Sri Sathya Sai District News
-
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: రానున్న స్థానిక సంస్థలఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక సాయి ఆరామంలో అన్ని సబ్డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర వాటిపై దిశా నిర్దేశం చేశారు. వివిధ కేసుల్లో ధైర్య సాహసాలు, ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలు, చోరీలు, గొడవలతో పాటు రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ఆర్టీసీ బప్టాండ్లలో చోరీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పదే పదే కేసుల్లో ఉన్న నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదుకు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, పోలీసు లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, నర్సింగప్ప, శివన్నారాయస్వామి, ఏఓ వేషుగోపాల్, డీసీఆర్బి సీఐ నరేంద్రరెడ్డి, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో బిల్లుల దొంగ● రహస్యంగా సాగుతున్న విచారణ పుట్టపర్తి టౌన్: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అందుకే ఓ ఉద్యోగి పోలీసు కార్యాలయంలోనే అవినీతికి తెర లేపారు. గతంలో ఏఓగా పనిచేసిన ఓ అధికారి ఎడాపెడా బిల్లులు చేసుకుని భారీగా మింగేశారు. ఇటీవలే సదరు ఏఓ బదిలీల్లో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. తన గుట్టు ఎవరికీ తెలియలేదని సంబరపడ్డారు. అయితే స్టేషనరీ పేరుతోనే రూ.లక్షలు దారి మళ్లించిన అంశాన్ని ఎస్పీ సతీష్కుమార్ ఇటీవల పసిగట్టారు. పోలీసు శాఖలోనే దొంగలున్నట్లు బయటకు తెలిస్తే శాఖ పరువుకు భంగమని భావించి రహస్యంగా సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. సదరు ఇంటి దొంగకు ఎవరు సహకరించారు. ఎవరి ఖాతాలో ఎంత వేసుకున్నారు. తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంగోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలోని నాసిన్ కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బట్న కృష్ణారావు పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఏప్రిల్ 2 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగిలిన తరగతుల్లో ఏర్పడే ఖాళీలకు ఏప్రిల్ 2 నుంచి 8 వరకూ ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 40 సీట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో 1వ తరగతికి 40 సీట్లు కేటాయించారు. మొదట కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర రంగ సంస్థలు, ఎక్స్సర్వీస్మెన్ పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తారు. అందలోనూ ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం, ఇతరులకు మిగిలిన సీట్లు కేటాయించనున్నారు. http:// admission. kvs. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
గృహ నిర్మాణంలో వేగం పెంచాలి
ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణం, తాగునీరు, గ్రామీణ పరిశుభ్రత అంశాల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘సాసా’ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. మండలాల వారీగా పంచాయతీలకు ర్యాంకులు ఇచ్చి పోటీతత్వాన్ని సృష్టించాలన్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధర్మవరంలో 165, హిందూపురం అర్బన్లో 43, కదిరి అర్బన్లో 41 గృహాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో పాటు ముదిగుబ్బ, గోరంట్ల మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శానిటరీ కాంప్లెక్స్ల పురోగతి తక్కువగా ఉందని, పీఎం సూర్యఘర్ అమలు కూడా వేగవంతం చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ కదిరి టౌన్: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. పెండింగ్ ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కంచాలని సూచించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కదిరి 9వ వార్డు సయ్యద్ వీధిలో షాహిదా, నిసార్ అనే లబ్ధిదారుల ఇంటిపైన సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, తహసీల్దార్ రెడ్డి శేఖర్, విద్యుత్శాఖ డీఈ కృష్ణదేవ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి
ప్రశాంతినిలయం: జిల్లాలో రెవెన్యూ పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పని చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాంకేతిక సమస్యలు అధిగమించి రీసర్వే పూర్తి చేయాలన్నారు. 22ఏ చుక్కల భూముల సమస్యలు, సరిహద్దు వివాదాలు, రెవెన్యూ క్లినిక్లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారధి, డీఎస్ఓ వంశీక్రిష్ణారెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘పురం’ పోలీసులకు రివార్డులు
హిందూపురం: స్థానిక పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పలువురికి రివార్డులు దక్కాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావిడి నాగేంద్రను అరెస్ట్ చేసినందుకు గాను డీఎస్పీ కేవీ మహేష్.అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ జనార్ధన్, ఎస్ఐలు నరేంద్ర, మునీర్ అహమ్మద్, కానిస్టేబుళ్లు రవి, సుబ్రహ్మణ్యంతో పాటు బైండోవర్ కేసుల్లో నిబద్ధత చూపిన హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ,చిలమత్తూరు ఎస్ఐలు నరేంద్ర, మునీర్ అహమ్మద్ను అభినందిస్తూ రివార్డులు, ప్రశంసా పత్రాలను ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం అందజేశారు. క్షయ రహిత జిల్లాగా మార్చాలి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి అర్బన్: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనుపమా జేమ్స్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షయ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ సురేష్బాబు, డీపీఓ సమత, ఆర్డీఓ సువర్ణ, టీబీ మెడికల్ ఆపీసర్ డాక్టర్ గాయత్రి, ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం నల్లచెరువు: మండలంలోని పి. కొత్తపల్లిలో రాయలసీమ వాసన్ సంస్థ ఇన్చార్జ్ ఉత్తప్ప ఆధ్వర్యంలో వేరుశనగ కాయల ప్రాసెసింగ్ యూనిట్ను ఏపీ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 30 ఎఫ్యూఓలతో కలిసి యూనిట్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఓరువాయి పంచాయతీ మద్దేపల్లిలో ఎస్సీ రైతుల సాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ షేరింగ్ విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం వాటర్ షేరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ అశోక్ కుమార్రెడ్డి, వ్యవసాయాధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఏఓ లక్ష్మీప్రియ, హెచ్ఓ లావణ్య పాల్గొన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిరుత కూన బలి కళ్యాణదుర్గం రూరల్: వేటగాళ్లు పన్నిన ఉచ్చులో ఓ చిరుత కూన చిక్కుకుని ప్రాణాలు విడిచింది. చాపిరి సమీపంలో వేటగాళ్లు కుందేళ్ల కోసం పలు చోట్ల ఉచ్చులు ఏర్పాటు చేశారు. మంగళవారం అటువైపు వెళ్లిన కాపరులకు ఉచ్చులో చిక్కుకున్న రెండు చిరుత కూనలు కనిపించాయి. ఇందులో ఒకటి బయటపడేందుకు ప్రయత్నించి చివరకు మృతి చెందింది. మరొక కూనను తల్లి చిరుత నోటకరచుకుని రక్షించుకుంది. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు అనేకసార్లు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. -
హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమాలు
ధర్మవరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా ధర్మవరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వరకుమారి, జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ, నాయకురాలు లతాదేవి, చెన్నేకొత్తపల్లి మండలాధ్యక్షుడు పెద్దకోట్ల సురేష్కుమార్, పట్టణ గౌరవాధ్యక్షుడు కేజీవీ నాగిరెడ్డి, పట్టణ కార్యదర్శి హెచ్.రామాంజనేయులు, రామగిరి మండల నాయకులు కృష్ణతేజ, అజయ్కుమార్ దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగ, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్కార్డులు, మెడికల్ బిల్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్ సమయంలో మరణించిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా హామీలు నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 రెండు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతామని, అప్పటికీ స్పందించకపోతే విజయవాడ కేంద్రంగా ఏప్రిల్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఏప్రిల్ 28న సెక్రటేరియట్ను ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ సురేష్కు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అమర్నారాయణరెడ్డి, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చలపతి, అల్లా బకాష్, నాగేంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, సీఐటీయూ నాయకులు రమణ, ఆదినారాయణ, ఏపీ ఎన్జీఓ నాయకులు శ్రీనివాసులు, యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, లతాదేవి, గోపాల్రెడ్డి, వెంకటకిషోర్, ఆదినారాయణ, నారాయణస్వామి, రాంప్రసాద్, బిల్లే రామాంజనేయులు, ఆదిశేషు, బాలగొండ్ల ఆంజనేయులు, గడ్డం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి -
నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ‘హంద్రీ–నీవా ద్వారా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఎనిమిది నెలల్లో 52 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకొచ్చాం. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 43 టీఎంసీలు చేరినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లా కుప్పంకు ఎంత నీరు ఇచ్చారో చెప్పడం లేదు. చిత్తూరు జిల్లాకు ఎంత నీరు తీసుకెళ్లారో, చెరువులకు ఎంత నింపారో, భూగర్భజలాలకు ఎంత చేరిందో స్పష్టంగా వెల్లడించాలి. చెవుల్లో పూలు పెట్టొద్దు లెక్కలు చూపండి. శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు రూ.3,850 కోట్లతో కాలువకు లైనింగ్ పనులు చేపట్టారన్నారు. ఈ భారీ ఖర్చు కుప్పంకు నీళ్లు అందించేందుకా.. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకా.. లేక నేతల కమీషన్ల కోసమా అంటూ ప్రశ్నించారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల వల్ల రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. లైనింగ్ పనుల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందన్నారు. ఈ నిధులతో గాలేరు–నగరి నుంచి చిత్తూరు జిల్లాకు హంద్రీ–నీవా నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి ఉండొచ్చన్నారు. ఫేజ్–2లో 4 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పేరూరు డ్యాంకు ఒక్క టీఎంసీ కూడా ఇవ్వలేదేం? వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు 52 టీఎంసీల నీరు తెచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క టీఎంసీ కూడా పేరూరు డ్యాంకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ డ్యాం కింద రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు ఆయకట్టు ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబుకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదన్నారు. డ్యాంకు నీటిని వదిలితే కింద ఉన్న ఇసుకను అమ్ముకోలేమనే స్వార్థంతో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా చేశారన్నారు. పెన్నానది నుంచి రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలించేస్తున్నారన్నారు. ఇసుక తవ్వకాల ద్వారా పరిటాల సునీత దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర దోపిడీ చేశారని ఆరోపించారు. 2002కు ముందు ఉన్న కరువు పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని, రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. టమాట, అరటి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. 110 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పీఏబీఆర్ నుంచి రూ.90 కోట్లతో ప్రారంభించిన పనులు నిలిచిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారని వాపోయారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి, సీకేపల్లి మండలాలకు నీరు అందించే పథకం కూడా నిలిచిపోయిందని ఆరోపించారు. కమీషన్ల కోసం పనులు నిలిపేస్తున్నారని విమర్శిస్తూ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బండి పవన్, మీనుగ నాగరాజు, సాకే వెంకటేశు, ఆకుల మునిశంకరయ్య, గుగ్గిళ్ల ప్రసాద్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, చిరంజీవి, విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
అనంతపురం: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమ వాసుల జీవనాడిగా ఉన్న ఆర్డీటీపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తి వేస్తూ విదేశీ నిధులు అందేలా ఎఫ్సీఆర్ఏ ను పునరుద్ధరించింది. 2031 సంవత్సరం వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఐక్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీసుకెళ్లిన ఒత్తిడి కారణంగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ సాధ్యమైందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ చోరీ చేసేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్ ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ వస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. 2025 ఏప్రిల్ 21న ఆర్డీటీ విదేశీ ఖాతాలను ఫ్రీజ్ అయ్యాయి. ఫలితంగా ఆర్డీటీ సంస్థ సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో చేయి చేయి కలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యారు. కళ్యాణదుర్గం నుంచే ప్రజా పోరాటం ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కాకపోవడంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలతో జిల్లా అట్టుడికింది. మరో వైపు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. జిల్లాలో తొలుత ఆర్డీటీ ఎక్కడైతే కార్యకలాపాలు ప్రారంభించిందో అక్కడి నుంచే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ బాధ్యతలను భుజానకెత్తుకున్న తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర చేపట్టారు. 18 రోజులు సాగిన ఈ పాదయాత్ర 203 కిలోమీటర్ల మేర సాగి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 63 గ్రామాలు చుట్టేసింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2025 మే 17న బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో కుందుర్పిలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానికి చేరవేశారు. అనంతరం ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు. అదే రోజు న్యూఢిల్లీలో పార్లమెంట్ వద్ద పార్టీ ఎంపీలతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో ఢిల్లీని అట్టుడుకించి కేంద్రంపై ఒత్తిడి తీసుకెళ్లారు. క్రెడిట్ చోరీకి సిద్ధమైన టీడీపీ నాయకులు ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన అధికార పక్షానికి చెందిన టీడీపీ నాయకులు ఏ ఒక్క రోజూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం ఒక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోయారు. పేదల పక్షాన పోరాటం చేయని టీడీపీ నాయకులు తాజాగా తమ వల్లే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అయ్యిందంటూ ప్రచారం చేసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పది నెలలుగా జిల్లాలో ఆర్టీటీ కోసం వైఎస్సార్సీపీ సాగించిన సుదీర్ఘ పోరాటానికి అఖిలపక్షం నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడయ్యారని, దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోరాటాలు సాగించిన ప్రతి వైఎస్సార్ సీపీ నాయకుడిని ప్రశంసిస్తున్నారు. ఈ నెల 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి ఆర్డీటీ అంశంపై చర్చిస్తున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రధానికి రాసిన పోస్టుకార్డులను చూపుతున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య (ఫైల్) ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆర్డీటీ కోసం జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమం మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర లక్ష పోస్టు కార్డుల ఉద్యమంతో నేరుగా ప్రధానికి విజ్ఞప్తులు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ ప్రజా పోరాటానికి లభించిన విజయం ఏటా రూ.400 కోట్ల ఖర్చు ఏటా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లను ప్రజల శ్రేయస్సు కోసం ఆర్డీటీ ఖర్చు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య, క్రీడలు, పేదలకు మెడికల్ బిల్లుల చెల్లింపు, పక్కా ఇళ్లు తదితర కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికే దాదాపు మూడు సంవత్సరాలు ఖర్చు చేసేంత మొత్తం ఆర్డీటీ ఖాతాల్లో ఉంది. అయితే ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తన్న ఆర్డీటీ కార్యకలాపాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేశాయి. దీంతో ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాకుండా తిరకాసు పెడుతూ వచ్చాయి. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేసేంత వరకూ నిధులు ఖర్చు చేయడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించడంతో సంక్షేమానికి తెర తీసినట్లైంది. ప్రజా నాయకుడికి అధినేత ఫోన్ కాల్ ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ జరిగిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఫోన్చేసి ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం. -
ఐక్య పోరాటాల ఫలితమే ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్
బత్తలపల్లి: పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్టీటీకి కేంద్రం ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయడంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. విషయం తెలియగానే బత్తలపల్లిలోని ఫెర్రర్ ఘాట్కు క్షీరాభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో అలకరించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల సమష్టి పోరాటాల ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసిందని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య వైఎస్సార్సీపీ ఎంపీలతో ఇటీవల పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టి, కరువు జిల్లాలో ఆర్డీటీ అంటే సంస్థ కాదని, అది జిల్లా పేదల జీవనాధారమంటూ చేసిన వ్యాఖ్యలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాని కదిలించాయని, ఫలితంగా ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కు మార్గం సుగమమైదంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్సీఆర్ఏ పునరుద్దరణతో సేవలు మరింత విస్తరించనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీటీ ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
శిరివరంలో తాగునీటి సమస్య
● సచివాలయం ఎదుట మహిళల ధర్నాలేపాక్షి: మండలంలోని శిరివరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో సమస్య పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక సచివాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ఐదు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా.. సరఫరా చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదారు నెలలుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నీటి కోసం పొలాల్లోని బోరుబావుల వద్దకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేక పోయిందన్నారు. గ్రామాల్లో కనీసం సౌకర్యాలు సమకూరుస్తారని బాలకృష్ణకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. స్పందించిన స్థానిక అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు మడకశిర: జిల్లాలోని కేజీబీవీలో సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని జీసీడీఓ అనిత తెలిపారు. మంగళవారం మడకశిర ఎంఈఓ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కేజీబీవీల్లో సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. కొత్తగా ఎంపీహెచ్ఈఓ కోర్సును కూడా ప్రారంభించామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి గాను ఒక్కో కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు, 6వ తరగతిలో 40 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, అర్హులైన వారు ఏఫ్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడు నుంచి తొమ్మిది వరకు ఆయా పాఠశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సీట్లు భర్తీ చేస్తామన్నారు. ఇందులో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ 29, ఓసీ 50 శాతం మేర రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఆదాయం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి, రొళ్ల కేజీబీవీ ప్రిన్సిపాల్ మున్వర్జాన్ పాల్గొన్నారు. కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్ట్అనంతపురం సెంట్రల్: యువకుడి హత్య కేసులో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం అనంతపురం వన్టౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన చింతమాను సురేంద్ర కుటుంబం కొన్నేళ్లుగా అనంతపురంలోని వైఎస్సార్కాలనీలో నివాసముంటోంది. సురేంద్ర కుమారుడు ప్రదీప్ తాగుడకు బానిసై జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో గతనెల 11న రాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. నిన్ను చంపుతానంటూ తండ్రి సురేంద్రను మత్తులో ఉన్న ప్రదీప్ బెదిరించాడు. దీంతో తనను చంపుతాడనే భయంతో ఇనుపరాడ్తో సురేంద్ర దాడి చేయడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కర్నూలులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న తండ్రిని మంగళవారం కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. -
పోలీసు బదిలీలు పూర్తి
● రెండోరోజు 50 మందికి స్థాన చలనం పుట్టపర్తి టౌన్: ఒకే సబ్ డివిజన్లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం పూర్తయ్యింది. సీనియార్టీ ఽఆధారంగా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రెండో రోజు జిల్లావ్యాప్తంగా ఉన్న ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్కు ఎస్పీ సతీష్కుమార్ బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. 20 మంది ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్కానిస్టేబుళ్లు, 27 మంది మహిళా కానిస్టేబుళ్లు కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. ముందుగా ఒకే సబ్డివిజన్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్పై ప్రదర్శించి ఖాళీలు చూపారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి ఒక సబ్ డివిజన్ నుంచి మరొక సబ్డివిజన్కు సిబ్బంది కోరుకున్న చోటకు బదిలీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ వేణుగోపాల్, స్పెషల్బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఐలు ప్రదీప్ సింగ్, ప్రసాద్, వీరన్నతోపాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
● 1,200 ఏళ్ల నాటి సూర్య దేవుడి విగ్రహం లభ్యం
హిందూపురం: ఒకట్రెండు కాదు... ఏకంగా 1,200 ఏళ్ల నాటి సూర్యదేవుడి విగ్రహం సోమవారం హిందూపురం మండలం కిరికెర గ్రామంలో లభ్యమైంది. శిల్పం పక్కనే ప్రాచీన శిలా శాసనాలు, శివలింగం, నంది, వినాయకుడి ప్రతిమలు ఉన్నాయి. వీటిని చరిత్రకారుడు బుక్కపట్నం గోపి గుర్తించి, వివరాలు వెల్లడించారు. విగ్రహాలు, శాసనాలు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కోలార్, తలకాఢ్ రాజధానులుగా చేసుకుని దక్షిణ కర్ణాటకను పాలించిన గంగ వంశరాజుల కాలం నాటివని తెలిపారు. శిల్పం లభ్యమైన ప్రాంతంలో 8వ శతాబ్దంలో సూర్యదేవర ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. అరుదైన సూర్య దేవుడి విగ్రహం ఎలాంటి రక్షణ లేకుండా పడి ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా పురావస్తు శాఖ అధికారులు స్పందించి దేశ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందజేయాలని కోరారు. -
నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం ప్రధాన అర్చకుడు పార్థసారధి ఆచార్యులు పర్యవేక్షణలో శ్రీవారి స్నపన తిరుమంజనం వైభవంగా సాగింది. ఉత్సవానికి ఉభయదారులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్.విష్ణువర్దన్రెడ్డి, సీనియర్ న్యాయవాది సుబ్బరాజుగుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. పసుపుతో శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడిని అలంకరించి తులసిమాల ధరింపజేసి స్నపనం గావించారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.గణితం పరీక్షకు 214 మంది గైర్హాజరు పుట్టపర్తి: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం 107 కేంద్రాల్లో నిర్వహించిన గణితం పరీక్షకు 21,413 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,241 మంది హాజరయ్యారని, 172 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఇక ప్రైవేటు విద్యార్థుల్లో 408 మందికి గాను, 366 మంది విద్యార్థులు హాజరుకాగా, 42 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఏడుగురు జిల్లా స్థాయి పరిశీలకులు, నలుగురు విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నుంచి వచ్చిన ఆరుగురు, 81 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కలిపి మొత్తం 81 మంది అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు. -
విహార యాత్రలో విషాదం
