breaking news
Sri Sathya Sai District Latest News
-
టీచర్ల నిరసన ర్యాలీ
మడకశిర: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మడకశిరలో టీచర్లు బుధవారం ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక అమరాపురం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం కార్యాలయం ఎదుట కాసేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. 2010 సంవత్సరానికి ముందు నియామకమైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూన్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలని కోరారు. టెన్త్ వంద రోజుల ప్రణాళికలో పబ్లిక్ సెలవులు, పండుగ దినాలను మినహాయించాలన్నారు. డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 18న డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కళ్యాణచక్రవర్తికి అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, జిల్లా కార్యదర్శి నరసింహప్ప, స్థానిక యూటీఎఫ్ నాయకులు మహలింగప్ప, జోగప్ప, మూడ్లగిరియప్ప తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ రూరల్: టెట్ నుంచి ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం పెనుకొండలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ ఆనంద్కుమార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, నాయకులు నరేష్కుమార్, నారాయణ స్వామి, రమేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
దోచుకునేందుకే వైద్య విద్య ప్రైవేటీకరణ
పుట్టపర్తి టౌన్: తనకు దోచి పెట్టే అస్మదీయులకు మెడికల్ కళాశాలలు కట్టబెట్టి వైద్య విద్య ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు తెరలేపారని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ధ్వజమెత్తారు. కోటి సంతకాల ముగింపు సందర్భంగా బుదవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇందులో కొన్ని కళాశాలల భవనాలు పూర్తయి తరగతులూ కొనసాగుతున్నాయన్నారు. మరికొన్ని కళాశాలల భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రూ. 8వేల కోట్లు ఖర్చు పెడితే ఈ కళాశాలలన్నీ అందుబాటులోకి వచ్చి ఏటా 20,500 మంది పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగే అవకాశముందన్నారు. తన 18 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేని చంద్రబాబు ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా తన అనుయాయులకు కట్టబెట్టి దోచుకునేందుకు తెరలేపారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరం కావడంతో పాటు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించి స్వచ్చందంగా సంతకాలు చేసి కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అక్రమ బిల్లులపై సంతకాలా? సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన సత్యసాయి బాబా శతయంతి ఉత్సవాల సమయంలో తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు గాను రూ.80 లక్షలు ఖర్చు అయినట్లుగా పెట్టిన బిల్లుపై సంతకాలు పెట్టాలంటూ మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతిని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. దాతలు నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వారు వేయించిన రోడ్డుకు సంబంఽధించి కూడా బిల్లులు చేయాలని ఒత్తిళ్లు చేయడం పల్లె దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సంతకం పెట్టకపోతే బిల్డింగ్ కూలుస్తామని, చెత్త ఎత్తనివ్వకుండా అడ్డుకుంటామని, తాగునీటి సరఫరా నిలిపి వేసి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరింపులకు దిగడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశప్ప, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధాకర్రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి ఫొటో సాయి, నాయకులు అవుటాల రమణారెడ్డి, గోవర్దన్రెడ్డి, ఎంపీపీలు శ్రీధర్రెడ్డి, ఏవీ రమణారెడ్డి, కన్యాకుమారి, కవిత, సాయిగీత, రవినాయక్, నరసారెడ్డి, ఈశ్వరయ్య, కేశప్ప, శ్యామ్సుందర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, జయప్ప, లక్ష్మీరెడ్డి, గంగాద్రి, మాధవరెడ్డి, రామాంజనేయులు, శ్రీధర్రెడ్డి, భాస్కర్, షామీర్ బాషా, జగన్మోహన్ చౌదరి, సతీష్రెడ్డి, సందీప్నాయుడు, వాల్మీకి శంకర్, రుషీకేశవరెడ్డి, నాగిరెడ్డి, రంగప్ప, భాస్కర్, మల్లికార్జున, కుళ్లాయప్పనాయక్, విజయకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి -
దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పిస్తాం : ఎస్పీ
హిందూపురం: దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన దివ్యాంగుల హక్కుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఏ దివ్యాంగుడినీ కించపరిచేలా మాట్లాడినా, భయపెట్టినా శిక్షార్హులవుతారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి, హిందూపురం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి షెక్షావలి, న్యాయ సలహాదారుడు ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు చిలమత్తూరు: మండలంలోని కొడికొండలో ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురి చేస్తూ చర్చి ప్రాంతంలో బలవంతం చేయబోయిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జ్ ఎస్ఐ నరేంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వెల్లడించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలుతనకల్లు: రైతులకు నకిలీ ఎరువులు, మందులను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం ఏడీఏ లక్ష్మీనాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంతో పాటు కొక్కంటిక్రాస్లో ఉన్న ఎరువుల దుకాణాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలోని కేఎస్ఆర్ ఫర్టీలైజర్, కొక్కంటిక్రాస్లో ఉన్న వెంటేశ్వర ఫర్టీలైజర్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫర్టీలైజర్స్లో కలిసి రూ. 2.70 లక్షలు విలువైన ఎరువులను స్టాప్సేల్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తనకల్లు, ధర్మవరం ఏఓలు భారతి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ‘రూ.700 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యం’ అనంతపురం అగ్రికల్చర్: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.700 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక డీసీసీబీ ప్రధాన కార్యాయలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని బ్రాంచ్ మేనేజర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2026 మార్చి 31 నాటికి నిర్ధేశించుకున్న మేర డిపాజిట్లు సేకరించాలన్నారు. ఇందుకోసం కచ్చితమైన ప్రణాళిక అమలు చేయాలన్నారు. గడువు మీరిన రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్కాబ్ డైరెక్టర్ సురేంద్ర, సీనియర్ మేనేజర్ తేజస్వి, సీఈఓ కె.సురేఖారాణి, డీజీఎంలు పాల్గొన్నారు. ధర్మవరంలో పట్టపగలే చోరీ ధర్మవరం అర్బన్: స్థానిక లింగశెట్టిపాళ్యంలో బుధవారం ఉదయం సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఘటనపై వన్టౌన్ పీఎస్లో బాధితురాలు మౌలిక ఫిర్యాదు చేసింది. వివరాలు... వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల సమయంలో టేబుల్పై ల్యాప్టాప్, సెల్ఫోన్ పెట్టి పనిలో నిమగ్నమైన ఆమె.. కాసేపటి తర్వాత మిద్దైపెకి వెళ్లి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో తల్లి, తమ్ముడు లోపల గదిలో ఉండగా బయట గదిలో టేబుల్పై ఉంచిన కంపెనీ ల్యాప్టాప్, సెల్ఫోన్ను దుండగుడు అపహరించుకెళ్లాడు. గేటు శబ్దం రావడంతో ఎవరో వచ్చారని కుటుంబ సభ్యులు బయటకెళ్లి చూశారు. గేటు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి బయటి గదిని పరిశీలించారు. టేబుల్పై ఉన్న ల్యాప్టాప్, సెల్ఫోన్ కనిపించలేదు. దీంతో అవి అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని వెంటనే చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పీఏబీఆర్కు తగ్గిన ఇన్ఫ్లోకూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) లోకి బుధవారం ఇన్ఫ్లో బాగా తగ్గిపోయింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కుల చేరుతుండగా, 470 క్యూసెక్కులు తగ్గించారు. దీంతో 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. అలాగే హెచ్చెల్సీ లింక్ చానల్ ద్వారా 150 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్లో 5.18 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో రెండు గేట్ల ద్వారా 460 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్ డ్యామ్కు విడుదల చేస్తున్నారు. -
పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ
హిందూపురం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 309.13 గ్రాముల బంగారు నగలు, 3,010 గ్రాముల వెండి సామగ్రి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హిందూపురం అప్గ్రేడ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహేష్, సీఐ ఆంజనేయులుతో కలసి ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. పట్టుబడింది వీరే... పోలీసులకు పట్టుబడిన వారిలో గుంటూరులోని రామిరెడ్డినగర్కు చెందిన బండికాళ్ల రత్నరాజు అలియాస్ తేజా (ప్రస్తుతం పరిగి మండలం గొల్లపల్లిలో ఉంటున్నాడు), హిందూపురం మండలం హనుమేపల్లికి చెందిన ఎస్ఎన్ బాబూప్రసాద్ (ప్రస్తుతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరీబిదనూరు తాలూకా విదురాశ్వత్థంలో ఉంటున్నాడు), గౌరీబిదనూరు తాలూకా అలకాపురం నివాసి సిద్దిక్ సాహెబ్, హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన ఎంజీ గంగరాజు, ఉప్పర సురేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రత్నరాజుపై 55 కేసులు ఉన్నాయి. 2023 నుంచి వరుస చోరీలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పరిచయం పెంచుకున్న ఐదుగురు.. విడుదలైన తర్వాత ముఠాగా ఏర్పడి పగటి సమయంలో కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. చీకటి పడగానే ఆయా ఇళ్లలోకి చొరబడి విలువైన సామగ్రితో పాటు నగదూ అపహరించుకెళ్లేవారు. 2023 నుంచి ఈ నెల వరకూ వీరు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పలు పీఎస్ల పరిధిలో వరుస దోపిడీలు సాగిస్తూ వచ్చారు. ఆయా ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు... ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాలతో డీఎస్పీ మహేష్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో బుధవారం ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి, బంగారు నగలు, వెండి సామగ్రితో పాటు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ రివార్డులు అందజేశారు. తాళం పడిన ఇళ్లే టార్గెట్.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్ 320 గ్రాముల బంగారు, 3 కిలోల వెండి సామగ్రి స్వాధీనం -
దమ్ముంటే రాజీనామా చెయ్
కదిరి టౌన్: ‘సూపర్సిక్స్ పథకాల వల్ల మళ్లీ మేమే గెలుస్తామంటూ నిన్న ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గొప్పలు చెప్పుకున్నారు. మీరు ఈవీఎంలతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మీకు అంత సీన్ లేదు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం’ అంటూ వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ సవాల్ విసిరారు. ఆయన బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాలతో మళ్లీ గెలుస్తామన్న భ్రమల్లో కందికుంట ఉన్నారన్నారు. ‘ఇప్పుడు మీరు పాలకపక్షంలో ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా సరే ఎన్నికలకు సిద్ధం. ఇప్పుడు ఎన్నిక జరిగినా వైఎస్సార్సీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. గతంలో జగనన్న సాగించిన సంక్షేమాభివృద్ధి పాలన కారణంగా ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు’ అని అన్నారు. ప్రెస్మీట్లో కందికుంట హుందాతనం, సంస్కారం లేని భాష మాట్లాడారన్నారు. కదిరి ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, సమయం వచ్చినప్పుడు గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. గొప్పలు చెప్పుకోవడం మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్రెడ్డి, మునిసిపల్ విభాగం కార్యదర్శి కృపాకర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, కౌన్సిలర్ రామ్ప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరేంటో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం మీకు మళ్లీ గెలిచే సీన్ లేదు కందికుంటకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ సవాల్ -
వెలుగుల చామంతి
గాండ్లపెంట: విద్యుత్ వెలుగుల కాంతిలో చామంతి పూల సాగు చేపట్టి గాండ్లపెంట మండలం ద్వారనాల గ్రామానికి చెందిన రైతు శ్రీనాథ్రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గ్రామ సమీపంలో కదిరి – రాయచోటి ప్రధాన రహదారి పక్కన తనకున్న ఐదు ఎకరాల్లో ఆయన చామంతి పూల సాగుచేపట్టాడు. బెంగళూరు రూరల్ పరిధిలోని ఆనేకల్లు ప్రాంతం నుంచి ఒక్కో మొక్కను రూ.1.50 నుంచి రూ.3 వరకూ వెచ్చించి కొనుగోలు చేశాడు. పంట సాగులో వినూత్న పద్ధతులు అవలంభించడంతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పంటను హైదరాబాద్, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. కృత్రిమ కాంతితో సత్ఫలితాలు సాధారణంగా చామంతి మొక్క ఏపుగా ఎదిగి అధిక దిగుబడి ఇవ్వాలంటే రోజుకు 14 గంటల వెలుగు ఉండాలి. అయితే శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండడంతో రైతు శ్రీనాథ్రెడ్డి తన పొలంలో చేపట్టిన చామంతి సాగులో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను అమర్చాడు. పగటి వేళ సూర్య కాంతితో పాటు రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగు కారణంగా మొక్క నాటిన నెల రోజులకే ఒకటిన్నర ఎత్తుకు ఏపుగా పెరిగి నెలన్నరకే పంట కోతకు వచ్చింది. ఆ తర్వాత విద్యుత్ బల్బులు తొలగించేశాడు. ఈ విధానం ద్వారా నాలుగు నుంచి ఆరు నెలల వరకూ అధిక దిగుబడి వచ్చింది. ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం ఉండదు. పశువుల పేడ ఎరువు మాత్రమే వినియోగిస్తే చాలు. నీటి తడులు కూడా చాలా తక్కువ. దీంతో పెట్టుబడుల భారం కూడా తగ్గింది. విద్యుత్ వెలుగుల్లో పూలసాగు ద్వారనాల రైతు వినూత్న పద్ధతులుపొరుగు రాష్ట్రాల మార్కెట్కు తరలిస్తా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా మొక్క నాటిన నెలన్నరకే ఏపుగా పెరిగి పూలు కోతకు వస్తాయి. ఆ సమయంలో విద్యుత్ దీపాలను తొలగించేస్తా. ఎకరాకు 4 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిని తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు పంటను తరలిస్తా. – శ్రీనాథ్రెడ్డి, రైతు, ద్వారనాల -
సమయపాలన లేకపోతే ఎలా?
అగళి: సమయపాలన పాటించడంలో అలసత్వం వీడాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆగళి పీహెచ్సీ వైద్యులు, సిబ్బందిని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం హెచ్చరించారు. స్థానిక పీహెచ్సీని బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలతో పాటు పలు రికార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వైద్యులు, సూపర్వైజర్లు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివానంద, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. పీహెచ్సీలో బుధవారం విలేకరుల సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. కొమరేపల్లి పంచాయతీ నుంచి ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 14 వరకూ 3,982 జారీ అయిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల అంశంలో విచారణ కొలిక్కి వచ్చిందని, ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారుల జారీ చేసే ఆదేశాల మేరకు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పీహెచ్సీలో తనిఖీలు గుడిబండ: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం బుధవారం తనిఖీ చేశారు. వ్యాక్సిన్ నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి వెంగళరావు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య సిబ్బందిని నిలదీసిన డీఎంహెచ్ఓ -
ఉప్పొంగిన ప్రజా ఉద్యమం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం ఉప్పొంగింది. వైద్యం మా హక్కు...పీపీపీ పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు సర్కార్ను హెచ్చరించారు. పేదల పక్షాన వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ఊరూవాడా మద్దతు లభించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మంది మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన ప్రతులు జిల్లా కేంద్రానికి చేరాయి. సాక్షి పుట్టపర్తి : ‘వైద్యం.. ప్రజల హక్కు’ నినాదంతో జిల్లా మార్మోగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగింది. గ్రామగ్రామానా సంతకాల సేకరణ పెద్దఎత్తున సాగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ (పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్షిప్) పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలని.. ప్రజలు డిమాండ్ చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి తీసుకున్న సంతకాల ప్రతులను బుధవారం జిల్లా కేంద్రానికి చేర్చారు. కార్లతో భారీ ర్యాలీ.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో పెనుకొండలోని మెడికల్ కాలేజీ నుంచి జాతీయ రహదారిలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వరకు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది కార్లతో వేలాది మంది జనాలతో పెనుకొండ పట్టణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. 50 వేలకుపైగా సంతకాల సేకరణ.. పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 50 వేల మందితో సంతకాలు సేకరించినట్లు శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఉపసంహరించుకునే వరకు ఉద్యమం.. కదిరి నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 68 వేల మందితో సంతకాలు సేకరించినట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. బినామీలకు కట్టబెట్టేందుకే.. హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని 50 వేల మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని దీపిక తెలిపారు. తన అనుయాయులకు కారుచౌకగా మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రైవేటీకరణ అంటూ జపం చేస్తున్నారని దీపిక మండిపడ్డారు. ప్రభుత్వమే నిర్వహించాలి.. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను బుధవారం జిల్లా కేంద్రం పుట్టపర్తికి తరలించారు. ధర్మవరంలో భారీ ర్యాలీ.. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నుంచి కాలేజీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 62,358 మందితో సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి పంపించారు. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన 64,670 సంతకాల ప్రతులను బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రం పుట్టపర్తికి పంపారు. అనంతపురం నుంచి ప్రత్యేక వాహనంలో వీటిని తీసుకెళ్లారు. పార్టీ నేత తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. ఈవిషయంలో చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ పోరుబాట ఊరూరా సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలోనూ వేలాది మంది మద్దతు జిల్లా కేంద్రానికి చేరిన కోటి సంతకాల ప్రతులు పెనుకొండలో ఉషశ్రీచరణ్ భారీ ర్యాలీ -
పది విద్యార్థికి విషమ పరీక్ష!
కదిరి: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాలో అమల్లోకి వచ్చింది. 100 శాతం ఫలితాలు సాధించడం కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రోజంతా తరగతులు, మళ్లీ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు, సెలవు రోజుల్లో కూడా తరగతుల నిర్వహణ కారణంగా పిల్లలకు విశ్రాంతి కరువవుతోంది. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా బడిలోనే గడపాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇక స్థానికంగా హైస్కూల్లో లేక సమీపంలోని గ్రామంలో ఉన్న పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తల్లిదండ్రులు, టీచర్లు చెబుతున్నారు. సంక్రాంతి సెలవుల్లోనూ బడికి వెళ్లాల్సిందే.. జిల్లాలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 15,384 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఈ నెల 6వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకూ సెలవు రోజుల్లో కూడా బడికి వెళ్లాల్సిందే. రోజూ ఉదయం, సాయంత్రం మరో రెండు గంటలు అదనంగా బడిలో కూర్చోవాలి. పిల్లలతో పాటు 10వ తరగతికి బోధించే ఆయా సబ్జెక్టు టీచర్లు కూడా సంక్రాంతి సెలవుల్లో బడికి వెళ్లాల్సిందే. సెలవురోజుల్లో పనిచేసే వారికి సీసీఎల్ కూడా ఇవ్వకుండా కనీస పనిదినాల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీనికి తోడు ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపే ప్రశ్నపత్రాలను జిరాక్స్ చేసుకుని పరీక్ష నిర్వహించడం, వాటిని దిద్ది అదే రోజు ‘లీప్ యాప్’ లో నమోదు చేయాల్సి రావడంతో టీచర్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సెలవుదినాల్లోనూ పని చేయాల్సి రావడంపై పెదవి విరుస్తున్నారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సెలవు రోజుల్లోనూ పనిచేయాలంటూ టీచర్లకు ఆదేశాలు ఈ నెల 6 నుంచి విద్యార్థులకు రోజూ అదనపు తరగతులు విశ్రాంతి కరువై విద్యార్థుల్లో పెరిగిన ఒత్తిడి మానసిక సమస్యలతో చాలా మంది సతమతం సెలవుల్లో తరగతుల నిర్వహణపై టీచర్ల నుంచి వ్యతిరేకత ఎన్పీకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. వీరిలో 20 మంది పెడబల్లి నుంచి రోజూ 8 కి.మీ నడిచి స్కూల్కు వచ్చి.. మళ్లీ సాయంత్రం ఇళ్లకు వెళ్తారు. ప్రస్తుతం సాయంత్రం 5.15 గంటలకే సూర్యాస్తమయం అవుతుండగా.. పిల్లలు ఇంటికి చేరే సరికే చీకటి పడుతోంది. ఆటోలు కూడా లేనందున పిల్లలు బిక్కుబిక్కుమంటూ భయంతో ఇల్లు చేరుతున్నారు. ప్రభుత్వం తాజాగా రోజూ రెండు గంటలు అదనంగా స్కూళ్లలో తరగతులు ఏర్పాటు చేస్తుండటంతో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలోనే చీకటి పడితే ఎలా ఇళ్లకు చేరుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. -
స్క్రబ్ టైఫస్పై అలర్ట్
అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మంగళవారం ముదిగుబ్బ, గుమ్మఘట్ట మండలం తాళ్లకెర ప్రాంతానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ ఉన్న విషయం వెలుగులోకి రాగా.. బుధవారం కిరికెర గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ పాజిటివ్ కేసుల్లో ఐదు నెలల గర్భిణి ఉండటం గమనార్హం. కేసులు కలకలం రేపుతుండటంతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ఈఎన్టీ వార్డులోని రోగులను మరో వార్డుకు తరలించి.. అక్కడ 20 పడకలతో స్క్రబ్ టైఫస్ వార్డు ఏర్పాటు చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి ర్యాపిడ్ యాక్షన్ టీంను అందుబాటులో ఉంచారు. మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ భీమసేనాచార్, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, వైద్య కళాశాల నుంచి డాక్టర్ ఆది నటేష్, డాక్టర్ సరోజమ్మ, డాక్టర్ కృష్ణవేణిలను నియమించారు. మరోవైపు తాళ్లకెరకు చెందిన ఓ విద్యార్థిని స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడినట్లు తెలియడంతో మలేరియా సబ్యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్, వైద్యులు సందేశ్, తహసీల్దార్ రజాక్వలి, ఎంపీడీఓ జయరాములు గ్రామంలో పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కీటకనాశిని మందుతో గ్రామంలో పిచికారీ చేయించారు. సర్వజనాస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు మూడుకు చేరిన పాజిటివ్ కేసులు -
ఉద్యాన రైతుకు ఊతంగా నిలవండి
● అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశం ప్రశాంతి నిలయం: ఉద్యాన రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి వారికి ఊతంగా నిలవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం అమలులో భాగంగా జిల్లాలో అమలు చేయాల్సిన దీర్ఘకాలిక లక్ష్యాలు, లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, డీఆర్డీఏ, డ్వామా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా భౌగోళిక పరిస్థితులు, పంట పద్ధతులు, నీటి వనరులు, నేల స్వభావం వంటి క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్డీఏ, డ్వామా పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల్లో లోటుపాట్లు లేకుండా పురోగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శుభదాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికరామగిరి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఉదయం ఎంపీపీ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రామగిరి ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసినా, ప్రతిసారి అధికార పార్టీ దౌర్జన్యాలతో మెజార్టీ ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరు కావటంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మరోసారి ఎన్నిక నిర్వహణ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఇప్పటికే వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నేడు జరిగే ఎంపీపీ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. నకిలీ బంగారంతో బ్యాంక్ రుణం! ● పోలీసుల అదుపులో కర్ణాటక ముఠా ● కొనసాగుతున్న విచారణ ఓడీచెరువు: నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకునేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకకు చెందిన ఓ ముఠా పక్కా ప్రణాళికతో అధిక బరువుతో వడ్డాణానికి పైపొర మాత్రం బంగారంతో చేసి బ్యాంక్ల్లో తాకట్టు పెట్టి రుణం పొందేలా కుట్రకు తెరలేపారు. ఇలాంటి వడ్ఢాణాలు పెద్ద సంఖ్యలో చేసినట్లు సమాచారం. స్థానికేతరులు కావడంతో తమపై అనుమానం రాకుండా ఉండేందుకు రుణంపై కొంత మొత్తం కమీషన్ చెల్లించేలా స్థానిక రైతులతో ఒప్పందం చేసుకుని బ్యాంక్లో తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం పొందేలా పథకం రచించారు. ఇందులో భాగంగా గోరంట్ల, ఓడీ చెరువులోని పలువురు రైతులను ఒప్పించారు. బుధవారంఖరీదైన కారులో ఓడీచెరువులోని ఎస్బీఐ శాఖకు చేరుకున్న కర్ణాటక వాసులు.. 280 గ్రాముల బరువున్న వడ్డాణాన్ని బ్యాంక్ అధికారులకు స్థానిక రైతు ద్వారా అందజేయించి తాకట్టు రుణం కావాలని అడిగించారు. పెద్ద మొత్తంలో రుణం కావడంతో బ్యాంక్ అధికారులు పలు రకాలుగా ప్రశ్నలు సంధించడంతో రైతు తడబడడంతో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులు జోక్యం చేసుకుని బ్యాంక్ అధికారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా బ్యాంక్ అధికారులు పదేపదే ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో వెంటనే బ్యాంక్ తలుపులు మూతవేయించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. వీరికి చెందిన ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలోనూ గతంలో మోసగించినట్లు అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. -
హేమావతిలో వీరబల్లాల శాసనం
అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామ చెరువు వద్ద నొలంబ పల్లవ రాజులు నిర్మించిన శివాలయం గడపపై హోయసల ప్రభువు రెండో వీరబల్లాల శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి మంగళవారం గుర్తించారు. కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని శాలివాహన శకవర్షం 1111 సౌమ్య నామ సంవత్సరంలో హొయసల రెండో వీరబల్లాలుడు రాయించినట్లుగా తెలుస్తోందన్నారు. ఆంగ్ల సంవత్సరం ప్రకారం సామాన్య శకం 1189 నాడు వీరబల్లాలుడు శివాలయానికి భూమిని దానం చేసి ఉండవచ్చన్నారు. వాస్తవానికి స్తంభ శాసనం సగం కనిపిస్తుందని, మిగతా సగం గుడి మెట్టుకు ఆసరాగా ఉందన్నారు. రెండో వీరబల్లాలుడికి చెందిన 1206 నాటి మరో శాసనం సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర ఆలయ ద్వారబంధాల పైబాగంలో ఉందన్నారు. చిరుత దాడిలో మేక మృతి రొళ్ల: మండలంలోని టీడీపల్లికి చెందిన కాపరి నరసింహప్ప పోషిస్తున్న మేకల మందపై మంగళవారం సాయంత్రం చిరుత దాడిచేసింది. ఉదయం మందను గ్రామ పొలిమేర వద్దకు మేపు కోసం కాపరి తోలుకెళ్లాడు. సాయంత్రం మందను ఇంటికి మళ్లిస్తుండగా మార్గ మధ్యంలో పొదల చాటు నుంచి చిరుత దాడిచేసి, ఐదేళ్ల వయసున్న మేకను నోట కరుచుకుని పోయింది. ఆ సమయంలో కాపరులు వెంటపడి కేకలు వేయడంతో వంద మీటర్ల వరకూ మేకను లాక్కెళ్లి వదిలి పారిపోయింది. కాపరులు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మేక మృతి చెందింది. ఘటనతో సుమారు రూ.15 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. వ్యక్తి దారుణ హత్య నల్లచెరువు: మండలంలోని ఓరువాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి నివాసి చలపతి (37) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీనం సాగిస్తున్న చలపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమ్మరవాండ్లపల్లి పక్కనే ఉన్న మల్లిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ భార్యతో కొన్నేళ్లుగా చలపతి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. విషయం తెలుసుక్ను వెంకటరమణ తన భార్యకు సర్దిచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. చివరకు భర్తతో గొడవపడి మూడేళ్ల క్రితం అయ్యన్నగారి కొత్తపల్లిలోని తన పుట్టింటికి ఆమె చేరుకుంది. అయినా చలపతి అప్పుడప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి వస్తుండడాన్ని వెంకటరమణ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మంగళవారం ఓరువాయి గ్రామ ఎల్లమ్మ గుడి సమీపంలో నిర్మాణ పనిప్రాంతంలోనే భోజనం చేస్తున్న చలపతి వెనుక నుంచి వేటకొడవలితో దాడి చేశాడు. ఘటనతో చలపతి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, నల్లచెరువు పీఎస్ ఎస్ఐ మక్బూల్ బాషా అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఆలయాల్లో హుండీ కానుకల లెక్కంపు మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను మంగళవారం దేవాదాయశాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. జిల్లెడగుంట ఆలయంలో హుండీల ద్వారా రూ.6,32,693, భక్తరపల్లి ఆలయంలోని తాత్కాలిక హుండీల ద్వారా రూ.2,07,410, శాశ్వత హుండీల ద్వారా రూ.10,87,490 చొప్పున మొత్తం రూ.21,64,958 నగదు సమకూరింది. ఈ మేరకు ఆలయాల ఈఓ నరసింహరాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధికారి అక్కిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరసేగౌడ్, సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు, అర్చకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపిక ధర్మవరం: ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు క్రీడాకారులను మంగళవారం ధర్మవరంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను జూడో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భాస్కరనాయుడు, పాఠశాల హెచ్ఎం సుమన, పీడీ స్వరూప, సరళ పర్యవేక్షించారు. ఎంపికై న వారిలో గవ్వల యువ సంధ్యా, జాహ్నవి, జనశ్రీ, సుస్మిత, కొండా అర్చన ఉన్నారు. వీరిని కోచ్ ఇనాయత్బాషా అభినందించారు. -
22 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో ఈ నెల 22 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఈ మేరకు అన్ని పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇదిలా ఉండగా, ఎస్కేయూ పరిధిలో యూజీ మూడు, ఐదు సెమిస్టర్లకు సంబంధించి మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. గుత్తి ఎంఎస్ డిగ్రీ కళాశాలలో ఒకరిని, హిందూపురం బాలాజీ విద్యామందిరంలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు అనంతపురం కల్చరల్: ఈ నెల 12, 13, 14 తేదీలలో అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, బ్రోచర్లను మంగళవారం వివేకానంద యోగభవన్లో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ వెల్ఫేర్ విభాగంలో యోగాకు గుర్తింపు దక్కడంతో రాష్ట్ర స్థాయి విజేతలను ఈ నెల 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద సంగమేశ్వరంలో జరిగే జాతీయ స్థాయి చాంపియన్షిప్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విజేతలు నేరుగా ఆసియన్ గేమ్స్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో యోగాసన అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముత్యాలరెడ్డి, కేవీ రమణ, యోగా గురువులు దివాకర్, ఆంజనేయులు, మారుతీప్రసాద్, మహేష్, మల్లికార్జున పాల్గొన్నారు. -
భోజనం నాణ్యతలో రాజీ పడద్దు
చెన్నేకొత్తపల్లి/ముదిగుబ్బ: వసతి గృహాలు, పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు ఇచ్చే భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని నిర్వాహకులను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం, సీకేపల్లి గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. సీకేపల్లిలోని ఎస్సీ బాలుర వసతి గృహం, ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని అంగన్వాడీ కేంద్రం, ఎంఎల్ఎస్ పాయింట్, కొత్త బీసీ కాలనీలోని చౌకధాన్యపు డిపోను పరిశీలించారు. కేజీబీవీలో నాసిరకం కోడిగుడ్లను గమనించి అసహనం వ్యక్తంచేశారు. నాగసముద్రంలోని ప్రాథమిక పాఠశాలలో వంటగది శుభ్రంగా లేకపోవడం, కాలం చెల్లిన చెక్కీలను గమనించిన ఆమె హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని సరుకులను వాడుతున్నందుకు గాను ఆ పాఠశాల హెచ్ఎంకు షోకాజు నోటీసు జారీ చేయాలని ఎంఈఓ ప్రసూన్కుమార్నాయుడికి సూచించారు. ఆమె వెంట డీఈఓ కిష్టప్ప, ఐసీడీయస్, పౌరసరఫరాల అధికారులు, చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ సురేష్కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణుడు ఉన్నారు. అలాగే ముదిగుబ్బలోని కేజీబీవీ, అంగన్ వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతం కార్యక్రమంలోపాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లో తనిఖీలు ధర్మవరం రూరల్/కదిరి అర్బన్: స్థానిక మార్కెట్ యార్డులోని ఎంఎల్ఎస్ పాయింట్ను మంగళవారం ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి తనిఖీ చేశారు. రికార్డులు, నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో స్టాక్ పాయింట్ అధికారి ప్రసన్నకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కదిరి మండలం కాళసముద్రం అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కదిరిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి -
పదేళ్ల బాబుకు పునర్జన్మ..
