breaking news
Sri Sathya Sai District Latest News
-
కూటమి పాలనలో పీఆర్ వ్యవస్థ నిర్వీర్యం
ప్రశాంతి నిలయం: కూటమి ప్రభుత్వ అశాసీ్త్రయ నిర్ణయాలతో పంచాయతీ రాజ్ (పీఆర్) వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ టీఎస్ చేతన్కు వినతి పత్రం అందించి, మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,150 కోట్లను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఈ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు దక్కాల్సిన ఉపాధి నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసి ఆ డబ్బులనూ కూటమి ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. తక్షణం సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూర్చాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 1,320 మంది పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 9 నెలల వేతనం విడుదల చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనం పెంచడంతో పాటు వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు కులశేఖరరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అశోక్రెడ్డి, రేగాటిపల్లి ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి, మంజునాథరెడ్డి, వైఎస్సార్సీపీ యూత్ విభాగం నాయకులు కొండారెడ్డి, భోగి కొండారెడ్డి, విశ్వనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, రాజారెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
అత్యాచారాలు.. దోపిడీలు
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, చోరీలు పెచ్చుమీరిపోతున్నాయి. రోజుకో చోట ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. ఏడాదిగా నియోజకవర్గంలో రోజూ ఏదో ఒక ఘటన జరుగుతున్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే పోలీసు యంత్రాంగం ముందస్తుగా నేరాలను తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అత్తాకోడలిపై అత్యాచారంతో మొదలు.. కూటమి సర్కార్ కొలువుదీరాక హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. పోలీసులు ఎవరినైనా పట్టుకున్నా.. వెంటనే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ వస్తోంది. దీంతో పోలీసులు తమకెందుకని భావించి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఏడాది కాలంలో హిందూపురంలో అకృత్యాలు, దౌర్జన్యాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ● చిలమత్తూరు మండలంలో గతేడాది అక్టోబరులో కొందరు దుండగులు అత్తాకోడలిపై అత్యాచారం చేయడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అప్పుడు ప్రారంభమైన నేరాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న చౌళూరులో అత్యాచార యత్నం, నేడు తూముకుంటలో హత్య, కిరికెరలో భారీ దోపిడీ..ఇలా ఏడాదిగా హిందూపురం..నేరస్తుల పరమైంది. ● చిలమత్తూరు మండలంలోని కందుర్పర్తి, చౌళూరు గ్రామాల్లో బాలికలపై జరిగిన అత్యాచార యత్నాలు కూడా కూటమి సర్కార్ హయాంలో చోటుచేసుకున్నవే. ● 2024 జూలైలో హిందూపురం మండలంలోని గొల్లాపురంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సతీష్ను టీడీపీ నేతలు దారుణంగా కొట్టి చంపారు. నిందితులను రిమాండ్కు పంపి పోలీసులు చేతులు దులుపుకోవడంతో వారు బెయిల్పై బయటకు వచ్చి బాధితులను బెదిరిస్తున్నారు. పైగా తమకు ఎవరు అడ్డుచెప్పినా అంతం చేస్తామంటూ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ● తాజాగా ఈనెల 26వ తేదీన లేపాక్షి మండలం మైదుగోళంలో రవికుమార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గంగోత్రి బార్ వద్ద ఆటోడ్రైవర్ అశోక్తో జరిగిన గొడవలో అతను మృత్యువాత పడ్డాడు. ఇక పేకాట, అక్రమ మద్యం, మట్కాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పోలీసుశాఖలోని కొందరి అండతోనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోయిన దోపిడీలు, దొంగతనాలు ● హిందూపురం రూరల్ మండలంలోని కిరికెర గ్రామం వెంకటాద్రి లేఅవుట్లో ఈనెల 26వ తేదీ రాత్రి నిత్యానందరెడ్డి ఇంట్లో జరిగిన భారీ దోపిడీ నియోజకవర్గంలో జరిగిన మరో సంచలనం. దుండగులు తుపాకులతో బెదిరించి మరీ 25 తులాల బంగారు నగలను దోపిడీ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాద్రి లేఅవుట్లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటన పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ఎనిమిది బృందాలు రంగంలోకి దిగినా.. ఇంత వరకూ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ● మరవకొత్తపల్లి బీసీ కాలనీలోనూ పట్టపగలే దుండగులు చోరీ చేసి బంగారం ఎత్తుకెళ్లారు. డ్రోన్లతో నిఘా పెంచుతామని ప్రకటించుకున్న పోలీసులు ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు. సీసీ కెమెరాల ఏర్పాటులోనూ అలసత్వం కనిపిస్తోంది. చిలమత్తూరు మండలంలో గతేడాదిగా కొడికొండ చెక్పోస్ట్తో పాటుగా మండలంలోని పలు చోట్ల బైక్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు కూడా జరిగాయి. అయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే బాలకృష్ణ సినీనటుడు బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఎప్పుడో చుట్టం చూపుగా హిందూపురం వచ్చి వెళ్తుంటారు. పాలన అంతా పీఏల కనుసన్నల్లోనే సాగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గంపై పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. దీంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ముఖ్యంగా పోలీసు శాఖ అధ్వాన్నంగా తయారైందని స్థానికులే చెబుతున్నారు. డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు ఉన్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. హిందూపురంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు ఏడాది కాలంలోనే పెచ్చుమీరిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు డీఎస్పీతో పాటు నలుగురు సీఐలున్నా ప్రయోజనం శూన్యం భయాందోళనలో నియోజకవర్గ ప్రజానీకం -
ఫెన్సింగ్ పోటీల్లో జస్వంత్రెడ్డి సత్తా
తలుపుల : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తొగటవాండ్లపల్లికి చెందిన బి.రామాంజులురెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు బి.జస్వంత్రెడ్డి సత్తా చాటాడు. జూన్ 29న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అండర్ –10 మినీ స్టేట్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇప్పి విభాగంలో సిల్వర్ మెడల్ సాదించాడు. అనంతపురం ఎంకే స్పోర్ట్ అకాడమీలో ఫెన్సింగ్లో జస్వంత్రెడ్డి శిక్షణ తీసుకున్నాడు. సిల్వర్ మెడల్ పొందినందుకు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా సెక్రటరీ సరస్వతి, స్పోర్ట్ అకాడమీ కోచ్ రాహుల్ అభినందించారు. జూలై 5, 6, 7 తేదీల్లో జరగనున్న మినీ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో జస్వంత్ పాల్గొననున్నట్లు కోచ్ రాహుల్ తెలిపారు. -
ప్రజా ప్రదక్షిణ వేదిక
10,187తన ఇంటిని ఇతరులు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని హిందూపురం డీబీ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఇప్పటి వరకు 14 సార్లు అర్జీలిచ్చారు. అయినా కనీస స్పందన లేదు. దీంతో జిల్లా రిజిస్ట్రార్కు.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా.. ఖర్చులు తప్ప ఉపయోగం లేదని బాధితుడు వాపోయాడు. పాలకులు, అధికారుల తీరుపై నమ్మకం పోయిందంటున్నాడు. రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్లుగా కర్ణాటకలో నివాసం ఉంటోంది. వారి భూమిని మూడు సర్వే నంబర్లలో కలిపి 5 ఎకరాలను పేరూరు గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆన్లైన్లో తమ పేరుపై ఎక్కించుకున్నారు. ఇటీవల ఆన్లైన్లో వన్–బీ చూడగా.. ఆ ఖాతా నంబరుపై మరొకరి పేరు వస్తుండటంతో బాధితులు మండల, డివిజన్ స్థాయిలో అర్జీలిచ్చారు. ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్కు వెళ్లి వరుసగా మూడు వారాలు అర్జీలిచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు. సాక్షి, పుట్టపర్తి ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇస్తే చాలా... ఎంతటి సమస్యనైనా అధికారులే మీ వద్దకు వచ్చి పరిష్కరిస్తారు’’ అంటూ పాలకులు గొప్పలు చెబుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేస్తే.. ఆన్లైన్ ద్వారా నేరుగా సీఎంఓ కు చేరుతుందని, గంటల వ్యవధిలోనే స్పందన వస్తుందంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. నిజమే అనుకున్న జనం కలెక్టరేట్ వరకూ తమ సమస్యపై అర్జీ ఇస్తే అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. దీంతో జనం ఒకే సమస్యపై పదేపదే అర్జీలిస్తున్నారు. అయినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. పైగా సమస్య పరిష్కారమైనట్లు సెల్ఫోన్లకు మెసేజ్లు వస్తుండటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలే అధికం.. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రతి సోమవారం వివిధ సమస్యలపై ప్రజల నుంచి సగటున 500 వరకు అర్జీలు అందుతుంటాయి. అందులో 400 వరకు (80 శాతం) రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. సాగులో ఒకరుంటే.. ఆన్లైన్లో మరొకరి పేరు ఉంటోంది. భూమి ఒకరి పేరు మీద ఉంటే.. ఇద్దరి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులే భూ కబ్జాలకు పాల్పడుతుండటంతో ఏడాది వ్యవధిలోనే భూ తగాదాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో జనం మండల, డివిజన్ స్థాయి తొలుత ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్కు వచ్చి అర్జీలిస్తున్నారు. అయితే కలెక్టరేట్లో ఇచ్చిన అర్జీని మళ్లీ డివిజన్ లేదా మండల అధికారులకే పంపుతుండటంతో సమస్యల పరిష్కారం అటకెక్కుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని ప్రదక్షిణ.. జిల్లాలో 32 మండలాలుండగా.. తనకల్లు, నల్లచెరువు, అమడగూరు, అమరాపురం, రొళ్ల, గుడిబండ, అగళి, రామగిరి, కనగానపల్లి, పరిగి మండలాలు జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉంటాయి. ఓసారి వచ్చి వెళ్లాలంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పైగా ఒకరోజు పనులు మానుకోవాల్సిందే. దీంతో ఆయా మండలాల వారు తమ సమస్యలపై తొలుత స్థానిక మండల, డివిజన్ స్థాయిలోనే ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ పరిష్కారం కాకపోవడంతో వ్యయ, ప్రయాసల కోర్చి పుట్టపర్తిలోని కలెక్టరేట్ వరకూ వస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పరిష్కార వేదికకు అందిన అర్జీలు (వివరాలన్నీ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ) 5,9342,313 తూతూ మంత్రంగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీలన్నీ బుట్టదాఖలు.. పరిష్కారమైనట్లు మెసేజ్లు ప్రతి వారం కలెక్టరేట్కు వచ్చి అర్జీ ఇచ్చినా ఫలితం శూన్యం కూటమి సర్కారు తీరుపై జనం లబోదిబో 7,3022,885ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు.. నా వ్యవసాయ మోటర్కు విద్యుత్ కనెక్షన్ కోసం రూ.1.40 లక్షలు చెల్లించాను. ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు మెటీరియల్ ఇవ్వలేదు. కేవలం స్తంభాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాతో డబ్బులు తీసుకున్న ఏఈ బదిలీపై వెళ్లారు. కొత్తగా వచ్చిన వాళ్లేమో.. మాకు తెలీదంటున్నారు. ఇప్పటికే విద్యుత్ ఎస్ఈ కార్యాలయంతో పాటు కలెక్టరేట్లో ఎనిమిది సార్లు అర్జీలిచ్చినా పట్టించుకున్న వారే లేరు. – రాజా, కొండకమర్ల, ఓడీ చెరువు మండలం నడవలేని స్థితిలోనూ.. వస్తూనే ఉన్నా నా భూమిని మరో వ్యక్తి ఆక్రమించాడు. పట్టా పాసు పుస్తకాలు చేయించుకుని నన్ను రానివ్వడం లేదు. ఇప్పటికే ఆరుసార్లు కలెక్టరేట్లో అర్జీలిచ్చిన.. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అంతకుముందు తనకల్లు తహసీల్దార్, కదిరి ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేశాను. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నడవలేని స్థితిలో పలుమార్లు కలెక్టరేట్కు వస్తున్నా.. నా భూమిని నాకు అప్పజెప్పలేకపోతున్నారు. పరిష్కరిస్తామని చెబుతుండటంతో ఆశతో వస్తున్నా. – కొండప్పనాయక్, మల్లిరెడ్డిపల్లి, తనకల్లు మండలంఅర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి అందే అర్జీలన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 266 అర్జీలు అందగా..వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్తే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామ సుబ్బయ్య, ఆర్డీఓ సువర్ణతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉన్నత విద్య అభ్యసిస్తున్న 8 మంది విభిన్న ప్రతిభావంతులకు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ సమకూర్చిన ల్యాప్టాప్లను కలెక్టర్ పంపిణీ చేశారు. -
సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ చూపాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన.. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్ఎస్, హౌసింగ్, పౌర సరఫరాలు, నీటి పన్నులు తదితర అంశాలపై ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా సర్వే అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలన్నింటికీ సరైన పరిష్కారం చూపాలన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై నెలాఖరులోపు రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఎల్ఎస్ గోడౌన్లను తనిఖీ చేయాలన్నారు. పురుగు మందు ప్రభావంతో రైతు మృతి చెన్నేకొత్తపల్లి: పొలంలో పురుగుల మందు పిచికారీ చేసి ఇంటికి వచ్చిన రైతు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలోని న్యామద్దల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (53) మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పంటకు రసాయన మందు పిచికారీ చేసి మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ప్రైవేటు వాహనంలో చికిత్స నిమిత్తం చెన్నేకొత్తపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య వరలక్ష్మితో పాటు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కాగా, పంటలకు రసాయన ఎరువులు పిచికారీ చేసే సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. గూగూడులో కొలువు తీరిన పీర్లు నార్పల: మండల పరిధిలోని గూగూడు మోహర్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో పీర్లు కొలువు తీరాయి. ఈ సందర్భంగా ఆలయంలో కుళ్లాయి స్వామి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకున్నారు. అగ్ని గుండం వద్ద భక్తిశ్రద్ధలు పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం కుళ్లాయి స్వామికి నిత్య పూజ నివేదన నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. -
‘మోడల్’ సీట్లు అమ్ముకుంటున్నారు
సాక్షి టాస్క్ఫోర్స్: కనగానపల్లి మోడల్ స్కూల్ ప్రవేశాల వ్యవహారం చర్చనీయాంశమైంది. సాక్షాత్తు ఆ పాఠశాల వైస్ చైర్మన్, టీడీపీ నాయకుడు పోతలయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివరిస్తూ ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. ఏం జరిగిందంటే... కనగానపల్లి మోడల్ స్కూల్లో 6 నుంచి ఇంటర్ వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతికి 40 సీట్లు ఉంటాయి. వసతి గృహంలో మాత్రం 100 సీట్లే అందుబాటులో ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కౌన్సెలింగ్ ద్వారా పలువురికి ప్రవేశాలు కల్పించారు. తాజాగా సోమవారం మిగులు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో పాఠశాల వైస్ చైర్మన్, టీడీపీ నాయకుడు పోతలయ్య పాఠశాల వద్దకు వెళ్లి అర్హులైన విద్యార్థినులకు సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే ప్రిన్సిపాల్ రవికిరణ్ సీట్లు లేవని చెప్పడంతో అతను కంగుతిన్నాడు. మిగులుసీట్లు ఎవరికిచ్చారు..ఎలా ఇచ్చారని ప్రశ్నించగా..ప్రిన్సిపాల్ సమాధానం చెప్పలేదు. కాగా, డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించడంతో పోతలయ్య వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి కనగానపల్లి మోడల్ స్కూల్లో జరిగిన అడ్మిషన్ల కుంభకోణాన్ని పరిటాల సునీతకు వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవికిరణ్ సీట్లు అమ్ముకుంటూ అర్హులైన పేద విద్యార్థినులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దీనిపై వెంటనే స్పందించి ప్రిన్సిపాల్పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోస్టు సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ఆవేదన వ్యక్తం చేస్తూ కనగానపల్లి మోడల్ పాఠశాల వైస్ చైర్మన్ సోషల్ మీడియాలో పోస్ట్ -
వివాహేతర సంబంధంతోనే హత్య
హిందూపురం: మూడు రోజుల క్రితం లేపాక్షి మండలంలో చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా నిర్ధారిస్తూ ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. హిందూపురంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహేష్ వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి 10 గంటల నుంచి లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (36) కనిపించకపోడంతో ఆయన తండ్రి బోయ అశ్వత్థప్ప ఫిర్యాదు మేరకు అదే నెల 25న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆనంద్, గోవిందరాజుపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందిన సమాచారం మేరకు గత నెల 25న రాత్రి గ్రామ శివారులోని నీటి కుంటలో బయటపడిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అశ్వత్థప్ప కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం తన భర్తదేనంటూ రవికుమార్ భార్య గీత నిర్ధారించింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త గీత ఫిర్యాదుతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. అనుమానితులైన గోవిందరాజు, ఆనంద్ను సోమవారం మధ్యాహ్నం మైదుగోళం సమీపంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు. ఆనంద్ భార్యతో రవికుమార్ వివాహేతర సంబంధం కొనసాగించేవాడని, ఈ విషయంగా పలుమార్లు మందలించినా అతని తీరు మారకపోవడంతో హతమార్చాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత నెల 24న సాయంకాలం మందు పార్టీ ఏర్పాటు చేసుకుందామని ఆనంద్ తెలపడంతో రవికుమార్ తన ఇంటి నుంచి చికెన్ చేయించుకుని బాక్స్లో తీసుకుని ఆనంద్, అతని తమ్ముడు గోవిందరాజుతో కలసి మైదుగోళం శివారులోని కురుబ లింగప్ప బీడు భూమికి చేరుకున్నారు. అక్కడ చాలా సేపటి వరకూ మద్యం తాగుతూనే ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో రవికుమార్ మద్యం మత్తులో జోగుతుండగా ఇదే అదునుగా భావించి అన్నదమ్ములు ముందుగానే సిద్ధం చేసుకున్న వేటకొడవలితో నరికారు. మొండెం నుంచి వేరుపడిన తలను ప్లాస్టిక్ సంచిలో వేసి, మొండెంతో పాటు లింగప్ప పొలంలోనే ఉన్న నీటి కుంటలో పడేసి వెళ్లిపోయారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. యువకుడి హత్యకేసులో వీడిన మిస్టరీ నిందితుల అరెస్ట్ -
పంచాయతీకే పంగనామం
సాక్షి, టాస్క్ఫోర్స్: ఇది రామగిరి... ఇక్కడ మేం ఏమైనా చేయగలం... అందినకాడికి దోచుకుంటాం ... లేదంటే లాక్కుంటాం.. అంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలమైన రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ బాగోతం బయటపడింది. పంచాయతీకి చెందిన ట్రాక్టర్ను గత సంవత్సర కాలంగా సొంత పనులకు వాడుకోవడమే కాదు రోజూ చుట్టు పక్కన ఉన్న గ్రామాల రైతులకు బాడుగలకు పంపుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. అంతేకాదు ఏకంగా ట్రాలీని సమీపంలోని కర్ణాటక ప్రాంతంలోని సోలార్కు లీజ్కు ఇచ్చాడంటే ఎంత ఘనుడో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని అధికారులు.. గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. అలాగే పంచాయతీ అభివృద్ధికి చెత్త తరలింపునకు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆయా ట్రాక్టర్లను టీడీపీ నాయకులు తమ ఆధీనంలో ఉంచుకొని సొంత పనులకు వాడుకుంటుండటం గమనార్హం. పేరూరులోనే కాదు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇదే రీతిలో ట్రాక్టర్లను సొంతానికి వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా పంచాయతీరాజ్శాఖకు చెందిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం ఇప్పటికై నా డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పవన్కల్యాణ్ ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా పంచాయతీల్లో ట్రాక్టర్లను వెనక్కు తీసుకొని పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేరూరు పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ దౌర్జన్యం ఏడాదిగా చెత్త తరలించే ట్రాక్టర్ను బాడుగకు పంపుతున్న వైనం మిగతా చోట్లా ఇదే రీతిలో దోచుకుంటున్నారన్న విమర్శలు -
‘పోలీసు స్పందన’కు 60 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. వినతులను ఎస్పీ రత్న స్వయంగా స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. మహిళలు, వికలాంగుల వద్దకు నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీఎస్పీ విజయకుమార్, ఎస్బీ సీఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు. ‘108’లో ప్రసవం మడకశిర రూరల్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్లోనే ప్రసవించింది. వివరాలు.. మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన గర్భిణి మహాలక్ష్మికి ఆదివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని గర్భిణిని పావగడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి పైలెట్ తిమ్మప్ప సాయంతో ఈఎంటీ మంజుల ఆమెకు కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రికి చేర్చారు. పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి ఈ సందర్భంగా బాలింత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆత్మహత్యాయత్నం కాదు.. హత్యాయత్నం!’ ధర్మవరం అర్బన్: స్థానిక గీతానగర్కు చెందిన వివాహిత రమాదేవిని ఆదివారం రాత్రి ఫిట్స్ వచ్చాయంటూ కుటుంబ సభ్యులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవిని ఆమె పుట్టింటి తరఫు బంధువులు వెళ్లి పరామర్శించారు. రమాదేవికి ఫిట్స్ రాలేదని ఉరి వేసి హత్య చేయాలని చూశారంటూ అనంతపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ స్పందించి ఓ కానిస్టేబుల్ను అనంతపురంలోని ఆసుపత్రికి పంపించారు. వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించారా? అనేది తేలాల్సి ఉంది. -
బదిలీల నరకయాతన
అనంతపురం: ఉమ్మడి జిల్లా సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియ నరక యాతనను మిగిల్చింది. అనంతపురంలోని డీపీఓలో చేపట్టిన ఈ ప్రక్రియకు ఉదయం 8 గంటలకంతా హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టలేదు. 12 గంటల తర్వాత తొలుత స్పౌజ్, పీహెచ్సీ, మెడికల్ సర్టిఫికెట్ ఉన్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. మూడు గంటల వరకు జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. తెల్లవారుజామున మూడు గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో నిరీక్షణ తప్పలేదు. దీంతో చంటి పిల్లల తల్లులు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవివాహితులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులను లోపలకు అనుమతించకపోవడంతో వారు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. మహిళల పట్ల పోలీసు శాఖ నిర్దయగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆదోనిలో ఓ మహిళా కానిస్టేబుల్ చనిపోయిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి ఆగమేఘాలపై పిల్లల తల్లులకు పాలు, జ్యూస్ అందించారు. కౌన్సెలింగ్ కేంద్రంపైన సేద తీరేందుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కోటాలో అభ్యంతరాలు స్పౌజ్ కోటాలో బదిలీలకు సంబంధించి తమ భర్త ఎక్కడ ఉంటాడో ఆ పరిసరాల్లోనే స్థానాన్ని కోరుకోవాలి. అయితే తాడిపత్రి, హిందూపురం పరిసరాల్లో పనిచేస్తున్న కొందరు ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వారిని స్పౌజ్ పరిసర ప్రాంతాల్లోని స్థానాలు కేటాయించారు. అర్ధరాత్రి ఆందోళన: గణనీయమైన ర్యాంకు ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించి వారు కోరుకున్న చోటు కేటాయించాలి. అలాగే రేషనలైజేషన్లో పోస్టు కోల్పోయిన వారికి జనరల్ కేటగిరి కింద చివరన పిలవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపట్టారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో పరిస్థితి అదుపు తప్పి అర్ధరాత్రి కౌన్సెలింగ్ ఆగిపోయింది. తిరిగి అధికారులు నచ్చచెప్పి కౌన్సెలింగ్ను కొనసాగించారు. -
నేడు పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి టౌన్: అర్హులైన లబ్ధిదారులకు జూలై నెలకు సంబంఽధించి పింఛన్లను మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ నరసయ్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 2,60,883 మంది లబ్ధిదారులకు రూ 114.09 కోట్లు మంజూరు కాగా, ఇందుకు సంబంఽధించిన నగదును సోమవారం బ్యాంక్ల నుంచి విత్డ్రా చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 2వ తేదీ కూడా పంపిణీ ప్రక్రియ ఉంటుంది. నేటి నుంచి తూమాటి దోణప్ప శత జయంతి ఉత్సవాలు ఉరవకొండ: తెలుగు సాహితీ విజ్ఞాన గని, బహుభాషా పండితుడు ఆచార్య తూమాటి దోణప్ప శత జయంతి వేడుకలు మంగళవారంనుంచి హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన దోణప్ప 1926, జూలై 1న సంజప్ప, తిమ్మక్క దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. హైదారాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా తెలుగు సాహితీ జగత్తు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది. గురుకులాల్లో ఇంటర్ మిగులు సీట్లకు కౌన్సెలింగ్ అనంతపురం రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ నుంచి సమాచారం అందిన విద్యార్థులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఈ నెల 2న బీ పప్పూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురకుల పాఠశాలలో బాలికలకు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, బాలురకు 2 నుంచి 4 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. వ్యక్తి దుర్మరణం పెనుకొండ: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం వెలగమాకులపల్లికి చెందిన గంగాధర్(40) తన సోదరుడు భాస్కర్, కుమారుడు ప్రణీత్తో కలసి సోమవారం ద్విచక్ర వాహనంపై పెనుకొండకు బయలుదేరాడు. నగర పంచాయతీ పరిధిలోని రబ్బర్ ఫ్యాక్టరీ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనడంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్, ప్రణీత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇరు పార్టీల కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదుతాడిపత్రి టౌన్: గత నెల 29న పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న కారణంతో టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన 20 మంది కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. వీరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రవితేజారెడ్డి, నవీన్ రెడ్డి, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ప్రణయ్ తదితరులు, అలాగే టీడీపీ కార్యకర్తలు మల్లికార్జున, పరమేష్, సుదర్శన్రెడ్డి, ఖాదర్, యాసిన్ తదితరులు ఉన్నారు. అనుమానాస్పద మృతి కుందుర్పి: మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం మరో ఇద్దరు కూలీలతో కలసి అదే గ్రామానికి చెందిన జోగప్పగారి హనుమంతు ఇంటి నిర్మాణ పనుల్లో కుమార్ పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన హనుమంతు, తదితరులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక కుమార్ మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమార్ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్ యాడికి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. యాడికిలోని అంకాలమ్మ వీధికి చెందిన వృద్ధుడు బోయ ఆదెప్ప మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదెప్పపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. సజావుగా ఏఎన్ఎంల బదిలీల కౌన్సెలింగ్ అనంతపురం మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ఏఎన్ఎంల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 803 మంది ఏఎన్ఎంలకు జూమ్ వీడియా ద్వారా డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. అర్ధరాత్రి వరకూ ఈ ప్రక్రియ సాగింది. సీనియర్ అసిస్టెంట్ కమలాకర్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 740 మందికి వారి సీనియారిటీ, ప్రగతి ఆధారంగా పోస్టింగ్ కల్పించారు. -
పోలీసుల అదుపులో టీడీపీ నేత
● సొంత పార్టీ నేతపై దాడిలో ప్రమేయం పెనుకొండ/రూరల్: మండలంలోని మునిమడుగు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ చిన్న వెంకటరాముడిని కొత్తచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మునిమడుగుకు చెందిన టీడీపీ నాయకుడు ఆంజనేయులు అలియాస్ బేనీషా కొత్తచెరువు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంలోని ఆస్పత్రికి తరలించి కాపాడుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో దాడికి కారకులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో దాడికి తమను ప్రేరేపించింది చిన్న వెంకటరాముడని వారు అంగీకరించినట్లు సమాచారం. దీంతో సోమవారం వేకువజామున చిన్న వెంకటరాముడిని కొత్తచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ముగ్గురితో పాటు చిన్న వెంకటరాముడిని సీరియస్గా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం చర్చనీయాంశమైంది. ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి లేపాక్షి: మండలంలోని ఉప్పరపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు కుమారుడు జశ్వంత్(19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఫైనలియర్ చదువుతున్న జశ్వంత్ ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయంశ్రీనివాసులు పంటకు నీరు కట్టేందుకు వెళ్లిన సమయంలో జశ్వంత్ తోడు వెళ్లాడు. పంటకు తాను నీరు కడతానని, ఇతర పనులేమైనా ఉంటే చూసుకోవాలని తెలపడంతో పని అప్పగించి తండ్రి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత పక్క పొలం రైతు పొలంలోకి ట్రాక్టర్తో మట్టిని తరలిస్తుండడం గమనించిన జశ్వంత్... డ్రైవర్ను మాట్లాడించేందుకు వెళ్లాడు. ట్రాక్టర్ ఇంజన్కు ట్రాలీకి మధ్యలో నిలబడి మాట్లాడుతూ పొలం వైపుగా వెళుతుండగా అదుపు తప్పి ట్రాలీ చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ వెంటనే ట్రాక్టర్ను ఆపి క్షతగాత్రుడిని బయటకు లాగి 108 వాహనంలో చికిత్స నిమిత్తం హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని సర్వే, భూరికార్డుల శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన గ్రామ సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. అధికారులు విడుదల చేసిన సీనియార్టీ జాబితాపై గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర నాయకులు అడ్డుచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాయినింగ్ డేట్ ఆధారంగా సీనియారిటీ జాబితా ఎలా ఇస్తారంటూ సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్తో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇతర శాఖలు, ఇతర జిల్లాల్లో మాదిరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ర్యాంక్ ఆధారంగా సీనియార్టీ జాబితా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదంటే కౌన్సెలింగ్ బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పరిస్థితిని డీఆర్ఓ మలోల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన సర్వే శాఖ కార్యాలయానికి చేరుకుని సీనియారిటీ జాబితాపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఏడీలు రూప్లానాయక్, విజయశాంతిబాయి, సూపరింటెండెంట్ అయూబ్తో సమీక్షించారు. జాబితాకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలను పరిశీలించారు. అనంతరం ఆయన సూచన మేరకు ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ తతంగం కారణంగా ఉదయం 9 గంటలకు మొదలవ్వాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ఆరు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. 624 మందికి కౌన్సెలింగ్ ఉమ్మడి జిల్లాలో 828 మంది గ్రామ సర్వేయర్లు ఉన్నారు. వీరిలో అధికారిక నివేదిక ప్రకారం ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 624 మంది ఉన్నారు. తొలుత మెడికల్ గ్రౌండ్స్, తరువాత స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మిగిలిన వారికి చేపట్టారు. సీనియార్టీ జాబితాపై తీవ్ర అభ్యంతరం ఆరు గంటలు ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభం -
కల్తీల కలవరం
సాక్షి ప్రతినిధి, అనంతపురం:మార్కెట్ నిండా నకిలీ, కల్తీ వస్తువులే. సామాన్యులు, నిరక్షరాస్యులే కాదు బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు కూడా నకిలీ వస్తువుల విషయంలో బోల్తా పడుతున్నారు. ఏది నకిలీనో, ఏది నిజమైనదో తేల్చుకోలేక వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. రోజువారీ వినియోగంలో ఉండే వస్తువుల వ్యాపారం రూ.కోట్లలో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నకిలీ, కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తరచూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇలా నకిలీ ఉత్పత్తులు మార్కెట్ను ముంచెత్తుతున్నట్టు ఆరోపణలున్నాయి. టీపొడిలో కొత్త కోణాలు ఇటీవలి కాలంలో కల్తీ టీపొడి వినియోగం తీవ్రమైంది. పదే పదే వాడిన టీని ఎండపెట్టి చింతపిక్కల పొడి వంటివి కలిపి మళ్లీ అమ్ముతున్నారు. ఇందులో కొన్ని ఆకర్షించే రంగులు, రుచికోసం రసాయనాలు కలుపుతున్నారు. ఒరిజనల్ టీపొడి అయితే ఒక గ్లాసు మంచినీళ్లలో వేస్తే... టీపొడి బాగా నానిన తర్వాత గానీ రంగుమారదు. అదే నకిలీ టీపొడి అయితే నీళ్లలో వేసిన రెప్పపాటులోనే నీళ్లన్నీ టీరంగులోకి మారిపోతాయి. లేబుళ్లు లేకుండా సంచుల కొద్దీ వస్తున్న ఈ టీపొడిలో మసాలాలు కలిపి వినియోగదారులకు అందిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తోంది. పాలను విషపూరితం చేస్తున్నారు కల్తీపాలు ఇప్పటికీ యథేచ్ఛగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని రకాల నూనెలను బాగా మరగకాచి, వాటిలో కొన్ని క్రీములు కలిపి నకిలీ పాలను తయారు చేస్తారు. వీటిని డెయిరీ సంస్థలకు అమ్ముతున్నారు. డెయిరీ సంస్థలు ఫ్యాట్ కంటెంట్ (కొవ్వు శాతం) చూస్తాయి గానీ, ఇవి నకిలీవా, కాదా అనే పరిస్థితి లేదు. కల్తీ మాఫియా గుప్పిట్లోనే.. కుళ్లిపోయిన వెన్నను కాచి నెయ్యిని తయారు చేస్తున్నారు. మంచి సువాసన కోసం కొన్నిరకాల రసాయనాలు కలుపుతున్నారు. కారంపొడిలో రకరకాల రసాయనాలతో పాటు కొన్ని రకాల పొట్టు కలిపి కారంపొడి తయారు చేస్తున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే గ్లూకోన్డీని కూడా కల్తీమయం చేశారు. కొన్ని రసాయనాల మిశ్రమం, శాక్రిన్లు కలిపి ఇస్తున్నారు. దీనివల్ల చిన్నారుల ఆరోగ్యం గుల్లవుతోంది. పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. శనగపిండిలో బియ్యపు పిండి కలిపి అమ్ముతున్నారు. చిరు ధాన్యాల్లో అంటే ధనియాలు, మినప్పప్పు వంటివి బాగా ఆకర్షించేలా ఉండటం కోసం ఓరకమైన నూనెలను కలుపుతున్నారు. ఇవి చాలా ఆకర్షించేలా ఉంటాయి. తాజాగా సర్ఫ్ పౌడర్, సబ్బులు, గుడ్నైట్ లిక్విడ్ వంటి నకిలీ సరుకులు విజిలెన్స్ తనిఖీల్లో పట్టుకున్నారు. నకిలీని కనిపెట్టేదెలా..? సబ్బులు, బట్టలకు వాడే సర్ఫ్ వంటివి కనిపెట్టడం సామాన్య వినియోగదారులకు కొంచెం కష్టమే. కానీ కొద్దిగా పరిశీలిస్తే... ఒరిజనల్ కంపెనీ వస్తువుకు, నకిలీ వస్తువుకు లేబుల్ మీద ఉన్న రాత (ఫాంట్)లో తేడా ఉంటుంది. లోగోలో కూడా ఒక అక్షరం తేడాతో ఇమిటేట్ చేస్తుంటారు. అన్నింటికీ మించి బార్కోడ్ అతిముఖ్యమైనది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో బార్కోడ్ స్కాన్ చేయరు. ఒకసారి బార్కోడ్ స్కాన్తో కొనుకున్న వస్తువును, కిరాణా షాపులో ఉన్న వస్తువును పోల్చి చూస్తే తేడా కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిక్లరేషన్ నిబంధనలే చూస్తాం మా పరిధిలో కంపెనీ డిక్లరేషన్లో ఇచ్చిన నిబంధనలు మాత్రమే చూస్తాం. అవి కరెక్టుగా ఉన్నాయా లేదా అనేదే పరిశీలిస్తాం. వస్తువు నాణ్యత చూడటం మా పరిధిలో లేదు. డిక్లరేషన్ నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తాం. – సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్, తూనికలు కొలతల శాఖ యాజమాన్యాలే జాగ్రత్తగా ఉండాలి నకిలీ ఏదో ఒరిజనల్ ఏదో సామాన్యులు కనిపెట్టలేరు. ఎన్నో ఏళ్లనుంచి వ్యాపారం చేస్తున్న కిరాణా షాపుల యజమానులకు డూప్లికేట్ ఏదో, మంచిదేదో తెలుసు. ఏజెన్సీలనుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి తీసుకోవాలి. లేదంటే నకిలీ ప్రొడక్ట్లు దొరికితే నష్టపోయేది కిరాణాషాపుల యాజమాన్యాలే. – జమాల్ బాషా, సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నీళ్ల నుంచి పాల వరకు అన్నీ కల్తీ తాజాగా గుడ్నైట్, ఏరియల్ వస్తువులు నకిలీ గతంలో బ్రూ ప్యాకెట్లు, టైడ్ పౌడర్లు ఫేక్గా తేలాయి ఒరిజనల్ ఏదో నకిలీ ఏదో కనిపెట్టలేక మోసపోతున్న జనం విజిలెన్స్ తనిఖీల్లో గుట్టు రట్టుతో వినియోగదారుల్లో ఆందోళన అనంతపురంలోని పాతూరుకు చెందిన మహబూబ్ బాషా దోమలబారినుంచి తప్పించుకునేందుకు ఆలౌట్ లిక్విడ్ బాటిల్ కొన్నారు. దోమలు చావకపోగా ఎన్ని రోజులైనా లిక్విడ్ అయిపోలేదు. అప్పుడు తెలిసింది ఇది నకిలీ ఆలౌట్ అని. గుత్తిలో సుజాత అనే మహిళ అర డజను బట్టల సబ్బులు కొనింది. కానీ ఆ సబ్బుతో ఎంత ఉతికినా మురికి పోలేదు. చివరకు ఆరా తీస్తే అవి నకిలీవని తేలింది. -
కారు దగ్ధం.. ప్రయాణికులు క్షేమం
నల్లమాడ: ప్రయాణిస్తున్న కారులో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందకు దిగిన వెంటనే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కదిరి ఫైర్ ఆఫీసర్ సుబహాన్ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీ సి.రెడ్డివారిపల్లికి చెందిన వెంకటశివారెడ్డి అనంతపురంలో ఆడిటర్గా పనిచేస్తున్నారు. బంధువులకు చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం భార్య అనిత (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు), కుటుంబ సభ్యులు కేశవరెడ్డి, వసుంధరతో కలిసి ఏపీ39ఎల్ఎం 4541 నంబరు గల కారులో స్వగ్రామం వచ్చారు. ఆ రాత్రికి అక్కడే ఉండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెంకటశివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం బయల్దేరారు. అలా సి.రెడ్డివారిపల్లి నుంచి కిలోమీటరు దూరం వెళ్లగానే కారు బానెట్లోంచి మంటలు వచ్చి దట్టమైన పొగలు రావడంతో వెంటనే అందులోని వారంతా కిందకు దిగి దూరంగా వెళ్లారు. కొద్దిసేపటికే కారు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమైంది. సమాచారం అందుకున్న కదిరి ఫైర్ ఆఫీసర్ సుబహాన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు కారు యజమాని వెంకటశివారెడ్డి తెలిపారు. -
కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు
బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బత్తలపల్లిలో ఖాశీంస్వామి పీరును కొలువుదీర్చారు. శనివారం రాత్రి ముజావర్లు మహబూబ్బాషా, ఖాశీంపీరా, ఫక్రుద్దీన్, ఖాశీంవలి ఖాశీంస్వామి చావిడిలో ఫాతెహా చేశారు. అర్ధరాత్రి పీరును కొలువుదీర్చారు. ఆదివారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. మండలంలోని గంటాపురం, పోట్లమర్రి, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, రాఘవంపల్లి, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం, వెంకటగారిపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. మొహర్రం వేడుకలు నిర్వహించే వారు పోలీస్స్టేషన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తప్పుడు ‘స్పౌజ్’ ఆప్షన్తో బదిలీలుధర్మవరం అర్బన్: సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది తప్పుడు ‘స్పౌజ్’ ఆప్షన్తో బదిలీలు చేయించుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్బాషా, ప్రధాన కార్యదర్శి పులిబండ్ల నరసింహారావు, గౌరవాధ్యక్షుడు రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలో శనివారం జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో స్పౌజ్ ఆప్షన్ దుర్వినియోగం చేయడంతో చాలామంది అర్హులు నష్టపోయారని తెలిపారు. ఆర్డీఎంఏ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఏ క్షణంలోనైనా తుంగభద్ర తుళ్లింత● డ్యాంలో ఇప్పటికే 68 టీఎంసీల నీరు నిల్వ ● 65,182 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఏ క్షణంలోనైనా నదికి నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తి డ్యాంలో నీటి మట్టం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 65,182 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 68 టీఎంసీలకు పైగా చేరింది. డ్యాం క్రస్ట్ గేట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో కేవలం 80 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని ఇటీవల అధికారులు తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు నీరు చేరితే ఏ క్షణంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నదీతీర, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. చిన్నారిని క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులుకదిరి అర్బన్: కేరళలో ఓ కుటుంబం వద్ద పెరుగుతున్న చిన్నారిని ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం క్షేమంగా కదిరికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్టేషన్లో డీఎస్పీ శివనారాయణస్వామి మీడియాకు వెల్లడించారు. మరువతండాకు చెందిన రవీంద్రనాయక్, శ్రీవాణి దంపతులు మూడేళ్ల కుమార్తెను కేరళలో ఎందుకు వదిలేసి వచ్చారంటూ వారి బంధువు రామచంద్రనాయక్ ఇటీవల గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. డబ్బుల కోసం కుమార్తెను అమ్మేశారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేశారు. సంతానం లేని దంపతులకు పెంచుకునేందుకు తమ కూతురును ఇచ్చామని రవీంద్రనాయక్ దంపతులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేరళకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి అక్కడ రాజేష్, స్వాతి దంపతుల వద్ద ఉన్న బాలికను తీసుకుని కదిరికి వచ్చారు. సోమవారం సీడబ్ల్యూసీ ముందు చిన్నారిని హాజరుపరుస్తామని, చిన్నారిని విక్రయించారా.. నిజంగా పెంచుకునేందుకు ఇచ్చారా.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయాలు దర్యాప్తులో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. -
హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరణ?