పెనుకొండ రూరల్: విహార యాత్ర కాస్త విషాదంగా ముగిసింది. స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్కు చేరుకున్న ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మణిపూర్లోని ఉక్రూల్ జిల్లా చోయ్థార్ గ్రామానికి చెందిన ఖరియ్ అహుంగ్షీ ఫిలిమెన్ (25) బెంగళూరులోని ఓ సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలసి సోమవారం విహార యాత్రలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్కు వచ్చాడు. స్నేహితులందరూ కలసి రిజర్వాయర్లో దిగి నీటిలో కేరింతలు కొడుతుండగా ప్రమాదవశాత్తు ఫిలిమెన్ లోతైన ప్రాంతంలోకి వెళ్లాడు. ఈత సరిగా రాకపోవడంతో నీట మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి వెలికి తీసేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కియా పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. రిజర్వాయర్లో నీట మునిగి యువకుడి మృతి -
6న జేఎన్టీయూ(ఏ) స్నాతకోత్సవం
అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) 15వ స్నాతకోత్సవం ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించనున్నారు. భారతదేశ క్షిపణి మహిళ (మిస్సైల్ ఉమెన్)గా ఖ్యాతి దక్కించుకున్న టెస్సీ థామస్ను గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశారు. ఛాన్సలర్ /గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై జేఎన్టీయూ(ఏ) గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారు. ఈ మేరకు స్నాతకోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. అగ్ని పుత్రి టెస్సీ థామస్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో టెస్సీ థామస్ ఏరోస్పేస్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. ఈమెను అగ్నిపుత్రిగా పిలుస్తారు. అగ్ని–4 క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించి, మిస్సైల్ ప్రాజెక్ట్ను నడిపించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె కేరళలోని త్రిశూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, పుణెలో ఎంటెక్, మిస్సైల్ గైడెన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988లో డీఆర్డీఓలో చేరి, అగ్ని సిరీస్ క్షిపణుల అభివృద్ధిలో, ముఖ్యంగా అగ్ని–2, 3, 4, 5 క్షిపణుల గైడెన్స్, నావిగేషన్ సిస్టమ్లో కీలక పాత్ర పోషించారు. టెస్సీ థామస్కు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గదర్శకులు. గౌరవ డాక్టరేట్కు టెస్సీ థామస్ ఎంపిక -
రాజకీయ కక్షతో బిల్లులు ఆపారు
ప్రశాంతి నిలయం: ‘‘రాజకీయ కక్షతో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో మా సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశాం. ఇప్పుడు మంత్రి సవిత మాకు బిల్లులు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. మీరైనా బిల్లులు మంజూరు చేయించండి’’ అని సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచ్లు కలెక్టర్, జేసీ ఎదుట వాపోయారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డితో కలిసి కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వచ్చిన సోమందేపల్లి మండల సర్పంచ్లు రామాంజనేయులు, లక్ష్మీ నరసింహప్ప, శ్రీనివాసరెడ్డి, నాగరత్నమ్మ, ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఈమేరకు అర్జీ ఇచ్చారు. అనంతరం వారు జేసీకి తమ సమస్య విన్నవించారు. కేతగాని చెరువు పంచాయతీలో రూ.6.80 లక్షలు, చాలకూరులో రూ.7.38 లక్షలు, వెలిదడకలలో రూ.4 లక్షలు, చాలకుంటలో రూ.8.90 లక్షలు, తుంగోడులో రూ.2.37 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఆయా గ్రామ పంచాయతీల విద్యుత్ సరఫరా, మోటర్ల మరమ్మతులకు వినియోగించినవేనన్నారు. వీటికి పంచాయతీల తీర్మానం ఉన్నా... అందుబాటులో నిధులున్నా మంత్రి సవిత బిల్లులు మంజూరు చేయకూడదని ఆదేశించారని, దీంతో ఎంపీడీఓలు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తమపై దయచూపి బిల్లులు మంజూరు చేయించాలని కోరారు. ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై 214 అర్జీలు అందగా.. వాటిని స్వీకరించిన కలెక్టర్ పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. మంత్రి సవిత తీరని అన్యాయం చేస్తున్నారు ‘పరిష్కార వేదిక’లో సర్పంచ్ల ఫిర్యాదు -
గంగమ్మ తల్లీ.. కరుణించమ్మా
కదిరి అర్బన్: మండలంలోని యర్రదొడ్డి గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది అనంతరం తొలి ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు. రాత్రి అమ్మవారికి గ్రామెత్సవం నిర్వహించారు. బత్తలపల్లి: మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని పూలు, నిమ్మ, వేప, ఆకులతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అమ్మవారికి జంతుబలులు ఇచ్చారు. అలాగే మండల వ్యాప్తంగా ప్రజలు జంతుబలులిచ్చి, పంటలు పుష్కలంగా పండాలని గ్రామదేవతలను వేడుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో టెంకాయలు, చీనీపండ్లు విసురుతూ యువకులు పందేలు ఆడారు. -
నిబంధనలకు నీళ్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పరవాలేదు’ అనే నానుడి ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ)గా పని చేస్తున్న వెంకటరమణనాయక్కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్గా అత్యంత జూనియర్గా ఉన్న ఆయనను నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఐఓగా కొనసాగిస్తుండమే ఇందుకు నిదర్శనం. ఈ వ్యవహారం ఆర్ఐఓ, డీవీఈఓ కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జూనియర్ అధ్యాపకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ డీవీఈఓ వచ్చినా.... జీఓ నంబర్ 8 మేరకు హైకోర్టు ఆదేశాలతో అన్ని ఉమ్మడి జిల్లాలకు రెగ్యులర్ డీవీఈఓలను నియమించే సందర్భంలో సీనియార్టీ జాబితాలో 57, 59, 65, 66, 71, 73, 75 స్థానాల్లో ఉన్న వారిని కాదని 327వ స్థానంలో ఉన్న వెంకటరమణనాయక్ను డీవీఈఓ (ఎఫ్ఏసీ)గా కొనసాగించారు. ఇందుకు ఇంటర్ బోర్డులో పని చేస్తున్న ఓ రిటైర్డ్ అధికారి అండగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు సీనియర్లు కోర్టుకు వెళ్లడంతో 2025 జనవరి 5న ఆయనను డీవీఈఓ బాధ్యతల నుంచి తప్పించి రెగ్యులర్ డీవీఈఓగా గురువయ్యశెట్టిని నియమించారు. అదే ఏడాది జూలైలో ఆయా జిల్లాల్లో రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్ఐఓ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇక్కడ మాత్రం వెంకటరమణనాయక్నే ఎఫ్ఏసీ ఆర్ఐఓగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఏసీ హోదాలో మూడేళ్లు మాత్రమే ఉండొచ్చని అధ్యాపకులు చెబుతున్నారు. ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారని అంటున్నారు. ● డీవీఈఓ అనుమతి లేకుండా ఉద్యోగులకు ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వకూడదు. 2019 మార్చి పరీక్షల సమయంలో ఒక రికార్డు అసిస్టెంట్కు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ ఏకంగా 30 రోజులు ఓడీ ఇవ్వడాన్ని అధ్యాపకులు తప్పుపడుతున్నారు. ఈ విషయంపై 2021లో అప్పటి సెక్రటరీకీ కొందరు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఈయనను ఆర్ఐఓ బాధ్యతల నుంచి తప్పించారని చెబుతున్నారు. అయితే కమిషనర్ మారిన వెంటనే మళ్లీ చక్రం తప్పి డీవీఈఓగా తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. 2024 ఏప్రిల్లో తిరిగి ఆర్ఐఓ బాధ్యతలూ చేపట్టారు. ● 2025 మార్చిలో జరిగిన పరీక్షల సమయంలో డీఈసీ మెంబరుగా నిబంధనలకు విరుద్ధంగా తనమిత్రుడికి లైబ్రేరియన్గా అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి నేరుగా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఈసారి డీఈసీ కమిటీలో సదరు లైబ్రేరియన్ను తప్పించారని చెబుతున్నారు. ఈయన హయాంలో జరిగిన , జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే మరిన్ని వెలుగులోకి వస్తాయని అధ్యాపకులు చెబుతున్నారు. రాష్ట్రమంతా రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్ఐఓ బాధ్యతలు ఇక్కడ మాత్రం ఏళ్లుగా ఎఫ్ఏసీ ఆర్ఐఓగా వెంకటరమణనాయక్ సీనియర్లను కాదని జూనియర్ను కొనసాగిస్తుండడంపై అనుమానాలు -
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలి
అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా విరాజిల్లుతున్న ఆర్డీటీని పరిరక్షించాలన్న డిమాండ్తో ఏప్రిల్ 9న సీపీఐ ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ , సీపీఎం మద్దతు ఇవ్వాలని సీపీఐ కోరింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నగర కార్యదర్శి రామిరెడ్డి, బాలరంగయ్యలను సీపీఐ జిల్లా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ.. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులను మాత్రమే కలిశామని, తక్కిన రాజకీయ, కుల సంఘాలను కలిసి బంద్ను విజయవంతం చేయాలని కోరతామన్నారు. ఏప్రిల్ 3న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, కేశవ రెడ్డి, రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి , నరేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు అల్లిపీర, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9న ఉమ్మడి జిల్లాల బంద్కు సీపీఐ పిలుపు వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు కోరిన సీపీఐ నాయకులు -
●అరటికి ఈతాకు రక్ష
అరటి పంటకు ఈతాకును రక్షణగా ఉంచిన దృశ్యం పెరుగుతున్న ఎండలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోరంపల్లి – గంగవరం గ్రామాల మధ్య అరటి రైతులు అరటి పిలకలకు రక్షణగా ఈతాకును ఏర్పాటు చేశారు. మొక్కను మొత్తం ఎండ నుంచి కాపాడుకునేందుకు రక్షణగా ఓ గొడుగులా చుట్టూ ఏర్పాటు చేశారు. అరటి మొదటి దశలో ఉండగా అంతర పంటగా పలువురు రైతులు టమాట, పప్పుశనగను సైతం సాగు చేశారు. – కళ్యాణదుర్గం: -
అబ్బురం.. పంటల వైవిధ్యం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేనివిధంగా ‘అనంత’లో పంటల వైవిధ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశంలో పండే ప్రధాన పంటలన్నీ జిల్లాకు పరిచయం అవుతుండటం విశేషం. చివరకు కశ్మీర్, సిమ్లా లాంటి అతిశీతల వాతావరణంలో పండే యాపిల్ లాంటి పంట కూడా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. ఈ–క్రాప్ సర్వేతో జిల్లాలో పంటల వారీగా దాదాపుగా కచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల పరిధిలో ఎన్ని రకాల వ్యవసాయ పంటలు, ఎన్ని రకాల పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు, పూల తోటలు సాగు చేస్తున్నారనేది వెల్లడవుతోంది. దీంతో గతంలో 15 నుంచి 20 వరకు వ్యవసాయ పంటలు, 20 నుంచి 25 వరకు ఉద్యాన పంటలు.. ఇలా ఏటా ఖరీఫ్లో 40 నుంచి 50 పంటలు, రబీలో అయితే 20 నుంచి 25 పంటలు చూపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వందల సంఖ్యలో పంటలు సాగు చేస్తున్నట్లు వెల్లడవుతోంది. గత ఖరీఫ్లో ఏకంగా 150 రకాల పంటలు సాగు చేసినట్లు నమోదు చేశారు. రబీలో 127 రకాల పంటలు రబీలో జిల్లా వ్యాప్తంగా 3,93,958 ఎకరాల్లో 127 రకాల పంటలు సాగు చేసినట్లు ఈ–క్రాప్ ద్వారా వెల్లడైంది. అయితే ఇందులో కేవలం ఏడు రకాల వ్యవసాయ పంటలే 3,47,163 ఎకరాల్లో సాగులోకి రాగా.. మిగతా 46,795 ఎకరాల్లో 100 రకాల పంటలు వేశారు. అందులో పప్పుశనగ, వరి, వేరుశనగ, సజ్జ, మినుము, ఆముదం, బేబీకార్న్, పాప్కార్న్, పత్తి, అలసంద, పెసర, ఉలవ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, కంది, కుసుమ, నువ్వులు, సోయాబీన్, చెరకు, పొద్దుతిరుగుడు, పత్తి, పొగాకు, గోధుమ, రాగి, మల్బరీ, ఉసిరి, చీనీ, నిమ్మ, సపోట, జామ, ద్రాక్ష, దానిమ్మ, అరటి, అంజూర, మామిడి, సీతాఫలం, పనస, మకాడమియా, అజ్వాన్, అమరాంథస్, ఆకు, వక్క, ఆపిల్, ఆపిల్ బేర్, అశ్వగంధ, అవకాడో, వెదురు, టమాట, వంగ, బెండ, బీన్స్, బీట్రూట్, బ్రాడ్బీన్స్, గుమ్మడి, కాకర, సొర, బీర, బూడిద గుమ్మడి, క్యాబేజ్, క్యాప్సికం, బెర్రీ, రేగు, క్యారెట్, కాలీఫ్లవర్, లిల్లీ, మల్లె, రోజ్, ట్యూబ్రోజ్, కనకాంబరం, చామంతి, బంతి, కొబ్బరి, ధనియాలు, దోస, కర్భూజ, కళింగర, బొప్పాయి, కస్టర్డ్ యాపిల్, ఖర్జూరం, డ్రాగన్, మునగ, ఫీల్డ్బీన్, ఫ్లాక్స్ సీడ్, గోంగూర, పచ్చిమిరప, ఎండుమిరప, ఉల్లి, పొటాటో, స్వీట్ పొటాటో, ముల్లంగి, రాజ్మాబీన్, ఎర్రచందనం, శీకాకాయి, పసుపుతో పాటు మరికొన్ని కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు.. మొత్తంగా 127 రకాలు సాగైనట్లు ఈ–క్రాప్లో నమోదు చేశారు. రబీలో 3,93,958 ఎకరాల విస్తీర్ణంలో 127 రకాల పంటల సాగు గత ఖరీఫ్లోనూ ఏకంగా 150 రకాల పంటలు సాగైనట్లు ఈ–క్రాప్లో వెల్లడి సత్ఫలితాలిస్తున్న ఈ–క్రాప్ కచ్చితమైన సాగు గణాంకాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం తరఫున అర్హులైన రైతులకు అందాల్సిన ప్రయోజనాలు కల్పించడానికి వీలుగా గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తీసుకువచ్చిన ఈ–క్రాప్ (పంట నమోదు) ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ –క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) లేనప్పుడు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది ఇచ్చిన కాకిలెక్కలే అన్నింటికీ ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుతీరాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకే వ్యవస్థతో గ్రామ స్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రణాళికలు అమలు చేయడంతో రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు లభించింది. ఈ క్రమంలో ఈ–క్రాప్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి చేకూరి రైతులకు ఉపశమనం లభించింది. -
మధుర స్వరం.. పరవశ భరితం
ప్రశాంతినిలయం: శ్రోతలను మైమరపించేలా భక్తి రస మాధుర్యంతో సత్యసాయిని కీర్తిస్తూ సాగిన సంగీత కచేరీ పరవశభరితంగా సాగింది. ఆదివారం సాయంత్రం సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన నందిగిరి క్యాంపస్ విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిపై కృతజ్ఞతతో కూడిన భక్తి భావనను చాటుతూ కచేరీ చేపట్టారు. సత్యసాయి ఆధ్యాత్మిక లీలలను, సేవా స్ఫూర్తిని, ప్రేమ తత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో ఆశీనులైన భక్తకోటి సంగీత స్వరాన్ని వింటూ మంత్రముగ్ధులయ్యారు. పిదప విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి మందిరం వేళల్లో మార్పులు.. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో నిత్యం సాయంత్రంపూట జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ వేళల్లో మార్పులు చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. 5 గంటల నుంచి 5.45 వరకూ వేదం, 5.45 నుంచి 6.30 వరకూ భక్తి గీతాలాపన, అనంతరం సత్యసాయి మహాసమాధి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు గమనించాలని కోరారు. ఆకట్టుకున్న సాయి విద్యార్థుల సంగీత కచేరీ -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు శ్రీనివాసులు (35) శనివారం రాత్రి కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసుల వివరాల మేరకు... శ్రీనివాసులు కూలి మగ్గం నేసుకుంటూ జీవించేవాడు. ఆరేళ్ల క్రితం మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆమె మృతి చెందింది. భార్య చనిపోవడంతో శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. మరో పెళ్లి చేస్తే మద్యం మాని బాగుడతాడని తల్లిదండ్రులు భావించారు. ముదిగుబ్బ మండలం సిరిగారిపల్లికి చెందిన నందు అనే అమ్మాయితో మరో పెళ్లి చేశారు. అయితే రెండో పెళ్లి తరువాత కూడా శ్రీనివాసులు మద్యం తాగి తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాలుగు నెలల కిత్రం పుట్టింటికి వెళ్లింది. కొద్ది రోజులుగా మృతుడు తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తమ్ముడు ఆదివారం శ్రీనివాసులును నిద్ర లేపడానికి తలుపు తట్టగా ఇంట్లో ఉరివేసుకున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి ఆదెప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
పుట్టపర్తి: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం) ప్రారంభమైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్తచెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 169 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 33 మంది చీఫ్ ఎగ్జామినర్లు, ఐదుగురు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు మూల్యాంకన విధుల్లో ఉంటారన్నారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, ఎకనమిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమైందన్నారు. మొత్తం 1,09,715 పేపర్లు వచ్చాయన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టుకు అధికంగా పేపర్లు వచ్చాయన్నారు. బోర్డు ఆర్డర్ వచ్చిన అన్ని కళాశాలల అధ్యాపకులు వాల్యుయేషన్కు హాజరుకావాలని, రాని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కనగానపల్లి: మండల పరిధిలోని తగరకుంట గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... మండలంలోని నెమలివరం గ్రామానికి చెందిన బొమ్మలాట గంగాధర్ (35), భాస్కర్, రాజు ముగ్గురు తగరకుంట నుంచి కనగానపల్లి వైపు ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. అలాగే కనగానపల్లి వైపు నుంచి అటుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నుంచి కిందపడి ముగ్గురూ గాయపడ్డారు. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గంగాధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సుశీల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ముదిగుబ్బలో మరొకరు.. ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి రాము (52) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టపర్తికి చెందిన రాము పని నిమిత్తం వెళ్తుండగా దొరిగిల్లు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన రామును చికిత్స నిమిత్తం ముదిగుబ్బకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య చెన్నమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దమ్మ ఆలయంలో చోరీ పుట్లూరు: మండలంలోని కుమ్మనమల గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న 60 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సురేంద్రబాబు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
పారదర్శకంగా కానిస్టేబుళ్ల బదిలీలు
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: పారదర్శకత, నిబంధనలే ప్రామాణికంగా కానిస్టేబుళ్ల బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఆదివారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 మంది కానిస్టేబుళ్లకు ఎస్పీ సతీష్కుమార్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లలో ఒకే పోలీసుస్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్కు పిలిచారు. ఖాళీల జాబితాను ప్రొజెక్టర్పై ప్రదర్శించారు. బదిలీల నిబంధనలు ఎస్పీ స్పష్టంగా వివరించారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి ఒక సబ్ డివిజన్ నుంచి మరొక సబ్ డివిజన్కు సిబ్బంది కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగడంతో సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఓ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ నాగరాజు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణ లేకుండా బదిలీలు చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో క్రమబద్దీకరణ చేయకుండా టీచర్ల బదిలీలు మాత్రమే చేపట్టాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్టీఏ జిల్లా సబ్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. క్రమబద్ధీకరణ జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదని, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాలల రోల్ పెరగడం అనేది అసాధ్యమని, ఫలితంగా చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. అలాగే గత సంవత్సరంలో బదిలీ అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా క్రమబద్ధీకరణకు గురైతే తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం టీచర్ల బదిలీలు మాత్రమే నిర్వహించాలని, క్రమబద్ధీకరణ చేయకూడదని డిమాండ్ చేశారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.గోవిందరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఓబిరెడ్డి, సిద్ధప్రసాద్ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్, విశ్వనాథరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. -
కనుల పండువగా సిడిమాను ఉత్సవం
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదికప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని, ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు.రాయదుర్గంటౌన్: రాయదుర్గం పట్టణ సమీపంలోని కొండపై రస సిద్ధేశ్వరస్వామి సిడిమాను ఉత్సవం ఆదివారం సాయంత్రం అశేష భక్తజన సందోహం నడుమ కనులపండువగా జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. అంతకుముందు ఉత్సవ విగ్రహానికి గంగపూజ నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ ఈశ్వర్ స్నేహితుల బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జైన సంస్కృతికి ప్రతీక.. శ్రీరస సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. జైన సంస్కృతికి ప్రతీకగా రససిద్ధేశ్వర స్వామి ఆలయంలో శిలలపై జైన విద్యా పీఠ రూపం మలచబడి ఉంది. మొదటి వరుసలో ఆచార్యులు విద్యార్థులకు బోధిస్తున్న దృశ్యం, ఆ తరువాత రాణులు కూడా ఆచార్యుల ఉపన్యాసాలను వింటున్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి. వీటన్నింటిని పరిశీలించిన చరిత్రకారులు ఇక్కడ జైన విద్యా పీఠం వెలసి ఉండవచ్చని, జైనాచార్యుడైన రససిద్ధుడు బోధన చేసి ఉంటారని పేర్కొంటారు. ఆది నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను పాలెగాండ్ర వంశస్తులే నిర్వహిస్తూ వస్తున్నారు. -
ఒత్తిడిలోను పుత్తడికి జై!
పుట్టపర్తి టౌన్: బంగారు తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య జిల్లాలో ఇటీవల పెరిగింది. గ్రామీణ, పట్టణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ అధికంగా బంగారు రుణాలు పొందుతుండడం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల ద్వారా బంగారు రుణాలు నెలకు దాదాపు రూ. 20 కోట్లు తీసుకొంటున్నారు. గతంలో రూ. 12 కోట్ల వరకు బంగారు రుణాల లావాదేవీలు ఉంటే ఇప్పుడు రూ. 20 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. 80 శాతం మంది బ్యాంక్లో తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో కుదవ పెట్టి రుణం పొందుతున్నారు. బంగారు రుణాలపై బ్యాంకులు ఏడాదికి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థల్లో 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. సులువుగా రుణం .. సాధారణంగా రుణం కోసం బ్యాంకులకు వెళితే సవాలక్ష నిబంధనలు పెడతారు. కొన్ని సార్లు నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం పొందలేని పరిస్థితి. పైగా బడా బాబులు ష్యూరిటీ ఇస్తే తప్ప లోన్లివ్వరు. ఒక్కోసారి అటు తిప్పి ఇటు తిప్పి రుణం మంజూరు చేయకుండా కొర్రీలు పెడతారు. గోల్డ్ లోన్ అలా కాదు.. చేతిలో బంగారు నగలు ఉంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల్లో క్షణాల్లో రుణం మంజూరవుతోంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ ఫైనాన్స్ సంస్థలు.. అవసరాలకు అప్పులు పుట్టని చాలా మంది గోల్డ్ లోన్లు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకొనే రుణానికి వడ్డీ ధర అధికంగా ఉండడంతో చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు బంగారు నాణ్యతను బట్టి లోన్లు మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో పది గ్రాముల బంగారానికి రూ. 90 వేల దాకా రుణం ఇస్తున్నారు. జిల్లాలో ప్రధాన బ్యాంక్లతోపాటు పలు ప్రైవేటు సంస్థలు విరివిగా బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొందరు బంగారు కుదువ పెట్టి లోన్ తీసుకొని ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తున్నారు. లాకర్లవైపు మక్కువ కరువు.. డబ్బు ఉన్నవారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచు కోవడం తగ్గించేశారు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకొని పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే రుణం తీసుకున్న 90 శాతం నెలలోపు చెల్లిస్తున్నారు. మిగిలిన్న మొత్తాన్ని ఏడాదిలోపు వడ్డీతో చెల్లిస్తున్నారు. మళ్లీ బంగారు లోన్ కోసం బ్యాంకులో పెట్టేస్తున్నారు.జిల్లాలో ప్రధాన కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వివిధ బ్యాంక్ శాఖల్లో కిలోల కొద్దీ బంగారం ఉంది. ధర పెరిగినా కొనుగోళ్లు బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.అత్యవసర సమయంలో ఉపయోగపడే నిధిగా భావిస్తుంటారు. అందుకే ధరలు భగ్గుమంటున్నా కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న గోల్డ్ లోన్లు వడ్డీ రేటు తక్కువ.. రిస్కూ తక్కువే లోన్లు ఇవ్వడానికి ప్రైవేటు సంస్థలు కూడా ఆసక్తి ప్రైవేటుగా అప్పయితే అధిక వడ్డీ కట్టాల్సిన దుస్థితి అందుకే ధరలు పెరిగినా బంగారు కొనుగోళ్లపై ఆసక్తి -
పండగ పూట ‘నారాయణ’ నిర్వాకం
హిందూపురం టౌన్: ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పండుగ సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్న ఘటన హిందూపురం పట్టణంలో వెలుగు చూసింది. శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. అయినా హిందూపురంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా మార్కుల కోసం, ర్యాంకుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసింది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తోంది. ర్యాంకులు, మార్కుల ఒత్తిడి భరించలేక రాష్ట్రంలో నారాయణ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అనేక మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా.. యాజమాన్యం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ తెలిసినా స్థానిక విద్యాశాఖ అధికారులు మాత్రం నోరుమెదపక పోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎంఈఓ గంగప్పను వివరణ కోరగా.. విద్యార్థుల తల్లిదండ్రులు కోరితేనే తరగతులు ఏర్పాటు చేసినట్లు నారాయణ పాఠశాల యాజమాన్యం తెలుపుతోందని వివరించారు. సెలవు రోజుల్లోనూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మార్కుల కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్ -
అరటి రైతుల కష్టాలు కనిపించలేదా?