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న పదేళ్ల బాలుడికి పునర్జన్మను ప్రసాదించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, చిన్నపిల్లల విభాగం ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్తో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విష సర్పం కాటుతో.. పెద్దవడుగూరు మండలం కండ్లగూడురు గ్రామానికి చెందిన నారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, ఈ నెల 2న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిన్న కుమారుడు శివనారాయణ అర్ధరాత్రి సమయంలో మేల్కోని మూత్రవిసర్జనకంటూ బయటకు వచ్చాడు. ఆ సమయంలో కుప్పకూలిపోవడంతో తల్లిదండ్రులు ఆగమేఘాలపై పామిడిలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పాము కాటు (కట్ల పాముగా అనుమానం) కారణంగా అప్పటికే శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే సమయంలో ఇంటి వద్ద ఉన్న పదేళ్ల వయసున్న పెద్ద కుమారుడు శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమచారం అందుకున్న తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. బంధువులు అంబులెన్స్లో తీసుకురావడంతో పరిస్థితి విషమంగా ఉందని వెంటనే అనంతపురానికి తీసుకెళ్లాలని పామిడిలో వైద్యులు సూచించారు. 36 గంటల నిరంతర శ్రమ శివరామరాజును అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకువచ్చే లోపు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యులు వెంటనే చిన్నపిల్లల విభాగంలో అడ్మిట్ చేసుకుని పీఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి 36 గంటల పాటు నిరంతర వైద్య సేవలు అందించారు. కాస్త కోలుకున్న తర్వాత మరో రెండు రోజుల పాటు పీఐసీయే స్టెప్డౌన్లో, అనంతరం సాధారణ వార్డులో ఉంచి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో శివరామరాజుకు దాదాపు 40 వైల్స్ యాంటీ స్నేక్ వీనమ్ అందించడంతో పాటు ఖరీదైన మందులు, ఐసీసీయూ సౌలభ్యాన్ని ఉచితంగా అందించారు. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలు పొందాలంటే రూ.3లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. నిజంగా వారు దేవుళ్లు.. ‘ఇప్పటికే ఓ బిడ్డ శివనారాయణను కోల్పోయాం. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ బతుకుతాడో.. లేదోనని మొక్కని దేవుడు లేడు. అయితే పెద్దాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మా బిడ్డను బతికించారు. నిజంగా వారు దేవుళ్లే’ అంటూ శివరామరాజు తల్లి లక్ష్మీదేవి భావోద్వేగంతో పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాబాయి, పీజీలు వాసవి, ప్రేమ్, జీవన్, లావణ్య, హౌస్సర్జన్ ఏంజెల్, స్టాఫ్నర్సులు మేరీ సుజాత, అరుణ, కీర్తి, పెద్దక్క, మాధవి, తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ చిన్నపిల్లల విభాగం ఘనత ఈ నెల 2న అర్ధరాత్రి పాముకాటుకు గురైన అన్నదమ్ముళ్లు పామిడి సీహెచ్సీకి చేర్చేలోపు తమ్ముడి మృతి జీజీహెచ్లో చేరిన బాబుకు ప్రాణం పోసిన వైద్యులు, స్టాఫ్నర్సులు -
మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టండి
పుట్టపర్తి: మారిన వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో మామిడి తోటల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు జిల్లా ఉద్యాన అధికారి (డీహెచ్ఓ) చంద్రశేఖర్ సూచించారు. మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై మంగళవారం బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి కల్యాణమంటపంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన సస్యరక్షణ చేపడితే మామిడిలో అధిక దిగుబడులు సాధ్యమవుతాయన్నారు. అనంతరం సమీపంలోని మామిడి తోటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. ప్రస్తుతం 10 శాతం కంటే తక్కువ పూత వచ్చిందని, పూత రాని తోటల్లో 10 గ్రాముల 13.0.45 ఎరువు, 3 గ్రాముల సూక్ష్మధాత మిశ్రమాన్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. 10 నుంచి 20 శాతం పూత వచ్చిన తోటల్లో ఒక ఎం.ఎల్.డబుల్ , 2 ఎం.ఎల్. హెక్సా కొనజోల్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. 50 శాతం, అంతకు మించి పూత వచ్చిన తోటల్లో 0.3ఎం.ఎల్. ప్లానోపిక్స్ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో బుక్కపట్నం మండల వ్యవసాయాధికారి నటరాజ్, హెచ్ఓ నవీన్, రైతులు ఆవుటాల రమణారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోపాలరెడ్డి, రంగారెడ్డి, ఓబిరెడ్డి, శంకర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం
మడకశిర: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నిర్వహణ లోపాల కారణంగా కస్తూరిబా గురుకుల బాలిక విద్యాలయ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఇందుకు మడకశిర నియోజకవర్గంలోని కేజీబీవీల నిర్వహణ అద్దం పడుతున్నాయి. నియోజకవర్గంలో అమరాపురం, రొళ్ల (ఆవినకుంట), గుడిబండ (కరికెర), అగళి, మడకశిర (గుండుమల)లో కేజీబీవీలు ఉన్నాయి. అన్నింటిలోనూ 6 నుంచి ఇంటర్ వరకూ తరగతులును నిర్వహిస్తుండగా మొత్తం 1,282 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అస్తవ్యస్తంగా నిర్వహణ మడకశిర నియోజకవర్గంలోని కేజీబీవీలు జిల్లా కేంద్రానికి సుదూరంగా కర్ణాటక సరిహద్దున ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల తనిఖీల ఊసే లేకుండా పోయింది. దీంతో కేజీబీవీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేజీబీవీల్లో సరైన వసతులు లేకపోవడం, భోజనంలో నాణ్యత లోపంచడం తదితర సమస్యలతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీబీవీల నిర్వహణను ఎంతో గొప్పగా ఊహించుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టి కంగు తిన్నారు. కుళ్లిన కూరగాయలను వంటకు ఉపయోగించడం, 253 మంది బాలికలకు రెండంటే రెండే మరుగు దొడ్లు ఉండడం, భోజనంలో నాణ్యత లోపించడం, కుళ్లిన అరటి పండ్లను ఇస్తుండడం, అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం తదితర సమస్యలు గుర్తించిన ఎమ్మెల్యే నోట మాట లేకుండా పోయింది. ఎంఈఓల పర్యవేక్షణ కరువు కేజీబీవీలను తరచూ ఎంఈఓలు తనిఖీ చేయాల్సి ఉండగా.. మడకశిర నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్వహణ గాడి తప్పింది. సిబ్బంది ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థినుల బాగోగులను గాలికి వదిలేశారు. తన తనిఖీల్లో వాస్తవాలను గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిని తీవ్ర స్థాయిలో మందలించినా.. సదరు సిబ్బందిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చివరకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం తనిఖీ చేపట్టన తర్వాత అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువు నాణ్యతలేని భోజనంతో ఇబ్బందులు ఎంఈఓల పర్యవేక్షణ నామమాత్రం మడకశిర మండలం గుండుమలలోని కేజీబీవీ పాఠశాల ఇది. 6 నుంచి పదో తరగతి వరకు 208 మంది, ఇంటర్లో 45 మంది విద్యార్థినులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సొంత గ్రామం కావడంతో కేజీబీవీలో ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వంలో కేజీబీవీల నిర్వహణ సక్రమంగా ఉందని నిరూపించాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎంతో ఆశతో ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అయితే ఆయన ఆశ అడియాసగానే మారింది. కేజీబీవీ నిర్వహణలో అనేక లోపాలు గుర్తించిన ఆయన నోట మాట రాలేదు. దీంతో అక్కడి సిబ్బందిపై తనదైన శైలిలో మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలి చంద్రబాబు ప్రభుత్వానికి విద్యారంగ సమస్యలపై చిత్తశుద్ధి లేదు. దీంతో కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలతో విద్యారంగాన్ని పటిష్టం చేశారు. దీంతో బోధనాప్రమాణాలు మెరుగుపడి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రస్తుతం కేవలం ప్రచార ఆర్భాటానికే పాలకులు పరిమితమై విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మార్పు రావాలి. కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మడకశిర -
కర్ణాటకలో ప్రమాదం.. చలివెందల వాసి మృతి
భాగ్యనగర్ (బాగేపల్లి): మలుపులో ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందలకు చెందిన పలువురు మంగళవారం బాగేపల్లి తాలూకా లోని సుంకులమ్మ ఆలయానికి ఆటోలో వచ్చారు. బాగేపల్లి పట్టణ శివారులన 44వ జాతీయ రహదారిపై సాయిబాబా ఆలయం వద్ద మలుపు తీసుకోవాల్సి ఉండడంతో వాహనాల రాకను గమనించేందుకు డ్రైవర్ ఆటోను ఆపాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ఘటనలో ఆటోలో నుంచి కిందపడిన ఆదిమూర్తి (80) మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13 మందిని తొలుత బాగేపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిక్కబళ్లాపురలోని జిల్లాస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, లారీ, బస్సు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఫార్మసీ ఫలితాల విడుదలఅనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నవంబర్లో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర శేఖర్రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
ఉమ్మడి జిల్లాపై చలి పంజా
● మడకశిరలో 11.2, శెట్టూరులో 12.1 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. పగలు, రాత్రి శీతల వాతావరణం నెలకొంది. వేకువజామున పొగమంచు అధికమవుతోంది. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో 11.2 డిగ్రీలు, అనంతపురం జిల్లా శెట్టూరులో 12.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విడపనకల్లు 12.2, సోమందేపల్లి 12.3, అమడగూరు 12.4, తనకల్లు 12.6, రొద్దం 12.7, కుందుర్పి, గుమ్మఘట్ట, గుడిబండ 13.1, ఓడీ చెరువు 13.2, నల్లచెరువు 13.4, అమరాపురం 13.5, వజ్రకరూరు 13.6, కళ్యాణదుర్గం, గాండ్లపెంట 13.7, రాప్తాడు 13.8 డిగ్రీలు... ఇలా చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా మండలాల్లో కూడా 14 నుంచి 17 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య కొనసాగుతున్నాయి. -
దొంగనోట్ల ముఠా అరెస్టు
బత్తలపల్లి: దొంగనోట్లు చెలామణి చేసే నలుగురిని అరెస్టు చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో దొంగల ముఠా సభ్యులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఎస్ఐ సోమశేఖర్, ట్రైనీ ఎస్ఐ నాగప్రసన్నలతో కలిసి సీఐ విలేకర్లతో మాట్లాడారు. కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరుకు చెందిన బోడేపల్లి అంజి, అదే జిల్లా కొండాపురం మండలం దామలూరుకు చెందిన ఓబులేసు, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయపల్లికు చెందిన శిరోల్లా రాజకుళ్లాయప్ప, వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం లింగయ్యపల్లికి చెందిన ఇల్లూరి వీరాంజనేయరెడ్డి బృందంగా ఏర్పడ్డారన్నారు. ఇందులో భాగంగానే నకిలీ నోట్లు ఉన్న ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బాలు, హరిలను కలిసి రూ.3 లక్షలు ఒరిజినల్ నోట్లకు రూ.9 లక్షల నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. గతనె 19న బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామ సమీపంలోని కాటికోటేశ్వర క్షేత్రంలోకి వెళ్లే ఆర్చ్ వద్ద వీరాంజనేయరెడ్డి దగ్గర ఉన్న అసలైన రూ.3 లక్షలు తీసుకొని బాలు, హరి రూ.9 లక్షల నకిలీ నోట్లు ఇచ్చి వెళ్లిపోయారన్నారు. అయితే వారు ఇచ్చిన నకిలీ నోట్లు కూడా సరైనవి కాదని వీరాంజనేయరెడ్డి గమనించి విషయాన్ని ఓబులేసు, అంజిలకు చెప్పారన్నారు. డబ్బుల విషయంపై సోమవారం బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లి క్రాస్ వద్ద వారి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా అసలు విషయం బయట పడిందని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్కు పంపిన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి వద్ద నుంచి రూ.500 నకిలీ నోట్లు 600 మేర స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
బ్యాంకు ఖాతాలో నగదు మాయం
సోమందేపల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.80 వేల నగదును దుండగులు అపహరించారు. సోమవారం ఓ నంబర్ నుంచి తనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి చాటింగ్ చేస్తూ మోసం చేసినట్లు బాధితుడు మంగళవారం విలేకరులకు తెలిపాడు. క్షణాల్లో తన ఖాతాలో ఉన్న నగదు అదృశ్యమైందన్నారు. ఘటనపై స్థానిక పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తోలుబొమ్మల కళాకారిణి శివమ్మకు ‘శిల్పగురు’ అవార్డుధర్మవరం రూరల్: డిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ హస్త కళాకారుల జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ శిల్పగురు జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ అవార్డుల పోటీలో 2023 సంవత్సరానికి గాను తాము పంపిన శ్రీ విష్ణు చరిత, విశ్వరూప హనుమాన్ తోలుబొమ్మలకు అవార్డు దక్కిందని శివమ్మ తెలిపారు. మంగళవారం డిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం వడ్డించండి మడకశిరరూరల్: మండల పరిధిలోని గుండుమల కేజీబీవీ పాఠశాలను మంగళవారం జిల్లా సమగ్రశిక్ష అడినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) దేవరాజు సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ పాఠశాలను సోమవారం రాత్రి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేసి భోజన పథకం నాణ్యత, మెనూ అమలు తీరు, విద్య ప్రగతి తదితర వాటిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీసీ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల సమస్య లేకుండా చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. స్కిల్ హబ్ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణప్రశాంతి నిలయం: జిల్లాలోని యువతకు స్కిల్ హబ్ సెంటర్ల ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8 నైపుణ్య హబ్లు, పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్య కళాశాలను స్థాపించి వివిధ రంగాలలో యువతకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ను ఏర్పాటు చేసి వాటి ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మరింత సమాచారం కోసం 9390176421, 9398643930, 9966682246 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. -
హత్యా రాజకీయాలకు కేరాఫ్ కందికుంట
కదిరి టౌన్: ‘హత్య రాజకీయాలకు కేరాఫ్ కందికుంట.. నకిలీ డీడీల కుంభకోణం కేసులో అతని ప్రమేయం ఉందని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 19న కేసు విచారణ కూడా ఉంది. అలాంటి కందికుంటకు వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి లేదు’ అని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్యయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విమర్శించారు. మంగళవారం కదిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మక్బూల్ అహ్మద్ మాట్లాడారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. ఆయన వచ్చిన తరువాత కదిరి అభివృద్ధి పూర్తిగా కుటుంపడిందన్నారు. ఫిబ్రవరిలో నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని. కానీ నేటికీ కోనేరు ఎప్పుడు సిద్ధం కాలేదన్నారు. గత ప్రభుత్వంలో తాము రాయలసీమ సర్కిల్ నుంచి కోనేరు వరకూ రోడ్డు విస్తరణ పనులు చేపడితే.. టీడీపీ నాయకులు అడ్డుపడ్డారని, నష్టపరిహారం ఇచ్చి పనులు చేయాలని అప్పుడు డిమాండ్ చేశారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉన్నందున రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కందికుంట కేవలం మాటలు చెప్పి తప్పుకునే రకమన్నారు. మాజీ మంత్రి షాకిర్ను అడిగితే కందికుంట పుట్టు పుర్వోత్తరాలు, చేసిన పాపాలన్నీ తెలుస్తాయన్నారు. కందికుంట కక్ష రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చి కదిరి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనవి కూడా అమలు చేశారన్నారు. ఇకపై వైఎస్ జగన్పై ఇష్టానుసారంగా మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి లింగాల కృపాకర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, కన్వీనర్లు మనికంఠనాయక్, అశోక్వర్ధన్రెడ్డి, రవీంద్రరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి రాజేంద్రప్రసాద్, యూత్ అధ్యక్షుడు రమేష్యాదవ్, బాబా, ఇమ్రాన్, యసన తదితరులు పాల్గొన్నారు. జగన్ను విమర్శించేస్థాయి ఆయనకెక్కడిది? విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ -
జోరుగా కోటి సంతకాల సేకరణ
సాక్షి, పుట్టపర్తి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో జోరుగా సాగుతోంది. డిసెంబర్ 9 నాటికి హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3,78,081 మందితో సంతకాలను సేకరించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మేధావులు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని సంతకాల సేకరణ చేపడుతున్నారు. పార్టీ శ్రేణులు అన్ని ప్రాంతాల్లో సంతకాలు సేకరిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. ● మడకశిర పట్టణంలో 11వ వార్డులో వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, కౌన్సిలర్ రెహానా, 14వ వార్డులో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ సతీష్కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మంగళవారం జరిగింది. అలాగే వైబీ హళ్లి, జమ్మానిపల్లి, కొలిమిపాళ్యం, గౌడనహళ్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్రెడ్డి, రొళ్ల మండలం గొట్టుగుర్కిలో వైఎస్సార్సీసీ జిల్లా ఎస్సీ సెల్ ఈసీ మెంబర్ నాగభూషణ, గుడిబండ మండలం కేకాతి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ●హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలంలోని గలిబిపల్లి, సోమిరెడ్డిపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సయ్యద్ నిస్సార్, వైస్ ఎంపీపీ అంజినరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరించారు. -
రీసర్వే పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో జరుగుతున్న రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ల్యాండ్ సర్వే అధికారులను కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ–సర్వే, పీజీఆర్ఎస్, స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ల జాబితా మ్యాపింగ్, హౌసింగ్, భూసేకరణతో పాటు పాటు రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు , తహసీల్దార్లు , వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ దశల్లో జరుగుతన్న రీసర్వే పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే పనులను ఆర్డీఓలు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్కుమార్, సర్వేశాఖ ఏడీఈ విజయశాంతిబాయి, డీఆర్ఓ రామసుబ్బయ్య తదితరలు పాల్గొన్నారు.కదిరి అర్బన్: రైతులు కలిసిమెలసి వ్యవసాయం చేసుకుంటే సత్వరం అభివృద్ధి చెందుతారని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కదిరి మండల పరిధిలోని కదిరి బత్తలపల్లి రోడ్డులో ఉండే గ్రాండ్ ఈవెంట్ ఫంక్షన్ హాల్లో అతియా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెట్ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సాధికారికత సాధించాలన్నారు. చిన్న కమతాలతో దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యం తక్కువగా ఉంటుందన్నారు. ఎఫ్పీఓ ఉన్న సభ్యులందరూ ఉమ్మడిగా రుణాలు తీసుకుని వ్యవసాయం చేస్తే లాభాలు బాగా వస్తాయన్నారు. నాబార్డు లోన్లు కూడా సులువుగా వస్తాయన్నారు. చియాసీడ్స్, రెడ్గ్రామ్స్ పంటల సాగులో పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువగా వస్తాయని రైతులు వాటిని సాగు చేయాలని సూచించారు. అంతకుముందు పంటల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ సమష్టి వ్యవసాయంతో అభివృద్ధి -
రాప్తాడును రావణ కాష్టంలా మార్చారు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో నిత్యం హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరిగి పోయాయి. ఆమె ఒక లేడీ మాఫియా డాన్గా వ్యవహరిస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండి, అవకాశం లేకపోయినా సొంత మండలం రామగిరిలో ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు సునీత అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మెజార్టీ ఎంపీటీసీలు తమ వైపు ఉన్నా, కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నా మీకు ఏదీ అనుకూలంగా లేదన్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. మీరు కోరిన ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీగా చేసుకోవాలని సూచించారు. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని పరిటాల కుటుంబం గుర్తు పెట్టుకోవాలన్నారు. మజ్జిగ లింగమయ్య హత్యతోనే ప్రారంభమైన పరిటాల కుటుంబ పతనం పాపంపేట దోపిడీతో సంపూర్ణమైందన్నారు. అలా చేస్తే రాజకీయ సమాధే పరిటాల సునీత నలుగురు రిటైర్డ్ తహసీల్దార్లకు జీతాలిస్తూ తమ వద్ద పెట్టుకున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. వివాదాస్పద భూములను గుర్తించి వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ‘నీ మొగుడు నాలుగుసార్లు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యేలైనా రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాలకు ఏమైనా చేసి ఉంటో చెప్పుకోండి’అని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేని చేతగాని కుటుంబం పరిటాల కుటుంబమన్నారు. ఇలా బతికే బదులు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని హితవు పలికారు. లేదంటే మీ ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుని తాము ప్రారంభించి మీ ప్రభుత్వంలో ఆగిన అన్ని పథకాలనూ పూర్తి చేస్తే అప్పుడైనా ప్రజలు ఆదరిస్తారన్నారు. అలాకాకుండా ప్రకాష్రెడ్డిని తిట్టినా, ప్రశ్నించిన వారిని, ఎదిరించిన వారిని హత్యలు చేసుకుంటూపోతే రాజకీయ సమాధి కావడం తథ్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం వ్యాపారంగా మార్చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేలా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందని ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తమ అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 11 లక్షల సంతకాలు అయ్యాయని, ఇందులో రాప్తాడు నియోజకవర్గంలో 70 వేలకు పైగా ప్రజలు సంతకాలు చేశారని వివరించారు. ప్రభుత్వ వైద్యం, విద్య రంగాలను ప్రైవేటీవకరణ, కార్పొరేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, ఆలమూరు ఓబులేసు, మీనుగ నాగరాజు, ఎంపీటీసీ సునీల్దత్తరెడ్డి, కుంటిమద్ది సర్పంచ్ నరేంద్ర, తోపుదుర్తి ఎంపీటీసీ పోతులయ్య, ప్రణిల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. లేడీ మాఫియా డాన్ పరిటాల సునీత సొంత మండలంలో ఎంపీపీని దక్కించుకోలేకపోతున్నావ్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగితే మంచిది అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీపీ ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నాం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
బత్తలపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య వాటాల్లో తేడా రావడంతో వాగ్వాదానికి దిగి డయల్ 100కు ఫోన్ చేసి దొరికిపోయారు. రూ.లక్ష అసలు నోట్లకు రూ.3 లక్షల దొంగ నోట్లు ఇస్తాననే ఒప్పందంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తితో కదిరి వాసి ఒప్పందం చేసుకున్నాడు. అయితే నోట్లు చూడగానే నకిలీగా కనిపిస్తున్నాయని గొడవ పడ్డారు. పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడి ముసుగులో నకిలీ నోట్ల చెలామణి విచ్చలవిడిగా సాగుతోంది. గమనించని కొందరు పర్సెంటేజీలకు ఆశపడి రూ.లక్షల్లో మోసపోతున్నారు. రెండు నెలల క్రితం గోపురం క్రాస్ వద్ద రూ.60 లక్షలు మోసపోయినట్లు తెలిసింది. అయితే బ్లాక్ వ్యాపారం కావడంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముదిగుబ్బ మండలానికి చెందిన రైతు నగేశ్ ఈ ఏడాది ఆరంభంలో కదిరి పట్టణంలోని మార్కెట్ యార్డులో రెండు పొట్టేళ్లను అమ్మాడు. కొనుగోలు చేసిన కేటుగాళ్లు రూ.32 వేలు నకిలీ నోట్లు కట్టబెట్టి పరారయ్యారు. కొత్తచెరువు గొర్రెల సంతలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి నకిలీ నోట్ల మార్పిడి చేసి పరారీ అయ్యాడు. మోసపోయిన బాధితుడు ఆ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా.. బ్యాంకు అధికారులు నకిలీ నోట్లుగా గుర్తించారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో దొంగ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అమాయకులు, రైతులను లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్ల కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ చోట్ల నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్నారు. గమనించని అమాయకులు నకిలీ నోట్లను తీసుకుని మోసపోతున్నారు. ఆ తర్వాత బ్యాంకులకు వెళ్తే.. అక్కడ అవి నకిలీ నోట్లుగా తేలుతున్నాయి. బ్యాంకు అధికారులు చెబితే కానీ.. గుర్తించలేని పరిస్థితి. సంతలే లక్ష్యంగా... కొందరు కేటుగాళ్లు ప్రతి వారం గొర్రెలు, మేకల సంత, పశువుల సంతలను టార్గెట్ చేసి.. జీవాలను కొనుగోలు చేసి నకిలీ నోట్లు కట్టబెట్టి పరారవుతున్నారు. కేవలం దొంగ నోట్ల మార్పిడి కోసం సంతలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్తచెరువు, గోరంట్ల, కదిరి, తనకల్లులో నకిలీ నోట్ల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడిలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. హిందూపురం పట్టణంలో వాణిజ్య వ్యాపారాల పేరుతో పెద్ద మొత్తంలో రూ.200 నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు చేర్చుతున్నట్లు తెలిసింది. రూ.లక్షకు రూ.3 లక్షలు దొంగ నోట్లు రూ.3 లక్షలు కావాలంటే.. రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ లెక్కన మూడింట రెండు వంతుల నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంగా బయటి ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు జిల్లాలో ప్రవేశించారు. నకిలీ నోట్ల కట్టలను.. అసలు నోట్లతో కలిపి చెలామణి చేస్తున్నారు. బెంగళూరు, చైన్నె నుంచి ఒక ముఠా నుంచి నకిలీ నోట్ల కట్టలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి 30 శాతం పర్సెంటేజీతో కొందరు తీసుకొచ్చి.. మార్పిడి చేస్తున్నారు. ఈ లెక్కన రూ.200 నోటుకు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది. పర్సెంటేజీలకు ఆశపడి కొందరు యువత నకిలీ నోట్ల చెలామణి పనిలో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడైతే ఎక్కువగా నగదు సహిత లావాదేవీలు ఉంటున్నాయో.. అక్కడ ఎంట్రీ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. పెద్ద నోట్లు కాదని.. పెద్ద నోట్లతో మోసం జరుగుతోందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూ.500 నోట్లు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. దీంతో నకిలీ నోట్ల మార్పిడి కొంచెం కష్టంగా మారడంతో చాలామంది రూ.200 నోట్లపై పడినట్లు తెలిసింది. హిందూపురం పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాల విషయంలో రూ.200 నోట్ల కట్టలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు కలపడంతో మోసపోయిన ఘటనలు ఇటీవల కాలంలో నాలుగైదు వెలుగు చూశాయి. జిల్లాలో జోరుగా నకిలీ నోట్ల దందా రూ.లక్షకు మూడు లక్షల చెల్లింపు బత్తలపల్లిలో ఇద్దరి అరెస్టు -
సంతకం.. సమరనాదం
సాక్షి నెట్వర్క్: మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నిరుపేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు నినదించారు. వైద్యం, విద్య ప్రజల హక్కు అని, ఆ హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాయొద్దని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకు సాగితే తమ సత్తా చూపుతామని కోటి సంతకాలతో సమరనాదం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లా అంతటా ముమ్మరంగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ నాయకులు వైద్య కళాశాలలపై సర్కారు కుట్రను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. వైద్య కళాశాలలను పరిరక్షించుకునేందుకు విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలూ ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ● కదిరి నియోజకవర్గం ఎన్పీకుంట మండలం వెలిచలమల, పడమర నడిమిపల్లి పంచాయతీల్లో సోమవారం వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవిందునాయక్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ● పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం ఎంబీక్రాస్లో పార్టీ మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్వంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించారు. ● పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంజలి ఆధ్వర్యంలో అమరాపురం మండలం చిట్నడకు, ఆలదపల్లిలో చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. ఊరూరా సాగుతున్న కోటి సంతకాల సేకరణ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్న ప్రజలు -
కేజీబీవీలో కలెక్టర్ తనిఖీలు
మడకశిర రూరల్: మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న కేజీబీవీని సోమవారం రాత్రి కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రగతి, భోజనంలో నాణ్యతపై ఆరా తీశారు. వంట గది, స్టోర్ రూంతో పాటు నిల్వ ఉంచిన కూరగాయలు, అరటిపండ్లు పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ఉన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఎమ్మెల్యే తనిఖీ చేసిన సమయంలో ఎస్ఓ అందుబాటులో లేకపోవడం, పాఠశాలలో నాణ్యమైన భోజనం సక్రమంగా అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముగ్గురికి షోకాజ్ కేజీబీవీలో నెలకొన్న సమస్యలపై మండల విద్యాధికారి అందించిన నివేదిక ఆధారంగా ఎస్ఓతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష పీఓ దేవరాజు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఎంఈఓ భాస్కర్ సోమవారం రాత్రి వెల్లడించారు. -
సర్వే చేయలేదంటూ షోకాజ్ నోటీసులు
మీమాంసలో ఎనర్జీ అసిస్టెంట్లు అనంతపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాలపై సర్వే చేయలేదంటూ ఎనర్జీ అసిస్టెంట్లకు జిల్లా సచివాలయ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకరిద్దరు కాదు... ఏకంగా 137 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలవరానికి తెరలేపింది. పేరుకు మాత్రమే సచివాలయం విధులు ఎనర్జీ అసిస్టెంట్లు పేరుకు మాత్రమే సచివాయల ఉద్యోగులే అయినా పని మొత్తం విద్యుత్ శాఖలోనే చేయాల్సి ఉంటుంది. ఉదయం సచివాలయంలో ముఖ హాజరు వేసుకున్న అనంతరం సాయంత్రం వరకూ విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తుంటారు. దీనికి అదనంగా ప్రతి రెండు రోజులకు ఒకసారి నైట్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వే చేయాల్సిన పని లేదంటూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల చెప్పడంతో ఆ మేరకు ఎనర్జీ అసిస్టెంట్లు సర్వేకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయాల పరిధిలోని కుటుంబాలకు కౌశలం, సిటిజన్ ఈకేవైసీ, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్పై డోర్ టూ డోర్ సర్వే చేయలేదని జిల్లా వ్యాప్తంగా 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు జిల్లా సచివాలయ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3న షోకాజ్ నోటీసులు అందుకున్న ఎనర్జీ అసిసెంట్లు ప్రస్తుతం తాము సంజాయిషీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సచివాలయ అధికారికి సంజాయిషీ ఇవ్వాలా? లేదంటే విద్యుత్ శాఖ ఎస్ఈకి సంజాయిషీ ఇవ్వాలో స్పష్టత లేకుండా పోతోంది. సర్దుబాటు చర్యల్లో భాగంగా మండలాల్లో పనిచేస్తున్న చాలా మంది ఎనర్జీ అసిస్టెంట్లను అనంతపురం నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లకు విద్యుత్ శాఖ అధికారులు బదిలీ చేశారు. వీరికి సర్వే చేయాలనే అంశంపై ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అయినా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఉద్యోగాలకు ఎలాంటి ముప్పులేదు వాస్తవానికి వారు ఎనర్జీ అసిస్టెంట్లు కాదు (జేఎల్ఎం గ్రేడ్–4) ఉద్యోగులు. విద్యుత్ శాఖ విధులంటే 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వేలు చేయరని ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఎనర్జీ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం జిల్లా సచివాలయ అధికారికి లేదు. జీతం మేమే చెల్లిస్తున్నాం, పనులు మేమే చేయించుకుంటున్నాం కాబట్టి ఆ అధికారం మాకే ఉంది. ప్రస్తుతం అందుకున్న నోటీసులకు సంజాయిషీ మాత్రమే ఇవ్వండి. వారి ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు. – శేషాద్రి శేఖర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ జిల్లాలో 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు ఎవరికి సంజాయిషీ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి గగ్గోలు పెడుతున్న ఎనర్జీ అసిసెంట్లు -
సారూ..సమస్యలు తీర్చండి
ప్రశాంతి నిలయం: ‘‘నెలల తరబడి తిరుగుతున్నాం...ఇక్కడే రెండు, మూడు సార్లు అర్జీలిచ్చాం. అయినా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మాపై దయతలచి సమస్యలు తీర్చండి సారూ’’ అంటూ జనం కలెక్టర్ శ్యాంప్రసాద్కు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 331 అర్జీలు సమర్పించారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. గడువులోపు అర్జీలన్నీ పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని సమస్యలుంటే అర్జీదారుకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ, ఇన్చార్జ్ డీఆర్ఓ రామసుబ్బయ్య, డీఆర్డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు. ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్కు వినతుల వెల్లువ వివిధ సమస్యలపై 331 అర్జీలు -
మీ అభిమానం మరువలేను
మడకశిర: ‘‘మీరు పలికిన ఈ అపూర్వ స్వాగతం చూసి నాకు నోట మాట రావడం లేదు... ఈ ప్రేమ, అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను’’ అంటూ భారత అంధ మహిళల క్రికెట్ టీ–20 కెప్టెన్ ఆనందభాష్పాలు రాల్చారు. ప్రపంచ కప్పు సాధించిన తర్వాత తొలిసారి ఆమె మడకశిరకు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. వేలాది మందితో రాజీవ్గాంధీ సర్కిల్ నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిర ప్రజలు, విద్యార్థులు దీపికపై పూల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన దీపికకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమే మంత్రి సవిత మాట్లాడుతూ... విద్యార్థులు దీపికను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమేనని దీపిక నిరూపించిందన్నారు. ఆమె సాధించిన విజయం దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి పని చేయాలన్నారు. సినీ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ దీపిక దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని కోరారు. అపూర్వ స్వాగతంతో దీపిక ఆనందభాష్పాలు ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు, అధికారులుఆర్థిక సాయం..10 సెంట్ల స్థలం దీపికకు జిల్లా కేంద్రం పుట్టపర్తిలో 10 సెంట్ల స్థలాన్ని ఇస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. అలాగే మడకశిర నియోజకవర్గం తరఫున రూ. 2 లక్షలు, యాదవ సంఘం తరఫున మరో రూ. 2 లక్షలను చెక్కుల రూపంలో అందించారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు కూడా దీపికకు ఆర్థిక సాయం అందించారు. మడకశిరలోని ఇండోర్ స్టేడియానికి దీపిక పేరు పెట్టాలని పలువురు స్థానికులు కోరారు. -
సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దాం
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పిలుపు ప్రశాంతి నిలయం: దేశ రక్షణ కోసం ప్రాణం పెట్టే సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ సాయుధ దళాల పతాక నిధికి తమ వంతు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సైనికులు త్యాగాలకు దేశ ప్రజలందరూ రుణపడి ఉండాలన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విరివిగా సైనికులు కుటుంబాల సంక్షేమం కోసం విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగులతో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు. పల్స్ పోలియోను విజయవంతం చేయండి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ‘పల్స్ పోలియో’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 0 నుంచి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 21వ తేదీని బూత్లలో పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు 22, 23 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వేయాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలి బాల్యవివాహాలను అరికట్టి బాలికలకు బంగారు భవిష్యత్ ఇచ్చేందుకు అందరూ పాటుపడాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ‘బాల్య వివాహ ముక్తు భారత్’ 100 రోజుల కార్యక్రమానికి సంబంధించి ‘బాల్య వివాహం అపుదాం–దేవుని కృపను పొందుదాం’ అనే నినాదంతో తయారు చేసిన బాల్య వివాహాల వ్యతిరేక వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి అధికారి, క్షేత్రస్థాయి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఎవరైనా బాల్య వివాహానికి పూనుకుంటే వెంటనే 1098 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
గంగమ్మ ఆలయ ఈఓకు రిమాండ్
● అమ్మవారి సొత్తు కాజేసేందుకు ప్రయత్నించిన ఫలితం కదిరి అర్బన్: గంగమ్మ అమ్మవారికి భక్తులు కానుక రూపంలో అందజేసిన సొత్తును కాజేసేందుకు ప్రయత్నించి దొరికిపోయిన ఆలయ ఈఓ మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. సోమవారం కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణస్వామి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అక్రమంగా ఆటోలో తరలిస్తూ... కదిరి మండల పరిధిలోని యర్రదొడ్డిలో వెలసిన గంగమ్మ తల్లికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 5 కేజీల వెండి, 1.980 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 చీరలు ఈఓ మురళీకృష్ణ ఈ నెల 7న అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూ. 6,23,600 విలువైన అమ్మవారి సొత్తును ఈఓ అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆటో సహా పోలీస్స్టేషన్ తరలించారు. అనంతరం పోలీసులు ఈఓ మురళీకృష్ణను విచారించారు. సొమ్ము తరలింపునకు అనుమతి పత్రాలు కోరగా..అలాంటివేమీ లేవన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల లిఖిత, మౌఖిక అనుమతి లేకుండా...రికార్డుల్లో నమోదు చేయకుండా భక్తులు సమర్పించిన కానుకలు తరలించడం నేరమని పోలీసులు తెలిపారు. అనంతరం దేవదాయశాఖ తనిఖీ అధికారి ప్రసాద్ (హిందూపురం) ఫిర్యాదు మేరకు ఈఓ మురళీకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. సీఐ నిరంజన్రెడ్డి, పలువురు పోలీసులు పాల్గొన్నారు. -
కియాలో కమాండోల మాక్డ్రిల్
పెనుకొండ రూరల్: ఉగ్రవాదులు దాడి చేస్తే వారిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఆత్మరక్షణ ఎలా పొందాలి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా బాధితులను ఎలా రక్షించాలి అనే అంశాలపై కియా పరిశ్రమలో ఆక్టోపస్ కమాండోలో సోమవారం అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసే విధానంతో పాటు ఉగ్రవాదులు చొరబడిన భవనం, పరిసరాలు లోపలకు, బయటకు వెళ్లే మార్గాలు, భవనంలో ఎంతమంది చిక్కుకుపోయారు. బాంబులను అమర్చారా? సీసీ కెమరాల ద్వారా అనుమానితులను గుర్తించే అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఆపరేషన్ పాల్కాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రణాలిక ప్రకారం తొలుత ఐదుగురు ఉగ్రవాదులు పరిశ్రమలోని అడ్మిన్ విభాగంలోకి చొరబడటం, సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపే విధానం రక్తి కట్టించారు. సమాచారం అందుకున్న ఆక్టోపస్ కమాండోలు వ్యూహాత్మకంగా పరిశ్రమలోకి ప్రవేశించే విధానం బందీలుగా ఉన్న కార్మికులను రక్షించే విధానం చూపరులను గగుర్పాటుకు గురి చేసింది. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. కార్యక్రమంలో కియా పరిశ్రమ సీఎస్ఓ మధుసూదన్, ఆక్టోపస్ డీఎస్పీ జగ్గునాయుడు, బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్, కియా పీఎస్ ఎస్ఐ రాజేష్, సెక్యూరిటీ ఇన్చార్జ్,నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి టెట్
● జిల్లా నుంచి హాజరుకానున్న 4,529 మంది అభ్యర్థులు ● పుట్టపర్తిలో ఓ కేంద్రం, బెంగళూరులో మరో కేంద్రం ఏర్పాటు పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ (ఏపీటెట్ అక్టోబర్ 2025) బుధవారం నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 10 తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా నుంచి 4,529 మంది అభ్యర్థులు ‘టెట్’కు హాజరుకానుండగా..పుట్టపర్తిలో ఒకటి, బెంగుళూరులో ఒకటి చొప్పున రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలోనికి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు హాల్టికెట్లో పాటు గుర్తింపు కార్డు తీసుకొని గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని డీఈఓ సూచించారు. వైభవంగా వసంతోత్సవం● ముగిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మడకశిర రూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వసంతోత్సవం, చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి పురోహితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవదాయశాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, వైఎస్సార్సీపీ నాయకులు మంజునాథ్, సుధీర్రెడ్డి, రాజశేఖర్, నగేష్, సర్పంచ్ రంగనాథ్ తదితరులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్ ధర్మవరం అర్బన్: పట్టణంలోని క్రీడా మైదానంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం క్రీడామైదానంలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ గురించి ఈనెల 7వ తేదీన ‘ధర్మవరంలో టీ–3 బెట్టింగ్’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన డీఎస్పీ హేమంత్కుమార్ సోమవారం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహణలో ఇంకెవరి ప్రమేయం ఉందన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఫ్లెక్సీ మీద పడి ఇద్దరికి తీవ్రగాయాలు
