున్నట్లుగా గుర్తించిన అధికారులు సదరు రైతుకు నోటీసులు జారీ చేశారు. ప్రజలెవ్వరూ ఆ నీటిని వినియోగించరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇంటింటికీ తిరిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
దారి వెంట నీరాజనం..
చిలమత్తూరు: అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు బయలుదేరిన మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా జనం నీరాజనం పలికారు. హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఉదయమే బాగేపల్లి టోల్ప్లాజ్ వద్దకు వేలాదిగా చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ రాకకోసం నిరీక్షిస్తూ గడిపారు. వైఎస్ జగన్ కాన్వాయ్ టోల్ప్లాజా వద్దకు చేరుకోగానే ‘జై జగన్’ అంటూ నినదిస్తూ జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. తనకోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి వైఎస్ జగన్ కారులో నుంచే వారికి అభివాదం చేసుకుంటూ.. నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. అభిమాన తరంగం వెంట రాగా వైఎస్ జగన్ కొడికొండ చెక్పోస్ట్, కోడూరు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి క్రాస్, మీదుగా కల్లితండా చేరుకున్నారు. యువత భారీ బైక్ ర్యాలీతో కల్లితండా వరకూ జగన్ కాన్వాయ్ను అనుసరించింది.తిరుగు ప్రయాణంలోనూ అదే అభిమానం..మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించి రోడ్డుమార్గంలో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్కు అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. బెంగళూరు మార్గంలోని దారికి ఇరువైపులా నిలబడి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానం చూపారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా... నేటికీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. పాఠశాలల పునర్వవ్యవస్థీకరణను పారదర్శకంగా చేపట్టాలన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో అశాసీ్త్రయ విధానాలు వీడాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలలో 5 తరగతులను బోధించటానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్ హెచ్ఎం పోస్టు అదనంగా కేటాయించాలన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య 120 దాటితే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించాలని, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయించాలని, అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియంను కొనసాగించాలన్నారు. బదిలీ జీఓ వెంటనే విడుదల చేసి వేసవిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం శిబిరం వద్దకు వచ్చిన డీఈఓ కృష్ణప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, గౌరవాధ్యక్షుడు భూతన్న, బాబు, శ్రీనివాసులు, నారాయణ, శివశంకర్, అనిల్కుమార్, మారుతి, తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో యూటీఎఫ్ నేతల డిమాండ్ -
●వాస్తు దోషమని మూతేశారు!
ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్ యార్డ్ మొదటి గేటు కొంత కాలంగా మూత పడింది. మార్కెట్యార్డ్కు రెండు ప్రధాన గేట్లు ఉండగా ఇందులో పట్టణం వైపు నుంచి ప్రవేశించే మొదటి గేటును వాస్తు దోషం ఉందంటూ అధికారులు మూతేశారు. దీంతో మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ రేషన్ గోదాం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ గోదాంలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. ప్రస్తుతం సుదూరాన ఉన్న రెండవ గేటు ద్వారానే మార్కెట్ యార్డులోకి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సైన్స్ పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలతో అధికారులు గేటు మూసేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రీసర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలి: జేసీ
ప్రశాంతి నిలయం: భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వేను ఆర్డీఓలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్ఎస్, రీ సర్వే అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో జిల్లాలోని 32 గ్రామాల్లో చేపట్టిన సర్వే పనులు ఎలా జరుగుతున్నాయో సంబంధిత ఆర్డీఓలు పరిశీలించాలన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు బృందాలుగా ఏర్పడి రీసర్వే పూర్తి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఐకాన్ యూత్’ సదస్సుకు మదీహహిందూపురం టౌన్: ‘భవిష్యత్ భారతావని యువత ముందున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళూరులోని యెన్ఫోయా విశ్వవిద్యాలయంలో వేదికగా ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే అంతర్జాతీయ సదస్సు ‘ఐకాన్ యూత్ 2025’కు హిందూపురంలోని ఎస్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎ.మదీహ ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి సోమవారం తెలిపారు. రాష్ట్రం తరఫున నలుగురు పాల్గొంటుండగా...అందులో తమ కళాశాల విద్యార్థి కూడా ఉండటం గర్వకారణమన్నారు. ‘ఆధునిక యుగంలో ప్రజారోగ్య ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించడంలో యువత పాత్ర’ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ రూపంలో మదీహ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సెమినార్కు ఎంపికై న విద్యార్థినిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటేశులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సహచర విద్యార్థులు అభినందించారు. ‘పోలీసు స్పందన’కు 70 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి అర్బన్ డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు. -
తల్లికి వందనం.. బాబు ద్రోహం