అనంతపురం అర్బన్: ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరటి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని రైతులు నిలదీశారు. అరటి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అరటి గెలలు, బోదెలతో శనివారం అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో అరటి పంట ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. దీంతో ధర పతనమై రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.22 వేల నుంచి రూ.25 వేలు ధర పలికిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర ఐదారు వేల రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, ధరలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గొప్పలు చెప్పారన్నారు. క్షేత్రస్థాయిలో అరటి రైతులు నష్టపోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టన్ను రూ.25 వేలతో అరటి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, మామిడి, తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, వెంకటరాముడు, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు. నేడు ‘కడపటి యుద్ధం’ ఆవిష్కరణ అనంతపురం కల్చరల్: విలక్షణ రచయిత బండి నారాయణస్వామి కలం నుంచి జాలు వారిన ‘కడపటి యుద్ధం’ నవల ఆదివారం ఆవిష్కరణ కానుంది. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ వేదికగా జరిగే ఈ కార్యక్రజుమానికి ప్రజాకవి గోరేటి వెంకన్న, భూమన్, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి హాజరు కానున్నారు. రాతిదూలం లాగుడు పోటీలు కూడేరు: ఉగాది పండుగ నేపథ్యంలో కూడేరు మండలం కొర్రకోడులో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీకి రైతులు తీసుకువచ్చారు. బొమ్మనహళ్ మండలం గోవిందవాడ గ్రామ రైతు గురుస్వామి వృషభాలు ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన రైతు నరసింహులు వృషభాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన రైతు భీమలింగ వృషభాలు, నాల్గో స్థానంలో బొమ్మనహళ్ మండలం లింగాదహళ్కు చెందిన వృషభాలు, ఐదో స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతు మస్తానయ్య వృషభాలు, ఆరో స్థానంలో పత్తికొండ మండలం పులికొండ గ్రామ రైతు మాధవరాజులు వృషభాలు, ఏడో స్థానంలో వజ్రకరూరు మండలం ధర్మపురికి చెందిన రైతు అజిత్కుమార్ వృషభాలు, ఎనిమిదో స్థానంలో బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్కు చెందిన బసన్న వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
నేత్రపర్వం... లంకా దహనం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ తీసుకెళ్లారు. అక్కడ ఈఓ ఎం.విజయరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణానికి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లంకాదహనం వేడుకను ప్రారంభించారు. తిరిగి అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుని అక్కడ లంకాదహనం వేడుకలను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకను చూసేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. -
కష్టాల్లో అరటి రైతులు
● భారీగా అరటి ధరల పతనం ● ఈదురుగాలులకు నేలవాలిన చెట్లు ● రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు సర్కారు అనంతపురం అగ్రికల్చర్: అరటి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు ధరల్లేక దిక్కులు చూస్తుంటే.. మరోవైపు ఈదురుగాలులకు తోటలు నేలవాలుతుండటంతో నష్టాలు రెట్టింపవుతున్నాయి. కోతకు వచ్చిన నాణ్యమైన మొదటి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. టన్ను రూ.20 వేలకు పైగా ఉండాల్సిన ధర ఒక్కసారిగా నేలచూపు చూడటంతో టన్ను రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్యనే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ● గత నవంబర్లోనే రెండో పంటను అమ్ముకోలేక ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది మొదటి పంటకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నాలుగు రోజులుగా 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలు మండలాల్లో అరటి తోటలు నేలవాలాయి. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 33 శాతం దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తున్న పరిస్థితి. ఇలా పది మండలాల్లో 120 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.4.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. అరటి తోటలకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.ఒక కోటి, మొక్కజొన్న, వరి పంటల నష్టం రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అరటి తోటల రైతులకు ఈ ఏడాదీ కలిసిరాక పెట్టుబడులు కూడా దక్కించులేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అరటి రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోయింది. ఉద్యానశాఖ మాత్రం మొక్కుబడిగా నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. -
తల్లీబిడ్డల అదృశ్యంపై కేసు నమోదు
పుట్టపర్తి టౌన్: స్థానిక చిత్రావతి రోడ్డులో నివాసముంటున్న ఆది ఆంధ్ర సత్యం భార్య మేదర సోమేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలసి కనిపించకుండా పోయిందంటూ భర్త చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు, బంధువుల నివాసాలు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడన్నారు. బైక్ బోల్తా – యువకుడికి గాయాలు గాండ్లపెంట: ద్విచక్ర వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన పవన్కుమార్ శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై కదిరికి బయలుదేరాడు. గాండ్లపెంట మండలం వేపరాల క్రాస్ వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమైన పవన్కుమార్ను స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కారు అదుపు తప్పి... నల్లచెరువు: కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సంతోష్, శ్రావణి శనివారం ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. నల్లచెరువు మండలం రాట్నాలపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జయింది. గాయపడిన సంతోష్, శ్రావణిని స్థానికులు 108 వాహనం ద్వారా కదిరిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
కళ్యాణదుర్గం రూరల్: టీడీపీ సీనియర్ నేత, కళ్యాణదుర్గం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం ఎర్రంపల్లిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరారెడ్డి తదితరులు ఎరరంపల్లికి చేరుకుని ఉన్నం హనుమంతరాయచౌదరి పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉన్నం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
విద్యార్థిని బలిగొన్న ఈత సరదా
వజ్రకరూరు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన చిన్న మాదుల రాజేష్, సోమావతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వీరి చిన్న కుమారుడు అరుణ్తేజ్ (13) స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో అరుణ్తేజ్ మరో నలుగురు విద్యార్థులతో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి సమీపంలోని ఉన్న సొంత పొలానికి వెళ్లాడు. కాసేపు ఆడుకున్న తర్వాత స్నేహితులతో కలిసి బావిలో ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి వెళ్లిన అరుణ్తేజ్ ఎంత సేపటికీ పైకి రాలేదు. కంగారు పడిన స్నేహితుల కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలో దూకి గాలింపు చేపట్టారు. నీటి అడుగున పూడికలో ఇరుక్కుపోయిన అరుణ్తేజ్ను వెలికి తీసి ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్తేజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం రాజ్కుమార్, ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈద్.. తక్బీర్
పుట్టపర్తి టౌన్: ఈద్ –ఉల్ –ఫితర్ (రంజాన్) సందర్భంగా జిల్లాలో శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దలు, తల్లిదండ్రులు పట్ల విధేయత చూపాలని, మత సామరస్యం, సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాలని మత పెద్దలు సందేశం ఇచ్చారు. మత సామరస్యాన్ని చాటుతూ ఇచ్చిన విందుల్లో హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు మస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు కిటకిటలాడిన మసీదులు, ఈద్గాలు -
అకాల నష్టంపై సమగ్ర నివేదిక
● జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య బత్తలపల్లి: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలన్నీ నమోదు చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మండల స్థాయి వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. శుక్రవారం ఆయన సాంకేతిక శాస్త్రవేత్త రామసుబ్బయ్యతో కలిసి బత్తలపల్లి మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పలు గ్రామాల్లో పంటలు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ నరసింహనాయుడు, మండల వ్యవసాయాధికారి ఓబిరెడ్డి, విస్తరణ అధికారి శ్రీనివాసులు, గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీకాంత్రెడ్డి, రవి, బాలరాజు నాయక్, రాగిరి సోమశేఖర్ తదితరులు ఉన్నారు. రేపటి నుంచి ఇంటర్ ‘స్పాట్’ పుట్టపర్తి: శనివారం జరగాల్సిన ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ ఆదివారం కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 21వ తేదీ శనివారం ఇంగ్లిష్, మ్యాథ్స్, తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్ రంజాన్ సెలవు దృష్ట్యా ఆదివారానికి మార్చినట్లు వెల్లడించారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరిశీలకులు 23వ తేదీ సోమవారం నుంచి హాజరుకావాలన్నారు. ఈ సబ్జెక్టుల అధ్యాపకులు అందరూ తప్పనిసరిగా క్యాంపునకు హాజరు కావాలన్నారు. -
రైతులపై రాజకీయ పెత్తనం
ధర్మవరం రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ కొలువుదీరాక రైతులపై రాజకీయ పెత్తనం పెచ్చుమీరిపోయింది. కబ్జాలు, ఆక్రమణలకు అంతేలేకుండా పోయింది. టీడీపీ నాయకులు తలచుకుంటే రోడ్లు, విద్యుత్ లైన్ల అలైన్మెంట్ కూడా మారిపోతోంది. తాజాగా ధర్మవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి కోసం విద్యుత్ అధికారులు 33 కేవీ విద్యుత్ లైనుఅలైన్మెంట్ మార్చి ఇతర రైతుల పొలాల్లో స్తంభాలు నాటారు. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చినా ఏమాత్రం లెక్కచేయలేదు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఏకంగా పోలీసులను వెంట బెట్టుకుని వెళ్లి స్తంభాలు నాటారు. అలైన్మెంట్ మార్చేసి.. అడ్డుకున్న వారిని ఈడ్చేసి ధర్మవరం మండలం గొట్లూరు వద్ద సర్వే నంబర్ 624లో శ్రీరామరెడ్డి, నరసింహారెడికి 4.60 ఎకరాల పొలం ఉంది. పొలం పక్కనే తారురోడ్డు వెళ్తోంది. వీరికి రోడ్డుకు అటు వైపున కూడా కొంత భూమి ఉంది. ఇటీవల గొట్లూరు నుంచి సుబ్బరావుపేట వైపు 33 కేవీ విద్యుత్ లైను లాగుతున్నారు. విద్యుత్ శాఖకు చెందిన కాంట్రాక్టర్ విద్యుత్ స్తంభాలను శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి పొలం వద్దకు రాగానే రోడ్డుకు ఇటు పక్కన భూమిలో తొలుత విద్యుత్ స్తంభాలను నాటారు. ఆ లైను అలాగే టీడీపీ నాయకుని పొలం గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో టీడీపీ నాయకుడు ఆ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చాడు. అప్పటికే నాటిన విద్యుత్ స్తంభాలను పడగొట్టాడు. అంతేకాకుండా రాజకీయ నాయకులతో అధికారులకు ఫోన్లు చేయించాడు. దీంతో విద్యుత్ అధికారులు 33 కేవీ విద్యుత్ లైను అలైన్మెంట్ మార్చి శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి పొలంలో స్తంభాలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చారు. ఈక్రమంలోనే శుక్రవారం ఏకంగా 50 మంది పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అటువైపున ఉన్న శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి చీనీ తోటలో నాటించారు. రైతు కుటుంబ సభ్యులు కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ చూపినా పట్టించుకోలేదు. తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నా... వినకుండా వారందరినీ బలవంతంగా జీపులో ఎక్కించి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విద్యుత్ స్తంభాలను నాటించారు. టీడీపీ నాయకుడి కోసం విద్యుత్ లైను అలైన్మెంట్ మార్పు తమ పొలంలో స్తంభాలు నాటవద్దని వేడుకున్నా.. వినని అధికారులు రైతు కుటుంబ సభ్యులను ఈడ్చుకెళ్లిన పోలీసులు స్టే ఆర్డర్ చూపినా పట్టించుకోని వైనం న్యాయ పోరాటం చేస్తాం.. తొలుత అధికారులు మా చీనీతోటకు అటు వైపు ఉన్న మా స్థలంలోనే స్తంభాలను నాటారు. మా స్థలం తర్వాత టీడీపీ నాయకుడి పొలం ఉంది. దీంతో అతను తన స్థలంలో స్తంభాలు నాటడానికి ఒప్పుకోలేదు. నాటిన విద్యుత్ స్తంభాలనూ తొలగించాడు. దీంతో అధికారులు ఇటువైపున ఉన్న మా చీనీతోటలో విద్యుత్ స్తంభాలు నాటేందుకు ప్రయత్నించగా...హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ను తీసుకొచ్చాను. వీటిని చూపినా... పోలీసులు లెక్క చేయలేదు. అడ్డుకున్న మా కుటుంబీకులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. – నరసింహారెడ్డి, రైతు -
రంజాన్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ సూచించారు. జిల్లాలోని ముస్లింలందరికీ ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, గౌరవం, దాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలు జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి ‘పది’ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా ● ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈనెల 30కు వాయిదా సాక్షి, పుట్టపర్తి: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రభుత్వ వాయిదా వేసిందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం 211–గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు ఈనెల 30కు వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. -
రంజాన్కు సర్వం సిద్ధం
నెలవంక కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలను విరమించారు. సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాసాలతో సాగిన రంజాన్ మాసం ముగియడంతో శనివారం పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లా అంతటా రంజాన్ వేడుకలకు మసీదులు, ఈద్గాలలో ఏర్పాట్లు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల్లో చివరిరోజు శుక్రవారం ఇఫ్తార్ వేళ మసీదులన్నీ ముస్లింలతో రద్దీగా మారాయి. మసీదుల ఇమామ్లు, మౌజన్లు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకతీతంగా ఇఫ్తార్ విందు ఇచ్చి ఐక్యత చాటిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి బృందం, శ్రీసత్యసాయి జిల్లా -
హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన
యాడికి: ఉగాది పండుగ సందర్భంగా యాడికి మండలం రాయలచెరువులోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకట సుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్పల్లి రైతు నాగయ్య వృషభాలు, తృతీయ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా అక్కంపేట గ్రామ రైతు ఆదిల్ వృషబాలు, నాల్గో స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకటసుబ్బారెడ్డి రెండో జత వృషబాలు, ఐదో స్థానంలో గార్లదిన్నె మండలానికి చెందిన రైతు రామాంజనేయులు వృషభాలు, ఆరో స్థానంలో తాడిపత్రిలోని గన్నేవారిపల్లి రైతు రమేష్బాబుయాదవ్ వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో కొండుపల్లి చిలమకూరు జయప్రకాష్, ముత్తలూరు నరేష్ చౌదరి, న్యూ వికాష్ స్కూల్ రామకృష్ణ, జొన్నల వ్యాపారి పెద్దన్న, రాజ పుల్లయ్య, రంగస్వామి, నాగరంగయ్య, మదమంచి శివప్రసాదనాయుడు సత్యరించారు. నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవంగుంతకల్లు రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. ఆంజనేయ రక్షమాం.. పవన పుత్ర పాహిమాం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. శుక్రవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో అలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి ఆలయ పురవీధుల్లో భక్తులు లాగారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పర్యవేక్షించారు. ●ఉల్లాసంగా ఉట్ల పరుషబుక్కరాయసముద్రం: ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం బుక్కరాయసముద్రంలో ఉట్ల పరుష ఉల్లాసంగా సాగింది. స్టేట్ బ్యాంక్ ఎదుట ఉట్ల మాను ఏర్పాటు చేసి, ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రమైంది. -
చెట్టుపై నుంచి కింద పడి వ్యక్తి మృతి
రొళ్ల: చింత చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం హులికుంట గ్రామానికి చెందిన రంగశామప్ప (58)కు భార్య కామాక్షమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో తన పొలంలో పెంచిన చింత చెట్లలోని కాయలు కోసేందుకు శుక్రవారం తన భార్యతో కలసి వెళ్లిన రంగశామప్ప అక్కడ చెట్టు పైకి ఎక్కాడు. కాయలు కోస్తూ అదుపు తప్పి కింద పడ్డాడు. ఛాతీ, వెన్నెముకపై బలమైన దెబ్బలు తగలడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. కామాక్షమ్మ నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని ప్రైవేట్ వాహనంలో రొళ్లలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంగశామప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. కత్తులతో పరస్పర దాడిహిందూపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురంలోని మేళాపురంలో నివాసముంటున్న హరీష్రెడ్డి చెల్లెల్ని విశ్వనాథరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో హరీష్రెడ్డి, విశ్వనాథరెడ్డి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు చెలరేగాయి. అప్పటి నుంచి తరచూ మాటాలతో గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆవేశంతో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. హరీష్రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
యువ స్ఫూర్తి.. సాయి అనుగ్రహ దీప్తి
పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఏపీ సత్యసాయి యూత్ బృందం శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. నేటి యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సత్యసాయి బోధనలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయనే సందేశంతో సాగిన నాటిక దేశవిదేశీ భక్తులను ఆకట్టుకుంది. యువ స్ఫూర్తి – సాయి అనుగ్రహ దీప్తి అనే పేరుతో ప్రదర్వించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అంతకు ముందు ఉదయం సాయి ప్రేమాతరంగిణి పేరుతో నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాలకు చెందిన 504 మంది భక్తులకు సత్యసాయి పాదుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు బహూకరించారు. ప్రశాంతి నిలయం: -
రంజాన్ శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్: నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లింలకు పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేవీ ఉష శ్రీచరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దెబ్బతిన్న పంటల పరిశీలన ముదిగుబ్బ: అకాల వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు రామసుబ్బయ్య, కిరణ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. అనంతరం నల్లచెర్లోపల్లిలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ రవీంద్ర, విస్తరణ అధికారి మనోహర్, ఉద్యానశాఖ సిబ్బంది ప్రియాంక, వీఆర్ఓ చరణ్కుమార్, రైతులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి ధర్మవరం విద్యార్థి ధర్మవరం అర్బన్: ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత శిబిరానికి ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సాకే నరహరి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నరహరిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరరెడ్డి, అధ్యాపకులు శుక్రవారం అభినందించారు. ఏపీ నుంచి 10 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంపిక కాగా, అందులో తమ కళాశాల విద్యార్థి ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్నాయక్, అధ్యాపకులు కిరణ్కుమార్, త్రివేణి, షమీవుల్లా, పావని, భువనేశ్వరి, హైమావతి, పుష్పావతి, సరస్వతి, ఆనంద్, మీనా, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య గుత్తి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన రమేష్ (40) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ప్రాధేయపడడంతో ఇటీవల మద్యం తాగడాన్ని పూర్తిగా మానేశాడు. అయితే స్వీయ నియంత్రణ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబసభ్యులు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటపడిన రమేష్ నేరుగా తురకపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని అప్పటికే పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. -
‘పురం’ ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం
హిందూపురం: జిల్లాలో పెద్ద పట్టణమైన హిందూపురంలో తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం ప్రధాన అంశాలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన హిందూపురం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హిందూపురం మున్సిపాలిటీలో వివిధ సమస్యలపై ఆరు నెలలుగా సమీక్షలు నిర్వహిస్తున్న దృష్ట్యా ఇక్కడి పరిస్థితులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అనుభవం కలిగిన కమిషనర్ మల్లికార్జున, అధికారులు, ప్రజలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతూ మెరుగైన పాలన అందిస్తామన్నారు. ముఖ్యంగా పట్టణాన్ని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. పట్టణంలో రోజువారీ చెత్త సేకరణను కచ్చితంగా అమలయ్యేలా చూస్తామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వార్డుకు సమయానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా లీకేజీలుంటే మరమ్మతు చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల మరమ్మతులపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధానం అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, పలువురు అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ -
నమో చౌడేశ్వరీమాత..