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో టీడీపీ నేతలు అనధికారికంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ మీదపడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని బళ్లారి బైపాస్ చౌరస్తా.. 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రధాన అనుచరులు రమేష్, నలుబోలు మధుతో పాటు పలువురు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఒకటి గాలికి ఎగిరి అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లికి చెందిన సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డిపై కుప్పకూలింది. ఐరన్ ఫ్రేమ్ నుదిట్లోకి దూసుకెళ్లడంతో సంజీవరెడ్డి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడు. శ్రీనివాసరెడ్డి తలకు బలమైన గాయమై అరగంటకు పైగా అపస్మారకంగా రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సర్వజనాస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు సంజీవరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, గాలికి ఊగుతున్న భారీ ఫ్లెక్సీని తొలగించాలని పలుమార్లు టీడీపీ నేతలకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు. చివరకు నగర పాలక సంస్థ అధికారులకు తెలిపినా వారు కూడా పట్టించుకోలేదన్నారు. చివరకు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు ప్రాణాలు బలయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. రూ.2.5 కోట్ల విలువైన సామగ్రి దగ్ధం తాడిపత్రి రూరల్: స్థానిక కడప రోడ్డులోని మల్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న లిక్కీ ఇంటీరియర్ దుకాణంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని రూ.2.5 కోట్ల విలువైన ప్లైవుడ్ కాలి బూడిదైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. యజమాని మోహన్ నుంచి సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కౌన్సిలర్ చేతిలో ఓడిపోయిన స్థాయి నీది
కదిరి: ‘స్థానిక మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ఉన్న అత్తార్ చాంద్బాషా చేతిలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నువ్వు ఏ అర్హత ఉందని మా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి గురించి మాట్లాడుతావ్?’ అంటూ కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్పై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కౌన్సిలర్ రాంప్రసాద్తో కలసి సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నకిలీ డీడీల కేసులో శిక్ష పడిన ఖైదీ నువ్వు. నేరాలకు కేరాఫ్ అడ్రెస్ నీది. అలాంటి నువ్వు నీతులు మాట్లాడితే జనమే కాదు.. మీ పార్టీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ తరఫున ఎంఎస్ పార్థసారథికి టికెట్ ఇస్తే ఆయనను మోసగించావ్. అప్పట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి నువ్వు కూడా ఓడిపోతివి. తర్వాత 2009లో ప్రజారాజ్యం తరఫున సిద్దారెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో నువ్వు ఓటమి నుంచి బయట పడ్డావు. లేదంటే అప్పుడు కూడా నీకు గెలుపు లేదు. ఆ తర్వాత 2014లో ‘ఆఫ్ట్రాల్ కౌన్సిలర్’ అని నువ్వు పదే పదే ఎద్దేవా చేసిన చాంద్బాషా చేతిలో ఓడిపోతివి. మళ్లీ వరుసగా 2019లోనూ మా పార్టీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయావు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా మూడు పార్టీలు కలిస్తే నీకు వచ్చింది కేవలం 6 వేల మెజార్టీ. ఇది నీ రాజకీయ చరిత్ర. మదమెక్కి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. జాగ్రత్త. మరోసారి వైఎస్ జగన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ స్థాయికి తగ్గ సమాధానమే ఇస్తాం’ అని ధ్వజమెత్తారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది జరిగింది. కానీ మీ హయాంలో జరిగిన అభివృద్ది ఏంటో చెప్పండి. దీనిపై బహిరంగ చర్చకు సిద్దం’ అని సవాల్ విసిరారు. హిందూపూర్ క్రాస్ నుంచి కోనేరు సర్కిల్ వరకూ నిత్యం ట్రాఫిక్ జామ్ కావడానికి ఎమ్మెల్యే కందికుంటనే కారణమన్నారు. కదిరి నుంచి ఎన్పీ కుంట వరకూ రోడ్డు 3 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి 18 నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. కందికుంటపై పూల శ్రీనివాసరెడ్డి ఫైర్ -
ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
సోమందేపల్లి: ‘‘వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి. అప్పుడు పేదలకు మెరుగైన వైద్యసేవలు.. నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కుతాయి. అలా కాకుండా చంద్రబాబు చెప్పినట్లు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఇప్పుడు ‘ఇండిగో’ సంస్థ లాగే ఆ ప్రైవేటు సంస్థలు నిరంకుశంగా వ్యవహరిస్తాయి. తద్వారా నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజ్లను ప్రైవేటీకరణ చేస్తోందని, తద్వారా వైద్య విద్యను నిరుపేదలకు అందని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ‘ఇండిగో’ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కేంద్రం ఆదేశాలు ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఇండిగో’ సంస్థ సర్వీసులు నిలిపివేయడంతో లక్షలాది మంది ఇబ్బంది పడ్డారని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువుపోయిందన్నారు. రేపు మెడికల్ కళాశాలలను ప్రైవేటికిచ్చినా ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు. అందువల్లే వైఎస్సార్ సీపీ నిరుపేదల పక్షాన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, వైస్ సర్పంచ్ వేణు, వైస్ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రఫీక్, సర్పంచ్ జిలాన్, నాయకులు ఆదినారాయణరెడ్డి, నరసింహమూర్తి, మంజు, ప్రభాకర్రావు, శ్రీనివాసరెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి ‘ఇండిగో’ సంస్థ మొండి వైఖరితో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారని, ఈ అంశంలో టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆయన అసమర్థతతో భారత్ తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీజీసీఏ దిగివచ్చే దాకా ఇండిగో సంస్థ మొండిగా వ్యవహరించిందంటే వారి ధైర్యం ఏమిటో సదరు మంత్రే చెప్పాలన్నారు. విమానాలు రద్దయి లక్షల మంది విమానాశ్రయాల్లో గగ్గోలు పెడుతుంటే కేంద్ర మంత్రి జాతీయ మీడియాకు కూడా సమాధానం చెప్పకుండా రీల్స్ చూసుకుంటున్నారంటే పాలనపై ఎటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. వెంటనే రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి పీపీపీ అంటూ ప్రైవేటుకిస్తే ‘ఇండిగో’లాగే ఉంటుంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ప్రమాదంలో యువకుడి మృతి
గుత్తి రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన దోణప్ప, భూదేవి దంపతుల కుమారుడు నల్లారెడ్డి (32)కి భార్య సునీత, కుమార్తె రమ్య ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ కూలి పనులతో పాటు గుత్తిలో మొబైల్ సిమ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రెండో సారి గర్భం దాల్చి ఏడు రోజుల క్రితం అనంతపురంలోని ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. సోమవారం డిశ్చార్జ్ ఉండడంతో సాయంత్రం గుత్తిలో తన ద్విచక్ర వాహనాన్ని ఆపి, అనంతపురానికి వెళ్లి రాత్రికి భార్య, చిన్నారిని తీసుకుని కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో కారు గుత్తికి చేరగానే నల్లారెడ్డి దిగి ద్విచక్ర వాహనం తీసుకువస్తానని భార్యకు తెలిపి వారిని సాగనంపాడు. అనంతరం తన బైక్ తీసుకుని కారును అనుసరిస్తూ లచ్చానుపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న వారు గమనించి, వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనతో భార్య, కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ప్రసవించిన భార్య, నవజాత శిశువుతో ఇంటికి వెళుతుండగా ఘటన -
ప్రోత్సాహం కరువైనా.. ఆదుకున్న మార్కెట్
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా... నేటికీ పట్టు రైతులకు ప్రోత్సాహకాలు అందలేదు. బైవోల్టిన్ పట్టుగూళ్లు ప్రతి కిలోపై రూ.50 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాల్సి ఉంది. ఈ 18 నెలల కాలంలో నయా పైసా కూడా ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు రూ.90 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్లో గూళ్ల ధరలు పెరగడంతో పట్టు రైతులకు ఉపశమనం లభించింది. మడకశిర: రాష్ట్రంలోనే బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా రైతులు ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం హిందూపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి తదితర పట్టుగూళ్ల మార్కెట్లలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.600 లోపే ఉండగా, ప్రస్తుతం రూ.800తో అమ్ముడు పోతోంది. కర్ణాటకలోని రామ్నగర్ మార్కెట్లో కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.900కు పైగా పలుకుతోంది. దీంతో న్యాయబద్ధంగా తమకు అందాల్సిన ప్రోత్సాహాకాలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. మార్కెట్ తమను ఆదుకుటోందని పట్టు రైతులు పేర్కొంటున్నారు. పట్టు రైతులకు ప్రోత్సాహకాలు అందించని చంద్రబాబు ప్రభుత్వం ధరల పెరుగుదలతో పట్టు రైతులకు దక్కిన ఊరట -
జిల్లాకు అందాల అతిథులు
అనంతపురం: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి రివ్వున ఎగురుతూ వచ్చిన అందాల అతిథులు ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తున్నాయి. ప్రకృతి సోయగాలను రెట్టింపు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇందులో బుల్లి పిట్ట ’ఉల్లంకి’ మొదలు, రంగురంగుల వివిధ జాతుల పక్షులు ఉన్నాయి. ఇప్పటికే స్థానికంగా 220 రకాల పక్షి జాతులను ఎస్కేయూలోని జువాలజీ విభాగం పరిశోధకులు గుర్తించగా... తాజాగా 32 జాతులకు చెందిన విదేశీ పక్షులు ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తున్నట్లు నిర్ధారించారు. వీటి కిలకిలరావాలు, అందాలు, సందడి జిల్లా వాసులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి. ఆహారం.. సంతానోత్పత్తి కోసమే.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం పరిశోధన విద్యార్థుల సర్వే ప్రకారం ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వీటిలో రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 32 జాతులకు చెందిన వలస జాతి పక్షులు ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని చిత్రావతి, సంగమేశ్వరం, పెన్నా, హగరి నదీ తీరాలతో పాటు.. శింగనమల మండలం తరిమెల గ్రామ పరిసరాల్లో విడిది ఏర్పాటు చేసుకున్నాయి. కాగా, ఆయా దేశాల్లో శీతాకాలంలో తీవ్రమైన చలి నుంచి తప్పించుకోవడంతో పాటు సంతానోత్పత్తి కోసం ఈ పక్షులు వలస వచ్చినట్లుగా పరిశోధక విద్యార్థులు గుర్తించారు. సందడి చేస్తున్న అరుదైన పక్షుల్లో కొన్ని ● సాండ్ పైపర్.. తెలుగులో ఉల్లంకి పిట్ట, చిట్టి తుర్రి అంటారు. యూరప్, మధ్య ఆసియా నుంచి వలస వచ్చాయి. నీటి అంచున బుడిబుడిగా నడుస్తూ పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ●లిటిల్ స్టింట్.. తెలుగులో చిన్న ఉల్లంకి అని అంటారు. రష్యా, సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చాయి. ఇవి కూడా నీటి అంచున సంచరిస్తూ కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ●లిటిల్ రింగెడ్ ప్లోవర్.. తెలుగులో చిన్న వలయ ఉల్లంకి అంటారు. నీటి పరివాహక ప్రాంతాలు, వంకలు, వాగులతో పాటు మెట్ట ప్రాంతాల్లోనూ సంచరిస్తూ పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ● నార్తర్న్ పిన్టైల్ పక్షి (సూది తోక బాతు).. ఇప్పటికే ధర్మవరం చెరువు, సంగమేశ్వరం, పెన్నా, చిత్రావతి, హగరి నదులతో పాటు తరిమెల గ్రామంలోని నీటి వనరుల్లో కనిపిస్తున్నాయి. నీటిలో ఈదుతూ జలచరాలను ఆహారంగా తీసుకుంటాయి. ● రోజీ స్టార్లింగ్.. దీనిని గులాబీ గోరువంక అని కూడా పిలుస్తారు. ప్రధానంగా పంటలకు నష్టం కలిగించే మిడతలు, పురుగులు, ఇతర కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో వీటిని రైతుల పాలిట మిత్రులుగా పరిగణిస్తారు. ఉమ్మడి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో విదేశీ పక్షుల సందడి 32 జాతులకు చెందిన విదేశీ పక్షుల రాక స్థానికంగా 220 రకాల పక్షిజాతుల గుర్తింపు ఫిబ్రవరి చివరి వరకు కనువిందు చేయనున్న పక్షులు పది రోజుల నిర్విరామ ప్రయాణంతో 13 వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి కేవలం పది రోజుల్లోనే ఉమ్మడి జిల్లాకు విదేశీ పక్షులు చేరుకుంటాయి. రష్యా, సైబీరియా, ఆసియా ప్రాంతాల నుంచి సముద్రమట్టానికి 8 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ హిమాలయాల మీదుగా వలస వచ్చిన ఈ పక్షులు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. – డాక్టర్ వి.బాలసుబ్రహ్మణ్యం, జువాలజీ విభాగం అధ్యాపకుడు, ఎస్కేయూ -
ట్రాక్టర్ బోల్తా – యువకుడి దుర్మరణం
మడకశిర రూరల్: ప్రమాదవశాత్తు రోటావేటర్ కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గుడిబండ మండలం పీసీ గిరి గ్రామానికి చెందిన బండిమనే తిప్పన్న కుమారుడు యంజేరప్ప (31)కు కోతులగుట్ట గ్రామానికి చెందిన గాయత్రితో వివాహమైంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రెప్గా పనిచేస్తున్న యంజేరప్ప.. ఇటీవల భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కుటుంబంతో కలసి అత్తారింటికి వచ్చాడు. ఆదివారం ఇంటి పట్టున ఖాళీగా ఉండలేక బామ్మర్ది మల్లికార్జునగౌడ్తో కలసి పొలానికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమై.. హంద్రీనీవా కాలువ వద్ద ఇంటికి వెళ్లే మలుపులో ట్రాక్టర్ను తిప్పుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. డ్రైవర్ పక్కన కూర్చొన్న మల్లికార్జున పక్కకు దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ నడుపుతున్న యంజేరప్ప రోటోవేటర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. బాధిత కుటుంబానికి పరామర్శ గుడిబండ: ప్రమాదంలో మృతిచెందిన యంజేరప్ప మృతదేహానికి రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, రొళ్ల మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నరసింహారెడ్డి, పలువురు నాయకులు నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న వారు ఆదివారం మృతుడి నివాసానికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. -
దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది
విజయం సాధించాలనే సంకల్పం ఉంటే క్రీడలు, చదువులో రాణించడానికి పేదరికం ఎన్నడూ అడ్డంకి కాదు. ఉమ్మడి జిల్లాకు చెందిన బోయ బాబు విషయంలో ఇది నిజమని తేలింది. కడు పేదరికం నుంచి వచ్చి... ఆర్టీటీ సహకారంతో ఓ వైపు చదువులు, మరో వైపు క్రీడల్లో రాణిస్తూ నేడు జిల్లా గర్వించే క్రీడాకారుడిగా ఎదిగిన బోయ బాబు విజయ ప్రస్తానం ఆయన మాటల్లోనే... – పుట్టపర్తి అర్బన్: మాది అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అమ్మ ఓబులమ్మ వ్యవసాయ కూలి పనులకు పోతోంది. నాన్న చెన్నప్ప కంకర రాళ్లు కొట్టే పనికి పోతుంటాడు. రోజంతా వారు కష్టపడితే తప్ప కుటుంబం గడిచేది కాదు. రాళ్లు కొట్టే క్రమంలో నాన్న, వ్యవసాయ కూలి పనుల్లో అమ్మ తరచూ గాయపడేవారు. అయినా ఆ బాధ నాకు తెలియకుండా వారు నన్ను పెంచారు. ఎలాగైనా బాగా చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి అమ్మా, నాన్నను బాగా చూసుకోవాలని అనుకున్నా. ఆటనే ఈ స్థాయికి చేర్చింది పేదరికం కారణంగా నాకు చదువులు, ఉద్యోగ అవకాశాలు ఉండవని అనుకున్నా. ఈ బాధను మరచిపోయేలా పరుగు తీయడం మొదలు పెట్టా. ఈ క్రమంలోనే బంతిని కాలితో కంట్రోల్ చేస్తూ నా స్నేహితులకు అందకుండా పరుగు తీస్తుండడం గమనించిన టీచర్లు నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో ఆర్డీటీ సంస్థ దేవుడిలా ఆదుకుంది. ఫుట్బాల్ అకాడమీలో చేర్చుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సహించింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అక్కడే చదువుకున్నా. తిరిగి ఆర్డీటీ సహకారంతోనే అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో ఆ ట్రస్ట్ విద్యాసంస్థలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్బాబు, పీడీ శ్రీనివాసులు నన్నెంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మైదానంలో కీలకం ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్న బోయ బాబు జాతీయ స్థాయిలో పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యంఫుట్బాల్ మైదానంలో లెఫ్ట్ వింగ్ బ్యాక్లో ప్రధానంగా ప్రత్యర్థి క్రీడాకారులను డిఫెన్స్ చేస్తూ అటాకింగ్లో సహాయపడుతుంటా. అలాగే లెఫ్ట్ కార్నర్ నుంచి బంతిని గోల్లోకి పంపే ముఖ్యమైన అటాకింగ్ స్థానం కూడా నాదే కావడం ఎంతో గర్వంగా ఉంది. ఆర్డీటీ ఫుట్బాల్ అకాడమీ, బెంగళూరు యూత్ ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ పొందాను. 2016–17లో ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నీలో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించా. 2017–20 వరకూ అస్సాం ఫుట్బాల్ అసోసియేషన్ తరపున ఆడాను. 2022–23లో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు తరఫున ఆలిండియా ఫుట్బాల్ టోర్నీలో ఆడి జట్టు విజయంలో కీలకంగా మారాను. 2023 నుంచి ఇప్పటి వరకూ ఎస్కే యూనివర్సిటీ తరఫున సౌత్జోన్ జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నా. ఈ నెల 5 నుంచి విజయవాడ వేదికగా జరుగుతున్న సంతోష్ ట్రోఫీలో ఏపీ జట్టు తరఫున పాల్గొంటున్నా. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. ఇందుకు దాతలు ఎవరైనా సహకరించాలని కోరుకుంటున్నా. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతుల ఉత్సవానిన వైభవంగా నిర్వహించారు. జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయం నుంచి కంబాల నరసింహస్వామి ఆలయం వరకూ ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు భక్తిశ్రద్దలతో జ్యోతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉయ్యాలోత్సవం, శయనోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు హుండీ లెక్కింపు: జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ నరసింహరాజు ఆదివారం వెల్లడించారు. అలాగే మంగళవారం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల ఢీ – వ్యక్తి మృతి బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లిలో వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాసినేని చంద్రమౌళి(65)కి భార్య శకుంతల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం బెళుగుప్పలో దుకాణానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేసి, రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామి ఢీకొనడంతో చంద్రమౌలితో పాటు తిప్పేస్వామి, ఆయన భార్య భూలక్ష్మి రోడ్డుపై పడ్డారు. చంద్రమౌళి తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పగాయాలతో తిప్పేస్వామి, భూలక్ష్మి దంపతులు బయటపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చంద్రమౌళిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తిప్పేస్వామికి కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మందపై దూసుకెళ్లిన వాహనం
●45 గొర్రెల మృతిబెళుగుప్ప: మండలంలోని కాలువపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గొర్రెల మందపై ట్యాక్సీ దూసుకెళ్లిన ఘటనలో 45 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుతో గొర్రెల పెంపకాన్ని చేపట్టాడు. మేపు కోసం ఇతర ప్రాంతాలనకు మందను తోలుకెళ్లిన ఆయన కాపరులతో కలసి తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున కాలువపల్లి వద్దకు చేరుకున్నాడు. జాతీయ రహదారిపై రోడ్డుకు పక్కగా గొర్రెలను తోలుకెళుతూ మార్గమద్యంలో వంతెనను దాటిస్తుండగా.. వెనుక నుంచి మందపైకి శరవేగంగా ఓ ట్యాక్సీ దూసుకెళ్లింది. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సింధనూరు జాతికి చెందిన 45 గొర్రెలు మృతి చెందాయి. కళేబరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఘటనతో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని బాధితుడు నాగేశ్వరరరెడ్డికి ధైర్యం చెప్పారు. జీవనాధరమైన పొలాన్ని విక్రయించి, గొర్రెల పోషణ చేపట్టిన రైతు నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటూ గ్రామస్తులతో కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మూడు గంటలకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ రూరల్ సీఐ మహానంది, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, బెళుగుప్ప ఎస్ఐ శివ తదితరులు అక్కడకు చేరుకుని ఆందోళకారులతో మాట్లాడి, న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. ఘటనపై గొర్రెల యజమాని నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వీడని ముగ్గురు మిత్రుల అదృశ్యం మిస్టరీ
రాప్తాడురూరల్: రాప్తాడు మండలం చిన్మయనగర్లోని ఎల్ఆర్జీ స్కూల్లో పదో తరగతి చదువుతూ అదృశ్యమైన ముగ్గురు స్నేహితుల మిస్టరీ నాలుగు రోజులవుతున్నా ఆచూకీ లభించలేదు. పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఎం.సుధీర్, తాడిపత్రి మండలం వంగనూరుకు చెందిన గంగుల దీపక్కుమార్, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం చెన్నమనాయనికోటకు చెందిన జి.ఆంథోని ప్రకాష్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 5న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. సమీప ప్రాంతాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించింది. మరో బృందం బెంగళూరుకు వెళ్లింది. ఆరోజు ఏమి జరిగిందంటే... ముగ్గురు స్నేహితులు హాస్టల్లో ఉంటూ ఓ విషయంపై వాదనకు దిగి కారు అద్దాలు పగులకొట్టారు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విషయం చెప్పి వెంటనే వచ్చి మాట్లాడాలని చెప్పింది. తమ కుటుంబ సభ్యులు వస్తే ఎక్కడ ఇబ్బంది పడతామోననే భయంతో అదేరోజు ఇంటర్వెల్ సమయంలో తరగతి గది నుంచి వెళ్లిపోయారు. గుర్తించిన యాజమాన్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోయింది. అదేరోజు రాప్తాడు పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు అదృశ్యమైన ముగ్గురు స్నేహితుల్లో దీపక్కుమార్, ఆంథోని ప్రకాష్ ఇద్దరూ వారి తల్లిదండ్రులకు ఏకై క కుమారులు. మరో విద్యార్థి సుధీర్కు అన్న ఉన్నాడు. ఈ పిల్లలు మిస్సింగ్ అయ్యారని తెలిసిన రోజు నుంచి తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. కూలినాలి చేసుకుంటూ ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలను చదివిస్తున్నామని వాపోతున్నారు. మూడు నెలల్లో వార్షిక పరీక్షలు ఉన్న సమయంలో ఇలా అదృశ్యం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆశలను అడియాసలు చేయొద్దని పిల్లలను వేడుకుంటున్నారు. తెలిసో తెలియకో చేసిన తప్పుగా క్షమిస్తామని, ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలని, చదువు ఇష్టం లేదంటే ఇంటికి రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు, స్కూల్ యాజమాన్యం ఓవైపు తిరుగుతుండగా, మరోవైపు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా ఊరూరు తిరుగుతున్నారు. నాలుగు రోజులవుతున్నా ఆచూకీ లభించని వైనం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందం తీవ్ర ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు -
ఇసుక తరలింపు అడ్డగింత
శింగనమల: మండల పరిధిలోని పెన్నా నది, వంకలు, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా జిల్లా మైనింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శనివారం రాత్రి ఇసుక రీచ్ల్లో తనిఖీలు చేపట్టారు. తరిమెల పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా లోడు చేస్తున్న హిటాచీ, ఇసుకతో వెళుతున్న టిప్పరును సీజ్ చేశారు. ఇసుక అక్రమ డంప్లోకి తరలిస్తున్న ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న రెరండు ట్రాక్టర్లు, రెండు టిప్పర్లను అదుపులోకి శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయ్కుమార్ మాట్లాడుతూ... ఇసుక, ఎర్రమట్టి తరలింపులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇప్పటికే గార్లదిన్నె మండలంలో 11 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తుండగా మైనింగ్ అధికారులు అడ్డుకుని, వాహనాలను అప్పగించారని వివరించారు. హంద్రీ–నీవా కాలువలో వ్యక్తి గల్లంతు ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ నీవా కాలువలో ఆదివారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. అయితే అతను ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. కాగా, మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతుండే పంపనూరు గ్రామానికి చెందిన మల్లన్న (65) ఆదివారం మధ్యాహ్నం కాలువ వద్ద సంచరించడం చూసినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో గల్లంతైన వ్యక్తి మల్లన్న అయి ఉండవచ్చుననే అనుమానాలు బలపడ్డాయి. సర్పంచ్ ఎర్రిస్వామి, వీఆర్వో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ● అ‘పూర్వ’ సమ్మేళనంచెన్నేకొత్తపల్లి: దాదాపు 40 ఏళ్ల క్రితం 1984–85లో చెన్నేకొత్తపల్లిలోని జెడ్పీహెచ్ఎస్లో కలసి చదువుకున్న 70 మందిలో 50 మంది అదే పాఠశాల వేదికగా ఆదివారం సందడి చేశారు. ఆప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నాటి గురువులను సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆటపాటలతో సరదాగా గడిపారు. -
ప్రజా ఉద్యమం..ఉధృతం
సాక్షి నెట్వర్క్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోట ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. మెడికల్ కళాశాలల అంశంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్యను దూరం చేసే ఆలోచనలను మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జిల్లాలో పలుచోట్ల చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. హిందూపురం తొమ్మిదో వార్డులో వైఎస్సార్సీపీ నేతలు సంతకాలు సేకరించారు. 21వ వార్డులో వార్డు ఇన్చార్జ్ న్యాతరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ సువర్ణ, మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. మడకశిర మండలం గౌడనహళ్లిలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తనకల్లు మండలంలోని మల్లిరెడ్డిపల్లి, నడిమికుంటపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించారు. సంతకాల సేకరణకు విశేష స్పందన -
పదవి కోసం టీడీపీ పాకులాట
సాక్షి, పుట్టపర్తి: రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 11న రామగిరిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఈసారి టీడీపీ ఎన్ని అరాచకాలు తెరతీస్తుందోనన్న భయం అందరిలో నెలకొంది. 9 చోట్ల వైఎస్సార్సీపీ సభ్యుల గెలుపు రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 9 చోట్ల వైఎస్సార్సీపీ సభ్యులు గెలిచారు. రామగిరి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన మీనుగ నాగమ్మను రామగిరి ఎంపీపీగా అప్పట్లో ఎన్నుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె మరణించడంతో ఎంపీపీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎంపీపీ పదవి మహిళకు రిజర్వేషన్ అయింది. ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని.. లేకపోతే ఇబ్బందులు పడతారని బెదిరింపులకు దిగారు. ఫలితంగా ఇప్పటికే.. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ గూండాల బెదిరింపులకు భయపడి.. ఇప్పటికే ఊళ్లు ఖాళీ చేశారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది మార్చి 27న , మే 18న , జూలై 16న , ఆగస్టు 13న ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాయిదా పడుతూనే ఉన్నాయి. పదవి కోసం దొడ్డిదారిలో... రామగిరి ఎంపీపీ స్థానానికి పోటీ చేసేందుకు టీడీపీ తరఫున అభ్యర్థి లేకున్నా.. ప్రతిసారీ బరిలో దిగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురి చేసి.. దొడ్డి దారిలో పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా సభ్యురాలిని బెదిరించి.. పార్టీ ఫిరాయించే ప్రయత్నాలు ఇప్పటికే పలుమార్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎలాంటి పథకం పన్నుతారనే దానిపై అందరిలో భయాందోళన నెలకొంది. ఎన్నికలంటే భయం.. భయంరామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక అంటే సభ్యులతో పాటు మండల వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. తొలిసారి ఉప ఎన్నిక సమయంలో పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఏప్రిల్లో ఎన్నిక నిర్వహించగా.. భయంతో సభ్యులు రాలేదు. తిరిగి జూలైలో మరోసారి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి కోసం వెంపర్లాడి ప్రలోభాలకు గురి చేసినా ఎవరూ తలొగ్గలేదు. దీంతో అధికారులు వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్టులో ఉప ఎన్నిక నిర్వహించగా.. సభ్యులు డుమ్మా కొట్టడంతో వాయిదా పడింది. టీడీపీ గూండాలు తలపెట్టే రాక్షస క్రీడకు భయపడి.. ఎన్నికలకు రాం రాం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ పదవి దక్కించుకోవాలని పరిటాల సునీత ప్రయత్నాలు ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు ఎన్నికల గొడవల్లో భాగంగా కురుబ లింగమయ్య దారుణ హత్య ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఎన్నిక తాజాగా ఈనెల 11న ఎంపీపీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ బలం లేకున్నా బరిలో దిగి.. దొడ్డి దారిలో రామగిరి ఎంపీపీ పదవి దక్కించుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రామగిరి మండలంలోని ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో మళ్లీ కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. -
క్రికెటర్ దీపికకు ఘన స్వాగతం
మడకశిర/అమరాపురం: అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అమరాపురం మండలం తంబాలహట్టి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కొలంబోలో జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను ఓడించి కప్ను కై వసం చేసుకోవడంతో కెప్టెన్ దీపిక దేశానికి పరిచయమయ్యారు. దీపిక వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తంబాలహట్టికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆమైపె పూల వర్షం కురిపించి.. హారతులు పట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్ఐ ఇషాక్బాషా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నేడు మడకశిరలో సన్మానం .. అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ దీపిక సోమవారం మడకశిరకు వస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తొలిసారిగా మడకశిరకు వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఏఈఆర్ఓలకు షోకాజ్అనంతపురం అర్బన్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా (ఏఈఆర్ఓ) వ్యవహరిస్తున్న తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కలెక్టర్ ఆనంద్ శనివారం షోకాజ్ జారీ చేశారు. ఈ నెల 15లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 2022లో ఉన్న ఓటర్లను ప్రస్తుత ఓటర్లతో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. అయిన్పటికీ అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో 30 శాతం కంటే తక్కువగా మ్యాపింగ్ జరిగిన మండలాల ఏఈఆర్ఓల తీరును కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో అనంతపురం అర్బన్ నియోజవకర్గం పరిధిలో ఏఈఆర్ఓలుగా ఉన్న అనంతపురం రూరల్ తహసీల్దారు (16.39 శాతం), ఎంపీడీఓ (12.029 శాతం), రాప్తాడు నియోజకవర్గం పరిధిలో చెన్నేకొత్తపల్లి తహసీల్దారు (28.135 శాతం), రాప్తాడు ఎంపీడీఓ (27.323 శాతం) షోకాజ్ నోటీసు అందుకున్నారు. మ్యాపింగ్ తక్కువగా జరగడంపై ఈ నెల 15వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నోటీసులో హెచ్చరించారు. -
పల్లెకు ఝలక్
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పంచాయతీలోని సుబ్బరాయనిపల్లి, గువ్వలగుట్టపల్లి, బత్తలపల్లి గ్రామాలకు చెందిన వందకు పైగా కుటుంబాలు ఆ పార్టీని వీడాయి. గువ్వలగుట్టపల్లి బస్టాండు సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నెంబర్ 763లోని ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గువ్వలగుట్టపల్లికి చెందిన ఓ నాయకుడికి కట్టబెడుతుండడం చూసిన జనం టీడీపీకి షాకిచ్చారు. ఈ భూముల వ్యవహారానికి సుబ్బరాయనిపల్లికి చెందిన మరో నాయకుడు వత్తాసు పలుకుతుండడంతో సదరు గ్రామంలో సైతం పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడారు. ఎంతో కాలంగా టీడీపీకి ఊడిగం చేశామని, ఇప్పటికీ తమకు న్యాయం చేయకపోవడంతో ఆ పార్టీకి గుడ్బై చెప్పినట్లు చెబుతున్నారు. పెడపల్లి రెవెన్యూ గ్రామంలో గువ్వలగుట్టపల్లి వద్ద జాతీయ రహదారికి ఆనుకొని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొందరు నాయకులు ఆక్రమించుకోవాలని చూశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకురావడంతో స్థానిక బీజేపీ నాయకులు స్పందించి మంత్రి సత్యకుమార్ను కలిసి సదరు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. దీంతో ఆయన అధికారులను ఆదేశించడంతో సదరు భూమిలో చదును చేసే పనులు ఆపగలిగారు. ఎంతో కాలంగా గ్రామంలో ఉన్న తమకు కాకుండా ఓ కాంట్రాక్టర్కు, భూస్వామికి ప్రభుత్వ భూమి అప్పనంగా ఇస్తుంటే చూస్తూ ఉండాలా అంటూ స్థానికులు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం వారంతా పెడపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ పంచన చేరడంతో ‘పల్లె’కు ఝలక్ ఇచ్చినట్లు అయింది. టీడీపీని వీడిన పెడపల్లి పంచాయతీ వాసులు వంద కుటుంబాలకు పైగా పార్టీకి గుడ్బై పల్లె విధానాలు నచ్చకనే దూరమైనట్లు స్పష్టీకరణ -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈ సమర్పించుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించుకొని పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అలాగే కలెక్టరేట్కు రాకుండా ఠీఠీఠీ. ఝ్ఛ్ఛజుౌట్చఝ. ్చఞ. జౌఠి. జీుఽ లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: స్థానిక పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో తెలియజేవచ్చని సూచించారు. అర్జీదారులు ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ట్విస్ట్ మడకశిర: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ అయినట్లు గుర్తించారు. తవ్వేకొద్దీ... జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ బర్త్ సర్టిఫికెట్ల విచారణలో తవ్విన కొద్దీ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020లో అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. 2021లో ఈ పంచాయతీకి లాగిన్ ఇచ్చారు. అయితే ఈలాగిన్ ఉపయోగించి ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయలేదని ఇంతకు మునుపు పని చేసిన గ్రామ కార్యదర్శులు విచారణ అధికారుల ముందు హాజరై చెప్పారు. అసలు వీరు లాగిన్ ఉపయోగించకుంటే ఇదే లాగిన్ నుంచి బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయని విచారణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2021, 2022లో ఈలాగిన్లో మొత్తం 5 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఇంతకు ముందే విచారణ అధికారులు గుర్తించారు. తాజాగా పుట్టపర్తి కేంద్రంగా ఆదివారం చేసిన విచారణలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే లాగిన్ నుంచి డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ అయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. 2021లో రెండు డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 2025లో 7 డెత్ సర్టిపికెట్లు జారీ అయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. 2022, 2023, 2024లో డెత్ సర్టిఫికెట్లు ఈలాగిన్ నుంచి జారీ కాలేదు. ఈ నేపథ్యంలో విచారణ అధికారులు డెత్ సర్టిఫికెట్లు ఎవరు గ్రామ కార్యదర్శిగా ఉన్నప్పుడు జారీ అయ్యాయో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నివేదిక సిద్ధం కొమరేపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంగా జరిగిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై విచారణ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 2025 జనవరి నుంచి అక్టోబర్ 14 వరకు 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయో అనే అంశంపై వారం రోజుల నుంచి అధికారులు విచారణ జరిపారు. పలువురిని విచారించారు. ప్రాథమికంగా విచారణ నివేదికను సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారి ద్వారా తెలిసింది. ఈ విచారణ నివేదికను సోమవారం ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. బీటెక్ విద్యార్థికి విద్యుత్ షాక్ ధర్మవరం అర్బన్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ బీటెక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. ధర్మవరంలోని మారుతీనగర్కు చెందిన వెంకటస్వామి కుమారుడు రాజవంశీకృష్ణ అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం మిద్దైపె ఫోన్లో మాట్లాడుతూ అటుఇటు తిరుగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై కిందపడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్స్పాత్రికి తీసుకెళ్లి.. వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. -
టీడీపీలో అఖండ చిచ్చు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ టీడీపీలో ‘అఖండ’ చిచ్చు రేగింది. పబ్లిసిటీ కోసం బాలకృష్ణ అభిమానులు చేసిన ఆరాటం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. అనంతపురం, మడకశిర ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన ఈ వివాదం ఒకరిపై ఒకరు బాలకృష్ణకు, పార్టీకి ఫిర్యాదులు చేసేంత వరకూ వెళ్లింది. ఈ తతంగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అఖండ–2 సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ ఫ్లెక్సీలు నగరం మొత్తం భారీగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు జగన్ ‘అనంత’ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు గత నెల 29న సూచించారు. అయితే తాను శబరిమలకు వెళుతున్నానని చెప్పి ప్రసాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో ఫ్లెక్సీలు వేశారు. అలాగే శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, హౌసింగ్బోర్డులో డివైడర్ల మధ్యలో లాలీపాప్స్ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకుడు రాయల్ మురళి ఎమ్మెల్యే రాజు తరఫున ఫ్లెక్సీలను పినాకిని యాడ్స్ ఏజెన్సీ ద్వారా వేయించారు. ఈ క్రమంలో తన నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాలకృష్ణ దృష్టిలో మైనస్ మార్కులు పడతాయని, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అంశంలో తీవ్ర నష్టం జరిగిందనే భావనతో రాజు ఫ్లెక్సీలు తొలగించి తనవి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. వెంటనే దగ్గుపాటి అనుచరుడు గంగారాం పినాకినీ యాడ్స్ యజమాని మురళీకి ఫోన్ చేసి.. రాజు లాలిపాప్స్ తొలగించి దగ్గుపాటివి ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో మురళి టీడీపీ నేత రాయల్ మురళీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ అంశాన్ని రాయల్ మురళి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. తన ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకునేది లేదని రాజు తీవ్రంగా హెచ్చరించారు. దగ్గుపాటి ప్రసాద్పై ఎంఎస్ రాజు నేరుగా బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘అనంత’ పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు సునీల్.. రాజుతో, దగ్గుపాటితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలోనే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ జిల్లా ఇన్చార్జ్ అయిన గుంటూరు మేయర్ నాని (కోవెలమూడి రవీంద్ర)కి ఫిర్యాదు చేశారు. దీంతో రాయల్ మురళి కూడా నానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఎమ్మెల్యేల వాదులాట అంశం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి ఇద్దరి మధ్య వివాదం ఫ్లెక్సీలది కాదని, ‘అనంత’ మార్కెట్ యార్డు అంశంలో తలెత్తిన విభేదాలు ఇద్దరి మధ్య రాజకీయాలను కాదని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే స్థాయికి వెళ్లాయని, అది మనసులో పెట్టుకుని ప్రతిసారీ ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారనే చర్చ సాగుతోంది. ‘అనంత’లో అఖండ–2 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వాటిని చించేసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు రాజు ఫ్లెక్సీలు తొలగించి తన ఫ్లెక్సీలు వేయాలని యాడ్ ఏజెన్సీకి దగ్గుపాటి హుకుం దీంతో దగ్గుపాటి అనుచరుడు గంగారాంపై రాజు చిందులు రాజు తరఫున ఫ్లెక్సీలు వేయించిన రాయల్ మురళీపై దగ్గుపాటి బూతులు బాలకృష్ణకు ఫిర్యాదు చేసిన రాజు, జిల్లా టీడీపీ ఇన్చార్జ్ నానికి ఫిర్యాదు చేసిన మురళి విషయం ఆరా తీసిన ‘అనంత’ పార్లమెంటు టీడీపీ పరిశీలకుడు సునీల్ ఫ్లెక్సీల చించివేతతో రచ్చ.. అనంతపురం నగరంలోని పవిత్రమార్ట్, సప్తగిరి సర్కిల్ వద్ద రెండు ఫ్లెక్సీలను ‘అనంత’ ఎమ్మెల్యే అనుచరులు శనివారం చించేశారు. ఈ దృశ్యాలను రాయల్ మురళి టీడీపీ నేతలకు వాట్సాప్లో పంపి.. గంగారాం చించేయించాడని చెప్పాడు. దీంతో ఎంఎస్ రాజు ఆదివారం నేరుగా గంగారాం ఇంటికి వెళ్లి అతన్ని తన కారులో కూర్చోబెట్టుకుని వాదులాడుకున్నారు. ఇద్దరి మధ్య గట్టి వాదన జరుగుతున్న సమయంలో దగ్గుపాటి ప్రసాద్.. రాయల్ మురళీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయారు. రాయల్ మురళి కూడా దగ్గుపాటిపై అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ‘ఏం చేస్తావ్! నువ్వేం పీకలేవ్!’ అని గట్టిగానే మాట్లాడాడు. ఈ క్రమంలో రాయల్ మురళి ఫోన్ను ఎంఎస్ రాజు తీసుకుని దగ్గుపాటితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాదించుకున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పరస్పరం ఫిర్యాదులు.. -
సాయీ నీ నామం..