పుట్టపర్తి/పామిడి: అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు తెలిపిన మేరకు... పామిడిలోని ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న కమ్మరి రామాచారి, పుష్పవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కార్పెంటర్ వృత్తితో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో 9 నెలల క్రితం రామాచారి తన పెద్ద కుమార్తె శ్రావణి(25)ని శ్రీసత్యసాయి జిల్లా బుక్క పట్నం మండలం కృష్ణాపురానికి చెందిన గోవిందాచారి, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు నీలకంఠాచారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద రూ.లక్షలు విలువ చేసే బంగారు, నగదు ఇచ్చారు. పెళ్లి అనంతరం నీలకంఠ కృష్ణాపురంలోనే వేరు కాపురం పెట్టాడు. వ్యవసాయంతో పాటు వేరుశనగ పప్పు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల వ్యాపారానికి సంబంధించి యంత్రాల కొనుగోలుకు డబ్బు అవసరం కావడంతో శ్రావణి తల్లిదండ్రులు నీలకంఠకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం శ్రావణిని నీలకంఠ వేధించడం మొదలు బెట్టాడు. తరచూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీనికి తోడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు మానుకోవాలని భార్య పదేపదే చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నీలకంఠాచారి పథకం ప్రకారం శనివారం రాత్రి నిద్రపోతున్న భార్య గొంతునులిమి హతమార్చి, అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం పామిడిలోని అత్తామామకు ఫోన్చేసి విషయం తెలిపాడు. అక్కడకు చేరుకున్న రామాచారి దంపతులు... తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యగా నిర్ధారించుకుని నిలదీసేలోపు నీలకంఠాచారి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అందే నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ విజయ్కుమార్ పేర్కొన్నారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో ఘటన మృతురాలు పామిడి నివాసి కుమార్తె కుటుంబ సభ్యులు నిలదీస్తుండగానే భర్త పరారీ -
● నేత్ర దానం
కదిరి టౌన్: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన సత్రం కోసం కృషి చేసిన శ్రీసత్రశాల సాయిరాం ప్రభాకర్ మృతి అనంతరం ఆయన నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ప్రభాకర్ దేహం నుంచి నేత్రాలను అనంతపురం రెడ్క్రాస్ సొసైటీ ఐ బ్యాంక్ సిబ్బంది సేకరించారు. మరణానంతరం నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలనే లక్ష్యంతో ముందకు వచ్చిన ప్రభాకర్ భార్య సత్రశాల పద్మ, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ధర్మవరం: స్థానిక సిద్దయ్యగుట్టకు చెందిన చక్కా వెంకటేష్(62) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య నాగవేణి, కుమార్తెలు రజిత, పూజిత, అల్లుళ్లు బాలాజీ, బింగి మోహన్కుమార్ను విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సజావుగా వీఆర్ఓల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం చేపట్టిన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్–2 వీఆర్ఓల బదిలీల కౌన్సిలింగ్ సజావుగా జరిగింది. మొత్తం 328 మంది హాజరు కాగా, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 121 మంది ఉన్నారు. మరో 53 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ బదిలీ కౌన్సెలింగ్ను డీఆర్ఓ ఎ.మలోల, అనంతపురం. శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్ పరిపాలనాధికారులు అలెగ్జాండర్, వెంకటనారాయణ నిర్వహించారు. ఎస్ఆర్లు, ఇతర పత్రాలను డిప్యూటీ తహసీల్దార్లు మూర్తి, లీలాకాంత్ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉదయం 11గంటలకు మొదలు కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కావడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళా వీఆర్ఓలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పోలీసుల అదుపులో దోపిడీ కేసు నిందితుడు? హిందూపురం: మండలంలోని కిరికెర వద్ద వెంకటాద్రి లే అవుట్లో నివాసముంటున్న సిమెంట్ వ్యాపారి నిత్యానందారెడ్డి ఇంట్లో చోటు చేసుకున్న దోపిడీకి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసును సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్తులను, అనుమానితులను విచారణ చేశారు. సంఘటన జరిగినప్పుడు హిందూపురం, బెంగళూరు ప్రాంతాల్లో ప్రయాణించిన వాహనాలు, సెల్ఫోన్ కాల్ డేటాలను సేకరించి దాని ఆధారంగా దొంగలు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
అ‘పూర్వ’ కలయిక
తనకల్లు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975–76లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత రువాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తరగతి గదులను ఆత్మీయంగా తాకుతూ నాటి అనుభూతులను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటిగురువులు కుళ్లాయిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, నవనీతమ్మను సత్కరించారు. అనంతరం తమ సీనియర్ విద్యార్థులైన విశ్రాంత ప్రిన్సిపాల్ బయప్పరెడ్డి, దేశాయి భక్తవత్సలరెడ్డి, నాగేంద్రను సన్మానించారు. తమ బ్యాచ్ విద్యార్థులంతా కలసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్రాంత టీచర్ భాస్కర్రెడ్డి, విశ్రాంత ఎస్ఐ మహమ్మద్ రఫీ, రత్నమయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, కృష్ణమూర్తి, సూర్యప్రకాష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఆర్సీని నియమించాలి’
కదిరి అర్బన్: పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు చేసి, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఆదివారం ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న డీఏలు, ఐఆర్లను ప్రకటించాలన్నారు. పీఆర్సీని నియమించి నిర్ణీత కాల పరిమితి లోపు నివేదిక తెప్పించుకుని వీలైనంత త్వరగా 12వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలను మంజూరు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు జాఫర్,ప్రసాద్, రవినాయక్, ఖలీల్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దంపతులపై హత్యాయత్నం కేసులో కుమారుడి అరెస్ట్ బత్తలపల్లి: దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బత్తలపల్లి పీఎస్ ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జాంపుల అప్పస్వామి, లక్ష్మీదేవి.. భవిష్యత్తు అవసరాల కోసమని కొద్ది మేర డబ్బు దాచుకున్నారు. వీరి కుమారుడు సురేష్బాబు అలియాస్ బాబుల్లా మద్యానికి బానిస. మద్యం తాగేందుకు డబ్బు కోసం తరచూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో 2023, నవంబర్ 22న మద్యం తాగేందుకు తనకు డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించాడు. తమ వద్ద లేదని వారు చెప్పడంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొడవలితో దాడి చేశాడు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సురేష్బాబు.. ఆదివారం గంటాపురం క్రాస్లో తచ్చాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
సిఫారసుకే పెద్దపీట
అనంతపురం సిటీ: ‘మనకు కావాల్సిన పిల్లలు వస్తున్నారు. జర చూసుకోండి. లెటర్ కూడా ఇచ్చి పంపుతున్నాం. వారు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇవ్వండి. లేదంటే రోడ్డు పాయింట్కు వేయండి. ఏ ఒక్కటీ మిస్ కావడానికి వీల్లేదు. అడిగినవన్నీ చేయాల్సిందే’ అంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్ల మీద ఫోన్లు చేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు ఆదివారం అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఓ వైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో బిజీబిజీగా ఉన్నా.. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఫోన్ కాల్ను అధికారులు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హల్చల్ చేశారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారు ముందుగా రావాలని, లెటర్లు లేని వారిని పక్కన ఉండాల్సిందిగా సూచించారు. లెటర్లు స్వీకరించి వారు ఎక్కడికి పోస్టింగ్ కోరుకుంటున్నారో మరీ తెలుసుకుని కేటాయించారు. తొలి రోజు అనుభవంతో.. మలి రోజు ప్రశాంతం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. తొలి రోజు (శనివారం) నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారి.. ఆందోళనలతో ముగిసింది. ఈ అనుభవంతో మలి రోజు (ఆదివారం) అధికారులు తీసుకున్న కొన్ని చర్యలు సాఫీగా సాగేలా దోహదపడ్డాయి. అభ్యర్థులందరినీ బయటే ఉంచి.. కొందరిని మాత్రమే అనుమతిస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టడంతో తొక్కిసలాటకు తావు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ కొనసాగినా ఇంకా అభ్యర్థులు మిగిలే ఉన్నారు. లెటర్లు ఉన్న వారికే ప్రాధాన్యత.. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికే అధికారులు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చారా.. అయితే రండి. మీకు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరి కొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫారసు చేయడం గమనార్హం. జెడ్పీ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో డిజిటల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ కొనసాగుతుండగా డీపీఓ నాగరాజునాయుడుకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ కనిపించారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ర్యాంక్లో తొలి స్థానంలో ఉన్నా.. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి ఓ అమ్మాయి లెటర్ తెచ్చుకున్నారు. ఒకే స్థానం కోసం ఇద్దరూ పోటీపడ్డారు. అయితే అప్పటికే ఆ స్థానం తొలి ర్యాంకర్ అబ్బాయికి కేటాయించగా.. అమ్మాయికి సర్దిచెప్పి మరో చోట అవకాశం కల్పించారు. అయితే ఏమాత్రం పలుకుబడి లేని వారు, ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చుకోలేకపోయిన వారు మదనపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా పశుసంవర్థక శాఖలో.. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారని సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కౌన్సెలింగ్కు ముందే అభ్యర్థులు మూడు స్థానాలను ఆప్షన్లగా చూపిస్తూ దరఖాస్తు చేసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక స్థానాన్ని కౌన్సెలింగ్కు పిలిచినప్పుడు కేటాయించాల్సి ఉంటుంది. అయితే పశుసంవర్ధక శాఖలో మాత్రం మీరు ఏవైనా మూడు మండలాలు కోరుకొని ఆప్షన్లు ఇచ్చి వెళ్లండి. అందులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తామంటూ’ ఉద్యోగులను వెనక్కి పంపడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌన్సెలింగ్.. ఉమ్మడి జిల్లా యూనిట్గా సచివాలయ ఉద్యోగులకు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో మిగిలి ఉండడంతో అర్ధరాత్రైనా సరే పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారులు పని చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. చాలా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్లో అధికారుల తీరు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా అధికారులకు ఫోన్ చేయించినా సరే మంచి ర్యాంకు ఉన్నా సరే దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం -
సౌత్జోన్ పెంకాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
హిందూపురం టౌన్: నంద్యాలలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెంకాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి సౌత్జోన్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల టాండింగ్ సీనియర్ విభాగంలో హిందూపురానికి చెందిన షేక్ నస్రీన్, జూనియర్ విభాగంలో శరణ్య, మదీహ, ప్రణవి, మానస మొదటి స్థానంలో నిలిచి, బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఫ్రీ జూనియర్స్ విభాగంలో హిందూపురానికి చెందిన దివ్య, ఫ్రీ టీన్ విభాగంలో తన్వితారెడ్డి, మఖాన్ విభాగంలో మధుర, మీనా, ఆఫిఫా కౌసర్ బంగారు పతకాలను సాధించారు. అలాగే టాండింగ్ బాలుర జూనియర్ విభాగంలో తరుణ్ ఆదిత్య, ఫ్రీ టీన్ విభాగంలో దుర్గా స్మరన్ బంగారు పతకాన్ని, ఈశ్వర్ రజత పతకాన్ని దక్కించుకున్నారు. ప్రతిభ చాటిన వీరిని జూలై 18 నుంచి 20 వరకు తిరుచ్చిలో జరిగే సౌత్జోన్ పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పెంకాక్ సిలాట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోజ్ సాయి, రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు రఫీక్ అహమ్మద్; ట్రెజరర్ రియాజ్ భాషా అభినందించారు. -
మద్యం మత్తునే హత్యకు కారణం!
గతంలో వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. అయినా మద్యం వారి మధ్య మాటలు కలిపింది. అదే రోజే మద్యం మత్తు విచక్షణను కోల్పోయేలా చేసి ఒకరి హత్యకు కారణమైంది. నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో ఈ నెల 23న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అనంతపురం: చిన్నపాటి వాదన కారణంగా ఘర్షణ పడి ఓ యువకుడిని హతమార్చిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఏం జరిగిందంటే.. ఈ నెల 24న ఉదయం అనంతపురంలోని బళ్లారి బైపాస్ సర్కిల్లో జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పార్క్లో పడుకుని ఉన్న వ్యక్తి తలపై గుర్తు తెలియని వ్యక్తులు ఫుట్పాత్ బ్రిక్తో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. హతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి గార్లదిన్నె మండలం, కోటంక గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చి నిర్ధారించారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ ఎన్.జగదీష్ కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నేర పరిశోధనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తొలుత సిదానందను ఆయన భార్య తరఫు వారు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టి అనుమానాల్లో వాస్తవం లేదని నిర్ధారించారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో నేర పరిశోధనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మద్యం షాపులో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన అనంతరం ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలు మార్గంలో తిరుపతికి చేరుకున్నట్లుగా పసిగట్టారు. అనంతరం పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సిదానందను హత్య చేసినట్లుగా అంగీకరించారు. భార్యను దూషించాడనే... అనంతపురంలోని ఐదో రోడ్డు భవానీ గుడి వద్ద నివాసముంటున్న ఎరికల నాగయ్య కుమారుడు ఎరికల లక్ష్మన్న అలియాస్ అలీ/ చిన్న లింగన్న/ అంజి, కళ్యాణదుర్గం రోడ్డులోని విద్యారణ్య నగర్లో నాగులుకట్ట వద్ద నివాసముంటున్న తుమ్మశెట్టి వెంకటరెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ బొప్పాయి, దోసకాయ లోడింగ్ పనులు చేస్తూ, తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ నెల 23న రాత్రి బళ్లారి బైపాస్ సర్కిల్ సమీపంలో మద్యం షాపు వద్ద తాగుతూ అప్పటికే అక్కడున్న సిదానందతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎరికల లక్ష్మన్నను సిదానంద బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. లక్ష్మన్న భార్యనుద్ధేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మన్న తన స్నేహితుడు వెంకటరెడ్డితో కలసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పార్కులో సేద తీరుతున్న సిదానంద వద్దకు చేరుకుని నుదుటిపై ఫుట్బాత్ బ్రిక్తో దాడి చేశారు. సిదానంద అక్కడికక్కడే చనిపోవడంతో ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలులో తిరుపతికి వెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్ఐలు కె.ప్రసాద్, పి.విజయభాస్కర్ నాయుడు, టెక్నికల్ టీంను ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. సిదానంద హత్య కేసులో వీడిన మిస్టరీ చిన్నపాటి గొడవ కారణంగా హత్య నిందితుల అరెస్ట్ -
బదిలీల తీరుపై ఆర్ఎస్కే అసిస్టెంట్ల అసంతృప్తి
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ఆదివారం ఉద్యాన, పశు సంవర్థకశాఖ కార్యాలయాల్లో కొనసాగింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ కింద ధరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే కొందరు తాము కోరుకున్న స్థానం కాకుండా మరో స్థానం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు 280 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు హాజరు కాగా, వారి ఎస్ఆర్లు ఇతర ధ్రువీకరణ పత్రాలను ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, ఏడీహెచ్ దేవాందన్, సూపరింటెండెంట్ బాషా తదితరులు పరిశీలించి, పోస్టింగ్ కల్పించారు. అలాగే పశు సంవర్థకశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీలు వెంకటస్వామి, శుభదాస్, డీడీలు, సూపరింటెండెంట్ల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్కు 180 మంది విలేజ్ అనిమిల్ హస్బెండరీ అసిస్టెంట్లు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ జెండా దిమ్మె ధ్వంసం రొద్దం: మండలంలోని బీదానిపల్లిలో ఆరేల్ల క్రితం ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండా దిమ్మె, శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త చంద్రమౌళి ధ్వంసం చేశాడు. విషయాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గోపాలరెడ్డి, చలపతి, బాబయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో నేర నియంత్రణ
● సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు వేగవంతం ● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితోనే నేర నియంత్రణ సాధ్యమని, అందువల్ల కేసుల దర్యాప్తులో అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫెరెన్స్ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి, కదిరి, హిందూపురం, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత ఆరు నెలల్లో వివిధ కేసుల్లో పురోగతి సాధించిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందని, అందరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. చోరీల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి పూట గస్తీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు తీసుకోవాలన్నారు. వాటిని నేర రికార్డులతో సరిపోల్చి నేరగాళ్లను పట్టుకోవాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణ, కేవీ మహేష్, నరసింగప్ప, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెలవులో రామగిరి సీఐ ●● రాజకీయ ఒత్తిళ్లే కారణమా? చెన్నేకొత్తపల్లి: రామగిరి సీఐ శ్రీధర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ నంబర్ను కూడా ఆయన శుక్రవారం స్టేషన్లోనే సరెండర్ చేశారు. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని, తిరిగి ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తించడం అనుమానమేనన్న చర్చ జరుగుతోంది. పది నెలలు కూడా కాకుండానే... రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీధర్ పదినెలల కిందటే విధుల్లో చేరారు. సర్కిల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉండటంతో నిరంతరం ఒత్తిళ్లలోనే విధులు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. ప్రతి కేసులోనూ టీడీపీ నేతలు కలుగజేసుకోవడం...టీడీపీ ముఖ్యనాయకులు ఆదేశాలు జారీ చేయడంతో విసిగిపోయి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ● రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన కురబ లింగమయ్య హత్య.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాఫ్టర్లో రాగా, హెలీప్యాడ్ వద్దకు భారీగా జనం వచ్చి హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడం. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఆయా ఘటనలకు సంబంధించి సీఐ శ్రీధర్పై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ తరచూ సెలవులో వెళ్తుండటంతో ఆయా కేసుల దర్యాప్తు చాలా నిదానంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీధర్ ఆందోళన చెందారని, మరోవైపు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తట్టుకోలేక సీఐ సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. -
తడ‘బడి’న పాఠం
ఇది అగళి మండల పరిధిలోని కంబదపల్లి ప్రాథమిక పాఠశాల. 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నా... ఇక్కడ ఈ విద్యా సంవత్సరం నాలుగో తరగతిలో వర్షిణి అనే విద్యార్థిని మాత్రమే చేరారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు రవి చిన్నారికి పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో 1,2 తరగతుల విద్యార్థులు చాలా మంది ఉన్నా... వారంతా సమీపంలోని మధుడి గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు. అగళి మండల పరిధిలోని ఐ.తోణసన్నపల్లి గ్రామంలోని పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వీరు. ఇక్కడ ముగ్గురు విద్యార్థులుండగా.. ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్నారు. అలాగే నందరాజన్నపల్లి గ్రామంలోనూ నలుగురు విద్యార్థులుండగా.. ఒక ఉపాధ్యాయురాలిని ప్రభుత్వం నియమించింది. అగళి: కూటమి సర్కార్పై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకానికి ఈ రెండు చిత్రాలు అద్దం పడుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగా, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ కూటమి సర్కార్ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుండటంతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు కళకళలాడుతుండగా... సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. -
అర్ధంతరంగా ఆగిన బదిలీలు
అనంతపురం సిటీ: తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆందోళనకు దిగడంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీ అర్ధంతరంగా ఆగింది. అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.జహీర్ అస్లాం ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా పీఆర్ హెడ్ మురళీమోహన్, ఈఈ ప్రభాకర్రెడ్డి, డీఈఈలు కె.లక్ష్మీనారాయణ, రాజేంద్రప్రసాద్, డీఎల్ మురళి, జింకల కృష్ణజ్యోతి, సూపరింటెండెంట్లు ఖాజీ మొహిద్దీన్, రమాదేవి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5.50 వరకు కౌన్సెలింగ్ సజావుగా సాగింది. సాయంత్రం ఆగిన కౌన్సెలింగ్.. సాయంత్రం 5.50 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఆ తరువాత అర్ధంతరంగా ఆగిపోయింది. కౌన్సెలింగ్లో కొందరు సచివాలయ ఉద్యోగులు పెళ్లి కాకపోయినా.. తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సృష్టించి సమర్పించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వాటి సంగతి తేల్చాకే కౌన్సెలింగ్ కొనసాగాలని, అప్పటి వరకు ఆపేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ ఆపేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. విధిలేక అధికారులు కౌన్సెలింగ్ నిలిపివేశారు. కేసులు నమోదు చేయండి.. పెళ్లి కాకపోయినా.. కొందరు తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే కౌన్సెలింగ్ హాల్ నుంచి ఇంటి దారి పట్టారు. పీఆర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలకు కౌన్సెలింగ్ తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆందోళన సాయంత్రం కౌన్సెలింగ్ నిలిపేసిన అధికారులు -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే అడు!్డ
సాక్షి టాస్క్ఫోర్స్: రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ పేర్లు ముద్రించడాన్ని సహించలేక కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాహకులకు అధికారులు నోటీసు లిచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించారు. వివరాలు.. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు 2021 ఏప్రిల్లో తీర్మానం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు విగ్రహ ఏర్పాటుకు తహసీల్దార్, ఎంపీడీఓ అనుమతి తీసుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కోసం చందాలు వసూలు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రూ.2 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ రూ.7 లక్షల విరాళం అందించారు. పలువురి ద్వారా మొత్తం రూ.15 లక్షలు వసూలు చేసిన భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు రాప్తాడులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆదివారం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల క్రితమే ఉత్సవానికి సంబంధించి పాంప్లేట్లు కొట్టించి అందరికీ పంచారు. ఆ రెండు పేర్లు తొలగించండి..! విగ్రహావిష్కరణ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహోదగ్రులైనట్లు తెలిసింది. అధికారులకు ఫోన్ చేసి మండిపడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, సాకే రాజేష్ కుమార్ పేర్లు ఉండకూడదని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఎలాగోలా కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ నిర్వాహకులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చారు. పర్మిషన్ తీసుకుని పనులు చేసుకోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీలకతీతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాం.. నోటీసులపై భీమ్ రావ్ యువజన సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్, వైస్ ప్రెసిడెంట్ బాల నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు. 2021 నుంచి పనులు జరుగుతున్నా అధికారులు ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. పార్టీలకతీతంగా చందాలు వసూలు చేశామన్నారు.పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పేర్లు తొలగించి కార్యక్రమాన్ని చేసుకోవచ్చని సమాచారమిచ్చారన్నారు. సర్పంచు సాకే తిరుపాల్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ కూడా దళితులే అని, అయినా విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ అడ్డు పడడం దళిత జాతికే సిగ్గు చేటన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్కుమార్ పేర్లు ఉండటంతో కక్ష సాధింపు రాప్తాడులో ఆగిపోయిన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం -
అంతా మా ఇష్టం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ గందరగోళంగా తయారైంది. పారదర్శకత కరువైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సాగిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పలుకుబడి, డబ్బు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, సీనియార్టీ పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అసిస్టెంట్లు మండిపడుతున్నారు. ప్రణాళికేదీ...? కలెక్టర్ అనుమతితో ఈనెల 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ)కు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, సూపరింటెండెంట్ల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి, ప్రణాళిక లేకుండా చేపట్టడంతో ఏం జరుగుతుందనే వీఏఏలు ఆందోళనతో ఎగబడ్డారు. ర్యాంకులు, మెరిట్ ప్రకారం వీఏఏలు పట్టుబట్టగా, అధికారులు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం కొనసాగిస్తామని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గంట పాటు నిలిపేశారు. చివరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్కు అధికారులు అంగీకరించారు. సోమవారం ఉత్తర్వులు.. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పోస్టులు 282 ఉండగా... అందులో పనిచేస్తున్న వారు 248 మంది ఉన్నారు. అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఏఏలు 229 మంది బదిలీకి అర్హత ఉన్నట్లు తెలిపారు. మరో 19 మంది రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అటు ఉద్యానశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 323 మంది వీహెచ్ఏలు ఉండగా అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 280 మందికి బదిలీలు చేపట్టారు. మరికొందరు రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. శనివారం రెండు జిల్లాల నుంచి తరలివచ్చిన వీహెచ్ఏలు ఆప్షన్లు ఇచ్చేశారు. సోమవారం సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆప్షన్లు ఇవ్వడానికి వీహెచ్ఏలు కూడా ఇబ్బంది పడ్డారు. పట్టుపరిశ్రమశాఖ అసిస్టెంట్ల బదిలీలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ఎస్కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కరువు నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సర్వత్రా విమర్శలు -
ఉచిత వైద్యం.. సత్యసాయి లక్ష్యం
ప్రశాంతి నిలయం: నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం అందించడమే సత్యసాయి లక్ష్యమని, సత్యసాయి వైద్య సంస్థలు ఈ మేరకు పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైట్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్.సుందరేశ్ దబిర్ అన్నారు. శనివారం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, వైద్య సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి ‘ఆదర్శ వైద్యం’ అన్న అంశంపై ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుందరేశ్ మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సత్యసాయి బాబా 1956లో పుట్టపర్తిలో సత్యసాయి జనరల్ ఆస్పత్రి ప్రారంభించారని, ఆ తరువాత బెంగళూరులో జనరల్ ఆస్పత్రి, ప్రశాంతి గ్రాం, వైట్ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదైన సేవగా మారిందని, కానీ సత్యసాయి సంస్థలు మాత్రం నేటికీ ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. ఇక్కడి సిబ్బంది సైతం రోగులను ప్రేమతో కూడిన వైద్యం సేవలు అందిస్తూ సాంత్వన కలిగిస్తున్నారన్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఏటా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలను సత్యసాయి వైద్య సంస్థల్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పని చేస్తోందన్నారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టోక్యో, యూనివర్సిటీ ఆఫ్ చికాగో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేసుకున్న రెండు ఒప్పంద పత్రాలను సత్యసాయి మహాసమాధి చెంత ప్రదర్శించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వైద్య సిబ్బంది సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ మెడికల్ సదస్సులో డాక్టర్ సుందరేశ్ దబిర్ -
పంచాయతీ కార్యదర్శుల నిరసన
ప్రశాంతి నిలయం: పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్లో ఫీడ్బ్యాంక్ ఆధారంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిర్ణయించడం బాధాకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎక్కువ మజరా గ్రామాలు ఉండడం వల్ల ట్రైసైకిల్స్ ద్వారా ప్రతి గ్రామానికీ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందన్నారు. ,ప్రతి గ్రామానికీ ఒక క్లాప్ మిత్రను నియమించి ఇళ్లను బట్టి వారి వేతనాన్ని ప్రభుత్వమే నిర్ణయించి చెల్లించాలని కోరారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లను శానిటేషన్, పీడబ్ల్యూఎస్ స్కీంలలో పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, సచివాలయాల్లో రేషనలైజేషన్లో భాగంగా మిగులు ఉద్యోగులను పంచాయతీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేయించేందుకు పూర్తి అజమాయిషీ లేకపోవడం వల్ల ఇబ్బదులు పడుతున్నామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో డీఆర్ఓను కలసి అందజేశారు. సమస్యలు పరిష్కరించాలి హిందూపురం టౌన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీలను అప్గ్రేడ్ చేయడంతో పాటు సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థి బలవన్మరణం బత్తలపల్లి: డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామాపురం గ్రామానికి చెందిన కప్పల ఆదినారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు కప్పల నారాయణస్వామి (22) అలియాస్ బిందు డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన నారాయణస్వామి శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. -
ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయ సహాయం
హిందూపురం: వివిధ కేసుల్లో రిమాండ్లో ఉంటున్న వారిలో ఆర్థిక స్థోమత లేని వారికి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శనివారం హిందూపురం సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. ఏ కేసులో ఎంత కాలంగా రిమాండ్లో ఉంటున్నారని ఆరా తీశారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోగలరా.. సబ్జైలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ బెయిల్ కోసం న్యాయవాదులను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేని వారికి అర్హత ఉంటే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. జైళ్లకు రావడం వల్ల స్వేచ్ఛ, శాంతి కోల్పోతారని, కుటుంబాల గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయని తెలిపారు. కనీసం జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. రిమాండ్ ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే రాత పూర్వకంగా రాసి జైలు ఆవరణలోని ఫిర్యాదుల పెట్టెలో వేయాలన్నారు. అనంతరం జైలు గదులు, వంటగది పరిశీలించి ఆహార పదార్థాల తయారీ కోసం ఉపయోగించే సరుకుల గురించి సబ్జైలర్ హనుమప్పను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వన్నూరప్ప, న్యాయవాదులు శివశంకర్, సుధాకర్, సందీప్, లోక్ అదాలత్ సభ్యులు హేమావతి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ వజ్రకరూరు: ఢిల్లీలోని డాన్బోస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ప్రారంభమైన ‘షీ రెప్రజెంట్స్–2025’ అనే ప్రతిష్టాత్మక నాయకత్వ అభివృద్ధి– శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన 45 మంది మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ఒకరు. వీరికి ఏడు రోజులపాటు పాలన, కమ్యూనికేషన్, ప్రజానైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు– వాటిపరిష్కార పద్ధతులు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మోనాలిసా మాట్లాడుతూ ఢిల్లీ శిక్షణకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. పశువులను తప్పించబోయి ఢీకొన్న కార్లుపెనుకొండ: పశువులను తప్పించే క్రమంలో రెండు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం శనివారం కారులో హైదరాబాద్ వెళుతుండగా.. పెనుకొండ సమీపంలోని పులేకమ్మ ఆలయం వద్ద పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ స్లో చేశాడు. ఆ సమయంలో ఈ కారును వెనక వేగంగా వచ్చిన మరో కారు ఢీకొంది. ఈ హఠాత్పరిణామంతో కార్లలో ప్రయాణిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న పెనుకొండ పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పడమే కాకుండా కారును రోడ్డు పక్కన నిలిపి.. వారిని మరో వాహనంలో పంపించారు. ఫేక్ కాల్తో నగదు మాయం రొద్దం: సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతూనే ఉన్నారు. బ్యాంకు అధికారుల పేరిట బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారు. రొద్దం మండలం గౌరాజుపల్లికి చెందిన ఓ యువతికి శనివారం అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని ఆధార్ అడిగాడు. ఆ యువతి ఆధార్ నంబర్ చెప్పి ఫోన్ పెట్టేయగానే తన బ్యాంకు ఖాతాలోని రూ.1000 నగదు డ్రా అయిపోయింది. తాను మోసపోయానని ఆ యువతి లబోదిబోమంటోంది. -
కార్యకర్తలకు తోడుగా ఉంటా
మహిళలకు రక్షణ కరువు బుక్కరాయసముద్రం/శింగనమల: చంద్రబాబు ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాలను లెక్కలతో సహా వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెడ్బుక్ మాటున సాగిస్తున్న అరాచకాలకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఇదే వేదిక నుంచి ‘రీ కాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిఽథున్రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్రెడ్డి, రమేష్రెడ్డి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, ఈరలక్కప్ప, దీపిక, మక్బుల్ అహ్మద్, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అధికార ప్రతినిధి ఎంపీ గోరంట్ల మాధవ్, పీఏసీ సభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ, మహాలక్ష్మి శ్రీనివాస్, అనంతపురం మేయర్ వసీం, టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల నాయక్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పెన్నోబిలేసు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కృష్ణవేణి, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు సోమశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు స్వాగతం పలికారు. అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా అవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సిద్దరాంపురం రోడ్డు మీదుగా వైఎస్సార్సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. 2019–24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 5 ఏళ్ల పాలనతో జగనన్న రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే చంద్రబాబు ప్రస్తుత ఏడాది పాలనలో రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, భోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు నరేష్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, ముత్యాల శీనా, పురుషోత్తం, పెద్ద కొండయ్య, చికెన్ నారాయణస్వామి, శ్రీనివాస రెడ్డి, ఆది, తదితరులు పాల్గొన్నారు. అరాచకాలను తిప్పికొట్టాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది బాలికలు మిస్సింగ్ అవుతున్నా మహిళా పక్షపాతి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నోరుమెదపరన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికలపై అత్యాచారాలు జరిగితే సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం కానీ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకపోయినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. హామీల అమలులో ఘోరంగా విఫలం బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార పార్టీ నాయకులు రెడ్బుక్ మాటున అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ వారు ఇసుక, ఎర్రమట్టి, రేషన్ బియ్యం దందా కోసం కొట్టుకుచస్తున్నారన్నారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన మందులు, నాణ్యమైన భోజనం ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రులను చూశాం కానీ.. నేడు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఖండించారు. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని ఏమాత్రం పట్టించు కోకుండా చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అవినీతి అక్రమాల్లో మునిగిపోయారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
కుళ్లాయిస్వామి గోవిందా
● ప్రథమ దర్శనంతో పులకించిన భక్తులు నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు. -