పెనుకొండ/హిందూపురం: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు శుక్రవారం నేత్రపర్వంగా సాగాయి. మండల కేంద్రం సోమందేపల్లిలో శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపుగా తీసుకురాగా, తొగటవీర క్షత్రియులు తలలపై జ్యోతులు ఉంచుకుని నృత్యం చేస్తూ ముందుకు సాగారు. వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి ఉత్సవాన్నిచూసి పులకించిపోయారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సీసీ హరిదాస్, డీఏ నారాయణస్వామి తదితరులు పర్యవేక్షించారు. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో తోగట వీరక్షత్రియుల ఆరాధ్యదైవమైన చౌడేశ్వరిదేవి జ్యోతుల ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామునే ఆలయంలో మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించిన అనంతరం 3 గంటల సమయంలో జ్యోతులను తలలపై ఎత్తుకుని నృత్యం చేస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా జనం తరలి రావడంతో ముదిరెడ్డిపల్లి జనసంద్రమైంది. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చల్లని పానీయాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయరాములు, ఆలయ కమిటీ నాయకులు బండారు బాలాజీ, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, నాగభూషణరెడ్డి ఆర్పీ భాస్కర్, మనోహర్, సాయితేజా శ్రీనివాస్ పాల్గొన్నారు. ● హిందూపురం మండలం కొటిపి గ్రామంలో చౌడేశ్వరీ దేవి రథోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని రథంపై అధిష్టింపజేసి పురవీధుల్లో భక్తులు లాగారు. వడి బియ్యం సమర్పిణ, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లిలో వైభవంగా జ్యోతుల ఉత్సవం కొటిపిలో నేత్రపర్వంగా సాగిన రథోత్సవం -
కనుల పండువగా సిరిమాను ఉత్సవం
యల్లనూరు: మండలంలోని కొడవండ్లపల్లిలో వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ శుక్రవారం పెద్దమ్మ సిరిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మంపల్లి తిమ్మమ్మ గుడి నుంచి పెద్దమ్మ గుడి వరకూ ఎద్దుల బండిపై సిరిమానును ఊరేగింపుగా తీసుకువచ్చారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, రమాదేవి దంపతులు, కుమారుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ సిరిమాను ఉత్సవాన్ని పెద్దారెడ్డి ప్రారంభించారు. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. కొడవండ్లపల్లి పెద్దమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసింది. తిమ్మంపల్లి తిమ్మమ్మగుడి వద్ద, కొడవండ్లపల్లి పెద్దమ్మ గుడి వద్ద హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. చింతకాయమందలో పెద్దమ్మ, అంకాలమ్మ, యల్లనూరులో పెద్దమ్మ, చిలమకూరులో యల్లమ్మ ఆలయాల వద్దనూ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో వేడుక పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుక
ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి చెంత గురువారం ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరాన్ని మామిడి తోరణాలు, వేప చిగుర్లు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభించగా.. డాక్టర్ వేదాంతం రాజగోపాలచక్రవర్తి పంచాంగ శ్రవణం గావించారు. పరాభవ నామ సంవత్సర విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వేదాంతం రాజగోపాల చక్రవర్తిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సభ్యుడు చక్రవర్తి ఘనంగా సత్కరించారు. అనంతరం సంగీత కచేరీతో సత్యసాయి యూత్ సభ్యులు అలరించారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కొల్లూరు వందన బృందం సంగీత కచేరీ ఆకట్టుకుంది. -
కారు ఢీ – యువకుడి మృతి
మడకశిర రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన తిప్పేస్వామి(19), చంద్రమౌళి గురువారం బుళ్లసముద్రం వైపు నుంచి మడకశిర వైపుగా ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయ్యవారిపల్లి సమీపంలోకి చేరుకోగానే 544ఈ జాతీయ రహదారిపై మలుపు వద్ద ఉన్నఫళంగా కారు దూసుకువచ్చి ఢీకొనడంతో తిప్పేస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చంద్రమౌళిని చికిత్స నిమిత్తం హిందూపురానికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కర్రసాము పోటీలు
గార్లదిన్నె: ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని పాత కల్లూరులో కర్రసాము, ఇరుసు పైకి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఏటా గ్రామంలో యువకులకు గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కర్రసాము, ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. కర్రసాము పోటీల్లో ఆరుగురు పాల్గొనగా వారిలో వెంకటనరసింహ, శ్రీకర్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా వారికి రూ.4 వేలు, రూ.3 వేల నగదు బహుమతి అందజేశారు. ఇరుసు పైకెత్తే పోటీల్లో ఆరుగురు పాల్గొనగా ఉప్పరపల్లి నారాయణ, నాగిరెడ్డిపల్లి రామానంద ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి రూ.6వేలు, రూ.3 వేల నగదు బహుమతి అంద జేశారు. జనం అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు. -
పెన్నానది ఒడ్డున వ్యక్తి మృతదేహం
హిందూపురం: మండలంలోని చౌళూరు గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాగా, కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, కల్లు తాగేందుకు వచ్చి ఉంటాడనే అనుమానాలను వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
● వర్షాలు మధ్య రకం.. పంటలు సమృద్ధి
కదిరి టౌన్: పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని, వర్షాలు మధ్య రకంగా కురిసినా.. పంటలు మాత్రం సమృద్ధిగా పండుతాయని శివాలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా గురువారం రాత్రి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఊంజల్ సేవ అనంతరం పంచాంగాన్ని అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ చదివి వినిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
సందడిగా ఉగాది వేడుక
పుట్టపర్తి టౌన్: పరాభవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జిల్లా యంత్రాంగం ఉగాది వేడుకను సందడిగా నిర్వహించింది. గురువారం ఉదయం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ప్రాచీన కళలు, సాహిత్యం, సంప్రదాయాల మేలు కలయికగా ఉగాది వేడుకలు నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖామంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఏఎస్పీ అంకిత సురానాతో పాటు జిల్లా అధికారులు హాజరయ్యారు. అధికారులు తెలుగుతనం ఉట్టిపడేలా సంప్రదాయ పంచెకట్టుతో హాజరై ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమన్నారు. మంత్రి సవిత, ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. జాబిలి జయచంద్ర, వల్లం రమేష్బాబు, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, డాక్టర్ శివన్న, శోభారాణి, మాణిక్యం ఇషాక్, ముద్ద రంగప్ప కొండసాని రజిత తమ కవితలతో అలరించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కవులు, రచయితలను సత్కరించారు. నలుగురు అర్చకులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంచెకట్టుతో అలరించిన కలెక్టర్, జేసీ, ఎస్పీ ఉట్టిపడిన తెలుగు సంస్కృతి అలరించిన కవి సమ్మేళనం -
శిల్పారామంలో ఉగాది శోభ
పుట్టపర్తి టౌన్: స్థానిక శిల్పారామంలో ఉగాది సంబరాలు వైభవంగా సాగాయి. శిల్పారామం ఏఓ ఖాదర్వలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పురోహితుడు నాగరాజుశర్మ పంచాంగం చదివి వినిపించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో శిల్పారామంలో సందడి నెలకొంది. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతి పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన ఆయన 1990లో ఏఆర్ విభాగంలో చేరారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆర్ఐ వలి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకుమార్, అడహక్ కమిటీ సభ్యుడు త్రిలోక్నాథ్, సిబ్బంది షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
పీడలను దూరం చేసే శక్తి స్వరూపిణి
హిందూపురం: రాష్ట్ర సరిహద్దులోని కొటిపి గ్రామంలో గ్రామదేవతగా కొలువై కర్ణాటక, ఆంధ్ర తమిళనాడు, తెలంగాణ రాష్ల్రా భక్తుల పాలిట కొంగు బంగారమై చౌడేశ్వరీ అమ్మవారు పూజలందుకుంటోంది. సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. కొటిపి చౌడేశ్వరీ దేవి అంటే సత్య వాక్కు కలిగిన అమ్మవారిగా భక్తుల విశ్వాసం. ఎలాంటి దుష్ట పీడలైనా దూరం చూసే శక్తిస్వరూపిణిగా కొలుస్తుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తుంటారు. జంతు బలులతో మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం ఆవరణలోని చెరువు కట్టపై జంతు బలులు చేస్తుంటారు. అయితే బలిదానం చేసినప్పుడు రక్తఽధారలు భూమిలోనే ఇంకిపోతాయని, అవి కనిపించవని పూర్వీకులు చెబుతున్నారు. ఎంతటి విలువైన చీరైనా సరే.. మొక్కుబడుల్లో భాగంగా కొటిపి చౌడేశ్వరీదేవి అమ్మవారికి వడిబియ్యంతో పాటు సమర్పించిన ఎంతటి విలువైన చీరయినా సరే ఒక్కసారి అమ్మవారి మూలవిరాట్కు అలంకరించి ఆ తర్వాత తీసి చెరువు కట్టపై వదిలేస్తారు. అది ఎంతటి విలువైన చీరయినా దానిని ఎవరూ ముట్టరు. అలా భక్తులు సమర్పించిన చీరలు చెరువు కట్టపై గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఇందుకు బలమైన పూర్వ కథనం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ‘వందల ఏళ్ల నాటి క్రితం అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన చీరలను విక్రయించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు ఓ వ్యాపారిని సంప్రదిస్తారు. అతను ఖరీదైన చీరలను తీసి కట్ట కట్టి మరుసటి రోజు వచ్చి తీసుకెళతానని చెప్పి వెళతాడు. గ్రామ పొలిమేర దాటగానే ఉన్నఫళంగా తీవ్ర అస్వస్థతకు గురై కాలు కూడా కదపలేని స్థితిలో అక్కడే చతికిల పడిపోయిన వ్యాపారిని గమనించిన గ్రామస్తులు వెంటనే అమ్మవారి మహిమగా నిర్ధారించుకుని ఆలయానికి చేరుకుని చౌడేశ్వరీదేవిని శరణు కోరుతారు. వ్యాపారి కట్టలు కట్టిన చీరలను తీసి అమ్మవారి మూలవిరాట్ ఎదుట పెడతారు. ఆశ్చర్యంగా అదే రోజు వ్యాపారి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ రోజు రాత్రి వ్యాపారి కలలో అమ్మవారు కనిపించి తాను కట్టిన చీర ఎవరూ తీసుకెళ్లరాదని చెప్పడంతో ఉదయాన్నే వ్యాపారి కొటిపి గ్రామానికి చేరుకుని అమ్మవారి మహత్యాన్ని గ్రామస్తులకు తెలుపుతాడు. అప్పటి నుంచి అమ్మవారికి సమర్పించిన చీరలను ముట్టడానికి ఎవరూ సాహించడం లేదు.’ నేడు రథోత్సవం హిందూపురం మండలం కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వీరీదేవి అమ్మవారి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు గురువారం వెల్లడించారు. ఏటా ఉగాది పండుగ సందర్భంగా మూలవిరాట్కు ప్రత్యేకపూజలు, ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 20న రథోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను గ్రామస్తులు పూర్తి చేశారు. కొలిచిన వారి కొంగుబంగారమై విరాజిల్లుతున్న కొటిపి చౌడేశ్వరీ దేవిసర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని.. ... అంటూ ఒక్కసారి చౌడేశ్వరీ ఖడ్గమాలను పఠిస్తే అభీష్ట సిద్ధితో పాటు సమస్త పీడలు దూరమవుతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆనందం సొంతమవుతాయి. ఛైత్ర మాసం రాకతో జిల్లాలో శక్తి స్వరూపిణి ఆరాధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సమస్త దేవతా స్వరూపంగా భక్తులు కొలిచే కొటిపిలోని చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో మొదలయ్యాయి. -
అకాల వర్షం.. అపార నష్టం
పుట్టపర్తి అర్బన్: అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా కురుస్తున్న వర్షంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానతో మామిడి కాయలన్నీ నేలరాలాయి. కలింగర, దోస పంటలకు కూడా అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. ప్రస్తుతం కలింగర, దోస పంటలు కోత దశలో ఉండగా... వడగండ్ల వానతో కాయలు పగిలి పోతున్నాయి. గాలీ వాన బీభత్సం బుధవారం సాయంత్రం గాలీవీన బీభత్సం సృష్టించింది. గంటన్నర పాటు కురిసిన వడగండ్ల వానతో బుక్కపట్నం మండలం ధూపంపల్లిలో భాస్కర్, బాలకృష్ణ అనే మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వారిద్దరూ ఐదు ఎకరాల్లో 350 మామిడి చెట్లు సాగు చేస్తుండగా...బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో కాయలన్నీ నేలరాలాయని రైతులు వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అలాగే చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లిలో 60 ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలన్నీ రాగిపోగా రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగింది. ఇక పుట్టపర్తి, గోరంట్ల, కొత్తచెరువు, బుక్కపట్నం, చిలమత్తూరు, ధర్మవరం, కదిరి తదితర మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. కొత్తచెరువు, లోచర్లలో వడగండ్ల వాన దంచికొట్టింది. మంగళవారం రాత్రి చిలమత్తూరు మండలంలో 13.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రొళ్లలో 7.2 మి.మీ, హిందూపురం 2.6, పరిగిలో 2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నేలరాలిన మామిడి ఆందోళనలో రైతులు -
ఇసుక అక్రమ రవాణాపై రైతుల కన్నెర్ర
●ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన రొద్దం: ఇసుక అక్రమ రవాణాపై రైతులు కన్నెర్ర చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. మరోసారి పెన్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే సహించబోమని హెచ్చరించారు. మండల పరిధిలోని కందుకూర్లపల్లి పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి కొందరు అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇసుక తరలిస్తున్న వారు రైతులతో వాగ్వాదానికి దిగారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని తీరుతామంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...ఇసుక అక్రమ రవాణాతో పెన్నా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలమట్టం పడిపోతోందని, దీంతో నదిలో వేసుకున్న ఫిల్టర్ బోర్లు బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యవసాయమే జీవనాధారమని, సాగునీరు లేకపోతే కుటుంబాలు వీధిన పడతాయన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లేకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. పది పరీక్షల్లో 219 మంది గైర్హాజరుపుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 219 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. 107 పరీక్షా కేంద్రాల్లో 21,492 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,273 మంది హాజరయ్యారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 113 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ వెల్లడించారు. 6,520 మందికి గాను 6,407 మంది హాజరయ్యారు. -
ఆకట్టుకున్న ‘ఆనందం తవ దర్శనం’
ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవాదళ్ ఆధ్వర్యంలో బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో నిర్వహించిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. ‘ఆనందం తవ దర్శనం’ పేరుతో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యసాయిని స్తుతిస్తూ పలు భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మణరావు ప్రసగించారు. సత్యసాయి సేవలను కొనియాడారు. పట్టపగలే చోరీ కనగానపల్లి: మండల కేంద్రం చెన్నేకొత్తపల్లిలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి చిరు వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె మరో ప్రాంతంలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆదినారాయణరెడ్డి బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి పనిపై బయటకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. 30 తులాల బంగారు, రూ.1.05 లక్షల నగదు కనిపించకపోడంతో చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో సీకే పల్లి పీఎస్ ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం : కలెక్టర్
పుట్టపర్తి టౌన్: దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బుదవారం పుట్టపర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో కలసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలసి బస్సులో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... దివ్యాంగులు బలహీన వర్గం కాదని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అసాధారాణ ప్రతిభ కనబరుస్తారని అన్నారు. దివ్యాంగులు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం మధుసూదన్, ఆర్డీఓ సువర్ణ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్థితోపాటు దివ్యాంగులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీకదిరి టౌన్: స్థానిక మదనపల్లి మార్గంలోని బళ్లారి కాంపౌండ్ వద్ద గల ఉన్న వలీవుల్లా మసీదుల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎస్పీ సతీష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఎస్పీ శివనారామణస్వామి, సీఐ వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ఎస్పీ పాల్గొని ఉపావాస దీక్షలు కొనసాగిస్తున్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ మృతిపరిగి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. పరిగి మండలం శ్రీరంగరాజుపల్లిలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామాంజప్ప, నరసమ్మ (52) దంపతులకు కుమారుడు గంగాధరప్ప, కోడలు శివమ్మ, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న స్టే వైర్కు ఆరేసిన దుస్తులను నరసమ్మ తీస్తుండగా కరెంట్ షాక్ గురై గట్టిగా కేకలు వేసింది. రక్షించేందుకు ప్రయత్నించిన కుమారుడు గంగాధరప్ప, భర్త రామాంజినప్ప, మనవళ్లు నవీన్, కళ్యాణ్ సైతం విద్యుత్ షాక్కు గురయ్యారు. క్షతగాత్రులను బంధువులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో నరసమ్మ మృతి చెందింది. మిగిలిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని జీజీహెచ్కు వైద్యులు రెఫర్ చేశారు. మృతురాలి కోడలు శివమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గ్యాస్ అందక.. పొయ్యి వెలగక
కదిరి: గ్యాస్ బండ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. రోజుల తరబడి ప్రయత్నిస్తున్నా...సిలిండర్ బుక్ కావడం లేదు. సిలిండర్ బుక్ అయినా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం చాలా వరకూ హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లు దొరక్క తల్లడిల్లుతున్నారు. కొందరైతే కొద్ది రోజులుగా హోటళ్లను మూసివేశారు. ఇంకొందరు కట్టెల పొయ్యి మీద చేస్తూ ధరలు పెంచేశారు. నాలుగు రోజుల్లోనే 56,215 బుకింగ్స్.. జిల్లాలోని వినియోగదారులకు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకు చెందిన ఏజెన్సీల ద్వారా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. సాధారణంగా రోజుకు సగటున 9,325 ఎల్పీజీ సరఫరా ఉంటుంది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో బుకింగ్స్ బాగా పెరిగాయి. గడచిన నాలుగు రోజుల్లోనే 56,215 బుకింగ్స్ జరిగాయి. వినియోగదారుల డిమాండ్కు తగ్గట్లు ప్రభుత్వం సిలిండర్లు సరఫరా చేయలేక పోతోంది. దీంతో రోజు రోజుకూ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సర్వర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పండుగ పూట పస్తులేనా? హిందువులకు అతి పెద్ద పండుగ ఉగాది. మరోవైపు ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్ ఈసారి ఒక్క రోజు తేడాతో వచ్చాయి. దీంతో గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో గంటల తరబడి ఏజెన్సీల వద్ద క్యూలో ఉంటూ అవస్థలు పడుతున్నారు. ఇంకొందరు గ్యాస్ బుకింగ్ నంబర్ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ క్యాష్ చేసుకుంటుంటే, గ్యాస్ డెలివరీ బాయ్స్ గృహావసర గ్యాస్ సిలిండర్ను డిమాండ్ను బట్టి రూ.1,700 నుంచి రూ.2 వేల వరకూ అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. ఆంక్షలతోనూ ఇబ్బందులే.. గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక... మరో సిలిండర్ బుక్ చేయాలంటే పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలనే ప్రభుత్వ ఆంక్షలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటి వరకూ కొందరు ఏజెన్సీ నిర్వాహకులే వినియోగదారుడికి తెలియకుండా వారి పేరు మీద గ్యాస్ బుక్ చేసి మరొకరికి ఇచ్చేవారు. సబ్సిడీ తమ ఖాతాలో జమ అవుతున్నందున వినియోగదారులు సైతం ఇన్ని రోజులూ పెదవి విప్పలేకపోయారు. ఇలాంటి వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాణిజ్య సిలిండర్కూ తప్పని తిప్పలు.. వాణిజ్య సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, ఇతర చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సర్వీసులకు సంబంధించి వాణిజ్య గ్యాస్ సిలిండర్లను మాత్రం సరఫరా చేస్తున్నామని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. సామాన్యులపై భారం.. గృహావసర వినియోగ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 మేర ధర పెంచేశారు. పెంచిన ధరలు రాత్రికి రాత్రి అమల్లోకి వచ్చేశాయి. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో గ్యాస్ కష్టాలు స్పష్టంగా కనబడుతున్నాయి.మూడు రోజుల క్రితం ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో నల్లమాడ మండలానికి చెందిన నరసింహులు బుక్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. బుక్ చేసే ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులను కలిస్తే... బుకింగ్ లేకుండా సిలిండర్ ఇవ్వడం కుదరదన్నారు. పండుగకు బంధువులంతా వచ్చారని, ఈ పరిస్థితుల్లో ఇంట్లో గ్యాస్ లేకపోతే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. బంధువులు, స్నేహితులందరికీ ఫోన్లు చేసి సిలిండర్ కోసం ఆరా తీస్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న సామాన్యులు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ రూ.1,700 కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ -
జాయింట్ పట్టాలు విభజిస్తేనే మేలు: జేసీ
ధర్మవరం రూరల్: జాయింట్ పట్టాల విభజనతోనే మేలు జరుగుతుందని రైతులకు జేసీ ఎం.మౌర్య భరద్వాజ్ వివరించారు. మండల పరిధిలోని గొట్లూరులో జాయింట్ పట్టా సబ్ డివిజన్ ప్రక్రియపై బుధవారం నిర్వహించిన గ్రామ సభలో జేసీ మాట్లాడారు. భూ క్రయ విక్రయాల్లో, బ్యాంక్ల ద్వారా రుణాలు పొందడంలో, ప్రభుత్వ పథకాల వర్తింపజేయడంలో జాయింట్ పట్టాల వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వ్యక్తిగత పట్టాలు ఉంటేనే పూర్తి హక్కులు ఉంటాయన్నారు. జాయింట్ పట్టా ఉన్న రైతులు వెంటనే సబ్ డివిజన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామసుబ్బయ్య, జిల్లా సర్వే అధికారి విజయశాంతి, తహసీల్దార్ సురేష్, సర్వేయర్లు పాల్గొన్నారు. -
కొలిచిన వారి కొంగుబంగారమై..
ఏర్పాట్లు పూర్తి గురువారం రాత్రి జరిగే చౌడేశ్వరీదేవి పంచమ జ్యోతుల ఉత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామమంతా విద్యుద్దీపాలతో అలంకరించాం. ఉత్సవానికి 30 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశాం. రాత్రి 3 గంటలకు జ్యోతుల ఉత్సవం ప్రారంభమవుతుంది. – డి.సి.ఈశ్వరయ్య, ఆలయ ధర్మకర్త పరస్పర సహకారంతో.. ఏటా అమ్మవారి జ్యోతుల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారిపై ఉన్న భక్తి భావంతో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. చౌడేశ్వరీమాత అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం. ఉత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – చింతా హరిదాస్, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు, సోమందేపల్లి పెనుకొండ:(సోమందేపల్లి): కొలిచిన వారి ఇంట కొంగుబంగారమని సోమందేపల్లిలోని చౌడేశ్వరీదేవి అమ్మవారు భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవానికి సోమందేపల్లి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా ఉగాది పర్వదినాన అమ్మవారి పంచమ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవానికి వివిధ గ్రామాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే బంధుమిత్రులతో సోమందేపల్లిలోని గృహాలు కిటకిటలాడుతున్నాయి. దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి ఉత్సవంలో పాల్గొననున్నట్లు అంచనా. రాత్రి 3 గంటల అనంతరం ఆలయంలో చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా జ్యోతులను తలపై ఉంచుకుని అమ్మవారిని స్తుతిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం చౌడేశ్వరీదేవి .. నేడు సోమందేపల్లిలో జ్యోతుల ఉత్సవం -
గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు
హిందూపురం: గ్యాస్ సిలిండర్ల కొరతతో హిందూపురం పట్టణంలోని రైల్వేరోడ్డులోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. పాసుపుస్తకాలతో ఏజెన్సీ వద్దకు వస్తున్నారు. దీంతో బుధవారం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం కిటకిటలాడింది. సిలిండర్లు బుక్ చేసినా డిలివరీ కావడం లేదని వాగ్వాదానికి దిగారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం 7, 8 తేదీల్లో బుక్ చేసిన వారికి వరుస క్రమంలో సిలిండర్లు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక హిందూపురం మండలంలోని వివిధ గ్రామాల్లోని రోడ్లపై ఎక్కడ చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే కనిపిస్తున్నాయి. గ్యాస్ బండి రాగానే సిలిండర్ల కోసం ఎగబకే పరిస్థితి ఏర్పడుతోంది. -
జీవితాల్లో ఉషస్సులు వెల్లివిరియాలి
● జిల్లా ప్రజలకు ఉషశ్రీచరణ్ ఉగాది శుభాకాంక్షలు పెనుకొండ రూరల్: ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు ఉన్నట్లే...జీవితంలోనూ మంచి, చెడు, కష్టాలు, సుఖాలు ఉంటాయని, వాటన్నింటినీ ఒకేలా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు పుట్టపర్తి టౌన్: జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే రంజాన్ను ముస్లింలంతా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఎలుగుబంటి కలకలం గుడిబండ: మండల పరిధిలోని ఎస్ రాయపురం గ్రామంలో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బుధవారం ఉదయం గ్రామంలో అటుఇటూ తిరుగుతూ హల్చల్ చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొలాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లు పంటల మధ్య దాక్కుని రైతులపై దాడులు చేస్తున్నాయని వాపోయారు. పంటలను కూడా నాశనం చేస్తున్నాయన్నారు. అటవీ శాఖ అధికారులు వన్య ప్రాణుల నుంచి రైతులను కాపాడాలన్నారు. -
ధర్మవరం ఆర్డీఓగా ప్రేమంత్కుమార్
ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్డీఓగా ప్రేమంత్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కడపలో సర్వశిక్ష అభియాన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్మవరంలో ఇన్చార్జ్ ఆర్డీఓగా రామసుబ్బయ్య విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో నూతన ఆర్డీఓగా ప్రేమంత్కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీ.కొడిగేపల్లిలో చిరుత సంచారం మడకశిరరూరల్: మండల పరిధిలోని సి.కొడిగేపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని పొదల్లో ఉన్న చిరుత తనకు సంబంధించిన గొర్రెల మందపై దాడి చేసి పొట్టేలును చంపేసిందని గొర్రెల కాపరి దాళప్ప తెలిపారు. దాదాపు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. వారం రోజుల నుంచి గ్రామ సమీపంలోని పొదల్లో చిరుత సంచరిస్తున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత భయంతో పొలాల వద్దకు వెళ్లలేక పోతున్నామన్నారు. అటవీశాఖాదికారులు చర్యలు తీసుకుని చిరుత సంచారం లేకుండా చూడాలన్నారు. చిరుత దాడిలో మృతి చెందిన గొర్రెల కాపరికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పోక్సో కేసు నమోదు ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలికను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిపై పట్నం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భూగర్భ జలాలపై పరిశోధన ● కలెక్టర్కు నివేదిక సమర్పించిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ప్రశాంతినిలయం: హిందూపురం నియోజకవర్గంలో భూగర్భ జలాలపై పరిశోధనలు జరిపిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధికారులు కలెక్టర్ శ్యాంప్రసాద్కు నివేదికలు అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో భూగర్భ జలాలపై పరిశోధన చేయగా తక్కువ జలాలు ఉన్నట్లు , భూగర్భ జలాల పెంపునకు పలు సూచనలు చేసినట్లు సభ్యులు వివరించారు. ఇందులో చోళసముద్రాన్ని మోడల్గా తీసుకొని పరిశోధన చేశామన్నారు. పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పండిత్ మగ్నూర్, మాధవ్రేష్మాపిళ్లై, స్వరూప్ కళ్యాణ్ సాహూ, ప్రతీక్, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రాజశేఖర్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ గురుమూర్తి, డీఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొకై ్లనర్, ఇసుక ట్రాకర్ల సీజ్పుట్టపర్తి అర్బన్: స్థానిక చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తోడుతున్న ప్రొకై ్లనర్తో పాటు ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. రాత్రి సమయాల్లో చిత్రావతి నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ప్రొకై ్లనర్, రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. వీటిని పుట్టపర్తి రూరల్ పీఎస్కు తరలించారు. తనిఖీల్లో గనుల శాఖ ఏడీ అమీర్బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్ షేక్ ఖాజావలి, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, ఏఈ సుధాకర్ పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాట
పుట్టపర్తి: ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్టీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో అధికారులకు వినతిపత్రాల సమర్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను నాయకులు కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పీఆర్సీ ప్రకటించకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, నాలుగు డీఏలను పెండింగ్లో ఉంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని నిరసించారు. ఆర్థిక సమస్యలతో పాటు యాప్స్ పేరుతో ఉపాధ్యాయులపై అదనపు భారం మోపుతూ బోధనకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లీలా ఇంద్ర ప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, నాయకులు భాస్కర్రెడ్డి, ప్రతాపరెడ్డి, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, మనోహర్రెడ్డి, సునీత, అనిత, ఇందిర, సురేష్, మహమ్మద్ అలీ, జమీర్, ప్రభాకర్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాంతియుతంగా ధర్నా చేస్తే కేసులు పెడతారా?