ప్రశాంతి నిలయం: రష్యన్ సత్యసాయి భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరంలోని భక్తులు పరవశించిపోయారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన రష్యా సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరి నిర్వహించారు. తొలుత సత్యసాయి అష్టోత్తర నామాన్ని జపించారు. తర్వాత సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో వారు నిర్వహించిన సంగీత కచేరి అందరినీ ఆకట్టుకుంది. -
ధర్మవరంలో టీ–3 బెట్టింగ్
క్రికెట్ను వీక్షిస్తున్న జనసందోహం ధర్మవరం అర్బన్: రెండు, మూడు రోజుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్ చూసిన జనం... వన్డే మ్యాచ్లతో ఊగిపోయారు. ఆ తర్వాత టీ–20 మ్యాచ్లతో శివాలూగారు. సిక్స్లు, ఫోర్ల వరద పారుతుంటే స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు అతుక్కుపోయిన క్రికెట్ ప్రేమికులు తమను తాము మైమరిచి డ్యాన్సులు చేశారు. ఈ ఉత్సాహానికి తగ్గట్టే బెట్టింగ్ కూడా హీటెక్కింది. బాల్ బాల్కూ బెట్టింగ్ జరిగేది. ప్రస్తుతం ధర్మవరంలో ఇంకాస్త ముందుకు వెళ్లి టీ–3 మ్యాచ్లతో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. బండరాళ్లే వికెట్లు... రబ్బరు బాల్తో క్రికెట్... మూడే ఓవర్లు... క్రికెట్ అంటే వికెట్లు, ప్యాడ్లు, గ్లౌజ్లు, అంపైర్, బౌండరీలు ఇలా అనేక రకాల నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం బండరాళ్లే వికెట్లు, ఒక బ్యాట్, రబ్బరు బాల్లో క్రికెట్. ప్రతి బాల్ను బాదడమే మ్యాచ్ ప్రత్యేకత. ఒక్కో టీంకు ఐదుగురు చొప్పున రెండు టీంలకు మొత్తం 10 మంది క్రీడాకారులుంటారు. మ్యాచ్ మొత్తం మూడు ఓవర్లే. ఏ టీం మూడు ఓవర్లలో ఎక్కువ స్కోరు చేస్తుందో... ఆ టీం గెలిచినట్లే. ఒక్కో మ్యాచ్కు రూ.లక్షలో పందెం. మూడు ఓవర్లలో ఒక టీం 50 పరుగులు చేస్తే... మరో టీం 51 పరుగులు చేసిందంటే ఆ టీం గెలిచినట్లే. ఒక్కో మ్యాచ్కు రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బెట్టింగ్ సాగుతోంది. కేవలం గంటలోపే మ్యాచ్ ఫలితం తేలుతోంది. వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే బెట్టింగ్ క్రికెట్ ఆడుతూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన క్రీడాకారులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వచ్చి బెట్టింగ్ క్రికెట్ ఆడుతున్నారు. కూతవేటు దూరంలో పోలీసులు... ధర్మవరంలోని క్రీడా మైదానానికి కూతవేటు దూరంలోనే డీఎస్పీ కార్యాలయం, వన్ టౌన్ పోలీస్స్టేషన్లున్నాయి. ఇంత పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొంత మంది పోలీసులు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడే క్రీడాకారులతో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. మూడు ఓవర్ల మ్యాచ్.. రూ.లక్షల పందెం ధర్మవరం క్రీడా మైదానంలో యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్ తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు -
‘పది’ంతల దోపిడీ
కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో కొన్ని పాఠశాలల నిర్వాహకులు అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ విద్యాసంస్థల్లో దోపిడీ మరీ ఎక్కువగా ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమనెవ్వరూ ఏమీ చేసుకోలేరని ఆయా విద్యాసంస్థల సిబ్బంది బహిరంగంగా అంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పది పరీక్షలకు 16 వేల మంది.. జిల్లాలో 307 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 16 వేల మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు శనివారంతో గడువు ముగిసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెగ్యులర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 ఫీజు వసూలు చేయాలి. అదే సప్లిమెంటరీ కింద మూడు సబ్జెక్టుల్లోపు పరీక్షలు రాసే వారి నుంచి రూ.110 మాత్రమే ఫీజు రూపంలో వసూలు చేయాలి. కానీ జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా 10 రెట్లు అదనంగా వసూలు చేశారు. జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో రూ.500 వరకు వసూలు చేశారు. ఇక కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ.1,000 నుంచి రూ.1.500 వరకూ తీసుకున్నారు, నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలల్లో రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ వసూలు చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించలేని స్థితిలో తల్లిదండ్రులు.. పరీక్షల సమయంలో పిల్లలను ఎక్కడ ఇబ్బంది పెడతారోనన్న భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నించలేకపోయారు. తాము వసూలు చేసిన డబ్బులో కొంత డీఈఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుందని పలు పాఠశాల యాజమానులు చెబుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. దీనిపై జిలా విద్యాశాఖ అధికారి కిష్టప్పను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కాకుండా అధిక మొత్తంలో వసూలు చేసినట్లు తేలితే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో భారీగా వసూలు ప్రభుత్వం నిర్ణయించింది రూ.125.. వసూలు రూ.1,000పైనే నారాయణ సహా కార్పొరేట్ విద్యాసంస్థల్లో మరీ ఎక్కువ -
బైక్ రేసర్ల భరతం పడతాం
పెనుకొండ: జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా బైకులతో విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే రైసర్ల భరతం పడతామని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెనుకొండ బాబయ్య దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా గంధం రోజున (2వ తేదీ రాత్రి) జాతీయ రహదారిపై మాటు వేసి రేసింగ్తో పాటు ప్రమాదకర విన్యాసాలు చేసిన వారిని అడ్డుకుని 102 బైక్లు సీజ్ చేశామన్నారు. వాహనాల రికార్డుల ఆధారంగా బైకర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం జరిమానాలు విధించామన్నారు. పలువురు బైక్ రేసర్లు మరోసారి ఇలాంటి తప్పిదాలు చేయబోమని హామీ ఇచ్చిన నేపథ్యంలో తొలితప్పుగా భావించి వాహనాలను విడుదల చేశామన్నారు. రికార్డులు సక్రమంగా లేని వారికి 2, 3 రోజులు గడువు ఇచ్చామన్నారు. దాడుల్లో నలుగురు సీఐలు, 8 మంది ఎస్ఐలు 50 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో ఇదే విధమైన చర్యలు ఉంటాయని, యువత గ్రహించి బైక్ రేసింగ్లకు దూరంగా ఉండాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమావేశంలో డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్ తదితరులు ఉన్నారు. హెచ్చరించిన ఎస్పీ సతీష్కుమార్ 102 బైక్లు స్వాధీనం..జరిమానా -
పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థుల డాక్టర్ కల నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశారు. మిగిలిన వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కార్...
పుట్టపర్తి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా... స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా, 2019లో వైఎస్ జగన్ అధికారంలో చేపట్టాక ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు మన విద్యార్థులకు అదనంగా వచ్చాయి. అయితే గతేడాది పాలన పగ్గాలు చందబ్రాబు చేతుల్లోకి వెళ్లడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. విద్యార్థుల ఎంబీబీఎస్ కల కల్లగా మారే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెద్ద ఎత్తున్న ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని ప్రజలకు వివరించారు. దీంతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్తో సహా పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, రాప్తాడు, హిందూపురం, మడకశిర పార్టీ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మక్బూల్, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, దీపిక, ఈరలక్కప్ప ఆయా నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు వెల్లువలా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ.. తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ 3 లక్షల వరకు సంతకాల సేకరణ పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల నుంచి సేకరించిన సంతకాల పేపర్లను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నారు. మాది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా తమ్ముడి కల. బాగానే కష్టపడి చదివాడు. మూడు మార్కుల తేడాతో సీటు కోల్పోయాడు. మేనేజ్మెంట్ కోటాలో చదివేంత స్థోమత మాకు లేదు. వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన మెడికల్ కళాశాలలన్నీ అందుబాటులోకి వచ్చి ఉంటే సీట్లు పెరిగి నా తమ్ముడు కల నెరవేరేది. కానీ చంద్రబాబు సర్కార్ ‘ప్రైవేటు’ మంత్రం జపిస్తోంది. దీంతో నిరుపేద కుటుంబాల్లోని ఎందరో యువకులు.. తమ జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయారు. అందుకే మెడికల్ కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలన్నది నా కోరిక. అందుకే వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నా. మా అమ్మకు 60 ఏళ్లు. ఏడాది క్రితం కింద పడగా తలకు గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్తే న్యూరోసర్జన్ లేడన్నారు. బెంగళూరుకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అక్కడి వెళ్తే తలలో రక్తం గూడు కట్టిందని రూ.6 లక్షలు తీసుకుని వైద్యం చేశారు. అప్పుడు చేసిన అప్పునకు వడ్డీ ఇంకా కడుతూనే ఉన్నా. పెనుకొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి ఎందరో పేదలకు మేలు జరిగేది. కానీ చంద్రబాబు సర్కార్ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తోంది. నిర్మాణం ప్రారంభమైన మెడికల్ కళాశాలలను ప్రైవేటు అప్పగించేందుకు సిద్ధమైంది. దీన్ని మేం ఒప్పుకోం. మా కోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీకే నా మద్దతు. – మడకశిరకు చెందిన ఓ యువకుడి ఆక్రందన ఇది ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, నిరుపేద కుటుంబాల్లోని యువకుల డాక్టర్ కల నెరవేర్చేందుకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. జగన్పై అక్కసుతో వాటిని కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకుంది. దీన్ని నిరసిస్తూ జిల్లా పెద్ద ఎత్తున కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం చందబ్రాబు సర్కారు తీరుకు నిరసనగా పోరుబాట ఊరూరా సంతకాల సేకరణ, రచ్చబండ స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన సకల జనులు ఇప్పటికే జిల్లాలో దాదాపు 3 లక్షల సంతకాల సేకరణ పూర్తి – పెనుకొండకు చెందిన ఓ యువతి మాటలివి -
బాబయ్య సేవలో ఎస్పీ
పెనుకొండ: ఎస్పీ సతీష్కుమార్ శనివారం రాత్రి బాబయ్య స్వామి సేవలో గడిపారు. బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని స్వామికి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు చాదర్ తలపై ఉంచుకుని దర్గా వద్దకు చేరుకున్న ఎస్పీకి పీఠాధిపతి తాజ్బాబా, ఆయన కుమారుడు సలావుద్దీన్బాబా, దాదు, మత పెద్దలు... ఫక్కీర్ల విన్యాసాల నడుమ స్వాగతం పలికారు. ఎస్పీ వెంట డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కమిటీల్లో జిల్లా వాసులకు చోటుపుట్టపర్తి టౌన్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో పలువురు జిల్లా వాసులకు చోటు దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీకాంత్రెడ్డి (ధర్మవరం), సోషియల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బి.వేణుగోపాల్రెడ్డి (హిందూపురం), పంచాయతీ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్. నాగభూషన్రెడ్డి (మడకశిర), మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎల్. కృపాకర్రెడ్డి (కదిరి), సంయుక్త కార్యదర్శులుగా మహమ్మద్ హజీఫుల్లా (హిందూపురం), రెహానా (మడకశిర)ను నియమించారు. అలాగే కళాకారుల విభాగం పుట్టపర్తి నియోజవర్గ అధ్యక్షునిగా మంగలి రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా శివనాయక్, మడకశిర నియోజవర్గ వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షునిగా కృష్టమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గ్రామ కార్యదర్శులపైనే కన్ను
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో గ్రామ కార్యదర్శుల పాత్రపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ ద్వారా 2025 జనవరి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసిన వ్యవహారం రాష్ట్రంలోనే కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పంచాయతీ లాగిన్ ద్వారానే బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించారు. తొలుత పంచాయతీ లాగిన్ హ్యాక్ అయ్యిందేమోనని భావించారు. కానీ ప్రాథమిక విచారణ పూర్తయ్యాక అందరి కళ్లు గ్రామ కార్యదర్శులపైనే పడ్డాయి. కొమరేపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదుగురు కార్యదర్శులు పనిచేయగా.. ఒకరు మాత్రం ఎక్కువ రోజులు పనిచేశారు. ఆయా కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. శనివారం ప్రస్తుతం కొమరేపల్లి గ్రామ పంచాయతీ పనిచేస్తున్న మహేష్ను జిల్లా కేంద్రం పుట్టపర్తికి పిలిపించిన అధికారులు అతన్ని సమగ్రంగా విచారించినట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం కేంద్రంగా అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేసినట్లు సమాచారం. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపైనా అనుమానాలు.. మరోవైపు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై డీపీఓతో పాటు డీఎల్పీఓ కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ ద్వారా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, తాము పంచాయతీ లాగిన్ వాడలేదని గ్రామ కార్యదర్శులు చెబుతున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ లాగిన్ సదరు గ్రామ కార్యదర్శికే తెలుస్తుంది. లేదంటే ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి తెలిసే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక.. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇప్పటికే విచారణ దాదాపుగా పూర్తి చేసిన అధికారులు.. సమగ్ర వివరాలతో నివేదిక రూపొందిస్తున్నారు. రేపోమాపో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ‘నకిలీ’ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో విచారణ వేగవంతం గ్రామ కార్యదర్శుల పాత్రపై దృష్టి సారించిన జిల్లా అధికారులు తాజాగా గ్రామకార్యదర్శిని జిల్లా కేంద్రానికి పిలిపించి విచారించిన వైనం రేపోమాపో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం -
కమనీయం.. బ్రహ్మోత్సవం
● వైభవంగా భక్తరపల్లి లక్ష్మీనరసింహు స్వామి బ్రహ్మోత్సవాలు ● ఆకట్టుకున్న భూతప్ప, జ్యోతుల ఉత్సవాలు ● వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనంమడకశిర రూరల్: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం భూతప్ప, జ్యోతులు ఉత్సవాలు నిర్వహించగా... ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించకున్నారు. భక్తిశ్రద్ధలతో భూతప్ప ఉత్సవం.. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భూతప్ప ఉత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. భూతప్పల పాదస్పర్శతో తమ బాధలు, వ్యాధులు, సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సంతానం లేని మహిళలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు మడికట్టుకుని భూతప్పలు వచ్చే దారిలో పడుకున్నారు. భూతప్పల పాదస్పర్శతో పులకించిపోయారు. స్వామివార్లకు జ్యోతుల సమర్పణ.. తెల్లవారుజామునే వందలాది మంది మహిళలు బియ్యపు పిండి, బెల్లంతో తయారు చేసిన జ్యోతులను తీసుకువచ్చి భక్తరపల్లి, జిల్లేడుగుంట ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివార్లకు సమర్పించారు. ఇక పొంజుతో తలపై కొట్టించుకుంటే కష్టాలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు పొంజుతో తలపై కొట్టించుకోవడానికి ఎగబడ్డారు. -
మొక్కుబడి తంతు
పుట్టపర్తి: జిల్లాలో శుక్రవారం నిర్వహించన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) మొక్కుబడి సాగింది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక వేదికలపై ఆశీనులైన టీడీపీ నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో వచ్చిన వారు కూడా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రొటోకాల్కు మంగళం.. మెగా పీటీఎంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. చాలా చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించలేదు. ప్రస్తుతం సర్పంచ్లు, ఎంపీటీసీలుగా ఉన్న వారంతా వైఎస్సార్ సీపీకి చెందిన వారు, మద్దతుదారులు కావడంతో వారికి సమాచారం కూడా ఇవ్వలేదు. రాజకీయ సభల్లా ప్రసంగాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎంను టీడీపీ నాయకులు రాజకీయం చేశారు. అర్హత లేకపోయినా చాలా మంది వేదికలపైకి ఎక్కి దర్బారు చూపారు. టీడీపీకీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మండల కన్వీనర్లు ఇతర ప్రజా ప్రతినిధులు మైకు అందుకుని కార్యక్రమ ఉద్దేశాన్ని మరచి రాజకీయ ప్రసంగాలు చేశారు. అభం శుభం తెలియని పిల్లల మనస్సులోకి పచ్చ విషం చొప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు పాఠశాలల అభివృద్ధికి ఎలాంటి తీర్మానాలు చేయకుండానే సమావేశాలు ముగించారు. మెనూ పాటించలేదని ప్రిన్సిపాల్తో వాగ్వాదం తనకల్లు గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్లో వాగ్వాదానికి దిగారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని మండిపడ్డారు. ఇలాగైతే తమ పిల్లలను ఎలా పాఠశాలకు పంపేది లేదన్నారు. రాజకీయ సభలా పీటీఎం.. పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రాజకీయ సభలా మారింది. టీడీపీ నాయకుల కోసం సమావేశాన్ని 12 గంటల సమయంలో ప్రారంభించగా...తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమైతే తదుపరి పిల్లలతో గడిపి యోగక్షేమాలను అడిగి తెలుసుకుందామని సుదూర ప్రాంతాల నుండీ వచ్చిన తల్లిదండ్రులు పిల్లలను కలవలేక ఇబ్బందులకు గురయ్యారు. ఇక టీడీపీ కన్వీనర్తో పాటూ ఫైవ్మెన్ కమిటీ సభ్యులు, టీడీపీ మాజీ జెడ్పీటీసీ, పలువురు మాజీ ఎంపీటీసీలు వేదికపై ఆశీనులై రాజకీయ ప్రసంగాలు చేశారు. దీంతో విసిగిపోయిన చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు బయటికెళ్లిపోయారు. ఓపికతో ఉన్న ఒకరిద్దరు ఏపీఆర్ఎస్లో మౌలిక వసతుల లేమిపై ప్రస్తావించారు. ఎన్సీసీలో జరిగిన ఆక్రమాలు, పిల్లల ఖాతాలో జమ కావాల్సిన డబ్బుల దుర్వినియోగం గురించి మాట్లాడారు. ఇప్పటికై నా కమిటీ సభ్యులు పాఠశాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తూతూ మంత్రంగా మెగా పీటీఎం రాజకీయ ప్రసంగాలు చేసిన టీడీపీ నాయకులు సమస్యలు ప్రస్తావించినా వినే వారే కరువు -
ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం
కనగానపల్లి: కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఒక వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలసి విషద్రావకం (గడ్డికి పిచికారీ చేసే మందు) తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ సంఘటన మండలంలోని తగరకుంట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రవి, గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో శుక్రవారం రవి గొడవపడగా భార్య గీత జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే తాను చనిపోతే తన బిడ్డలను ఎవరు చూస్తారని భయపడిన ఆమె... మొదట తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి విషద్రావకం తాగించి, తర్వాత తాను కూడా తాగింది. అపస్మాకర స్థితిలో ఉన్న వీరిని కుటుంబ సభ్యులు గుర్తించి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. 8న పీజీ స్పాట్ అడ్మిషన్లు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. పీజీ సెట్ రాయని అభ్యర్థులు, ఆసక్తి గల వారు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావచ్చు. అడ్మిషన్ పొందిన తక్షణమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ సీట్ల వివరాలు ఇవే.. అడల్ట్ ఎడ్యుకేషన్ –24, అప్లైడ్ ఎకనామిక్స్ –30, ఎకనామిక్స్–26, ఇంగ్లిష్ 36, హిస్టరీ –24, పొలిటికల్ సైన్సెస్–17, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –29, రూరల్ డెవలప్మెంట్– 34, సోషియాలజీ –35, తెలుగు– 41, హిందీ–13, బయో కెమిస్ట్రీ–9, బయో టెక్నాలజీ– 6, బోటనీ–20, కెమిస్ట్రీ –29, ఆర్గానిక్ కెమిస్ట్రీ– 6, కంప్యూటర్ సైన్సెస్– 15, ఎలక్ట్రానిక్స్– 29, ఇన్స్ట్రుమెంటేషన్– 26, జియాగ్రఫీ–20, మేథమేటిక్స్– 24,అప్లైడ్ మేథమేటిక్స్– 26, మైక్రోబయాలజీ –2, ఫిజిక్స్– 42, పాలిమర్ సైన్సెస్–17,సెరికల్చర్–11, స్టాటిస్టిక్స్– 14, జువాలజీ– 15, ఎంకాం–42, ఎంకాం (అకౌంటింగ్)– 50, ఎంపీఈడీ– 34, ఎంఎల్ఐఎస్సీ– 30, ఎంఎస్డబ్ల్యూ–32. దుగుమర్రి వీఆర్వో సస్పెండ్ శింగనమల(నార్పల): నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబారావుపై సస్పెన్షన్ వేటు పడింది. రంగాపురం గ్రామానికి చెందిన రైతు నాగార్జునతో మ్యుటేషన్ కోసం వీఆర్వో రూ.38 వేలు లంచం డిమాండ్ చేసిన విషయం విదితమే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి.. కలెక్టర్కు నివేదిక పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్వో వెంకోబారావును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
స్క్రబ్ టైఫస్... జిల్లా వాసులను భయపెడుతోంది. జ్వరమొస్తే చాలు జనం వణికిపోతున్నారు. శరీరంపై చిన్న దద్దు వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏడాదిగా జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యంత్రాంగం కనీసం వ్యాధి నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు కూ
ప్రశాంతి నిలయం/ హిందూపురం: జిల్లాలో స్క్రబ్ టైఫస్ భయం వణికిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదుకావడంతో జ్వరం వచ్చిన జనం భయపడిపోతున్నారు. వివిధ రకాల విషజ్వరాల మాదిరిగా ఇది కూడా ఓ రకం జ్వరమే అయినప్పటికీ, ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములుండే ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తేలింది. స్క్రబ్ టైఫస్ ఓ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి.. స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియంటియా సూసుగముషి’ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. పొదలు, పచ్చిక బయళ్లలో ఉండే నల్లులు (చిగర్ మైట్స్) ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. పరిమాణంలో చిన్నగా ఉండే నల్లులు మనిషికి తెలియకుండానే కాటు వేస్తాయి. అప్పుడు ఓరియంటియా సూసుగముషి బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి లక్షణాలు.. వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వాంతులు, పొడిదగ్గు, నీరసం, కుట్టిన చోట నల్లటి మచ్చలు, దద్దుర్లు ఉంటాయి. వ్యాధి ముదిరితే కామెర్లు, ఫీట్స్ లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అప్పటికీ చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయకండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్త్రావం, తెల్లరక్తకణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. చికిత్స ఆలస్యమైతే మరణాలు కూడా సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. స్క్రబ్ టైఫస్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో పనిచేసే వారు, పశువుల కాపరులకు, తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో, దట్టమైన పొదలు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి సోకే ప్రమాదం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్క్రబ్ టైఫస్ బారిన పడకుండా ఉండవచ్చు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నల్లులు పెరిగే వాతావరణాన్ని నివారించాలి. ఇళ్లలో దోమతెరలు వాడాలి. అలాగే నేలపై పడుకోవడం, కూర్చోవడం చేయరాదు. అందుబాటులో లేని పరీక్షా కేంద్రాలు.. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ ధర్మవరంలో 2, హిందూపురంలో 2, ఎన్పీ కుంటలో 1, అమడగూరులో 1 చొప్పున మొత్తం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికీ నిద్రమేల్కోలేదు. వ్యాధి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఇప్పటివరకూ నిర్వహించలేదు. ఇక వ్యాధి నిర్ధారణకు పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి స్క్రబ్ టైఫస్ నిర్ధారణకు సబ్టైఫస్ ఐజీఎం అనే టెస్ట్ చేయాలి. కానీ స్థానికంగా ల్యాబ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వైద్యులు అనుమానిత కేసులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి అక్కడ పరీక్షలు నిర్వహించి... నిర్ధారించిన తర్వాత ఇక్కడ చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స ఆలస్యమైతే బాధితుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లినా...స్క్రబ్ టైఫస్ అంటూ భయపెట్టి ఎలీసా టెస్టు చేస్తున్నారు. ఇందుకు భారీగా వసూలు చేస్తున్నారు. హిందూపురం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు.. ఇటీవల హిందూపురం ఆస్పత్రికి నాలుగు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు వచ్చాయి. దీంతో బాధితుల నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. శుక్రవారం నుంచి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముగ్గురు చిన్నారులను అనుమానిత కేసులుగా నమోదు చేసి చికిత్సలు అందిస్తున్నారు. జిల్లాలో 6 పాజిటివ్ కేసుల నమోదు వైరల్ జ్వరాలకు తోడు టైఫస్ భయం భయపడుతున్న జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన అప్రమత్తంగా ఉండాలి స్క్రబ్ టైఫస్ జిల్లాలో క్రమక్రమంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటికే జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశాం. వ్యాధిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులు సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలి. – ఏ.శ్యాం ప్రసాద్, కలెక్టర్ జాగ్రత్తలు పాటించాలి స్క్రబ్ టైఫస్ ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరం నిండుగా దుస్తులు ధరించడం, దోమతెరలు వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – ఫైరోజా బేగం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
11న రామగిరి ఎంపీపీ ఎన్నిక
● ఐదోసారి నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం రామగిరి: ఇప్పటికే నాలుగుమార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 11వ తేదీన ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది. 10 స్థానాల్లో 9 మంది వైఎస్సార్ సీపీ అభ్యర్థులే.. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్రిజర్వడ్ మహిళకు కేటాయించడంతో రామగిరి స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందగా...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. కుట్రలు.. అల్లర్లతో వాయిదాల పర్వం ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికకు ఇప్పటికే నాలుగు సార్లు నోటిఫికేషన్ ఇవ్వగా...అధికార పార్టీ కుట్రలు, అల్లర్లతో వాయిదా పడుతూ వస్తోంది. తొలిసారి మార్చి 27న, రెండోసారి మే 18న, మూడోసారి జూలై 16న, నాల్గోసారి ఆగస్ట్ 13న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని పరిటాల కుటుంబం కుట్ర చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. అంతేకాకుండా మిగతా వారినీ భయపెట్టి ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ నెల 11న రామగిరి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. -
‘నకిలీ’ తీగ లాగుతున్నారు
మడకశిర: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఒక్కొక్క తీగలాగుతూ డొంక కదిలిస్తున్నారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 2025 జనవరి నుంచి అక్టోబర్ 14 వరకు 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడంపై అధికారుల విచారణ ముమ్మరం చేశారు. జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం శుక్రవారం కొమరేపల్లిలోవిచారణ ప్రారంభించింది. గ్రామ కార్యదర్శుల విచారణ.. కొమరేపల్లి పంచాయతీ 2020లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు కార్యదర్శులుగా పనిచేశారు. దీంతో అధికారులు విచారణ హాజరుకావాలని వారందరికీ నోటీసులు పంపారు. వీరిలో ముగ్గురు గ్రామ కార్యదర్శులు విచారణకు హాజరైనట్లు సమాచారం. మిగిలిన వారికి మరోసారి నోటీసు పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విచారణలో పాల్గొన్న గ్రామ కార్యదర్శులు.. తాము గ్రామ పంచాయతీకి చెందిన లాగిన్ను ఉపయోగించలేదని అధికారులకు తెలిపినట్లు సమాచారం. కానీ పంచాయతీ లాగిన్ నుంచే 2021, 2022 సంవత్సరాల్లో 5 బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు సర్కార్ వచ్చాకే ‘నకిలీ’ బీజం.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరాకే నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందాకు బీజం పడింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ 14 వరకు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం కొనసాగింది. ఈ మధ్య కాలంలో కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ కావడం సంచలనంగా మారింది. ఇతర రాష్ట్రాల వారికీ సర్టిఫికెట్లు! కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఇతర రాష్ట్రాల వారికీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి కూడా ఇక్కడి నుంచే బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ బర్త్ సర్టిఫికెట్లను ఎవరు జారీ చేశారు... ఇందుకు ఎవరైనా పంచాయతీ లాగిన్ను దుర్వినియోగం చేశారా... లేదా లాగిన్ను హ్యాక్ చేశారా..అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 17 వేల మంది జననం.. రిజిస్ట్రేషన్కు 42 వేల దరఖాస్తులు.. వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 2024లో జిల్లాలో 17 వేల శిశువులు జన్మించారు. అదే ఏడాది బర్త్ సర్టిఫికెట్ల కోసం 46 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2025లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసంపై విచారణ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు.. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై కొమరేపల్లి గ్రామ కార్యదర్శి మహేష్ అగళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ను ఎవరైనా హ్యాక్ చేశారా...అన్న విషయం సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీపై విచారణ వేగవంతం గతంలో పని చేసిన గ్రామ కార్యదర్శుల విచారణ కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు! తాము పంచాయతీ లాగిన్ ఉపయోగించలేదంటున్న కార్యదర్శులు 2024లో జిల్లాలో 17 వేల జననాలు.. బర్త్ సర్టిఫికెట్ల కోసం 42 వేల దరఖాస్తులు -
విద్యార్థుల భవితకు బాటలు వేయాలి
లేపాక్షి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా విద్యార్థుల భవితకు బాటలు వేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం లేపాక్షిలోని జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో ఆయన పాల్గొన్నారు. మెగా పీటీఎం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సంబంధం మెరుగుపడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా మొబైల్లో లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దీనివల్ల విద్యార్థుల ప్రగతి తెలుసుకోవచ్చన్నారు. అలాగే హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డుల ఉపయోగం గురించి వివరించారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ సందర్శించి ఎగ్జిబిట్లను పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. -
నేత్రపర్వంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం
కదిరి టౌన్: స్థానిక ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగమంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుని కల్యాణోత్సవాన్ని శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో వంద రోజుల కార్యాచరణ అనంతపురం సిటీ: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల కార్యాచరణకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చి 15 వరకు ఈ ప్రణాళిక కొనసాగనుంది. 16 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 356 ఉండగా, మొత్తం 19,596 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలికలు 10,290 మంది, బాలురు 9,306 మంది ఉన్నారు. వీరికి ప్రణాళిక అమలులో భాగంగా ఉదయం 8 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్, రోజువారీ స్లిప్ టెస్టులు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. నాలుగు టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం ధర్మవరం రూరల్: స్థానిక గూడ్స్షెడ్ కొట్టాల వద్ద గొట్లూరుకు వెళ్లే మార్గంలో బొలెరో, ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల రేషన్ బియ్యాన్ని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆర్ఎస్ఎఫ్ నాయకుడు సాకే హరి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున తదితరులు వాహనాలను అడ్డుకుని సమాచారం ఇవ్వడంతో సీఎస్డీటీ చెన్నకేశవనాయుడు అక్కడకు చేరుకుని బియ్యం స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేశారు. -
కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. భారతదేశం అంతటా విపత్తు సంభవించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రె
అనంతపురం అగ్రికల్చర్: కరోనా విలయతాండవం మొదలైన 2020 మార్చిలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టడానికి భయపడ్డారు. చివరకు టీడీపీ నేతలు సైతం కనీసం ప్రజలకు నైతిక స్థైర్యం కల్పించలేక దాక్కున్నారు. లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయిన విపత్కర పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా, ముఖ్యంగా రైతులు, పేద వర్గాలకు అడుగడుగునా అండగా నిలబడి ‘నిజమైన పాలకుడి’గా వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు గత కొంత కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఉద్యాన రైతుల కోసం కిసాన్ రైలు కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లతో దేశవ్యాప్తంగా మార్కెట్లు బంద్ కావడంతో రూ.లక్షలు పెట్టుబడులతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు పడుతున్న అవస్థలపై అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించారు. ఎక్కడిక్కడ జిల్లాల పరిధిలో కాల్సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారు. స్థానిక అమ్మకాలపై దృష్టి సారించి కనీస పెట్టుబడులకు ఢోకా లేకుండా రూ.1,400 కోట్లు విలువ చేసే 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు క్రయవిక్రయాలు సాగించడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి నేరుగా ఢిల్లీ, నాగపూర్, ఝాన్సీ, ఆగ్రా మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు తరలించే ‘కిసాన్ రైలు’ను 2020, సెప్టెంబర్ 9న ప్రారంభించారు. మొదటి రైలులో 14 వ్యాగన్ల ద్వారా 322 టన్నుల ఉద్యాన ఉత్పత్తులు తరలించారు. ఇందులో 213.5 టన్నుల టమాట, 75 టన్నుల అరటి, 20 టన్నుల చీనీ, 8 టన్నుల కర్భూజా, 3 టన్నుల మామిడి, 2.50 టన్నుల బొప్పాయి ఉన్నాయి. స్పెషల్బోగీ ఏర్పాటు చేయడంతో 11 మంది రైతులు, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సెర్ఫ్ శాఖల నుంచి 15 మంది అధికారులు కూడా రైలులో ఢిల్లీకి వెళ్లి అక్కడి మార్కెటింగ్ వ్యవస్థపై అధ్యయం చేయగలిగారు. అనంతరం 2020 సెప్టెంబర్ 19న 12 వ్యాగన్ల ద్వారా 240 టన్నులు, అదే ఏడాది అక్టోబర్ 12న 12 వ్యాగన్ల ద్వారా 276 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు కిసాన్రైలు ద్వారా తరలించారు. అందులో చీనీ, మామిడి, దానిమ్మ, అరటి, టమాట, ఉసిరి, కర్భూజాతో పాటు వేరుశనగ లాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ చర్యల ద్వారా 2021, 2022, 2023, 2024లో జిల్లాలోని దాదాపు అన్ని రకాల ఉద్యాన ఉత్పత్తులకు ఉత్తర భారతదేశంలో మార్కెట్లో మంచి డిమాండ్ పెరిగింది. 2021లో చీనీ టన్ను ఏకంగా రూ.లక్ష ధర పలికింది. అలాగే అరటి టన్ను రూ.30 వేల మార్క్ను చేరుకుంది. టమాట కూడా ఒకానొక దశలో కిలో రూ.100కు చేరుకుంది. ఇలా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మార్కెటింగ్ పరిస్థితులు మెరుగుపడడంతో ఉమ్మడి జిల్లా రైతులకు పూర్తి ఆర్థిక భరోసా దక్కింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యాన ఉత్పత్తులకు గిట్టుబాటు కరువైపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అరటిని రోడ్డున పారబోస్తున్న దుస్థితి నెలకొందంటే రైతుల పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కష్ట కాలంలో రైతులకు అండగా నిలిచిన జగన్ సర్కార్ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యాన రైతులకు అడుగడుగునా ప్రోత్సాహం కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ, నాగపూర్ మార్కెట్లకు జిల్లా ఉద్యాన ఉత్పత్తులు -
మొక్కజొన్న రైతు కుదేలు
గోరంట్ల: ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30,713 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. గోరంట్ల మండలంలోనే అత్యధికంగా 6,454 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగుచేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ దాదాపు 2,14,991 క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధించారు. కొనుగోలుకు ముందుకు రాని చంద్రబాబు సర్కార్.. పంట సాగుకు ముందు ధరలు ఆశాజనకంగా ఉండడంతో జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. క్వింటా మొక్కజొన్నకు చంద్రబాబు ప్రభుత్వం రూ.2400 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ప్రభుత్వం దగా చేసింది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు కుమ్మకై క్వింటా మొక్కజొన్నను రూ.1,700 కు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ధరతో పంటను విక్రయిస్తే కనీసం పెట్టుబడులు సైతం చేతికి అందవని రైతులు వాపోతున్నారు. దీంతో చాలా మంది రైతులు మొక్కజొన్న బస్తాలను ఇళ్లలో నిల్వ చేసుకోగా, మరికొందరు రైతులు కల్లాల్లోనే ఆరబోస్తున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరతో మొక్కజొన్న దిగుబడులు కొనుగోలు చేయాలంటూ రైతులు బయపరెడ్డి, నారాయణప్ప, జయచంద్రారెడ్డి తదితరులు కోరుతున్నారు. గిట్టుబాటు కాని ధర క్వింటా రూ.2400తో మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించలేదు ఈ ఖరీఫ్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటకు క్వింటా రూ.2,400తో కొనుగోలు చేసేలా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – శివశంకర్నాయక్, మండల వ్యవసాయాధికారి, గోరంట్ల -
గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం
గీసుకొండ: జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని శ్రీసత్యసాయి జిల్లా అగళి, అనంతపురం జిల్లా పుట్లూరు మండలాలకు చెందిన కమ్యూనిటీ డెవలప్మెంట్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్టు సీనియర్ ట్రస్టీ రామాంజనేయులు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓబులేసు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు నాగమణి, ఆంజనేయులు, బాలవికాస సీనియర్ అసోసియేట్ కొట్టె రమాదేవితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామం సాధించిన ప్రగతి, విజయాలను జిల్లా ట్రైనింగ్ మేనేజర్లు కూసం రాజమౌళి, వనపర్తి కరుణాకర్ వివరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మేడిద సుశీల, గూడ సరోజన తదితరులు పాల్గొన్నారు. చెక్బౌన్స్ కేసులో ఏడాది జైలు అనంతపురం: చెక్ బౌన్స్ కేసులో ఏకంగా రూ.9 కోట్ల నగదు చెల్లింపుతో పాటు ముద్దాయిలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ అనంతపురం ఫస్ట్ క్లాస్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివశంకర్ తీర్పు వెలువరించారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ఆదినారాయణ వద్ద శ్రీలక్ష్మి (ఎన్ఆర్ఐ), అమిలినేని నరేష్ దంపతులు ఐదేళ్లక్రితం రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలో అప్పు వెనక్కి చెల్లిస్తున్నట్లుగా వారు అందజేసిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు అనంతపురం ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తుది వాదనలు విన్న అనంతరం శుక్రవారం తీర్పు వెలువడింది. వడ్డీతో సహ మొత్తం రూ.9 కోట్లు వెనక్కు చెల్లించడంతో పాటు ముద్దాయిలు శ్రీలక్ష్మి, అమిలినేని నరేష్ ఏడాది జైలు శిక్ష అనుభవించాలంటూ న్యాయమూర్తి తీర్పు వెలురించారు. రేపు ‘కవికాకి’ శతజయంతి ఉత్సవాలు అనంతపురం కల్చరల్: స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం ఉదయం కవి కాకి కోగిర సీతారామ్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కోగిర సీతారామ్ సమకాలిక కవులు ఏలూరు యంగన్న, రాజారాంతో పాటు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ, డాక్టర్ రాధేయ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన కోగిర జీవిత విశేషాలపై ప్రసంగించనున్నారు. అలాగే పద్యకవిత్వంపై వేదాద్రి చంద్రశేఖర్, వచన కవిత్వంపై డాక్టర్ అంకె శ్రీనివాస్, బాలసాహిత్యంపై ప్రజ్ఞా సురేష్, కోగిర జయచంద్ర, రాయుడు, కొత్తపల్లి సురేష్ తదితరులు ప్రసంగించనున్నారు. అలరించిన సంగీత కచేరీ ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా సింగపూర్ నుంచి విచ్చేసిన భక్తులు శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సంగీత విభావరి నిర్వహించారు. సత్యసాయిని కొనియాడుతూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. -
ప్రాణాలు బలిగొన్న చేపల వేట
తలుపుల: చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారుడు మడుగులో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... తలుపుల మండలం వేపమానిపేటకు రామాంజులు (35), మరో వ్యక్తితో కలసి శుక్రవారం శింగనపల్లి సమీపంలోని తాటిమాను మడుగులో చేపల వేటకు వెళ్లారు. ఒక వైపున వదిలిన వలలో చేపలు పడని విషయం గుర్తించిన రామాంజులు మరోవైపు వల వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వలను తీసుకుని మడుగులో ఈదుకుంటూ ముందుకు సాగాడు. మధ్యలోకి వెళ్లగానే ఆయాసం ఎక్కువైంది. అదే సమయంలో మడుగులోని జమ్ములో పంచె చుట్టుకోవడంతో నీట మునిగాడు. విషయాన్ని గుర్తించిన తోడు వచ్చిన వ్యక్తి వెంటనే గ్రామానికి చేరుకుని స్థానికులను తోడు పిలుచుకుని వచ్చే లోపు మృతి చెందాడు. రామాంజులుకు భార్య రామక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో టీచర్ మృతి మడకశిర: మండలంలోని ఆమిదాలగొంది జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషియల్ టీచర్గా పని చేస్తున్న నాగేంద్ర గురువారం రాత్రి హిందూపురం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లీలాఇంద్రప్రసాద్, నాయకులు ప్రతాపరెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, రాజేష్, ప్రకాష్రెడ్డి, సుబ్బారెడ్డి, సునీత, సుజాత, పీఆర్టీయూ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు రజనీకాంత్రెడ్డి, మధుసూదన్రెడ్డి, దామోదర్, స్థానిక ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
అడ్డొస్తున్నాడని హతమార్చారు!