కంటైనర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఆరుగురు ప్రయాణికులకు గాయాలు చిలమత్తూరు: రోడ్డు పక్కన ఆపిన కంటైనర్ను వేగంగా దూసుకొచ్చిన ఓల్వో బస్సు ఢీకొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని రాయచూరు నుంచి బెంగళూరుకు 33 మంది ప్రయాణికులతో వీఆర్ఎల్ ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున చిలమత్తూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కోడూరు తోపు సమీపంలో ఉన్న గార్మెంట్స్ పరిశ్రమ వద్దకు చేరుకోగానే అప్పటికే రోడ్డు పక్కన ఆపిన కంటైనర్ ఆలస్యంగా గమనించిన ఓల్వో డ్రైవర్ వేగాన్ని నియంత్రించేలోపు నేరుగా వెళ్లి ఢీకొంది. ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా తొలుత కర్ణాటకలోని బాగేపల్లిలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ నుంచి బస్సును వేరు పరిచి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు చిలమత్తూరు పీఎస్ ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. చెరువుల్లో మట్టిని తరలించుకోండి : మంత్రి సవిత పెనుకొండ: అవసరాన్ని బట్టి చెరువుల్లోని మట్టిని తరలించుకోవాలని రైతులకు మంత్రి సవిత సూచించారు. ఈ విషయంగా అధికారులు ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. స్థానిక తన కార్యాలయంలో నియోజకవర్గ సాగునీటి సంఘం అధ్యక్షులతో శుక్రవారం ఆమె సమావేశమై మాట్లాడారు. రైతులు మట్టి తోలుకునేందుకు ట్రాక్టర్కు రూ.3 చెల్లిస్తే చాలన్నారు. నియోజకవర్గంలోని సాగునీటి కాలువల్లో జంగిల్ క్లియరెన్స్, మట్టి తవ్వకాలకు రూ. 3.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని 26 చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జంగిల్ క్లియరెన్స్కు మంజూరైన రూ.50 లక్షల నిధులతో కాలువల్లో ముళ్ల పొదల తొలగింపు, పూడిక తీత పనులు చేపట్టనున్నామన్నారు. అయితే ఈ నిధుల వినియోగానికి జీఎస్టీ సమస్య వుందని త్వరలో పరిష్కరించి పనులు ప్రారంభిస్తామన్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన పుట్టపర్తి టౌన్: ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూలై 5వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి. విజయరామరాజు కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి కొత్తచెరువులో పర్యటించారు. జూనియన్ కళాశాల, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలు, గదులను పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి సంబంఽధిత అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం సత్యసాయి విమానాశ్రయాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే విమానాశ్రయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. మట్కా రాస్తున్న మహిళల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా రాస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టి పక్కా ఆధారాలతో సరస్వతి, కుళ్లాయమ్మ, జ్యోతిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.30 లక్షల నగదు, సెల్ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామానికి చెందిన నరేష్ 42 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకలోని పావగడకు బొలెరో వాహనంలో తరలిస్తూ శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ సర్కిల్లో పట్టుపడ్డాడన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్టాక్ పాయింట్కు తరలించినట్లు వివరించారు. తనిఖీల్లో సీఐ శ్రీహర్ష, సీఎస్డీటీ జ్యోతి పాల్గొన్నారు. క్షుద్ర పూజల కలకలం నల్లచెరువు: స్థానిక పూలకుంట రోడ్డులోని తాటిచెర్ల బ్రదర్స్ క్రికెట్ మైదానంలో ముగ్గులు, కోడిగుడ్లు వేసి క్షుద్ర పూజలు నిర్వహించారు. క్రికెట్ మైదానంలో క్షుద్ర పూజలు నిర్వహించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపు కోసమా? లేదా, క్రీడాకారులపై క్షుద్ర పూజలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, మండల కేంద్రంలోని ఓ మొబైల్ షాప్ వద్దనూ ఇలాగే పూజలు చేశారు. బుధవారం అమావాస్య సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూదరుల అరెస్ట్ తలుపుల: మండలంలోని భూపతివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. అందిన సమాచారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టి 13 మందిని అరెస్ట్ చేసి, రూ. 68,200 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
వ్యవస్థలు నాశనం
పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను కూటమి సర్కారు నాశనం చేసిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష నేతలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసులు పెడతామని, భూములను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. అధికారులు, పోలీసులుకు భారత రాజ్యాంగం ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారని, దానికి లోబడే పని చేయాలని హితవు పలికారు. రెడ్బుక్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించి విమర్శలపాలు కావొద్దని పోలీసు అధికారులకు సూచించారు. -
తండ్రిపై తనయుడి కొడవలితో దాడి
పరిగి: తాను అడిగిన డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో తండ్రిపై తనయుడు కొడవలితో దాడి చేసి, గాయపరిచాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం ఎర్రగుంటలో నివాసముంటున్న వృద్ధుడు మోదప్పగారి క్రిష్టప్పకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కొన్నేళ్లుగా సోరియాసిస్తో బాధపడుతున్న రెండో కుమారుడు శంకర.. చికిత్స నిమిత్తం తరచూ తండ్రితో డబ్బులు అడిగేవాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలని తండ్రిని అడిగాడు. తన వద్ద డబ్బు లేదని తండ్రి తెలపడంతో శంకర ఘర్షణ పడి కొడవలితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దాడిని అడ్డుకుని క్షతగాత్రుడిని హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. క్రిష్టప్ప భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. -
మొహర్రం ఉత్సవాలు ప్రారంభం
బత్తలపల్లి: మత సామరస్యానికి, హిందూ– ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గూగూడు తర్వాత ఆ స్థాయిలో మొహర్రం ఉత్సవాలు జరిగే బత్తలపల్లి ఆధ్యాత్మిక శోభను నింపుకుంది. మండల వ్యాప్తంగా వైభవంగా నిర్వహించే మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బత్తలపల్లిలోనూ ఖాసీంస్వామి(మొహర్రం) ఉత్సవాలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో పీర్లను భద్రపరిచే పెట్టెను కిందకు దించి ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుండం తీసి వేడుకలకు అంకురార్పణ చేశారు. రాత్రి ఖాశీంస్వామి ప్రథమ దర్శనంతో భక్తులు పులకించారు. పదిరోజుల పాటు ఉత్సవాలుఉత్సవాలు పదిరోజుల పాటు వైభవంగా జరుగుతాయని ముజావర్లు(పూజారులు) తెలిపారు. జూలై 2నఐదవ సరిగెత్తు, 4న చిన్నసరిగెత్తు(పానకాలు), 5వ తేదీ ఉదయం గ్రామోత్సవం, 6న పెద్ద సరిగెత్తు, 7నఅగ్నిగుండ ప్రవేశం... జలధికి ఉత్సవం ఉంటుందన్నారు. భక్తులకు కాశీంస్వామి తొలిదర్శనం -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నారాయణస్వామితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు.అగ్రిగోల్ బాధితులను ఆదుకునే అంశాన్ని టీడీపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ఉంచిందని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి బాధితులకు న్యాయం చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పి ఏడాదవుతున్నా అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. హామీని అమలు చేయకపోతే బాధితులతో కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సభ్యులు కుళ్లాయప్ప, ధనుంజయ, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. -
అరటి సాగులో ఆదర్శం
పెనుకొండ: అరటి సాగులో పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన గోపాలరెడ్డి వైవిధ్యాన్ని కనబరుస్తూ పలువురిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానగరంలోనే నివాసముంటున్నారు. అయితే వ్యవసాయంపై మక్కువ ఉన్న ఆయన తరచూ అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ గ్రామంలో తనకున్న 3.75 ఎకరాల్లో యాలక్కి రకం అరటి సాగు చేపట్టారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న అరటి గెలలను బెంగళూరుకు చెందిన వ్యాపారులకు టన్ను రూ. 50 వేల చొప్పున విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. రూ. 26 లక్షల ఖర్చు.. తన తమ్ముడి సహకారంతో యాలక్కి అరటి సాగులో అంతర్పంటగా వక్క, టెంకాయ చెట్లను గోపాలరెడ్డి పెంచుతున్నారు. ఈ క్రమంలో పొలం చుట్టూ ఫెన్సింగ్, బోరు వేయించడం, డ్రిప్ ఏర్పాటు, షెడ్ నిర్మాణం, వీడర్ కొనుగోలు, పొలం చదును, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి దాదాపు రూ.26 లక్షల వరకూ వెచ్చించారు. కర్ణాటకలోని నెలమంగల సమీపంలో ఉన్న ఫ్రీన్లీ బనానా కంపెనీ నుంచి టిష్యూ కల్చర్ అరటి ఒక్కో మొక్కను రూ.30 చొప్పున, శివమొగ్గ సమీపంలోని తీర్థహళ్లి నుంచి వక్క మొక్కలు, చెళ్లకెర నుంచి ఒక్కో టెంకాయ మొక్కను రూ.380తో కొనుగోలు చేశారు. మొత్తం 2,500 అరటి మొక్కలు, 1,800 వక్క, 110 టెంకాయ మొక్కలను ఒకేసారి పొలంలో నాటి సాగు చేపట్టారు. ప్రస్తుతం చేతికి అందివచ్చిన తొలిదశ అరటి పంటను విక్రయించగా రూ.3.50 లక్షల ఆదాయం సమకూరింది. మరో రెండు కోతల పంట చేతికి వచ్చే అవకాశముంది. అరటి పిలకలను విక్రయిస్తుంటారు. ఒక్కో పిలకను రూ.20 నుంచి రూ.25 చొప్పున కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. అరటి ఆకులను బెంగళూరుకు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం అరటి మొక్క బోద నుంచి లభ్యమయ్యే గడ్డను ఇతర రైతులు తీసుకెళ్లి తమ పొలాల్లో పంట పెట్టుకుంటున్నారు. ఒక్కో గడ్డను రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. అంతర్ పంటలుగా వక్క, టెంకాయ బెంగళూరులో నివాసముంటూ సొంతూరిలో వ్యవసాయం సాగును భారంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ఉద్యోగి పంటల సాగుపై మక్కువ పెంచుకున్నాడు. వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడినా... సొంతూరులోని పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అవగాహనతోనే పంటల సాగు పంటల సాగుపై అనుభవం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం బెంగళూరులో నివాసముంటూ భార్యతో కలసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. గ్రామంలో పెద్దల నుంచి సంక్రమించిన 3.75 ఎకరాల పొలాన్ని బీడుగా మార్చడం ఇష్టం లేక అరటి సాగు చేపట్టాను. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతర్ పంటగా వక్క, టెంకాయ చెట్లను పోషిస్తున్నా. వృద్ధురాలైన తల్లి, వికలాంగుడైన తమ్ముడు తోడుగా ఉంటున్నారు. పంట సాగులో రైతులెవరైనా నా సహకారం కావాలనుకుంటే 974047 1698కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు. – గోపాలరెడ్డి, రైతు -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం
ప్రశాంతి నిలయం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్, ఎంపీ బీకే పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, కలెక్టర్ టీఎస్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీకే పార్థసారథి మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రంలోని 67 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని, సాంకేతిక లోపాలవల్ల కొందరు పథకం పొందలేకపోయారన్నారు. ‘పీఎం కిసాన్ సన్మాన్’ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద అదనంగా రూ.14 వేలు ఆర్థిక లబ్ధి కలుగుతుందన్నారు. అర్హులు ఉంటే వెంటనే గుర్తించాలన్నారు. వార్షిక ప్రీమియం రూ.456 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల బీమా లబ్ధి కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరై పూర్తయిన పనులను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని డ్వామా పీడీని ఆదేశించారు. జిల్లాలో రూ.3 వేల కోట్లతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలన్నారు. పింఛన్లపై విచారణ చేయించండి.. గతంలో మంజూరైన పింఛన్లపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే మరొకరిని నియమించాలన్నారు. మూడు నెలలకోసారి సమావేశం.. కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... ప్రతి మూడు నెలలకు ఒకసారి ‘దిశ’ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. కేంద్రం నిధులతో చేపట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి లోపాలను దిశ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని కేంద్రానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో పుట్టపర్తి, కదిరి, మడకశిర ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, ఎస్పీ వి.రత్న, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటనారాయణ, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వంశీకృష్ణారెడ్డితోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘దిశ’ సమావేశంలో చైర్మన్ బీకే పార్థసారధి -
పీఆర్లో నేడు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు శనివారం అనంతపురంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి సంఖ్యను కుదించింది. దీంతో 534 సచివాలయాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఈ లెక్కన ఐదేళ్లు పూర్తయిన వారు 315 మంది, ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు కలిగిన వారు 147 మంది ఉన్నారు. ఖాళీలు 72 ఉన్నట్లు తేల్చారు. యువకుడి దుర్మరణం కనగానపల్లి: కారు టైర్ పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. కేరళలోని ఎంబీబీఎస్ కళాశాలలో సీటు దక్కిన తన కుమారుడు హెయాన్స్ నాయక్ (20)ను ఆ కళాశాల చేర్పించేందుకు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మనీషాబాయి తన సమీప బంధువుతో కలసి కారులో వెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియ ముగించుకున్న అనంతరం శుక్రవారం ఉదయం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై కారు ముందు చక్రానికి అమర్చిన టైరు పేలి రహదారి పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది. హెయన్స్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనీషాబాయి, బంధువు సందీప్ నాయక్, డ్రైవర్ సమీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురం తరలించారు. ఘటనపై కనగానపల్లి పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
శ్రీచైతన్యలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల సీజ్
హిందూపురం టౌన్: పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎంఈఓ గంగప్ప శుక్రవారం ఆయా తరగతులను సీజ్ చేశారు. కాగా, శుక్రవారం ఉదయం ఆ పాఠశాలను వైఎస్సార్ ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరీష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుండడంతో ఎంఈఓకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి రూ.22వేల నుంచి రూ25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాం, టై, షూ, బ్యాగులను శ్రీచైతన్య పాఠశాల పేరుతో ముద్రించి ఇక్కడే కొనాలని నిబంధన పెట్టి దాదాపు రూ.8500ల వరకు వసూలు చేశారన్నారు. ఎంఈఓ గంగప్ప మాట్లాడుతూ.. శ్రీచైతన్య పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు లేవని, ఇకపై నిర్వహించకూడదని అన్నారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు చంద్రశేఖర్, భరత్, సాయిరాం, అనుదీప్, ఫణి, నాజీర్, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సిఫార్సులకే పెద్దపీట
ప్రశాంతి నిలయం/అనంతపురం కార్పొరేషన్: పాలనలో కీలకమైన సచివాలయ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలని, తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కూటమి నేతలు బదిలీలను వేదికగా మార్చుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంలో ఈనెల 25 నుంచి వివిధ విభాగాల్లో పని చేస్తున్న గ్రామ/వార్డు ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కూటమి నాయకులు తమ పరిధిలోని సచివాలయాల్లో తమకు కావాల్సిన ఉద్యోగులను తెచ్చుకునేందుకు ప్లాన్ చేశారు. సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వండి.. సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖ ఉంటేనే కోరుకున్న చోటకు బదిలీ సాధ్యమని భావించిన ఉద్యోగులు లేఖల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనితీరు, నిబంధనలన్నీ పక్కనపెట్టి ప్రజాప్రతినిధి సూచన మేరకు ఉద్యోగి కోరుకున్న స్థానానికి బదిలీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో అర్హులు తమకు కావాల్సిన స్థానాలను పొందేందుకు వీలులేకుండా పోయిందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రిక్వెస్టుతో కోరుకున్న చోటుకు.. 544 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా.. 4,373 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 2020 అక్టోబర్లో కొందరు, తరువాత నెల రోజుల వ్యవధిలో మరికొందరు ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉంది. అలాగే మ్యూచువల్, స్పౌజ్, హెల్త్ తదితర కారణాలతో ఉద్యోగులు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా రిక్వెస్టు అంశాలను సాకుగా చూపి చాలా మంది తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ‘రాజకీయం’ సిఫార్సు లేఖల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లచుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు శుక్రవారం జరిగిన వార్డు అడ్మిన్ బదిలీల్లో గందరగోళం కౌన్సెలింగ్ శనివారానికి వాయిదా -
షార్ట్ సర్క్యూట్తో ఎరువుల దుకాణం దగ్ధం
బత్తలపల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో ఓ ఎరువుల దుకాణం దగ్ధమైంది. బాధితుడు తెలిపిన మేరకు.. బత్తలపల్లికి చెందిన మోహన్రెడ్డి స్థానిక కదిరి మార్గంలో 30 ఏళ్లుగా ఎరువుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం లావాదేవీలు ముగించుకున్న అనంతరం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో దుకాణంలో నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన గస్తీ పోలీసులు సమాచారం అందివ్వడంతో వెంటనే యజమాని అక్కడు చేరుకుని షట్టర్ తెరిచాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న రైతులు రెండు ట్రాక్టర్ ట్యాంకర్ల నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ధర్మవరంలోని అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు, వివిధ రకాల విత్తనాలు, ఇతర సామగ్రి కాలి బూడిదైనట్లు బాధిత యజమాని వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నాయకులు తరలివచ్చి మోహన్రెడ్డికి ధైర్యం చెప్పారు. కోలుకునేందుకు అవసరమైన సాయం చేస్తామని భరోసానిచ్చారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రైళ్లల్లో కొరవడిన భద్రత
గుంతకల్లు: రైలు ప్రయాణమంటనే ప్రయాణికులు హడలెత్తిపోయే రోజులు వచ్చాయి. ముఖ్యంగా దుండగులు ఆర్ధరాత్రి సమయాల్లో సిగ్నల్ కోసం వేచి చూస్తూ రైల్వేస్టేషన్ ఔటర్ ప్రాంతాల్లో నిలిపిన రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెరలేపడమే ఇందుకు కారణం. ఇంత జరుగుతున్న రైల్వే ఎస్కార్ట్, నిఘా వ్యవస్థలు నిద్రావస్థలో ఉండిపోయాయి. రైళ్లల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఏసీ బోగీల్లో నిద్రపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రైళ్లలో జరిగిన చోరీలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 29న నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు గుత్తి జంక్షన్ సమీపంలో ఔటర్లో సిగ్నిల్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు ముందస్తు పథకం ప్రకారం దాదాపు నాలుగు స్లీపర్ బోగీల్లోకి చొరబడి మారణాయుధలతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించారు. ● మూడేళ్ల కిత్రం వరురసగా హంపి, రాయలసీమ, చైన్నె ఎక్స్ప్రెస్ రైళ్లు అదే ఔటర్లో సిగ్నల్ కోసం నిలిపిన సమయంలో దుండగులు చొరబడి దాదాపు 30 తులాలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ● గుత్తి–అనంతపురం రైలు మార్గంలోని తురకపల్లి రైల్వేస్టేషన్, గుత్తి–తాడిపత్రి రైలు మార్గంలోని జక్కలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ వైర్లును కట్ చేయడంతో రైలు ముందుకు పోవడానికి అవకాశం లేకుండా చేసి, ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణలు ఎత్తుకెళ్లారు. ● తాజాగా (గడిచిన సోమవారం వేకువజాము) తాడిపత్రి రైల్వేస్టేషన్ ఔటర్లో సిగ్నల్ వైర్లను కట్ చేసి కోమలి రైల్వేస్టేషన్ ఔటర్లో నిలిచిన ముంబై–చైన్నె ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలు విశాలక్ష్మి మెడలోని 2.7 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. అదే రోజు రాత్రి పాండిచ్చేరి–కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలు దివ్వభారతి మెడలోని 3.5 తులాల బంగారు చైన్ను లాక్కొని ఉడాయించారు. గుత్తి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు కిటికి వద్ద కూర్చొన్న ఓ ప్రయాణికుడి చేతిలోని ఖరీదైన సెల్ఫోన్ను అపహరించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధి 12 జిల్లాలకు విస్తరించి ఉంది. ఇందులో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు. కడప, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీలతోపాటు కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి జిల్లాలకూ గుంతకల్లు రైల్వే పోలీస్ కేంద్రంగా ఉంది. గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా 900 మంది పోలీసులు అవసరం కాగా, ప్రసుత్తం 550 మంది మాత్రమే ఉన్నారు. 350కి పైగా ఖాళీలు ఉన్నాయి. డివిజన్ వ్యాప్తంగా రోజూ 300కు పైగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గుంతకల్లు, గుత్తి రైల్వేజంక్షన్ల మీదుగా రాత్రి పూట దాదాపు 50కి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగాడుతున్నాయి. ఈ రైళ్లకు 20 నుంచి 24 బోగీలు ఉంటాయి. రాత్రి పూట తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే ఎస్కార్ట్గా కేటాయిస్తున్నారు. స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందితోనే 24 గంటలు విధులు నిర్వహిస్తుండటంతో విశ్రాంతి లేక జీఆర్పీ, ఆర్పీఎఫ్లు ఒత్తిడికి లోనువుతున్నారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయం ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఉన్న కొద్ది పాటి సిబ్బందితో ర్యాండమ్గా రైళ్లలో బందోబస్తు చేపడుతున్నాం. జీఆర్పీ సిబ్బంది ఇద్దరితో పాటు ఆర్పీఎఫ్కు చెందిన మరో కానిస్టేబుల్కు రైళ్లలో ఎస్కార్టు విధులు కేటాయిస్తున్నాం. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తున్నాం. – హర్షిత, జీఆర్పీ ఇన్చార్జ్ డీఎస్పీ, గుంతకల్లు రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు ప్రయాణికుల సొమ్ముకు రక్షణ కరువు నిద్రావస్థలో రైల్వే పోలీసులు -
మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: జిల్లాను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని యువతకు కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా దినం సందర్భంగా పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి గణేష్ కూడలి వరకూ గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతం మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు అలవాటు పడితే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని హెచ్చరించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పెడదారిన పడి జీవితాలు నాశనం చేసుకోకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, ఎక్పైజ్ శాఖ అధికారి నాగముద్దయ్య, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు
పుట్టపర్తి టౌన్: మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు శాఖ తరుఫున అండగా ఉంటామని ఎస్పీ రత్న భరోసానిచ్చారు. జిల్లా అటాచ్మెంట్తో పనిచేస్తున్న అనంతపురం డీటీసీ సీఐ పవన్కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రత్న... అనంతపురంలోని మృతుడి స్వగృహానికి చేరుకుని పవన్కుమార్ మృతదేహానికి నివాళులర్పించారు. తక్షణ సాయం కింద రూ.75 వేలను కుటుంబ సభ్యులకు అందజేసి, పరామర్శించారు. అధైర్య పడరాదని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌలభ్యాలను త్వరలో అందేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, 1998లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన పవనర్కుమార్... శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని రొద్దం, సోమందేపల్లి, మండలాల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై సీఐగా పుట్టపర్తి అటాచ్మెంట్తో అనంతపురం డీటీసీలో పనిచేస్తున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు బార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మత్తుకు బానిస కావొద్దు
● మంత్రి సవిత పెనుకొండ: మత్తుకు బానిసలు కాకూడదని యువతకు మంత్రి సవిత పిలుపునిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం పెనుకొండలో మంత్రి ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన చాలా మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. సమాజానికి చెడు చేయాలని చూసే ఏ వ్యక్తినీ ఉపేక్షించబోమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్డీఓ ఆనంద్కుమార్, డీఎస్పీ నర్శింగప్ప, మున్సిపల్ కమిషనర్ సతీష్కుమార్, ఎకై ్సజ్ సీఐ సృజన్బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి తనకల్లు: సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులకు డెయిరీ కార్య నిర్వాహణాధికారి పర్వతనేని అనిల్కుమార్ సూచించారు. మండలంలోని పరాకువాండ్లపల్లిలో గురువారం పాడి రైతులకు పశు పోషణ, పాల ఉత్పత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు సబ్సిడీపై పశుదాణా, మినరల్ మిక్చర్ పశుగ్రాస విత్తనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జోనల్ మేనేజర్ రావి బాలాజీ, ఆనంద్, మేనేజర్ పూజారి నాగరాజు, సిబ్బంది శ్రీధర్రెడ్డి, బాదుల్లా, శివయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇరువర్గాల పరస్పర దాడులు కదిరి అర్బన్: మండలంలోని మరువతండా గ్రామంలో బంధువుల మధ్య గొడవ చోటుచేసుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వివరాలు.. కదిరి మండలానికి చెందిన శ్రీవాణి, రవీంద్రనాయక్ దంపతులు బతుకు తెరువు కోసం కొన్ని నెలల క్రితం కేరళకు వలస వెళ్లి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో వారితో పాటు వారి మూడేళ్ల వయసున్న కుమార్తె కనిపించకపోవడంతో బంధువు రామచంద్రనాయక్ గురువారం నిలదీశాడు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో కుమార్తెను కేరళలో విక్రయించి వచ్చారంటూ రామచంద్రనాయక్ మండిపడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుని పరస్పరం కొట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రామచంద్రనాయక్ ఆరోపించినట్లుగా బిడ్డను విక్రయించిన అంశంపై సమగ్ర విచారణ చేపడతామని కదిరి రూరల్ అప్గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. డీపీటీఓకు ప్రశంసాపత్రం పుట్టపర్తి టౌన్: గత ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజ్కు ఇచ్చి సంస్థకు అధిక ఆదాయం సమకూర్చిన జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్ను అభినందిస్తూ గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రశంసాపత్రాన్ని అందుకున్న డీపీటీఓను ఆర్టీసీ ఉద్యోగులు అభినందించారు. ఎకై ్సజ్ స్టేషన్ తనిఖీ ధర్మవరం అర్బన్: స్థానిక ప్రొహిబిషన్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నరసింహులు తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ చేయకుండా తరచూ తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్ఐలు చాంద్బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు కర్నాటకలోని రాయచూర్ జిల్లా గుడెదనాల్కు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
ఏడీఏల బదిలీ జాబితా విడుదల
● అనంతపురం, హిందూపురం పెండింగ్ అనంతపురం అగ్రికల్చర్: బదిలీల ప్రక్రియలో భాగంగా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)ల జాబితా ఎట్టకేలకు వెల్లడైంది. బదిలీల చివరి రోజైన ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 133 మందితో జాబితా విడుదల చేశారు. అయితే వెనువెంటనే జాబితాను వెనక్కి తీసుకున్నారు. 17 రోజుల తర్వాత తాజాగా బుధవారం అర్ధరాత్రి రెండో సారి 110 మందితో జాబితా విడుదల చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది పరిస్థితి తేలలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపట్టడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుకుబడి, ప్రజాప్రతినిధుల సిఫారసులు, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదటి జాబితాలో 9 మంది ఏడీఏలను బదిలీ చేస్తూ జాబితా ఇచ్చారు. తాజాగా విడుదలైన జాబితాలో ఏడుగురు ఏడీఏలను బదిలీ చేశారు. అత్యంత కీలకమైన అనంతపురం డివిజన్తో పాటు హిందూపురం డివిజన్లకు ఏడీఏలను కేటాయించకపోవడం గమనార్హం. బదిలీలు ఇలా... ఎస్.సత్యనారాయణ కదిరి నుంచి ఉరవకొండకు, ఎం.చెంకలరాయుడు తాడిపత్రి నుంచి కర్నూలు జిల్లా ఆలూరు, బి.క్రిష్ణమీనన్ మడకశిర నుంచి పెనుకొండ, జే.సనావుల్లా పుట్టపర్తి డీఆర్సీ నుంచి కదిరి, ఎల్.లక్ష్మానాయక్ రాయదుర్గం నుంచి ధర్మవరం, ఎస్.పద్మజ ఉరవకొండ నుంచి రాయదుర్గం, ఎం.రవి అనంతపురం నుంచి తాడిపత్రి బదిలీ అయ్యారు. అనంతపురం నుంచి రవి బదిలీ కాగా ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. హిందూపురంలో ఉన్న అల్తాఫ్ అలీఖాన్ను ఎక్కడకు బదిలీ అయ్యారనే విషయం అనేది కూడా తేలలేదు. ధర్మవరం ఏడీఏ క్రిష్ణయ్యను కూడా ఎక్కడకు బదిలీ చేశారనేది తేలాల్సివుంది. అనంతపురం ఏడీఏ స్థానానికి అల్తాఫ్ అలీఖాన్, క్రిష్ణయ్యల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదెక్కడి టోల్ బాదుడు?! చిలమత్తూరు: టోల్ ప్లాజాల వద్ద ఒకే ఎంట్రీకి రెండేసి సార్లు బిల్లులు డెబిట్ అవుతుండడంతో పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంది పుచ్చుకున్న ప్రస్తుత రోజుల్లో టోల్ప్లాజాల వద్ద వాహనాల ఎంట్రీని సులభ తరం చేసేందుకు ఫాస్ట్టాగ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాలు టోల్ గేట్లోకి ప్రవేశించగానే ఫాస్ట్టాగ్ స్కాన్ అయి దాని ద్వారా ఎంట్రీకి సంబంధించిన రుసుం సదరు వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం హిందూపురానికి చెందిన అయూబ్ తన వాహనంలో వెళుతూ చోళసముద్రం టోల్ప్లాజా దాటారు. రెండు నిముషాల వ్యవధిలో రెండు సార్లు అతని బ్యాంక్ ఖాతా నుంచి టోల్ప్లాజా రుసుం డెబిట్ కావడంతో కంగుతిన్న అయూబ్ వెంటనే టోల్ప్లాజా సిబ్బందిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో జరిగిన మోసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 19న బాగేపల్లి టోల్ప్లాజా వద్ద కూడా ఇలాగే తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు సార్లు నగదు డెబిట్ అయిందని వివరించారు. జరిగిన మోసంపై తాను సోషల్ మీడియా వేదికగా వాహనదారులను చైతన్య పరుస్తూ పోస్టు చేసినట్లు వివరించారు. టోల్ప్లాజా యాజమాన్యం దోపిడీపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
జిల్లాలో వరుస హత్యలు
లేపాక్షి: భార్యపై అనుమానంతో ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన ఘటన గురువారం లేపాక్షి మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (37)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అశ్వత్థప్పతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న బంధువు ఆనంద్ కుటుంబంతో రవికుమార్ చనువుగా ఉండేవాడు. తరచూ ఇంటికి రాకపోకలు సాగిస్తుండడంతో తన భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఆనంద్ ఎలాగైనా రవికుమార్ను హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంతో తన సోదరుడు గోవిందప్పతో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి స్థానిక రైతు లింగప్ప తోటలో మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపి రవికుమార్ను రప్పించుకున్నారు. ముగ్గురూ కలసి మద్యం సేవించారు. అదే సమయంలో మత్తులో జోగుతున్న రవికుమార్పై వేటకొడవలితో దాడి చేయడంతో మొండెం నుంచి తల వేరుపడింది. అనంతరం మృతదేహాన్ని నీటి గుంతలో గొయ్యి తీసి పాతిపెట్టారు. బుధవారం తెల్లవారినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో అశ్వత్థప్ప ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆనంద్, గోవిందప్ప ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడడంతో నీటి గుంతలో పాతిపెట్టిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు. భార్యపై అనుమానంతో లేపాక్షి మండలంలో ఓ యువకుడి హత్య మంగళవారం రాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చిన వైనం పోలీసుల అదుపులో నిందితులు జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో గురువారం తూముకుంట వాసి హత్య జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యపై అనుమానంతో ఓ యువకుడిని మరొకరితో కలసి రెండు రోజుల క్రితం భర్త మట్టుబెట్టగా గురువారం వెలుగు చూసింది. మరో ఘటనలో జిల్లా సరిహద్దున కర్ణాటక ప్రాంతంలో మద్యం మత్తులో చోటు చేసుకున్న గొడవలో హిందూపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి హతమయ్యాడు. మద్యం మత్తులో... హిందూపురం/గౌరిబిదనూరు: మండల పరిధిలోని తూముకుంట చెక్పోస్టు ప్రాంతంలో నివాసముటున్న రవికుమార్ (37) జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. వెల్డర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య అనుపమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో అతనిలో మార్పు తీసుకువచ్చేందుకు భార్య విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా మార్పు రాకపోవడంతో 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె రాలేదు. దీంతో ఒంటరిగా మారిన రవికుమార్ ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని గంగోత్రి బార్ వద్దకు గురువారం వెళ్లిన అతను సాయంత్రం మద్యం మత్తులో జోగసాగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హిందూపురంలోని బాపూజీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్తో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. గొడవ తారస్థాయికి చేరుకోవడంతో ఆటో డ్రైవర్ బీరు బాటిల్ ముక్క తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. వరుస పోట్లకు గురి కావడంతో రవికుమార్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న కర్ణాటకలోని గౌరిబిదనూర్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించారు. ఘటనపై గౌరిబిదనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
అనంతపురం: గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సాగు, వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల వినియోగంతో వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని, వినియోగదారులు విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తిని అలవర్చుకుంటారని అన్నారు. గంజాయి పొగ రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, దీర్ఘకాలంలో ప్రాణాప్రాయం తలెత్తుతుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కుటుంబాల అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో ఆరుగురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల నియామకంలో జిల్లాకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర రైతు సంఘం విభాగం సెక్రటరీగా పీవీ భాస్కర్రెడ్డి (పుట్టపర్తి నియోజవర్గం) జాయింట్ సెక్రటరీలుగా ఎన్ రంగారెడ్డి, ఎం.వెంకటరెడ్డి (పుట్టపర్తి నియోజవర్గం), రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీగా నల్లపరెడ్డి (రాప్తాడు), ఐటీ విభాగం సెక్రటరీలుగా రోహిత్రెడ్డి, (రాప్తాడు) సి.జయపాల్రెడ్డి (పుట్టపర్తి)లను నియమించారు. కృషి విజ్ఞాన కేంద్రం స్థాపనకు చర్యలు బత్తలపల్లి: మండల పరిధిలోని అప్పరాచెరువు గ్రామం వద్ద కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) స్థాపనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ తోటగతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీలో డాక్టర్ సి.మధుమతి(అసోసియేట్ డైరెక్టర్, రాయలసీమ జోన్) అధ్యక్షత వహిస్తుండగా, సభ్యులుగా డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ ఎం.శివప్రసాద్, డాక్టర్ ఎం.బాలకృష్ణ ఉన్నారు. గురువారం నిపుణుల బృందం అప్పరాచెరువు సమీపంలోని సర్వే నంబర్లు 96, 97, 63లో కలిపి కేటాయించిన 68 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మట్టి నమూనాలు సేకరించి శాసీ్త్రయ పరీక్షల కోసం ల్యాబ్కి పంపారు. భూసేకరణపై గ్రామ సభలు ప్రశాంతి నిలయం: సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకై భూసేకరణపై గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ టి.ఎస్.చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను పొందిన తర్వాత సమగ్ర నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ మడకశిర: మండలంలోని గుండుమల గ్రామానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త దళిత మంజునాథ్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మడకశిర పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టణ టీడీపీ కార్యకర్త ఈశ్వరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ నగేష్ తెలిపారు. మంజునాథ్ని మడకశిర కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంజునాథ్ అరెస్ట్ను వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, కుంచిటి వక్కలిగ వైఎస్సార్సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నాయకుడు అశ్వత్థనారాయణ, ఎస్సీ సెల్ కార్యదర్శి మంజునాథ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. పనస కాయల వాహనం బోల్తా కనగానపల్లి: బెంగళూరు నుంచి అనంతపురానికి పనస కాయల లోడ్తో వెళుతున్న బొలెరో వాహనం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బోల్తాపడింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మామిళ్ల పల్లి సమీపంలోని గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే వాహనం ముందరి టైర్లు రెండూ ఒక్కసారిగా పేలాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా వాహనం బోల్తాపడింది. పనస కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఘటనతో రూ.30 వేల మేర నష్టం వాటిల్లినట్లు అనంతపురానికి చెందిన వ్యాపారి పోతులయ్య వాపోయాడు. కాగా, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. -
అధికారులందరూ సమన్వయంతో పనిచేయండి
ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 5వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులు సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతంచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. గురువారం కొత్తచెరువులోని జెడ్పీ బాలుర, బాలికల పాఠశాలలు, సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎస్పీ వి.రత్న ,జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్లతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కొత్తచెరువులో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. సభా స్థలం, పార్కింగ్ స్థలాల్లో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. -
అలా ముగించేశారు!