పుట్టపర్తి అర్బన్: ‘బాధ్యత గల పదవిలో ఉండి తప్పుడు పనులు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. తిరుపతిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం’ అని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాస లీలలు చేస్తూ దొరికిపోయిన బీఆర్ నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసినా ఇప్పటి వరకూ చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని నాయకులు విమర్శించారు. దానిపై పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయిందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్సీపీ నాయకులు బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు జేబుకు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే కదిరి పట్టణంతో పాటు నియోజక వర్గంలోని తనకల్లు, పెనుకొండ నియోజకవర్గం పరిగిలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. పరిగిలో జరిగిన ధర్నాలో వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. పగలు భక్తి .. రాత్రి రాసలీలు, తిరుమల గౌరవాన్ని కాపాడండి, తప్పు చేసిన వారు పదవిలో.. ప్రశ్నించే వారు బోనులో, బీఆర్ నాయుడు దిగిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాల్సిందే జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులు -
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
హిందూపురం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలు పునరావృతం కాకూడదని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ ఫైరోజ్బేగం, డీసీహెచ్ మధుసూదన్ హెచ్చరించారు. ‘తల్లీబిడ్డను చంపేశారు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. హిందూపురం ఆస్పత్రిలో కొటిపికి చెందిన బాలింత అనూరాధమ్మ, శిశువు మృతి ఘటనపై వారు వైద్యులు, సిబ్బందితో విచారణ చేపట్టారు. మృతురాలు తీసుకున్న వైద్యం, క్షేత్రస్థాయిలో అందించిన సేవలు తదితర వాటిపై వివరాలు సేకరించారు. మృతురాలు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలను గైనికాలాజిస్ట్ బాబా బుడెన్తో అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్హాల్లో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది హైరిస్క్ గర్భిణులు సుఖ ప్రసవం అయ్యేవరకు నిరంతరం గమనిస్తూనే ఉండాలన్నారు. తల్లీబిడ్డల ప్రాణాలు చాలా అమూల్యమైనవన్న విషయాన్ని మరువకూడదన్నారు. సకాలంలో స్పందిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రావన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ జనార్దన్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. 180 మంది గైర్హాజరుపుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 41 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. 6,575 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6,385 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 180 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఇంటర్ పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సౌజన్య హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరులో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనుమతులు తీసుకోకుండా బోర్లు తవ్వకూడదు. అలాంటి బోర్లు గుర్తించి సీజ్ చేస్తాం. బోరు తవ్వాలంటే మండల రెవెన్యూ అధికారి నుంచి అనుమతులు తప్పనిసరి. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్లో నీటి సమస్య రాకుండా ఉండాలంటే వాల్టా చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. నీటి వినియోగం అవసరానికి మించి చేయరాదు. – రాజశేఖర్రెడ్డి, జిల్లా భూగర్భ జలశాఖాధికారి భూగర్భ జలాన్ని కాపాడుకోవాలి -
ప్రయాణికుల భద్రతే లక్ష్యం
గుంతకల్లు: ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు. మంగళవారం భద్రతా తనిఖీల్లో భాగంగా గుంతకల్లు రైల్వే డివిజన్లోని గుంతకల్లు–బళ్లారి సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాతో కలిసి ప్రత్యేక రైలులో రియర్ విండో ద్వారా రైలు మార్గాన్ని పరిశీలించారు. ఈ సెక్షన్లోని రైల్వే ట్రాక్ ఒంపులు, లెవల్ క్రాసింగ్లు, సిగ్నల్ వ్యవస్థతోపాటు రైల్వే బ్రిడ్జిలు పరిశీలించి భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సెక్షన్ ఎక్కవగా రద్దీగా ఉండటంతో రైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఆరా తీశారు. రైళ్లు సమయ పాలనను పాటించేలా ఇంజినీరింగ్, సిగ్నల్, ఆపరేషన్ విభాగం సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఈ సెక్షన్లోని కీలకమైన, సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెంచడంతోపాటు ట్రాక్ పట్టిషం చేయడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న ప్రణాళికపై నిశితంగా అధికారులకు తెలియజేశారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా విభాగాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ -
ఉర్దూ పరీక్షకు ఒకరు గైర్హాజరు
పుట్టపర్తి: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉర్దూ పరీక్షకు ఒకరు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మొత్తం మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 46 మంది విద్యార్థులకు గాను 45 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థులకు మోడ్రన్ లాంగ్వేజ్ పీరక్ష, జనరల్ బైపీసీ విధ్యార్థులకు బ్రిడ్జి కోర్సు (గణితం) పరీక్షలు జరిగాయి. గర్భం దాల్చిన విద్యార్థిని! ముదిగుబ్బ: బత్తలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఓ బాలిక గర్భం దాల్చిన అంశం కలకలం రేపింది. ముదిగుబ్బ మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని గర్భం దాల్చినట్లుగా తెలియగానే అధికారులు అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమీప బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశంపై సీడీపీఓ సరస్వతిని ఫోన్లో సంప్రదించగా తనకు ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు. ఖాద్రీశుడి హుండీల లెక్కింపుకదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను ఆలయంలో సోమవారం లెక్కించారు. 35 రోజులకు గాను రూ.1,15,10,416 నగదు, 2 గ్రాముల బంగారు, 305 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హుండీల పర్వేక్షాణాధికారి వెంకటేశ్వరులు, ఏపీజీబీ మేనేజర్ బి.రామకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రగ్స్కు దూరంగా ఉండండి
మడకశిర: డ్రగ్స్కు దూరంగా ఉండాలని యువతకు ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ సోమవారం మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బహిరంగ అవగాహన సభ జరిగింది. కార్యక్రమానికి ఎస్పీతో పాటు సినీనటులు శ్రీవిష్ణు, రఘు, అనన్య, హెబ్బాపటేల్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వెంకట్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బోర్డు సభ్యుడు శ్రీనివాసమూర్తి, అంధ మహిళల టీ20 క్రికెట్ ఇండియా టీం కెప్టెన్ దీపిక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ తొలుత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షత జరిగిన అవగాహన సభలో ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి చిక్కుకుంటే ఇతర దేశాలకు వెళ్లడానికి కూడా అనుమతులు దక్కవన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు, డీఎస్పీ నర్శింగప్ప, సీఐలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ సతీష్కుమార్ -
దానిమ్మ తోట దగ్ధం
తాడిమర్రి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాడిమర్రి మండలం పుల్లంపల్లికి చెందిన రైతు మారినేని పురుషోత్తం రెడ్డి దానిమ్మ తోట దగ్ధమైంది. తనకున్న 17 ఎకరాల్లో పదేళ్ల క్రితం 3 వేల దానిమ్మ, జామ మొక్కలను రైతు నాటాడు. ప్రస్తుతం దానిమ్మ చెట్లను వాడు పెట్టాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఎండు గడ్డిపై పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న బాధిత రైతు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే లోపు 3 వేల చెట్లు, డ్రిప్పు వైరు, పైపులు, తోట చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కాలిపోయింది. ఘటనతో సుమారు రూ.45 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. -
జిల్లాలో విద్యుత్ షాక్తో మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రజల నిర్లక్ష్యమో.. విద్యుత్ అధికారులు, సిబ్బంది అలసత్వమో గానీ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారికంగా నమోదవుతున్న కేసులే పదుల సంఖ్యలో ఉండగా, అనధికారిక లెక్కల ప్రకారం మరింత ఎక
పుట్టపర్తి టౌన్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలోనూ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు నాటినాటికీ పెరిగి పోవడమే ఇందుకు నిదర్శనం. విద్యుత్ సిబ్బంది అలసత్వం, సేవల్లో జాప్యం, వినియోగదారుల అవగాహన లోపం, సొంత మరమ్మతులు తదితరాల వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. విద్యుత్ ప్రమాదాలు నియంత్రణ, నష్ట తీవ్రత తగ్గించేందుకు విద్యుత్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకూ చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదాల్లో 32 మంది అకాల మృత్యువాత పడ్డారు. ఈ నెలలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారికి పరిహారం కూడా ఏళ్లతబడి పెండింగ్లో ఉంచుతున్నారు. విద్యుత్ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించకపోవడం, విద్యుత్ సరఫరా వ్యవస్థల వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మనుషులు చనిపోతుండగా, మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. ప్రమాద బాధితులకు పరిహారం అందజేతలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. పిట్టల్లా రాలుతున్న రైతులుం వైఎస్ జగన్ పాలనలో జిల్లాలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా అయ్యింది. కొత్తగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా వ్యవస్థను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలోపేతం చేసింది. దీంతో లోఓల్టేజీ సమస్య తీరింది. వ్యవసాయానికి రాత్రిపూట కరెంట్ సరఫరా బాధ తప్పింది. దీంతో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను కరెంట్ కష్టాలు వెన్నాడసాగాయి. ఓ వైపు లో ఓల్టేజీ సమస్య, మరో వైపు ఎక్కడికక్కడ నిర్వహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతున్న విద్యుత్ తీగలతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో వారు స్పందించకపోవడం గమనార్హం. ‘ఎల్సీ ఇచ్చేస్తున్నాం మీరే మరమ్మతు చేసుకోండి’ అంటూ ఉచిత సలహాలిస్తూ అన్నదాతల జీవితాలతో చెలగాటమాడారు. ఫలితంగా విద్యుత్ షాక్కు గురై రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలు ఈ నెలలో నలుగురి మృతి మరమ్మతులపై సకాలంలో స్పందించని విద్యుత్ సిబ్బంది అవగాహన లోపంతో ప్రాణాలు కోల్పోతున్న వైనం జాగ్రత్తలే శ్రీరామరక్ష తడిచేతులు, నీటిలో నిలబడి విద్యుత్తు మోటార్లను, స్విచ్లను తాకరాదు. వ్యవసాయ మోటారు, స్టార్టర్లకు ఎర్తింగ్ తప్పని సరి. పంట పొలాల్లోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్కు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా ఇవ్వకూడదు. మోటారుకు సొంతంగా మరమ్మతులు చేయరాదు. విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినప్పుడు సొంతంగా సరిచేయరాదు. సంబంధిత ఉద్యోగులు, సిబ్బందితో మరమ్మతు చేయించాలి. ఇళ్లలో, పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగల నాణ్యతను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. పాడైనట్లు గుర్తిస్తే వెంటనే మార్చేయాలి. ఇళ్లకు దగ్గరగా తీగలు వెళుతున్న, ఇళ్లపై తెగిపడినా, ట్రాన్సఫార్మర్లు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నా..అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రమాదవశాత్తు షాక్కు గురైన వ్యక్తిని రక్షించే క్రమంలో చేతులతో తాకకుండా కర్రతో వ్యక్తి నుంచి తీగలను దూరం చేయాలి. ఎక్కడైనా ప్రమాదకరంగా విద్యుత తీగలు, స్తంభాలు ఉన్నట్లయితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలి. 1912 టోల్ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలి. ఈ నెంబరుకు ఫిర్యాదు చేయడం వలన తక్షణ స్పందన కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
నేడు ముసలమ్మ ఆలయంలో కుంభాభిషేకం
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని తాడిపత్రి రహదారి పక్కన చెరువు కట్ట సమీపంలో నూతనంగా నిర్మించిన ముసలమ్మ దేవాలయంలో సోమవారం 6వ వార్షికోత్సవ కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ముసలమ్మ వంశస్తులైన సుశీల సూర్యనారాయణరెడ్డి సొంత నిధులతో పాటు గ్రామస్తుల ఆర్థిక సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. 17న ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మూల దేవతా ప్రార్థన, గురు ప్రార్థన, గణపతి పూజ, స్వస్తి వాచనము, రక్షా బంధనము నిర్వహించనున్నారు. 18న ఉదయం 6 గంటకు అమ్మవారికి అభిషేకం, కళశ స్థాపన గణపతి హోమం, పంచామృతాభిషేకం, కలశ స్థాపన ఆదిత్యా నవగ్రహ హోమం, ముసలమ్మ అమ్మవారి మూల మంత్ర హోమం, ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నిర్వహించన్నారు. 19న సాయంత్రం 5 గంటలకు చిక్క వడియార్ చెరువులో ముసలమ్మ తల్లి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త సుశీలమ్మ తెలిపారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
ఓడీచెరువు: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ఓడీ చెరువు మండలగం తంగేడుకుంట గ్రామానికి చెందిన తుంగ నవీన్(26) సోమవారం సాయంత్రం అరకబావిపల్లి వద్ద ఎరువు తోలడానికి ట్రాక్టర్తో వెళ్లాడు. ఆ సమయంలో దిబ్బలో ఉన్న విద్యుత్ స్తంభం స్టే వైర్ తగిలి షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నవీన్ను స్థానికులు వెంటనే ఓడీచెరువులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. కాగా, కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచిన నవీన్ మృతితో కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. బంగారు నగల అపహరణరొళ్ల: మండలంలోని కె.గొల్లహట్టి గ్రామానికి చెందిన మూడ్లప్ప ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి 60 గ్రాముల రెండు బంగారు గొలుసులతో పాటు రూ.10 వేలు నగదు అపహరించారు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆదివారం మూడ్లప్ప ఇంటికి తాళం వేయకుండా పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న తల్లి తలుపులు దగ్గరగా లాగి పక్కింటికి చేరుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోయింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళం తీసి అందులో భద్ర పరిచిన రెండు బంగారు గొలుసులు, రూ.10 వేలు నగదు అపహరించికెళ్లారు. రాత్రికి ఇంటికి చేరుకున్న మూడ్లప్ప బీరువా తలుపులు తీసి ఉండడం గమనించి పరిశీలించాడు. అందులో బంగారు నగలు, నగదు కనిపించకపోవడంతో సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. క్లూస్టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరిష్కార వేదికకు 81 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 81 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐ బొజ్జప్ప, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. కగ్గళ్లు భూ వివాదంపై నేడు ఎస్సీ కమిషన్ విచారణ హిందూపురం: మండలంలోని కగ్గళ్లు గ్రామంలో భూమి ఆక్రమణపై అందిన ఫిర్యాదుపై మంగళవారం ఎస్సీ కమిషన్ క్షేత్ర స్థాయి విచారణను చేపట్టనుంది. సర్వే నెం:105/2బి, 106–4డిలో భూములు ఆక్రమణకు గురయ్యాయని కగ్గళ్లు గ్రామానికి చెందిన వై. హనుమంతరాయుడు ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషన్ సభ్యులు మేకల భిక్షం, ఎన్.టి.రామాంజినమ్మ మంగళవారం ఉదయం హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం కగ్గళ్లులో పర్యటించి వివాదాస్పద భూములను పరిశీలించి వివరాలను ఆరా తీయనున్నారు. -
లారీ కిందకు దూసుకెళ్లిన కారు
పెనుకొండ రూరల్: టమాట పైరు కోసం వచ్చిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంజయ్య(45) తన పొలంలో టమాట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నర్సరీల్లో టమాట పైరు కొనుగోలు కోసమని సమీప బంధువు శ్రీకాంత్తో కలసి కారులో ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ శ్రీనివాసులు నియంత్రణ కోల్పోవడంతో లారీ కిందకు దూసుకెళ్లాడు. ఘటనలో శ్రీనివాసులు పాటు అతని పక్కనే ముందు సీటులో కూర్చొని ఉన్న అంజయ్యకూ తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆగమేఘాలపై పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులుకు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. వెనుక సీటులో కూర్చొని ఉన్న శ్రీకాంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని సంతాపూర్ ఉప సర్పంచ్ దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం -
ద్విచక్ర వాహనాల ఢీ – ఒకరి మృతి
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రి మండలం మరువపల్లి నివాసి మదన్మోహన్, మరో ఇద్దరితో కలసి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు వచ్చాడు. అదే సమయంలో బత్తలపల్లి మండలం గంటాపురం నివాసి అక్కిం రెడ్డప్ప(35) ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట మదన్మోహన్ ఆపిన ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని, ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ఆర్డీటీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించక సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు అక్కిం రెడ్డప్పకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘స్థలం అమ్మి అడ్డం తిరిగారు’కదిరి టౌన్: రిజిస్టర్ చేయించుకున్న పొలం తిరిగి మాదే అని ఉద్దేశ పూర్వకంగా కోర్టులో పిటిషన్ వేసి మోసం చేయడమే కాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తమతో గొడవపడి బెదిరించారని సోమవారం బత్తలపల్లికి చెందిన చిత్ర శివయ్య పట్టణ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. వివరాలు .. కదిరికి చెందిన మాతంగి వెంకటాద్రి, బత్తలపల్లి మండలం వెంకటాపురానికి చెందిన వెంకటాద్రి తమ్ముడు మాతంగి వెంకటేష్ వారి కుటుంబ సభ్యుల నుంచి చిత్ర శివయ్య బత్తలపల్లి గ్రామ పొలంలో 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ సంతకాలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ వెంకటాద్రి, వెంకటేష్ వారి బంధువులు మాటమార్చారు. దీనిపై ఉద్దేశ పూర్వకంగా కోర్టులో పిటిషన్ పెట్టడంతో పాటు అంతు చూస్తామని బెదిరిస్తున్నట్లు చిత్ర శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. మోటార్ల కేబుల్ చోరీ బొమ్మనహాళ్: గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మోటార్లకు అమర్చిన కేబుల్ను దొంగలు కట్చేసి తీసుకెళ్లిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని గోవిందవాడ, కల్లుదేవనహళ్లి గ్రామాలకు వేదావతి హగరి నది నుంచి నాలుగు విద్యుత్ మోటార్లు ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు విద్యుత్ మోటార్లకు అమర్చిన కేబుల్ చోరీ చేశారు. దాదాపు 350 మీటర్లు కేబుల్ చోరీ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు, గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి మోటార్లకు కేబుల్ ఏర్పాటు చేసి నీటి సరఫరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగు బెళుగుప్ప: శీర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో ఏకాంబరప్ప ఇంటి వెనుక ఉన్న కొబ్బరిచెట్టుపై సోమవారం రాత్రి పిడుగుపడింది. చిరుజల్లులు పడే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో కాలనీవాసులు ఉలిక్కిపడి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అప్పటికే కొబ్బరి చెట్టు కాలుతూ కనిపించింది. అప్రమత్తమైన కాలనీవాసులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి.. కొబ్బరిచెట్టును మొత్తం యంత్రంతో కోసి వేయించారు. పిడుగు పడిన సమయం రాత్రి కావడంతో కాలనీలోని వారంతా ఇళ్లల్లో ఉన్నారు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చర్చించుకున్నారు. -
చీనీకి చీడపీడలు..
