రైతులను బలి చేశారు
ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేశారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి తద్వారా రాయలసీమ ద్రోహిగా నిలిచారు. సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించేందుకు పోతిరెడ్డి పాడు వద్ద గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాయలసీమ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
– సాకే శైలజానాథ్,
మాజీ మంత్రి