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. ‘తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్న చందంగా మొండివైఖరితో ముందుకెళ్లింది. ఫలితంగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీరందరూ జిల్లా సరిహద్దు మండలాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తం మీద వారిగోడును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అలా ముగించేశారు. తొలిరోజు 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తికాగా, రెండోరోజు గురువారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ ఉంటుందంటూ ఉదయం అందరికీ మెసేజ్లు పెట్టారు. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఖాళీల అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినా...డీఈఓ ప్రసాద్బాబు అంగీకరించలేదు. తన పరిధిలో లేని అంశం అని... కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఎవరైనా కౌన్సెలింగ్కు అటెండ్ కామని చెబితే మాత్రం అలాంటి వారికి నేరుగా కమిషనర్ కార్యాలయం నుంచే స్కూళ్లు అలాట్ చేస్తారని, అవి ఎక్కడొస్తాయో కూడా తెలీదంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుమార్లు కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసినా ప్రభుత్వం కరుణించలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్న తమపై ఇంత కక్షసాధింపుగా వ్యవహరించడం సరికాదని వాపోయారు. ఎట్టకేలకు అందరూ అంగీకరించడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి దాకా కొనసాగింది. 404 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ముందురోజు 190 మందికి 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. నిబంధనల మేరకే ఉన్న ఖాళీలను చూపించామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఏదిఏమైనా కౌన్సెలింగ్కు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చేసిన ఎంటీఎస్ టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వానికి పట్టని ఎంటీఎస్ టీచర్ల గోడు బలవంతంగా బదిలీల కౌన్సెలింగ్ 1998 ఎంటీఎస్ టీచర్లకూ పూర్తయిన బదిలీలు దాదాపు సరిహద్దు మండలాలకు ఎక్కువగా కేటాయింపు -
‘ఉద్యాన’ పథకాలు వినియోగించుకోండి
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ డీడీలు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తోటల పెంపకంలో భాగంగా హెక్టారుకు మామిడి తోటలకు రెండు సంవత్సరాల్లో రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జామకు రూ.80 వేలు, చీనీ రూ.50 వేలు, దానిమ్మ రూ.50 వేలు, సీతాఫలం రూ.30 వేలు, సపోటా రూ.30 వేలు, రేగు రూ.30 వేలు, ద్రాక్ష రూ.1.20 లక్షలు, టిష్యూకల్చర్ అరటి రూ.70 వేలు, బొప్పాయి రూ.30 వేలు, డ్రాగన్ ఫ్రూట్ రూ.2.70 లక్షలు, అవకాడో రూ.50 వేలు, అంజూర రూ.50 వేలు, ప్యాషన్ ఫ్రూట్ రూ.2.75 లక్షలు, ఉసిరి రూ.75 వేలు, నేరేడు రూ.75 వేలు, చింత రూ.75 వేలు, ఫల్సాఫ్రూట్ రూ.75 వేలు, విడిపూల సాగుకు రూ.50 వేలు, హైబ్రీడ్ కూరగాయల సాగు రూ.60 వేల మేర రెండేళ్లలో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. పుట్టగొడుగుల పెంపకానికి రూ.2 లక్షలు రాయితీ ఉంటుందన్నారు. ముదురుతోటల పెంపకంలో భాగంగా 10 సంవత్సరాల పైబడి వయసున్న మామిడి, 8 సంవత్సరాల పైబడి కలిగిన చీనీ తోటలకు హెక్టారుకు రూ.24 వేలు రాయితీ ఇస్తామన్నారు. వ్యక్తిగత ఫారంపాండ్ల నిర్మాణానికి రూ.75 వేలు, పాలీహౌస్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, షేడ్నెట్ హౌస్లకు రూ. 8.87 లక్షలు, మామిడి, అరటి ఫ్రూట్ కవర్స్కు రూ.25 వేలు, ప్లాస్టిక్ మల్చింగ్కు రూ.20 వేలు, ప్యాక్హౌస్లకు రూ.2 లక్షలు, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్కు రూ.12.85 లక్షలు, మినీట్రాక్టర్కు 1.96 లక్షలు, పవర్ టిల్లర్కు రూ.లక్ష, తైవాన్ స్ప్రేయర్కు రూ.10 వేలు, టమాటా ట్రెల్లీస్కు రూ.18,750, హైబ్రీడ్ కూరగాయల విత్తనాలకు రూ.3 వేలు, శాశ్వత పందిళ్లుకు రూ.2.50 లక్షలు మేర రాయితీ వర్తిస్తుందని వివరించారు. అలాగే సోలార్కోల్డ్ రూంలు, సోలార్ క్రాప్ డయ్యర్లు, కోల్డ్స్టోరేజీల్లో కండెన్సర్ల మార్పు, రిఫర్వాన్, ప్లాస్టిక్ క్రేట్స్కు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన పండ్లతోటల రైతులు ఆర్ఎస్కే అసిస్టెంట్లు, హెచ్ఓలు, ఉద్యానశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. రెండు జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్ -
అమ్మలపై అలసత్వం
4,085శ్రీసత్యసాయి జిల్లాలో హెచ్ఎంఐఎస్లో నమోదైన ప్రసవాలు5,280 సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అమ్మా పెట్టదు అడుక్కూ తిననివ్వదు’ అన్న చందమిది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం జేఎస్వై (జననీ సురక్ష యోజన) ప్రవేశపెట్టింది. ఈ పథకం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత ఘోరంగా అమలవుతున్నట్టు తేలింది. ఆస్పత్రిలో చేరిన గర్భిణి ప్రసవమై డిశ్చార్జ్ అయ్యేలోగా తల్లి వివరాలన్నీ యాప్లో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. వివరాలన్నీ సరిగా పంపితే తల్లి ఖాతాలోకి రూ.1,500 వేస్తారు. కానీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కనీసం 55 శాతం మందికి కూడా ఈ పథకం వర్తిచడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయొచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపం.. అనంతపురంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ‘జేఎస్వై’ పనితీరు దారుణంగా ఉంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 84 శాతం మంది తల్లులకు ‘జేఎస్వై’ కింద సొమ్ము అందగా, అనంతపురం జిల్లాలో కేవలం 56 శాతం మందికి మాత్రమే అందింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 64 శాతం మందికి మాత్రమే వర్తించింది. ప్రసవం జరిగిన ఆస్పత్రిలో దరఖాస్తు చేయకపోవడం వల్లే వేలాదిమంది బాలింతలు ఇలా తమకు వచ్చే కొద్దపాటి సొమ్మునూ కోల్పోతున్నారు. ఆస్పత్రులకు గర్భిణి రాగానే వివరాలు సేకరించి ఎంఎస్ఎస్ (మాతా శిశు సురక్ష) వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. భర్త పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు అన్నీ పంపించాలి. కానీ ఈ వివరాలు పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ అప్లోడ్ చేయడానికి సిబ్బంది లేరు. ఉన్నా చాలా చోట్ల వాళ్ల వివరాలు నమోదు చేయడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నమోదు లేకపోతే ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలే కానరావడం లేదు. దీంతో వేలాది మంది బాలింతలకు లబ్ధి చేకూరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2024–25 సంవత్సరంలో 3 లక్షల మంది బాలింతలకు అందలేదు. అంటే ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున రూ.45 కోట్లు కోల్పోయారు. అంతేకాదు ‘జేఎస్వై’ సరిగా నమోదు కాకపోవడంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద రూ.6 వేలు కూడా చాలామంది కోల్పోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యంతో కేంద్రమిచ్చే నిధులకు పేద బాలింతలు నోచుకోవడం లేదు. ఎంఎస్ఎస్ (మాతా శిశు సురక్షలో నమోదు)బాలింతలకు కరువైన ‘జేఎస్వై’ భాగ్యం ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేకూరని లబ్ధి వేలమంది బాలింతలకు పైసా అందని వైనం ‘అనంతపురం’లో 56 శాతం, ‘శ్రీ సత్యసాయి’ 64 శాతం మందే దరఖాస్తు 3,42764.91 -
లుక్ పేరుతో బుక్ చేసేశారు!
అనంతపురం: రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం వస్తుందని నమ్మించారు. రూ.20,300 చెల్లిస్తే.. నిత్యం రూ.700 ఆదాయం వస్తుందని గాలం వేశారు. చివరికి రూ.కోట్లలో డిపాజిట్ చేయించుకుని బుక్ చేసేశారు. వివరాలు.. అమెరికన్ కంపెనీ ‘లుక్’ పేరుతో యాప్ను ప్రవేశపెట్టారు. పుస్తకాలు, గ్రంథాలు ఆన్లైన్లో చదివే ‘లుక్’ యాప్లో చందాదారుల పేరుతో దోపిడీ ప్రారంభించారు. రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేలు ఆదాయం వస్తుందని నమ్మించారు. ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. రూ.20,300 చెల్లిస్తే.. రోజూ రూ.700 ఆదాయం వస్తుంది. ప్రతి రోజూ యాప్లో 25 టాస్క్లు ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే ఒక్కో టాస్క్కు రూ.28లు నగదు క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకోవచ్చు. కొత్త ఖాతాదారులను చేర్పిస్తే 30 శాతం వెంటనే నగదు ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా ప్రారంభంలో అత్యంత నమ్మకంగా, కచ్చితంగా మొత్తాలను చెల్లించారు. అనంతపురం నగరంలోనే రూ.20 వేల చందాదారులు వేలల్లో ఉన్నారు. రూ.2.50 లక్షల చందాదారులు వందల్లో ఉన్నారు. బుధవారం డ్రా చేసుకునేందుకు క్లిక్ చేయగా, తక్షణమే 30 శాతం చెల్లిస్తే.. ఈ 30 శాతం ఖాతాలో ఉన్న మొత్తం అంతా డ్రా చేసుకోవచ్చని యాప్లో మెసేజ్ చేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోటీ పడి నగదు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి మరీ డిపాజిట్ చేశారు. బుధవారం రాత్రి రూ.2.50 లక్షలు చెల్లించిన వారే అధికంగా ఉన్నారు. రూ.20 వేలు చెల్లించిన చందాదారులు తక్షణమే రూ.6,090 చెల్లించాలి. లేదంటే ఖాతా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉన్న ఫలంగా రూ.6,090 చెల్లించారు. ఇలా ఖాతాదారులకు అత్యాశ చూపించి బుధవారం రాత్రే అధికంగా మొత్తాలను కట్టించుకున్నారు. డబ్బు డ్రా చేయడంతో బ్యాంకు ప్రాసెస్లో ఉందంటూ గురువారం రాత్రి యాప్లో డేటాను తొలగించేశారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ‘లుక్’ పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆందోళన చెందుతున్నారు. సైబర్ క్రైం హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫోన్లు చేస్తున్నారు. రూ.వందల కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన వైనం రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం అంటూ గాలం అపరిమితంగా ఖాతాదారులను పెంచుకుని బురిడీ -
పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి
ప్రశాంతి నిలయం: ‘‘పరిశ్రమల స్థాపనతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. అందువల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ...జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. నూతన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తూ జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం అందివ్వనున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే వారికి అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులపై సమీక్షించారు. అనంతరం వివిధ పరిశ్రమలకు సంబంధించిన రాయితీలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి రాయితీ కింద 3 యూనిట్లకు రూ.46.69 లక్షలు, వడ్డీ రాయితీ కింద 3 యూనిట్లకు రూ.1.70 లక్షలు మంజూరు చేశారు. అలాగే వివిధ దశల్లో ఉన్న భారీ, పెద్ద తరహా పరిశ్రమల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి రాధాకృష్ణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ జిల్లా అధికారి కృష్ణకుమారి, ఏపీఎస్ఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ అన్సారీ తదితరలు పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
మా వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించండి
● పౌరసరఫరాల కమిషనర్ను కోరిన ఎండీయూ ఆపరేటర్లు ధర్మవరం: రేషన్ బియ్యం పంపిణీ నుంచి తమను తప్పించినందున వెంటనే తమ వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించాలని ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కోరారు. ఈ మేరకు వారు విజయవాడలోని సెక్రటేరియట్లో పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్గౌర్ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిశోర్, సూర్యనారాయణ, రవికుమార్, సతీష్, దేవసహాయం, సుధాకర్రెడ్డి, సాంబశివరావు, రామంజనేయులు, సునీల్, వెంకట్, కేశవ, అక్బర్, హరి, కమలాకర్, ప్రతాప్రెడ్డి తదితరులు మాట్లాడుతూ...ప్రజలకు ఉపయోగపడే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో వాహనాలపై ఆధారపడిన ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలా మంది జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎండీయూ వ్యవస్థను ఎలాగూ రద్దు చేసినందున తమ వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించడంతో పాటు బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. అలాగే తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలని కోరారు. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఆర్ఎస్కే సిబ్బంది బదిలీలకు గ్రీన్సిగ్నల్ అనంతపురం సెంట్రల్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్లు పూర్తయిన వారికి ఆఫ్లైన్లో, ఐదేళ్లలోపు సిబ్బంది రిక్వెస్ట్ బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిక్వెస్ట్ బదిలీ ఉద్యోగులను వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 867 రైతు సేవా కేంద్రాలున్నాయి. అనంతపురం జిల్లాలో 126 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 124 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు ‘అనంత’లో 101 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 102 మంది ఉన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 180 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 143 మంది ఉండగా అందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇక.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సెరికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 12 మంది, శ్రీ సత్యసాయిలో 73 మంది ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పశు సంవర్ధక శాఖకు సంబంధించి 666 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. సీఎం పర్యటనకు స్థల పరిశీలన పుట్టపర్తి టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 5వ తేదీన కొత్తచెరువుకు రానున్నట్లు జిల్లా అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న అధికారులతో కలిసి కొత్తచెరువులో పర్యటించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ జూలై 5వ తేదీన కొత్తచెరువుకు రానున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశంతో పాటు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీంతో బహిరంగ సభ కోసం కొత్తచెరువు జూనియర్ కళాశాల మైదానాన్ని ఎస్పీ రత్న పరిశీలించారు. మైదానాన్ని త్వరితగతిన చదును చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ విజయకుమార్, సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, నరేష్ మారుతీ శంకర్, తహసీల్దార్ బాలాంజనేయులు, ఎంఈఓ జయచంద్ర ఉన్నారు. -
సర్దుకుంటున్న రెడ్డెప్పశెట్టి
చిలమత్తూరు: నదిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడం...ఈడీ అటాచ్ చేసిన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను స్వాధీనం చేసుకోవడం... ఉద్యానశాఖ ద్వారా అక్రమంగా పాలీహౌస్, ఫారంపాండ్లను మంజూరు చేయించుకోవడం... విద్యుత్ చౌర్యం.. ఇలా..రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమ బాగోతాలు అన్నీఇన్నీ కావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయన చేసిన అవినీతి, అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తేగా అధికారులూ చర్యలకు సిద్ధమయ్యారు. కేసులన్నీ ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటుండటంతో భూములన్నీ విక్రయించి పలాయనం చిత్తగించేందుకు రెడ్డెప్పశెట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ బడా రియల్టర్తో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అయితే ప్రభుత్వ భూములను కలుపుకొని ధర చెప్పడంతో ఆ రియల్టర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవిక్షన్్ నోటీసు ఇవ్వగానే కోర్టుకు... అక్రమాల్లో ఆరితేరిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి.. ఏదైనా ఇబ్బంది కలిగినా తప్పించుకునేందుకు సైతం ముందే దారులు వెదికి ఉంచుకున్నారు. అందువల్లే అతనిపై అన్ని కేసులు నమోదైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ● చిత్రావతి నదిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంతో ఇరిగేషన్ అధికారులు చిలమత్తూరు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అనంతరం ఎవిక్షన్ నోటీసు ఇవ్వగా..రెడ్డెప్పశెట్టి వెంటనే కోర్టును ఆశ్రయించారు. తాను రైతుల కోసం బ్రిడ్జి నిర్మించానని... దాన్ని తొలగిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కోర్టు ఎదుట వాదన వినిపించారు. అయినా ఆరు నెలలు గడువు కావాలంటూ సమయం కోరారు. ● విద్యుత్ చౌర్యానికి సంబంధించి రూ.13 లక్షలు చెల్లించాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు నోటీసు ఇవ్వగా..దీనిపైనా రెడ్డెప్పశెట్టి కోర్టుకు వెళ్లాడు. అంత చెల్లించలేనని, నామమాత్రం ఇస్తానంటూ కోర్టుకు తెలిపాడు. ఇక తన పొలానికి దారి ఇవ్వలేదని ఓ రైతు చిలమత్తూరు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనూ ఆయనపై ఇప్పటి వరకూ చర్యలు లేవు. అలాగే రైతులను మోసం చేసి వారి పేరిట డ్రిప్ ఇరిగేషన్ కింద పథకాలు తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సరిపెట్టారు. ఈడీ అటాచ్ చేసిన లేపాక్షి హబ్ భూములను స్వాధీనం చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నా... ఇప్పటివరకూ చర్యలు లేవు. అధికారుల అంగీకారం వెనుక భారీ డీల్! భూములు విక్రయించాలని నిర్ణయించుకున్న రెడ్డెప్పశెట్టి...తన అక్రమాలపై ఇప్పటికే నోటీసులిచ్చిన అధికారులకు ఆరునెలలు గడువు ఇవ్వాలని లేఖ రాశారు. అందుకు అధికారులు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. దీంతో ఆలోపు భూములన్నీ విక్రయించి బయటపడదామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉంటున్న రెడ్డప్పశెట్టి ఇక్కడి అధికారులను పిలిపించుకుని డీల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా...రెవెన్యూశాఖ కనీసం కోర్టుకు స్థాయి అధికారి సహకరిస్తున్నట్లు ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. తప్పులు మెడకు చుట్టుకోవడంతో తప్పించుకునే ప్రయత్నం భూములన్నీ అమ్మకానికి పెట్టిన వైనం! లేపాక్షి హబ్ భూములు, ప్రభుత్వ భూములనూ విక్రయించేలా ప్లాన్ -
పని సర్దుబాటులో టీచర్లను కేటాయించండి
పుట్టపర్తి అర్బన్: పని సర్దుబాటులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అవసరమున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు డీఈఓ కిష్టప్పకు ఆ సంఘం జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాదరెడ్డి, చంద్రశేఖర్ బుధవారం వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. పాఠశాలల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల అనంతరం ఏకోపాధ్యాయ పాఠశాలలు, పిల్లల సంఖ్య పెరిగిన పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొందన్నారు. పని సర్దుబాటులో భాగంగా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. అప్గ్రేడ్ అయిన పాఠశాలలకు హెచ్ఎం, పీఎస్ హెచ్ఎం, ఆదర్శ పాఠశాలల్లో కొత్తగా క్రియేట్ అయిన పోస్టులకు వెంటనే ఐడీలను క్రియేట్ చేసి సకాలంలో జీతాలు చెల్లించాలన్నారు. స్పాట్ వాల్యుయేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులకు సాల్ట్, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా తరగతులను సెలవు రోజుల్లో నిర్వహించాలని సూచించారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను వారి నివాసాలకు దగ్గరి మండలాల్లో నియమించాలన్నారు. కార్యక్రమంలో ఎస్జీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి గోపాల్నాయక్, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్కుమార్, రవిచంద్ర, మండల అధ్యక్షుడు శివయ్య, కౌన్సిల్ మెంబర్ అనిల్కుమార్, హెచ్ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి ● జేసీకి వినతిపత్రం అందజేసిన సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు ప్రశాంతి నిలయం: గ్రామ సర్వేయర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ ఆఫ్ ఏపీ సభ్యులు కార్తీక్, సురేష్, మనోహర్, హరి, బాలాజీ, భాస్కరరెడ్డి మండిపడ్డారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నా నేటికీ తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్కు బుధవారం వారు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. రేషనలైజేషన్, ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో తీరని అన్యాయం జరుగుతోందని వాపోయారు. భూ సర్వే సమయంలో జనాభా ప్రాతిపదికన కాకుండా భూ విస్తీర్ణం పరంగా హేతుబద్దీకరణ చేయాలన్నారు. రేషనలైజేషన్ను వెంటనే పూర్తి చేసి బదిలీలు చేపట్టాని డిమాండ్ చేశారు. సర్వే విభాగం ఉద్యోగులను టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ సొంత మండలాలు కేటాయించాలన్నారు. రీ సర్వే సమయంలో బకాయి పడిన టీఏ, డీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. -
విద్యా వ్యవస్థలో మార్పులు తేవడమే లక్ష్యం
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆదర్శాలకు అనుగుణంగా రూపొందించిన విద్యావాహని ద్వారా గ్లోబల్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్యావాహిని డైరెక్టర్ కరుణా మున్షి పేర్కొన్నారు. విద్యావాహిని మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రారంభమైంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్కు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ఐఐటీ మద్రాస్తో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద పత్రాలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సభలో కరుణామున్షి మాట్లాడారు. విద్యావాహిని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిద్దుతామన్నారు. అలాగే సత్యసాయి అశయాలను కొనసాగిస్తూనే... సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తామన్నారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. విద్యావాహిని డైరెక్టర్ కరుణా మున్షి -
జీతాలు ఇప్పించండి మహాప్రభో
● విద్యుత్ మీటర్ రీడర్ల వేడుకోలు పుట్టపర్తి టౌన్: మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్కుమార్ను ఆ శాఖ మీటర్ రీడర్లు వేడుకున్నారు. ఈ మేరకు బుధవారం పుట్టపర్తిలోని ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ సంపత్కుమార్ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 20 ఏళ్లుగా మీటర్ రీడర్లుగా తాము పనిచేస్తున్నామని వివరించారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబపోషణ భారమైందన్నారు. కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా న్యాయం జరగలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎస్కో అకౌంట్ ఓపెన్ చేసి జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. డిమాండ్ సాధనలో భాగంగా జూలై 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిరణ్కుమార్, రవి, వినోద్, నరేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మామిడి తోటల పరిశీలన
తలుపుల: జిల్లా వ్యాప్తంగా మామిడి తోటల రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ‘చేదు మిగిల్చిన మామిడి’ శీర్షికన ‘సాక్షి’లో వెలుడిన కథనంపై ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక వ్యవసాయాధి హరితతో కలసి ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్రెడ్డి బుధవారం తలుపుల మండలం టి.రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు వెంకటరమణ సాగు చేసిన మామిడి తోటను పరిశీలించారు. రైతులకు నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. బీమా, నష్ట పరిహారాల విషయం ప్రభుత్వ బీమా సంస్థల పరిధిలో ఉందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం ● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం సిటీ: గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో మూడ్రోజులుగా నిర్వహించిన డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సభకు జెడ్పీ సీఈఓ శివశంకర్ అధ్యక్షత వహించగా, చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ప్రధాన భాగమన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. పాలనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరన్నారు. ఇందుకు సరైన పరిజ్ఞానం, నైపుణ్యత, ఆత్మ విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై అవగాహన పెంచుకోగలిగితే పాలనారంగంలోనూ మహిళలు తీసిపోరని నిరూపించినట్లు అవుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణను పూర్తి చేసుకున్న మహిళా సర్పంచులకు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య అభినందనలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి● రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నాగభూషణ పుట్టపర్తి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నాగభూషణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగభూషణ మాట్లాడారు. జీఓ 36 ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్త్ అలవెన్స్లు, రిస్క్ అలవెన్సులు అమలు చేయాలని, ఆప్కాస్ కార్మికులందనీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి మల్లికార్జున, సీఐటీయూ మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్, యూనియన్ నాయకులు రామయ్య, నరసింహులు, కేశవ, రమణ, రామదాస్, బెస్త గంగాధర్, గణేష్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
అనుకున్నట్టే కానిచ్చేశారు!
● 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు వేర్వేరుగా బదిలీల కౌన్సెలింగ్ ● 2008 టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి అనంతపురం ఎడ్యుకేషన్: ఇప్పటికే రెండుమార్లు వాయిదా పడ్డ ఎంటీఎస్ టీచర్ల బదిలీల అంశంలో అధికారులు కొత్త పంథా ఎంచుకుని అనుకున్నట్టే చేశారు. సీనియార్టీ జాబితాలో 2008 ఎంటీఎస్ టీచర్లు ముందున్నారు. వీరి తర్వాతనే 1998 ఎంటీఎస్ టీచర్లు మొదలవుతారు. ఖాళీలన్నీ దూర ప్రాంతాల్లో ఉండడం.. ఉన్న వాటిలో 2008 ఎంటీఎస్ టీచర్లకు కాస్తా మంచివి దక్కుతాయి. రెండుసార్లు వాయిదా పడడంలో 1998 ఎంటీఎస్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉందని నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ... ఎంటీఎస్ టీచర్ల మధ్య ‘విభజించు–పాలించు’ సూత్రాన్ని అమలు చేసింది. 2008, 1998 వారికి వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీఈఓ పేరుతో మెసేజ్ పంపారు. ‘2008 ఎంటీఎస్ టీచర్లకు మాత్రమే సాయంత్రం 5 గంటలకు కౌన్సెలింగ్’ ఉంటుందని పేర్కొన్నారు. గొడవతో ఉద్రిక్తత.. సాయంత్రం 5 గంటలకు వచ్చిన 2008 ఎంటీఎస్ టీచర్లు..జాబితాలోని 50 మందికి మాత్రమే మంచి స్కూళ్లు వస్తాయని, తక్కిన 147 మంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని వాపోయారు. ఇలా రెండు గ్రూపులు విడిపోయి వాదించుకున్నారు. ఇక ‘కౌన్సెలింగ్కు హాజరుకాకపోతే కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జనరేట్ అవుతాయి.. ఎవరికి ఎక్కడొస్తాయో మీ ఇష్టం’ అంటూ విద్యాశాఖ సిబ్బంది బెదిరింపులకు దిగడంతో ఎంటీఎస్ టీచర్లు ఇరకాటంలో పడ్డారు. జాబితాలో ముందున్న వారు తాము కౌన్సెలింగ్లో పాల్గొంటామని చెప్పడంతో మరికొందరు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సజావుగా ముగిసింది. ఇక.. నేడో, రేపో 1998 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
మద్యం రాసిన మరణ శాసనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా సీఎం చంద్రబాబు మార్చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణను దక్కించుకున్న ‘పచ్ఛ’ నేతలు నిబంధనలు తుంగలో తొక్కి వేళాపాళా లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. దీంతో యువత మత్తులో జోగుతోంది. తాగుడు మానేయమని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందుబాబులు ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో తమ పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మద్యం రాసిన మరణ శాసనం. ఈ శాసనానికి బుధవారం ఇద్దరు యువకులు బలయ్యారు. ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమయపాలనలేని మద్యం విక్రయాలు ● మద్యానికి బానిసవుతున్న యువత ● తాగుడు మానేయమంటే ఆత్మహత్యలే ధర్మవరం అర్బన్: మద్యం తాగొద్దని భార్య చెప్పినందుకు మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్వీధిలో జరిగింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మార్కెట్వీధికి చెందిన డ్రైవర్ రాజేంద్రప్రసాద్(30)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. తాగుడు మానేయాలని భార్య బతిమాలినా వినేవాడు కాదు. మద్యం మానేయమంటే తాను చనిపోతానంటూ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఉన్న రూ.200 నగదు తీసుకుని మద్యం తాగి రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయంపై భార్య ప్రశ్నించడంతో ఏదో ఒకటి చేసుకుని చనిపోతానంటూ బెదిరించి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి హాల్లో నిద్రించాడు. రోజూ బెదిరించేది మామూలే కదా అనుకుని ఆమె కూడా పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భార్యకు మెలకువ వచ్చి చూడగా హాల్లో నిద్రపోతున్న భర్త కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్ హుక్కుకు బెడ్షీట్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ● గుమ్మఘట్ట: తాగుడు మానేయమన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న, లక్ష్మక్క దంపతులకు నలుగురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కుమారుల్లో చివరి వాడైన శశికుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడికి తల్లిదండ్రులు మరోసారి నచ్చచెప్పారు. తాగుడు మానేస్తే ఎవరైనా పిల్లనిచ్చేందుకు ముందుకు వస్తారని ఇప్పటికై నా మద్యం సేవించడం మానేయాలని హితవు పలికారు. దీంతో మనస్తాపం చెందిన శశికుమార్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గుర్తించి బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సోషల్ మీడియా మాయలో పడొద్దు
పుట్టపర్తి టౌన్: సోషల్ మీడియా మాయలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోరాదని బాలికలకు ఎస్పీ రత్న సూచించారు. ఈగల్ క్లబ్, శక్తి యాప్ వినియోగంపై బుదవారం కొత్తచెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు, చిన్న వయస్సులో కలిగే ప్రేమ ఆకర్షణ, గంజాయి వలన కలిగే అనర్థాలపై చైతన్య పరిచారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ మొదలైన సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువులపైనే మనసు పెట్టాలన్నారు. బాలికలు, మహిళలు ప్రమాదంలో ఉంటే 79934 85111 కు సమాచారం అందిస్తే శక్తి టీం సభ్యులు సకాలంలో చేరుకుని రక్షణ కల్పిస్తారన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. బాలికలు అన్ని రంగాల్లో సమాన ప్రతిభతో రాణించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి కొత్తచెరువు సీఐ మారుతీశంకర్, ఎస్ఐలు గోపీనాఽథ్రెడ్డి, లింగన్న, కృష్ణమూర్తితో పాటు శక్తిం టీం సభ్యులు పాల్గొన్నారు. బాలికలకు ఎస్పీ రత్న సూచన -
ప్రజావ్యతిరేకత దిశగా ‘కూటమి’
అనంతపురం అర్బన్: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందని సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ పి.మధు అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి క్లాక్ టవర్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో నేడు మతోన్మాద వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రిన దేశంలో ఎమర్జెన్సీని అప్పటి కేంద్ర ప్రభుత్వం విధించి 1.13 లక్షల మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. యాభై ఏళ్ల అనంతరం ఎమర్జెన్సీ చీకటి పాలనను గుర్తు చేసుకుంటే నేడు అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్, మతోన్మాద పాలకుల చేతిలో ప్రజలు నిర్బంధాన్ని చూడాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయిందన్నారు. డీసీఎం పవన్కల్యాణ్ ద్వారా రాష్ట్రంలో మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. నిర్బంధ, మతోన్మాద దుష్ట పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాల ద్వారానే పేదల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జి.ఓబుళు, రామరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి, జిల్లా నాయకులు బాలరంగయ్య, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. నాటి ఎమర్జెన్సీ చీకటి పాలనను తలదన్నేలా నేడు రాష్ట్రంలో పరిస్థితులు మతోన్మాద, నిర్బంధ పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పి.మధు -
‘అనంత’లో వరుస హత్యల కలకలం
అనంతపురం: ఒక్క రోజు వ్యవధిలోనే రెండు హత్యలు చోటు చేసుకోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ పరిసరాల్లో గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రామలింగ కుమారుడు జి.సిదానంద (28) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం రాత్రి కుమ్మర నరసాపురం సురేష్ బాబు(43) దారుణంగా హతమయ్యాడు. శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు లోపించాయనేందుకు నిదర్శనంగా ఇప్పటికే పలు హత్యలు చోటు చేసుకున్నాయి. కేవలం 30 రోజులు కూడా గడవక ముందే మూడు హత్యలు చోటు చేసుకుని పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన యువతి తన్మయి (19)ని అతి కిరాతకంగా హత్య చేశారు. రాష్ట్రంలోనే ఈ ఘటన కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన మరువక ముందే అనంతపురం నగరంలో ఒక్క రోజు వ్యవధిలోనే మరో రెండు హత్యలు జరిగాయి. పోలీసులకే సవాల్ విసిరిన గంజాయి బ్యాచ్ అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. ఏకంగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ ముందే ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ గంజాయి బ్యాచ్ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం ద్వారా పోలీసులకు సవాలు విసిరింది. కొన్ని రోజులుగా పుష్ప పాటతో రీల్ చేస్తూ సోషల్ మీడియాలో టాటూ చరణ్ అనే యువకుడు వైరల్ చేశాడు. ఈ నెల 18న అనంతపురంలోని సున్నపుగేరిలో నివాసముంటున్న యశోద ఇంట్లో టాటూ చరణ్, పవన్ చొరబడి డబ్బు కోసం బెదిరించి.. దాడి చేసి దౌర్జన్యంగా సెల్ఫోన్ లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 21న టాటూ చరణ్, ఇతని అనుచరుడు పవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇది వరకే దొంగతనం, మనుషులపై దాడి కేసులో నిందితులు. -
పాల వ్యాన్ బోల్తా
నల్లచెరువు: మండలంలోని పెద్దయల్లంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై పాల వ్యాన్ అదుపు తప్పి మోరీకి ఢీకొని బోల్తా పడింది. తేజాస్ కంపెనీకి చెందిన పాల వ్యాన్ మంగళవారం కాలసముద్రంలో పాలు సేకరించుకుని చిత్తూరు జిల్లా పూతలపట్టులోని డెయిరీకి బయలు దేరింది. పెద్దయల్లంపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి వ్యాన్ అదుపు తప్పి మోరీని ఢీ కొట్టి జాతీయ రహదారి పక్కనే ఉన్న గుంత లోకి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ శ్యాంప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి బలవన్మరణం రాప్తాడు: మండలంలోని గంగలకుంట సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటలకు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 65 నుంచి 70 మధ్య వయస్సు గల వ్యక్తి తెలుగు రంగు చొక్కా, నలుపు రంగు డ్రాయర్, బ్రౌన్ కలర్ లుంగీ ధరించాడు. అతనికి ఎడమ కాలు లేదు. రెండు చేతులు కూడా అవిటిగా ఉన్నాయి. ఆచూకీ తెలిసిన వారు 95502 16049, 99513 25345 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు. జేఎల్ఎం ఆత్మహత్య పరిగి: మండలంలోని కాలువపల్లికి చెందిన డీఎల్ మురళీకృష్ణ(53) ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురంలోని విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న ఆయనకు భార్య నాగరత్నమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడిగెనహళ్లిలో నివాసముంటూ రోజూ విధులకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ మాత్రలతో అరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. వ్యాధి మరింత ముదురుతుండడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన సోమవారం రాత్రి 9 గంటలకు కొడిగెనహళ్లి నుంచి సొంతూరు కాలువపల్లికి వెళ్లి, తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ తండ్రి ఇంటికి రాకపోవడంతో కుమారుడు కాలువపల్లికి వెళ్లి పరిశీలించాడు. అప్పటికే ఇంట్లో వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న దృశ్యాన్ని చూసి బంధువులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగడు యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆటో బండి.. కష్టాలు దండి
పుట్టపర్తి టౌన్: కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆటోవాలాకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందేది. అలాగే వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత దక్కేది. అయితే కూటమి ప్రభుత్వంలో ఆటోవాలా గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.15 వేల ఇవ్వాల్సి ఉన్నా.. ఇప్పటికీ హామీలతోనే సరిపెడుతున్నారు. తాజాగా ఆగస్టుకు ఈ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించినా అది కార్యరూపం దాల్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జిల్లాలోని సుమారు 30 వేల మంది ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు పలు హామీలను చంద్రబాబు గుప్పించారు. బ్యాడ్జి కలిగిన అన్ని వాహనాల డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం, భారీ జరిమానాలకు కారణమవుతున్న జీఓ నంబర్ 21, 31 రద్దు చేస్తామన్నారు. అలాగే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గింపు, టాటా మ్యాజిక్ వ్యాన్లు జీపులు, కార్లకు గ్రీన్ ట్యాక్స్ థర్డ్పార్టీ ఇన్సూరెన్స్లు, టోల్గేట్ ఫీజులు తగ్గిస్తామన్నారు. డ్రైవర్లకు సాఽధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యారుణాల మంజూరు, చంద్రన్న బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామంటూ గొప్పలకు పోయారు. అధికారం చేపట్టి ఏడాది గడచిన ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో అరచేతిలో వైకుంఠం చూపి తమను మోసం చేశాడని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం తగ్గి... ఖర్చులు పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోంది. దీంతో రోజంతా కష్టపడితే రూ.300 నుంచి రూ.400 వరకు మిగలని పరిస్థితి నెలకొంది. ఏటా ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం దాదాపు రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. వీటితో పాటు పోలీసులు, రవాణా శాఖ అధికారులు తనిఖీల పేరుతో వేలాది రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటో కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి నెలవారీ కంతులు కట్టుకోలేక ఆటో కార్మికులు బతుకులు దినదిన గండంగా మారాయి. వచ్చే అరకొర ఆదాయం ఇంధనం, ఇతర ఖర్చులకు సరిపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఆటోవాలా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు కార్మికుల కష్టాలు పట్టించుకోని కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.15 వేలు నేటికీ ఇవ్వని వైనం గతంలో ‘వాహన మిత్ర’ ద్వారా ఆదుకున్న వైఎస్ జగన్ ఏటా రూ.10 వేలతో పాటు సంక్షేమ పథకాలన్నీ అందజేసిన వైనంఎన్నికల హామీలు నెరవేర్చాలి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదు. పైగా జరిమానాలు పెరిగిపోయాయి. కూటమి సర్కార్ ఇప్పటికై నా ఆటో కార్మికుల గురించి ఆలోచించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ. 15 వేల ఆర్థిక సాయంతో పాటు 21, 31 జీఓల రద్దు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. – బెస్త శేఖర్, ఆటో డ్రైవర్, పుట్టపర్తి మాట నెలబెట్టుకోవాలి ఇప్పటి వరకూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆటో డ్రైవర్లను గుర్తించిన నాయకుడు లేరు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో మా సమస్యలు గుర్తించి అధికారంలోకి రాగానే ఆదుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏటా రూ.10 వేలు అందజేశారు. చంద్రబాబు కూడా ఎన్నికల సమయంలో మాకు అనేక హామీలిచ్చారు. వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – తిరుపాల్ నాయక్, డ్రైవర్, బ్రాహ్మణపల్లి తండాగతంలో అండగా నిలిచిన జగన్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసి ఆదుకున్నారు. దీంతో పాటు ప్రమాదవశాత్తూ మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల బీమా వర్తింపజేశారు. అలాగే వాహనం కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే డ్రైవర్లకు రూ. 3 లక్షల వరకూ వడ్డీ రాయితీ అందించారు. -
సీహెచ్సీలో స్వీపర్ ఆత్మహత్యాయత్నం