పుట్టపర్తి టౌన్: వ్యక్తి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విజయకుమార్, సీఐ సురేష్, ఎస్ఐ కృష్ణమూర్తితో కలసి నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది జూలై 8న బుక్కపట్నం మండలం మారాల డ్యామ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆ గ్రామ వీఆర్ఏ పుల్లప్ప ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన బుక్కపట్నం పీఎస్ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితులుగా రెడ్డిపల్లికి చెందిన గంగాభవానీ, వంకరకుంటకు చెందిన గంగాధర్, విష్ణు, మోర్చలపల్లి నివాసి సుదర్శన్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మృతుడు గంగాభవానీ భర్త రామప్పగా నిర్ధారణ అయింది. పదేళ్లుగా కొనసాగుతున్న గంగాభవానీ, గంగాధర్ వివాహేతర సంబంధానికి రామప్ప అడ్డుగా ఉండడంతో అతన్ని హతమార్చాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విష్ణు, సుదర్శన్ను కలుపుకుని నలుగురూ కలసి జూలై 8న ఇంట్లో నిద్రిస్తున్న రామప్ప తలపై బండతో దాడి చేశారు. కాళ్లు చేతులు పట్టుకుని దుప్పటితో గాలి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం రామప్ప మృతదేహాన్ని స్కూటీలో తరలిస్తుండగా టైర్ పంచర్ కావడంతో ఆటోలో తరలించి మారాల డ్యామ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. మృతదేహం వద్ద పడి ఉన్న కడియం ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ చేయడంతో నేరాన్ని వారు అంగీకరించారు. దీంతో శుక్రవారం నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు, ఆటో, స్కూటీ, హత్యకు వినియోగించిన దుప్పటిని స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. భార్యతో సహ ముగ్గురికి రిమాండ్ వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్కుమార్ -
● యాడుండావ్ నాయనా! ఓసారి వచ్చిపో..
తలుపుల: ఇది ఓ కన్నతల్లి అరణ్య రోదన. ఉన్న ఊళ్లో ఉపాధి దొరక్క... బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడి ఆచూకీ తెలియక కన్నీటి పర్యంతమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తలుపుల మండలం కొవ్వూరివాండ్లపల్లిలోని దళిత వాడకు చెందిన శాంతమ్మ, గంగయ్య దంపతులకు ఏకై క కుమారుడు రామచంద్ర ఉన్నాడు. రామచంద్ర చిన్నప్పుడే తండ్రి మరణించాడు. అప్పటి నుంచి కుమారుడికి కష్టమనేది తెలియకుండా తల్లి పెంచి పోషించింది. ప్రస్తుతం రామచంద్రకు 28 ఏళ్లు. తాను ఏదైనా పని చేసి తల్లిని బాగా చూసుకోవాలని అనుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేసినా ఎక్కడేగాని ఉపాధి అవకాశాలు దక్కలేదు. దీంతో హైదరాబాద్కు చెందిన బోరువెల్ నిర్వాహకుడు శ్రీనివాసులురెడ్డిని కలసి ఆయన కంపెనీ తరఫున సౌత్ ఆఫ్రికాలో పనికి వెళ్లాడు. ఏడాదిగా సౌత్ ఆఫ్రికాలోనే ఉంటున్నాడు. రోజూ తల్లికి ఫోన్ చేసి ఆమె బాగోగులు అడిగి తెలుసుకునేవాడు. తిరిగి వచ్చేయాలని, ఇక్కడే ఏదోక పని చేసుకుని బతుకుదామని తల్లి చెబుతూ వచ్చేది. ఈ క్రమంలోనే గత నవంబర్ 23వ తేదీ వరకూ ఫోన్లో టచ్లో ఉన్న రామచంద్ర.. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. దేశం కాని దేశంలో తన బిడ్డకు ఏం కష్టమొచ్చిందోననే ఆందోళన ఆమెలో మొదలైంది. దీంతో హైదరాబాద్కు వెళ్లి శ్రీనివాసులురెడ్డిని కలసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే అతను పట్టించుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగి ఇంటికి చేరుకుంది. ప్రభుత్వం స్పందించి బిడ్డను తన వద్దకు చేర్చాలని శాంతమ్మ వేడుకుంటోంది. -
కియా కార్మికుడి దుర్మరణం
పెనుకొండ రూరల్: పుట్టపర్తి మండలం కొట్లపల్లికి చెందిన నరసింహమూర్తి (32) కియా ట్రైనింగ్ సెంటర్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధుల్లో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆయన.. హరిపురం సమీపంలోకి చేరుకోగానే వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. స్థానికుల సమాచారంతో కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పట్టుగూళ్ల మార్కెట్లో ఈ–పేమెంట్స్
● జనవరి నుంచి అమలుకు నిర్ణయం హిందూపురం: పట్టురైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2026 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టుగూళ్ల మార్కెట్లోనూ ఈ–పేమెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే హిందూపురం మార్కెట్కు గూళ్లు తెచ్చే రైతులకు జనవరి నుంచి ఈ–పేమెంట్స్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పట్టుగూళ్ల మార్కెట్ అధికారి హంపయ్య తెలిపారు. ఇకనుంచి పట్టుగూళ్లు తెచ్చే రైతులంతా తప్పనిసరిగా తమ బ్యాంకు పాసుబుక్ కాపీ వెంట తెచ్చుకుని మార్కెట్ ఆఫీసులో వివరాల అందజేయాలని సూచించారు. సుమధురం.. సాయి కీర్తనామృతం ప్రశాంతి నిలయం: సత్యసాయి ప్రేమతత్వాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని కొనియాడుతూ నిర్వహించిన సంగీత కచేరీతో భక్తులు ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సింగపూర్ సత్యసాయి భక్తులు గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సంగీత కచేరీ నిర్వహించారు. రవిచంద్ర పర్చురే బృందం సుమధురంగా సత్యసాయి కీర్తనలు ఆలపించగా...భక్తజనం తరించింది. 21న పల్స్ పోలియో ● విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ పిలుపు పుట్టపర్తి టౌన్: జిలాల్లో ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని, అందరూ సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఫైరోజా బేగం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సాయి ఆరామంలో ‘పల్స్ పోలియో’ నిర్వహణపై వైద్యాధికారులు, పర్యవేక్షణ అఽధికారులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ...21వ తేదీన 0 నుంచి ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. ముందస్తుగా పల్స్ పోలియోపై గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తొలిరోజే వంద శాతం లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఏదైనా కారణం చేత తొలిరోజు పోలియో చుక్కలు వేయింకోని చిన్నారులను గుర్తించి మరుసటిరోజు వేయాలన్నారు. తర్వాత వారి గృహాలను సందర్శిచి సర్వే చేసి నివేదికలు అందజేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని ‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అఽఽధికారి సునీల్కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్ బాబు, డీపీఎంఓ నాగేంద్రనాయక్ పాల్గొన్నారు. 8న పీజీలో స్పాట్ అడ్మిషన్లు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగులు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ నరసింహన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీజీ సెట్ రాయని అభ్యర్థులు, కోర్సులో చేరాలనే ఆసక్తి ఉన్న వారు ఈ నెల 8న ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలి. అడ్మిషన్ సమయంలోనే కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో కుట్టుమిషన్ల పంపిణీకదిరి అర్బన్: మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీలో ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నిస్తూ ‘మిషన్ ఫెయిల్’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డి స్పందించారు. జిల్లాలో 75 శాతం ముఖ హాజరుతో కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు త్వరలో కుట్టుమిషన్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మిషన్ల పంపిణీకి సంబంధించి విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో కార్యాచరణ మొదలైందని వివరించారు. -
ఇళ్లకు వెళ్లే ధైర్యం లేక..
చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అతివృష్టి, అనావృష్టితో పంటలు పండలేదు. ప్రభుత్వమూ ఆదుకోలేదు. విత్తనాలు, ఎరువులూ ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారు. పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా రైతు ఇళ్లకు వెళ్లాల్సి ఉన్నా...అధికారులు, ప్రజాప్రతినిధులు అంత సాహసం చేయలేకపోయారు. నేను కూడా రైతునే. కానీ రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎవరూ నా దగ్గరకు రాలేదు. – ఆవుటాల రమణారెడ్డి, రైతు, జిల్లా అగ్రిబోర్డు మాజీ చైర్మన్ -
అబద్ధాలతో మోసం చేయడం, చెవిలో పూలు పెట్టడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’ అంటూ అన్నదాతలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. రైతుకు సాయంగా నిలవకపోగా నిర్వహణ, ప్రచారం పేరిట రూ.కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు సర్కార్ ఉనికి కోసం చేసిన ఈ కార్యక్రమ
● ‘రైతన్నా మీ కోసం’నుప్రచారానికి వాడుకున్న చంద్రబాబు సర్కార్ ● నిలదీతల భయంతో రైతుల ఇళ్లకు వెళ్లని ప్రజాప్రతినిధులు ● రైతుకు సాయం చేయని సర్కార్..ఖర్చు మాత్రం రూ.కోట్లుపుట్టపర్తి అర్బన్: వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులకు వివరించి సాగును లాభసాటిగా చేస్తామంటూ చంద్రబాబు సర్కార్ ’రైతన్నా.. మీకోసం’ పేరుతో ఆరు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాల్సి ఉన్నా..జిల్లా ఎక్కడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. వ్యవసాయ, మార్కెటింగ్ అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అందరూ కార్యాలయాలకే పరిమితమయ్యారు. ప్రచారానికి మాత్రం ప్రభుత్వ ధనం రూ.కోట్లు కుమ్మరించారు. మమ అనిపించారు.. జిల్లాలో అట్టహాసంగా నవంబర్ 24న ‘రైతన్నా మీ కోసం’ ప్రారంభం కాగా, ఎమ్మెల్యేలు కేవలం ఆరోజు మాత్రం హడావుడి చేశారు. ఆ తర్వాత వారు ముఖం చాటేశారు. రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వారు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన ఎమ్మెల్యేలు రైతుల ఇళ్లకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఒకరిద్దరు మాత్రం టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లి వాళ్లే రైతులన్నట్లు హడావుడి చేసి కార్యక్రమాన్ని మమ అనిపించారు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్లకుండానే... జిల్లాలోని 2.59 లక్షల రైతు కుటుంబాలుండగా... వారందరినీ 5 రోజుల్లో కలవడం అసాధ్యమని భావించిన అధికారులు రోడ్లపై కనిపించిన వారితో పాటు ఆర్ఎస్కే దగ్గరకే వచ్చిన రైతులు, టీడీపీ కార్యకర్తలు, ఆపార్టీ సానుభూతిపరుల చేతిలో కరపత్రం పెట్టి ఫొటోలు దిగి వాటిని ఏపీ ఏఐఎంఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. ఈ మేరకే రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కార్యక్రమాన్ని మమ అనిపించారు. 3వ తేదీన జిల్లాలోని 348 ఆర్ఎస్కేల్లో రైతులు, ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచి వర్క్షాప్ నిర్వహించాల్సి ఉండగా... రైతులు రారని తెలిసి కేవలం టీడీపీ సానుభూతిపరులను పిలిచి కార్యక్రమాన్ని ముగించారు. యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్తో పాటు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్లలో ఏయే పంటలు సాగు చేస్తారు, ఎరువులు ఎంత కావాలి, దిగుబడి, మార్కెట్ తదితర వివరాలను రైతులను అడిగి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ పట్టనట్టు ఆర్ఎస్కే సిబ్బంది వ్యవహరించారు. అన్నీ కాకిలెక్కలు.. సాధారణంగా ఒక రైతు కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు రైతులుంటారు. అయితే వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులు ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో జిల్లాలోని 2,74,065 రైతు కుటుంబాల్లోని 10,38,924 మందిని కలిసినట్లు కాకి లెక్కలు చూపించారు. ఈ వివరాలను స్వయంగా జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ వెల్లడించారు. ఇందులో పురుష రైతులు 5,43,166 మంది, మహిళా రైతులు 4,95,758 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేలో లక్ష్యానికి మించి 6 శాతం అధికంగా ఇళ్లను సందర్శించినట్లు వెల్లడించారు. ఈలెక్కలు చూసి రైతులే ముక్కున వేలేసుకున్నారు. అన్నదాతలకు అన్యాయం అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రైతుల ఖాతాల్లో రూ. 20 వేలు జమ చేస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో (పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.4 వేలు కలిపి ) కేవలం రూ. 14 వేలు మాత్రం అందజేశారు. సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. ఇవన్నీ పక్కనపెడితే ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందించలేకపోయారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం పనులు వదిలేసి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. కనీసం ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు కూడా సకాలంలో ఇవ్వలేదు. -
పది శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
ప్రశాంతి నిలయం: వ్యవసాయ రంగంలో పది శాతం వృద్ధి సాఽధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పీఎండీడీకేవై పథకం అమలుపై గురువారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి ఠాకూర్ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్షించారు. కంది, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు, ఉద్యాన, మల్బరీ పరిశ్రమలపై గ్రామీణ ప్రజలు ఆధారపడ్డారన్నారు. 2025–26 వార్షిక ప్రణాళిక ప్రకారం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 10 శాతం వృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పీఎండీడీకేవై కింద రైతులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాము నాయక్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఎల్డీఎం రమణ కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయప్రసాద్, పశుసంవర్దకశాఖ అధికారి శుభదాస్, సెరికల్చర్ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సానుకూలత పెంచేందుకు కృషి చేయండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించి సానుకూల దృక్ఫథం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీ సచివాలయ నుంచి సీఎస్ విజయానంద్ వివిధ అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల్లో సానుకూల దృక్ఫథం పెరిగేలా చూడాలన్నారు. స్క్రబ్ టైఫస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా... ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్క్రబ్ టైఫస్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందన్నారు. అలస్యం చేస్తే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఐదు రోజులకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీరంపై నలుపు మచ్చలు, దద్దుర్లు, బలహీనత తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్ను సంప్రదించాలన్నారు. అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
ఓటరు మ్యాపింగ్ సర్వే వేగవంతం చేయండి
మడకశిర రూరల్: ఓటరు జాబితా మ్యాపింగ్ సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. మడకశిర మండలం ఆర్.అనంతపురం వద్ద పరిశ్రమలకు సంబంధించిన భూములను పరిశీలించేందుకు గురువారం వచ్చిన ఆయన సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఇప్పటి వరకు 37 శాతం మాత్రమే ఓటరు జాబితా మ్యాపింగ్ సర్వే పూర్తి చేశారని అధికారులపై మండి పడ్డారు. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. అనంతరం రైతులను కలసి సమస్యలపై ఆరా తీశారు. కార్యకర్మంలో తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ కార్యకర్త దాడి పుట్టపర్తి టౌన్: వైఎస్సార్సీపీ నాయకుడు చింతా శ్రీధర్రెడ్డిపై టీడీపీ కార్యకర్త వినయ్నాయక్ దాడికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితుడు గురువారం పుట్టపర్తి అర్బన్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... వ్యక్తిగత పనిపై జిల్లా కేంద్రానికి వచ్చిన పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామానికి చెందిన చింతా శ్రీధర్రెడ్డి స్థానిక సత్యసాయి సూపర్ ఆస్పత్రి ఆటో స్టాండ్ వద్ద నిలబడి ఉండగా బడేనాయక్ తండాకు చెందిన టీడీపీ కార్యకర్త వినయ్నాయక్ గొడవ పడి ఇనుపరాడ్తో దాడి చేశాడు. వారం రోజుల్లోపు చంపేస్తామంటూ బెదిరిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న శ్రీధర్రెడ్డిని స్థానికులు వెంటనే సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రమణీయం.. రథోత్సవం
మడకశిర రూరల్: ‘జై హనుమాన్...పవన పుత్రా పాహిమాం’ అంటూ వేలాది మంది భక్తులు కీర్తించగా జిల్లేడుగుంట గ్రామం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లెడుగుంటలో ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. అనంతరం పురోహితులు హోమం, విశేష పూజలు నిర్వహించి రథోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు బొరుగులు, అరటిపండ్లు రథంపై విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జ్యోతులు, భూతప్ప ఉత్సవాలను నిర్వహించనున్నారు. కనుల పండువగా జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
పెనుకొండ రూరల్: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వృద్ధుడు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ మేరకు కియా పీఎస్ ఎస్ఐ రాజేష్ బుధవారం వెల్లడించారు. పెనుకొండ మండలం దుద్దేబండ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు పక్కన తీవ్రగాయాలతో ఓ వృద్ధుడు పడి ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు కియా పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ రాజేష్ కోరారు. వాహనం ఢీకొని మరొకరు... పెనుకొండ: స్థానిక శ్రీకృష్ణదేవరాయ జంక్షన్లో 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ మేరకు పెనుకొండ పీఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే పెనుకొండ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. డివైడర్పై కుళ్లిన వ్యక్తి మృతదేహంపెనుకొండ రూరల్: మండలంలోని కొత్తచెరువు మలుపు సమీపంలో 44వ జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కియా పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల పైబడి వయస్సు ఉన్న వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్లిన దశలో పడి ఉంది. డివైడర్పై ఏపుగా గడ్డి పెరిగి ఉండడంతో సకాలంలో గుర్తించలేకపోయారు. బుధవారం డివైడర్పై గడ్డి తొలగిస్తున్న కార్మికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికిలో మార్చురీకి తరలించారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే కియా పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ రాజేష్ కోరారు. వృద్ధుడి దుర్మరణం లేపాక్షి: బొలెరో ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి గ్రామ పంచాయితీ పరిధిలోని కుర్లపల్లికి చెందిన నారాయణప్ప (70)కు చెవులు సరిగా వినిపించవు. వ్యక్తిగత పనిపై బుధవారం లేపాక్షికి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి దాటుతుండగా కొడికొండ చెక్పోస్టు వైపు నుంచి హిందూపురం వైపుగా వేగంగా వెళుతున్న బొలెరో ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా శ్రీనివాస్ అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా విజయవాడ డీడీగా పని చేస్తున్న శ్రీనివాస్ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గత కొంత కాలంగా ఇన్చార్జ్ డీడీగా అసిస్టెంట్ జియాలజిస్టు ఆదినారాయణ విధులు నిర్వర్తిస్తున్నారు. వడ్డుపల్లికి చేరిన కుడికాలువ నీరు కూడేరు: మండలంలోని పీఏబీఆర్ నుంచి ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాలకు ఈ నెల 1న ధర్మవరం కుడికాలువ ద్వారా విడుదల చేసిన నీరు రెండు రోజుల తర్వాత బుధవారం ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చేరాయి. కుడికాలువ పరిధిలో ఆయా నియోజకవర్గాల్లో 49 చెరువులున్నాయి. తొలుత చివరన ఉన్న తాడిమర్రి మండలం అగ్రహారం చెరువును నీటితో నింపిన తర్వాత అక్కడి నుంచి మిగిలిన చెరువులను నింపుతూ చివరన పీఏబీఆర్ దిగువన ఉన్న మరుట్ల చెరువును నింపనున్నారు. -
ప్రతి నీటి బొట్టూ విలువైనదే
నల్లమాడ: ప్రతి నీటి బొట్టూ విలువైనదేనని, రైతులు పొదుపుగా వాడుకొని బంగారు పంటలు పండించుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నల్లమాడలో ఏర్పాటు చేసిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం రాయితీతో అందించే డ్రిప్, స్ప్రింక్లర్లతో బిందు సేద్యాన్ని అలవాటు చేసుకొని సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగుచేయాలన్నారు. పీఎం ‘ధన్ ధ్యాన కృషి యోజన’ పథకం కింద రైతులు ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో పంటలు సాగుచేసేలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. చిక్కుడు, మల్బరీ, బొప్పాయి, పూలు, కాయగూరల సాగుపై జిల్లా రైతులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమం అనంతరం ప్రజలు కలెక్టర్ శ్యాం ప్రసాద్కు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్, పశుసంవర్థక అధికారి సుభదాస్, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ అధికారి సుదర్శన్, తహసీల్దార్ మనోజ్కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష.. ప్రశాంతి నిలయం: జిల్లాలో చేపట్టిన చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్ట్ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ల పనుల పురోగతి, నీటి నిల్వల వివరాలను ఆరా తీశారు. చిన్న నీటి పారుదల శాఖ ఎస్ఈ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 1,186 చిన్న నీటి ట్యాంకులు ఉండగా... 680 చెరువుల్లో 5.702 టీఎంసీల నీరు ఉందని వివరించారు. యోగివేమన ప్రాజెక్ట్లో 0.8 టీఎంసీలు, రామగిరి మండలం అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్లో 0.01 టీఎంసీ నీరు ఉన్నట్లు వివరించారు. రూ.3.39 కోట్ల వ్యయంతో 198 చెరువులకు సంబంధించిన పనులు చేపట్టామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ రాజాస్వరూప్ కుమార్ మాట్లాడుతూ, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 183 చెరువులను నింపేందుకు 5.08 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, ఇప్పటివరకు 60 చెరువులను 3.10 టీఎంసీ నీటితో నింపామన్నారు. గుడిపల్లి రిజర్వాయర్ కోసం చేపట్టిన పనులను ఈ సందర్భంగా వివరించారు. ‘ఎఫ్’ లైను దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు భూములు సర్వే సరిహద్దుల నిర్ధారణ కోసం ప్రజల నుంచి అందే ఎఫ్ లైను దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ మండల సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లను హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎఫ్ లైన్ దరఖాస్తుల పరిష్కారంపై సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. నవంబర్ నెలలో ఎఫ్ లైన్ దరఖాస్తులు 175 అందాయని, వాటిలో కొన్ని అమోదించగా, నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించామన్నారు. మండల సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు తమ పరిధిలో లేని సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, సర్వే శాఖ ఏడీ విజయశాంతి బాయి, మండల సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు పాల్గొన్నారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ -
గుప్పుమంటున్న గంజాయి
సోమందేపల్లి: జిల్లాలో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా కొనసాగుతోంది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండక ముందే గంజాయి మత్తులో యువత పెడదారిన పడుతోంది. గత రెండేళ్లుగా హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ ప్రాంతాల్లోని టీ కేఫ్ల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగిస్తుండగా... పారిశ్రామిక వాడల్లో బహిరంగంగానే అమ్మకాలు కొనసాగుతుండడం గమనార్హం. మత్తులో యువకులు పరస్పర దాడులకు దిగడం, మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడటం, వాహనాలను శరవేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడి మృతిచెందడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిలో విద్యార్థులు సైతం ఉండడం ఆందోళనకరం. ఉత్తర భారతం నుంచి దిగుమతి.. పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లో పలు పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటిలో బిహార్, జార్ఘండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు పనిచేస్తున్నారు. తరచూ తమ స్వస్థలాలకు వెళ్లిన వారు అక్కడి నుంచి తిరిగి వస్తూ రైలు మార్గంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. తొలుత తమ వ్యక్తిగత వ్యసనాలకు గంజాయిని వినియోగిస్తున్న వలస కార్మికులను గమనించిన స్థానిక యువత అతి త్వరగా ఆకర్షితులయ్యారు. ఈ రెండేళ్లలో జిల్లాలో గంజాయి వినియోగం భారీగా పెరిగింది. ఇటీవల పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. సోమందేపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఏడాది క్రితం గంజాయి మత్తులో బైక్ నడుపుతూ పెనుకొండ ఆర్టీఓ చెక్పోస్టు వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు. నెల క్రితం సోమందేపల్లి పెద్దకొండ సమీపంలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు కొండపైకి బైక్ నడుపుతూ అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నవాజ్ అనే యువకుడు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మరో ఘటనలో గంజాయి మత్తులో ఓ యువకుడు స్థానిక ఓ పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాజాగా మంగళవారం రాత్రి సోమందేపల్లిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. మత్తులో జోగుతున్న యువత సోమందేపల్లిలో పేట్రేగిపోతున్న పోకిరీలు -
బలవంతపు భూసేకరణ ఆపాలి
హిందూపురం: పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి పంట భూములను బలవంతంగా లాక్కోడం దుర్మార్గమని, ఈ ప్రక్రియను తక్షణమే ఆపేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హిందూపురం మండలం రాచేపల్లి, చలివెందుల, మలుగూరు, చర్లపల్లి, బాలంపల్లి, కొండూరు తదితర గ్రామాల్లో బుధవారం వివిధ ప్రజా సంఘాల నాయకులు పర్యటించి భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోవడంతో బలవంతపు సేకరణకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోందని మండిపడ్డారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదన్నారు. కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. రామ్కుమార్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల ప్రభాకరరెడ్డి, చైతన్య గంగిరెడ్డి, రైతుసంఘం నాయకులు సిద్ధారెడ్డి, ఓపీడీఆర్ శ్రీనివాసులు, ఎస్యూసీఐ నాయకులు గిరి, రంగనాయకులు, రైతు సంఘం నాయకులు కాసీం, కార్మిక నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ -
ఊసే లేని దత్తత
‘‘మనతోపాటు పుట్టినవాడికి తిండిలేదు, మనం పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉంటే.. వాడికేమో ఇల్లు లేదు. మీలో చాలా మంది సమాజం వల్ల పైకి వచ్చారు. కాబట్టి తిరిగి దానికి ఎంతో కొంత ఇవ్వాలి. పేదవాళ్లుగానే ఉన్న మీతోటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను సంపన్నులు తీసుకోవాలి. దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలనే ‘మార్గదర్శి–బంగారు కుటుంబం.. పీ4–జీరో పావర్టీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’. – ఈ ఏడాది మార్చి 31న పీ4–జీరో పావర్టీ కార్యక్రమం ప్రారంభంలో సీఎం చంద్రబాబు పుట్టపర్తి అర్బన్: సంపద సృష్టిస్తానని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు.. పేదలను ఆదుకునేందుకు సంపన్నుల వెంట పడ్డారు. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని గొప్పలకు పోయారు. పీ–4కు ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేసి పేదల ఇళ్లలో కొత్త వెలుగులు నింపుతామని ఆర్భాటంగా ప్రకటించారు. చివరకు అక్క, చెల్లెమ్మలకు మొండి చెయ్యి చూపారు. దీంతో పీ4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించాలనే కార్యక్రమం కాస్త అటకెక్కింది. ఇందుకోసం పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయం వెనుక పీ4 సర్వే అధికారుల కోసం సిద్ధం చేసిన భవనం తలుపులు నేటికీ తెరుచుకోలేదు. కార్యక్రమం ఉద్దేశం ఇదే... సంపన్న వర్గాల్లోని 10 శాతం మంది.. అట్టడుగున ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకుని వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే పీ–4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దత్తత తీసుకునే వారిని మార్గదర్శులు అని.. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా పేర్కొంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిబంధన మేరకు ఒక్కో మార్గ దర్శకుడు కనీసం నాలుగు కుటుంబాలను దత్తతకు తీసుకోవాల్సి ఉంది. గుర్తించిన బంగారు కుటుంబాలకు ఆర్థికేతర మద్దతు ఇవ్వాల్సి ఉంది. అంటే విద్య, వ్యవసాయం, మార్గదర్శకత్వం, ఆర్థిక ప్రణాళిక, సాంకేతికత, నిర్మాణం, చట్టపరమైన సహాయం అందించాలి. ఆర్థిక మద్దతు కింద దత్తత తీసుకున్న కుటుంబాలకు ప్రతి నెలా నిత్యావసరాలకు కనీసం రూ.500, జీవనోపాధికి రూ.5వేలు. ఆర్థిక సహాయం అందించాలి. అయితే మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక్కడే తిరకాసు మొదలైంది. రాష్ట్రంలోనే అత్యధిక సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న సీఎం చంద్రబాబు ముందుగా పేదలను దత్తత తీసుకోవాల్సి ఉండగా... ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. నీతులు పరుల కోసమేననే ధోరణితో దత్తత భారాన్ని సంపన్నుల నెత్తిన రుద్దారు. 10 నెలలుగా అవగాహన సదస్సులు, సర్వేలు చేయించారు. అయినా దత్తతకు సంపన్నులు, అధికారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించి బంగారు కుటుంబాలకు సాంత్వన ఎన్నడనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మొత్తం 46,209 బంగారు కుటుంబాలను, 5,893 మంది మార్గదర్శకులను అధికారులు గుర్తించారు. అయితే ఏ మండలంలో ఎంత మందిని, ఏ గ్రామంలో ఎవరిని గుర్తించారనే వివరాలను అధికారులు వెల్లడించలేక పోతున్నారు. పేదల దత్తతకు ముందుకు రాని ధనికులు, ఉద్యోగులు బంగారు కుటుంబాలకు దక్కని సాంత్వన పేదల్లో ఆశలు రేపి మిన్నుకుండిపోయిన ప్రభుత్వం సైట్ ఓపెన్ కావడం లేదు పేదలను ఆదుకునే పీ4–జీరో పావర్టీ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్నది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూపొందించిన వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు. ప్రస్తుతం గుర్తించిన మార్గదర్శకులు, బంగారు కుటుంబాల లబ్ధిదారులకు సలహాలు, సూచనలు మాత్రం ఇస్తున్నాం. – విజయ్కుమార్, సీపీఓ -
12న కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
పుట్టపర్తి అర్బన్/టౌన్: అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు ధర్నా నోటీసును బుధవారం జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఐసీడీఎస్ పీడీ ప్రమీలకు అందజేసి, మాట్లాడారు. మొబైల్ యాప్ల భారం తగ్గించాలని, సకాలంలో వేతనాలు మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులను అందించాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, కోరారు. ఇవే డిమాండ్ల సాధనకు గతంలో 42 రోజుల పాటు సమ్మెలోకి వెళితే... ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా... నేటికీ అంగన్వాడీల సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోసంపై ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. కార్యక్రంమలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, డిప్యూటీ సెక్రెటరీ వెంకటేషు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీషా, కార్యదర్శి సంపూర్ణమ్మ, దేవి, భాగ్యలక్ష్మి, చంద్రకళ, రమాదేవి, షామీరా, శకుంతల తదితరులు పాల్గొన్నారు. -
తాడిపత్రిలో పిల్లల అపహరణ కలకలం
తాడిపత్రి రూరల్: స్థానిక ఆర్డీటీ కాలనీలో బుధవారం పిల్లల అపహరణ కలకలం రేగింది. మత్తుతో కూడిన బిస్కెట్లు, చాక్లెట్లు చిన్నారులకు ఇచ్చి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ జంటను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దంపతులు కౌసల్య, వెంకట్రాముడు కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తన కుమార్తెతో కలసి కౌసల్య తాడిపత్రికి చేరుకుని ఆర్డీటీ కాలనీలో నివాసముంటోంది. బుధవారం వెంకట్రాముడు తన వెంట మరో యువతిని వెంటబెట్టుకుని తాడిపత్రికి చేరుకుని కూతురిపై మమకారంతో ఆరా తీయడం మొదలు పెట్టాడు. రమేష్రెడ్డి కాలనీలోని పాఠశాలలో చదువుకుంటున్నట్లుగా తెలుసుకుని అక్కడకు చేరుకుని తన వద్ద ఉన్న కుమార్తె ఫొటోలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు చూపించాడు. అక్కడ లేదని తెలుసుకున్న అనంతరం వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థులకు పంచి ఆర్డీటీ కాలనీకి వెళ్లి భార్య, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు. తన వద్ద మిగిలిన చాక్లెట్లు, బిస్కెట్లను కాలనీలోని చిన్నారులకు పంపిణీ చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకుని వివరాలు అడిగారు. సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఆప్గ్రేడ్ పీఎస్కు తరలించారు. వెంకట్రాముడు చెబుతున్న వివరాలను నిర్ధారించుకునేందుకు కౌసల్య, ఆమె కుమార్తెను పిలిపించారు. విచారణలో వెంకట్రాముడు చెప్పింది వాస్తవమని నిర్ధారించుకున్నారు. అయితే వెంకట్రాముడు వద్ద కత్తి ఉండడంతో అనుమానాలు రేకెత్తాయి. కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో భార్య అడ్డుపడితే కత్తితో దాడి చేయాలని అనుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులో ధర్మవరం వాసులు -
పోలీస్ శాఖకు డ్రోన్లు అందజేసిన కొరియన్లు
పెనుకొండ: సామాజిక బాధ్యతలో భాగంగా కియా పరిశ్రమలో పనిచేస్తున్న కొరియన్లు ఓ బృందంగా ఏర్పడి రూ.15 లక్షల విలువ చేసే డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు అందజేశారు. వీటిని కొరియన్ల చేతుల మీదుగా మంగళవారం రాత్రి పెనుకొండలోని సీఐ కార్యాలయంలో ఎస్పీ సతీష్కుమార్ అందుకున్నారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పాఠశాలలో క్షుద్ర పూజలు నల్లచెరువు: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఉపాధ్యాయులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేయించారు. క్షతగాత్రుడికి అందని వైద్యంఅగళి: స్థానిక పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రుడికి సకాలంలో వైద్యం అందలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వివరాలు... అగళి మండలం బొమ్మసనపల్లికి చెందిన అశోక్ బుధవారం రాత్రి ఆటోలో బొమ్మసనపల్లి గేటు నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొన్నాడు. ఘటనలో అశోక్కు తలకు బలమైన రక్తగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతన్ని వెంటనే స్థానికులు అగళిలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే అక్కడ 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కానీ, సిబ్బంది కాని లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ లోపు క్షతగాత్రుడి పరిస్థితి విషమిస్తుండడంతో ఆగమేఘాలపై రొళ్లలోని పీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. -
ప్రపంచ శాంతికి పాటుపడదాం
● సర్వమతాల సారం ఒక్కటే ● బాబయ్య దర్గా పీఠాధిపతి తాజ్బాబా పిలుపు పెనుకొండ: సర్వమతాల సారం ఒక్కటేనని, ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ప్రపంచశాంతికి పాటుపడాలని బాబయ్య దర్గా పీఠాధిపతి తాజ్బాబా పిలుపునిచ్చారు. బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దర్గా ఆవరణలో సర్వమత సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి తాజ్బాబా మాట్లాడుతూ... ప్రస్తుతం అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. ఇది మానవ జాతి మనుగడకు పెద్ద కీడుగా మారిందన్నారు. ఏ దేశంలో మతసామరస్యం వెల్ల్లివిరిస్తుందో అక్కడ శాంతి పరిఢవిల్లుతుందని, ఆ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పలువురు మత పెద్దలు జాతీయ సమైక్యత గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో సిక్కు మఠాధిపతి జగ్జ్యోత్సింగ్, కవులు తులసీదాస్, ముద్దరంగప్ప, అతావుర్ షాబుద్దీన్, జాన్ ప్రియనాథ్, జాబిలి చాంద్బాషా, ఉమర్ ఫారూక్ఖాన్, ఉల్గార్ దర్గా పీఠాధిపతి మదని తదితరులు పాల్గొన్నారు. దీపారాధనకు పోటెత్తిన భక్తులు బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన దీపారాధన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి దీపారాధనకు టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మండుతున్న అగ్ని గుండంలో టెంకాయలు వేసి మైమరచిపోయారు. -
సాయి ప్రేమే శ్రీరామ రక్ష
ప్రశాంతి నిలయం: ప్రేమతత్వంతో సత్యసాయి భక్తకోటిని ఆదరించాడని, ఆయనే ప్రేమే సకల జనులకు శ్రీరామ రక్ష అన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మైమరపించాయి. పర్తియాత్రలో భాగంగా సింగపూర్ సత్యసాయి భక్తులు బుధవారం పుట్టపర్తికి విచ్చేశారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి సింగపూర్ విద్యాసంస్థల చిన్నారులు ‘సర్కిల్ ఆఫ్ లవ్’ పేరుతో నాటిక ప్రదర్శించారు. సత్యసాయి చూపిన ప్రేమ మార్గాన్ని వివరిస్తూ చక్కటి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. -
పుట్టపర్తి మీదుగా వందేభారత్ ఎక్స్ప్రెస్
గుంతకల్లు: బెంగళూరు–కలబురిగి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను శ్రీ సత్యసాయి పుట్టపర్తి మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి కలబురిగి జంక్షన్ నుంచి ఈ రైలు (22231) ఉదయం 6.10కి బయలుదేరి 6.48 గంటలకు యాదగిరి, 7.38కి రాయచూర్, 9.00 గంటలకు గుంతకల్లు జంక్షన్, 10.03 గంటలకు అనంతపురం, 11 గంటలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, మధ్యాహ్నం 2.10 గంటలకు బెంగళూరు జంక్షన్కు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో జనవరి 2 మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు జంక్షన్ (22232) నుంచి బయలుదేరి సాయంత్రం 4.23 గంటలకు శ్రీసత్యసాయి పుట్టపర్తి ప్రశాంతి నిలయం, 5.33 గంటలకు అనంతపురం, 6.37 గంటలకు గుంతకల్లు, రాత్రి 8.18 గంటలకు రాయచూర్, రాత్రి 10.45 గంటలకు కలబురిగి జంక్షన్కు చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏడుగురు విద్యార్థుల డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న యూజీ మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. బుధవారం జరిగిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడిన ఏడుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. హిందూపురంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురిని బుక్ చేశామన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? రొద్దం: ‘‘పెద్దగువ్వలపల్లి గ్రామ సమీపాన అగ్రిగోల్డ్ సంస్థ పెంచిన నీలగిరి చెట్లను మంత్రి సవిత అనుచరులు నరుకుతుంటే.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉన్పర ఉప్పేంద్ర, శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు మా కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు... ప్రశ్నిస్తే దాడులు చేస్తారా’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. బుధవారం ఆమె మండలంలోని గోనిమేకులపల్లిలో పర్యటించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చిన్నప్పయ్య కుమారుడు హరీష్ ఫోన్ చేసి బెదిరించారన్నారు. మంత్రి అండతో టీడీపీ నాయకులు మండలంలోని ప్రకృతి వనురులను దోచుకుంటున్నారన్నారు. ఈ దారుణాల గురించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పినా, పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పటికైనా స్పందించి అక్రమంగా చెట్లను నరుకుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరోసారి వైఎస్సార్ సీపీ జోలికోస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. యక్షిత్.. అరుదైన ఘనత పెనుకొండ: పట్టణానికి చెందిన టీడీ యక్షిత్ అరుదైన ఘనత సాధించాడు. స్థానిక బ్రిలియన్స్ స్కూల్లో చదువుకుంటున్న యక్షిత్ అక్టోబర్ 5న చైన్నెలో ప్రపంచ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో పాల్గొన్నాడు. 863 మందితో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కగా..అందులో పాల్గొన్న యక్షిత్కు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు సర్టిఫికెట్ పంపారు. బుధవారం పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవిత సర్టిఫికెట్ను యక్షిత్కు అందించి అభినందించారు. అలాగే యక్షిత్కు శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ రామచంద్రను కూడా ప్రశంసించారు. -
షీప్ సొసైటీ ఎన్నికలకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ)కు ఎన్నికలు నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ షీప్ డెవలప్మెంట్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 సొసైటీలు రిజిష్టర్ చేసుకోగా... అందులో డిపార్ట్మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తయినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 84 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిలిపివేశారు. 2018లో ఎన్సీడీసీ కింద రూ.10.66 కోట్లు రుణాల పంపిణీకి సంబంధించి సక్రమంగా కంతులు కట్టని 342 మందిని డిపాల్ట్ర్ జాబితాలో పెట్టినట్లు ఈ శాఖ వర్గాలు తెలిపాయి. డీ–పాల్టర్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హత లేదన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 45 సొసైటీలకు, శ్రీసత్యసాయి జిల్లాలో 39 సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందులో మొదటి విడత కింద ఈనెల 5న 55 సొసైటీలకు, రెండో విడతగా ఈనెల 12న 29 సొసైటీలకు ఎన్నిక జరగనుంది. వెటర్నరీ డాక్టర్లు (వీఏఎస్) ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఒక్కో సొసైటీలో ఏడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు షీప్ డెవలప్మెంట్ ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి తెలిపారు. రేపు తొలివిడతగా 55 సొసైటీలకు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు (శుక్రవారం) తొలివిడతగా 55 షీప్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో మందనకుంట, ధేమకేతేపల్లి, గౌనివారిపల్లి, బాలంపల్లి, చలివెందుల, పరిగి, చాలకూరు, మాగేచెరువు, పత్తికుంటపల్లి, సోమందేపల్లి, గొడ్డువెలగల, డబురువారిపల్లి, వంచిరెడ్డిపల్లి, వెంకటగిరిపాలెం, రాంపురం, వెంగలమ్మచెరువు, కోగిర, ఎం.కొత్తపల్లి, రొద్దం, తురకలాపట్నం, యర్రాయపల్లి, హరియాణ్చెరువు, బిల్వంపల్లి, దాదులూరు, భానుకోట, కొండపల్లి, కేఎన్ పాళ్యం, తగరకుంట, గంగరెడ్డిపల్లి, దుబ్బార్లపల్లి సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12న మిగతా సొసైటీలకు.. రెండో విడత కింద ఈ నెల 12న శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి, కొడపగానిపల్లి, రామస్వామితాండ, నసనకోట, పి,కొత్తపల్లి, ఆత్మకూరు సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు 55 సొసైటీలకు, 12న 29 సొసైటీలకు ఎన్నికలు సొసైటీలను దక్కించుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు -
కల్యాణం.. కమనీయం
మడకశిర రూరల్: నారసింహుడి నామస్మరణతో జిల్లేడుగుంట మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తరపల్లి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. తొలుత అర్చకులు భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ భక్తుల జయజయ ధ్వానాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ లక్ష్మీనారసింహుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి తరించారు. కల్యాణోత్సవంలో ఉభయదారులుగా హరేసముద్రం సీతాలక్ష్మి, హెచ్ఎస్ హనుమంతరావు కుటుంబం వ్యవహరించింది. అంతకుముందు ఆంజనేయస్వామి దేవాలయంలో పురోహితులు హోమం, వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు బ్రహ్మరథోత్సవం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు. జిల్లేడుగుంట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉదయం 11.15 గంటల బ్రహ్మరథోత్సవం ప్రారంభమవుతుందని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం -
‘మిషన్’ ఫెయిల్!