తాడిమర్రి: చీనీ రైతును చీడపీడలు వణికిస్తున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్లితో కాయలకు మంగు సోకడంతో పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక కాయలు చెట్లపైనే పండి రాలిపోతున్నాయి. మరోవైపు పులుసు పురుగు విజృంభించడంతో చెట్లు ఎండిపోతుండగా.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెరిగిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఎర్ర మట్టి నేలలు అధికంగా ఉండటం, ఇక్కడ పండించే చీనీ కాయలు తీపిగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నీటి సౌకర్యం తక్కువగా ఉన్నా... కేవలం డ్రిప్పు ద్వారా నీటి తడులు అందిస్తే పంటను కాపాడుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లా రైతులు ఎక్కువ మంది చీనీ తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఏకంగా 37,500 ఎకరాల్లో 4.50 లక్షలు చెట్లు సాగు చేస్తున్నారు. వర్షాభావం..తెగుళ్ల దాడి రెండేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బోరు బావుల్లో నీటి మట్టం తగ్గింది. అయినప్పటికీ డ్రిప్పు ద్వారా అష్టకష్టాలు పడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్న రైతులకు చీడపీడలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చీడపీడలతో దిగుబడిపై దెబ్బ పడగా..కాస్తో కూస్తో పండిన పంట కూడా నాణ్యత సరిగా లేదని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాలపాలయ్యారు. వ్యాపారులు కొనడం లేదు ఈ ఏడాది చీనీ దిగుబడి కోసం ఎరువులు అధికంగా వేశా. కాయలు మంచి సైజు వచ్చాయి. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే నల్లి పురుగు దెబ్బకు కాయలకు మంగు సోకింది. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. చీనీకాయలు కోతకు వచ్చినా అడిగే వారే లేరు. –కుమ్మర ఓబుళపతి, తాడిమర్రి చెట్లు ఎండిపోతున్నాయి పులుసు పురుగు సోకడంతో చీనీచెట్లు వాడు పట్టి ఎండిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదు. ఇప్పటికై నా ఉద్యాన శాఖ అధికారులు తోటల్లో పర్యటించి తగిన సూచనలు, సలహాలివ్వాలి. –అల్లే సాయినాథ్రెడ్డి, శివంపల్లి, తాడిమర్రి నల్లితో కాయలపై నల్లని మంగు పులుసు పురుగుతో ఎండుతున్న చెట్లు ఆందోళన చెందుతున్న రైతన్నలు -
సందడిగా గుత్తి కోట ఉత్సవాలు
గుత్తి: చారిత్రక సంపద, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్ఓ మలోల అన్నారు. రెండు రోజులుగా గుత్తిలో అత్యంత వైభవంగా గుత్తి కోట ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆదివారం కోట సంబరాలు అంబరాన్నింటాయి. హెరిటేజ్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. స్థానిక ఎంఎస్ ఫుట్ బాల్ క్రీడామైదానం వద్ద జెండా ఊపి డీఆర్ఓ హెరిటేజ్ వాక్ను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, గుత్తి కోట సంరక్షణ సమితి, పురావస్తు, పర్యాటక శాఖలు, రైల్వే డీజిల్షెడ్, వాకర్స్ అసోసియేషన్, ఐసీడీఎస్, మెప్మా, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. కోట ప్రాముఖ్యతను వివరిస్తూ కళాకారులు ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, అంగన్వాడీ టీచర్లతో కలిసి వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. డీఆర్ఓ మలోల అల్లూరి సీతారామరాజు, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయ భాస్కర్ అలియా రాయల్, వెంకటరామిరెడ్డి వీర నరసింహం రాయల్, నాయుడు శ్రీకృష్ణ దేవరాయలు, హేమలత రాణి రుద్రమ దేవి వేష ధారణలతో ఆకట్టుకున్నారు. గురవయ్యల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ మలోల మాట్లాడుతూ గుత్తి కోటకు ఎంతో చరిత్ర ఉందన్నారు. కళలు, చరిత్ర, సంస్కృతి, చారిత్రక కట్టడాలను పరిరక్షించడం మనందరి బాధ్యతన్నారు. చారిత్రక ప్రదేశాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు. గుత్తి కోట అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ప్రపంచ పటంలో గుత్తి కోటకు స్థానం కలిగే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, పురావస్తుశాఖ అధికారి స్వామి నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, మెప్మా విశ్వజ్యోతి, ఏఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లతో స్టెప్పులేస్తున్న మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా గురవయ్యల ప్రదర్శన -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
పుట్టపర్తి: జిల్లాలో సోమవారం నుంచి ‘పది’ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9.30 ప్రారంభమవుతాయని,విద్యార్థులు అర గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారురు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూం నంబర్ 8328028353కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో 107 కేంద్రాల్లో 22,303 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ఆయన వెల్లడించారు. బాలురు 11,098 మంది, బాలికలు 10,236 మంది ఉన్నట్లు చెప్పారు. విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని, బస్సు కండక్టర్కు హాల్టికెట్ చూపితే చాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ సారి ప్రైవేటు టీచర్లను కూడా ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. మొత్తం 1,177 మంది ఇన్విజిలేటర్లలో 971 మంది ప్రభుత్వ, 206 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. -
బాలికకు తీవ్ర గాయాలు
గాండ్లపెంట: మండల పరిధిలోని రెక్కమాను గ్రామంలో ఓ బాలిక కాలిపై ఆర్టీసీ అద్దె బస్సు చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు.. గ్రామానికి చెందిన హఫీఫా వైఎస్సార్ జిల్లా వేంపల్లిలోని మైనార్టీ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు తన అవ్వతో కలసి ఆదివారం ఉదయం రాయచోటి ఆర్టీసీ డిపో అద్దె బస్సు ఎక్కింది. ఫుట్బోర్డు వద్ద నిలిచి ఉన్న బాలిక... బస్సు కదలడంతో అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వెనుక చక్రం బాలిక కాలిపై వెళ్లింది. దీంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే ఆమెను 108 వాహనం ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి పుట్టపర్తి టౌన్: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి, సమమ పాలన పాటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యుర్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేసి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారిలో అత్మవిశ్వాసం నింపారు. ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం డీఈఓ కిష్టప్ప పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎరువులు వేసి అస్వస్థతకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతిబొమ్మనహాళ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కమ్మరి సురేష్ (34) ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆదివారం సెలవు కావడంతో సురేష్ ఉదయం పొలంలో పత్తి పంటకు రసాయన ఎరువులు వేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తండ్రి తిప్పేస్వామితో కలిసి ఎరువు వేశారు. తండ్రి మధ్యాహ్న ఇంటికి రాగా, సురేష్ పొలంలోనే మిగతా ఎరువు వేసి వస్తాను అని చెప్పి పొలంలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం ఎండలో పనిచేసి ఓ చెట్టు కింద పడుకున్నాడు. చుట్టూ పక్కన పొలానికి చెందిన రైతులు సురేష్ను పలకరించిన ఎలాంటి స్పందన లేకపోడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సురేష్కు భార్య పవిత్రతో పాటు ముగ్గురు కుమారైలు ఉన్నారు. తిప్పేస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బొమ్మనహాళ్ పోలీసులు తెలిపారు. లారీ కింద పడి చత్తీస్ఘడ్ వాసి మృతికుందుర్పి: చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన సంతురామ్ (34) కుందుర్పి మండలం కదరంపల్లిలో ఆదివారం ప్రమాదవశాత్తూ బోరులారీ కింద పడి మృతి చెందాడు. కుందుర్పి పోలీసుల వివరాల మేరకు.. సంతురామ్ చత్తీస్ఘఢ్లోని దంతేవాడ జిల్లాకు చెందినవాడని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం బోర్వెల్ పనుల నిమిత్తం ఓ లారీ యజమాని కింద పనులు చేస్తూ కుందుర్పి మండలానికి వచ్చాడన్నారు. కదరంపల్లిలో బోరుబావి తవ్వుతుండగా శ్రీశైలం అజాగ్రత్త కారణంగా లారీని మలుపుతిప్పే ప్రయత్నంలో భాగంగా మృతుడు సంతురామ్పై లారీ ఎక్కించుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఘటనపై కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా ఇఫ్తార్ విందు
పుట్టపర్తి టౌన్: రంజాన్ను పురస్కరించుకుని ఎనుములపల్లి గణేష్ కూడలి సమీపంలోని డాక్టర్ అబ్దుల్ కలాం షాదీమహల్లో ప్రభుత్వం తరుఫున ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమన్నారు. కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రంజాన్తో పాటు హిందువులు ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ ఒకేసారి వస్తున్నాయని, అందరూ కలసి మెలసి శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకుందామన్నారు. భూగర్భ జలాలు పెంచుదాంకదిరి అర్బన్: జిల్లాలో అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి భూగర్భ జలాలను పెంచుదామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి మండల పరిధిలోని యర్రదొడ్డి సమీపంలో ‘మన పల్లె – మన నీరు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. భూగర్భ జలాలు ప్రస్తుతం 14 మీటర్లలో ఉన్నాయన్నారు. చాలా వరకు చెరువుల సప్లయ్ ఛానళ్లు మెయిన్టెయిన్ చేయకపోడంతో పాడయ్యాయని చెప్పారు. 90 రోజుల పాటు కాలువల పూడికతీత కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మతో పాటు స్వచ్ఛాంద్ర కమిషన్ డైరెక్టర్ పర్విన్భాను పలువురు అధికారులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో రిటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సులో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ అనంతరం వందశాతం ఉద్యోగ సహకారం అందిస్తామన్నారు. మార్చి 23 నుంచి నూతన బ్యాచ్ను ప్రారంభిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7780752418 ను సంప్రదించాలన్నారు. అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు పుట్టపర్తి: గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో బుక్కపట్నం సమీపంలోని రైతులకు చెందిన మామిడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం బుక్కపట్నం గ్రామానికి చెందిన అవుటాల రవీంద్రరెడ్డికి చెందిన వంద మామిడి చెట్లు కాలిపోగా, పక్కనే ఉన్న మరో రైతు చెన్నకృష్ణకు చెందిన 25 చెట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. కాపుకు వచ్చిన చెట్లు కాలి పోవడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండలకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ దిమ్మె తగిలి వ్యక్తి మృతి హిందూపురం: హిందూపురం కిరికెర పంచాయతీలోని బసనపల్లిలో ఆదివారం శివాలయానికి విద్యుత్ కనెక్షన్ సరిచేస్తుండగా జారిపడి జయచంద్రారెడ్డి (58) మృతి చెందారు. మృతుడు ఆలయంలో సేవలు అందిస్తూ గ్రామస్తులకు అవసరమైన సహాయం చేస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఆలయానికి అవసరమైన విద్యుత్ లైట్లు అమర్చడం కోసం కనెక్షన్లు చేస్తున్నారని, చిన్న దిమ్మైపె ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇచ్చి దిగుతున్న సమయంలో జారీ పడటంతో తలకు దిమ్మెకట్ట తగిలిందన్నారు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. ఆయనకు భార్య ఇందిరమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రూరల్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిన వ్యక్తి సాయికాళేశ్వర్
పెనుకొండ: ఆధ్యాత్మికత విలువను ప్రపంచానికి చాటిన మహనీయుడు సాయికాళేశ్వర్ అని షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శిల్పా అనుపాటి పేర్కొన్నారు. సాయికాళేశ్వర్ 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శివసాయి మందిరంలో సాయికాళేశ్వర్ సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకున్న 85 మందికి శిల్ప కంటి అద్దాలను అందజేశారు. ట్రస్ట్ సభ్యులకు వస్త్రాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు శిల్పా మాట్లాడుతూ సాయికాళేశ్వర్ పెనుకొండలోనే కాక ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల చదువులకు, పాఠశాలలు, కళాశాల అభ్యున్నతికి, తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంతో సహకారం అందించారన్నారు. ఆయన బాటలో గ్లోబల్ ట్రస్ట్ తరఫున నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. నిరవధికంగా కంటి ఆపరేషన్లు ఇతర ఉచిత వైద్య సేవలు కొనసాగించడమే కాక ఉచితంగా వినికిడి పరికరాలు, కంటి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. దేశ విదేశాల నుంచి వైద్యులు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన స్వామి భక్తులు, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ సిబ్బంది మదన్కుమార్రెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు, గ్లోబల్జెన్, ప్రగతి పాఠశాలల కరస్పాండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
దంపెట్లలో 800 ఏళ్లనాటి శాసనం గుర్తింపు
బత్తలపల్లి: మండలంలోని దంపెట్ల గ్రామ సమీపంలోని చిత్రావతి నది ఒడ్డున వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో 800 ఏళ్లనాటి ప్రాచీన కన్నడ శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. ఆదివారం బత్తలపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామ శివారులో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఉందన్నారు. ఈ ఆలయంలో 800 ఏళ్లనాటి ప్రాచీన కన్నడ శాసనాన్ని దేవగిరి యాదవరాజు సింహళదేవుడు క్రీశ 1225వ సంవత్సరం జనవరి 21న రాయించారని తెలిపారు. దాని ప్రకారం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో అప్పట్లో మధురాపురం అనే గ్రామం ఉండేదని, ఆలయ సేవలకు చేసిన గుర్తింపుగా ఆ గ్రామ ప్రముఖులకు రాజు సర్వమాన్య భూములను దానంగా ఇచ్చినట్లు వివరించారు. భారత పురావస్తుశాఖ సహకారంతో గత అక్టోబర్లో ధర్మవరం మండలం కునుతూరు గ్రామంలోని ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయంలో ఇదే రాజు వేయించిన శాసనాన్ని తాను కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రాచీన దేవాలయాల మీద తాను చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ శాసనాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. మన చరిత్ర గొప్పతనాన్ని, భావి తరాలకు తెలియజేయడానికి ఇలాంటి శాసనాలను పరిరక్షించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దంపెట్ల, కునుతూరు గ్రామాల్లో లభ్యమైన యాదవరాజుల శాసనాలను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా చాలా కాలం పాటు ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవగిరిని రాజధానిగా పాలించిన యాదవరాజుల ఏలుబడిలో ఉన్నట్లు గోపి వివరించారు. -
‘స్పెల్ బీ’లో రొద్దం విద్యార్థి ప్రతిభ
రొద్దం: మండల కేంద్రంలోని శ్రీటీచ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని లహరి స్పెల్బి కాంపిటీషన్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ ఆర్కే తిమ్మారెడ్డి తెలిపారు. అనంతపురం పట్టణంలో విశ్వ ఎడ్యుటెక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో తమ పాఠశాలకు చెందిన లియా, హుస్సేన్, సంజయ్, లహరి పాల్గొన్నారన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం లహరి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై విద్యార్థిని లహరిని పాఠశాల ఉపాధ్యాయు బృందం అభినందించింది. జాతీయస్థాయికి ఎంపిక -
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి
ప్రశాంతినిలయం: వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వేసవి సంసిద్ధత, స్వచ్ఛ భారత్ మిషన్ పనులు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద జిల్లాకు మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగు దొడ్లలో ఇప్పటి వరకూ 3,725 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. తక్కిన 1,198 మరుగుదొడ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ గ్రాంట్ ద్వారా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్బీఎం, ఐసీడీఎస్ గ్రాంట్ల కింద అంగన్వాడీల్లో 52.15 శాతం మరుగుదొడ్లు, 89.84 శాతం తాగునీటి సరఫరా పురోగతి నమోదైందన్నారు. మడకశిర డివిజన్లో 130 కేంద్రాలకు గాను 127 కేంద్రాల్లో పూర్తయ్యాయన్నారు. మార్చి నుంచి జూలై వరకూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కరువు ప్రభావిత మండలాల్లో నీటి రవాణా కోసం రూ.210.92 కోట్లు కేటాయించామన్నారు. మడకశిర నియోజకవర్గంలోని పంచాయతీలకు తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభ్యాసకులంతా పరీక్షకు హాజరుకావాలి పుట్టపర్తి అర్బన్: అక్షర ఆంధ్ర (ఉల్లాస్) ఫైనల్ పరీక్షకు అభ్యాసకులందరూ హాజరవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. ఆదివారం పుట్టపర్తి మండలం ప్రశాంతిగ్రామంలోని అక్షర ఆంధ్ర పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్నదే కార్యక్రమ లక్ష్యమన్నారు. అందరూ అక్షరాస్యులుగా మారి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పరీక్ష ముగిసిన అనంతరం జవాబు పత్రాలు, అటెండెన్స్, అవార్డు లిస్ట్లను సంబంధిత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య నోడలాఫీసర్ జనార్దన్ గౌడ్, సీఎంఎం రమాదేవి, సీఓ ధరణి, ఇన్విలేజర్లు నర్మద, పుష్ప పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
ఏడాదిపాటు వాడాలి
పుట్టపర్తి అర్బన్: కొండగుట్టల్లో పెరిగే నీలగిరి మొక్కలు ప్రస్తుతం రైతులకు ‘కలప తరువు’గా మారాయి. నీటి అవసరం లేకున్నా పెరిగే మొక్కలు కావడంతో బంజరు, బీడు భూముల్లో పెంచుతున్నారు. గతంలో రైతులు వీటిని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఉద్యాన మొక్కలకు ఊతంగా నిలిపే కర్రలకు కొరత ఏర్పడటం. నీలగిరి అందుకు బాగా ఉపయోగపడటంతో రైతులు వాటిని పెంచుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వస్తుండటంతో ఒకరిని చూసి మరొకరు నీలగిరి సాగుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాల్లోని రైతులు నీలగిరి మొక్కలను విపరీతంగా పెంచుతున్నారు. గతంలో పేపర్ మిల్లులకే పరిమితం నీలగిరి కర్రలను గతంలో ఎక్కువగా పేపర్ మిల్లులకు మాత్రమే పంపేవారు. అలాగే ప్లైవుడ్ పరిశ్రమలు ఎక్కువగా ఉండే చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సరఫరా చేసేవారు. కానీ పెద్దగా లాభాలు వచ్చేవి కావు. అందులోనూ మార్చి, ఏప్రిల్ మాసాల్లో పేపర్ మిల్లులు మూత పడడంతో నీలగిరికి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఉద్యాన పంటలకు వినియోగంతో డిమాండ్ నాణ్యమైన కూరగాయలు, పండ్ల దిగుబడికి ప్రతి మొక్కకూ కర్రసాయం అవసరం అవుతోంది. ఈదురు గాలులకు మొక్క కిందపడి విరిగిపోకుండా రైతులు కర్ర సాయాన్ని అందిస్తున్నారు. దీంతో కర్రల వ్యాపారం బాగా పుంజుకుంది. ఒకప్పుడు బంజరు భూములు, బీడు భూముల్లో మాత్రమే సాగు చేసే రైతులు... ప్రస్తుతం సారవంతమైన భూముల్లో సైతం నీలగిరి మొక్కలను సాగు చేస్తుండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలోనూ నీలగిరి సాగులో ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలు కావడంతో రైతులు నీలగిరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. 15 ఏళ్ల వరకూ దిగుబడి యూకలిప్టస్, జామాయిల్, నీలగిరి వంటి పేర్లతో పిలిచే ఈ మొక్క ఒక్కసారి నాటితే 12 నుంచి 15 ఏళ్ల వరకూ దిగుబడి ఇస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓ సారి కర్ర నరికి విక్రయించుకోవచ్చు. ఎకరాకు కనీసం 45 నుంచి 60 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. ఈ పంటకు పెట్టుబడి చాలా తక్కువ. సొంత భూములున్న రైతులు సాగు చేసినట్లయితే ఒకటి రెండు సార్లు ఎరువులు, నీళ్లు అందిస్తే సరిపోతుంది. పెరిగిన సాగు విస్తీర్ణం జిల్లాలో అత్యధికంగా చిలమత్తూరు, హిందూపురం, మడకశిర, అమడగూరు, తనకల్లు, నల్లచెరువు తదితర మండలాల్లో నీలగిరి పంట సాగవుతోంది. ఓడీసీ మండలం మహమ్మదాబాద్, గోరంట్ల మండలం పులేరు, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో నీలగిరి మొక్కల విక్రయ కేంద్రాలున్నాయి. ఇక్కడి నుంచే రైతులు కర్రలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కర్ర 6 నుంచి 8 అడుగుల వరకు సైజును బట్టి రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతోంది. స్థానికంగా కర్రలకు కొరత ఏర్పడితే చిత్తూరు, నెల్లూరు, తెలంగాణ నుంచి కర్రలను కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. కర్ర సాయమిస్తే నాణ్యమైన దిగుబడి పండ్ల తోటల్లో ముఖ్యంగా టమాట, వంకాయ, బీర, సొర కాయలు, కాకర వంటి తీగ జాతి పంటలకు కర్రలను అధికంగా వినియోగిస్తారు. టమాట, వంకాయ పిందె స్థాయిలోనే కింద పడితే కాయ నాణ్యత దెబ్బతింటుంది. అందువల్ల రైతులు మొక్కలకు కర్రను సాయంగా ఉంచి పంట కాపాడుకుంటారు. ఇక తీగ జాతి పంటలకు తప్పనిసరిగా కర్రల సాయం ఇస్తారు. మామిడి, చీనీ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలకు సపోర్ట్గా కర్రలు నాటడం వల్ల మొక్కలు గాలికి, వర్షాలకు కింద పడకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే నీలగిరి కర్రలకు డిమాండ్ పెరగడంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కాసులు కురిపిస్తున్న నీలగిరి కర్ణాటక సరిహద్దులో భారీగా సాగు ఉద్యాన మొక్కలకు ఊతంగా నీలగిరి కర్రలు ఇటీవల భారీగా పెరిగిన డిమాండ్ ఒక్కో కర్ర రూ.25 నుంచి రూ.30 వరకూ విక్రయంప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి మొక్కలు దెబ్బ తినకుండా కర్రల సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మామిడి మొక్కలు పెళుసుగా ఉండడంతో అవి విరగకుండా ఏడాది పాటు కర్రల సపోర్ట్ ఉండాలి. ఇందుకోసం మూడు, నాలుగు అడుగుల ఎత్తు ఉన్న కర్రలయితే సరిపోతాయి. అయితే ఇటీవల అటవీ ప్రాంతానికి వెళ్లి కట్టెలు కొట్టే కూలీలు తగ్గిపోవడంతో ఎక్కువగా నీలగిరి కర్రలను కొంటున్నాం. దీంతో నీలగిరి సాగు విస్తీర్ణం కూడా జిల్లాలో పెరిగింది. – సూర్యనారాయణ, కొత్తచెరువు -
ఒత్తిళ్లు.. ఉద్యోగుల బెంబేలు
అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న భారీ లక్ష్యాలు పంచాయతీ అధికారుల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి రాత్రిదాకా ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కొందరు ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన పన్నుల వసూళ్ల ఒత్తిడితోనే జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో చంద్రశేఖర్ ఫొటో పెట్టి...‘పన్నుల వసూళ్లకు డిప్యూటీ ఎంపీడీఓ బలయ్యాడు’ అంటూ పోస్టులు పెట్టారు. ఇలాంటి ఒత్తిడి ఎన్నడూ చూడలేదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విలేజ్ డెవలప్మెంట్ అధికారి పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ విస్త్తృతంగా ఫార్వర్డ్ అవుతోంది. ఆ వాయిస్ మెసేజ్ లో ఏముందంటే... ‘రోజుకు రూ.10 లక్షల పన్నుల వసూళ్ల లక్ష్యం విధించారు. నా వయసు 57 సంవత్సరాలు. 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్నా. అయినా ఇంతటి ఒత్తిడి ఎప్పుడూ చూడలేదు. పన్నుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మానసిక టెన్షన్ ఎదు ర్కొంటున్నా. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజీనామా చేయాల్సి వస్తుంది. రోజుకు రూ.10 లక్షలు వసూలు చేయాలంటున్నారు.స్వయంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వచ్చినా అంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాదు. కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు అంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాకు కుటుంబాలు లేవా? రెండో శనివారం, ఆదివారం కూడా ఇదే పని చేయాలా? ఒత్తిళ్లు కొనసాగితే తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకు ఈఓఆర్డీ, ఎంపీడీఓ, డీపీఓ, కమిషనర్ బాధ్యులవుతారు’ అని మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ పంచాయతీ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం పునరాలోచించాలి జిల్లాలో పని చేస్తున్న గ్రామ అభివృద్ధి అధికారులు (వీడీఓ) తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాలు మార్చుకోకపోతే తాము అతి తొందరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘మాకూ కుటుంబాలు ఉన్నాయి.. చిన్న వయసులోనే అరోగ్యాలు దెబ్బతింటే మా కుటుంబాలు ఏమి కావాలని’ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడో కూర్చుని సంస్కరణల పేరుతో హోదాలు మార్చడం కాదని, ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలని మండిపడుతున్నారు. జిల్లా అధికారులు కూడా ఈ విషయంలో వైఖరి మార్చుకోవాలని కోరుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ల నాయకులకూ చురకలంటిస్తున్నారు. ‘పనికిరాని ఇన్ని యూనియన్లు ఉండడం వల్లే ప్రతి ఒక్కరూ మనల్ని పురుగులు చూసినట్టు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో పంచాయతీ ఉద్యోగుల తీవ్ర ఆవేదన గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీఓ గుండెపోటుతో మరణించాడంటున్న వీడీఓలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీకాకుళం జిల్లా వీడీఓ వాయిస్ మెసేజ్ -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్ట రేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు.ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. ‘పురం’ సంతకు 4,560 క్వింటాళ్ల చింతపండుహిందూపురం: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో ఆదివారం జరిగిన సంతకు 4,560 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. మొదటి రకం బెస్ట్ కరిపులి క్వింటాలు ధర గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టం రూ.10 వేలు, సగటు రూ.14 వేల చొప్పున క్రయ విక్రయాలు సాగాయి. రెండో రకం ఫ్లవర్ క్వింటాల్ గరిష్ట ధర రూ.13 వేలు, కనిష్టం రూ.6 వేలు, సగటు రూ.7,500 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహ మూర్తి తెలిపారు. ఉగాది సందర్భంగా వచ్చే గురువారం చింతపండు మార్కెట్కు సెలవు ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రిజర్వు ఎస్ఐల దుర్మరణం ● కర్ణాటకలోని చెళ్లకెర వద్ద ఘోరంపావగడ: లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ముగ్గురు రిజర్వ్ ఎస్ఐలు దుర్మరణం చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెళ్లెకెర తాలూకా హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు హైవేలో సంభవించింది. బెంగళూరు సాయుధ పోలీసు (సీఏఆర్) విభాగంలో ఎస్ఐలుగా పనిచేసే మంజునాథ్ దారిమని (31), అమరీష్ (25), సచిన్ (30), ఎల్.ఈశ్వర్, మహదేశ్వర బొమ్మన్నవర్ స్నేహితులు. తమ బ్యాచ్మేట్ పెళ్లి బళ్లారిలో జరుగుతుండడంతో మారుతి సియాజ్ కారులో బెంగళూరు నుంచి ఐదుగురూ బయల్దేరారు. మార్గమధ్యంలోని హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు– హైవేలో అతివేగంగా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. కారులోని మంజునాథ్, అమరీష్, సచిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈశ్వర్, మహదేశ్వర తీవ్ర గాయాలపాలయ్యారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జయింది. మృతులందరూ అవివాహితులే అని తెలిసింది. లారీ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్ద మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని ముంటిమడుగు క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శనివారం పెద్దవడుగూరు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ సుబ్బరాయుడు (53) మరో ఏడుగురితో కలిసి మిషన్తో మొక్కజొన్న ఆడించే పనికి గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి వచ్చాడు. పని ముగిసిన అనంతరం మిషన్ను ట్రాక్టర్కు కట్టుకుని అందరూ తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ముంటిమడుగు క్రాస్ వద్ద మొక్కజొన్న మిషన్ స్టాండ్ బోల్టు ఊడి పోయింది. ఈ క్రమంలో స్టాండ్ మీద కూర్చున్న సుబ్బరాయుడితో పాటు మరో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. సుబ్బరాయుడిపై నుంచి మొక్కజొన్న మిషన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనోహర్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మికి గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. కాగా మృతుడు సుబ్బరాయుడుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసు
సాక్షి, టాస్క్ఫోర్స్: మండల పరిధిలోని పలగలపల్లి పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నరేంద్రరెడ్డిపై పోలీసులు అక్రమ కేసు బనాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్లుకుంటకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు నరసింహప్పకు, అతని బంధువులకు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసులో నరేంద్రరెడ్డిని ఇరికించారు. ఆర్థిక లావాదేవీల అంశంలో గొడవ జరిగిందని, తమపైకి ప్రత్యర్థులను నరేంద్ర రెడ్డి ఉసిగొల్పాడని ఫిర్యాదుదారుడు పేర్కొనగా.. వాస్తవాలను పోలీసులు పరిశీలించకుండానే కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలతోనే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తప్పు చేయకపోయినా తనపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితుడు నరేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిళ్ల మేరకే కేసు నమోదు చేశారంటూ పోలీసులే చర్చించుకోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడిగా నాగమల్లేశ్వర రెడ్డికనగానపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడిగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన నాగమల్లేశ్వరరెడ్డిని నియమించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పూజారి లక్ష్మినరసింహులును నియమించారు. చదువు భారమని యువకుడి బలవన్మరణం పెద్దవడుగూరు: చదువు భారమని భావించిన యువకుడు బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. విరుపాపురానికి చెందిన మార్నె నరసింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరి పెద్ద కుమారుడు మార్నె కల్యాణ్ (20) ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు కట్టి పరీక్షలు రాయమని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణ్ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చీకటి పడినా తిరిగి రాలేదు. కొత్తపల్లి బస్టాండ్ సమీపంలోని కాశేపల్లి చెన్నారెడ్డి తోట వద్ద ఎప్పుడూ ఉండేవాడని తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లి గాలించారు. అక్కడ చెట్టుకు ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. కిందికి దింపి పామిడి ఆసుపత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజినేయులు తెలిపారు. గుంతలో పడి వృద్ధురాలు మృతి కళ్యాణదుర్గం రూరల్: గుంతలో పడి తిప్పమ్మ (83) అనే వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కుర్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. కుర్లపల్లిలో ఒంటరిగా జీవిస్తున్న తిప్పమ్మ శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని గుంతలో ప్రమాదపుశాత్తు పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి తిప్పమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే తిప్పమ్మ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం
● ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం సంపత్కుమార్ అనంతపురం టౌన్: విద్యుత్ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం సంపత్కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ సర్కిల్ డేను పురస్కరించుకుని విద్యుత్ ఉద్యోగులకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా పోటీలను జేఎన్టీయూ కళాశాల సమీపంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంపత్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి సీఎండీ శివశంకర్ లోతేటి వస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎస్ఈలు శేషాద్రి శేఖర్, మోసెస్తోపాటు ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. సివిక్స్ పరీక్షకు 334 మంది గైర్హాజరుపుట్టపర్తి: సివిక్స్ పరీక్షకు 334 మంది ఇంటర్ విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్న కేశవప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని 41 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు సివిక్స్ పరీక్ష రాశారు. 4,299 మందికి గాను 3,965 మంది హాజరయ్యారు. 334 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. విద్యాశాఖ అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సిలిండర్ల అక్రమ వినియోగంపై దాడులుఅనంతపురం సెంట్రల్: సిలిండర్ల అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుంతకల్లులో హనుమాన్ జంక్షన్ దగ్గర బాలాజీ కేఫ్లో 4 సిలిండర్లు సీజ్ చేసి నిర్వాహకుడు అనుముల సురేంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే గుత్తి గాంధీ సర్కిల్లో గ్యాస్ స్టౌవ్ రిపేరీ దుకాణంలో 12 సిలిండర్లు, గ్యాస్ ఫిలింగ్ పైపు సీజ్ చేసి నిర్వాహకుడు చిన్న మహమ్మద్పై కేసు నమోదు చేశారు. కదిరి పట్టణంలో ఓ ఇంట్లో 46 సిలిండర్లు సీజ్ చేసి డెలివరీ బాయ్పై కేసు కట్టారు.చట్ట విరుద్ధంగా విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐ గోపాలుడు, ఏఈఈ రవీంద్ర నాథ్, రాజశేఖర్, సీఎస్డీటీ భాగ్యలక్ష్మి, ఆర్ఐ రవికుమార్, కదిరి వీఆర్వో ఆదినారాయణమ్మ, హరీష్కుమార్ పాల్గొన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ల సీజ్ బొమ్మనహాళ్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో శనివారం జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు దాడులు నిర్వహించి ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ బోయ మల్లికార్జున, ఉరవకొండ మండలం బుడిదగవ్వి గ్రామానికి చెందిన వడ్డే రాంబాబు, ఉండబండ గ్రామానికి చెందిన బంగి చందు, కల్లుహోళ గ్రామానికి చెందిన కాకుల వన్నూరుస్వామి, కుమ్మరి నాగేంద్ర, బోయ వన్నూరుస్వామిని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇసుక కావాల్సిన వారు తహసీల్దార్ వద్ద అనుమతి తీసుకోవాలని, అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విద్యుత్ షాక్తో ఆపరేటర్కు తీవ్ర గాయాలు
అనంతపురం టౌన్: విద్యుత్ షాక్తో ఆపరేటర్కు తీవ్ర గాయాలైన ఘటన డీ4 సెక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక జేఎన్టీయూ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద నూతన సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. అందులో ట్రైనింగ్ షిఫ్ట్ ఆపరేటర్గా ఉన్న రమేష్ నాయక్ శనివారం 33కేవీ విద్యుత్ స్తంభంపైకెక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. చేతులు, కడుపు భాగం మొత్తం కాలిపోయింది. విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడడంతో తలకు సైతం గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ నాయక్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. షిఫ్ట్ ఆపరేటర్తో మరమ్మతులా..? లైన్ మరమ్మతులను విద్యుత్ అధికారులతో చేపట్టకుండా శిక్షణలో ఉన్న ఆపరేటర్తో చేయించడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలి సింది. ఏ లైన్లో విద్యుత్ సరఫరా ఉంటుందో.. ఎందులో ఉండదో వారికి కనీస అవగాహన ఉండదు. అయినా, పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగింది. ఈ విషయంపై విచారణ చేపట్టి షిఫ్ట్ ఆపరేటర్తో మరమ్మతులు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆకట్టుకున్న ‘కరుణాసాగర రామా’
ప్రశాంతినిలయం: శ్రీరాముని గుణగణాలను, రామాయణ విశిష్టతను చాటుతూ సాగిన ‘కరుణాసాగర రామా’ నృత్య రూపకం భక్తులను పరవశింపజేసింది. పర్తియాత్రలో భాగంగా దక్షణ తమిళనాడుకు చెందిన నీలగిరీస్ జిల్లా భక్తులు శనివారం సాయంత్రం సత్యసాయి సన్నిధిలో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యసాయి బాలవికాస్ చిన్నారులు ‘కరుణా సాగర రామా’ పేరుతో భక్తి రస నృత్య రూపకం ప్రదర్శించారు. శ్రీరాముని నీతి, పితృవాక్య పరిపాలన దక్షతను చక్కగా వివరించారు. నృత్య రూపకం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. పిదప భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
మృత్యు మలుపు
రాప్తాడురూరల్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థం కోసం లేనిచోట కొత్తగా తీయించిన ‘యూటర్న్’ వద్ద మరో నిండుప్రాణం బలైంది. నెల తిగరకుండానే అదే స్పాట్లో మరో వ్యక్తి మృతి చెందడం కలచివేస్తోంది. నగర శివారు బళ్లారి రోడ్డు ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దాటిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మరిమాకులపల్లికి చెందిన కృష్ణమనాయుడు (60) స్థానికంగా వాచ్మన్గా పని చేస్తున్నాడు. పనిమీద బైకుపై నగరానికి వచ్చి తిరిగి సిండికేట్నగర్కు వెళ్తూ... యూటర్న్ వద్ద తిప్పుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన బుల్లెట్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణమనాయుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బుల్లెట్ నడుపుతున్న యువకుడు గార్లదిన్నె మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పీఎస్ ఎస్ఐ కొమ్మినేని రాంబాబు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తరచూ ప్రమాదాలు కొత్తగా ఏర్పాటు చేసిన యూటర్న్ చాలామంది వాహనదారులకు తెలీదు. ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూటర్న్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్నూ తొలగించడం కొసమెరుపు. ఈ క్రమంలో వేగంగా వచ్చే వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. గతనెల 15న ఇదే యూటర్న్ వద్ద కారు మలుపు తిరుగుతుండగా బైకుపై వేగంగా వచ్చిన నరసనాయనికుంటకు చెందిన హరిజన నరేష్ కారును బలంగా ఢీకొని స్పాట్లోనే మృతి చెందాడు. అదే స్థలంలో తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో యూటర్న్ను తొలగించడం లేదా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బళ్లారి రోడ్డులో కొత్త యూటర్న్ వద్ద మరో ప్రాణం బలి -
●‘గ్యాస్’ బారులు
కదిరి సబ్ జైలు సమీపంలోని విజయలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం కనిపించిన దృశ్యమిది. అమెరికా, ఇజ్రాయొల్– ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సరిగా సరఫరా కావడం లేదు. సిలిండర్ బుక్ చేసి వారం దాటినా డెలివరీ కాకపోవడంతో కదిరి పట్టణంతో పాటు రూరల్ మండలంలోని పలు గ్రామాల వినియోగదారులు ఇలా సిలిండర్లు తీసుకుని ఏజెన్సీ వద్దకు వచ్చారు. దాదాపు 500 మంది రాగా, శనివారం సగం మందికి కూడా సిలిండర్లు ఇవ్వలేకపోయారు. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదని, బుక్ చేసుకుంటే నిర్ణీత వ్యవధిలో ఇంటికే వస్తోందంటూ ప్రకటిస్తుండటం గమనార్హం. – కదిరి టౌన్: -
లోక్ అదాలత్లో 10,082 కేసుల పరిష్కారం
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. రాజీకి అనుగుణంగా ఉన్న 10,082 కేసులు పరిష్కరించినట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. అనంతపురం కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో ఆయన పాల్గొన్నారు. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలు చేసే అధికారం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులలో కేసు పరిష్కారమైతే ఎవరో ఒకరే విజేతగా నిలుస్తారన్నారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ అయితే ఇరుపక్షాలూ విజేతలే అని పేర్కొన్నారు. జాతీయ లోక్అదాలత్ కేసుల్లో మొత్తం రూ.9.77 కోట్ల పరిహారం దక్కిందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం
చిలమత్తూరు: స్వగ్రామానికి బైక్పై బయలుదేరిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతులిద్దరూ బావబావమరిది కావడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపిన వివరాల మేరకు... బీదర్కు చెందిన అభిషేక్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఇటీవలే అభిషేక్కు బీదర్కు చెందిన యువతితో వివాహమైంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అభిషేక్ తన భార్య సోదరుడు సుమిత్తో కలిసి సొంతూరు బీదర్కు బైక్పై బయల్దేరాడు. శనివారం తెల్లవారుజామున కొడికొండ చెక్పోస్ట్ వద్దకు చేరుకున్నారు. బైక్పై వేగంగా వస్తున్న వీరు చెక్ పాయింట్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ను గుర్తించలేక అలాగే ముందుకు నడిపారు. బైక్ స్పీడ్ బ్రేకర్ను దాటి అదే వేగానికి ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న అభిషేక్, ఆయన బావమరిది సుమిత్ ఇద్దరూ కిందపడ్డారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపటినట్టు ఎస్ఐ తెలిపారు. మృతులిద్దరూ బావబావమరుదులు స్వగ్రామానికి బయలుదేరి తిరిగిరాని లోకాలకు.. -
ఆందోళన వద్దు.. అందరికీ ఇస్తాం
● 12 వేల సిలిండర్లు అందుబాలో ఉన్నాయి ప్రశాంతి నిలయం/రొద్దం: గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బుక్ చేసుకున్న ప్రతివారికీ సిలిండర్ అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజూ జిల్లా వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలెండర్లు ఆయిల్ కంపెనీల ద్వారా అందుతున్నాయన్నారు. శనివారం నాటికి జిల్లాలో 12 వేల గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సిలిండర్ను పొందిన గ్రామీణ ప్రాంత వాసులు 45 రోజుల తర్వాత, పట్టణ ప్రాంత వాసులు 25 రోజుల తర్వాత గ్యాస్ బుకింగ్ చేసుకోవాలన్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే సరఫరా చేస్తారన్నారు. అవసరం మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు గానీ, గోదాముల వద్దకు గాని వెళ్లకూడదన్నారు. అంతకుముందు ఆయన రొద్దంలోని విజయలక్ష్మి గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు చేశారు. గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసిన గోడౌన్ను తనిఖీ చేసి అక్కడే ఉన్న వినియోగదారులతో మాట్లాడారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే వాహనాన్ని తురకలాపట్నం గ్రామంలో తనిఖీ చేశారు. -
పదికి పకడ్బందీ ఏర్పాట్లు
పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 22,303 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. వీరి కోసం 107 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,177 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇందులో 971 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 206 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరుగురు రూట్ ఆఫీసర్లు, 107 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 107 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఏడుగురు ఏడీఓలను నియమించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య.. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2024లో 18,419 మంది పరీక్షరాయగా... 2025లో 15,769 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఏకంగా 22,303 మంది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 21,334 మంది ఉండగా.. కంపార్ట్మెంట్కు సంబంధించి 969 మంది విద్యార్థులున్నారు. రెగ్యులర్ సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 9,700 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 6,751 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే కేజీబీవీల నుంచి 1,162 మంది, మున్సిపల్ స్కూళ్ల నుంచి 1,529 మంది , ఇతర పాఠశాలల నుంచి 2,192 మంది పరీక్ష రాస్తున్నారు. ఇందులో బాలికలు 10,236 మంది ఉండగా... బాలురు 11,098 మంది ఉన్నారు. పక్కాగా నిర్వహణ.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. సీఎస్, డీఓలు ఉదయం 8.30 గంటల్లోపు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి. ప్రభుత్వం పేపర్ కోడ్ తెలియజేయగానే... సదరు కోడ్ ఉన్న ప్రశ్నపత్రాలను 9,15 గంటలకు తీసుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష పూర్తి కాగానే ఆన్సర్ షీట్లను పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలి. విద్యార్థులకు ఉచిత ప్రయాణం.. పుట్టపర్తి టౌన్: పది విద్యార్థులకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు డీపీటీఓ మధుసూదన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ముగిసే వరకూ ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.పుట్టపర్తి అర్బన్: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. శనివారం సాయంత్రం కొత్తచెరువులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా నుంచి 456 పాఠశాలలకు చెందిన 22,303 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు హాజరవుతున్నారని, వీరికోసం 107 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్య సదుపాయం కల్పించామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1,177 మంది ఇన్విజిలేటర్లు నియమించామన్నారు. అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 40 మందితో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం 8328028353 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు.. జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 22,303 మంది విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోలని డీఈఓ సూచన పకడ్బందీ ఏర్పాట్లు: డీఈఓ -
గుత్తి కోటను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
గుత్తి: పర్యాటక కేంద్రంగా గుత్తి కోటను తీర్చిద్దేందుకు కృషి చేస్తామని కలెక్టర్, ప్రజాప్రతినిధులు అన్నారు. శనివారం పట్టణంలోని ఎంఎస్ ఫుట్బాల్ క్రీడా మైదానంలో గుత్తి కోట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాళుక్యులు, మరాఠీలు, విజయనగర రాజులు పాలించిన గుత్తి కోట ప్రాశస్త్యం గురించి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తెలియజేస్తున్నారన్నారు. చారిత్రక గుత్తికోటను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గుత్తి కోటకు త్వరలో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యంతో కళాకారులు అలరించారు. డీఆర్వో మలోల సైతం పాట పాడి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఎంఎస్ ఫుట్ బాల్ క్రీడా మైదానం వద్ద నుంచి కోట వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఫుట్ బాల్ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ ఫేం శాంతికుమార్, రైజింగ్ రాజు, మోహన్ కామెడీ స్కిట్లు ప్రదర్శించనున్నారన్నారు. పాటల పోటీలు కూడా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, తాడిపత్రి, గుత్తి మున్సిపల్ చైర్పర్సన్లు జేసీ ప్రభాకర్రెడ్డి, వన్నూర్బీ, వైస్ చైర్పర్సన్ బిందె వరలక్ష్మి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ భాస్కర్, ఆర్కియాలజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కేయూ వీసీగా జ్యోతి కుమార్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నూతన వైస్ చాన్సలర్గా ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్/ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్వీఆర్ విజయ్కుమార్ మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 39 సంవత్సరాల బోధనానుభవం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎస్కేయూకు శాశ్వత వీసీ నియామకం జరిగింది. 18 నెలలుగా ఇన్చార్జ్ వీసీతోనే ఎస్కేయూ కార్యకలాపాలు జరిగాయి. ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ఎక్కువ కాలం పనిచేసి రికార్డు సృష్టించారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి గుడిబండ: మండల పరిధిలోని కేకాతి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగమ్మ (67) మృతి చెందింది. వివరాల్లోకెళితే... వృద్ధురాలు రంగమ్మ శుక్రవారం గ్రామంలోని గుడి వద్ద నుంచి ఇంటికి నడుస్తూ వస్తోంది. అయితే మైనగానపల్లి గ్రామానికి చెందిన హనుమంతు ఆటోతో రంగమ్మను ఢీ కొన్నాడు. వృద్ధురాలు రంగమ్మ తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె చిన్న కుమారుడు మంజునాథ్ వెంటనే మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రంగమ్మ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్కుళ్లాయప్ప తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం రొళ్ల: రోడ్డుకు అడ్డంగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయి వాహనం అదుపుతప్పి కింద చంద్రశేఖర్ (59) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అగళి మండలం కురసాంగనపల్లికి చెందిన చంద్రశేఖర్ మడకశిర మండలం నీలకంఠాపురంలోని కంటి ఆస్పత్రికి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. రొళ్లకొండ టోల్ప్లాజా దాటిన తర్వార కొడగార్లగుట్టకి వెళ్లే మలుపు వద్ద 544ఈ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించబోయి చంద్రశేఖర్ అదుపుతప్పి కింద పడ్డారు. చంద్రశేఖర్ తలకు బలమైన రక్త గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హైవే అంబులెన్స్ సహాయంతో రొళ్ల సీహెచ్సీకి తరలిస్తుండగా చంద్రశేఖర్ మార్గమధ్యలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గౌతమి, ఏఎస్ఐ ఇదాయితుల్లా ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
చికిత్స పొందుతూ చేనేత కార్మికుడి మృతి
పరిగి: పురుగుల మందు తాగిన ఘటనలో చికిత్స పొందుతున్న చేనేత కార్మికుడు కురుబ మల్లికార్జున (34) పరిస్థితి విషమించడంతో శుక్రవారం చనిపోయాడు. ఎస్ఐ రంగడు యాదవ్ వివరాలమేరకు.. హిందూపురం పరిధిలోని ధన్రోడ్డులో నివాసముంటున్న మల్లికార్జున చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్దేవంతో తెలిసిన వారితో సుమారు రూ.8 లక్షలు అప్పులు చేశాడు. అవి తీర్చలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పరిగి మండలంలోని హొన్నంపల్లి సమీపంలో పరిగి చెరువులోని కంపచెట్ల వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