గోరంట్ల: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో ఔట్ సోర్సింగ్ కింద స్వీపర్గా పనిచేస్తున్న లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలు తెలిపిన మేరకు.. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో శుభ్రత చేసే అంశంపై తరచూ లక్ష్మిని హెడ్నర్సు మల్లమాంబ వేధింపులకు గురి చేస్తూ ఉండేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిలో నిమగ్నమైన లక్ష్మిని ఆక్షేపిస్తూ మల్లమాంబ తీవ్ర స్థాయిలో మందలించింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి... అక్కడే ఉన్న నిద్ర మాత్రలు మింగింది. విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే వైద్యాధికారి ఉష దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన వైద్యులు ఆగమేఘాలపై ఆమెకు చికిత్స అందజేసి, ప్రాణాలు కాపాడారు. ఈ విషయమై డాక్టర్ ఉష ను వివరణ కోరగా లక్ష్మి తన విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో హెడ్ నర్సు మల్లమాంబ మందలించడం వాస్తవమని, చిన్నపాటి అంశానికి ఆమె నిద్ర మాత్రలు మింగిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పోక్సో కేసు నమోదు బుక్కరాయసముద్రం: మండలంలోని గోవిందపల్లి పంచాయతీలో ఇద్దరు బాలురపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, పుల్లయ్య తెలిపారు. వివరాలను మంగళవారం వారు వెల్లడించారు. రాఘవేంద్ర కాలనీలో 3వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల వయస్సు కలిగిన ఇద్దరు బాలురు మాయ మాటలతో నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. దీంతో బాధితుడు ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకోవడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ఇద్దరు బాలురపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో చోరీ.. నిందితుల అరెస్ట్ హిందూపురం: స్థానిక తూముకుంట పారిశ్రామిక వాడలోని స్వస్తిక్ ఫ్యాక్టరీలో ఐరన్ అపహరించిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం అప్గ్రేడ్ పీఎస్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 22న ఫ్యాక్టరీలో రూ.1.50లక్షల విలువ చేసే ఐరన్ను దుండగులు అపహరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో తూముకుంటకు చెందిన ఆటో డ్రైవర్ అర్ఫాత్షాషా, పరిశ్రమలో పనిచేస్తున్న యూపీలోని బల్దియా జిల్లా పర్వత్పూర్కు చెందిన దేవానంద్, చత్తీస్ఘడ్లోని రాయపూర్కు చెందిన యశ్వంత్ సాహును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వీరి నుంచి 25 కిలోల బరువున్న 32 బండిళ్ల బైండింగ్ వైర్, 20కేజీల తూకం వేసే 33 రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. రేపటి నుంచి జీవాలకు టీకాలుఅనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకలకు మంగళవారం నుంచి ఉచితంగా టీకాలు (వ్యాక్సినేషన్) వేసే కార్యక్రమం మొదలవుతుందని పశుసంవర్ధక శాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీ డీఎల్) ఏడీ డాక్టర్ రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలకర్లు ప్రారంభం కావడంతో వర్షాకాలంలో సాధారణంగా వ్యాపించే నట్టలు (డీవార్మింగ్), నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్), థైలేరియాసీస్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 లక్షలు గొర్రెలు, 9 లక్షల మేకలు... మొత్తంగా 58 లక్షల జీవాలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్ఎస్కేల వేదికగా శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేపట్టడానికి పారాస్టాప్తో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఏపీఎంఎస్కు బస్సు ఏర్పాటు
పుట్టపర్తి అర్బన్: వివిధ గ్రామాల నుంచి పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ (ఏపీఎంఎస్)కు రాకపోకలు సాగించే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేశారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఇలా ఇంకెన్నాళ్లు?! ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సు ఏర్పాటు చేశారు. రోజూ బడి వేళకు విద్యార్థులను పాఠశాలకు చేర్చడమే కాక, సాయంత్రం ఆయా గ్రామాలకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తమ కష్టాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న ‘సాక్షి’కి ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ధర్మవరం అర్బన్: స్థానిక శాంతినగర్కు చెందిన పామిశెట్టి రామకృష్ణ (70) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖరరెడ్డి, సభ్యులు మృతుడి కుటుంబసభ్యులను కలసి నేత్రదానంతో మరో ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చునని, అవగాహన కల్పించారు. దీంతో అంత బాధలోనూ రామకృష్ణ నేత్రాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో మృతుడి నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుటుంబ సభ్యులు నాగమ్మ, సావిత్రి, సురేష్, రవి, కిరణ్, నాగరత్న, మంజుల, ఆదినారాయణ, మాధవకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కిడ్నాప్ కేసు నమోదు నల్లమాడ: అన్నాచెల్లెలును కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు నల్లమాడ పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలు.. ప్రకాశం జిల్లా నల్లమడుగుల గ్రామానికి చెందిన గాయపు అంకమ్మ, ఏసురత్నం దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కట్టెలు కాల్చి బొగ్గుల చేసే పనిపై ఆధారపడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో అంకమ్మ తన కుటుంబసభ్యులతో కలసి సోదరుడు సమరం నగేష్ వెంట ఇటీవల నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి వలస వచ్చి బొగ్గులు కాల్చే పనిని చేపట్టారు. ఈ నెల 22న రాత్రి ఒంటి గంట సమయంలో ఏసురత్నం ఇంట్లో లేని సమయంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బొగ్గుల వ్యాపారి (సేటు) ఎం.యంగయ్య, మరో నలుగురు వచ్చి అంకమ్మ, ఆమె సోదరుడు నగేష్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. 23న వారి బారి నుంచి తప్పించుకుని ఇద్దరూ దొన్నికోటకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి నల్లమాడ పోలీసులకు అంకమ్మ ఫిర్యాదు చేశారు. పాత బాకీ తీర్చాలంటూ తనను, తన సోదరుడిని యంగయ్య, మరో నలుగురు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం మంగళవారం కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతి బత్తలపల్లి: మేడపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లికి చెందిన కోనేటి సుధాకర్ (38) బతుకుదెరువు నిమిత్తం 11 ఏళ్ల క్రితం బత్తలపల్లికి వచ్చాడు. ఆర్డీటీ ఆస్పత్రి సమీపంలో టిఫెన్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 20న రాత్రి మిద్దైపె పడుకునేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో భార్యతోపాటు స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం.. అటు నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.సుధాకర్కు భార్య, కుమార్తె అద్వైత, తల్లి ఉన్నారు. బాల పురస్కారాలకు దరఖాస్తుల స్వీకరణ పుట్టపర్తి అర్బన్: ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2026’కి గాను అర్హులైన బాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రీడలు, శౌర్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు అవార్డులను అందజేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు జూలై 31వ తేదీ లోపు https://awards.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. -
మహిళను కత్తులతో బెదిరించి బంగారు అపహరణ
బెళుగుప్ప: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తులతో బెదిరించి బంగారు నగలు, నగదు అపహరించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం రామసాగరం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తోటలో తన కుమారుడు శ్రీనాథరెడ్డితో కలసి ముడిమి లక్ష్మీదేవి నివాసముంటోంది. సోమవారం రాత్రి కూరగాయలు తీసుకు వచ్చేందుకు శ్రీనాథ్రెడ్డి రామసాగరం గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో గదిలో లక్ష్మీదేవి వంట చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు లోపలకు ప్రవేశించారు. వంట గదిలో ఉన్న లక్ష్మీదేవిని వెనుక నుంచి అదిమిపట్టి కిందపడేసి కత్తులతో బెదిరిస్తూ నోట్లోకి గుడ్డలు కుక్కారు. ఆమె శరీరంపై ఉన్న బంగారు చైను, చేతిలోని నాలుగు బంగారు గాజులు లాక్కొని, ఇంట్లో ఉన్న రూ.96వేల నగదును అపహరించారు. కొద్ది సేపటికి ఇంటికి చేరుకున్న కుమారుడు విషయం తెలుసుకున్ని గ్రామంలోకి వెళ్లి బంధువులకు, గ్రామస్తులకు తెలపడంతో చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు, ప్రొబేషనరీ డీఎస్పీ అస్రప్ అలీ, సీఐలు మహానంది, ప్రవీణ్కుమార్, విడపనకల్లు, వజ్రకరూరు ఎస్ఐలు ఖాజాహుస్సేన్, నాగస్వామి, బెళుగుప్ప ఎస్ఐ శివ పరిశీలించారు. స్నిప్పర్ డాగ్ను రంగంలో దించారు. క్లూస్ టీం సాయంతో నిందితుల వేలి ముద్రలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఉద్యానం’ చుట్టూ అధ్వానం
ధర్మవరం రూరల్: ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీలోని ఆరుబయలులో ఏర్పాటు చేసిన ఉద్యాన శాఖ వనరుల కేంద్రం పరిసరాలు అధ్వానంగా మారాయి. సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లాక ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మందుబాబులు ఇక్కడే సిట్టింగ్ వేస్తున్నారు. మద్యం తాగి.. అక్కడే సీసాలు పడేస్తున్నారు. కొందరు పగులగొడుతున్నారు. దీనికితోడు స్థానికులు ఇక్కడ ఎవ్వరూ ఉండరని కార్యాలయ తలుపుల వద్ద మెట్లపైన, సమీపాన మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. ఉదయం పూట విధులకు హాజరైన సిబ్బంది ఆ కంపును దాటి లోనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పోలీసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తే మందుబాబులు రాకుండా ఉంటారని కార్యాలయ సిబ్బంది అంటున్నారు. -
ఎక్కడ పడితే అక్కడే కిక్కు
అనంతపురం జిల్లాలో గత 9 మాసాల్లో మద్యం అమ్మకాలు ఇలా..మద్యం అమ్మకం (లీటర్లలో)99,12,006విలువరూ.792,12,78,746సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెల్టుషాపుల బెండు తీసే వారు కరువయ్యారు. పర్మిట్ల రూముల వైపు అసలు చూడడమే లేదు. ‘పచ్చ’ నేతలవే మద్యం షాపులు కావడంతో నిబంధనలు గాలికి పోయాయి. ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో జోగుతోంది. మద్యం వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. సామాన్యులే సమిధలు.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దాదాపు అన్ని చోట్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం షాపుల నిర్వహణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అమ్మకాలు ఎలా పెంచాలా అన్న కోణంలో ఇష్టారాజ్యంగా నిబంధనలకు తిలోదకాలిచ్చారు.మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో గడిచిన 9 మాసాల్లో రెండు జిల్లాలో 1.60 కోట్ల లీటర్ల మద్యం తాగినట్టు తాజా లెక్కల్లో తేలింది. దీన్నిబట్టి సామాన్యులు రోజువారీ మద్యం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా వేయొచ్చు. ఎక్కడ చూసినా బెల్టుషాపులు రెండు జిల్లాలో 200 వరకు మద్యం షాపులుంటే 2 వేలకు పైగా బెల్టు షాపులు ఉండటం గమనార్హం. దీంతో కూరగాయల షాపుల కంటే మద్యం షాపులే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. చిన్న చిన్న గ్రామాల్లో సైతం తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో రెండు, మూడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఇక అర్బన్ ప్రాంతాల్లో వైన్షాప్ల పక్కనే అనధికార పర్మిట్ రూములు వెలిశాయి. దీంతో మద్యం లభ్యత పెరిగి విచ్చలవిడిగా వినియోగం అవుతున్నట్టు తెలు స్తోంది. రోజుకు ఉమ్మడి జిల్లాలో 60 వేల లీటర్ల మద్యం తాగుతున్నారని అంచనా. ఇక.. గడిచిన 9 మాసాల్లో 60 లక్షల బీర్లు తాగారు. ఆఫర్లు పెట్టి మరీ.. మద్య నియంత్రణ గురించి పట్టించుకోకపోవడం, వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూములు ఉండటంతో తాగినోడికి తాగినంత చందంగా మారింది. గతంలో బహిరంగ మద్యపానంపై ‘సెబ్’ ఉక్కుపాదం మోపేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ధాబాలు, హోటళ్లు, టీకొట్లలో కూడా తాగే వెసులుబాటు ఉండటంతో మద్యం వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొన్ని చోట్ల భోజన ఆఫర్లు పెట్టిమరీ మద్యం సేల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందూపురం, కదిరి, తాడిపత్రి ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా మద్యం అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో రూ.1,300 కోట్లకు చేరువలో మద్యం అమ్మకాలు నెలకు సగటున రూ.145 కోట్ల విలువైన మద్యం తాగుతున్నట్టు అంచనా 9 మాసాల్లో 1.60 కోట్ల లీటర్ల మద్యం వినియోగం మరో 60 లక్షల బీర్ల సేవనం పర్మిట్రూములు, బెల్టుషాపులతో మత్తులో జోగుతున్న సామాన్యులు -
సచివాలయ ఉద్యోగుల నిరసన బాట
గుడిబండ: ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను స్థానికంగానే అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఐదేళ్లపాటు విజవంతంగా నడిపించింది. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా సాకారం చేసింది. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సచివాలయ ఉద్యోగులు స్థానిక తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసనకు దిగారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ పట్టణ ఉద్యోగులకు మండలంలో కాకుండా స్థానిక వార్డులను యూనిట్గా పరిగణించాలని కోరారు. మిగులు సిబ్బందిని ఎలా గుర్తించి నిర్వహిస్తారనే దానిపై జీఓలో స్పష్టత లేదన్నారు. పారదర్శక ప్రమాణాలు లేకుండా డిప్యూటేషన్లు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు ప్రారంభించే ముందు పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు, ఇంక్రిమెంట్లు ఇతర ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని కోరారు. మరో రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే సచివాలయ ఉద్యోగులు పెన్డౌన్, సమ్మె వంటి వాటికి సైతం వెనుకాడేది లేదన్నారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ గంగాధర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పెనుకొండ రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సచివాలయ ఉద్యోగులు మంగళవారం ఎంపీడీఓ నరేష్కృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. మండల వ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, మంగళవారం ఎంపీడీఓకు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. -
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు
● ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్ ధర్మవరం: ఎలాంటి కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలో విద్యుత్శాఖ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్లను పరిశీలించారు. ఏవైనా సమస్యలున్నాయా.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరకుమార్ మాట్లాడుతూ... వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతుల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. వినియోగదారులు కూడా తమ సమస్యలను నేరుగా విద్యుత్ అధికారులకు తెలియజేయాలన్నారు. లో ఓల్టేజి సమస్యను పూర్తిగా నివారిస్తామన్నారు. అందుకోసం అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ సంపత్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామ్, ఏడీ లక్ష్మీ నరసింహారెడ్డి, ఏఈలు నాగభూషణం, కొండయ్య, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల్లో పేపరు కొరత● ధ్రువీకరణ పత్రాలు అందక రైతులు, విద్యార్థుల ఇబ్బందులు నల్లమాడ: మండలంలోని పలు గ్రామ సచివాలయాల్లో ప్రింటెడ్ పేపర్ల కొరత నెలకొంది. ప్రస్తుతం బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్ జరుగుతోంది. పంటరుణం రెన్యూవల్ చేయాలంటే రైతులు తప్పనిసరిగా ఒరిజినల్ వన్–బీ బ్యాంక్లో సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఒరిజినల్ వన్–బీ ప్రింట్ తీసే పేపర్లు సచివాలయాల్లో స్టాకు లేకపోవడంతో రైతులు వన్–బీ పొందలేకపోతున్నారు. సకాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రింటెడ్ పేపర్లు లేకపోవడంతో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరులోనూ జాప్యం జరుగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తరుణంలో తక్షణం సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. సమష్టి కృషితోనే బాల్య వివాహాలకు చెక్ ●● బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కల్పించండి ● అధికారుల సమీక్షలో ఆర్డీఓ మహేష్ ధర్మవరం అర్బన్: సమష్టి కృషితోనే బాల్య వివాహాలు జరగకుండా చెక్ పెట్టవచ్చని ఆర్డీఓ మహేష్ తెలిపారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి బాల్యవివాహాలను నివారించాలని సూచించారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో బాల్య వివాహాల నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి బాల్యవివాహాలు చేయాలని చూస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. బాల్య వివాహం బలవంతంగా చేసే వారిపై పోక్సో చట్టం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలతోపాటు నిరక్ష్యరాస్యత, కుటుంబ సమస్యలు తీవ్రతరం అవుతాయని వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తహసీల్దార్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1098కు తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతిఒక్క అధికారి పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సురేష్బాబు, భాస్కర్రెడ్డి, సురేష్కుమార్, నారాయణస్వామి, మున్సిపల్ టీపీఆర్ఓ పెనుబోలు విజయ్భాస్కర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
చేదు మిగిల్చిన మామిడి
తలుపుల: అందరికీ తీపి పంచిన మామిడి పండించిన రైతుకు మాత్రం చేదును మిగిల్చింది. సీజన్లో అరకొరగా వచ్చిన కాయలు కూడా ఊజీపురుగుల దెబ్బతో రాలిపోతున్నాయి. దీంతో ఎకరం సాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు అయ్యిందని, ప్రస్తుతం పెట్టుబడి కూడా దక్క లేదని రైతులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయం మామిడే సంప్రదాయ పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలవైపు దృష్టి సారించారు. అందులోనూ ఎక్కువగా మామిడిపైనే మక్కువ పెంచుకున్నారు. ఇన్నాళ్లూ సకాలంలో వర్షాలు కురిసి, దిగుబడి బాగా రావడంతో రైతులు ఆనందంగా మామిడి తోటలు సాగు చేశారు. ఫలితంగా జిల్లాలో ఏటికేడు మామిడి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. రైతును విస్మరించిన కూటమి సర్కార్ ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట నష్టపోయినా ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో రైతులు ఫసల్బీమా చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 2,353 మంది రైతులు 2013 ఎకరాలకు ఫసల్ బీమా చేశారు. గత నవంబర్లో వర్షాభావ పరిస్థితులతో జనవరి వరకు మామిడి తోటల్లో పూత ఆలస్యమైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత, వాతావరణ పరిస్థితులతో పిందెలు నిలబడక కాపు అరకొరగానే కాసింది. దీంతో మే నెల దాటి జూన్ చివరికి వచ్చినా చాలా ప్రాంతాల్లో పంట తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. పోనీ అరకొర పంటనైనా తొలగించుకుని విక్రయిద్దామంటే... నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాయలకు ఊజీ పురుగులు పట్టాయి. దీంతో కాయలన్నీ రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఊసేలేని ఫసల్ బీమా పంటలు నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం ఫసల్ బీమా కింద పరిహారం అందించి ఆదుకునేది. అదికూడా పంట కాలం పూర్తయ్యేలోపే ఆర్థిక సాయం అందించేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పంటకాలం పూర్తయినా ఇంకా పంటనష్టపరిహారం అంచనాలే రూపొందించకుండా అన్యాయం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. అరకొర కాపు.. దానికీ ‘ఊజీ’ దెబ్బ లబోదిబోమంటున్న రైతన్నలు బీమా ఊసే ఎత్తని కూటమి సర్కార్రైతులను ఆదుకోవాలి ఏ సీజన్లో సాగు చేసిన పంటల వివరాలను ఆ సీజన్లోనే సేకరించాలి. పక్కాగా పంట నమోదు చేసి నష్టపోయిన వారికి బీమా పరిహారం అందించాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. లేకపోతే వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. – జి.వెంకటరమణ, టి.రెడ్డివారిపల్లి, తలుపుల మండలంపరిహారం అందించాలి మామిడి సాగు చేసిన రైతులంతా ఫసల్ బీమా చేశారు. అందువల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ సకాలంలో బీమాతో పాటు, నష్ట పరిహారం వర్తింపజేసి ఆదుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. – వై. మోహన్రెడ్డి, ఎనమలదొడ్డివారిపల్లి, తలుపుల మండలం -
కేవీకే పుట్టపర్తిలోనే ఏర్పాటు చేయాలి
పుట్టపర్తి: కృషి విజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) పుట్టపర్తి సమీపంలోనే ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, అగ్రి అడ్వైజరీ బోర్డు జిల్లా మాజీ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి డిమాండ్ చేశారు. అలాకాకుండా మరో ప్రాంతానికి తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళవారం పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. 2023లో అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కృషితో జిల్లాతో పాటు మూడు జాతీయ రహదారులు, పుట్టపర్తిలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడే కృషి విజ్ఞాన కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి మండలానికి తీసుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. పుట్టపర్తిలోనే ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చొరవ చూపాలని.. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలి గత ప్రభుత్వంలో మంజూరైన నల్లమాడలో మార్కెట్యార్డు, పుట్టపర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం, రూ.864 కోట్ల వ్యయంతో ప్రారంభమైన 193 చెరువులకు నీళ్లు నింపే పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డిని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. మలకవేముల క్రాస్ నుంచి నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మీదుగా కర్ణాటకలోకి కలిసే జాతీయ రహదారి మంజూరుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, వైఎస్సార్సీపీ నాయకులు రవినాయక్, ఈశ్వరయ్య, గంగాద్రి, ఫొటో సాయి, చెరువు భాస్కర్రెడ్డి, కేశప్ప తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్ -
‘ఎంటీఎస్’ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. మూడు రోజుల క్రితం జరిగిన కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసిన టీచర్లు రెండోమారు మంగళవారం జరపాలని చూసిన కౌన్సెలింగ్లోనూ పాల్గొనకుండా బాయ్కాట్ చేయడం విశేషం. స్థానిక సైన్స్ సెంటర్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ను ఎంటీఎస్ టీచర్లు అడ్డుకున్నారు. తమపట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, డీఏ, హెచ్ఆర్ఏ సదుపాయం ఉండదన్నారు. ఇలాంటి వారందరికీ జిల్లా సరిహద్దు మండలాల్లో కనీసం రవాణా సదుపాయం లేని స్కూళ్లకు కేటాయిస్తే ఎలా పోవాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నియర్ బై రెసిడెంట్’ ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొండిగా కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం మరోవైపు విద్యాశాఖ అధికారులు మొండిగా కౌన్సెలింగ్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో ఉన్న పేర్లను పిలుస్తూ లోపలికి వచ్చి నచ్చిన స్థానాలు ఎన్నుకోవాలి.. లేదంటే బలవతంగా స్థానాలు కేటాయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఎంటీఎస్ టీచర్లు తిరగబడ్డారు. లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియను అంతటితో ఆపేశారు. ఆర్జేడీ నోటా పాత మాటే రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో పాటు డీఈఓ ప్రసాద్బాబును చుట్టుముట్టారు. ఆర్జేడీ నోటి నుంచి కూడా పాతమాటే వచ్చింది. విద్యార్థులకు సరిపడా పోస్టులు మాత్రమే ఉన్నాయని అంతకు మించి చూపించడం సాధ్యం కాదంటూ తెగేసి చెప్పారు. దీంతో ఎంటీఎస్ టీచర్లు ఆర్జేడీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘మా జీవితాలతో ఆడుకోవద్దండి. ఇంత ఇబ్బందులు పెట్టే బదులు కాసింత విషం ఇచ్చి చంపండి’ అంటూ వాపోయారు. సహకరించాలని ఆర్జేడీ కోరినా.. ఎంటీఎస్ టీచర్లు అంగీకరించలేదు. రాత్రి 8 గంటల సమయంలో బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు టీచర్ల ససేమిరా -
సొంత మండలంలో అవకాశమివ్వండి
● డీపీఓకు సచివాలయ ఉద్యోగుల వినతి ఓడీచెరువు : సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే బదిలీలకు అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాదాగిరి చౌడప్ప కోరారు. ఈ మేరకు కొండకమర్ల సచివాలయాన్ని తనిఖీ చేసేందుకు మంగళవారం విచ్చేసిన డీపీఓ సమతను కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్కు సంబంధించిన జీఓ సాకుతో సొంత మండలాలకు బదిలీ కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ జీఓను పునఃపరిశీలించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాల అమలుకు నిత్యం కృషి చేస్తున్న తమ సేవలను గుర్తించాలన్నారు. ఇప్పటికే ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమకు ప్రమోషన్ కల్పించిన తరువాతనే రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. జాయినింగ్ తేదీ నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకొని రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఆలస్యంగా ప్రొబేషన్ ప్రకటించినందున 9 నెలల కాలానికి ఆరియర్స్ మంజూరు చేయాలని కోరారు. అలాగే క్యాడర్ గుర్తింపు, టెక్నికల్ పదోన్నతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల సచివాలయ ఉద్యోగులు బాబ్జాన్, నరేంద్ర, అంజి నాయక్, విజయ్, కుళ్ళాయప్ప, గౌసియా తదితరులు పాల్గొన్నారు. -
చీటింగ్ టీచరుకు ‘అధికార’ అండ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యాపారులను చీటింగ్ చేసి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ప్రభుత్వ టీచరు కాకర్ల దివాకర్నాయుడుకు అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనపై కనీస చర్యలు తీసుకోకుండానే తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేయించి ఉద్యోగంలో చేరేలా చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురంలోని రాజేంద్ర నగర పాలక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కాకర్ల దివాకర్నాయుడు చీటీల వ్యాపారంతో సుమారు రూ. 10 కోట్ల దాకా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత కూడా అసలు విషయం తెలీక కొందరు కొన్ని నెలలు పాటు క్రమం తప్పకుండా చీటీల మొత్తం చెల్లిస్తూ వచ్చారు. ఆయన భాగోతాన్ని గతేడాది జూలైలో వరుస కథనాలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధితులంతా అప్రమత్తమైనా అప్పటికే జరగాల్సిన నష్టం బాగా జరిగింది. కలెక్టర్, ఎస్పీని కలిసి విన్నవించడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు.. కాకర్ల దివాకర్నాయుడుకు తూర్పు రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్సీ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి స్కూల్కు పంపాలని, జీతానికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ అధికారులపై ఒత్తిళ్లు చేశారు. ఈ అంశంపై జిల్లా స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో రాయలసీమ స్థాయి అధికారిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో దివాకర్నాయుడుకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇవ్వకముందే సస్పెన్షన్ ఎత్తివేసి మే 1న అబుల్ కలాం స్కూల్కు కేటాయించారు. ఆ తర్వాత ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన వివరణ ఇస్తే ఆ తర్వాత విచారణకు ఓ అధికారిని నియమిస్తారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటిదాకా ఆయన వివరణ కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇదే అంశంపై డీఈఓ ప్రసాద్బాబు మాట్లాడుతూ.. ‘దివాకర్నాయుడుపై సస్పెన్షన్ ఎత్తివేశాం. ఆ తర్వాత చార్జెస్ నోటీసు జారీ చేశాం. వివరణ ఇచ్చాడో లేదో తెలీదు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండడం వల్ల కాస్తా ఆలస్యమైంది. వెంటనే వివరణ తీసుకుని విచారణ అధికారిని నియమిస్తాం. ఆలస్యం కాకుండా నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని పేర్కొన్నారు. లబోదిబోమంటున్న బాధితులు.. చీటింగ్ కేసు నిందితుడు దివాకర్నాయుడు దర్జాగా తిరుగాడుతుండగా మరోవైపు బాధితులు లబోదిబోమంటున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ తమ డబ్బు చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్నాడంటూ వాపోతున్రాను. ఇలాంటి వారికి అండగా నిలిచిన ప్రజా ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇవ్వకముందే సస్పెన్షన్ ఎత్తివేత ఆ తర్వాత నోటీసు జారీ చేసిన అధికారులు విధుల్లో చేరి రెండు నెలలవుతున్నా నేటికీ ఇవ్వని వివరణ తెర వెనుక ఉంటూ మంత్రాంగం నడుపుతున్న ఓ ఎమ్మెల్సీ -
ఆటోలో ప్రసవం..తల్లీబిడ్డ క్షేమం
సోమందేపల్లి: కాన్పు కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యంలో ఆటోలోనే ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పందిపర్తి గ్రామానికి చెందిన గర్భిణి మంజులకు ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబీకులు ఆమెను ఆటోలో సోమందేపల్లి ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే మంజుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హిందూపురం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో కుటుంబీకులు ఆమెను ఆటోలో హిందూపురం తరలిస్తుండగా.. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో వెంట వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్త పల్లవి, హెల్పర్ ఉషా ఆటోలోనే మంజులకు కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
‘పోలీసు స్పందన’కు 50 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 50 వినతులు అందాయి. డీఎస్పీ ఆదినారాయణ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజరీ సాయినాథరెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు ఎస్ఎస్ఈ బోర్డు కార్యాలయం మార్పుఅనంతపురం ఎడ్యుకేషన్: కృష్ణా జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఎస్ఎస్ఈ బోర్డు (ప్రభుత్వ పరీక్షల) కార్యాలయాన్ని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కళాశాల విద్య కమిషనర్ కార్యాలయం పక్కన సర్వీస్రోడ్డులో ఉన్న గరుడవేగ టవర్స్లోకి మార్పు చేశారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. సోమవారం నుంచి కార్యకలాపాలు అక్కడి నుంచే సాగుతున్నాయని పేర్కొన్నారు. రైలు ఎక్కబోతూ కింద పడి యువకుడి మృతి తాడిమర్రి: రైలు ఎక్కబోతూ అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు.. అనంతపురంలో రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కల్లే శ్రీరాములుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెను అదే గ్రామానికి చెందిన గోపాల్కు ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సుధాకర్(26) డిగ్రీ వరకు చదువుకుని తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమైన సుధాకర్.. ఆదివారం సాయంత్రం అనంతపురం రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రాత్రి 8 గంటలకు ఉన్న కదిరిదేవరపల్లి–తిరుపతి ట్రైన్ తప్పిపోవడంతో సోమవారం వేకువజామున వచ్చిన రైలును ఆలస్యంగా గమనించి ఎక్కేందేకు సిద్ధమయ్యాడు. అప్పటికే రైలు ముందుకు కదలడంతో ఎక్కేందుకు ప్రయత్నిస్తూ పట్టు తప్పి కింద రైలు కిందపడి రెండు ముక్కలయ్యాడు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామ వాసిగా గుర్తించి ఇక్కడి పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
హామీలు నెరవేర్చడం చేతకాకపోతే గద్దె దిగండి
ప్రశాంతి నిలయం: ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టి ఏడాది గడిచినా పాలకులు పరిష్కరించలేకపోయారని, హామీలను నెరవేర్చే సత్తా లేకపోతే వెంటనే గద్దె దిగిపోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకు ముందు స్థానిక గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీషా, కోశాధికారి శ్రీదేవి మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో కనీసం రేషన్ కార్డుకు కూడా నోచుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్వో విజయసారథికి అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, నాయకులు జీఎల్ నరసింహులు, లక్ష్మీనారాయణ, పెడపల్లి బాబా సాంబశివ, దిల్షాద్, అంజి, గంగాధర్ , పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా -
సహకార బ్యాంకులను లాభాల బాట పట్టిద్దాం
● డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి ముంటిమడుగు కేశవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: సహకార బ్యాంకులను లాభాల బాట పట్టించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా చేద్ధామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఉద్యోగులకు ఆ బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. నూతనంగా ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం సోమవారం స్థానిక డీసీసీబీ హాల్లో సీఈఓ కె.సురేఖారాణి అధ్యక్షతన జరిగిన 129న మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు ప్రాధాన్యతనిస్తూనే మిగిలిన వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందించి సమష్టి కృషితో బ్యాంకు పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ఆడిట్ రిపోర్టు, జమా ఖర్చులను మహాజనసభ ఆమోదించింది. అలాగే 2025–26 బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. గతేడాదికి సంబంధించి రూ.1.55 కోట్లను బైలా ప్రకారం వివిధ పద్ధులకు కేటాయించారు. సమావేశంలో డీజీఎంలు, ఏజీఎంలు, మేనేజర్లు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. యువకుడి బలవన్మరణం కనగానపల్లి: వ్యసనాలు మాని బుద్ధిగా ఉండాలని తల్లిదండ్రులు మందలించడాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం దాదులూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కేశవయ్య, ముత్యాలమ్మ దంపతులకు కుమారుడు నరేష్ (20), కుమార్తె ఉన్నారు. పదో తరగతి వరకూ చదువుకున్న నరేష్ ఆ తర్వాత పై చదువులకు వెళ్లకుండా సెంట్రింగ్ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలసి వ్యసనాలకు బానిసగా మారి జులాయిగా తిరగసాగాడు. తండ్రి పలుమార్లు హెచ్చరించినా మారలేదు. దీంతో ఆదివారం రాత్రి గట్టిగా మందలించి, గొర్రెల మంద వద్దకు కాపలాకు వెళ్లాడు. ఆ సమయంలోతల్లి, చెల్లి ఆరుబయట నిద్రిస్తుండగా ఇంట్లో పడుకున్న నరేష్ అర్ధరాత్రి దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం నిద్ర లేచిన తల్లి ముత్యాలమ్మ తలుపులు తెరవగా దూలానికి వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేసింది. చుట్టూపక్కల వారు అక్కడకు చేరుకుని అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఇలా.. ఇంకెన్నాళు?!
పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్కు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులు పతాకస్థాయికి చేరుకున్నాయి. ధర్మవరం – గోరంట్ల ప్రధాన మార్గంలో పుట్టపర్తికి ఒకటిన్నర కిలోమీటరు దూరం ఉన్న ఈ పాఠశాలకు సమీప గ్రామాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాల వేళకు రావడం, బడి వేళలు ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకోవడంలో తీవ్ర ఆలస్యమవుతోంది. ఇలా ఇంకెన్నాళ్లు అవస్థలు పడాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. చీకటి పడినా ఇళ్లకు చేరకపోవడంతో తమను బడి మానాలంటూ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని పలువురు బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – పుట్టపర్తి అర్బన్: -
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: తమ న్యాయపరమైన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ ప్రభుత్వాన్ని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగంను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. వేతనాలు పెంచాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీలోపు సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సాంబశివ, నాయకులు గంగాధర్, శివ, ఫకృద్దీన్, ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా నాయకులు ముంతాజ్, శబరి, అంజినమ్మ, వరలక్ష్మి, మమత, గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు. వివాహిత హత్య కేసులో భర్తకు రిమాండ్ కనగానపల్లి: మండల కేంద్రం కనగానపల్లిలో వివాహితను హత్య చేసిన కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కనగానపల్లికి చెందిన వివాహిత కళావతిని శనివారం సాయంత్రం ముళ్లపొదల వద్ద ఆమె భర్త రాఘవ కొట్టి చంపిన విషయం తెలిసిందే. హతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రామగిరి సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో కనగానపల్లి పోలీసులు విచారణ చేపట్టి సోమవారం నిందితుడు రాఘవను అరెస్ట్ చేశారు. అనంతరం ధర్మవరం కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ‘పీఎం సూర్యఘర్’ను వేగవంతం చేయండి●● ఎస్పీడీసీఎల్ సీజీఎం వరకుమార్ అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం వరకుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, బ్యాంకర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇంటి అవసరాలకు వినియోగించడంతో పాటు మిగులు విద్యుత్ను సంస్థకు విక్రయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కిలో వాట్ల వారీగా సోలార్ ఫ్యానళ్ల ఏర్పాటుకు బ్యాంకర్లు సైతం రుణాలను అందజేయాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి వచ్చిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల బ్యాంకర్లుతో సమన్వయం చేసుకొని గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈఈ, ఏడీలను అదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, ఏడీలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
వంచనపై యువ గర్జన
పుట్టపర్తి: ఎన్నికల హామీలు అమలు చేయకుండా వంచించిన కూటమి సర్కార్ తీరుపై విద్యార్థులు, యువకులు కదం తొక్కారు. అలవిగాని హామీలతో నమ్మించి మోసం చేసిన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పాలన చేతగాని సీఎం వెంటనే దిగిపోవాలని నినదించారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం పుట్టపర్తిలో నిర్వహించిన ‘యువత పోరు’కు విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపడంతో కార్యక్రమం విజయవంతమైంది. భారీ జనసందోహంతో ర్యాలీ ఉదయం పుట్టపర్తి పట్టణంలోని గణేశ్ సర్కిల్ నుంచి మొదలైన యువత పోరు ర్యాలీ కలెక్టరేట్ వరకు భారీ జనసందోహం మధ్య సాగింది. చంద్రబాబు మోసాలను వివరిస్తూ యువకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగ భృతి ఏది బాబూ?.. ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్ బాబూ, చేతకాని సీఎం రాజీనామా చేయాలి.. అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పుట్టపర్తి పుర వీధుల్లో చేసిన ర్యాలీకి భారీ మద్దతు లభించింది. అనంతరం విద్యార్థులు, నిరుద్యోగులు, యువత కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా, వసతి దీవెన బకాయిలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి సహా ఆయా మండలాల ఎంపీపీలు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, సర్పంచులు, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. నిండా ముంచిన చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, ఇప్పటికే చదువులు పూర్తి చేసిన యువతను చంద్రబాబు ప్రభుత్వం నిండా ముంచింది. చదువుకునేందుకు ఆర్థికంగా చేయూత లేదు. అప్పు చేసైనా చదువు పూర్తిచేస్తే ఉద్యోగాలు లేవు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఆర్థిక చేయూతనిచ్చి పేదల చదువులకు దోహదం చేసింది. – గంగుల సుధీర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం అన్ని వర్గాలకూ మోసం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత, మహిళలు.. ఇలా అన్ని వర్గాలనూ మోసం చేసింది. తల్లికి వందనంలో అర్హులకు న్యాయం జరగలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు చదువును దూరం చేశారు. విద్యార్థులపై దాడులతో పాటు వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకూ పోరాటం కొనసాగిస్తాం. – పురుషోత్తం రాయల్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరుద్యోగులకు కుచ్చుటోపీ నిరుద్యోగుల ఉసురు తగులుతుంది కూటమి సర్కారు తీరుపై యువజనాగ్రహం పుట్టపర్తిలో కదం తొక్కిన విద్యార్థులు, యువకులు గణేశ్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ విజయవంతం రూ.7,800 కోట్ల బకాయిలు పెండింగ్ 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,800 కోట్లు, హాస్టల్ నిర్వహణకు 1,100 కోట్లు, 2025–26 విద్యా సంవత్సరానికి రూ.2,600 కోట్లు మొత్తంగా రూ.7,800 కోట్లు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ విజయసారథికి అందించారు. -
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు
విద్యార్థులు, యువతకు అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తామని ఆశపెట్టారు. పగ్గాలు చేపట్టి ఏడాది దాటినా భృతి ఊసే లేదు. ఇక విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తామని చెప్పి మోసం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా వేధిస్తున్నారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదు. – లింగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం -
బుద్ధిచెప్పి తీరుతాం
వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. యువతకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి స్వయం ఉపాధికి అండగా నిలుస్తామన్న పవన్ కల్యాణ్ కూడా నేడు నోరు మెదపడం లేదు. యువకులు, విద్యార్థులను మోసం చేసిన కూటమి సర్కార్కు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పితీరుతాం. – అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం -
మోసం ఆయన నైజం
మోసం చంద్రబాబు నైజం. అబద్ధాలు చెప్పడంలోనూ ఆయన దిట్ట. బాబు మాటిచ్చారంటే మోసం గ్యారెంటీ. ఇప్పటికే ఎన్నోసార్లు ఇది రుజువైనా యువకులు, విద్యార్థులు మరోసారి ఆయన మాటలు నమ్మి ఓట్లేశారు. కానీ ఆయన బుద్ధి మారలేదు. ఉద్యోగాలు లేవు. పోనీ నిరుద్యోగ భృతి ఇస్తారంటే అదీ లేదు. చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందదు. పైగా హామీలన్నీ నెరవేర్చానంటూ ఎదురుదాడికి దిగారు. మోసాల బాబుకు బుద్ధి చెప్పితీరుతాం. – సందీప్ నాయుడు, యువజన విభాగం నేత, పుట్టపర్తి పశుమాంసం రవాణా కేసులో 11 మంది అరెస్ట్హిందూపురం: పశుమాంసం అక్రమ రవాణా ఘటనలో హిందూపురం పోలీసులు సోమవారం 11 మందిని అరెస్టు చేశారు. డీఎస్పీ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం నుంచి తరలుతున్న పశుమాంసాన్ని ఆదివారం తెల్లవారుజామున సంతేబిదనూర్ గేట్ వద్ద హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆరు వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సోమవారం 11 మందిని అరెస్ట్ చేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న 6.5 టన్నుల పశుమాంసాన్ని అధికారుల సమక్షంలో కిరికిరా డంపింగ్ యార్డ్ వద్ద పూడ్చివేశారు. అరెస్ట్ అయిన వారిలో హిందూపురానికి చెందిన ఫరూక్, అనీఫ్, అస్లాం, అసిఫుల్లా బేగ్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ మౌలాసాబ్, షేక్ ఇమ్రాన్, షేక్ జబివుల్లా, కొలిమి జమీర్ ఖాన్, అఫ్రిద్, జాకీర్లు ఉన్నారు. అధికారుల అనుమతులతోనే మాంసం షాపులు నిర్వహించాలని, అక్రమంగా ఎవరైనా నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. -
ప్రశ్నిస్తే కేసులా?