కదిరి అర్బన్: మహిళల స్వయం అభివృద్ధి కోసం జిల్లాలో నిర్వహించిన కుట్టు శిక్షణ ‘ఫెయిల్’ అయ్యింది. జిల్లాలోని 59 కేంద్రాల్లో 8,097 మంది మహిళలు 3 నెలల పాటు కుట్టుపై శిక్షణ పొందారు. గత అక్టోబర్లోనే శిక్షణ పూర్తి చేసుకున్నా... ఇంతవరకు వీరికి కుట్టు మిషన్లు అందజేయలేదు. మహిళా సాధికారితకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రికి బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ వృథా.. ఇంటివద్దనే టైలరింగ్ చేసుకుని ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ఆశతో ఎందరో మహిళలు వ్యయప్రయాసల కోర్చి కుట్టు శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ సమయంలో కేంద్రాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు అర్హత ఉన్న వారికి బ్యాంకు రుణాలు సైతం ఇప్పిస్తామని చెప్పడంతో మహిళలంతా ఎంతో ఆశపడ్డారు. శిక్షణ పూర్తయి రెండు నెలలు దాటినా మిషన్లే ఇవ్వలేదు. దీంతో శిక్షణ సమయంలో నేర్చుకున్నదంతా వృథా అయ్యిందని అభ్యర్థులు వాపోతున్నారు. ట్రైనర్లకు సైతం జీతాల్లేవ్! జిల్లా వ్యాప్తంగా కుట్టు శిక్షణా కేంద్రంలో మహిళలకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్లకు జీతాలు సైతం ఇవ్వలేదు. దీంతో వారంతా జీతాల కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వారికే జీతాలు ఇవ్వనపుడు తమకు మిషన్లు ఇస్తారో ఇవ్వరో అని పలువురు లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళల స్వయం ఉపాధికి కుట్టు శిక్షణ మూడు నెలల పాటు శిక్షణ పొందిన మహిళలు నేటికీ కుట్టుమిషన్లు పంపిణీ చేయని వైనం మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచి తద్వారా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పింది. కుట్టు శిక్షణ ద్వారా ఇంటివద్దే ఉపాధి కల్పిస్తామని మహిళల్లో ఆశలు రేపింది. మూడు నెలల కోర్సు పూర్తి చేస్తే చాలు మిషన్ కూడా అందిస్తామని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో మాత్రంలో చేసి చూపలేకపోయారు. -
వెంటనే మిషన్లు ఇవ్వాలి
కదిరిలో ఎలాంటి పరిశ్రమలు లేవు. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు ఇంటివద్దనే నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు కుట్టు శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికి రెండు నెలలు దాటినా ప్రభుత్వం మిషన్లు ఇవ్వలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిషన్లు పంపిణీ చేయాలి. – సలీమా, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు, కదిరి త్వరలో మిషన్లు వస్తాయి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కుట్టుపై శిక్షణ ఇచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు త్వరలోనే మిషన్లు అందజేస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా మిషన్లు ఇవ్వలేదు. – రామసుబ్బారెడ్డి, ఈడీ, బీసీ కార్పొరేషన్ -
మామిడి రైతులకు ‘పూత టెన్షన్’
తలుపుల: మామిడి రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. రాలిపోతున్న మామిడి పూత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్దిపాటి పూత వచ్చిన తోటలకు కూడా దిత్వా తుపాను దెబ్బ తగిలింది. 49,870 ఎకరాల్లో తోటలు జిల్లా వ్యాప్తంగా సుమారు 49,870 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. ఇప్పటి వరకూ మామిడి తోటల్లో చెట్లకు పూత కనిపించడం లేదు. ఈ పాటికి పూత దశలో ఉండాల్సిన మామిడి తోటలు ఖాళీ చెట్లతో వెలవెలలాడుతున్నాయి. గత ఏడాది మామిడి ధర ఉన్నప్పటికీ పురుగులు, తెగుళ్ల అకాల వర్షాలతో కాయలు నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధర పతనమైంది. దీనివలన కోతకు వచ్చినా ధరలు లేక మామిడి కోత కోయకుండా వదిలేశారు. కాయలు కోయక చెట్లలోనే ఉండిపోవడంతో చెట్లలో బలం తగ్గిపోయి ఈఏడాది పూతలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా పూత వచ్చే అవకావంలేదని, మరో ఏడాది వరకూ వేచి చూడాల్సిన చూడాల్సిందేనంటున్నారు. ఏటా నష్టాలే.. ఈఏడాది పూత పరిస్థితిని బట్టి 30 శాతం కూడా వచ్చేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అక్కడక్కడా కొద్ది పాటి పూత వచ్చినా దిత్వా తుపాను దెబ్బకు పూత రాలిపోతందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దిశ తుపాను దెబ్బకు జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది రైతులు తమ తోటల్లో సుమారు లక్ష టన్నులు దిగుబడి వచ్చినా అమ్ముకోలేక నష్టపోయారు. పరిహారమివ్వని చంద్రబాబు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది పురుగులు, తెగుళ్లతో అకాల వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫసల్ బీమా కింద రైతులను ఆదుకుంటామని ప్రభుత్వాలు ఆర్భాట ప్రచారాలు చేశాయి. న్యాయం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా 2,353 మంది మామిడి సాగు రైతులు 5032 ఎకరాలకు ఫసల్ బీమా చేశారు. అధికారులు సైతం నష్టాన్ని అంచనా వేసి రిపోర్టులు పంపారు. అయితే నేటికీ నష్టపరిహారం మాత్రం అన్నదాతలకు అందలేదు. 80 శాతం మామిడి తోటల్లో కనిపించని పూత గత ఏడాది తుపానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం వరుస నష్టాలతో అన్నదాతల అవస్థలు -
కలెక్టర్ సుడిగాలి పర్యటన
పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఆర్డీఓ సువర్ణ, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. మొదట బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామ పరిధిలోని కొట్టాలపల్లిలో ఉపాధి పనుల కింద చేపట్టిన ఉద్యాన పంటలు, మామిడి తోటలు, నీటి నిలువ గుంతలను పరిశీలించారు. తర్వాత కొత్తచెరువు మండలం కొత్తపల్లిలో ఫారంపాండ్లు, ఉద్యాన తోటలు, డ్రిప్ సదుపాయాలను పరిశీలించారు. నారేపల్లిలో రైతులతో మాట్లాడారు. రాసింపల్లిలో మామిడి తోటలను చూశారు. ఫ్రూట్ కవర్లు, ఫ్లైట్రాప్, సేంద్రియ ద్రావణాల తయారీ తదితర విధానాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పాఠాలు బోధించిన కలెక్టర్ కలెక్టర్ శ్యాంప్రసాద్ బుక్కపట్నం ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులతో ఆరాతీశారు. అనంతరం పాముదుర్తి ఉన్నత పాఠశాలలో బోర్డుపై స్వయంగా ఇంగ్లిష్, హిందీని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించారు. పలు ప్రశ్నలు సంధించి సమాధానాలను రాబట్టారు. అక్కడి నుంచి పాముదుర్తిలో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించారు. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాయింట్ ఎల్పీఎంలను రూపొందించకూడదని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీహెచ్ఓ చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, డిఈఓ కిష్టప్ప, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సమన్వయంతో పని చేయండి ప్రశాంతి నిలయం: జిల్లా ఆస్పత్రుల్లో వైద్య సేవలు బలోపేతం చేయడంతో పాటు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్య సేవలు, ఆస్పత్రి భవన నిర్మాణ పురోగతి, శానిటేషన్ మెరుగుదలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అంచనాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రుల్లో టెస్టులు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఽ ధర్మవరం, మడకశిర, కదిరి, తనకల్లు, పెనుకొండ, నల్లమాడ ఆస్పత్రుల భవన మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు. బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో పొలాలు, ఉపాధి పనుల పరిశీలన -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయండి
● ఎస్పీ సతీష్కుమార్ ధర్మవరం అర్బన్: అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పోలీసులదేనని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్ను ఎస్పీ సతీష్కుమార్ తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. అక్రమ మద్యం, ఇసుక, మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. అవినీతికి తావులేకుండా అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఎస్పీతోపాటు ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, టూటౌన్ సీఐ రెడ్డెప్ప, సీసీ చిరంజీవి, ఎస్ఐ వెంకటరాముడు, సిబ్బంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన కనగానపల్లి: మండలంలోని మద్దెలచెరువు తండాలోని అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం స్థానికులు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. అంగన్వాడీ కార్యకర్త చెక్కరమ్మ సెలవులో వెళ్లడంతో ఆయా లలితాబాయి విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా గ్రామస్తులు రుక్మిణి, గోపాల్నాయక్, వెంకటేష్ నాయక్, చిట్టెమ్మ ఆరోపించారు. ఆమైపె ఇప్పటికే నాటుసారా కేసులు ఉన్నాయని తెలిపారు. అయినా తన తీరు మార్చుకోక ఏకంగా కేంద్రంలోనే అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ విషయంపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఆయాను మార్చే వరకూ కేంద్రానికి పిల్లలను పంపేది లేదని తేల్చిచెప్పారు. కాగా, ఈ విషయంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ లతాకిరణ్ను వివరణ కోరగా.. త్వరలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయాపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
భక్తిశ్రద్ధలతో గంధం వేడుక
బాబయ్యస్వామి మొదటి గంధం వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సజ్జద్బాబా ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నుంచి భక్తిశ్రద్ధలతో ఆయన కుటుంబ సభ్యులు, భక్తులు దర్గా వద్దకు చేర్చారు. అనంతరం స్వామి సమాధి వద్ద ప్రార్థనలు చేసి గంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పక్కీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తాదులతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున కలెక్టర్ శ్యాంప్రసాద్, మంత్రి సవిత బాబయ్యస్వామికి చాదర్ను సమర్పించారు. – పెనుకొండ: -
రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయస్థానం
కదిరి అర్బన్: పల్నాడులో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించినట్లు హ్యాండ్బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్కుమార్, మహేష్ తెలిపారు. మంగళవారం పల్నాడులోని తిరుమల ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఆంధ్ర భారీ స్కోర్అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా కర్ణాటక, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న అండర్ –19 కూచ్బెహార్ క్రికెట్ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 415 పరుగుల భారీ స్కోర్ చేసింది. 300/5 ఓవర్నైట్ స్కోర్ మంగళవారం ఉదయం మ్యాచ్ను కొనసాగించిన ఆంధ్ర జట్టు లోహిత్ 74, పరమ్వీర్ సింగ్ 70 చేసి జట్టు స్కోర్ను 415 పరుగులకు చేర్చారు. అనంతరం బరిలో దిగిన కర్ణాటక జట్టు ఆది నుంచి తడబడింది. 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో మణిక్రాంత్ 56, సిద్ధార్థ్ అఖిల్ 60, ధృవ్ కృష్ణ 28, అన్వయ్ ద్రావిడ్ 13 పరుగులు చేశారు. పోటీలు జరిగాయని పేర్కొన్నారు. -
ఉచితం మాటున ‘ఇసుక దందా’
గోరంట్ల: గృహ అవసరాల పేరుతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గృహ నిర్మాణా అవసరాలతో పాటు ఇతర అవసరాలకు వాగులు, వంకల నుంచి ఇసుక తరలించుకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఇసుక రీచ్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అధికార పార్టీ నాయకులు వాగులు, వంకల్లోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇబ్బందుల్లో ప్రజలు గోరంట్ల మండలంలో ఇసుక దొరకకపోవడంతో గృహ, ఇతర నిర్మాణ పనులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం ఇసుక రీచ్ను ఏర్పాటు చేయడంతో ఇసుక కొరత ఉండేది కాదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను తీసివేశారు. దీంతో గోరంట్ల మండలంలో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ నాయకులు పరిగి, రొద్దం మండలాల్లోని నదుల నుంచి నిత్యం ఇసుక గోరంట్ల మండలానికి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నారు. రోజూ 20 నుంచి 30 ట్రాక్టర్ల ఇసుక రొద్దం, పరిగి మండలాల నుంచి గోరంట్ల తరలివస్తోదంటే ఇసుక దందా ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చారు. కళ్ల ముందే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఆయా మండలాల పోలీసు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టి రీచ్ ఏర్పాటు చేసి తక్కువ మొత్తానికి ఇసుక వినియోగదారులకు చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
పట్టు రైతులపై కనికరమేదీ?
పట్టు రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రైతులపై ఏమాత్రమూ కనికరం చూపడం లేదు. ప్రోత్సాహక సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్నాం. అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించి ఆదుకుంటామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా పైసా చెల్లించలేదు. ఇప్పటికై నా మాట నిలబెట్టుకోవాలి. – వేమారెడ్డి, పట్టు రైతు, పాపసానిపల్లి, మడకశిర మండలందశల వారీగా ఉద్యమం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక బకాయిలు రాబట్టడానికి దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పట్టుపరిశ్రమశాఖ ఏడీలను కలిసి వినతి పత్రాలు అందించాం. త్వరలోనే ఎమ్మెల్యేలందరినీ కలిసి వినతిపత్రాలు ఇస్తాం. ప్రభుత్వం స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. – వెంకట్రామిరెడ్డి, సోమ్కుమార్, పట్టు రైతుల కమిటీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు -
మహిళలకు రక్షణ కరువు
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, అమ్మాయిలపై ఈవ్టీజింగ్లు పెరిగిపోతున్నాయన్నారు. బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులు నిందితులకు వత్తాసు పలకడం ఎంతమాత్రమూ కరెక్టు కాదని అన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని కోరుతూ బాధితులతో కలిసి సోమవారం పుట్టపర్తిలో ఎస్పీ సతీష్కుమార్ను కలిసి విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పోలీస్ కార్యాలయం ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, అమ్మాయిలపై దాడులు జరిగినప్పుడు పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయకుండా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాప్తాడులో అంగన్వాడీ కార్యకర్తను దారుణంగా కొట్టినా, సోమందేపల్లిలో ఎంపీటీపీ శివమ్మపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని ఎండగట్టారు. హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేస్తే కొంతమందిపై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం జీరో ఎఫ్ఐఆర్, దిశ యాప్ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేకపోవడంతో మహిళలకు భద్రత కరువవుతోందన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మహిళల గురించి గొప్పగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహామండలి మాజీ చైర్మన్ అవుటాల రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, జిల్లా అధికార ప్రతినిధి ఫొటోసాయి తదితరులు పాల్గొన్నారు. దాడులు, దౌర్జన్యాలపై ఉదాసీనత తగదు బాధితుల పక్షాన నిలవకుండా.. నిందితులకు వత్తాసేంటి? ఎస్పీని కలిసి విన్నవించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ప్రతిపాదనకే పరిమితమా?
మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమైపోయింది. నియోజకవర్గంలో మడకశిర అప్గ్రేడ్ పోలీస్స్టేషన్తో పాటు రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లన్నీ కర్ణాటక సరిహద్దులోనే ఉన్నాయి. ఇవన్నీ పెనుకొండ పోలీస్ సబ్డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. పెనుకొండకు మడకశిర 42, గుడిబండ 65, అమరాపురం 85, అగళి 85, రొళ్ల 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మడకశిర నియోజకవర్గంలోని ప్రజలు పనుల నిమిత్తం డీఎస్పీని కలవాలంటే పెనుకొండకు పోవాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకుని ఉంది. దీంతో మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉంది. గతంలో పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడ పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై పరిశీలన కూడా చేశారు. అయినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్సీపీ హయాంలోనే సర్కిల్ విభజన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర పోలీస్ సర్కిల్ను విభజించారు. ప్రత్యేకంగా మడకశిర రూరల్ సర్కిల్ ఏర్పాటైంది. రూరల్ సర్కిల్ పరిధిలోకి గుడిబండ, అమరాపురం, రొళ్ల, అగళి పోలీస్ స్టేషన్లను చేర్చారు. రూరల్ సర్కిల్కు సీఐని నియమించారు. అలాగే మడకశిర పోలీస్స్టేషన్ను అప్గ్రేడ్ చేసి, సీఐని కేటాయించారు. ఈ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మడకశిర మున్సిపాలిటీ, మడకశిర రూరల్ మండలాన్ని చేర్చారు. మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే పరిపాలనాపరంగా సులభంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని నెలల కిందట ఈ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర హోం మంత్రి.. మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మడకశిరలోనే ఏర్పాటు చేయాలి మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్ డివిజన్ను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం సుదూరంగా ఉన్న పెనుకొండ పోలీస్ సబ్డివిజన్ కార్యాలయానికి వెళ్లడం ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కనుక మడకశిరలోనే పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి హోంమంత్రి తన హామీ నిలబెట్టుకోవాలి. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మడకశిర కార్య రూపం దాల్చని మడకశిర పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటు -
పట్టు రైతుల ఉద్యమ బాట
మడకశిర: ప్రోత్సాహకాలు అందించడంలో చంద్రబాబు సర్కారు తీరును నిరసిస్తూ రాష్ట్ర పట్టు రైతుల కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పట్టు రైతులు ఉద్యమబాట పట్టనున్నారు. రైతులు రెండు రకాల పట్టుగూళ్లు పండిస్తారు. మొదటిది బైవోల్టిన్, రెండోది సీబీ (క్రాస్ బ్రీడ్)రకం పట్టుగూళ్లు. సీబీ రకం పట్టుగూళ్లను రెండు శాతం మంది రైతులు మాత్రమే పండిస్తారు. బైవోల్టిన్ పట్టుగూళ్లను 98 శాతం మంది పండిస్తారు. పట్టుగూళ్ల మార్కెట్లలో విక్రయించిన రెండు రకాల పట్టుగూళ్లకు ప్రభుత్వం ప్రతి కిలోకూ ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రధానంగా సీబీ రకం పట్టుగూళ్లకు కిలోకు రూ.10, బైవోల్టిన్ రకానికి రూ.50 చొప్పున ప్రోత్సాహం కింద చెల్లించాలి. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరాక పట్టు రైతులకు ప్రోత్సాహక నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే బకాయిలన్నీ విడుదల చేసి ఆదుకుంటామని చెప్పి మాట తప్పారని పట్టు రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.80 కోట్లు ‘ప్రోత్సాహకం’ బకాయిలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ.33 కోట్ల దాకా బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. బైవోల్టిన్ పట్టు రైతులకు అందని ప్రోత్సాహకం పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిలు ఏడాదిన్నర అవుతున్నా కరుణించని చంద్రబాబు సర్కార్ -
●లక్ష్మీనారసింహా.. నమోనమః
మడకశిరరూరల్: లక్ష్మీనారసింహ గోవిందా.. గోవింద అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణ, అంకురార్పణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని తరించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన హనుమంతయ్య, రామాంజనప్ప వారి కుటుంబ సభ్యులచే, ఆంజినేయస్వామి ఆలయంలో గోవిందరాజులు, రత్నమ్మ కుటుంబ సభ్యులచే ధ్వజారోహణ, అంకురార్పణ, అగ్నిహోత్ర, హోమం తదితర కార్యక్రమాలను పురోహితులు నిర్వహించారు. స్వామివార్లకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేశారు. అదే విధంగా రొళ్ల జెడ్పీటీసీ అనంతరాజు కుటుంబ సభ్యులు స్వామి వార్లకు పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సర్పంచులు కరియన్న, రామాంజినేయులు, ఈఓ నరసింహరాజు, కమిటీ చైర్మన్ నర్సేగౌడ్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేడు హనుమద్ వ్రతం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయాల్లో స్వామి వార్లకు మన్యసూక్త పవమాన హోమం, హనుమద్వ్రతం, అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తరపల్లి, జిల్లెడుగుంట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తరలివచ్చిన భక్తులు నేడు హనుమద్వ్రతం -
అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టండి
ప్రశాంతి నిలయం: ధర్మవరం మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్ను పాలక మండలి సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్ శ్యాం ప్రసాద్ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ధర్మవరంలో మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మకై ్క ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని చైర్పర్సన్ కె.లక్ష్మి, వైస్ చైర్మన్లు జయరామిరెడ్డి, శంషాద్బేగం, పలువురు కౌన్సిలర్లు కోరారు. అధికారులు ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేతిరెడ్డి సూర్యప్రతాప్రెడ్డి తాగునీటి పథకంలో కమిషనర్, మేనేజర్ కుమ్మకై ్క మోటారు మరమ్మతులు, డీజిల్ బిల్లులు రూపంలో రూ.40 లక్షలు కాజేశారన్నారు. అనధికార లేఅవుట్లకు రూ.లక్షల్లో డబ్బు దండుకుంటున్నారని ఆరోపించారు. డ్రెయినేజీల పేరుతో అరకొర పనులు చేసి రూ.93 లక్షలు బిల్లు చేసుకున్నారన్నారు. రేగాటిపల్లి జగన్న కాలనీ, పోతులనాగేపల్లి, కుణుతూరు జగన్న కాలనీలను విలీనం చేయాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని విన్నవించారు. కాగా, పరిష్కార వేదికకు 244 వినతులు అందాయి. జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ వినతులు స్వీకరించారు. చట్టంపై అవగాహన కలిగి ఉండాలి వికలాంగుల హక్కుల చట్టం– 2016పై అన్ని శాఖల అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని నిర్వహించిన ప్రరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వికలాంగులు హక్కుల చట్టం–2016పై తెలుగు అనువాద పుస్తకాన్ని వివిధ శాఖల అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి అర్చన, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనాథల ఆరోగ్యానికి ‘అమృత’ భరోసా వృద్ధాశ్రమాల్లోని వృద్ధులు, అనాథ శిశువులకు ఉచిత వైద్య చికిత్సలు అందించే అమృత హెల్త్ స్కీమ్ కార్డులను కలెక్టర్ శ్యాంప్రసాద్ అందజేశారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా పరిధిలోని రిజిస్టర్డ్ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన 55 మంది అనాథలకు, 117 మంది వృద్ధులకు మొత్తం 172 మందికి అమ్మృత స్కీమ్ కార్డులను అందజేశారు. అలాగే జిల్లాలోని మూడు ప్రభుత్వ బాలసదనాలు, ఆరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, డీఎంఅండ్హెచ్ఓ ఫైరోజా బేగం, డిసీహెచ్ఎస్ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● జిల్లాలో పీఎం ధన ధాన్య కృషి యోజనను సంపూర్ణంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పథకం అమలు పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్కు ధర్మవరం మున్సిపల్ పాలకవర్గం ఫిర్యాదు -
సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి
అనంతపురం: సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ (54) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. రాజకీయ, అధికార, అనధికారులతో సుదీర్ఘ పరిచయాలు ఉన్న కాలవ రమణ... జిల్లా కరువు, సాగునీటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మృతిపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు నర్సింగ్ హోం వద్దకెలిల రమణ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు మృతదేహాన్ని స్వస్థలం హిందూపురానికి కుటుంబసభ్యులు తరలించారు. కాగా, వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత గల కాలవ రమణ మృతి బాధాకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందరితో కలివిడిగా, ఆప్యాయంగా ఉంటూ అభిమానంగా మాట్లాడే కాలవ రమణ పత్రికా లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. పాత్రికేయ వృత్తిలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి బాధాకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. హిందూపురంలోని కాలవ రమణ నివాసం వద్ద మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిష్కార వేదికకు 98 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 98 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని, చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ 93 శాతం పూర్తిపుట్టపర్తి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ పక్రియ తొలిరోజు 93 శాతం మేర పూర్తయిందని డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పింఛన్ తీసుకోని వారికి మంగళవారం అందజేస్తారన్నారు. పింఛన్ల పంపిణీని కొత్తచెరువు మండలం బైరాపురంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. -
ప్రభుత్వ కుంటలో పనులు ఆపాలి
రొద్దం: మండలంలోని రొద్దకంపల్లి గ్రామంలో ఉన్న అంగజాల కుంట కొందరి స్వార్థం కారణంగా ఉనికి కోల్పోతుందని, జేసీబీలను ఏర్పాటు చేసి కుంట కట్టను తొలగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే కుంటలో పనులు ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. సోమవారం రొద్దం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 97లో 16 ఎకరాల్లో విస్తరించిన అంగజాల కుంటను కొందరు అక్రమించుకుని కట్టను చదును చేస్తున్నారని వివరించారు. కుంటకు సంబంధించిన రికార్డులు పరిశీలించి తనకు పంపాలని ఆర్టీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ ఉదయశంకర్రాజుకు సూచించారు. కార్యక్రమంలో రొద్దం గ్రామ దళిత వాడకు చెందిన రైతులు, రొద్దకంపల్లి గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు. పరిష్కార వేదికలో మంత్రి సవితకు రైతుల వినతి -
మృత్యువులోనూ వీడని బంధం
మడకశిర రూరల్: వారి బంధాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. ఏడడుగుల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు చావులోనూ ఒక్కటయ్యారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్ను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారు అక్కడికక్కడే మరణించారు. వివరాలు... మడకశిర మండలం గుడ్డంపల్లికి చెందిన జ్యోతి, కృష్ణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వగ్రామంలో వైఎస్సార్సీపీ కీలక నేతగా గుర్తింపు పొందిన కృష్ణారెడ్డి స్థానిక పంచాయతీ వార్డు సభ్యుడిగా గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. బెంగళూరులోని డాన్బాస్కో పాఠశాలలో జ్యోతి పనిచేస్తుంది. ఈ క్రమంలో కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి కుమారుడు మధుసూదన్రెడ్డితో కలసి కారులో వచ్చారు. ఆదివారం స్వగ్రామంలో నూతన ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. హాసన్లో ద్వితీయ పీయూసీ (ఇంటర్) చదువుతున్న మధుసూదన్రెడ్డికి పరీక్ష ఉండడంతో సోమవారం తెల్లవారుజామున కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జడగొండనహళ్లి వద్దకు చేరుకోగానే పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. జ్యోతి (35), కృష్ణారెడ్డి (41) అక్కడికక్కడే మృతి చెందారు. మధుసూదన్రెడ్డితో పాటు బంధువు, జక్కేపల్లికి చెందిన చిదంబరరెడ్డి స్వల్స గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై మధుగరి పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలియగానే గుడ్డంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తరలించారు. విషయం వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వైసీ గోవర్థన్రెడ్డి, రాష్ట్ర వక్కలిగ విభాగం అధ్యక్షుడు రంగేగౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, తాలూకా బూత్ కమిటీ మేనేజర్ మల్లికార్జున, వివిధ విభాగాల కమిటీ సభ్యులు దేవరాజు, సిద్దగంగప్ప, నాగభూషణరెడ్డి, నరేష్రెడ్డి, హరిప్రసాద్, నగేష్, నాయకులు, వార్డు సభ్యులు... కృష్ణారెడ్డి దంపతుల మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ప్రమాదంలో దంపతుల మృతి బలిగొన్న పొగమంచు ప్రాణాలతో బయటపడిన కుమారుడు, మరో వ్యక్తి జ్యోతి, కృష్ణారెడ్డి (ఫైల్) -
ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం
పుట్టపర్తి అర్బన్: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత హెచ్ఐవీపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ హెచ్ఐవీ కలిగిన వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదని, మనలో ఒకరిగా చూడాలని తెలిపారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమస్థాయి అవార్డు లభించిందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు మొత్తం 7 అవార్డులు వచ్చాయన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ అనుపమజేమ్స్ మాట్లాడుతూ ఐదేళ్లుగా ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి స్వచ్ఛంద సంస్థలు పని చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, కమిషనర్ క్రాంతికుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్, జిల్లా సూపర్వైజర్ రమణ, ఇమ్యునైజేషన్ అధికారి సురేష్బాబు, డీపీఎంఓ నాగేంద్రనాయక్, నోడలాఫీసర్ సునీల్కుమార్, డెమో రామలక్ష్మి, మంగళకర, సంస్కృతి విద్యాసంస్థల విద్యార్థులు, శ్రీవిజ్ఞాన్, వెంకటేశ్వర జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, అనంత నెట్ వర్క్, జనజాగృతి, శక్తి మైత్రి, ఆర్డీటీ, లింక్ వర్కర్ వీఎంఎం సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలు వైద్య ఆరోగ్యశాఖతో కలిసి ఎయిడ్స్ నివారణ, నియంత్రణకు పని చేసిన పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందజేశారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. హెచ్ఐవీ బాధితులను మనలో ఒకరిగా గౌరవిద్దామన్నారు. వేరు చేసి చూడరాదన్నారు. దాతల సహకారంతో సేకరించిన పౌష్టికాహారాన్ని 30మంది చిన్నారులకు అందజేశారు. హెచ్ఐవీ కలిగిన పిల్లలు, పెద్దలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