కదిరి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడికెళ్లినా పిల్లలను చూడగానే ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం ద్వారా నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తాం’ అని గొప్పలు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పథకం అమలుకు నోచుకోలేదు. 2024–25 విద్యా సంవత్సరం కూడా ముగిసింది. కానీ నయాపైసా కూడా ఇవ్వలేదు. వచ్చే నెలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇలాంటి తరుణంలో ‘ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాకుండా విడతల వారీగా ఇవ్వాలనుకుంటున్నాం’.. అని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఇది కూడా గతంలో రుణమాఫీ అంశంలో తమను మోసగించినట్లుగానే ఉందని విద్యార్థుల తల్లులు అంటున్నారు. జగన్ హయాంలో రూ.కోట్లలో లబ్ధి.. జగన్ ప్రభుత్వంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,66,398 మంది విద్యార్థులకు రూ.946.41 కోట్ల లబ్ధి చేకూరింది. నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. కదిరి నియోజకర్గంలో 27,869 మందికి రూ.156.22 కోట్లు, ధర్మవరంలో 28,656 మందికి రూ.164.60 కోట్లు, పుట్టపర్తిలో 23,483 మందికి రూ.133.32 కోట్లు, హిందూపురంలో 27,954 మందికి రూ.160.04 కోట్లు, మడకశిరలో 23,365 మందికి రూ.133.83 కోట్లు, పెనుకొండలో 25,987 మందికి రూ.147.23 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో 9,084 మందికి రూ.51.25 కోట్లు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది చేకూరింది. అంతేకాక జిల్లాలో ‘జగనన్న విద్యాకానుక’ ద్వారా 1,62,699 మందికి రూ.62.21 కోట్లు, ‘జగనన్న వసతి దీవెన’ కింద 43,301 మందికి రూ. 162.38 కోట్లు, ‘జగనన్న విద్యా దీవెన’ కింద 44.082 మందికి రూ.314.91 కోట్ల లబ్ది చేకూరింది. నిధుల కేటాయింపులోనే కలవరం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చడం తప్ప చేకూర్చిన లబ్ధి అంటూ ఏదీ లేదు. 2025–26కు సంబందించి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ‘తల్లికి వందనం’ పథకానికి కేవలం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని చూడగానే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరిచారు. గత జగన్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి చేకూరిస్తే ఏడాదికి జిల్లాలోని విద్యార్థులకు రూ.250 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ లెక్కన తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ పథకం లబ్ధి చేకూర్చాలంటే చంద్రబాబు సర్కార్ కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవని తేల్చేశారు. అలా కాకుండా ఇంట్లో ఒక్కరికే పథకం లబ్ధి చేకూర్చినా ఈ నిధులు సరిపోవని అంటున్నారు. పథకం అమలుపై కమ్ముకున్న నీలి నీడలు విడతల వారీగా ఇస్తామంటున్న సీఎం చంద్రబాబు బాబు మాటలు నమ్మబోమంటున్న తల్లులు పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించే అమ్మ ఒడి పథకాన్ని కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగానూ ప్రకటించారు. అయితే పథకం అమలులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ.. తాజాగా విడతల వారీగా ఇస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనపై విద్యార్థుల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు విధిస్తే ఒప్పుకోం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండానే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాల్సిందే. నిబంధనల పేరుతో కోతలు విధించాలని చూస్తే ఊరుకోం. – రాజేంద్రప్రసాద్ యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బకాయి కలిపి చెల్లించాలి ‘తల్లికి వందనం’ పథకం కింద గత విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన బకాయితో కలిపి ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు మొత్తం నగదు మంజూరు చేయాలి. అది కూడా విడతల వారీగా కాకుండా అంతా ఒకేసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. షరతులు వర్తిస్తాయని సాకులు చెబితే ఒప్పుకోం. – బాబ్జాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
‘సర్పంచ్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’
పెనుకొండ రూరల్: సోమందేలపల్లి మండలం నాగినాయనిచెరువు సర్పంచ్ అంజినాయక్పై ఆదివారం నల్గొండ్రాయునిపల్లి, సోమందేపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ సోమవారం బాధితుడు అంజినాయక్తో కలసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నర్శింగప్పకు విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు నరసింహులు, సుధాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, మండల కన్వీనర్ గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు ● వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వెఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, శింగనమల వైఎస్సార్సీపీ నాయకులు కాటమయ్య, ప్రసాద్, శివశంకరనాయక్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్కు జ్ఞానీ జైల్సింగ్ స్మారక పురస్కారం తాడిమర్రి: మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నీరుగట్టు వెంకటేష్కు మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్సింగ్ స్మారక పురస్కారం దక్కింది. గత 30 ఏళ్లుగా వివిధ దిన పత్రికల్లో విలేకరిగా ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) యూనియన్ స్థాపించి ఐదు వసంతాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ స్పీకర్ షరీఫ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గోరంట్లలో అగ్ని ప్రమాదం గోరంట్ల: స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కాటన్ బజార్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోరంట్ల పట్టణానికి చెందిన ఇద్దరి భాగస్వామ్యంతో తమిళనాడుకు చెందిన గోకుల్ అనే వ్యక్తి శ్రీనివాస కాటన్ బిగ్ బజార్ ఏర్పాటు చేశారు. సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.50 లక్షల పైచిలుకు దుస్తులు, ఓ ద్విచక్ర వాహనం, ఆరు సీసీ కెమెరాలు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్నీ అనంతపురం: ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు. -
ప్రతి సమస్యకూ సంతృప్తికర పరిష్కారం చూపండి
ప్రశాంతి నిలయం: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసే వినతులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 172 వినతులు అందాయి. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులకు వర్చువల్ విధానంలో రాష్ట్ర స్థాయి కేపీఐల శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అలాగే మండల స్థాయి అధికారులందరూ వారివారి మండల స్థాయిలో జరిగే శిక్షణకు హాజరు కావాలన్నారు. అన్ని శాఖల ప్రధాన హెచ్ఓడీలు నెలవారీ కార్యాచరణ ప్రణాళిక నివేదికలు, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జూన్ 5న జిల్లా అంతటా అన్ని ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఇందుకు ఎన్ని మొక్కలు అవసరమవుతాయో ముందస్తుగానే నివేదికలు సిద్ధం చేసి డీఎఫ్ఓకు మంగళవారం లోపు అందజేయాలన్నారు. జిల్లాలో అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్కుమార్, డీఆర్వో విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐసీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్కుమార్, ఎల్డీఎం రమణకుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఈఓ కృష్ణప్ప, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీసహానీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్