నిరుద్యోగులను, విద్యార్థులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు సర్కార్కు పాలించే అర్హత లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని ,ఉన్నత చదువులు చదివే విద్యార్థులను వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు. పైగా ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. నిరంకుశ కూటమి సర్కార్ కూలే రోజు త్వరలోనే ఉంది. – బడా నాగార్జునరెడ్డి, యువజన విభాగం నేత, పుట్టపర్తి -
అర్జీలకు మెరుగైన పరిష్కారం చూపాలి
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే అర్జీలకు మెరుగైన పరిష్కారం చూపాలని డీఆర్ఓ విజయ సారథి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల వర్తింపు తదితర వాటిపై మొత్తంగా 212 అర్జీలు అందాయి. కార్యక్రమం అనంతరం డీఆర్ఓ విజయసారథి మాట్లాడుతూ... కలెక్టరేట్కు వెళ్లి అర్జీ ఇస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి వరకూ వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యకు మెరుగైన వరిష్కారం చూపవచ్చన్నారు. ఆ దిశగా ప్రతి అధికారీ కృషి చేయాలన్నారు. అలాగే పెండింగ్ అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు. అర్జీదారుడి సమస్య తీర్చడంలో ఏదైనా సమస్య ఉంటే ఆ విషయం అర్థమయ్యేలా వివరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం పనికి రాదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్దక శాఖల జేడీలు సుబ్బారావు, చంద్రశేఖర్ రెడ్డి, శుభదాస్, ప్రజా రవాణా అధికారి మధుసూదన్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, డీపీఓ సమత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులకు డీఆర్ఓ విజయ సారథి ఆదేశం వివిధ సమస్యలపై 212 అర్జీలు -
24 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 24 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. సగటున 9.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తి 26.4 మి.మీ, తలుపుల మండలంలో 24.6 మి.మీ, నల్లమాడ మండలంలో 24.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక బుక్కపట్నం మండలంలో 23 మి.మీ, కొత్తచెరువు 21.8, రామగిరి 20.6, సోమందేపల్లి 19.4, గోరంట్ల 19.2, రొద్దం 13.8, అమడగూరు 13.8, అమరాపురం 12.8, తనకల్లు 12.4, పెనుకొండ 11, ఓడీ చెరువు 10.2, కదిరి 7.2, అగళి 6.2, సీకేపల్లి 5.8, నల్లచెరువు 4.2, మడకశిర 4, ధర్మవరం 3.4, గాండ్లపెంట 2.8, కనగానపల్లి 2.2, ముదిగుబ్బ 2.2, ఎన్పీకుంట మండలంలో 2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా వర్షాలు ముంగారు పంటలకు మేలు చేస్తాయని వెల్లడించారు. జగన్పై కేసు అక్రమం● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పెనుకొండ రూరల్: సత్తెనపల్లిలో ఘటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు చేయడం అక్రమమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదవశాత్తూ సింగయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. అందుకు ప్రభుత్వము, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. జెడ్ప్లస్ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు గట్టి బందోబస్తుతో పాటు రోప్ పార్టీతో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఓ రాజకీయ నాయకుడి పర్యటనపై ఆంక్షలు విధించలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్ల పర్యటనలను అడ్డుకోలేదని, పైగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కల్పించామన్నారు. జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం చట్ట విరుద్ధం ● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ సాక్షి, పుట్టపర్తి: రెంటపాళ్లలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం.. ఎవరి చుట్టం కాదని, రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చట్టాలను దుర్వినియోగం చేయకూడదన్నారు. కూటమి నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం జరిగితే.. డ్రైవర్ కారణం అవుతాడు.. కానీ బస్సులోని ప్రయాణికులు కాదని తెలుసుకోవాలన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో? ఎవరు చేశారనే దానిపై స్పష్టత వచ్చాకే కేసులో పేర్లను చేర్చాలన్నారు. అలా కాకుండా అధికారం ఉంది..ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోబోవని గుర్తుంచుకోవాలన్నారు. 27న ‘దిశ’ కమిటీ సమావేశం అనంతపురం సిటీ: శ్రీసత్యసాయి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశం ఈ నెల 27న పుట్టపర్తిలోని కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జెడ్పీ డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య సోమవారం తెలిపారు. దిశ కమిటీ చైర్మన్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి అధ్యక్షతన ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మంత్రులు, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ టీఎస్ చేతన్, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కమిటీ సభ్యులు హాజరు కానున్నట్లు వివరించారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. -
ప్రతి గొర్రెకూ ఓ ధర!
యాడికి: ఉమ్మడి జిల్లాలో ఉరవకొండ, కదిరి తర్వాత మేకలు, గొర్రెల సంతకు యాడికి ఖ్యాతి గాంచింది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ సంతకు తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు. ఏడాది క్రితం వరకూ ఇక్కడ వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతూ వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా కొందరు టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు తెరలేపారు. సంత నుంచి గొర్రె కానీ, మేక కాని బయటకు తీసుకెళితే రూ.20 చెల్లించుకోవాలి. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మార్కెట్ యార్డుకు రూ.24 లక్షల ఆదాయం యాడికి నుంచి వేములపాడుకు వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో గతంలో ప్రతి సోమవారం గొర్రెల సంత నిర్వహించేవారు. పెద్ద సంఖ్యలో వాహనాల్లో గొర్రెలు, మేకలను తీసుకొచ్చి క్రయవిక్రయాలు సాగించేవారు. ప్రతి సోమవారం 1,500 నుంచి 2,500 వరకూ జీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అప్పట్లో తాడిపత్రి మార్కెట్ యార్డుకు చెందిన సిబ్బంది నిర్ణీత రుసుం వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు. ఇలా గొర్రెల సంత ద్వారా ప్రతి సోమవారం రూ.40 వేలకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరేది. ఈ లెక్కన నెలకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా, ఏడాదికి రూ.24 లక్షల వరకూ మార్కెట్ ఫీజులు వసూళ్లయ్యేవి. ఇక పండుగల సందర్భంలో ఈ ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండేది. ధనార్జనే ధ్యేంగా... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత గొర్రెల సంత ఆదాయంపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఈ నేపథ్యంలో మరికొందరితో కుమ్మకై 4 నెలలుగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఈ క్రమంలో తమ దందాకు అనుకూలంగా ఉండేలా కుట్రలు పన్ని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులోని గొర్రెల సంతను యాడికి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోన రోడ్డుకు మార్చేలా చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి మార్కెట్ యార్డు ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గొర్రెలు, మేకలు విక్రయించిన వారి నుంచే నిర్ణీత రుసుం వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జీవాలు విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారి నుంచి కూడా రూ.20 వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే జీవాలను గేటు దాటనివ్వకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇదే విషయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దృష్టికి వ్యవసాయ మార్కెట్ అధికారులు తీసుకెళ్లారు. ఏటా గొర్రెల సంత ద్వారా మార్కెట్ యార్డుకు సమకూరుతున్న రూ.24 లక్షల ఆదాయానికి కొందరు టీడీపీ నేతలు గండి కొడుతున్నారని, ఈ అక్రమాలను అరికట్టాలని అభ్యర్థించినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. మార్కెట్ యార్డు నుంచి బయటపడిన తర్వాత గొర్రెల సంతపై ఆదాయం స్థానిక పంచాయతీకి చెందాల్సి ఉంది. అయినా పంచాయతీకి నయాపైసా ఆదాయం సమకూరడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గతంలో మాదిరిగానే గొర్రెల సంతను వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డుకు తరలించి, ఆదాయం ప్రభుత్వానికే సమకూరేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. టీడీపీ నేతల నయా దందా సంతలో నుంచి గొర్రె బయటకు పోతే రూ.20 చెల్లించాలి ప్రతి సోమవారం అప్పనంగా రూ.50వేలకు పైగా అక్రమ వసూళ్లు -
మలి వయసులో ఆసరా
అనంతపురం అర్బన్: సీనియర్ సిటిజన్ కార్డు ఒక్కటి ఉంటే చాటు ప్రభుత్వం నుంచి లభించే చాలా ప్రయోజనాలు అందుతాయి. 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు అర్హులు. కార్డు తీసుకున్నవారికి ఆర్థిక, వైద్య, ప్రయాణ, పన్ను మినహాయింపు వంటి పలు ప్రయోజనాలు చేకూరుతాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఎఫ్డీలపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్లాన్లు ఇస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల్లో సీనియర్ సిటిజన్ కార్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ● రైల్వే, ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరపై తగ్గింపు ఉంటుంది ● ఐఆర్సీటీసీ లేదా టికెట్ బుక్కింగ్ సమయంలో రాయితీ వర్తిస్తుంది. ● విమాన ప్రయాణాల్లోనూ కొన్నిసార్లు రాయితీలు ఉంటాయి. ● బస్సు పాసు తీసుకుంటే నెలవారీ ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి. ● ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ● వైద్య పరీక్షలు, చికిత్సలపై ఆస్పత్రుల్లో రాయితీలు లభిస్తాయి. ● ఔషధాల మీద కొన్ని ఫార్మసీల్లో తగ్గింపు లభిస్తుంది. ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాధాన్యతగా వైద్యం అందిస్తారు. ● ఈఎస్ఐసీ, సీజీహెచ్ఎస్ పథకాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ● తలసేమియా, క్యాన్సర్, వైద్య రీయింబర్స్మెంట్ స్కీముల్లో అర్హత. ● ఆదాయ పన్నులో ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. ● 2025–26లో రూ.3 లక్షల వరకు ఆదాయానికి పన్నులు చెల్లించనవసరం లేదు. ● 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై అధిక మినహాయింపు ఉంటుంది. ● 80టీటీబీ కింద ఎఫ్డీల మీద వడ్డీ ఆదాయానికి రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ● ఫారం 15 హెచ్ ద్వారా టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు. ● పన్ను ఫైలింగ్ను సులభతరం చేసేందుకు ప్రత్యేక హెల్డ్ డెస్క్లు ఉంటాయి. ● రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ సిటిజన్ పోర్టల్ లేదా సర్కారీ సువిధ (https://sarkarisuvidha. online/) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ● ఆమోదం పొందిన తరువాత సీనియర్ సిటిజన్ కార్డును ఆన్లైన్లోనే పొందవచ్చు. ● సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా నగర, పురపాలక సంఘం కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ● దరఖాస్తు ఫారం, రెండు ఫొటోలు, చిరునామా, వయసు రుజుపు పత్రాలను అధికారులకు అందించాలి. ● ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డ్ ● జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ లేదా పాన్కార్డ్ ● విద్యుత్ బిల్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ ● ఇటీవల తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు ● బ్యాంక్ పాస్బుక్ ● ఆరోగ్య పత్ర ఏబీహెచ్ఏ కార్డు, హెల్త్ ఐడీ. 60 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారికి సీనియర్ సిటిజన్ కార్డు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తుకు అవకాశం జిల్లా కేంద్రాల్లోనే పొందే అవకాశం ఆరోగ్య బీమా, వైద్య రాయితీ దరఖాస్తు ఇలా అవసరమైన పత్రాలు.. ప్రయాణంలో రాయితీ పన్ను మినహాయింపు -
నిజాయితీ చాటుకున్న ప్రైవేట్ టీచర్
కదిరి టౌన్: రోడ్డుపై తనకు లభించిన విలువైన బంగారు నగను పోలీసుల ద్వారా సంబంధీకుడికి చేర్చి ఓ ప్రైవేట్ టీచర్ తన నిజాయితీ చాటుకున్నారు. వివరాలు... కదిరిలోని బీడీ పరిశ్రమలో అకౌంటెంట్ పనిచేస్తున్న ఇజ్రాయేల్ శుక్రవారం సాయంత్రం వలీ సాహెబ్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చేతి బ్యాగ్ జారి పోయింది. విషయాన్ని ఆయన గుర్తించలేక అలాగే ముందుకు దూసుకెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ విజయలక్ష్మి... రోడ్డుపై పడిన బ్యాగ్ను గుర్తించి తీసుకుని పరిశీలించారు. అందులో బంగారు గొలుసు ఉండడంతో వెంటనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. బ్యాగ్లోని బంగారు గొలుసు విలువ రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేసిన పోలీసులు విషయాన్ని వెంటనే డీఎస్పీ శివనారాయణస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవ తీసుకుని విచారణ అనంతరం ఆ బ్యాగ్ పొగొట్టుకున్న ఇజ్రాయేల్ను ఆదివారం తన కార్యాలయానికి రప్పించుకుని విజయలక్ష్మి చేతుల మీదుగా ఇప్పించారు. నిజాయితీ చాటుకున్న విజయలక్ష్మిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. జిల్లా అంతటా వర్షంపుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో రెండోరోజు ఆదివారం జిల్లా అంతటా వర్షం కురిసింది. 15 రోజులుగా తుంపరతో సరిపెడుతున్న వరుణ దేవుడు ఆదివారం సాయంత్రం మూడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మోస్తరు వర్షం కురిపించాడు. రోడ్లపై వర్షం నీరు పారింది. కాలువలు పొంగిపొర్లాయి. ఇక వేరుశనగ విత్తుకోవచ్చని, ఆరుద్ర కార్తె ప్రవేశించిందని, మంచి అదనులో విత్తనం పడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థల వివాదంలో మరొకరి అరెస్ట్ పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు స్థల వివాదం కేసులో మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కొత్తచెరువు సీఐ మారుతీప్రసాద్తో కలసి వివరాలను ఆయన వెల్లడించారు. కొత్తచెరువు నుంచి ధర్మవరానికి వెళ్లే మార్గంలో గత నెల 27న ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నమోదైన కేసులో ఇప్పటి వరకూ 11మందిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పరారీలో ఉన్న మెరిమిధశెట్టి పాండును కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి రోడ్డులో అదుపులోకి తీసుకుని కొత్తచెరువుకు తరలించారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుడు పాండు.. వివిధ రాష్ట్రాలలో 47 కేసుల్లో నిందితుడిగా ఉంటూ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్యాయత్నం ధర్మవరం అర్బన్: భార్య మద్యం తాగొద్దన్నందుకు మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. పట్టణంలోని గీతానగర్కు చెందిన బేల్దారి పనిచేసే ఏడుకొండలు మద్యం తాగే అలవాటు ఉంది. తాగుడు మానేయాలని భార్య పావని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం శ్మశాన వాటిక వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనస్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మారమన్నందుకు మట్టుబెట్టాడు!
కనగానపల్లి: వ్యసనాలు మాని కుటుంబపోషణపై దృష్టి సారించాలని హితవు పలికినందుకు కట్టుకునే భార్యనే ఓ కసాయి కడతేర్చిన ఘటన కనగానపల్లి మండలంలో సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రం కనగానపల్లికి చెందిన బోయ రాఘవ, కళావతి (32) దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో ఏడాదిగా రాఘవ మద్యానికి బానిసగా మారి ఇతర వ్యసనాలనూ అలవర్చుకున్నాడు. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు చోటుచేసుకునేవి. కట్టెల కోసమని వెళ్లి... శనివారం సాయంత్రం కట్టెల కోసమని గ్రామ శివారులోని ముళ్ల పొదల్లోకి కళావతితో పాటు రాఘవ వెళ్లాడు. ఆ సమయంలో వ్యసనాలు మానుకోవాలని మరోసారి రాఘవకు భార్య హితవు పలికింది. దీంతో ఆమెతో వాగ్వాదానికి దిగి కొడవలితో దాడి చేశాడు. కుప్పకూలిన భార్య తలపై కట్టెతో బాదడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను అక్కడే వదిలేసి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆమె ప్రాణాలు వదిలింది. మొదట మిస్సింగ్ కింద ఫిర్యాదు చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో కళావతి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులతో కలసి ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ సమయంలో వారితో పాటు రాఘవ కూడా ఉన్నాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా కళావతి కోసం గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని ముళ్ల పొదల వైపుగా వెళ్లిన స్థానికులు అక్కడ మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. కళావతి మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ శ్రీధర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాఘవ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులో తీసుకుని విచారణ చేయడంతో తానే హతమార్చినట్లు అంగీకరించినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కొట్టి చంపిన భర్త తొలుత మిస్సింగ్ కింద పోలీసులకు ఫిర్యాదు ముళ్లపొదల్లో లభ్యమైన మృతదేహం -
పశుమాంసం పట్టివేత
హిందూపురం: కర్ణాటకకు వాహనాల్లో తరలిస్తున్న పశు మాంసాన్ని హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు దాడిచేసి పట్టుకున్నారు. హిందూపురం ప్రాంతంలో పశువుల(ఎద్దులు, ఆవుదూడలు)ను వధించి మాంసాన్ని గోనె, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి బెంగళూరుకు రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో రూరల్ పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఆరు 406 వాహనాల్లో ఆరు టన్నుల పశు మాంసాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్లను అరెస్టు చేసి, వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన మాంసాన్ని పరీక్షలు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మాంసం వ్యాపారులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలుకనగానపల్లి: మండలంలోని కుర్లపల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ కార్యకర్తల మధ్యన ఘర్షణ చోటు చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. టీడీపీ కార్యకర్త శంకర్ గ్రామంలోని ఆలయం వద్ద ఆదివారం మద్యం సేవిస్తుండగా అటుగా వెళ్తున్న మరో టీడీపీ కార్యకర్త శ్రీకాంత్రెడ్డి గమనించి పక్కకు వెళ్లి తాగాలని హితవు పలికాడు. ఆ సమయంలో శ్రీకాంత్రెడ్డితో శంకర్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ కనగానపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపురం: ఐదున్నర దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఆర్డీటీని కాపాడుకుందామని సీనియర్ క్రికెటర్లు పిలుపునిచ్చారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ క్రికెటర్లు ఆర్డీటీ పరిరక్షణకు ఆదివారం కదం తొక్కారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన రంజీ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, మహిళా క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ‘ సేవ్ ఆర్డీటీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద ప్రారంభమైన కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్డీటీకి అన్ని విధాలుగా క్రికెటర్లు తోడుగా ఉంటాం. ఆర్డీటీ సేవలు కొనసాగేలా సంస్థకు ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలంటూ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు అగితే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు భారీగా నష్టపోతారన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు, క్రీడాకారులకు చేయూత, పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దన్నుగా నిలుస్తున్న ఆర్డీటీ సేవలు కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పగడాల మల్లికార్జున, సభాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం వెంటనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేసే వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఐపీఎల్ క్రీడాకారుడు విజయకుమార్, ఏడీసీఏ జిల్లా కార్యదర్శి భీమలింగారెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, షాబుద్దీన్, ప్రసాదరెడ్డి, రంజీ క్రికెటర్లు సురేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్లు శ్రీనివాసులు, కమలాకర్నాయుడు, సీతారామారావు, రవీంద్రనాథ్, చంద్రమోహన్రెడ్డి, రంజీ మాజీ క్రికెటర్లు ఫయాజ్, షాషా వలి, మురళి, సర్దార్, సాగర్, విజయ్రాజు, దాదా ఖలందర్, సాదిక్, రంజీ క్రికెటర్లు వినయ్కుమార్, మచ్చా దత్తారెడ్డి, కోగటం హనీష్ వీరారెడ్డి, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
రోటావేటర్లో పడి విద్యార్థి దుర్మరణం
రొద్దం: ప్రమాదవశాత్తు రోటావేటర్లో పడి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రొద్దం మండలం రాగిమేకులపల్లికి చెందిన నరసింహులు కుమారుడు ప్రేమ్కై లాష్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి పట్టునే ఉన్న బాలుడు.. ఓ రైతు పొలాన్ని విత్తుకు సిద్ధం చేసేందుకు వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్తో కలసి వెళ్లాడు. పొలంలో ట్రాక్టర్కు రోటావేటర్ అమర్చుకుని డ్రైవర్ పొలాన్ని కలియబెడుతుండగా దానిపై కూర్చొని ఉన్న ప్రేమ్కై లాష్ పట్టు తప్పి కిందపడ్డాడు. అదే సమయంలో రోటావేటర్ ముందుకు సాగడంతో అందులో చిక్కుకున్నాడు. డ్రైవర్ గమనించి ట్రాక్టర్ ఆపేలోపు ప్రాణాలు కోల్పోయాడు. వెలికి తీసేందుకు వీలు లేనంతగా చిన్నారి శరీరం అందులో చిక్కుకుపోయింది. మొండెం నుంచి తల వేరుపడింది. కుమారుడు మృతితో నరసింహులున అలివేలమ్మ దంపతులు బోరున విలపించారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ సోమిరెడ్డి పరామర్శించి, ఓదర్చారు. నేడు ‘పోలీసు స్పందన’ పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ వి.రత్న ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశౠరు. అర్జీదారులు తమ వెంట ఆధార్ కార్డును తప్పని సరిగా తీసుకురావాలి. ప.గో. జిల్లా వాసుల పర్తి యాత్ర ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు సత్యసాయి భక్తులు ఆదివారం పుట్టపర్తికి చేరుకున్నారు. సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. జీవితంలో కోరికల మూలంగా జరిగే పరిణామాలను వివరిస్తూ కోరిక పేరుతో బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకుంది. -
సడ్లపల్లె కథా పురస్కారాల ప్రదానం
హిందూపురం టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీలో తపన సాహితీ వేదిక ఆధ్వర్యంలో సడ్లపల్లె కథా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రచయిత శశికళ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా డీఎస్పీ మహేష్ పాల్గొన్నారు. 2024వ సంవత్సరానికి గానూ చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు బాలాజీ రాసిన ‘ఏకలవ్య ఎరుకల కాలనీ జీవన గాథలు‘ అనే పుస్తకానికి, అలాగే తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన స్వర్ణకిలారి రాసిన ‘నల్లబంగారం‘ అనే పుస్తకానికి ‘సడ్లపల్లె కథా పురస్కారాలు అందజేశారు. అలాగే డాక్టర్ శాంతినారాయణ అధ్యక్షతన కాకినాడకు చెందిన ప్రజా వైద్యుడు డా.యనమదల మురళీకృష్ణ వైద్య సేవలకు గానూ ‘తపన సాహిత్య వేదిక ’ సేవా పురస్కారాన్ని అందజేసి, నగదు బహుమతితో పాటు సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ 100 కిలో మీటర్ల దూరంలోని బాలాజీ కథలను, 1000 కిలోమీటర్ల దూరం లోని స్వర్ణ కిలారీ కథలను చదివి పురస్కారాలు ఇవ్వడం హర్షణీయమన్నారు. తపన సాహిత్య వేదిక వ్యవస్థాపకుడు సడ్లపల్లె చిదంబరరెడ్డి మాట్లాడుతూ రచయితలు, కవులకు పొత్సహించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పెద్దిరెడ్డి, డాక్టర్ యమున, డాక్టర్ ప్రగతి, మానవ హక్కుల వేదిక ఎంఎం బాషా, జాబిలి చాంద్బాషా, కల్లూరు రాఘేంద్రరావు, రైతు నాయకుడు వెంకటరామిరెడ్డి, ఈశ్వరరెడ్డి, మానవత అమరనాథరెడ్డి, పౌర హక్కుల సంఘం శ్రీనివాసులు, యువకవి కై మలి, సిద్దగిరి శ్రీనివాస్, అశ్వత్థనారాయణ, యువకవి గంగాధర్, ఆంధ్రరత్న గంగధర్, ఉమర్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. -
యువత పోరును విజయవంతం చేయండి
పుట్టపర్తి: యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం... ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం.. అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో యువతను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్ కో.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. పథకాలకు పేర్లు మార్చారే కానీ అమలు మాత్రం చేయడం లేదు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనూ తొలగించి రోడ్డుపాలు చేస్తున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు ‘వసతి దీవెన’ అందించకపోవడంతో అప్పు భారం పడి ఆందోళన చెందుతున్నారు. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు.. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన జూన్ నెలలో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత బకాయిలు విడుదల చేసిన ఘనత జగన్దే.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ వసతి దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఫీజు మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. పైగా రాజకీయాలకు అతీతంగా 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం జగన్ ప్రభుత్వం చెల్లించడం గమనార్హం. గతమెంతో ఘనం.. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. జిల్లాలో 18 వేల సచివాలయ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఊరట కల్పించారు. యువతకు చంద్రబాబు అండ్ కో మోసం నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం గత ప్రభుత్వం తొలి రెండేళ్లలో ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. ప్రస్తుత కూటమి సర్కార్ ఏడాది దాటినా ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆ దిశగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు నిరుద్యోగుల గురించే పట్టించుకోవడం లేదు. – అనిల్, నిరుద్యోగి, బుక్కపట్నం ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీ హుళక్కి కానరాని ‘ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ. 3 వేల భృతి’ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించని వైనం ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు ‘కూటమి’ కపటత్వాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ నిరుద్యోగ భృతి ఇవ్వాలి ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి అందించాలి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు. ఇప్పటికై నా బకాయిలతో సహా భృతి చెల్లించాలి. త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలి. – పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇబ్బందిగా ఉంది నేను బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. ఇప్పటి దాకా ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము రూ.10 వేలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా చాలా రావాల్సి ఉంది. ఇక వసతి దీవెన సొమ్ము రూ.20 వేలు ఇప్పటికీ జమ కాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. – ఈశ్వన్, కొత్తచెరువుసోమందేపల్లి: ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఆదివారం సోమందేపల్లిలో ‘యువత పోరు’ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే కార్యక్రమానికి యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అంతవరకూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మరోవైపు ఫీజురీయింబర్స్మెంట్– ఉపకార వేతనాలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. యువత పోరు కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు గజేంద్ర, శ్రీనివాసులు, జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, సర్పంచ్ అంజినాయక్, నాయకులు ఆదినారాయణరెడ్డి, కంబాలప్ప, మంజు, ఈశ్వర్, జితేంద్రరెడ్డి, శ్రీరాములు రమేష్, కళ్యాణ్, ఇమామ్ వలి, ప్రతాప్రెడ్డి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గుమ్మనూరు జయరామ్ వ్యాఖ్యలు సరికాదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్రొద్దం: స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యాక వైఎస్సార్సీపీ వారి అంతు చూస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. ఆదివారం బొక్సంపల్లి గ్రామ పంచాయతీలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి గత ప్రభుత్వం.. ప్రస్తుత ప్రభుత్వం పాలనలో తేడాను బేరీజు వేసుకోవాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2019లో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపించుకుని.. మంత్రి పదవి కట్టబెట్టారని గుర్తు చేశారన్నారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్షతోనే జయరామ్ ఎదిగారన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. టీవీ చానెల్ చర్చావేదికలో ఓ జర్నలిస్టు మాట్లాడిన మాటను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్కు అంటగట్టి దుష్ప్రచారం చేశారన్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘రప్పా.. రప్పా’ అని డైలాగ్ చెప్పగానే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు ప్రదర్శించినపుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. హోం మంత్రి అసత్య ఆరోపణలతో వైఎస్ జగన్మోన్రెడ్డిని విమర్శించడం మానుకోవాలన్నారు. మీరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. మీరే మాపై బురద చల్లాలని చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రత్నమ్మ, పార్టీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు విశ్వనాథ్రెడ్డి, ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, ప్రసాద్రెడ్డి, జెట్టి శ్రీనివాస్రెడ్డి, చిలకల రవి, హరిన లక్ష్మన్న, గోవర్ధన్రెడ్డి, బోయ మారుతి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామన్ తేదీ వేసేలా చర్యలు తీసుకోండి అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పాఠశాల సహాయకులకు (హిందీ, తెలుగు) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలీవింగ్ తేదీ కామన్గా వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. డీఈఓను కలిసిన వారిలో ఆర్యూపీపీ జిల్లా గౌరవాధ్యక్షులు సి.ఎర్రిస్వామి, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వి.హనుమేష్, జి.తులశిరెడ్డి ఉన్నారు. ట్యాబ్లు, పుస్తకాలు వెనక్కు ఇస్తేనే సర్టిఫికెట్లు ● బాలికల ఉన్నతపాఠశాల సిబ్బంది హుకుం పెనుకొండ: మీ వద్దనున్న ట్యాబులు, పాఠ్యపుస్తకాలు వెనక్కు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఉన్నతపాఠశాల సిబ్బంది హుకుం జారీ చేస్తున్నారు. దీంతో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పెనుకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరం 120 మంది విద్యార్థులు పదో తరగతి చదివారు. పరీక్షల్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లాల్సి ఉంది. ఇందుకు అవసరమైన టీసీ, స్టడీ, కాండక్ట్ సర్టిఫికెట్ల కోసం ఉన్నత పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. మీకు ఇదివరకు ఇచ్చిన ట్యాబులు, పదో తరగతి పాఠ్య పుస్తకాలు వెనక్కు ఇచ్చి.. మీ సర్టిఫికెట్లు తీసుకెళ్లండంటూ క్లర్క్ చెబుతున్నారు. ఇది హెచ్ఎం ఆర్డర్ అని అంటున్నారు. మీరు వెనక్కు ఇచ్చిన స్టడీ మెటీరియల్ను ప్రస్తుత విద్యాసంవత్సరపు టెన్త్ విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. ఒక వేళ వాటిని తెచ్చివ్వకపోతే సర్టిఫికెట్టు ఇచ్చేది లేదని చెబుతుండటంతో క్లర్క్తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గొడవకు దిగుతున్నారు. వెనక్కివ్వాలని ఎలా అడుగుతారు? స్టడీ మెటీరియల్ వెనక్కు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మెలిక పెట్టడంపై ఎంఈఓ సుధాకర్, డీవైఈఓ పద్మప్రియను వివరణ కోరగా.. ట్యాబులు, పాఠ్యపుస్తకాలు వెనక్కు ఇవ్వాలని ఎలా అడుగుతారు? అలాంటి ఆదేశాలు ఏవీ లేవని అన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో హెచ్ఎంతో మాట్లాడి కనుక్కుంటామన్నారు. -
మా బాధలు పట్టించుకోరా?