కిరాతక మేనమామ అరెస్ట్
కదిరి టౌన్: మేనల్లుడిని కిరాతకంగా హతమార్చిన మామను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కదిరి రూరల్ పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ వెంకటశివనారాయణస్వామి వెల్లడించారు. గత నెల 26న తలుపుల మండలం గరికిపల్లికి చెందిన గంగాధర్, చంద్రకళ కుమారుడు చిన్నారి హర్షవర్ధన్(4) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మేనమామ తమ్ముతక ప్రసాద్ గరికిపల్లికి వెళ్లి హర్షవర్దన్ను తన బైక్పై ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన తమ్ముతక ప్రసాద్పై అనుమానాలు బలపడ్డాయి. దీంతో గాలింపు ముమ్మరం చేసి సోమవారం మూర్తిపల్లి పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతుండగా కదిరి రూరల్ పీఎస్ సీఐ నాగేంద్ర, సిబ్బంది అరెస్ట్ చేశారు. విచారణలో హర్షవర్దన్ను హతమార్చిన తీరును నిందితుడు వివరించాడు. దీంతో అతని వద్ద నుంచి మోటార్ సైకిల్, 4 గ్లౌజులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
రైతు చూపు.. కూరగాయల వైపు
పుట్టపర్తి అర్బన్: స్వల్పకాలిక పంటలైన కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు నికలడగా ఉంటూ గిట్టుబాటు అవుతుండటమే ఇందుకు కారణం. జిల్లాలో 25,214 ఎకరాల్లో కూరగాయలు, ఆకు కూరలు, దోస, కళింగర, పూల తోటలు సాగుచేస్తున్నారు. ఇందులో అత్యధికంగా టమాట 20,463 ఎకరాల్లో పెట్టారు. వంకాయ 651 ఎకరాలు, అనప 540, ఆలూ 320, ఎండు మిరప 725, పచ్చి మిరప 620, చిక్కుడు 156, ఉల్లి 432, ఇతర కూరగాయలు 1,307 ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే జిల్లా వాసులకు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో బాగేపల్లి, డీ క్రాస్, మదనపల్లి, బెంగళూరు, చైన్నె, అనంతపురం తదితర మార్కెట్లలో కూరగాయలు విక్రయిస్తున్నారు. హిందూపురం, కదిరి, గోరంట్ల , ధర్మవరం వంటి ప్రాంతాల్లో మార్కెట్లు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైతులు కోరుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. నిలకడగా ధరలు సాధారణంగా కూరగాయల ధరలు హెచ్చు తగ్గులు అవుతుంటాయి. అయితే కొద్ది రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు నిలకడగా ఉంటున్నాయి. 13 కిలోల టమాట బాక్సు రూ.350 – 450, వంకాయ 10 కిలోల సంచి రూ.150, ఆలూ 50 కిలోల బస్తా సుమారు రూ.1550, అనపకాయలు కిలో రూ.50, చిక్కుడు కిలో రూ.40, పచ్చి మిరప కిలో రూ.35, ఎండు మిర్చి టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేలు, ఉల్లి 50 కిలోల బస్తా రూ.750 వరకు పలుకుతున్నాయి. ఉల్లి ధరలు మాత్రం పతనమయ్యాయి. సాధారణంగా సాగు చేసే వేరుశనగ, మొక్కజొన్న, కంది, వరి పంటల కంటే కూరగాయల సాగు మేలని పలువురు రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్లో నిలకడగా ధరలు సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు జిల్లాలో 25,214 ఎకరాల్లో వివిధ రకాల తోటలు -
60 చీనీ చెట్ల నరికివేత
తాడిమర్రి: చిల్లకొండయ్యపల్లిలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 60 చీనీచెట్లు నరికివేశారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల సీఐ శ్యామరావు ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చిల్లకొండయ్యపల్లిలో కొంకా తిరుపాల్ తనకున్న సర్వే నంబర్ 24–5లోని పొలంలో ఐదేళ్ల క్రితం 300 చీనీ మొక్కలు సాగు చేశాడు. ఆదివారం ఉదయం నీరు పెట్టడానికి వెళ్లగా తోటలో 60 చీనీ చెట్లు నరికివేతకు గురవడం చూసి తిరుపాల్ భార్య కళావతి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధితులు అక్కడి నుంచి తాడిమర్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ వారు ఏఎస్ఐతో మాట్లాడుతూ ఇటీవల నెలకొన్న రస్తా వివాదం కారణంగానే గుర్తు తెలియని వ్యక్తులు తమ చీనీచెట్లను నరికేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఏఎస్ఐ తన సెల్ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్చేసి ముదిగుబ్బ సీఐ శ్యామరావ్కు వివరాలు తెలిపారు. చెట్లు ఎవరు పీకారో చెప్పలేనప్పుడు ‘ఏం.... కి వచ్చారు’ అంటూ మహిళ అని కూడా చూడకుండా సీఐ అనుచిత వ్యాఖ్యలు చేశారని రైతు దంపతులు ఆరోపించారు. అనంతరం వారు అక్కడి నుంచి ధర్మవరం వెళ్లి డీఎస్పీ హేమంత్కుమార్కు సీఐ ప్రవర్తన తీరుతో పాటు చీనీచెట్ల నరికివేత గురించి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని తాడిమర్రి పోలీసులను ఆదేశించారు. చిల్లకొండయ్యపల్లిలో ఘటన ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీఐ అనుచిత వ్యాఖ్యలు డీఎస్పీకి బాధిత రైతు దంపతుల ఫిర్యాదు -
మెనూకు మంగళం
పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో పోషకాహారం సక్రమంగా అందడం లేదు. మెనూ అమలుకు మంగళం పాడారు. కోడిగుడ్లు, చిక్కీ అందకపోయినా సరఫరాదారులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల కోసం మధ్యాహ్న భోజనం పథకంలో మెనూలో మార్పులు తీసుకురావడంతో పాటు పోషక విలువలు కలిగిన కోడిగుడ్లు, చిక్కీలు చేర్చారు. అంతేకాకుండా సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సహకారంతో విద్యార్థులకు రాగి మాల్ట్ పథకానికీ శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా పోషకాహారం అందుతుండటంతో విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగింది. సెలవులు, పండుగ దినాల్లో సైతం విద్యార్థుల ఇళ్లకు పోషకాహారం అందించారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ఉన్న మధ్యాహ్న భోజన పథకం సరుకుల సరఫరాదారులను తొలగించి అధికార పార్టీకి చెందిన వారికి ఏజెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి విద్యార్థులకు పోషకాహారం సరిగా అందడం లేదు. వారంలో ఐదు రోజులపాటు కోడిగుడ్లు, మూడు రోజులపాటు చిక్కీలు ఇవ్వాలి. ప్రస్తుతం కోడిగుడ్లు మూడు రోజులు మాత్రమే అందుతున్నాయి. ఇక గతంలో ఒక్కో విద్యార్థికి 25 గ్రాముల పరిమాణం ఉన్న చిక్కీ ఇచ్చేవారు. ఇప్పుడు పరిమాణం బాగా కుదించి.. నాణ్యత కూడా తగ్గించేశారు. చాలా పాఠశాలల్లో చిక్కీలు కనిపించడం లేదు. ఎక్కడో అక్కడక్కడ అరకొరగా అందించి మమ అనిపిస్తున్నారని తెలిసింది. మెనూ పక్కాగా అమలు చేయాల్సిన విద్యా శాఖ అధికారులు విషయం తెలిసినా మిన్నకుండి పోతున్నారు. అధికార పార్టీ వారే సరఫరాదారులు కావడంతో ఎవరిపై చర్యలు తీసుకుంటే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీదారులు సరుకులు కోత విధిస్తూ సొమ్ము వెనకేసుకోగా.. పోషకాహారం అందక విద్యార్థులు సతమతమవుతున్నారు. కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసే అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోషకాహారం పక్కదారి.. ప్రభుత్వ బడుల్లో కోడిగుడ్లు గల్లంతు చూద్దామన్నా కనిపించని చిక్కీలు ఏజెన్సీదారులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం!చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం కోడిగుడ్లు, చిక్కీలు క్రమం తప్పకుండా అందించాలి. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. సరిగా అందడం లేదని మాకు ఎక్కడా ఫిర్యాదు అందలేదు. ఎక్కడైనా అటువంటి సమస్య ఉన్నట్లు మా దృష్టికి వస్తే విచారణ జరిపి.. సరఫరా చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. – కృష్ణప్ప, డీఈఓ గుడ్లు ఇవ్వడం లేదు మాకు వారం రోజులుగా కోడిగుడ్లు ఇవ్వడం లేదు. భోజనంతోనే సరిపెడుతున్నారు. రెండేళ్ల కిందటి వరకు రోజుకో రకం రుచికరమైన భోజనం, కోడిగుడ్లు, చిక్కీలు, రాగిమాల్ట్ అందాయి. ప్రస్తుతం ఏమైందో తెలియదు మాకు పెట్టే భోజనంలో తగ్గించేశారు. ఎప్పుడు ఏమి ఎగరగొడతారో తెలియడం లేదు. – చందన, ఐదో తరగతి, పుట్టపర్తి -
విస్తరిస్తున్న విషసంస్కృతి
ధర్మవరం: పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధర్మవరం నియోజకవర్గంలో చీనీ, మామిడి, బొప్పాయి, నేరేడు వంటి మొక్కలను, చెట్లను నరికి వేయడం లాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ కక్షలతో ప్రారంభమై అధికార పార్టీ అండతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులకే పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో ఒకరిని చూసి మరొకరు దారుణాలకు తెగబడుతున్నారు. మూడుసార్లు చెట్ల నరికివేత.. రేగాటిపల్లి పంచాయతీ పరిధిలోని ముచ్చురామి గ్రామం రైతు రామ్మోహన్రెడ్డి 40 ఏళ్లుగా రేగాటిపల్లి సొసైటీలో సభ్యునిగా ఉండి 2.50ఎకరాల పొలాన్ని సాగు చేసుకునే వాడు. ఐదేళ్ల క్రితం ఈ పొలంలో 500 దాకా మామిడి, ఉసిరి, అల్లనేరేడు తదితర మొక్కలు నాటాడు. అయితే ఈ పొలానికి సంబంధించి ఆన్లైన్ రికార్డులను తన పేరిట ఎక్కించుకున్న అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు, మాజీ ఎంపీపీ గుర్రప్ప రైతును ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. చంద్రబాబు సర్కారు రాగానే పొలంలో 300 చెట్లు నరికించాడు. ఆ తర్వాత మూడు నెలల క్రితం 70 మొక్కలను మట్టుబెట్టించాడు. తాజాగా బుధవారం 150 మొక్కలను నరికించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. ఇవే ఘటనలు పునరావృతమయ్యాయి. ఏకంగా వారి దౌర్జన్యాలు పరాకాష్టకు చేరి ఆదివారం రోజున పొలం మొత్తం ట్రాక్టర్లతో దున్నేయడంతో రైతు పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. ఇలా రాజకీయ కక్షలతో ప్రారంభమైన చెట్లు నరికే సంస్కృతి మెల్లమెల్లగా నియోజకవర్గమంతా పాకుతోంది. తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో సైతం వరుస ఘటనలు చోటు చేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనం. అయితే వీటిలో వ్యక్తిగత కక్షలు, భూవివాదాలే ఎక్కువగా ఘటనలకు కారణమవుతున్నాయి. నియోజకవర్గంలో మచ్చుకు మరికొన్ని.. ● తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రస్తా వివాదంలో సర్వే నంబర్ 24–5లో కొంకా తిరుపాల్, కొంకా శశి కళకు సంబంధించిన 60 చీనీ చెట్లను ప్రత్యర్థులు శనివారం రాత్రి నరికివేశారు. ఇటీవల జరుగుతున్న రస్తా వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ● తాడిమర్రి మండల కేంద్రంలో షెక్షావలి అనే రైతుకు చెందిన 15 చీనీ చెట్లను ప్రత్యర్థులు నరికి వేశారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ● ఏడాది క్రితం బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన వెంకటరాముడు అనంతపురం రూరల్ మండలం మన్నీల వద్ద సాగు చేస్తున్న 450 బొప్పాయి చెట్లను ఎవరో నరికివేశారు. అయితే ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ● 2024 జూలైలో బత్తలపల్లి మండలం యర్రాయపల్లి రైతు శివారెడ్డికి చెందిన 66 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఇందుకు సంబంధించిన కారణాలు కూడా తెలియరాలేదు. కక్షలు, కార్పణ్యాలతో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం కోసం పచ్చని చెట్ల నరికివేత వంటివి ఇంత వరకు ఫ్యాక్షన్ ప్రభావిత తాడిపత్రి లాంటి ప్రాంతంలో చూశాం. అలాంటి విష సంస్కృతి ఇప్పుడు ధర్మవరంలో విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నపాటి కారణాలకే పచ్చని చెట్లను నరుక్కుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఇచ్చే సందేశం ఏమిటి? సాక్షాత్తు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది..? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గి నిందితులపై చర్యలు తీసుకోక పోవడమే ఇందుకు కారణమా అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రి సత్యకుమార్ ఇలాకాలో... పచ్చని చెట్లను నరికివేస్తున్న వైనం రాజకీయ కక్షలతో మొదలై.. వ్యక్తిగత గొడవలతో తారస్థాయికి ముచ్చురామిలో జనసేన నేత బరితెగింపు.. మూడుసార్లు చెట్ల నరికివేత పోలీసుల ఉదాసీనత వల్లే ఘటనలు నియోజకవర్గమంతా పాకుతున్న దుష్ట సంప్రదాయం -
పొలం మొత్తం దున్నేశారు
ముచ్చురామి గ్రామంలో 2.50 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న మామిడి, ఉసిరి, నేరేడు మొక్కలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నరుకుతూనే ఉన్నారు. ఆ స్థానంలో కొత్తమొక్కలు పెట్టుకుని సాగుచేస్తుంటే రెండు రోజుల కింద 150 మొక్కలను నరికేశారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ ఆదివారం రోజున ఏకంగా పొలం మొత్తం ట్రాక్టర్లతో దున్నేశారు. జనసేన నాయకుడు గుర్రప్ప అనుచరులతో వచ్చి మా పొలాన్ని దున్నేశారు. – రామ్మోహన్రెడ్డి, ముచ్చురామి, ధర్మవరం మండలం -
కఠిన చర్యలు తీసుకుంటాం
ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న మొక్కల నరికివేతను సీరియస్గా తీసుకుంటున్నాం. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్లో భాగంగా నిందితుల నుంచి నష్ట పరిహారం అందించేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. మొక్కలు నరికేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. బాధితులు ధైర్యంగా నిందితుల వివరాలు పోలీసులకు తెలియజేయాలి. అనుమానిత ప్రదేశాల్లో నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాం. –హేమంత్కుమార్, డీఎస్పీ, ధర్మవరం -
నట్టేట ముంచిన ‘ఆమె’
● అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్లో వందల సంఖ్యలో మహిళలు యానిమేటర్ ఆదిలక్ష్మి మోసానికి బలయ్యారు. వందలు... వేలు.. కాదు రూ. కోట్లలో దగా చేసి ఉడాయించడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఇళ్లల్లో పాచి పని చేసుకుంటున్న వారిని కూడా వదల్లేదు. చీటీలు, వడ్డీలతో పాటు డ్వాక్రా సభ్యుల పేర్లతో రుణాలు తీసుకుంది. ఈమె బాధితుల్లో ఎక్కువగా కూలీనాలీ చేసుకునే వారే ఉన్నారు. రాప్తాడు రూరల్: నందమూరి నగర్లో చాలా కాలంగా ఉంటూ యానిమేటర్గా పనిచేస్తున్న ఆదిలక్ష్మి సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలో చీటీ వ్యాపారం నిర్వహిస్తోంది. అందరితోనూ మంచిగా ఉండడంతో చాలా మంది ఆమెను నమ్మారు. ఈ నమ్మకంతోనే చీటీలు పూర్తయినా వడ్డీ చెల్లిస్తానంటే చీటీలు వేసిన వారు ఒప్పుకున్నారు. వడ్డీ డబ్బులు ఇవ్వకుండా తిరిగి వారిని కొత్త చీటీల్లోకి సభ్యులుగా చేర్చుకునేది. దీనికి తోడు రూ. 2 వడ్డీతో రూ.లక్షల్లో అప్పులు చేసింది. అంతటితో ఆగకుండా ప్రగతి మహిళా సంఘం సభ్యుల పేరుపై రుణాలు తీసుకుంది. ఇలా మొత్తం రూ. 3 కోట్ల దాకా చేరుకోగానే 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఆర్డీఏ అధికారులకు, అనంతపురం రూరల్ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై అటు పోలీసులు కానీ, ఇటు డీఆర్డీఏ అధికారులు కాని ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ నేత జోక్యం.. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే విషయం స్థానిక ఓ టీడీపీ నేతకు ముందుగానే తెలుసుననే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదిలక్ష్మిపై ఒత్తిడి తీసుకెళ్లి ఆమె ఇంటిని బాధితుల్లో ఒకరైన తన సమీప బంధువు పేరిట రాయించినట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆమె కూడా తమలాగానే అప్పులు ఇచ్చిందని, అయితే ఇంటిని ఆమె ఒక్కతే ఎలా రాయించుకుంటుందని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుగానే లాంగ్లీవ్లో వెళ్లడానికి సదరు టీడీపీ నేతనే పావులు కదిపినట్లుగా తెలిసింది. ఈ విషయంలో అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు. కోట్లాది రూపాయలు ముంచేసి పరారైన యానిమేటరు చీటీలు, వడ్డీలతో పాటు సభ్యుల పేర్లతో రుణాలు బాధితులంతా కూలీనాలీ చేసుకునేవారే అజ్ఞాతంలోకి వెళ్లేముందు ఓ మహిళ పేరుపై ఇంటిని రాయించిన వైనం వెనుక నుంచి తతంగం నడిపిన స్థానిక టీడీపీ నేత -
● మాటలతోనే సరి.. రైతు ఆశలు ఆవిరి
పంట చేతికి వచ్చినా ధరల్లేక అరటి రైతులు దిక్కులు చూస్తున్నారు. కొనేవారు లేక తోటలను అలాగే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. తోటలనే కాయలు మాగిపోతున్నా పట్టించుకునే వారు లేరు. రూ. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంట కళ్లెదుటే కుళ్లిపోతుండడం చూసి రైతులు నలిగిపోతున్నారు. ‘గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఆదుకుంటాం..’ అంటూ ఆశలు రేకెత్తిస్తున్న పాలకులు, అధికారులు చివరికి ఉత్తచేతులు చూపుతూ నిరాశే మిగులుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
కార్పొరేట్కు ఊతమిచ్చేలా సర్కారు నిర్ణయాలు
కదిరి: విద్యా రంగంలో చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఊతమిచ్చేలా ఉన్నాయని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి విమర్శించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాదరెడ్డి అధ్యక్షతన ఆదివారం కదిరిలో జరిగిన ఆ శాఖ జిల్లా 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క సమస్యపై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. విద్యారంగంలోని సమస్యలపై చర్చించేందుకు మంత్రి లోకేష్ ముందుకు రావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం రోడ్మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లు సైతం టెట్ పాస్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని, దీనిపై గతంలో ఇచ్చిన జీఓ 51కి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అసెస్మెంట్ పుస్తకాలు, సిలబస్కు సంబంధం లేకుండా ప్రశ్నపత్రాల రూప కల్పన, ఉమ్మడి సర్వీస్ రూల్స్కి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. టీచర్లను పూర్తిగా బోధనకే పరిమితం చేయాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామమోహన్, జిల్లా ప్రధాన, ఆర్థిక కార్యదర్శులు గోపాల్నాయక్, జయకృష్ణ, జవహర్ తదితరులు పాల్గొన్నారు. 18 నెలల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి -
సీమకు తీరని అన్యాయం
అనంతపురం కల్చరల్: రాయలసీమ ప్రాంతానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని, నిధులు, నీళ్లు రాబట్టుకోవడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యారని రచయితలు, ఉద్యమ సంస్థల ప్రతినిధులు ధ్వజమెత్తారు. వేమనా ఫౌండేషన్, రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం రాయలసీమ మహాకవి సమ్మేళనం జరిగింది. సీమ వ్యాప్తంగానే కాకుండా చైన్నె, నెల్లూరు, ప్రకాశం, బళ్లారి, హంపీ నుంచి కవులు, రచయితలు విచ్చేసి సీమ ప్రత్యేకతను చాటేలా కవితలు వినిపించారు. ముఖ్యంగా జనప్రియకవి ఏలూరు యంగన్న, ఒంటెద్దు రామలింగారెడ్డి రాగయుక్తంగా ఆలపించిన కవితాగానం, జూటూరు షరీఫ్, రఘురామయ్య, రియాజుద్దీన్, సడ్లపల్లి చిదంబరరెడ్డి, వన్నప్ప, నరిసిరెడ్డి, టీవీరెడ్డి వచన కవితలు అమితంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు డాక్టర్ శాంతినారాయణ, బండి నారాయణస్వామి, జెట్టీ జైరామ్, మాజీ వీసీ కాడా రామకృష్ణారెడ్డి, కవిసమ్మేళనం సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, తరిమెల అమరనాథరెడ్డి, జిరసం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్ , ఉద్యమ సంస్థల ప్రతినిధులు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. రాజధానిని కర్నూలు నుంచి అమరావతికి తరలించుకుపోతున్నా పాలకులు నిలదీయలేకపోయారని విమర్శించారు. అడుగడుగునా సీమకు జరిగిన అన్యాయాలను ఎండగట్టారు. ప్రజలను సీమ సమస్యలు ప్రతిబింబించే సాహిత్యంతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రవికుమార్, లోకన్న తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ మహాకవి సమ్మేళనంలో రచయితలు -
ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు
అనంతపురం కార్పొరేషన్: శ్రీసత్యసాయి జిల్లా పోలీసు, అనంతపురం జిల్లా రెవెన్యూ జట్లు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడాయి. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో నాగేంద్రప్రసాద్ 31, ప్రభాకర్ 20, ఎస్పీ సతీష్కుమార్ 14, డీఎస్పీ మహేష్ 17 పరుగులు చేశారు. అనంతరం బరిలో దిగిన అనంత రెవెన్యూ జట్టు 17.5 ఓవర్ల వద్ద 95 పరులకు కుప్పకూలింది. జట్టులో రవితేజ 17, కలెక్టర్ ఆనంద్ 9 పరుగులతో నాటౌట్గా నిలిచారు. 35 పరుగుల తేడాతో శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి జిల్లా బౌలర్లలో ఎస్పీ సతీష్కుమార్ 4 వికెట్లు తీసుకుని ఆల్రౌండర్ ప్రతిభను కనబరిచారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా గజ్జల హరిప్రసాదరెడ్డి కదిరి: స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మరోసారి గజ్జల హరిప్రసాద్రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గోపాల్ నాయక్, ఆర్థిక కార్యదర్శిగా జయకృష్ణను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మరో ఐదుగురిని అసోసియేట్ అధ్యక్షులుగా, తొమ్మిది మందిని ఉపాధ్యక్షులుగా, ఆరుగురిని రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శివారెడ్డి, పరిశీలకులుగా రామాంజనేయులు వ్యవహరించారు. వ్యక్తి ఆత్మహత్య మడకశిర రూరల్: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన దొడ్డయ్య (37) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు వివాహమై 14 ఏళ్లయింది. సంతానం కలగకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన శనివారం సాయంత్రం తన ఇంటి ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మొరాయిస్తున్న టౖర్బైన్ కూడేరు: పీఏబీఆర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ నెల 22న తలెత్తిన టర్బైన్ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నెల 23 నుంచి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా.. సమస్య తీరలేదు. దీంతో నిపుణుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రిజర్వాయర్ అధికారులు తీసుకెళ్లినట్లుగా తెలిసింది. వృద్ధురాలి బలవన్మరణం గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్నజి.సుంకన్న భార్య రాములమ్మ(61) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని మెయిన్ రోడ్డులో ఓ లాడ్జి పక్కన సుంకన్న టీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రాములమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్, తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. దీనికి తోడు ఇటీవల మూత్ర విసర్జన సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన రాములమ్మ... ఆదివారం వేకువజామున బాత్రూమ్లోకి వెళ్లి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగింది. కాసేపటి తర్వాత బాత్రూం వద్దకెళ్లిన మనవడు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న అవ్వను గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె మృతిచెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ మంజుల తెలిపారు. ఆటో బోల్తా .. ఒకరి మృతికూడేరు: ఆటో బోల్తాపడిన ఘటనలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన పర్వతయ్య(57) మృతిచెందాడు. ఆదివారం రాజప్పకు చెందిన ఆటోలో ఉజ్జనయ్యతో కలసి వెళుతుండగా గ్రామ శివారుకు చేరుకోగానే కొర్రకోడుకు చెందిన అమర్నాథ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి ఆటోను ఢీకొన్నాడు. ఘటనలో ఆటో బోల్తాపడింది. కిందపడిన పర్వతయ్య, రాజప్ప, ఉజ్జనయ్య, అమర్నాథ్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి పర్వతయ్య మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వీఆర్వోను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు
కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని సైదాపురం గ్రామ వీఆర్వో టీఎస్ ఇనాయతుల్లాను చంపుతామని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్న పుట్టపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమనాథరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను ఆదివారం సీఐ వెల్లడించారు. సైదాపురం పరిధిలోని సర్వే నంబర్ 36లో గ్రామ కంఠముగా ఉన్న స్థలాన్ని పొరంబోకు రస్తాగా ఇవ్వాలని వీఆర్వోపై కదిరిలోని ఇందిరాకాలనీలో నివాసముంటున్న ప్రేమనాథరెడ్డి ఒత్తిడి చేశాడు. ఇందుకు వీఆర్వో ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించి, తన వద్ద ఉన్న కాగితాలపై బలవంతంగా సంతకాలు పెట్టించి, సీల్ వేయించుకుని వెళ్లాడు. విషయాన్ని తహసీల్దార్తో పాటు కదిరి పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రేమనాథరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి దుర్మరణంసోమందేపల్లి: స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు... రొద్దం మండలం తురకలపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (30) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆయనకు వివాహమైంది. ఈ క్రమంలో హిందూపురంలో శనివారం జరిగిన ఓ శుభకార్యంలో తన స్నేహితులతో కలసి పాల్గొన్న అనంతరం రాత్రికి స్వగ్రామానికి కారులో ప్రయాణమయ్యాడు. షిర్డీసాయిబాబా ఆలయం వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో నేరుగా వెళ్లి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సోమందేపల్లి పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకుల తీరుతో దేశం అప్పుల పాలు● ఏఐసీసీ పరిశీలకుడు అజయ్సింగ్ ధర్మవరం/కదిరి టౌన్: పాలకుల తీరుతో దేశం అప్పుల పాలవుతోందని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్సింగ్, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ విమర్శించారు. కదిరిలోని అత్తార్ రెసిడెన్సీతో పాటు ధర్మవరంలోని ప్రణవ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆయా నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ధర్మవరంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నరేష్ యనమల, కదిరిలో నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎస్ షనవాజ్ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం 17 నెలల కాలంలోనే రూ.222 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.15,485 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పనలోనూ పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు అడుగడుగునా మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. అమ్మాజీ ఆలయంలోకి ఎలుగు బంటి రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో త్రిశక్తి దేవతలుగా విరాజిల్లుతున్న అమ్మాజీ (మారక్క, గ్యారక్క, ముడుపక్క) ఆలయంలో ఆదివారం వేకువజామున ఎలుగుబంటి ప్రవేశించింది. శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు మారన్న, ముడుపన్న పూజాదికాలు ముగించుకున్న అనంతరం గర్భగుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం వేకువజామున ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడి గర్భగుడి తలుపులు తాకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న అర్చకులు విషయాన్ని గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. -
నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్
అనంతపురం కార్పొరేషన్: కూచ్ బిహార్ అండర్ –19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఆదివారం ఇరు జట్ల క్రీడాకారులు నెట్స్లో ముమ్మర సాధన చేశారు. భారత మాజీ ఆటగాడు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక జట్టు కెప్టెన్గా బరిలో దిగుతున్నాడు. నేడు పింఛన్ల పంపిణీపుట్టపర్తి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లను సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 80 మంది రౌడీషీటర్లు, పాత నేరస్తులకు ఆదివారం ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ముగిసిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామంలో రెండు రోజులుగా సాగిన ఎస్జీఎఫ్ అండర్–17, 19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో అనంతపురం క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ను దక్కించుకున్నారు. అండర్–19లో బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా క్రీడాకారులు విజయం సాధించారు. తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా క్రీడాకారులు నిలిచారు. విజేతలను అభినందిస్తూ పరిటాల శ్రీరామ్, జనసేన నేత మధుసూదన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. -
సేంద్రియ పద్ధతులే శరణ్యం
జురొళ్ల: వ్యవసాయంలో ఘనమైన మార్పులు వచ్చాయి. రసాయనిక సాగును పక్కనపెట్టి సేంద్రియ పంటల సాగు వైపు రైతులు చూస్తున్నారు. ఒకప్పుడు చెత్తే కదా అని తీసిపారేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆ చెత్తే బంగారమైపోయింది. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. రసాయనిక ఎరువులు భారంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత పంటల దిగుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి వ్యయం నుంచి విముక్తి కలగాలంటే సేంద్రియ పద్ధతులే అనివార్యమయ్యాయి. మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురంతో పాటు మడకశిర మండలాల్లో మొత్తం 35,258 మంది రైతులు, 76,948 ఎకరాల విస్తీర్ణంలో మెట్ట, మాగాణి భూములను సాగుచేస్తున్నారు. రసాయనిక ఎరువుల వినియోగంతో భూసారం తగ్గి పంటల దిగుబడి లేక ఇంత కాలం ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారించిన రైతులు భూమిని సారవంతం చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలిచారు. ఖర్చు తక్కువ పశువుల పేడ, కోడిపెంట, చీకిన గడ్డితో పాటు చెరువులు, కుంటల్లోని సారవంతమైన పూడికతీత మట్టిని రైతులు తమ పొలాలకు తరలించి భూమిలో సారం పెంచుకుంటున్నారు. పశు సంపదలేని రైతులు కోళ్ల ఫారాల్లోని కోడి పెంట, చెరువు, కుంటల్లోని సారవంతమైన పూడికతీత మట్టిని కొనుగోలు చేసుకుని పొలాల్లో వేసుకుంటున్నారు. బోరుబావుల కింద వేరుశనగ, వరి, రాగి, మిరప, గుమ్మడి, కీరదోస సాగుతో పాటు పూలతోటలు, కళింగర, కూరగాయల సాగు, దానిమ్మ, అరటి, బొప్పాయి తదితర పంటలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. పంటల సాగులో ఫలితాలు ఇస్తున్న సేంద్రియ ఎరువులు ఒకసారి చల్లితే మూడు పంటల వరకు దిగుబడి ఆసక్తి చూపుతున్న అన్నదాతలు -
బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తాం
చాలామంది భయంతో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం లేదు. అందువల్లే పరిస్థితి చేయిదాటి పోతోంది. అలాకాకుండా సకాలంలో పరీక్షలు చేయించుకుని క్రమం తప్పకుండా మందులు వాడితే జీవితకాలం తప్పక పెరుగుతుంది. వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఈ మేరకు మేము బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలితే బిడ్డకు రాకుండా మందులు అందిస్తున్నాం. – వనమాల, కౌన్సెలర్, ఐసీటీసీ కేంద్రం, ధర్మవరం ఆస్పత్రి -
జోరందుకున్న వ్యభిచారం..
ప్రజలకు ఎయిడ్స్పై అవగాహన కరపత్రాలు అందిస్తున్న సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేష్నాథ్(ఫైల్)ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీటీసీ కేంద్రంధర్మవరం అర్బన్: పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా...? ఒకప్పుడు ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రచారం ఇది. విస్తృత ప్రచారం..అవగాహన కార్యక్రమాల నేపథ్యంలో కాస్త తగ్గినట్లు కనిపించిన కేసులు... మళ్లీ పెరిగాయి. దీంతో ఎయిడ్స్ మహమ్మారి పడగ విప్పిన పాములా బుసకొడుతూ చాపకింద నీరులా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 12 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రతినెలా లక్షల్లో కండోమ్స్ను అందించి వారు హెచ్ఐవీ బారిన పడకుండా చూడటం, వారి నుంచి మరొకరికి సుఖవ్యాధులు రాకుండా చేస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారు పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మరికొందరు మొబైల్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడి రప్పిస్తుండగా...అందులో హెచ్ఐవీ బాధితులు కూడా ఉంటున్నారు. వీరే ఎయిడ్స్ విజృంభణకు కారణమవుతున్నారు. ఇక కొత్తగా పాజిటివ్ తేలిన జిల్లాకు చెందిన వారు కూడా సమాజంపై కక్షతో యువతను లక్ష్యంగా చేసుకుని ఎయిడ్స్ వ్యాప్తికి కారణమవుతున్నారు. పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నా..ఈ దందా ఆగడం లేదు. ఒక ప్రాంతంలో పోలీసులు పట్టుకుంటే మరో ప్రాంతానికి మకాం మారుస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందల్లో ఎయిడ్స్ బాధితులను గుర్తిస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించిన ఎయిడ్స్ కేసులను కలిపితే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 2021–22 సంవత్సరం నుంచి 2025–26(అక్టోబర్–2025) వరకు 2,94,950 మంది(పురుషులు, సీ్త్రలు)కి వైద్య పరీక్షలు చేయగా... 1,891 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. అలాగే 1,38,353 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా.. 82 మంది పాజిటివ్గా తేలారు. గర్భిణుల భర్తలకు పరీక్షలు చేస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుంది. ఇక అనధికారికంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుని ఎయిడ్స్ ఉన్నట్లు తేలిన కేసులు ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాలేదు. అవన్నీ కలిపితే బాధితుల సంఖ్య వేలల్లోకి వెళ్తుంది. హెచ్ఐవీ బాధితులు క్రమం తప్పకుండా యాంటీ రిట్రోవైరల్ థెరపీ మందులు వాడితే వారిలో వైరల్ లోడ్ తగ్గుతుంది. దీంతో వారి నుంచి ఇంకొకరికి హెచ్ఐవీ వ్యాప్తి చెందే శాతం తగ్గుతుంది. ఈ క్రమంలోనే హెచ్ఐవీ నిర్ధారణ కాగానే, బాధితులకు ఏఆర్టీ మందులకు సిఫార్సు చేస్తారు. అనంతరం వారిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే వాటిని తగ్గించేందుకు మందుల డోస్ పెంచుతారు. హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం రూ.5 వేలు విలువ చేసే మందులను ప్రతినెలా ఉచితంగా అందిస్తోంది. కానీ చాలా మంది ఏఆర్టీ సెంటర్కు వెళ్లేందుకు భయపడుతున్నారు. తమ వివరాలు బయటకు తెలుస్తాయని, సమాజంలో పరువుపోతుందని భావించి మందులు వాడకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇతరులకూ వైరస్ అంటిస్తూ మరింత చేటు తెస్తున్నారు. చాపకింద నీరులా ఎయిడ్స్ విజృంభణ జిల్లా వ్యాప్తంగా పెరిగిన వ్యభిచారం అవగాహన లోపంతో ఎయిడ్స్ మహమ్మారికి బలి ప్రభుత్వ లెక్కల్లో లేని కేసులే ఎక్కువ ఏడాదిలో వందల్లో ఎయిడ్స్ కేసుల గుర్తింపు... ఏఆర్టీ మందులతో చికిత్స.. -
రైతులకు విరివిగా రుణాలివ్వాలి
ప్రశాంతి నిలయం: వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యంగా భావించి రైతులకు విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని బ్యాంకులకు రెండో త్రైమాసికంలో నిర్దేశించిన రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.14051 కోట్ల రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రెండో త్రైమాసికం (సెప్టెంబర్ 30వ తేదీ) ముగిసే నాటికి రూ.1,00,059 కోట్ల రుణాలు మంజూరు చేసి 71.50 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామన్నారు. వ్యవసాయ రుణాలు రూ.5071 కోట్లు, ప్రాధాన్యతా రంగాలకు రూ.7,805 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఇప్పటి వరకు రూ.182 కోట్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. అర్హులైన యువ పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా రుణ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణ కుమార్, ఆర్బీఐ మేనేజర్, నాబార్డ్ ఏజీఎంలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు కృషి చేయండి.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ జిల్లాలో విరివిగా పరిశ్రమల స్థాపనకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు అందే దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సు ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆరు కంపెనీలు ముందుకు వచ్చాయని, వారికి అవసరమైన తోడ్పాటు అందజేయాలన్నారు. వివిధ పరిశ్రమల స్థాపన కోసం భూ కేటాయింపులపై చర్చించారు. డ్రగ్స్ రక్కసి నుంచి యువతను రక్షిద్దాం.. డ్రగ్స్ రక్కసి నుంచి యువతను రక్షించేందుకు అందరూ సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ‘ఈగల్ స్క్వాడ్’ మీటింగ్లో కలెక్టర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థలను ఊరూరా వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా 2025లో జిల్లా వ్యాప్తంగా 12 కేసులు నమోదు చేసి 32 కేజీల గంజాయి, 7 వాహనాలు సీజ్ చేశామన్నారు. అలాగే 52 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇప్పటికే ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ‘ఈగల్ క్లబ్’లు ఏర్పాటు చేశామని వివరించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి బ్యాంకర్లతో కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
‘పచ్చ నేత’ బరితెగింపు
పుట్టపర్తి అర్బన్: అధికార అండతో ఓ పచ్చనేత మరీ బరితెగించాడు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్ల విలువైన భూమిని కబ్జా చేస్తున్నాడు. సదరు నేత భూ దందాను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో కాస్త వెనక్కు తగ్గిన సదరు నేత శనివారం ఏకంగా ఆక్రమిత భూమిలో జేసీబీలను దించి మట్టిని తవ్వుకుని విక్రయించాడు. అన్నీ తెలిసిన అధికారులు లోపాయికారీ ఒప్పందంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. హడావుడిగా పనులు.. పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 432 పక్కన ఉన్న సర్వే నంబర్ 763లోని భూమిని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి చదును చేశాడు. ఈ భూకబ్జాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి సర్వే ప్రారంభించారు. మరో రెండు రోజుల పాటు సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ మళ్లీ అటువైపు రాలేదు. దీంతో సదరు టీడీపీ నాయకుడు ఏకంగా జేసీబీలను ఆక్రమిత భూమిలో దించి మట్టిని తవ్వి టిప్పర్ రూ.3 వేల చొప్పున జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు విక్రయించాడు. శనివారం రాత్రి 4 టిప్పర్లు, హిటాచీలు ఏర్పాటు చేసి భూమి చదును చేశాడు. గ్రామస్తులు అడ్డుకోవాలని చూసినా అధికార దర్పం చూపుతూ వారినే బెదిరించాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తుసు కోరుతున్నారు. రాత్రిపూట మట్టిని తోలి భూమి చదును చేస్తున్న టీడీపీ నాయకులు ఆక్రమిత స్థలంలో మట్టి తవ్వకాలు టిప్పర్ రూ.3 వేలతో మట్టి విక్రయం ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు -
జలవనరుల భూములకు ఎసరు
పుట్టపర్తి అర్బన్: అధికార పార్టీ నాయకులు భూ దందాల్లో ఆరితేరి పోయారు. ఏకంగా జలవనరులశాఖ భూములనే ఆక్రమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అభివృద్ధి పనులు చేస్తామంటూ.. నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మూడు స్థలాలకు ప్లాన్.. పుట్టపర్తి పట్టణం నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే జలవనరులశాఖకు చెందిన మూడు ముఖ్యమైన స్థలాలను కొట్టేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ● పుట్టపర్తి ఆర్టీసీ డిపో పక్కన సర్వే నంబర్ 127లో ఇరిగేషన్కు చెందిన అర ఎకరా భూమి ఏళ్లుగా ఖాళీగా ఉంది. పట్టణంలోని భవన నిర్మాణాల వ్యర్థాలను ఇందులో వేసేవారు. అయితే రెండు నెలల క్రితం అక్కడ ఫుట్పాత్ ఏర్పాటు చేశారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో దాని పక్కనే చిన్న పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పార్కు అంటే సాధారణంగా పచ్చిక బయళ్లు, మొక్కలు, ఆట వస్తువులు అంతర్గత రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రం గ్రానైట్, మార్బుల్స్ వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ పీహెచ్సీ నిర్మించాలని శిలాఫలకం వేసినా... అప్పటి అధికారులు అడ్డుకోవడంతో అది ఆగిపోయింది. మరో స్థలంలో కట్టడానికి ప్రయత్నిస్తే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ● గణేష్ సర్కిల్ సమీపంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్ల వెనుక భాగంలో ఎనుములపల్లి చెరువుకు సమీపంలో సర్వే నంబర్ 110లో 30 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ గతంలో పెద్ద గుంత ఉండేది. ప్రస్తుతం మట్టితో గుంతను పూడ్చి చదును చేస్తున్నారు. ఇక్కడ జలవనరుల శాఖకు చెందిన చిన్న భవనం ఉంది. దీనిపై కన్నేసిన టీడీపీ నాయకులు మట్టి తోలుతున్నా... సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ● కర్ణాటక నాగేపల్లికి వెళ్లే దారిలో చిత్రావతి నది బ్రిడ్జి దాటగానే సర్వే నంబర్ 275లో అర ఎకరా భూమి ఉంది. ఇక్కడ కొన్నాళ్లు ఇసుక రీచ్ నడిపారు. తర్వాత బాణసంచా అంగళ్లు ఏర్పాటు చేసేవారు. ఇది చిత్రావతి నదికి ఆనుకొని ఉండటం, కదిరి–పుట్టపర్తి ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మార్కెట్లో విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. దీనిపై కన్నేసిన కొందరు అధికార పార్టీ నేతలు...తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు పేరుతో నిర్మాణాలు చేపట్టారు. రూ. 50 లక్షలతో ప్రహరీ, అంగళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు పాగా వేస్తున్నా ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం చూసి జనం పెదవి విరుస్తున్నారు. అనుమతుల్లేవు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో పార్కింగ్, ఇతర అవసరాల కోసం జలవనరుల శాఖ ఆధీనంలోని స్థలాలను వాడుకుంటామన్నారు. ఉపయోగానికి వీలుగా వాటిని చదును చేశారు. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఆయా స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. అక్కడి నుంచి ఆదేశాలు రాగానే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, డీఈ, జలవనరులశాఖ పుట్టపర్తిలో పచ్చ నేతల భూ దందా బాబా ఉత్సవాల కోసమంటూ అనుమతి చదును చేసి నిర్మాణాలు చేపట్టిన వైనం -
నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
మడకశిర రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 8 రోజులపాటు సాగే ఉత్సవాల కోసం ఆలయాల నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, డిసెంబర్ 1న ధ్వజారోహణ, అగ్ని హోత్ర హోమం, 2న పవమాన హోమం, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మ రథోత్సవం, 5న భూతప్పలు, జ్యోతుల ఉత్సవం, 6న తలనీలాలు, పూల పల్లకి, గరుడోత్సవం, 7న కంబాల నరసింహస్వామికి జ్యోతుల ఉత్సవం, 8న వసంతోత్సవం, చక్రస్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా తరలివచ్చే భక్తులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు నష్టం ● ఏఐసీసీ పరిశీలకుడు అజయ్సింగ్ మడకశిర/పరిగి: రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్సింగ్ అన్నారు. శనివారం ఆయన మడకశిరలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని తెలిసినా...యూపీఐ ప్రభుత్వం ఆరోజు రాష్ట్రాన్ని విభజించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు తులసీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనాయతుల్లా, ఏఐసీసీ సభ్యులు సుధాకర్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అజయ్సింగ్ పరిగి మండలంలోని సేవా మందిర్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక విప్లవాత్మక మార్పులతో సంక్షేమ, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అప్పుల భారత్గా మార్చేశారన్నారు. విభజన ఆంధ్రప్రదేశ్కు 11 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి మోసగించారన్నారు. పైగా విభజన చట్టంలోని ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్నారు. -
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందాన తయారైంది ఎస్కేయూలో పరిస్థితి! అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేయడం అందరికీ తెలిసిందే. కానీ, ఎస్కేయూలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నిధులుండీ ఖర్చు చేయలే
కానరాని ఉషస్సు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయంలో మౌలిక సదుపాయాల కల్పనకు పీఎం ఉష (ప్రధాన మంత్రి– ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) కింద రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు ఖర్చుపెట్టలేని నిస్సహాయ స్థితిలో వర్సిటీ ఉన్నతాధికారులు ఉన్నారు. దీంతో నిధులకు చెదలు పట్టడమే కాకుండా వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 2026 మార్చిలోపు నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లడమే కాకుండా మరో దఫా రావాల్సిన రూ.20 కోట్ల నిధులూ రాని పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటి దాకా ఒక్క పనిలో కూడా కనీసం అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మార్చి నెలాఖరులోపు దాదాపుగా పూర్తి చేయని దుస్థితి నెలకొంది. సమావేశాలతో సరి.. పీఎం ఉష పథకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశముంటుంది. న్యాక్ గ్రేడింగ్ను బట్టి నిధులు మంజూరవుతాయి. నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంటే రూ.100 కోట్ల నిధులు, న్యాక్–బీ గ్రేడ్ ఉంటే రూ.20 కోట్ల నిధులు అందుతాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి న్యాక్–బీ గ్రేడ్ గుర్తింపు ఉండడంతో రూ.20 కోట్ల నిధులు మంజరయ్యాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి ‘పీఎం– ఉష’కు దరఖాస్తు చేయగానే, నిధులు మంజూరయ్యాయి. అనంతరం అప్పట్లోనే వీసీ ప్రొఫెసర్ కే. హుస్సేన్ రెడ్డి హయాంలో నిధులు వర్సిటీ ఖాతాకు జమయ్యాయి. 2026 మార్చి నెలాఖరులోపు రూ.20 కోట్ల నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని తెలిసినా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సివిల్ పనులకు సంబంధించి టెండర్లు మాత్రమే ఖరారయ్యాయి. అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. గడువు సమీపిస్తున్నా తరచూ సమావేశాలు నిర్వహించడం, చర్చించడంతోనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధిపై శ్రద్ధేదీ? వర్సిటీలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి బ్లాక్గ్రాంట్ నిధులు మినహా నయాపైసా నిధులను చంద్రబాబు ప్రభుత్వం అందించిన పాపాన పోలేదు. నూతన ప్రాజెక్ట్ ఒక్కటీ రాలేదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. వర్సిటీల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టకపోగా.. పీఎం ఉష పథకం కింద గత ప్రభుత్వం హయాంలో అందిన నిధుల ఖర్చుపై దృష్టి పెట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీ భవిష్యత్తుపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పీఎం ఉష పథకం కింద ఎస్కేయూకు రూ.20 కోట్ల నిధులు 2026 మార్చిలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యం గడువులోపు నిధులు ఖర్చు చేస్తే.. మరో రూ.20 కోట్లు వచ్చే అవకాశం ఇప్పటిదాకా ప్రారంభం కాని పనులు వర్సిటీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం
పుట్టపర్తి టౌన్: ప్రతి పోలీసు అధికారీ నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. శనివారం పుట్టపర్తిలో సాయి ఆరామంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్లతో నెలవారీ సమీక్ష నిర్వహించి పాత కేసులు, పోక్సో కేసులు, మహిళా నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పెడింగ్ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలు, ప్రాపర్టీ నేరాలు, చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు రౌడీషీటర్లపై దృష్టి సారించాలన్నారు. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తే నేరం చేసేందుకు భయపడతారన్నారు. పోలీసులు అంటే నేరస్తులకు భయం పుట్టే విధంగా పని చేయాలన్నారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎస్పీలు సబ్డివిజన్ పరిధిలో రోజూ 10 కేసుల చొప్పున మానిటరింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్కుమార్, నర్సింగప్ప, ఇందిర, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, లక్ష్మీకాంత్రెడ్డి, ఐటీ కోర్ టీమ్ ఇన్చార్జ్ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేర సమీక్షలో ఎస్పీ సతీష్కుమార్ -
ఆట పాటలతో ఆత్మస్థైర్యం
అనంతపురం సిటీ: ఆటపాటల ద్వారా విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యం నింపొచ్చని కలెక్టర్ ఆనంద్ అన్నారు. డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) మైదానంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఇలాంటి పోటీల వల్ల విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీయడమే గాక వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాల్లోనూ వీరికి రావాల్సిన రిజర్వేషన్ తప్పక పాటించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం ర్యాంప్స్, లిఫ్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ప్రతి ఒక్కరూ యూడీఐడీ కార్డును కలిగి ఉండాలని సూచించారు. అనంతరం రన్నింగ్ 100 మీటర్లు, షాట్పుట్, డిస్కస్త్రో, లాంగ్ జంప్, సాఫ్ట్బాల్ ఆటల పోటీలు నిర్వహించగా, 500 మంది విభిన్నప్రతిభాంతులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా నిరూపించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు అర్చన, బీసీ సంక్షేమ శాఖల డీడీ ఖుష్బూ కొఠారి, డీఎస్డీఓ మంజుల, సిబ్బంది పాల్గొన్నారు. -
సైనిక కుటుంబాలకు అండగా నిలవాలి
ప్రశాంతి నిలయం: దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సాయుధ దళాల ఫ్లాగ్ డేని పురస్కరించుకుని సంక్షేమ నిధికి సంబంధించిన కార్ ఫ్లాగ్లను, స్టిక్కర్లను ఆయన శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాలు దేశ సరిహద్దులలో నిరంతరం పహారా కాస్తూ ప్రజల రక్షణలో సేవ చేస్తున్నారన్నారు. సైనికులు, మాజీ సైనికులు యుద్ధ సమయంలో, విపత్తుల సమయంలో దేశానికి అండగా ఉంటున్నారన్నారని, వారికి ప్రజలందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సైనికుల సేవలకు గుర్తింపుగా పౌర సమాజం ఇచ్చే గౌరవ చిహ్నంగా ఈ ఫ్లాగ్ డే నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్ ఫ్లాగ్లు 5వేలు, స్టిక్కర్లు 3,500 అందుబాటులో ఉంచామని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.తిమ్మప్ప కలెక్టర్కు వివరించారు. కార్ ఫ్లాగ్ రూ.5, స్టిక్కర్ ఒక్కటి రూ.2గా ధర నిర్ణయించామని, ప్రజలు స్వచ్ఛందంగా కొనుగోలు చేసి సాయుధ దళాల పతాక దినోత్సవానికి విరివిగా విరాళాలు అందజేయాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ‘జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అనంతపురం,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నంబర్ 62076956433, ఐఎఫ్ఎస్సీ ఎస్బీఐ ఎన్0021438’కు నగదు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ సీహెచ్ పురుషోత్తం, సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో వంచన
● యువకునిపై పోక్సో కేసు బత్తలపల్లి: ప్రేమ పేరుతో బాలికను వంచించిన యువకునిపై పోక్సో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ధర్మవరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. బత్తలపల్లి మండలం దంపెట్లకు చెందిన ఈడిగ హరీష్ ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి మోసం చేశాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేసింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ధర్మవరం రూరల్ సీఐ తెలిపారు. నిందితుడు హరీష్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితునికి 14 రోజులు రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి ధర్మవరం: పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. డీఎల్ఆర్ కాలనీకి చెందిన కొండారెడ్డి (49)కు మద్యం అలవాటుంది. శనివారం గాంధీనగర్ రైల్వే గేటు సమీపంలోని లక్ష్మీనగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని జేబులో చీప్ లిక్కర్ మద్యం బాటిల్ ఉంది. అతిగా మద్యం తాగి మృతి చెందాడా.. ఇంకేమైనా జరిగిందా అన్నది టూటౌన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కొండారెడ్డికి భార్య లలితమ్మ ఉంది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మడకశిరరూరల్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం ఆమె భక్తరపల్లిలో ఆరోగ్య ఉపకేంద్రం, నీలకంఠాపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అలాగే ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని సందర్శించి, వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆదివారం నుంచి వారం రోజులపాటు జరిగే భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని కోరారు. ఉత్సవాల్లో పాటించాల్సిన సూచనలు, సలహాలను వైద్య సిబ్బందికి వివరించారు. వైద్య చికిత్సల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జూడోలో ‘అనంత’ క్రీడాకారులకు స్వర్ణాలు ధర్మవరం రూరల్: జూడో పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన క్రీడాకారులు స్వర్ణ పతకాలతో మెరిశారు. ధర్మవరం మండలం చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాల బాలికల జూడో పోటీల్లో వీరు ఆద్యంతం అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకు 27 పోటీల్లో మొత్తం 13 బంగారు పతకాలు సాధించారని పీడీ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఇసుక ట్రాక్టర్ అడ్డగింత పరిగి: ఊటుకూరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం వేకువజామునే గ్రామ పరిధిలోని పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులంతా ఏకమై నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇసుకతో వస్తున్న ట్రాక్టరును వంతెన వద్ద అడ్డగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను చెప్పినట్టు వినవా..? సాక్షి టాస్క్ఫోర్స్: నేను చెప్పినట్టు వినవా అంటూ.. అయితే నీకు నేనేంటో చూపిస్తా అంటూ కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామ సచివాలయ ఉద్యోగిపై టీడీపీ ఎంపీటీసీ కేశవరెడ్డి బెదిరింపులకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్యోజన) కింద ఇళ్లను మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. సొల్లాపురంలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటన్నింటినీ సిబ్బంది యాప్లో నమోదు చేయాలి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ కేశవరెడ్డి సచివాలయం వద్దకెళ్లి ఓ ఉద్యోగిపై పది మంది చూస్తుండగా నోరుపారేసుకున్నారు. ‘నా కనుసన్నల్లో నీవు పని చేయాలి... నేను చెప్పినట్లు చేయాలి.. లేదంటే మండల మీట్లో నేనేంటో చూపిస్తా’ అంటూ గదమాయించారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
హిందూపురం: తల్లీబిడ్డ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఫైరోజాబేగం అన్నారు. గర్భవతిగా ఉన్నపుడే తల్లీబిడ్డ ఆరోగ్యం, ప్రసవం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సిబ్బందికి సూచించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో గురువారం నవజాతి శిశువు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై పెనుకొండ డివిజన్ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణితో కలిసి డీఎంహెచ్ఓ శనివారం క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి బిడ్డ మరణించే వరకు జరిగిన పరిణామాల గురించి బాధిత మహిళ దివ్యశ్రీని అడిగి తెలుసుకున్నారు. బిడ్డ ఏడుస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని, పారాసిటమాల్ ఇచ్చారని, ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియలేదని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత చిన్న పిల్లల విభాగంలోని వైద్యులతోనూ నవజాత శిశువు మృతిపై డీఎంహెచ్ఓ ఆరా తీశారు. అనంతరం డ్యూటీ డాక్టర్లు కీర్తి, శివకుమార్, ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ బాబా బుడేన్, డాక్టర్ కేసీకే నాయక్తో సమావేశమై శిశువు మృతిపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సిబ్బందికి సూచనలిస్తూ డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ నాయక్, వైద్యాధికారి విజయకుమార్తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం నవజాత శిశువు మృతిపై విచారణ -
మోడల్ పేపర్స్ ఆవిష్కరణ
పుట్టపర్తి: పదో తరగతి విద్యార్థుల కోసం యూటీఎఫ్ ప్రచురించిన మోడల్ టెస్ట్ పేపర్స్–2026 పుస్తకాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఈఓ కృష్ణప్ప శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతి ఏటా విద్యార్థుల కోసం అనుభవం ఉన్న టీచర్లతో మోడల్ టెస్ట్పేపర్స్ బుక్ రూపొందించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ప్రణాలికలు రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అధికారి దేవరాజ్, సంఘం గౌరవాధ్యక్షుడు భూతన్న, నారాయణస్వామి, లక్ష్మీనారాయణ, శివ, బాబు, అమర నారాయణరెడ్డి, చంద్రశేఖర కృష్ణతేజ, అమర్నాథ్రెడ్డి, సురేష్, సంజీవప్ప తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు బత్తలపల్లి: మాల్యవంతం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు... అనంతసాగరం గ్రామానికి చెందిన గుజ్జల నాగేంద్రయ్య, నాగేంద్రమ్మ దంపతులు కూరగాయలను ఆటోలో వేసుకొని ఊరురా తిరుగుతూ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఆటోలో కూరగాయలు వేసుకొని మాల్యవంతం వైపు వెళుతుండగా ధర్మవరం నుంచి విద్యార్థులను తీసుకెళ్లే ఆర్టీసీ బస్సు వెనుకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగేంద్రయ్య, నాగేంద్రమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనంలో ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను కలిసి ఘటనపై ఆరా తీశారు. -
ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా : కలెక్టర్
ధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల వారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ధర్మవరం మార్కెట్యార్డులో ఈవీఎంలు భద్రపరిచిన గోదామును కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఫైర్ సేఫ్టీ, 24గంటల భద్రతా అంశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. చిగిచెర్లలో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ప్రారంభం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల జెడ్పీహెచ్ఎస్లో శుక్రవారం రాత్రి ఎస్జీఎఫ్ అండర్–14, అండర్–19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ మహబూబ్బాషా, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి, హరీష్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిమనోహర్, హెచ్ఎం తిమ్మారెడ్డి, స్టేట్ అబ్జర్వర్ జయసింహ, పీడీ ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం నీచం
ధర్మవరం రూరల్: కక్షపూరితంగా రైతుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం నీచమని, ఇప్పటికై నా అధికార పార్టీ నేతల్లో మార్పు రావాలని వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామంలో రైతు రామ్మోహన్రెడ్డికి చెందిన మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి నరికివేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించి, బాధిత రైతును పరామర్శించారు. పొలంలో నరికేసిన మామిడి చెట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు నయాపైసా మేలు చేకూర లేదన్నారు. పైగా రైతులపైనే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జనసేన నాయకుడిగా చెప్పుకుంటున్న రేగాటిపల్లి పంచాయతీలోని ఓ వ్యక్తి భూ కబ్జాలు, దౌర్జన్యాలు, పచ్చని చెట్లను నరకడం, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై డీసీఎం పవన్కళ్యాణ్ స్పందించాలన్నారు. గతంలో రెండు సార్లు చెట్లు నరికినా కూడా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా చెట్ల నరికి వేత సంస్కృతిని పోలీసులే పెంచి పోషించినట్లవుతోందన్నారు. కొంత కాలంగా బాధిత రైతు తన పొలంలో చెట్లను నరుకుతున్న విషయాలపై అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో పవన్కళ్యాణ్కే తెలియాలన్నారు. రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పీఆర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగాటిపల్లి సురేష్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేష్, అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ రవీంద్రారెడ్డి, యూత్ నాయకులు వడ్డే బాలాజీ, ముచ్చురామి విశ్వనాథ్రెడ్డి, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి -
క్రమశిక్షణకు నిదర్శనం పరేడ్ : ఎస్పీ
పుట్టపర్తి టౌన్: పరేడ్ అనేది క్రమశిక్షణకు నిదర్శనమని, క్రమం తప్పకుండా పరేడ్ నిర్వహిస్తూ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ఏఆర్ సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులకు ఎస్పీ సతీష్కుమార్ సూచించారు. శుకవారం స్థానిక పరేడ్ మైదానంలో ఆయా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన కవాతను ఎస్పీ పరిశీలించి, మాట్లాడారు. రోజూ వ్యాయామం, ధ్యానంతోపాటు గ్రౌండ్ పరేడ్ మరవకూడదన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు వలి, రవికుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగిపై దాడి ధర్మవరం అర్బన్: ఇంటి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం ఉదయం గీతానగర్లో ఇంటి పన్నుల వసూలు చేసేందుకు సచివాలయ ఉద్యోగి మంజునాథ్ ఆటో ద్వారా ప్రచారం చేపట్టారు. లక్ష్మి అనే మహిళ ఇంటి వద్దకు చేరుకోగానే కొళాయి రిపేరు చేయించి రోడ్డుపై అడ్డుగా వేసిన రాళ్లను గుర్తించి, వాటిని తొలగించాలని మంజునాథ్ సూచించాడు. వారు వినకపోవడంతో తన వద్ద ఉన్న జాబితా పరిశీలించి ఇంటి పన్ను బకాయి చాలా ఉందని చెల్లించాలని లక్ష్మి ఆమె కుమారుడు ప్రకాష్కు సూచించాడు. దీంతో గొడవకు దిగిన వారు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
ప్రశాంతి నిలయం: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30తో అక్రిడిటేషన్ కాలపరిమితి ముగియనుండగా... తాజాగా 2026, జనవరి 31 వరకు పొడిగించడం గమనార్హం. ప్రశాంతంగా కార్యదర్శుల పదోన్నతుల కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న గ్రేడ్–6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–5 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించి స్థానాల కేటాయింపునకు శుక్రవారం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పంచాయతీ అధికారులు నాగరాజునాయుడు, సమత ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. మొత్తం 120 మందికి గాను 119 మంది హాజరయ్యారు. సీనియార్టీ జాబితాను అనుసరించి కలెక్టర్ ఆమోదంతో పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని డీపీఓ నాగరాజునాయుడు తెలిపారు. -
మున్సిపాలిటీలో కలిపితేనే అభివృద్ధి
జగనన్న కాలనీలను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువస్తే నిధులు అందుబాటులో ఉంటాయి. తద్వారా మౌలిక వసతులను మరింత మెరుగు పరిచే వీలుంటుంది. అందుకే వైఎస్సార్ సీపీ తరఫున మేం పోరాడుతున్నాం. కానీ వైఎస్సార్ సీపీకి మంచిపేరు వస్తుందోనని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. జగనన్న కాలనీలను మాత్రమే మున్సిపాలిటీలో విలీనం చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసినా కమిషనర్ స్పందించడం లేదు. కానీ పేదలకు మేలు జరిగేంత వరకూ వైఎస్సార్సీసీ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటాం. – చందమూరి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
చీర ఎన్ని రోజుల్లో నేస్తారు?
ధర్మవరం: ‘‘పట్టు చీర తయారీకి ముడిసరుకులు ఏం వాడతారు, ఎన్ని రోజులు పడుతుంది, గిట్టుబాటు అవుతుందా’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఆయన ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్లలో పట్టుచీరల తయారీ విధానం, డిజైనింగ్, రీలింగ్, డయింగ్ తదితర వాటిని పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేతలు తమ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హాస్టల్ను తనిఖీ చేశారు. భోజనం, వసతి, ఇతర సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్బాబు, హ్యాండ్లూమ్ ఏడీ రామకృష్ణ, డీఓ రమణారెడ్డి, ఏడీఓలు సుబ్బరాయుడు, శీనానాయక్, డిజైనర్ నాగరాజు, పట్టుచీరల యూనిట్ నిర్వాహకులు జింకా రామాంజనేయులు, గుద్దిటి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. ‘మీ డబ్బు– మీ హక్కు’పై అవగాహన కల్పించాలి ప్రశాంతి నిలయం: పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లో నిల్వ ఉన్న డబ్బును తిరిగి పొందేందుకు ఆర్బీఐ చేపట్టిన ‘మీ డబ్బు– మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో లావాదేవీలు నిలిచిపోయిన బ్యాంకు ఖాతాలు 2,88,083 ఉన్నాయని, ఆయా ఖాతాల్లో రూ.66.95 కోట్ల నగదు ఉందన్నారు. ఈ నిధులు బ్యాంకుల నుంచి ఆర్బీఐకి మళ్లాయన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్న వారు ఆధార్, పాన్, పాస్పోర్టు సైజ్ ఫొటోతో సమీపంలోని బ్యాంకును సంప్రదించి ఈ–కేవైసీ పూర్తి చేయాలన్నారు. బ్యాంక్ ఖాతాలు పునరుద్ధరించిన తర్వాత, ఆర్బీఐతో పరస్పర ధ్రువీకరణ ప్రక్రియ అనంతరం సంబంధిత వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందన్నారు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో వారసులు డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుల అంగీకార పత్రంతో పాటు బ్యాంక్ అధికారులు కోరిన ఆధారాలను సమర్పిస్తే అన్క్లెయిమ్డ్ నగదును పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. 5న మెగా పేరెట్స్, టీచర్స్ మీట్.. డిసెంబర్ 5న జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. మెగా పీటీఎంలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం, హాజరు, ప్రవర్తన తదితర అంశాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అందువల్ల తల్లిదండ్రులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలన్నారు. సమావేశంలో డీఈఓ క్రిష్టప్ప, సమగ్ర శిక్ష ఏపీసీ దేవరాజు, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. చేనేత కార్మికులతో కలెక్టర్ మాటామంతీ -
మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్
● నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ● అభ్యంతరాలకు 30 రోజులు అవకాశం మడకశిర: నియోజకవర్గంలోని ఐదు మండలాలతో మడకశిర కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నూతన రెవెన్యూ డివిజన్లో మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలు ఉండనున్నాయి. ఇంతకుముందు ఈ మండలాలన్నీ పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవి. అయితే కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ మండలాల నుంచి రెవెన్యూ డివిజన్కు వచ్చేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నూతన రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం మడకశిర కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రజలు తమ అభ్యంతరాలు చెప్పడానికి ప్రభుత్వం 30 రోజులపాటు అవకాశం కల్పించింది. 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష పుట్టపర్తి అర్బన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు డీఈఓ కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,697 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు www.bse. ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ‘మన మిత్ర’ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పాఠశాల యూడైస్ లాగిన్ నుంచి కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసే అవకాశం ఉందన్నారు. ఏవైనా సవరణలు ఉంటే పాఠశాల హెచ్ఎం ధ్రువీకరణ లేఖతో పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ను కలిసి నామినల్ రోల్లో నమోదు చేయించాలన్నారు. హాల్ టికెట్లో ఉన్న క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చన్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు. అర్హులైన ఖైదీలకు న్యాయసాయం ● జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్ హిందూపురం/పెనుకొండ: ఆర్థిక స్థోమత కారణంగా లాయర్లను ఏర్పాటు చేసుకోలేని అర్హులైన ఖైదీలకు న్యాయసాయం అందిస్తామని జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన హిందూపురంలోని సబ్జైలును అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి కేసుల గురించి తెలుసుకున్నారు. కుటుంబీకులతో ములాఖాత్కు అవకాశం కల్పిస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం భోజనానికి ఉపయోగించే నిత్యావసరాలు, కూరగాయల నాణ్యతలను పరిశీలించారు. సబ్జైలులో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సబ్జైలు అధికారి హనుమప్ప, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, రాజు, పారా లీగల్ వలంటీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పెనుకొండ లోక్ అదాలత్ చైర్మన్ వాసుదేవన్తో కలిసి పెనుకొండ సబ్ జైలును తనిఖీ చేశారు. వేణురెడ్డికి మధ్యంతర బెయిల్ చిలమత్తూరు: వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక భర్త , వైఎస్సార్ సీపీ నాయకుడు వేణురెడ్డికి ఏపీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 15న టీడీపీ అల్లరిమూకలు హిందూపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం చేశాయి. ఈ ఘటనకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు....టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ నేతలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వేణురెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వేణురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు మిగతా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేశారని క్వాష్ పిటిషన్ వేశారు. విచారించిన న్యాయ స్థానం...వేణురెడ్డితో పాటు మిగతావారిపై నమోదైన కేసు విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. వేణురెడ్డితో పాటు మిగతా వారికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
మెడికల్ కాలేజీలను కాపాడుకుందాం
పరిగి: పేదలకు మేలు చేసే మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం కాకుండా అడ్డుకుందామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె.. పరిగిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. భావితరాల భవిష్యత్ను చందబ్రాబు సర్కార్ కాలరాస్తోందని, దీన్ని కాపాడేందుకే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారన్నారు. ఈ క్రమంలోనే గ్రామ గ్రామానా విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా పేదకుటుంబాల్లోని విద్యార్థుల డాక్టర్ కల నెరవేర్చడంతో పాటు నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ఏకంగా 17 మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో ఐదు మెడికల్ కళాశాలలను కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. మిగతా కళాశాలలను పూర్తి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ పేరుతో పేదలను పీల్చి పిప్పి చేసి పిండుకోవడం చంద్రబాబు నైజమన్నారు. దీన్ని గుర్తించిన ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అందరం ఏకమై మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీపీ సవిత, పలువురు సర్పంచ్లు, వైస్ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపు -
ఆసుపత్రిలో పసికందు మృతి
హిందూపురం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రెండురోజుల క్రితం పుట్టిన పసికందు గురువారం మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... దివ్యశ్రీ, సందీప్ దంపతులు పట్టణంలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తొలిసారి గర్భం దాల్చిన దివ్యశ్రీకి నెలలు నిండటంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టినప్పటి నుంచి బిడ్డ పాలు తాగకపోవడం... ఏడ్పు ఆపక పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రెండురోజులుగా వైద్యులను సంప్రదిస్తూనే ఉన్నారు. అయినా ‘‘అదంతే..మామూలే’’ అంటూ వైద్యులు చెప్పడం.. శిశువు ఏడ్పు ఆపకపోవడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు కూడా ‘‘ కొంచెం అలాగే ఉంటుంది... ఆ తర్వాత సర్దుకుంటుంది’’ అని చెప్పడంతో తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం కొద్దిగా పారసిటమాల్ సిరప్ తాగించారు. ఆ వెంటనే నిద్రపోయిన చిన్నారి సాయంత్రమైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు శిశువును పరీక్షించి ఆక్సిజన్ పెట్టి చూశారు. అయినా కదలికలు లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించారు. దీంతో బంధువులు బోరున విలపించారు. ఉదయం వరకు బాగానే ఉన్న పిల్లాడు సిరప్ తాగినప్పటి నుంచి కదలకుండా ఉండిపోయాడని విలపించారు. ఏం జరిగిందో చెప్పకుండా పిల్లాడ్ని ఇలా చేశారన్నారు. -
జాతీయ స్థాయి చిత్రకళ పోటీల్లో ప్రతిభ
పుట్టపర్తి టౌన్: జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో పుట్టపర్తిలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివరాల్లోకి వెళితే... స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఆర్ట్స్ టీచర్ చంద్రమోహన్ నేతృత్వంలో వివిధ పాఠశాలలకు చెందిన 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న 106 మంది విద్యార్థులకు పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, టూటూ డిజైనింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మొత్తం 59 మంది విద్యార్థులు పాల్గొనగా 25 బంగారు పతకాలు, 13 వెండి పతకాలు, 12 కాంస్య పతకాలను సాధించారు. వీరికి ఆ పాఠశాల హెచ్ఎం వెంకటరమణ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, పతకాలను అందజేశారు.