ఓ సంఘం నాయకులపై తిరగబడ్డ ఎంటీఎస్ టీచర్లు కాగా ఓ సంఘం నాయకులు అక్కడికి చేరుకుని అధికారుల మెప్పు పొందేందుకు ఎంటీఎస్ టీచర్లను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ‘మీ పోస్టులు చట్టబద్ధం కావు. అనవసరంగా ఇబ్బంది పడతారు. మీరడుగుతున్నట్లు అన్ని ఖాళీలు చూపించడం వీలుకాదు. సజావుగా కౌన్సెలింగ్ జరిగేందుకు సహకరించండి’ అంటూ మాట్లాడగా అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న వారు తిరగబడ్డారు. మా బాధలు అర్థం కావడం లేదా.. అని మండిపడ్డారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, వయసుపైబడి రిటైర్మెంట్కు చాలామంది దగ్గరలో ఉన్నారని అలాంటి వారు ఎలా వెళ్తారో తెలీదా అని నిలదీయడంతో ఆ సంఘం నాయకులు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: తమబాధలు పట్టించుకోవడం ప్రభుత్వం పొమ్మనలేక పొగ పెడుతోందంటూ ఎంటీఎస్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 594 మంది ఎంటీఎస్ టీచర్లు పని చేస్తున్నారు. 693 ఖాళీలు చూపించారు. వీటిలో 80 శాతం దాకా జిల్లా సరిహద్దు (కర్ణాటక రాష్ట్రం బార్డరు) మండలాల్లోనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకే జిల్లా సైన్స్ సెంటర్కు బదిలీల కౌన్సెలింగ్ కోసం ఎంటీఎస్ టీచర్లు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఖాళీల సమాచారం తెలుసుకున్న ఎంటీఎస్ టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. మెజార్టీ ఖాళీలు గుడిబండ, డి.హీరేహాల్, అమరాపురం, అగళి, బొమ్మనహాల్, బ్రహ్మసముద్రం, కంబదూరు, రాయదుర్గం, శెట్టూరు, కణేకల్లు మండలాల్లో చూపించారని వాపోయారు. తక్కిన మండలాల్లో 1,2,3 పోస్టులు మాత్రమే చూపించారన్నారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, డీఏ, హెచ్ఆర్ఏ సౌలభ్యం కూడా ఉండదని, అలాంటి తమను అంతంత దూరం వంపితే ఎలా అని వాపోయారు. దీనికితోడు చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం తమకు ‘నియర్ బై రెసిడెంట్’ ఉత్తర్వులిస్తే...ఈ ప్రభుత్వం ‘లాంగ్ బై రెసిడెంట్’ ఉత్తర్వులు ఇస్తోందంటూ మండిపడ్డారు. డీఈఓను అడ్డుకుని నిరసన కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చిన డీఈఓ ప్రసాద్బాబును ఎంటీఎస్ టీచర్లు అడ్డుకున్నారు. కార్పొరేషన్తో పాటు అన్ని మునిసిపాలిటీలతో పాటు ఏకోపాధ్యాయుడు ఉండే స్కూళ్లను ఖాళీగా చూపించాలని పట్టుబట్టారు. ఆందోళన చేస్తున్న విషయాన్ని డీఈఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. వారి నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే ఆమేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అయితే, రాత్రి 7 గంటల సమయానికి కూడా స్పష్టత రాకపోవడంతో బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి ఎంటీఎస్ టీచర్లు వెళ్లిపోయారు. ఎంటీఎస్ టీచర్లకు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, గోపాల్, వెంకటరమణ, ఏపీటీఎఫ్ నాయకులు వెంకటేష్, సిరాజుద్దీన్, నరసింహులు, నాగరాజు, తదితరులు మద్దతు తెలిపారు. బదిలీల ఖాళీలపై ఎంటీఎస్ టీచర్ల రగడ 80 శాతానికి పైగా కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఉన్నాయంటూ ఆవేదన సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ అడ్డగింత.. బాయ్కాట్ -
కరెంట్.. కటకట
● పుట్టపర్తిలోని గోవిందపేటకు చెందిన ఓ చిన్న కుటుంబం కేవలం కరెంటు పొయ్యి మీద ఆధారపడి వంట చేస్తోంది. అయితే ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవడంతో బయటి హోటల్ నుంచి ఆహారం తెచ్చుకుని తిన్నట్లు ఆ నవదంపతులు తెలిపారు. కరెంటు కోతల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ● పుట్టపర్తి మున్సిపాలిటీ ఎనుములపల్లిలో ఓ యువకుడు ఇంటి నుంచి ఉద్యోగం (వర్క్ ఫ్రం హోం) చేస్తున్నాడు. విదేశీ కంపెనీ కావడంతో ఆదివారం కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ.. ఎలాంటి సమాచారం లేకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు కోత విధిస్తుండటంతో ఉద్యోగం చేయలేక ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. ముందస్తు సమాచారం ఉంటే.. ఇతర ప్రాంతాలకు వెళ్లి లాగిన్ అయ్యే పరిస్థితి ఉండేదని వివరించాడు. ● పుట్టపర్తిలోని గోకులంలో ఓ చిల్లర దుకాణంలో ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలన్నీ దెబ్బ తిన్నాయి. ఉదయం నుంచి కరెంటు కోతలు ఉండటంతో ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు కరిగిపోయినట్లు తెలిపాడు. మధ్యాహ్నం తర్వాత విద్యుత్ వచ్చినప్పటికీ అప్పటికే నష్టం జరిగినట్లు చెప్పాడు. సుమారు రూ.5 వేల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాడు. మిగతా సరుకులు కూడా కూలింగ్ లేక సేల్ కాలేదని వాపోయాడు.ముందస్తు సమాచారం లేదు కరెంటు కోతలు విధించే పరిస్థితి ఉన్నప్పుడు.. ముందస్తు సమాచారం ఇస్తే.. ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటాం. ఉన్నపళంగా విద్యుత్ కోతలతో ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. సెలవు దినం కావడంతో ముందుగా ప్లాన్ చేసుకున్న పనులన్నింటినీ కరెంటు కోతల కారణంగా పక్కన పెట్టాల్సి వస్తోంది. – రామాంజినమ్మ, బడేనాయక్ తండా, పుట్టపర్తి ఎడాపెడా కరెంటు కోతలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు. ఫలితంగా పుట్టపర్తిలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. – సి.గంగాదేవి, సాయినగర్, పుట్టపర్తి సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో అనధికారిక కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. ప్రతి శని, ఆదివారాల్లో అయితే ఎడాపెడా కరెంటు తీసేస్తుండటంతో మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితర అన్ని రంగాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డుల్లోనూ సమస్య తలెత్తుతోందని వాపోతున్నారు. ఏ ఒక్క ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని మహిళలు చెబుతున్నారు. ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. వ్యాపారులకు పలు రకాలుగా నష్టం వాటిల్లుతోంది. కరెంటు కోతలతో కూలింగ్ కావాల్సిన సరుకులు పనికి రాకుండా పోతున్నాయి. ఉదయం నుంచి వెతలే ఓ వైపు వాతావరణ మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నపళంగా వర్షం రావడం.. ఆ తర్వాత ఎండ కాయడం.. మరి కాసేపటికే చీకటి అవుతోంది. ఇంకో వైపు కరెంటు కోతలు ముప్పుతిప్పలు పడుతున్నాయి. విద్యుత్తో నడిచే పరికరాలతో వంట చేయడం అలవాటుగా మార్చుకున్న సమాజంలో కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పుట్టపర్తిలో రాత్రింబవళ్లు అవస్థలు శని, ఆదివారాల్లో సమాచారం లేకుండా కోతలు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, గృహిణులు ఉదయం వంట చేయలేక మహిళల ఇబ్బందులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధులకూ తప్పని తిప్పలు మరమ్మతుల వల్లే అంతరాయం అకాల వర్షాలతో పుట్టపర్తిలో కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు మరమ్మతులకు గురయ్యాయి. అక్కడక్కడా పనుల నిమిత్తం మాత్రమే కోతలు విధించాం. వర్షం కారణంగా ఉన్నపళంగా మరమ్మతులు చేయాల్సి ఉండటంతో కోతలు విధిస్తున్నట్లు ఒక రోజు ముందుగానే చెప్పలేకపోతున్నాం. – సాయినాథ్, విద్యుత్ ఏఈ, పుట్టపర్తి -
డెంగీ జ్వరాల కలకలం
బత్తలపల్లి: డెంగీ జ్వరాలు కలకలం రేపుతున్నాయి. బత్తలపల్లిలోని విద్యాధరి పాఠశాల సమీపంలో గల వీరనారప్ప కుమారుడు సాయి మూడు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వర్షాకాలం ప్రారంభమవడంతో సీజన్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నా వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డీటీ ఆస్పత్రిలో బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు చెందిన చిన్నారులు డెంగీ జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికై నా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయుడు అదృశ్యం కదిరి టౌన్: మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్ ఆసిఫ్ మహమ్మద్ అదృశ్యమయ్యాడు. ఈయన పట్టణంలోని మారుతీనగర్లో నివాసముంటున్నారు. ఈయన ఇతరుల వద్ద రూ.50 లక్షల మేర అప్పులు చేసి, వారికి తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతుండటం గమనించిన భార్య పటాన్ జిగిని ఎందు కోసం చేశావని నిలదీసింది. దీంతో శుక్రవారం ఇంటి నుంచి బయల్దేరిన షేక్ ఆసిఫ్ మహమ్మద్ స్కూలుకు వెళ్లలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. చుట్టుపక్కల, స్నేహితుల వద్ద విచారించినా ఆచూకీ లభించకపోవడంతో భార్య శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రైవేట్ టీచర్ దుర్మరణం ముదిగుబ్బ: జొన్నలకొత్తపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన అరుణశ్రీ (36) అనే ప్రైవేటు స్కూలు టీచర్ దుర్మరణం చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుక్కపట్నం మండలం కృష్ణాపురం చర్చికి చెందిన కొందరు మహిళలు శనివారం బొలెరో వాహనంలో అనంతపురం వైపు బయల్దేరారు. జొన్నలకొత్తపల్లి వద్దకు రాగానే టైరు బరెస్టవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పొల్లాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కృష్ణాపురం లయోల పాఠశాల టీచర్ అరుణశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఎనిమిది మంది అణ్ణమ్మ, సుజాత, నూనె జీవన, మందల అనూష, ఎడిత్యా శ్రావణి, చింతమొక్కల లావణ్య, కీర్తన శ్రావణి గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. గిన్నిస్ రికార్డు కోసం.. గిరిజన పిల్లలకు కష్టాలు హిందూపురం టౌన్: గిన్నిస్ రికార్డు కోసం ఎన్డీఏ ప్రభుత్వం గిరిజన విద్యార్థులను విశాఖపట్నం తరలించి, సౌకర్యాలు కల్పించడంలో విఫలమై కష్టాలపాలు చేసిందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ధ్వజమెత్తారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పల కోసం, మోడీ మెప్పు కోసం, మరీ ముఖ్యంగా గిన్నిస్ రికార్డు కోసం వేలాదిమంది గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ బస్సులో తరలించడం.. నిద్రించడానికి సరైన సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల పిల్లలను ఈ విధంగా తరలిస్తారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళా సర్పంచులకు రేపటి నుంచి శిక్షణ అనంతపురం సిటీ: రాష్ట్ర గ్రామ స్వరాజ్య అభియాన్ (ఆర్జీఎస్ఏ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సర్పంచులకు సోమవారం నుంచి మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సీఈఓ శివశంకర్ శనివారం తెలిపారు. ‘స్థానిక పాలనలో మహిళా సాధికారత’ అనే అంశంపై డివిజనల్ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో మూడు డివిజన్లలో శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. అనంతపురం డివిజన్కు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ క్యాంపస్లోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం(డీపీఆర్సీ)లో, గుంతకల్లు డివిజన్ వారికి గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో, కళ్యాణదుర్గం డివిజన్ వారికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వెల్లడించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పామిడి: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పామిడిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఫారెస్ట్ బంగ్లా వద్ద నివాసం ఉంటున్న ఈశ్వర్రెడ్డి, రాజేశ్వరి (28) దంపతులు. వీరికి కుమార్తె భవ్యశ్రీ, కుమారుడు మూర్తీశ్వర్రెడ్డి సంతానం. ఈశ్వర్రెడ్డి కువైట్లో పనిచేస్తూ వీరిని పోషిస్తున్నాడు. రాజేశ్వరి స్థానిక నాగిరెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఉప్పర భాస్కర్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం బయట పడిన తర్వాత ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా వారిలో మార్పు రాలేదు. యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కువైట్ నుంచి వచ్చిన భర్త శుక్రవారం రాత్రి తిరిగి విధి నిర్వహణ నిమిత్తం వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న భాస్కర్ శనివారం రాజేశ్వరిని ఆటోలో ఎక్కించుకుని వంకరాజుకాలువ గ్రామానికి వెళ్లే దారిలోని మోరీ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారిమధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ... రాజేశ్వరి రక్తగాయాలతో పడి ఉంది. దీన్ని అటుగా వచ్చిన వారు గమనించి భాస్కర్ను ప్రశ్నిస్తే.. రాజేశ్వరి తన భార్య అని, ఫిట్స్ వచ్చి పడిపోయిందని వారిని నమ్మించాడు. అనంతరం ఆటోలో ఆమెను పామిడి కమ్యూనిటీ ఆస్పత్రికి తెచ్చాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా పామిడి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. రాజేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవరే హత్య చేశాడు: తమ కుమార్తె రాజేశ్వరిని ఆటో డ్రైవర్ ఉప్పర భాస్కర్ హత్య చేశాడని తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి, మాధవి ఆరోపించారు. బంధువులతో కలిసివారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. హంతకుడుని కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. -
మరోమారు దగా!
డీఎస్సీ–1998లో అర్హత సాధించి పోస్టింగులకు నోచుకోని వారు రెండు దశాబ్దాల తర్వాత మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారు. వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. ఇప్పుడు బదిలీల విషయంలో మరోమారు అన్యాయం జరుగుతోంది. రెగ్యులర్ ఉపాధ్యాయులకు సమీపంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానాలు లభిస్తే.. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కర్ణాటక సరిహద్దున మండలాల్లో మాత్రమే ఖాళీలు చూపిస్తున్నారు. ఈ వయసులో అంతదూరం వెళ్లలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ పట్ల నిర్దయతో వ్యవహరిస్తోందని వాపోతున్నారు. మడకశిర: ఉపాధ్యాయ పోస్టింగ్ నుంచి తదుపరి బదిలీల ప్రక్రియ వరకు డీఎస్సీ–1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులు దగాకు గురవుతూనే ఉన్నారు. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎంతోమంది యువత ఉపాధ్యాయ కొలువుల కోసం డీఎస్సీ రాశారు. అర్హత సాధించిన వారిలో చాలామందికి స్థానాలు కేటాయించలేదు. దీంతో సదరు అభ్యర్థులు కోర్టుకెళ్ళారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలతో ఒక కమిటీ వేసి ఇందులో 75 మంది మాత్రమే అర్హులని తేల్చి.. మిగిలిన డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారు. పాతికేళ్ల తర్వాత కొలువులు.. డీఎస్సీ–1998లో అన్యాయానికి గురైన 4,272 మంది అభ్యర్థులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో న్యాయం జరిగింది. వారందరినీ మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన నెలకు రూ.32,400 వేతనంతో ఉద్యోగాల్లోకి తీసుకుని, వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. పాతికేళ్ల తర్వాత వారికి కొలువులు దక్కడం.. వారి వయసు 50 ఏళ్లకు చేరుకోవడంతో వీరందరికీ సొంత మండలాలు.. ఖాళీలు లేనిచోట పక్క మండలాల్లో పోస్టింగ్లు కేటాయించారు. అలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 520 మంది పనిచేస్తున్నారు. మళ్లీ అదే కక్ష.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ చట్టాన్ని తీసుకువచ్చి ఇటీవలనే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నిర్వహించింది. అయితే ఈ బదిలీ ప్రక్రియలో ఎంటీఎస్ ఉపాధ్యాయులను చేర్చలేదు. ఎంటీఎస్ టీచర్లకు ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియ నిర్వహించడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఎంటీఎస్ టీచర్లు రెండేళ్ల నుంచి పని చేస్తున్న స్థానాలను కూడా ప్రభుత్వం ఖాళీలుగా చూపించింది. దీంతో ఆ స్థానాలన్నీ రెగ్యులర్ టీచర్లతో బదిలీ చేసేశారు. ఎంటీఎస్ టీచర్లకు మారుమూలన మండలాలకు బదిలీపై వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖాళీలన్నీ సరిహద్దు మండలాల్లోనే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెగ్యులర్ టీచర్ల బదిలీలు నిర్వహించిన తర్వాత ఎక్కువగా ఖాళీలు కర్ణాటక సరిహద్దు మండలాల్లోనే విద్యాశాఖ అధికారులు చూపించినట్లు ఎంటీఎస్ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఎంటీఎస్ టీచర్లకు బదిలీ ప్రక్రియ జరుగనుంది. వీరు ఈ బదిలీల్లో సరిహద్దు మండలాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. శ్రీసత్యసాయి జిల్లాలో కర్ణాటక సరిహద్దులోని అమరాపురం మండలంలో 33, అగళి మండలంలో 20, గుడిబండ మండలంలో 50, రొళ్ళ మండలంలో 50, మడకశిర మండలంలో 4 చొప్పున టీచర్ పోస్టులను ఖాళీగా చూపించారు. ఇక అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు మండలాలైన డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో ఎక్కువగా టీచర్ పోస్టులు ఖాళీలు చూపించారంటున్నారు. ఈనేపథ్యంలో ఎంటీఎస్ టీచర్లు బదిలీల ప్రక్రియలో ఈమండలాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వయసు రీత్యా ఎంటీఎస్ టీచర్లు దూర ప్రాంతంలోని మండలాలకు వెళ్ళి విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా వీరికి రూ.32,400 మాత్రమే నెలకు వేతనం అందుతుంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం ఎంటీఎస్ టీచర్లకు శాపంగా మారింది. పొమ్మనలేక పొగబెడుతున్న కూటమి ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం తమకు పొమ్మనలేక పొగబెడుతోందని ఎంటీఎస్ టీచర్లు వాపోతున్నారు. దూరప్రాంతాలకు బదిలీ చేస్తే ఉద్యోగాలు వదిలేస్తారని కూటమి ప్రభుత్వం భావిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్జగన్ తమకు ఉద్యోగాలిచ్చారనే కక్షతోనే కూటమి ప్రభుత్వం తమ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎంటీఎస్ టీచర్లకు ఇంతలా అన్యాయం జరుగుతున్నా ఉపాధ్యాయ సంఘాలు నోరెత్తకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని రెగ్యులర్ చేయాలని ఎంటీఎస్ టీచర్లు కోరుతున్నారు. బదిలీ కౌన్సెలింగ్లో తమను దూర ప్రాంతాలకు వేయకుండా సొంత మండలం లేదా పక్క మండలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎంటీఎస్ టీచర్లకు ప్రభుత్వం ఏ మేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి. నేడు బదిలీల కౌన్సెలింగ్ ఎంటీఎస్పై పనిచేస్తున్న డీఎస్సీ–2008తో పాటు 1998 ఉపాధ్యాయులకు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురంలోని జిల్లా సైన్సు మ్యూజియంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా కౌన్సెలింగ్కు హాజరు కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంటీఎస్ టీచర్లకు బదిలీల్లో తీరని అన్యాయం వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగాలిచ్చారనే వివక్ష కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఖాళీలు చూపుతున్నారు 50 ఏళ్లు పైబడిన వాళ్లం.. దూర ప్రాంతాలకు వెళ్లలేం కూటమి ప్రభుత్వం నిర్దయతో వ్యవహరిస్తోందని ఆవేదన అనంతపురం సైన్స్ మ్యూజియంలో నేడు బదిలీల కౌన్సెలింగ్ -
‘సిద్ధార్థ’లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, వోల్వా గ్రూప్ రిటైర్డ్ డైరెక్టర్ ఇందు శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కాన్వొకేషన్ డే సమావేశంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించడానికి సిద్ధార్థ గ్రూప్ కళాశాలలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచస్థాయి ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇంక్యుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేశామన్నారు. విద్యా ప్రమాణాలు, నాణ్యతలో రాజీ పడకుండా విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చాన్స్లర్ సుదర్శనరావు మాట్లాడుతూ తోటి వారితో పోటీ పడి సృజనాత్మక, ఇన్నొవేటివ్ విద్యపై శ్రద్ధ చూపాలన్నారు. యువ ఇంజినీర్లు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 903 మంది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 485 మందికి డిగ్రీ కాన్వొకేషన్లు అందజేశారు. 2024–25లో విద్యా సంవత్సరానికి సంబంధించి 17 మంది విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపాల్ మధు, జనార్దనరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ విజయభాస్కర్, గోపి, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఐటీలో ఉద్యోగాల పంట
అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్దనున్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ) కళాశాలలో 400 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు సాధించారు. ప్రముఖ బహుళజాతి సంస్థలు అయిన టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ తదితర వాటిల్లో కొలువులు దక్కించుకున్నారు. ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల వార్షిక వేతనం పొందనున్నారు. కాగ్నిజెంట్ కంపెనీలో 98 మంది, టీసీఎస్లో 157, ఇన్ఫోసిస్లో 21, హెచ్సీఎల్ టెక్లో 16, క్యాడ్ఎస్వైఎస్, లూమిన్, ప్లేటో, ఫోక్స్కాన్, ఐఆర్ఎంఏఐ కంపెనీల్లో 118 మందికి ఉద్యోగాలు వరించాయి. క్యాంపస్ కొలువులు అత్యధికంగా సాధించిన కళాశాలగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎస్ఆర్ఐటీ అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఈ నెల 26న కంపెనీల్లో ఉద్యోగాలకు చేరనున్నారు. ఈ మేరకు ఆఫర్ లెటర్లు సైతం ఆయా కంపెనీలు ఇచ్చాయి. ఈ సందర్భంగా శనివారం ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకబృందం అభినందించింది. కార్యక్రమంలో ఇండస్ట్రీ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎం.రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బాలకృష్ణ పాల్గొన్నారు 400 మంది విద్యార్థులకు క్యాంపస్ కొలువులు టీసీఎస్కు 157, కాగ్నిజెంట్కు 98 మంది ఎంపిక కళాశాలకు, కంపెనీకి అనుసంధానం విద్యార్థుల శ్రమకు, అధ్యాపకుల మార్గదర్శనానికి నిదర్శనమే ఈ ఫలితాలు. కళాశాలకు, కంపెనీకి అనుసంధానంతోనే సంచలన ఫలితాలు సాధ్యమయ్యాయి. సాఫ్ట్వేర్ కొలువులు పొందాలంటే ఎస్ఆర్ఐటీకే సాధ్యమని నిరూపించాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తర్ఫీదు ఇస్తున్నాం. మంచి కంపెనీల్లో కొలువులు దక్కిన విద్యార్థులందరికీ అభినందనలు. – ఆలూరు సాంబశివారెడ్డి, కరస్పాండెంట్, ఎస్ఆర్ఐటీ -
‘యువత పోరు’తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
పుట్టపర్తి: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేల మంజూరు కోసం ఈ నెల 23న పుట్టపర్తిలో ‘యువత పోరు’ నిర్వహించనున్నారు. యువత భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి, రాష్ట్రకార్యదర్శి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వారు పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు చేసిన మోసాలను ఈ కార్యక్రమం ద్వారా ఎండగడదామన్నారు. మహిళ ఆత్మహత్య శెట్టూరు: అడవిగొల్లపల్లికి చెందిన రామాంజినమ్మ (45) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మూడేళ్ల వ్యవధిలో రామాంజినమ్మ భర్త, కుమారుడు మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్న రామాంజినమ్మకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జీవితంపై విరక్తి చెందిన ఆమె శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుంది. ఉదయం ఎంతసేపటికీ రామంజినమ్మ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. విగతజీవిగా కనిపించింది. వెంటనే కుమార్తె ఉమాదేవికి, పోలీసులకు గ్రామస్తులు సమాచారం చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
బాలింతలతో ‘వసూళ్లు’
అనంతపురం మెడికల్: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవమైన వారికి ఆర్థికసాయం ఇప్పిస్తామని అగంతకులు బాలింతల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి శనివారం వెలుగు చూసింది. అనంతపురం నగర శివారులోని ఆలమూరు రోడ్డులో ఉంటున్న కౌసర్ ఇటీవల ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 17న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వీరికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆమె ఆధార్, కుటుంబ వివరాలు తెలియజేసి.. రూ.1000 ఇస్తే, ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు మంజూరు చేయిస్తామని చెప్పాడు. దీంతో కౌసర్ నిజమని నమ్మి గూగుల్ పే నుంచి రూ.వెయ్యి పంపారు. అనంతరం డబ్బు వసూలు గురించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల దృష్టికి వెళ్లడంతో వారు సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాంకు ఫిర్యాదు చేశారు. ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన పని అని ఆస్పత్రి వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. అయితే సదరు అపరిచిత వ్యక్తికి తిరిగి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర సేవల గురించి అవగాహన కల్పించడంలో వైద్యులు, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘట నలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
అనంతపురం: పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉమ్మడి జిల్లాలో అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, హిందూపురం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. తొలిరోజు 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి. జయచంద్రా రెడ్డి తెలిపారు. మొత్తం 161 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరైనట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలిలా.. 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 25 నుంచి జూన్ 30 వరకు(25,26 తేదీల్లో 1–50,000 ర్యాంకు వరకూ, 27,28 తేదీల్లో 50,001–90000, 29,30 తేదీల్లో 90,001–చివరి ర్యాంకు) వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్లైన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్ –2025 హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి స్టడీ ఒరిజనల్ సర్టిఫికెట్, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ ధ్రువపత్రాలు, కుల, ఓసీ అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. కౌన్సెలింగ్లో పాల్గొనే ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్లైన్ విధానంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన రసీదును కౌన్సెలింగ్ కేంద్రంలో అప్పగించాలి. స్టడీ సర్టిఫికెట్ లేని వారు ఏడు సంవత్సరాల రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ తేదీలిలా.. తేదీ ర్యాంకు నుంచి ర్యాంకు వరకు 22 15,001 32,000 23 32,001 50,000 24 50,001 68,000 25 68,001 86,000 26 86,001 1,04,000 27 1,04,001 1,20,000 28 1,20,001 చివరి ర్యాంకు. అరుదైన చేప.. చెడు చేస్తుందప్పా గుత్తి రూరల్: మండలంలోని బ్రాహ్మణపల్లి చెరువులో అరుదైన దెయ్యం చేప లభ్యమైంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలైన కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించే ఈ చేప శనివారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. అయితే దెయ్యం చేపలు తింటే రోగాల పాలవుతారని, ఈ చేపలు వృద్ధి చెందితే విలువైన చేపల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని తెలియడంతో మత్స్యకారులు దాన్ని చెరువు సమీపంలో పూడ్చిపెట్టారు. రుణదాతల ఒత్తిళ్లు.. వివాహిత ఆత్మహత్యాయత్నం కనగానపల్లి: రుణదాతల ఒత్తిళ్లు తాళలేక ఓ వివాహిత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శనివారం మండలంలోని తూంచర్లలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.... తూంచర్ల గ్రామానికి చెందిన రాజ్కుమార్ గతంలో అగ్రిగోల్డు ఏజెంట్గా పనిచేసేవాడు. ఆ సంస్థ మూతపడటంతో కొంతమంది పాలసీదారులకు అతనే అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించాడు. దీనికితోడు పంటల సాగుకోసం కూడా అప్పులు చేశాడు. వీటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవటంతో రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ఇటీవల కాలంలో నేరుగా ఇంటికి వెళ్లి రాజ్కుమార్తో పాటు అతని భార్య రాధమ్మను సైతం నిలదీయడం ప్రారంభించారు. శనివారం కూడా కొందరు రుణదాతలు రాజ్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను రుణం తీర్చాలంటూ పట్టుబట్టారు. ఈ ఒత్తిళ్లను భరించలేని రాధమ్మ మనస్తాపానికి గురై సాయంత్రం పురుగులు మందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
హిందూపురం టౌన్: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ చేతన్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చేతన్తో పాటు ఎస్పీ రత్న, జేసీ అభిషేక్కుమార్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. యోగా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలను అందజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా దినోత్సవంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న -
అక్రమ కేసులకు భయపడకండి
కదిరి టౌన్: ‘‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా బనాయించే అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి..ప్రజలను చైతన్యవంతులను చేయండి..మళ్లీ వైఎస్ జగన్ సారథ్యంలో సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయండి’’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్కుమార్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ అధ్యక్షతన జరిగిన టౌన్, మండల కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు పోలీసులను వాడుకుంటున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారన్నారు. అయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. జగనన్నను మరోసారి సీఎంను చేసుకుందాం.. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి మండల, గ్రామస్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ పిలుపునిచ్చారు. తాను నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ అవసరమున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అక్రమ కేసులతో వేధించే వారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టి తప్పక శిక్ష పడేలా చేస్తామన్నారు. వైఎస్ జగనన్నతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని, అందువల్లే ఆయన్ను రెండోసారి సీఎంగా చేసుకునేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రణీత్రెడ్డి మాట్లాడారు. 23న యువత పోరు.. యువత భవిష్యత్ను అంధకారం చేసిన కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ ఈనెల 23వ తేదీన వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహిస్తోందని రమేష్కుమార్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం యువత పోరు పోస్లర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట అమర్నాథ్రెడ్డి, మండల కన్వీనర్లు మణికంఠ నాయక్, రవికుమార్రెడ్డి, రవీంద్రారెడ్డి, రంగారెడ్డి, ఫయాజ్, అశోక్కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది వైఎస్సార్ సీపీ ‘పురం’ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్కుమార్రెడ్డి జగనన్నతోనే సంక్షేమ రాజ్యం: బీఎస్ మక్బూల్ -
ప్రతి ఒక్కరికీ ఎన్సీడీ సర్వే
పుట్టపర్తి అర్బన్: అసంక్రమిత వ్యాధులను అరికట్టి అందరినీ ఆరోగ్యవంతుల్ని చేయడానికి ఎన్సీడీ (నాన్ కమ్యూనకబుల్ డిసీజ్) సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం పేర్కొన్నారు. ఎన్సీడీ సర్వేపై పుట్టపర్తిలోని మండల సమాఖ్య కార్యాలయంలో వైద్యాధికారులు, సీహెచ్ఓలు, వైద్య ఆరోగ్య సిబ్బందికి శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్సీడీ పరీక్షలు పక్కాగా చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా నోటి, రొమ్ము పరీక్షలను నిర్వహించాలన్నారు. ప్రధానంగా ఈ పరీక్షలు గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సుల వారి ఆరోగ్యంపై నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్రనాయక్, డీపీఓ నాగరాజు, నూర హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు శివ, శివశంకర్, శ్వేత, డాక్టర్ సరిత, డాక్టర్ ఆశ్రిత, తదితరులు పాల్గొన్నారు. కంటి పరీక్ష కేంద్రాల్లో తనిఖీధర్మవరం అర్బన్: పట్టణంలోని కంటి పరీక్ష కేంద్రాలను డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం శుక్రవారం తనిఖీలు చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఆప్తాలమిక్ డాక్టర్లు, సిబ్బంది అర్హత సర్టిఫికెట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేసి రిజిస్టర్ చేసుకోవాలని నేత్రాలయ, అక్షయ కంటి పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. బోర్డుల్లో ఆపరేషన్లు చేయనున్నట్లు ప్రదర్శించరాదని వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె వెంట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్రనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సెల్వియా సాల్మన్, డిప్యూటీ డెమో ఫకృద్దీన్ తదితరులు ఉన్నారు. -
‘మురుగు’నూ వదల్లేదు!
చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీల్లో పూడికతీత పేరుతో నిధుల స్వాహాకు తెరలేపిన వైనం వెలుగు చూసింది. చేయని పనులకు పాత పనుల వివరాలు జోడించి బిల్లులు కొట్టేసే ప్రయత్నం కాస్త ఆడిట్ అధికారుల అప్రమత్తతో బెడిసి కొట్టింది. వివరాల్లోకి వెళితే... హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు శానిటరీ డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్ పరిధిలో రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.80 లక్షలతో డ్రెయినేజీల్లో పూడిక తీత పనులకు 8 నెలల క్రితం టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకునేందుకు పుట్టపర్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు హిందూపురం నివాసి కూడా పోటీ పడ్డారు. అయితే కొన్ని బెదిరింపుల కారణంగా పుట్టపర్తికి చెందిన కాంట్రాక్టర్ తన టెండర్ను విత్ డ్రా చేసుకోవడంతో సింగిల్ టెండర్ ద్వారా హిందూపురానికి చెందిన కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అంచనాకు మించి 4.90 శాతం ఎక్కువకు టెండర్ ఖరారు చేశారు. ఈ క్రమంలో సింగిల్ టెండర్లు, ఎక్సెస్ కోట్ను ఆమోదించరాదంటూ మున్సిపల్ చైర్మన్కు కౌన్సిలర్లు డిసెంట్ నోటీసు అందజేశారు. ఈ నోటీసును ఉన్నతాధికారులకు పంపకుండా అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తొక్కిపెట్టి కాంట్రాక్టర్కు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అయితే ఎలాంటి పనులు చేయకుండానే పాత పనుల ఫొటోలు, వివరాలు జోడించి బిల్లులు చేసుకునే ప్రయత్నం చేయడంతో అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం వ్యతిరేకించారు. నిరాకరించిన ఆడిట్ అధికారులు.. బిల్లులు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం అడ్డుగా నిలవడంతో ఈఎన్సీ పబ్లిక్ హెల్త్కు సరెండర్ చేయించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎమ్మెల్యే కార్యాలయం నుంచే జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. అనంతరం పనులు పూర్తయ్యాయని, 4.90 శాతం ఎక్సెస్ అమౌంట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రీ ఆడిట్ కోసమని జిల్లా కేంద్రంలోని ఆడిట్ కార్యాలయానికి పంపారు. అయితే సింగిల్ టెండర్, ఎక్సెస్ కోట్ను ఒప్పుకోబోమని ఆడిట్ అధికారులు తేల్చిచెప్పడంతో వెనువెంటనే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒత్తిళ్లు తీసుకెళ్లారు. అయినా నిబంధనలకు వ్యతిరేకంగా తాము పని చేయలేమంటూ ఆడిట్ అధికారులు స్పష్టం చేస్తూ ఆ ప్రతిపాదనలను వెనక్కు పంపారు. చెక్కు రూపంలో బిల్లు పొందే ఎత్తుగడ.. ప్రీ ఆడిట్ చేయించుకుని సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా బిల్లులు పొందాలనుకుని భంగపడిన కాంట్రాక్టర్... తాజాగా కమిషనర్ను బురిడీ కొట్టించి రూ.84 లక్షలకు చెక్కు పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గతంలో మున్సిపల్ కార్మికులు చేసిన పనుల వద్ద తాజాగా తీసిన ఫొటోలు జతపరిచి పనులు చేసినట్లుగా చూపించడమే కాక, కొన్నింటికి పాత ఫొటోలనే వాడి జతపరిచిన ఫైల్ను కమిషనర్ వద్ద పెట్టి బిల్లులను చెక్కు రూపంలో పొందేలా పావులు కదిపాడు. ఈ మొత్తం తతంగాన్ని ఎమ్మెల్యే కార్యాలయం వెనుక నుంచి నడిపిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. అయితే బిల్లులను ఏ కోశానా చెక్కు రూపంలో చెల్లించేందుకు వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, గతంలోనూ ఇదే కాంట్రాక్టర్ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని 2013లో దాదాపు రూ.22 లక్షల రికవరీకి అప్పటి అధికారులు ఆదేశించారు. 12 ఏళ్లు గడిచినా ఆ నగదును ఆయన తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. అయినా మున్సిపల్ అధికారులు మళ్లీ సింగిల్ టెండర్ ద్వారా పనులు కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. డ్రెయినేజీ పనులు చేయకుండానే రూ.80 లక్షల స్వాహాకు యత్నం సింగిల్ టెండర్, ఎక్సెస్కు ప్రీ ఆడిట్ చేయబోమన్న జిల్లా ఆడిట్ అధికారులు తాజాగా మున్సిపాలిటీ నుంచి రూ.84 లక్షల చెక్కు ఇప్పించుకునే ఎత్తుగడ -
పాలనలో ‘కూటమి’ విఫలం
సోమందేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ విమర్శించారు.. శుక్రవారం లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణ మంటపంలో 8వ మండల మహాసభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల పేరిట గద్దెనెక్కిన చంద్రబాబు.. ఏడాది పూర్తయినా ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ అమలు చేయలేకపోయారన్నారు. ఏడాది తర్వాత అనేక నిబంధనలతో అరకొరగా తల్లికి వందనం నిధులు విదిల్చారన్నారు. కియాలో రూ.కోట్ల అక్రమ సంపాదన పొందుతూ టీడీపీ నాయకులు ఆర్థికంగా బలపడుతున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారికి కియా అనుబంధ పరిశ్రమల్లోకి తీసుకోవడం దారుణమన్నారు. పెత్తనం అంతా వారిదే అయిపోయిందని తెలిపారు. చేనేతలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కదిరప్ప, ఉపాధ్యక్షుడు బాలస్వామి, ఏఐటీయుసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
ధర్మవరం అర్బన్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మహేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం హెచ్చరించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై శుక్రవారం ధర్మవరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో వారు సమావేశమై మాట్లాడారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ వల్ల ఆడ శిశువుల జననాల రేటు గణనీయంగా పడిపోతోందన్నారు. పీసీ–పీఎన్డీటీ యాక్ట్–1994 మేరకు లింగ నిర్ధారణ ప్రోత్సహించిన ఆస్పత్రుల వైద్యులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ధర్మవరం అర్బన్: స్థానిక బడేసాహెబ్ వీధిలో నివాసముంటున్న కురాకుల కృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబసభ్యులతో కలసి మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కృష్ణమూర్తి మరో ఊరికి వెళ్లారు. శుక్రవారం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటికి వేసిన తాళం బద్ధలుగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారు మాంగల్యం గొలుసు, రూ.2వేలు నగదు, ఇంటి బయట నిలిపిన ద్విచక్రవాహనం అపహరించుకెళ్లినట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సీ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ హిందూపురం: స్థానిక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ముక్కిడిపేటలోని పాత ప్రభుత్వ హాస్టల్ భవనంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కుటుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఎన్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు నెలల కాల వ్యవధి ఉన్న ఈ శిక్షణకు 16 నుంచి 40 ఏళ్లు కలిగిన మహిళలు అర్హులు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రముఖ గార్మెంట్స్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ లోపు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 90529 01657లో సంప్రదించవచ్చు. -
రామగిరి వాసికి అంతర్జాతీయ గుర్తింపు
రామగిరి: మండలంలోని గరిమేకలపల్లికి చెందిన నాగశేషుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2024కు సంబంధించి జరిగిన నవలల పోటీల్లో ఆయన రచించిన ‘కిలారి’ ఉత్తమ నవలగా ఎంపిక కావడంతో త్వరలో అమెరికాలోని డల్లాస్లో నగదుతో పాటు జ్ఞాపికను అందుకోనున్నారు. కాగా, నాగశేషు కర్ణాటకలోని మైసూరులో ఉన్న ముక్త గంగోత్రి యూనివర్సిటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కంబళ్ల నేత కార్మికుల కష్టాలపై ‘ఏకుదారం’ పేరుతో మొట్టమొదటి సారిగా ఆయన రచించిన నవల బహుళ ప్రాచూర్యం పొందింది. అనంతరం కురుబల ఆరాధ్యదైవం బీరప్ప స్వామి లీలలపై ఓ పుస్తకాన్ని రచించారు. తన ‘కిలారి’ నవలలో కులాల కంటే మానవత్వం ముఖ్యమనే సందేశాన్ని అందజేశారు. ఏటా జరిగే జొన్నలగడ్డ రాంబొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలా రచనల పోటీలకు సంబంధించి 2024లో నిర్వహించిన పోటీలకు పరిశీలనార్థం ‘కిలారి’ నవలను ఆన్లైన్ ద్వారా సిరికోన సాహితీ అకాడమికి నాగశేషు పంపారు. ప్రాథమిక పరిశీలన తర్వాత మొత్తం 26 నవలలను ఎంపిక చేసి న్యాయనిర్ణేతకు నిర్వాహకులు అందజేశారు. రెండోసారి వడబోత తర్వాత పోటీలో నిలిచిన 6 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపారు. ఇందులో కథావస్తువు, నిర్మాణం, తార్కిరత, శైలి, శిల్పం, సామాజిక ప్రయోజనం అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ నవలగా ‘కిలారి’ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాగశేషు మాట్లాడుతూ.. త్వరలో అమెరికా వేదికగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
కంటిపాప కోసం.. కన్నతండ్రి శోకం
సోమందేపల్లి: ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి షాఫియా అదృశ్యమై నెలలు గడిచినా.. నేటికీ ఆచూకీ కనిపించలేదు. కొద్దిరోజులు ముమ్మరంగా సాగిన పోలీసుల దర్యాప్తు ఆ తర్వాత ఆగిపోయింది. దీంతో నిరుపేద తండ్రి తన కంటిపాప కోసం కన్నీరుమున్నీరవుతున్నాడు. ఆడుకుంటూ అదృశ్యం.. పెనుకొండ దర్గాపేటకు చెందిన ఖలీల్.. హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు కాగా, వారిలో ఆరేళ్ల వయస్సున్న చిన్న కుమార్తె షాఫియా 2023 జూన్ 12న ఇంటి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ఖలీల్ తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు ఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా తొలుత ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ పాప ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో ఓ మహిళ ఏఎస్ఐకి కేసు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. అనుమానితులను ప్రశ్నించని పోలీసులు.. షాఫియా అదృశ్యం వెనుక ఆ చిన్నారి తల్లి సోదరి భర్త బాబ్జాన్ ప్రమేయం ఉన్నట్లు అందరూ అనుమానిస్తున్నారు. ఎందుకంటే షాఫియా అదృశ్యమైన ఘటనకు ఆరు నెలల క్రితం అతను తన బిడ్డను దర్గాపేటకు చెందిన ఓ మహిళ ప్రమేయంతో అమ్మినట్లు ఇటీవల బహిరంగంగా ఒప్పుకున్నాడు. షాఫియాను ఎత్తుకొస్తే అమ్మివేద్దామని సదరు మహిళ కోరినా... తాను ఒప్పకోలేదని అతను చెప్పాడు. అయితే బాబ్జాన్తో పాటు అతను చెబుతున్న మహిళనూ పోలీసులు విచారిస్తే.. తమ పాప ఆచూకీ లభిస్తుందని షాఫియా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇటీవల ఎస్పీ రత్న పాత కేసుల దర్యాప్తు ముమ్మరం చేసి విచారణ పూర్తి చేస్తున్నారని, ఈ క్రమంలోనే తన బిడ్డ అదృశ్యమైన కేసునూ ఓ సారి పరిశీలించి ఆచూకీ కనుగొనాలని ఖలీల్ కోరుతున్నారు. షాఫియా ఆచూకీ దొరికేనా? ఓ వ్యక్తి, మరో మహిళ ప్రమేయంపై అనుమానాలు పట్టించుకోని పోలీసులు.. కేసులో కనిపించని పురోగతి -
భూముల సబ్ డివిజన్కు స్పెషల్ డ్రైవ్
ప్రశాంతి నిలయం: జాయింట్ పట్టాదారుల భూములను సబ్ డివిజన్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. సబ్డివిజన్ చేయించుకోవాల్సిన రైతులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతుల పేర్లపై భూమి విస్తీర్ణం ఎక్కువగా చూపుతుందని, దీంతో వారంతా ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’ లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారన్నారు. అందువల్లే భూముల సబ్ డివిజన్కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. సబ్ డివిజన్ చేయించుకోవాల్సిన రైతులు రూ.50 రుసుం గ్రామ సచివాలయంలో చెల్లించి ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు ‘పురం’లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 6 గంటలకు హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. రైలు ఢీకొని 33 గొర్రెల మృతిసోమందేపల్లి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద రైలు ఢీకొని 33 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బ్రాహ్మణపల్లికు చెందిన మగ్గం అంజి గొర్రెల కాపరి. శుక్రవారం ఉదయం ఆయన తన గొర్రెలను మేత కోసం ఈదుళబలాపురం గ్రామం వైపు తీసుకువస్తున్నాడు. అయితే బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ సమీపంలో గొర్రెలు రైలు పట్టాలు దాటుతుండగా.. విజయవాడ వైపు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి గొర్రెలను ఢీ కొంది. ఈ ఘటనలో 33 గొర్రెలు మృతి చెందాయి. తనకు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని అంజి వాపోయాడు. హిందూపురం రైల్వే పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. -
సేవలతో ప్రజాభిమానం పొందాలి
ప్రశాంతి నిలయం: రెవెన్యూ శాఖలోని ప్రతి ఉద్యోగి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలతో వారి అభిమానం పొందాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిపాలనలో రెవెన్యూ శాఖ చాలా కీలకమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతగా పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, తద్వారా ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సేవలు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల లబ్ధిని ప్రజలకు అందేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు చిత్తశుద్ధితో సేవలందించి శాఖ ప్రతి ప్రతిష్ట పెంచాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయసారథి మాట్లాడుతూ..రెవెన్యూ ఉద్యోగులు తమ బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనంతరం రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్లు అశోక్ గుప్త, నారాయణ స్వామిని సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, రామసుబ్బయ్య, ఓఏ వెంకటరానాయణ సిబ్బంది పాల్గోన్నారు. రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్ టీఎస్ చేతన్ -
పచ్చనేత.. బియ్యం మేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పచ్చ నేతల జేబులు నింపుతున్నాయి. తమవాళ్లనే డీలర్లుగా నియమించుకున్న అధికార పార్టీ నేతలు.. టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అక్కడ సన్నబియ్యంగా రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో రేషన్ దందా పెద్ద ఎత్తున సాగుతుండగా... అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరగానే..అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పేదల నోటికాడ కూడును లాగేసుకుంటున్నారు. కొందరు డీలర్ల ద్వారా టన్నుల కొద్దీ బియ్యాన్ని సేకరిస్తున్నారు. మరికొందరు పేదలకు పదో పరకో అందించి బియ్యాన్ని సేకరిస్తున్నారు. అలా సేకరించిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా మళ్లీ ప్రజలకే అమ్ముతున్నారు. సరిహద్దు దాటించి.. సన్నబియ్యంగా మార్చి.. జిల్లాలో 32 మండలాలుండగా.. 16 మండలాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. దీంతో రేషన్ దందా సులువుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులు సరిహద్దుకు సమీపంలోని మండలాల్లోని రేషన్షాపుల నుంచి రాత్రికి రాత్రే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, నల్లమాడ, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో కర్ణాటకలోని రైస్ మిల్లులకు తరలిస్తారు. ధర్మవరం నుంచి కొత్తచెరువు, గోరంట్ల మీదుగా కర్ణాటకలోని బాగేపల్లి తీసుకెళ్తున్నారు. మరికొన్నింటిని ధర్మవరం నుంచి ఎన్ఎస్ గేటు మీదుగా కర్ణాటకలోని పావగడకు తరలిస్తున్నారు. ప్రతి నెలా రూ.3 కోట్ల దందా.. స్థానికంగా కిలో రేషన్ బియ్యాన్ని రూ.15 నుంచి రూ.20 లోపు కొనుగోలు చేసి... కర్ణాటకకు తరలిస్తారు. అక్కడ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. సోనా మసూరి వంటి బ్రాండెడ్ బియ్యంలో కలిపి కిలో రూ.55 దాకా విక్రయిస్తున్నారు. ఇలా రేషన్ బియ్యం దందాలో ప్రతి నెలా రూ.3 కోట్ల వరకూ చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా వారికి వెళ్లినా.. ఒక్కో వ్యక్తికి సగటున రూ.5 లక్షల వరకూ మిగులుతున్నట్లు సమాచారం. పంచనామాతోనే సరి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. అడపాదడపా పోలీసులు కేసులు నమోదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం పంచనామా రాసి వదిలేస్తున్నారు. ఇందుకోసం భారీగానే మామూళ్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రేషన్ బియ్యం దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా సిండికేట్గా ఏర్పడి సరిహద్దు దాటిస్తున్న పచ్చ నేతలు ప్రతి నెలా బ్లాక్ మార్కెట్కు 3 వేల టన్నుల బియ్యం రీసైక్లింగ్తో సన్నబియ్యంగా మార్చి మార్కెట్లోకి.. నెలకు రూ.3 కోట్లపైనే అక్రమ ఆదాయం మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అక్రమార్కులను వదలం రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు. డీలర్లు గీత దాటినా వేటు తప్పదు. ఎక్కడైనా రేషన్ బియ్యం కొనుగోలు చేసినట్లు సమాచారం ఉన్నా, నిల్వలు ఉన్నట్లు సమాచారం ఇచ్చినా వెంటనే దాడులు చేసి స్వాధీనం చేసుకుంటాం. కేసులు నమోదు చేసి బియ్యం సీజ్ చేస్తాం. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – వంశీకృష్ణారెడ్డి, డీఎస్ఓ, పుట్టపర్తి -
తుంగభద్రకు పోటెత్తిన వరద
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. బుధవారం 19,265 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో గురువారం 43,706, శుక్రవారం సాయంత్రానికి 51,261 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. డ్యాంలో నీరు 40 టీఎంసీలకు చేరువగా చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్యాం ఎగువన నిర్మించిన అప్పర్తుంగా ప్రాజెక్ట్ (గాజనూరు జలాశయం) నిండటంతో 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి తోడు రిజర్వాయర్ పరిసరాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరుగుతున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు వెల్లడించారు. ● గతేడాది 33 క్రస్ట్ గేట్లలో 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోవడం, మిగిలిన 32 గేట్లు కూడా దెబ్బతినడం వల్ల నిపుణుల సూచనల మేకు వాటిని మార్చాలని టీబీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న జలాశయంలో గేట్ల అంచు వరకు 80 టీఎంసీల నీరును మాత్రమే నిల్వ చేసి కాలువలకు వదులుతారు. ఎక్కువ వరద వస్తే నదికి వదిలేయనున్నారు. ఒక డ్యాంలో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గిన తర్వాత కొత్త గేట్లను అమర్చనున్నట్లు సమచారం. ● ప్రసుత్తం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1610.52 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 51,261 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 256గా ఉంది. మొత్తం నీటి సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రసుతం 38.610 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 51,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో 40 టీఎంసీలకు చేరువగా నీరు -
రాష్ట్రంలో అరాచక పాలన
చిలమత్తూరు: ‘రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణలేకుండా పోయింది. పట్టించుకునే వారే లేకపోవడంతో రోజుకో చోట బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి’’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల ధ్వజమెత్తారు. శుక్రవారం హిందూపురంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక నిర్వహించిన ‘పదవులకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి శ్యామల, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ పదవులు పొందిన నేతలను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో ఆరె శ్యామల మాట్లాడారు. 40 ఏళ్ల అనుభవమంటూ గొప్పలు చెప్పే చంద్రబాబు ఏడాది పాలన అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా చేశారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాభ్యుదయానికి పాటుపడ్డారని, నేడు మహిళలు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు తెచ్చారన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... చేయని సంక్షేమం, అభివృద్ధిపై నివేదికలు, సమీక్షలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఆయన తమ ఏడాది పాలనలో ఆడపిల్లలపై జరగుతున్న అఘాయిత్యాలు, హిందూపురంలో మహిళల అత్యాచారం మొదలు, దళిత బాలికపై సామూహిక అత్యాచారం, కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనలపై నివేదికలిస్తే బాగుంటుందన్నారు. సవిత తనస్థాయి తెలుసుకోవాలి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడుతున్న మంత్రి సవిత.. ముందు తన స్థాయి తెలుసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. 1945లో మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పిన హాఫ్ నాలెడ్జ్ మంత్రి సవిత కూడా రాజకీయాల గురించి మాట్లాడటం చూసి జనమే నవ్వుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో లేకపోయినా... ఆడబిడ్డల రక్షణ కోసం రోడ్లెక్కారని, వారికి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై అత్యాచారం జరిగితే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. కల్లితండాలో వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. కానీ దళిత బాలికపై అత్యాచారం జరిగితే హోంమంత్రిగా ఉన్న అనిత పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. సైనికుల్లా పనిచేయండి.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు రమేష్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ.. పదవులు పొందిన వారంతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి, రాష్ట్ర నేత వజ్రభాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వైఎస్సార్ సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఏ శివ తదితరులు పాల్గొన్నారు. కూటమి హయాంలో బాలికలు, మహిళలకు రక్షణ లేదు చంద్రబాబు ఏడాది పాలన అట్టప్ ప్లాప్ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గుత్తి: లారీ ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఖాసీం (52) తన స్నేహితుడు హరిజన పెద్దయ్యతో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం గుత్తికి వచ్చాడు. గుత్తి ఆర్ఎస్లోకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న ఖాసీం ఎగిరి రోడ్డుపై పడడంతో అతని తల మీదుగా లారీ చక్కాలు దూసుకెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వెంటాడిన మృత్యువు
ధర్మవరం అర్బన్: ఓ యువకుడిని మృత్యువు వెంటాడింది. ఉరివేసుకొని చనిపోవాలనుకున్న అతన్ని కుటుంబ సభ్యులు కాపాడారు. అయితే సెకండ్ల వ్యవధిలోనే మృత్యువు మరోరూపంలో తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలమేరకు.. ధర్మవరం పట్టణంలోని చంద్రబాబునగర్లో నివసిస్తున్న దేవరపల్లి నాగరాజు హోటల్లో పనిచేస్తున్నాడు. నాగరాజుకు భార్య, కుమారుడు దేవరపల్లి జయకుమార్ (25), కుమార్తె కోమల ఉన్నారు. ఇద్దరూ మగ్గం నేస్తూ తండ్రికి తోడుగా ఉంటున్నారు. మూడునెలల క్రితం మోటార్ సైకిల్పై నుంచి కిందపడి జయకుమార్ కాలికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న జయకుమార్ ఇక తాను నడవలేనని, దీంతో పాటు సంపాదన కూడా లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలీక మదనపడేవాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 18న తండ్రి నాగరాజు హోటల్కు పనికి వెళ్లాడు. తల్లి, సోదరి ఇంటి బయట కూర్చున్నారు. ఆ సమయంలో జయకుమార్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుండగా గమనించిన తల్లి వెంటనే జయకుమార్ను కాపాడేందుకు ఇంటిలోపలికి వెళ్లారు. కుమారుడిని తల్లిపైకి ఎత్తి పట్టుకుని ఉండగా చెల్లెలు కోమల ఫ్యాన్కు ఉన్న చీర ముడి విప్పుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జయకుమార్ తల్లి నుంచి జారిపడి మంచం పక్కనున్న మగ్గం డోలు బిగించే ఇనుప రాడ్డుపై పడ్డాడు. ఆ రాడ్డు తల వెనుక లోపలికి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే జయకుమార్ను ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రెడ్డప్ప తెలిపారు. ఉరి వేసుకొని చనిపోయేందుకు యువకుడి యత్నం కుటుంబ సభ్యులు కాపాడే యత్నంలో ఇనుప రాడ్ తగిలి మృత్యువాత -
పిల్లల హక్కులకు భంగం కలగరాదు
పుట్టపర్తి అర్బన్: పిల్లల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు బాల్య వివాహాలును రూపు మాపడంతో పాటు గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేకమైన వ్యవస్థను నిర్మిద్ధామంటూ పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ అంశంపై పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలోని తహసీల్దార్లు, ఎండీపీఓలు, ఎంఈఓలు, ఎస్ఐలు, శక్తి టీం సభ్యులతో గురువారం వారు సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టేందుకు వీలవుతుందన్నారు. పిల్లల అవసరాలను సున్నితంగా పరిష్కరించేలా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఆడ మగ పిల్లల్లో స్నేహ పూర్వక వాతావరణం నెలకొల్పాలన్నారు. గ్రామ బాలల రక్షణ కమిటీలను బలోపేతం చేయడం, ఆన్లైన్ దుర్వినియోగాలపై చైతన్య పరచడం వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. హాస్టళ్లలో పిల్లల భద్రత, కౌమార దశలో ఉన్న వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐఎఫ్ జిల్లా కో ఆర్డినేటర్ కొండప్ప, డీసీపీఓ మహేష్, సోషల్ వర్కర్ ఆనంద్, యూత్ అంబాసిడర్ సంజు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ సువర్ణ -
ప్రైవేట్ పాఠశాల సీజ్
బత్తలపల్లి: ఎలాంటి అనుమతులు లేకుండా బత్తలపల్లిలో నిర్వహిస్తున్న ఫోనిక్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ను సీజ్ చేసినట్లు ఎంఈఓలు చాముండేశ్వరి, సుధాకర్నాయక్ తెలిపారు. డీఈఓ ఆదేశాల మేరకు గురువారం ఆ పాఠశాలలో తనిఖీలు చేపట్టామన్నారు. అనుమతులు లేనందున సీజ్ చేసినట్లు వివరించారు. గ్రంథాలయం తనిఖీ చిలమత్తూరు: మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.రమ గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. పంచాయతీల నుంచి అందాల్సిన సెస్ బకాయిలను వసూలు చేయాలని గ్రంథాలయాధికారి మల్లికార్జునకు సూచించారు. అనంతరం పాఠకులతో మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు
లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో గురువారం ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్ పర్యవేక్షణలో ఈఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ.8,16,341 ఆదాయం వచ్చిందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, గ్రామ పెద్దలు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు. సమయ పాలన పాటించాలి పెనుకొండ రూరల్: సమయ పాలన కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్యాధికారిణి ఫైరోజాబేగం వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని గుట్టూరు ప్రభుత్వాస్పత్రిని ఆమె ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఓపీ, వార్డులో ఉన్న రోగులతో వైద్య సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మా గదిని పరిశీలించారు. పంపిణీ చేసిన, నిలువ ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆస్పత్రి ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైరోజా బేగం మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిసరాలను ఎప్పటికపకప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు నాగరాజు నాయక్, శ్రావణి, సిబ్బంది హాజరయ్యారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. ఆయన గురువారం పుట్టపర్తి ఎమ్మార్సీలో రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు విజయవంతంగా ముగించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయుల కొరత లేకుండా సర్దుబాటు చేశామని పేర్కొన్నారు. ఎక్కడైనా అవసరముంటే ఎంటీఎస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఖాదర్ వలిబాషా, ప్రసాద్, ఉపాధ్యాయుడు ప్రకాష్రెడ్డి, ఎమ్మార్సీ సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీ సత్యసాయి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 6–9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. జిల్లా కార్యాలయం లేదా గురుకుల పాఠశాలల్లో ఈనెల 23లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. అనంత పురం జిల్లాలో ఖాళీలు లేవన్నారు. బాలికలకు హిందూపురం బాలికల పాఠశాల, బాలురకు హిందూపురం బాలుర పాఠశాలల్లో పరీక్షలు ఉంటాయన్నారు. ఖాళీలు రోస్టర్ వారీగా ఇలా... 6వ తరగతిలో..కాళసముద్రం పాఠశాలలో బీసీ–1, మలుగూరు ఎస్సీ (గ్రూప్–3)–2, నల్లమాడలో ఎస్సీ (గ్రూప్–3)–2, ఎస్టీ–2, ఓసీ–1, అమరాపురంలో ఎస్సీ (గ్రూప్–3)–1, రొళ్లలో ఎస్సీ (గ్రూప్–3)–2, ఓసీ–1 ఖాళీలున్నాయి. అలాగే 7వ తరగతిలో మలుగూరులో ఎస్సీ (గ్రూప్–3)–1, ఎస్టీ–1, అమరాపురంలో ఎస్సీ (గ్రూప్–3)–1, హిందూపురం బాలకల పాఠశాలలో ఎస్సీ (గ్రూప్–3)–3, ఎస్టీ–1, బీసీ–1, రొళ్ల పాఠశాలలో ఎస్టీ–1 ఖాళీలున్నాయి. 9వ తరగతిలో హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ (గ్రూప్–3)–1 ఖాళీ ఉందని జయలక్ష్మీ వెల్లడించారు. -
ద్విచక్ర వాహనం నుంచి రూ.5 లక్షల చోరీ
హిందూపురం: ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగులో ఉంచిన రూ.5 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన హిందూపురం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు చిరంజీవి టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... పట్టణంలోని కోట ప్రాంతనికి చెందిన చిరంజీవి ఫొటోగ్రాఫర్గా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే అన్నదమ్ముల ఆస్తి వ్యవహారం విషయంలో రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా గురువారం చిన్నమార్కెట్ పక్కనే ఉన్న స్టేట్ బ్యాంకుకు వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బ్యాంకు నుంచి రూ.5 లక్షలు విత్డ్రా చేశాడు. అనంతరం తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగులో ఉంచి తాళం కూడా వేశాడు. తర్వాత చిన్న మార్కెట్ వద్దకు వచ్చి టీషాపులో తాగేందుకు ఆగాడు. టీ తాగేందుకు పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లాడు. నలుగురు వ్యక్తులు తన ద్విచక్ర వాహనం వద్ద మాట్లాడుతున్నట్లు కనిపిస్తూనే ఉండటంతో కంగారు పడలేదు. టీ తాగిన తర్వాత నేరుగా వాహనం తీసుకొని తన నివాసం సమీపానికి వెళ్లాడు. అయితే ద్విచక్ర వాహనానికి ఉన్న బ్యాగును చూడగా తాళం పీకేసి ఉండటంతో ఆందోళన చెందాడు. బ్యాగులో చూడగా నగదు కనిపించలేదు. కంగారుగా పరిసరాల్లో పరిశీలించాడు. తిరిగి చిన్నమార్కెట్ వద్దకు వెళ్లి వాహనం వద్ద నిలిచి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారేమోనని చూడగా వారు కూడా కనిపించలేదు. పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితుడు చిరంజీవి టూటౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బెల్టు షాపుల నిర్వాహకుల అరెస్ట్
హిందూపురం: స్థానిక ముదిరెడ్డిపల్లి ప్రాంతంలో అనధికారికంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, 30 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం తనిఖీలు చేపట్టామన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. నాటు సారా నిర్మూలనకు పటిష్ట చర్యలు : ఎక్సైజ్ డీసీగుంతకల్లు: ఉమ్మడి జిల్లాలో నాటు సారా నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య స్పష్టం చేశారు. గుంతకల్లులోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దులో నాటు నారా నిర్మూలనకు చేపట్టాల్సిన కార్యాచరణపై కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతురావు, ఏఈఎస్ రాజశేఖర్గౌడ్, సీఐ శివసాగర్, అనంతపురం స్క్వాడ్ ఇన్స్పెక్టర్లు జయనాథరెడ్డి, సుహాసిని, కర్నూలు స్క్వాడ్ ఇన్స్పెక్టర్ జయరామ్నాయుడుతో కలిసి చర్చించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై తరుచూ సంయుక్త దాడులు నిర్వహించాలని తీర్మానించారు. బైండోవర్ కేసుల్లోని వ్యక్తులపై నిఘా మరింత పెంచాలని నిర్ణయించారు. -
నిస్వార్థ సేవకుడు ఫాదర్ ఫెర్రర్
బత్తలపల్లి: కరువు జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా సేవలు అందించి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల్లో హృదయాల్లో ఓ దేవుడిగా ముద్ర వేసుకున్నారని పలువురు కొనియాడారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ 16వ వర్ధంతి సందర్భంగా బత్తలపల్లిలోని ఆయన ఘాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంస్థలో పని చేస్తున్న వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. జిల్లాలో మూడు అధునాతన ఆస్పత్రులను నిర్మించి అన్ని వర్గాలకు వైద్యసేవలు అందించడం, జిల్లా కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆస్పత్రి ఏర్పాటు, బత్తలపల్లిలో ఎయిడ్స్ రోగులకు ఆస్పత్రి ఏర్పాటు తదితర సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. కాగా, సంజీవపురం, సూర్యచంద్రాపురం, డి.చెర్లోపల్లి గ్రామాల్లోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహాలకు స్థానికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ బత్తలపల్లిలోని ఫాదర్ పెర్రర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఘాట్ వద్దకు వచ్చిన పలువురిని ఆప్యాయంగా పలకరించారు. ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ ప్రమీల, మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, మెయిన్టెనెన్స్ మేనేజర్ హనుమంతరెడ్డి, సీబీటీ కాటమయ్యతో పాటు ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఇసుక సరఫరా
ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఉచిత ఇసుక సరఫరా అమలు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా ఉచిత ఇసుక సరఫరాను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే అన్ని వాహనాలు ఉచిత ఇసుక రవాణా వాహనం అన్న బ్యానర్తో ఉండాలన్నారు. అలాగే జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక సరఫరా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్ రాష్ట్ర ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు సమన్వయంతో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లు, ఇసుక తవ్వకాలు తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. జిల్లాలో ఎక్కడా కూడా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా చర్యలు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యులతో పాటు ఎస్పీ రత్న, వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్, భూగర్భశాఖ అధికారి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
ఆదరణ ఓర్వలేకనే ఆరోపణలు
రొద్దం: ఏప్రాంతానికి వెళ్లినా.. ప్రజల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వ పెద్దలు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని ఎం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పోటెత్తుతుండటం అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక హోం మంత్రి అనిత ప్రెస్మీట్ పెట్టిన జగన్పై, వైఎస్సార్సీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. శాంతిభద్రలకు విఘాతం కల్పించేందుకు వైఎస్సార్సీపీ నేతలు బయటకు వస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం జరిగితే హోంమంత్రిగా ఉండి ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. అలాగే ఓ గిరిజన యువతి అదృశ్యమైయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఐదు రోజుల తరువాత అమ్మాయి శవమై కనిపించిందన్నారు. ఇంతవరకూ బాధిత కుటుంబాలను పరామర్శిచించి ప్రభుత్వం తరుఫున ఆర్థిక సాయం ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ మహిళను టీడీపీ నాయకులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన చూస్తే రాజ్యాంగం ఎక్కడుందని ప్రశ్నించారు. హోం మంత్రిగా మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి జగన్పై బురద జల్లడం పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కురుబ గీతా, మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు ఎన్ నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, జెట్టి శ్రీనివాస్రెడ్డి, వీరేష్, మాజీ సర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జగనన్నపై పనిగట్టుకొని బురదజల్లుతున్నారు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై హోంమంత్రి స్పందించరా? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
శెట్టూరు: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో బైక్పై వెళుతున్న బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పార్థసారథి (53) శెట్టూరు మండలం ములకలేడులోని యూనియన్ బ్యాంక్ శాఖలో క్యాషియర్గా పనిచేస్తున్నారు. కళ్యాణదుర్గంలో నివాసముంటూ రోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కళ్యాణదుర్గం నుంచి తన ద్విచక్రవాహనంలో ములకలేడుకు బయలుదేరారు. శెట్టూరు మండలం అడవిగొల్లపల్లి – యాటకట్లు గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా మలుపులో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన కనుకూరు గ్రామానికి చెందిన సత్యప్ప ఢీకొన్నాడు. ఘటనలో రోడ్డుపై పడిన పార్థసారథి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సత్యప్పతో పాటు ఆయన కుమార్తెకూ తీవ్ర గాయాలయ్యాయి. ఆ మార్గంలో వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పార్థసారథి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తహసీల్దార్ షాబుద్ద్దీన్ పలాయనం
పుట్టపర్తి: తహసీల్దార్ షాబుద్దీన్ పలాయనం చిత్తగించారు. ‘బదిలీ తహసీల్దార్ మళ్లీ విధుల్లోకి’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే షాబుద్దీన్ బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయం నుంచి జారుకున్నారు. వివరాల్లోకెళితే... బుక్కపట్నం తహసీల్దార్గా పనిచేస్తున్న షాబుద్దీన్ ఈ నెల 12న తనకల్లుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడే డీటీగా ఉన్న నరసింహులుకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. అయితే రాజకీయ కారణాలతో షాబుద్దీన్ తనకల్లులో జాయిన్ కాలేదు. ఉన్నట్టుండి బుధవారం బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమై పనులు చక్కబెట్టారు. అనధికారికంగా ఆయన విధులు నిర్వహిస్తున్న వైనంపై ‘సాక్షి’లో కథనం రావడంతో వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. వారం పది రోజుల్లో ఆయన ఏదో ఒక చోట విధుల్లో చేరాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. -
పోక్సో కేసులో వ్యక్తికి రిమాండ్
ముదిగుబ్బ: నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు .. ముదిగుబ్బకు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు మంగళవారం బయటపడిందన్నారు. అదే రోజు అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం బాలికను నమ్మించి మోసం చేసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక గర్భవతి అయినట్లు తెలియడంతో రాజేష్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీఏబీఆర్ సందర్శన కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)ను గురువారం జల్శక్తి అభియాన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు గౌతమ్, డిప్యూటీ డైరెక్టర్ శంకర్ సందర్శించారు. డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం ఎంత.. ఎక్కడి నుంచి నీరు సరఫరా అవుతోంది.. ఎలా వినియోగిస్తు న్నారు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఈఈ శశిరేఖ మాట్లాడుతూ డ్యాం కెపాసిటీ 11 టీఎంసీలని పేర్కొన్నారు. తుంగభద్ర, జీడిపల్లి జలాశయాల నుంచి కాలువల ద్వారా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి నప్పుడు వరద రూపంలో నీరు వచ్చి డ్యాంలో చేరుతుందని వివరించారు. ఇప్పటి వరకు సుమారు 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచామన్నారు. సత్యసాయి, అనంతపురం, శ్రీరామిరెడ్డి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతున్నట్లు చెప్పారు. ధర్మవరం కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీటిని సరఫరా చేస్తామని తద్వారా ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందుతోందన్నారు. డ్యాం వద్ద ఏర్పాటైన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి నీటిని వినియోగిస్తామన్నారు. ప్రస్తుతం అవుట్ ఫ్లో 120 క్యూసెక్కులున్నట్లు కేంద్ర బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈలు వెంకటరమణ,ఉదయ సేనయ్,ఏఈఈలు లక్ష్మీదేవి, రామకృష్ణ, ముత్యాలప్ప, శాస్త్రి, గంగమ్మ, వెంకటరమణ, రేణుక పాల్గొన్నారు. -
అల్పాహారం.. నిత్యన్నదానం
● ఖాద్రీశుని ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అల్పాహారంలో భాగంగా సోమవారం వెజిటబుల్ ఉప్మా, పల్లీల చట్నీ, మంగళవారం ఉగ్గాని, పల్లీల చట్నీ, బుధ, శుక్రవారాల్లో బిస్బిల్లా బాత్, గురువారం వెజిటబుల్ ఉప్మా, పల్లీల చట్నీ, శని, ఆదివారాలు పెసర పప్పు పొంగలి, సాంబర్ అందిస్తామన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా రుచికరమైన పదార్థాలతో వడ్డించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అంతేకాకుండా స్వామి దర్శనం కోసం వచ్చే బాలింతలు పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది, వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించామన్నారు. ఇక వయోవృద్ధులు, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఎంటీఎస్ టీచర్ల సర్దుబాటుకు గ్రీన్సిగ్నల్ అనంతపురం ఎడ్యుకేషన్: అవసరమైన పాఠశాలలకు 1998, 2008 ఎంటీఎస్ టీచర్లను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ ఈనెల 20లోగా పూర్తి చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముందుగా సీనియార్టీ జాబితాను తయారు చేయనున్నారు. సీనియార్టీని అనుసరించి అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తామని డీఈఓ ఎం.ప్రసాద్బాబు తెలిపారు.రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ● దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడం తప్పా? ● పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ● మండిపడిన బీఎస్పీ నాయకులు రామగిరి: తీవ్ర అన్యాయానికి గురైన దళిత మైనర్ బాలిక కుటుంబం కనీసం పరామర్శకు కూడా నోచుకోకుండా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని, ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో నిజంగానే రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లు తెలుస్తోందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు సిందనూరు నాగరాజు, గద్దల నాగభూషణం అన్నారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాల పల్లిలోని ఓ దళిత బాలికపై 14 మంది కీచకులు నెలలపాటు దాష్టీకానికి పాల్పడగా ఆ చిన్నారి గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలిక అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం బీఎస్పీ నేతల బృందం ఏడుగుర్రాలపల్లికి బయలుదేరింది. అయితే పోలీసులు బీఎస్పీ నేతల బృందాన్ని ఎన్ఎస్ గేట్లో అడ్డుకుని చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. ముందస్తు అనుమతి లేనిదే ఏడుగుర్రాలపల్లికి అనుమతించబోమన్నారు. దీనిపై బీఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరునికీ కల్పించిందన్నారు. పోలీసులు పాలకులకు వంత పాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. దళిత బాలికపై దాష్టీకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వం... ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు, బైనేని శ్రీనివాసరాజు, అంకె కుళ్లయప్ప, హరిప్రసాద్, నాగసుబ్బరాయుడు, శీన, కుంచె గోపాల్, నాగమ్మ, జయచంద్ర, కృష్ణ, రాజు, గంగాధర్, లింగరాజు, హనుమంతప్ప, నాగరత్నమ్మ, శశికళ, నాగవేణి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సాగుభారం
పుట్టపర్తి అర్బన్: భూమితల్లినే నమ్ముకున్న రైతన్నకు వ్యవసాయం భారంగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నాటికి ఇటు పంట పెట్టుబడులు, అటు పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి. ఆర్థికంగా అండగా నిలిచి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండగా.. చాలా మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. అప్పటికీ అవసరాలు తీరని వారు బంగారాన్ని బ్యాంకుల్లో, ప్రైవేటు ఫైనాన్సుల్లో తాకట్టు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు అనుకున్న వారు కాడి కింద పడేసి బతుకుదెరువు కోసం వలస పోతున్నారు. ఎరువులు, విత్తనాల ధరలకు రెక్కలు ఎరువులు, విత్తనాల ధరలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. కనీసం రాయితీపై ఇచ్చే విత్తనమైనా వేద్దామంటే నాసిరకంగా ఉంటోంది. పైగా ఎంత భూమి ఉన్నా మూడు బస్తాల వేరుశనగతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు మార్కెట్లో కిలో వేరుశనగ విత్తనం రూ.130 వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఇక ఎరువుల ధరలూ అమాంతం పెరిగిపోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. కాడెద్దులూ బరువై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల వద్ద ఉన్న కాడెద్దులూ భారంగా మారాయి. దీంతో వాటిని మార్కెట్కు తరలించి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ చాలా మంది రైతులు కాడెద్దుల బండితో ఇసుక తోలుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు. కూటమి ప్రభుత్వం ట్రాక్టర్లను మాత్రమే అనుమతించడంతో ఎద్దులు భారంగా మారాయి. పెరిగిన సాగు ఖర్చులు పొలం దున్నేందుకు గతంలో ట్రాక్టర్కు ఒక గంటకు రూ.800 తీసుకునేవారు. ప్రస్తుతం రూ.1,000 వరకూ వసూలు చేస్తున్నారు. గతంలో రోజుకూలి రూ.250 ఉండగా.. ఇపుడు రూ.400 వరకూ తీసుకుంటున్నారు. విత్తనం వేసేందుకు, కలుపు మందులు, పురుగు మందులు..ఇలా అన్ని ఖర్చులూ పెరిగాయి. దీంతో ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు చేయాలంటే రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు అవుతోంది. గతంలో మొక్క జొన్న పంట సాగుకు ఎకరాకు రూ.15 వేలు మాత్రమే ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.25 వేలకు పెరిగింది. కంది సాగు సైతం ప్రస్తుతం భారమైంది. డబ్బుకు వెనకాడకుండా ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చివర్లో ‘మద్దతు’ దక్కక పంటను మూడు దుడ్లకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదుకోని కూటమి సర్కార్ పంటల సాగుకు రైతులు నానా కష్టాలు పడుతున్నా...కూటమి సర్కారు ఈ ఏడాది కాలంలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాలు మాఫీ, చేదోడు తదితర పథకాలతో ప్రతి నెలా.. ప్రతి ఇంటికీ డబ్బు జమ చేస్తూ వచ్చారు. రైతులకు ఉచితంగా పంటల బీమా వర్తింపజేసి ఆదుకున్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం పంటల బీమా కూడా ఉచితంగా చేయడం లేదు. వేరుశనగకు ఎకరాకు రూ.640, మొక్కజొన్న రూ.660, కందికి రూ.400 చొప్పున కట్టించుకుని పంటల బీమా చేయిస్తోంది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు పంటల బీమా తోడైంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులూ ఇప్పటి వరకూ అందించలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతును నిలువుదోపిడి చేస్తోంది తప్ప... ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు..దక్కని ‘మద్దతు’ నేటికీ అందని ‘అన్నదాత సుఖీభవ’ అందినకాడికి అప్పులు చేస్తున్న అన్నదాత బ్యాంకుల్లోనూ బంగారం తాకట్టు పెడుతున్న వైనంసాగు ఖర్చులు పెరిగాయి ఏటా పంటల సాగుకయ్యే ఖర్చులు పెరుగుతున్నా... గిట్టుబాటు ధరలు లేక నష్టాలు వస్తున్నాయి. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతు బతుకుతాడు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. పంటల కోత సమయానికంటే ముందే గిట్టుబాటు ధరలు కల్పించి ప్రతి పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. గతంలో ఎకరా వేరుశనగ సాగుకు రూ.20 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడది రూ.50 వేలకు చేరింది. – నాగభూషణ, రైతు, పెడపల్లి వాతావరణం అనుకూలిస్తేనే.. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసినా... వాతావరణం అనుకూలిస్తే పంట చేతికొస్తుంది. లేదంటే రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక వేళ అదృష్టం బాగుండి పంట చేతికి అందినా..గిట్టుబాటు ధర లభించక నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం సాయంగా నిలవాలి. మార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలి. లేకపోతే రైతు బతుకు దుర్భరమవుతుంది. – లక్ష్మీనారాయణరెడ్డి, జగరాజుపల్లి -
నలుగురు జీవిత ఖైదీల విడుదల
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నలుగురు జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ రహమాన్ తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఓపెన్ ఎయిర్ జైలుకు చెందిన నలుగురు ఖైదీలు ఉన్నారు. విడుదలైన వారిలో ప్రకాశం జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన రామస్వామి, వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం గొట్లూరు గ్రామానికి చెందిన పోల్రెడ్డి, అదే జిల్లా కడపలోని భగత్సింగ్ నగర్కు చెందిన ఫకృద్దీన్, నెల్లూరులోని జీనిగిల వీధికి చెందిన చంద్రశేఖర్ ఉన్నారు. వీరికి విడుదల ఆర్డర్ కాఫీతో పాటు నూతన వస్త్రాలను అందజేసి బుధవారం రాత్రి సాగనంపినట్లు జైలు సూపరింటెండెంట్ రహమాన్ తెలిపారు. -
రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ
ప్రశాంతి నిలయం: జిల్లాలో 2024–25 సంవత్సరానికి గాను వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి సంబంధించి రూ.1.72 కోట్ల రాయితీ చెక్కును అర్హులైన 1,021 మంది రైతులకు కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రోటవేటర్లు, బ్రష్కట్లర్లు, స్ప్రేయర్లు, మతుకలు, నూర్పిడి యంత్రాలు వంటివి రైతులకు ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎఫ్పీఓ ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎప్పీఓలు చేపడుతున్న రైతు సంబంధిత కార్యక్రమాలు, సమస్యలపై ఆరా తీశారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఎఫ్పీఓలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వైవీ సుబ్బారావు, జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు బలిగొన్న అతివేగం తనకల్లు: అతి వేగం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లికి చెందిన పుప్పాల కిరణ్కుమార్ (23) జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. వ్యక్తిగత పనిపై బుధవారం కొక్కంటిక్రాస్కు వచ్చాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. నల్లగుట్లపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతూ నియంత్రణ కోల్పోవడంతో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన కిరణ్కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్లో కిరణ్కుమార్ను తనకల్లులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
అనంతపురం అర్బన్: ఈనెల 16, 17 తేదీల్లో విజయవాడ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లావాసులు వివిధ విభాగాల్లో ప్రతిభ చూపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ వి.వినోద్కుమార్ అభినందనలు తెలిపారు. వ్యాసరచన పోటీల్లో నగరానికి చెందిన బి.భావన రసజ్ఞ ప్రథమ బహుమతి సాధించారు. సోలో యోగా పోటీల్లో (35 ఏళ్లు ఆపై) నగరానికి చెందిన ఎం.చలపతి రెండో బహుమతి గెలుచుకున్నారు. షార్ట్ ఫిలిమ్ పోట్లీలో (35 ఏళ్లు ఆపై) గుత్తికి చెందిన సి.విజయభాస్కర్ చౌదరి ద్వితీయ బహుమతి సాధించారు. పోస్టర్ పోట్లీలో (35ఏళ్లు ఆపై) ఉరవకొండకు చెందిన కె.సునీత మూడో బహుమతి దక్కించుకున్నారు. యోగా షార్ట్ ఫిలిమ్ పోటీల్లో (10–18 ఏళ్ల మధ్య) ఉరవకొండకు చెందిని కె.భరణి రెండో బహుమతి, యోగా క్విజ్ పోటీల్లో (19–35 ఏళ్లు) నగరానికి చెందిన బి.భావన రసజ్ఞ, బి.సాయి చంద్రశేఖర్ (ఉరవకొండ), కె.రుషిత తన్మయి తృతీయ బహుమతి గెలుపొందారు.