పూరి ్తకాని పనులు.. గాల్లో ప్రాణాలు
పుట్టపర్తి అర్బన్: ముదిగుబ్బ నుంచి కోడూరు వరకూ పుట్టపర్తి మీదుగా నూతనంగా ఏర్పాటవుతున్న జాతీయ రహదారి 342 ప్రమాదాలకు అడ్డాగా మారింది. 80 కిలో మీటర్ల రోడ్డు వెంబడి ఉన్న ప్రమాదకర మలుపులు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిన నిర్మాణ పనులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న వంకలకు రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతుండగా తీవ్రగాయాలతో అల్లాడిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జాతీయ రహదారి 342 పనులు పూర్తికాకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాల నుంచి సర్వీస్ రోడ్ల వెంబడి ప్రయాణించి జాతీయ రహదారిపైకి వచ్చే జంక్షన్లు, సర్వీస్ రోడ్ల అభివృద్ధి అధికారులు పూర్తిగా విస్మరించారు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా జాతీయ రహదారిపైకి వాహనం ఎక్కిస్తే వాయువేగంతో వచ్చే వాహనాలతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టోల్గేట్ పనులు నత్తనగకన సాగుతున్నాయి. గోరంట్ల వద్ద ఫ్లైవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావాల్సి ఉంది. మూడవ విడతలో భాగంగా పుట్టపర్తి సమీపంలో బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. రోడ్డు పనులు ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా నేటికీ సంపూర్తిగా చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు పట్టించుకోకపోవడంతోరీ దుస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. ● గత బుధవారం రాత్రి బెంగళూరు నుంచి పుట్టపర్తికి వస్తున్న కారు వేగంగా వస్తూ కొత్తచెరువు మండలం కదిరేపల్లి పొలం వద్ద భారీ గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుట్టపర్తికి చెందిన రిజ్వాన్ బాషా (48) మృతి చెందగా ఆయన భార్య సర్తాజ్ తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రాణాపాయస్థితిలో ఉంది. డ్రైవర్ చాంద్బాషా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ● ఇటీవల బెంగళూరు నుంచి పుట్టపర్తికి కారులో వస్తున్న ఇద్దరు సత్యసాయి బాబా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు టోల్ గేట్ వద్ద ఉన్న మట్టి కుప్పపై కెక్కి బోల్తా పడ్డారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ● అలాగే కంకర తీసుకొస్తున్న టిప్పర్ ఢీ కొని గువ్వలగుట్టపల్లికి చెందిన ఓ వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. ● జాతీయ రహదారి నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో నాలుగు నెలల క్రితం పెడపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డుపైకి వచ్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ● ఆరు నెలల క్రితం పెద్దతండా వద్ద ఉన్న జంక్షన్ వద్ద ఆటో బోల్తాపడటంతో మహిళా కూలి మృతి చెందగా ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. ● వెంకటగారిపల్లి వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ● పనులు సరిగా పూర్తికాని కారణంగా కర్ణాటక బస్సు సైతం వెంకటగారిపల్లి వద్ద డివైడర్ను ఢీ కొని నిలిచిపోయింది. ● గోరంట్ల మండలం మందలపల్లి వద్ద జాతీయ రహదారిపై దంతులు వెళ్తున్న బైక్ అదుపు తప్పింది. వాహనం పడకపోయి ఉంటే లారీ కిందకు వెళ్లిపోయేదని, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు కనీసం ప్రమాద హెచ్చరికలు బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలకు అడ్డాగా 342 హైవే మూడేళ్లుగా సాగుతున్న పనులు తరచూ ప్రమాదాల్లో నిండు ప్రాణాల బలి ఎంతో మంది గాయపడుతున్న వైనం చోద్యం చూస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు ఏమరపాటుగా ఉంటే అంతే.. ప్రమాదాలు ఇలా... -
హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు
ధర్మవరం: ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని పలు హోటళ్లపైన శుక్రవారం రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో డొమెస్టిక్ సిలెండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. ధర్మవరం ఆర్డీఓ రామసుబ్బయ్య, తహసీల్దార్ సురేష్బాబుల ఆదేశాల మేరకు సీఎస్డీటీ రమణబాబు, వీఆర్ఓ రవిల ఆధ్వర్యంలో హోటళ్లలో దాడులు నిర్వహించి 11 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. రెస్టారెంట్లు, హోటళ్లపై కేసులు నమోదు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. గ్యాస్ గోడౌన్ను కూడా తనిఖీ చేసి రికార్డులు తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ లేదని గుర్తించామన్నారు. ఎవరైనా ఇంటికి ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్కు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పెనుకొండ రూరల్: అక్రమంగా డొమొస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వాణిజ్య కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంతో పాటు కియా పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. 19 డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కేసులు నమోదు చేసి సిలిండర్లను గోడౌన్ తరలించారు. దాడులలో పౌరసరఫరాల డివిజన్ అధికారి రమేష్, తహసీల్దార్ స్వాతి, సీఎస్డీటీ ప్రభావతి, వీఆర్వో బషీర్ పాల్గొన్నారు. హిందూపురం టౌన్: సివిల్ సప్లయ్స్ అధికారులు శుక్రవారం పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ హారతి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రెవెన్యూ సిబ్బంది పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండటంతో ఆయా హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు 27 సిలిండర్లను సీజ్ చేసినట్లు డీటీ హారతి తెలిపారు. దాడుల్లో డీటీలు లక్ష్మీనరసింహం, సావిత్రి, అనిల్ కుమార్, విజయ నిర్మల, మోహన్ నాయక్, వీఆర్ఓలు పాల్గొన్నారు. భారీగా గ్యాస్ సిలిండర్ల సీజ్ -
అరటి తోట దగ్ధం : రూ.8 లక్షల నష్టం
తాడిమర్రి: మండలంలోని మద్దులచెర్వు గ్రామంలో రైతు ఉప్పులూరు నాగార్జునరెడ్డికి చెందిన అరటి తోట శుక్రవారం అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లింది. బాధిత రైతు వివరాల మేరకు.. రైతు ఉప్పలూరు నాగార్జునరెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల్లో రెండేళ్ల క్రితం 4,000 అరటి మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో కొయ్య పంటతో తోట గెలలతో కళకళ లాడుతోంది. మరో నెల రోజుల్లో పంటకోత కోయాల్సి ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకతాయిలు బీడీ, సిగరెట్ తాగి పడేయటంతో తోటకు నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న రైతు కుటుంబ సభ్యులు వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అరటి చెట్లు, తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్పు, పైపులు కాలిపోయాయి. వేసవి కాలం కావడంతో ఎండలు అధికమై మంటలను ఆర్పలేక పోయారని వాపోయారు. సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం క్యూముదిగుబ్బ: ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ముదిగుబ్బలో శుక్రవారం గ్యాస్ సిలిండర్ల కోసం జనం ఎగబడ్డారు. చాలా మందికి గ్యాస్ సిలిండర్ అవసరం లేకున్నా కూడా ఖాళీ సిలెండర్లు లేకుండా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్యాస్ కోసం జనం వస్తుండడంతో సర్వర్ సరిగా పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. -
నిబంధనలకు పాతర
● శ్రీచైతన్య పాఠశాలల తనిఖీలో అధికారుల వెల్లడి కదిరి: జిల్లాలోని కదిరి, గోరంట్లలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలను శుక్రవారం పెనుకొండ డిప్యూటీ డీఈఓ జాన్ రెడ్డెప్ప విచారణ చేపట్టారు. జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని కళ్యాణదుర్గానికి చెందిన రమణ అనే వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఫిర్యాదు చేయడంతో దానిపై విచారణ చేపట్టారు. అనంతరం జాన్ రెడ్డెప్ప మాట్లాడుతూ.. జిల్లాలోని కదిరితో పాటు గోరంట్లలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలను తనిఖీ చేశామని, జిల్లాలో ఇంకా రెండు శ్రీ చైతన్య పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ తరగతులు నిర్వహిస్తున్న మాట నిజమేనని, తమ విచారణలో కూడా బయట పడిందన్నారు. వాటిలో ప్రీ–ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు లేదనే విషయం తాము గుర్తించామన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారని, క్వాలిఫైడ్ టీచర్స్తో కాకుండా ఇంటర్, డిగ్రీ చదివిన వారితో పాఠాలు చెప్పిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రకరకాల పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చేసినట్లు తమ విచారణలో బయటపడిందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆయన వెంట కదిరి ఎంఈఓ చెన్నకృష్ణ ఉన్నారు. జేసీని కలిసిన రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంతి నిలయం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు జేసీ మౌర్య భరద్వాజ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్, జిల్లా సెక్రెటరీ కళ్యాణ చక్రవర్తితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్కు వెళ్లారు. ఈ సందర్భంగా జేసీకి పుష్పగుచ్ఛం అందజేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, మహబూబ్ బాషా, యశ్వంత్, సనత్కుమార్రెడ్డి, ప్రసాద్, దివాకర్ , సోమశేఖర్ తదితరులు ఉన్నారు. వివాహిత మృతిపై కేసు నమోదు బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలోని గురువారం ఆత్మహత్య చేసుకున్న వివాహిత శ్రీలక్ష్మి మృతిపై ఆమె తండ్రి బెల్లపుకొండ శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. బీసీ కాలనీకి చెందిన ఆలకుంట శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి (20) గురువారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందిన సంగతి పాఠకులకు తెలిసిందే. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలి అనంతపురం టవర్క్లాక్: రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ కోరారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీ స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
16 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, పుట్టపర్తి: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెట్టుకోవాలన్నారు. పరీక్షలు లేనిరోజుల్లో మాత్రం ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం 7:45లోపు ఇన్–టైమ్, మధ్యాహ్నం 12:30 తర్వాత అవుట్–టైమ్ నమోదు చేయాలని డైరెక్టర్ సూచించారు. ఒంటిపూట బడులు అమలులో ఉన్న సమయంలో హాఫ్ డే క్యాజువల్ లీవ్ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఇక పదో తరగతి పరీక్షల డ్యూటీకి వెళ్లే టీచర్లు అటెండెన్స్ యాప్లో ‘పదో తరగతి డ్యూటీ’గా నమోదు చేయాలని, పరీక్షలు లేని రోజుల్లో తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు -
సైట్ ఓపెన్ కాలేదు
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి నమోదు చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాలేదు. దీంతో నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎన్నికలప్పుడు సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేశారు. నేను ఈఏడాది రూ.20 వేలు నష్ట పోయాను. వరుస నష్టాలు..పెట్టుబడికి చేతిలో డబ్బులేదు. పంటలు ఏవిధంగా సాగు చేయాలో తెలియడం లేదు. ఇప్పటికై నా నాకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తించేలా చూడాలి. – అక్కిం శంకర, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం రూ.20 వేలు ఇవ్వాలి ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు పెట్టుబడి సాయం అందజేయాలి. మొదటి ఏడాది మాకు డబ్బులు అందలేదు. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు మాత్రమే అందుతోంది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.20 వేలు ఖాతాల్లో జమ చేయాలి. ఈ ఏడాది పంటలు సరిగా పండలేదు. రైతుల ఇబ్బంది గుర్తెరగాలి. – ప్రకాష్, రైతు, తమ్మడేపల్లి, అమరాపురం మండలం. మరోసారి నమోదు చేసుకోవచ్చు అర్హత ఉండీ ఎవరికై నా అన్నదాత సుఖీభవ పథకం వర్తించకపోతే అలాంటి రైతులు మరోసారి నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. ఆయా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సైట్ ఓపెన్ కాగానే నమోదు చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ–కేవైసీ చేయని వారు, ఎన్పీసీఐకి బ్యాంకు ఖాతాను లింక్ చేయని రైతులు త్వరగా ఆ పని పూర్తి చేయాలి. – కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
విద్యుత్ అంతరాయంౖపై ఆందోళన
హిందూపురం: అప్రకటిత కరెంటు కోతలపై రైతన్నలు కన్నెర్ర చేశారు. కీలకమైన సమయంలో ఎడాపెడా విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తూ పంటలకు సాగునీరు అందకుండా చేస్తున్న విద్యుత్శాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం మణేసముద్రం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...గరిష్ట ఉష్ణోగ్రతలతో ఇప్పటికే బోర్లలోని నీటిమట్టం తగ్గుతోందని, అయినా ఎలాగోలా పంటలను కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. అయితే ఇటీవల విద్యుత్ అధికారులు ఇష్టానుసారం సరఫరా నిలిపివేస్తున్నారని, దీంతో బోర్లు ఆడక పంటలు ఎండుముఖం పట్టాయని వాపోయారు. ఇదే విషయాన్ని స్థానిక విద్యుత్ అఽధికారులకు విన్నవిస్తే... తామేం చేయలేమని, సబ్స్టేషన్ నుంచి నిలిపి వేస్తున్నారని చెబుతున్నారన్నారు. సబ్స్టేషన్కు వచ్చి తమ సమస్య చెబితే మెయిన్లైన్ నుంచి కోత వస్తోందని ఎవరికి వారు తప్పించుకుంటున్నారన్నారు. అందువల్లే రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. తమకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ ఉన్నతాధికారులు హామీ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రైతుల రాస్తారోకోతో పెనుకొండ, అనంతపురం మార్గంలో నడిచే వాహనాలు రోడ్డుపైనే భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మణేసముద్రం గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. మణేసముద్రం సబ్స్టేషన్ ఎదుట రాస్తారోకో చేసిన రైతులు -
కమనీయం.. పుష్పయాగోత్సవం
కదిరి: ఖాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పుష్పయాగోత్సవం కమనీయంగా సాగింది. పుష్పయాగోత్సవంతో పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని..సాగనంపడమే పుష్పయాగోత్సవ ఉద్దేశమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. మధ్యాహ్నం తర్వాత దర్శనం.. తీర్థవాది ఉత్సవం ముగియగానే అర్చకులు గురువారం సాయంత్రం ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కై ంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులను ఆలయంలోకి అనుమతించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. శుక్రవారం రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఈ ఉత్సవానికి ఉభయ దారులుగా విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముగిసిన ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు -
కొర్రీలు.. కోతలు
కొర్రీలు...కోతలతో ‘అన్నదాత సుఖీభవ’ అర్హులకు అందకుండా పోయింది. ఈ–కేవైసీ చేయలేదని, బ్యాంకు ఖాతాకు ఎన్ీపీసీఐకి లింక్ కాలేదని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని..ఇలా వివిధ కారణాలను సాకుగా చూపిన చంద్రబాబు సర్కార్ రైతుకు శఠగోపం పెట్టింది. గతంలో వైఎస్ జగన్ అందజేసిన రైతు భరోసాతో పోలిస్తే జిల్లాలోని సుమారు 20 వేల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ అందని పరిస్థితి నెలకొంది. వరుస కరువులతో అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాల్సిన పాలకులు పెట్టుబడి సాయానికి కోత పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టపర్తి అర్బన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘రైతు భరోసా’ పథకాన్ని కాపీ కొట్టి ‘అన్నదాత సుఖీభవ’ అంటూ పేరు మార్చిన చంద్రబాబు.. రైతుకు తోడుగా నిలవడంలో మాత్రం చిత్తశుద్ధి చూపలేకపోయారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ. 20 వేలు అందజేస్తామని హామీ ఇచ్చినా.. మొదటి ఏడాదే రైతుకు మొండి చూపారు. ఇక రెండో ఏడాదిలోనూ ‘సుఖీభవ’ మొత్తాన్ని రూ.20 వేలకు బదులు రూ.14 వేలకే కుదించారు. అదికూడా ఖాతాల్లో జమ చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా 2025 ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా ‘పీఎం కిసాన్’ ద్వారా వచ్చే రూ.2 వేలతో కలిపి రూ. 7 వేలు అందజేశారు. తిరిగి రెండో విడతలో నవంబర్ 19న మరో రూ.7 వేలు జమ చేశారు. ప్రస్తుతం మూడో విడతలో పీఎం కిసాన్తో కలిపి రూ.6 వేలు జమ చేశారు. 20 వేల మందికి అందని పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ కింద గతంలో కన్నా రైతుల సంఖ్య పెరగాల్సి ఉన్నా... రకరకాల నిబంధనల పేరుతో జాబితాలను కుదించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద 2.79 లక్షల మందికి ఏటా పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అర్హుల సంఖ్య సుమారుగా 20 వేల వరకూ తగ్గిపోయింది. జిల్లాలో హౌస్హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా ఒక కుటుంబంలో ఎంత మంది రైతులున్నా ఒకరికే ‘అన్నదాత సుఖీభవ’ పథకం వర్తింపజేస్తున్నారు. భూమి అమ్మిన రైతుకూ పథకం వర్తించడం లేదు. పోనీ భూమిని కొని కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం చేయించుకున్న రైతులకై నా వర్తించిందా అంటే అదీ లేదు. భూమి ఉన్న తల్లి లేదా తండ్రి కానీ మృతి చెందితే సదరు భూమిని రాయించుకున్న కుమారునికి గానీ, కూతురుకు గానీ అన్నదాత సుఖీభవ వర్తింపజేయడం లేదు. ఫలితంగా జిల్లాలోని 2,65,040 మంది రైతులు మాత్రమే సుఖీభవకు అర్హత సాధించారు. కౌలు రైతులకు మొండిచేయి.. వైఎస్ జగన్ హయాంలో కౌలు రైతులు, దేవదాయ శాఖ భూములు సాగుచేసుకునే రైతులకూ రైతు భరోసా లబ్ధి చేకూరింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి, ఇతరుల వద్ద భూములు కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్న వారికి మొండిచేయి చూపింది. దీంతో సుమారు 20 వేల మంది రైతులకు పథకం లబ్ధి చేకూరలేదు. ఇక పీఎం కిసాన్లోనూ వేలాది మందికి అన్యాయం జరిగింది. 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా ఎక్కిన రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయలేదు. ఫలితంగా జిల్లా నుంచి 2,46,262 మందికి మాత్రమే పీఎం కిసాన్ వర్తింపజేయగా... సుమారు 40 వేల మందికిపైగా రైతులకు ఈ పథకం వర్తించలేదని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక సిమ్ కార్డు ఇబ్బందులతో ఫోన్ నంబర్ మార్చిన రైతులకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఆర్ఎస్కే సిబ్బంది ఫోన్ చేసినప్పుడు పాస్ వర్డ్ చెప్పని రైతులకు పథకం వర్తించలేదు. ఇలా వేలాది మంది రైతులకు మొండి చేయి చూపారు. గతంలో ఠంచనుగా పెట్టుబడిసాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్–రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం ఖరీఫ్కు అనుకూలంగా జూన్, రబీకి అక్టోబర్, పంటకోతలు జరిగే సంక్రాంతికి ఇలా... మూడు విడతల్లో క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. అలాగే ఐదేళ్ల కాలంలో ప్రతి రైతుకూ రూ.67,500 ప్రకారం భరోసా కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కౌలు రైతులు, దేవదాయ, అటవీభూమి సాగుదారుల కింద 2 వేల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో రూ.13,500 ప్రకారం సాయం చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతుల గురించి పట్టించుకోకపోవడంతో వారికి పైసా కూడా సాయం అందే పరిస్థితి లేదు. కౌలు కార్డులు కూడా అందించకుండా మోసం చేయడంతో కౌలు రైతుల కష్టాలు మరింత పెరిగాయి. రైతు పరిస్థితి దయనీయం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇన్పుట్సబ్సిడీ ఊసే లేదు, ఇన్సూరెన్స్ గల్లంతైపోయింది. యంత్ర పరికరాలు లేవు. విత్తనాలు, ఎరువుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలకు ఎక్స్గ్రేషియా లేదు. మద్దతు ధరల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అటు వ్యవసాయం, ఇటు ఉద్యానం.. రెండూ సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు సర్కారు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ‘అన్నదాత దుఃఖీభవ’ తొలిఏడాది జిల్లా రైతులకు చంద్రబాబు ఎగనామం రెండో ఏడాది అమలు చేసినా కొర్రీలతో జాబితాలో కోతలు జిల్లాలో సుమారు 20 వేల మంది రైతులకు అందని పెట్టుబడి సాయం కౌలు రైతుల కష్టాలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఇన్పుట్, ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఊసే ఎత్తని వైనం -
ఘనంగా మొల్లమాంబ జయంతి
ప్రశాంతి నిలయం: ప్రముఖ కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా జేసీ మౌర్య భరద్వాజ్ మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... సామాన్య కుటుంబంలో పుట్టి మొల్లమాంబ రామాయణాన్ని రచించి కీర్తిని గడించారన్నారు. సాహితీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. ఆమె రచనలు తెలుగు భాషా సాహిత్యానికి అమూల్యమైనవన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ సూర్యనారాయణరెడ్డి, కుమ్మర సంఘం నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ‘పురం’లో రేపు మెగా జాబ్ మేళా పుట్టపర్తి టౌన్: నైపుణ్యాభివద్ధి సంస్థ, సీడాప్, సీఐఇల్ సంస్థ ఆధ్వర్యలో 15న హిందూపురం పట్టణంలో సప్తగిరి డిగ్రీ కళాశాలలో వంద జాతీయ బహుళ జాతీయ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, సిడాప్ కోఆర్డినేటర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నామని, మెగా జాబ్ మేళాకు హాజరయ్యే వారు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ డిప్లమా, డిగ్రీ, బీటెక్, పీజీ. బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు అర్హులన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ 15 వేల నుంచి రూ 50 వేల జీతం ఉంటుందన్నారు. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్కార్డ్, రెండు పాస్ ఫోటోలు తీసుకరావాలన్నారు. వివరాలకు 9966682246, 9676706976, 9398643930 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు. భౌతికశాస్త్రం పరీక్షకు 117 మంది గైర్హాజరు పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 41 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు భౌతిక శాస్త్రం పరీక్ష నిర్వహించారు. 6,513 మందికి గాను 6,396 మంది పరీక్షకు హాజరు కాగా, 117 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్న కేశవప్రసాద్ తెలిపారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అడవుల పరిరక్షణకు సిట్ బృందాలు ప్రశాంతి నిలయం: జిల్లాలోని అడవులను పరిరక్షించడానికి జిల్లా స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్) ఏర్పాటు చేసినట్లు జేసీ మౌర్యభరద్వాజ్, అటవీశాఖ జిల్లా అధికారి చక్రపాణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అడవుల పరిరక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్ బృందాలతో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో రిజర్వ్ అడవులుగా నమోదైన రెవెన్యూ భూముల గుర్తింపు, ల్యాండ్ బ్యాంక్ కోసం వ్యవసాయానికి అనువుగా లేని అడవుల మాదిరి కనిపించే భూములను గుర్తించడం తదితర వాటిపై చర్చించామన్నారు. -
వృథాను అరికట్టడానికే..
అనంతపురం టౌన్: కరెంటు కావాలంటే ఇకమీదట రీచార్జ్ చేసుకోవాల్సిందే. అవును ఇది నిజం. మొబైల్ – డీటీహెచ్కు ఎలా అయితే చేస్తారో కరెంటు కోసం కూడా అలానే రీచార్జ్ చేయాలి. విద్యుత్ వృథా ఖర్చును ఆరికట్టడం కోసమే చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానాన్ని చాలాప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తొలుతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ రీచార్జ్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రీచార్జ్ మొత్తం ఇలా... ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ప్రతి నెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లును ర్యాండమ్గా తీసుకొని నెల వారీ ఖర్చు (యూనిట్లు)ను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే వినియోగదారునికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే వినియోగదారు ఎంతమేర విద్యుత్ వినియోగించారు.. అందు కోసం పెట్టిన ఖర్చు.. మిగిలిన బ్యాలెన్స్ వివరాలు మెసేజీలో తెలియజేస్తారు. తద్వారా వినియోగంపై స్పష్టత వస్తుంది. రీచార్జ్ చేసుకోవడం ఆలస్యమైతే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లి రీచార్జ్ చేసుకుంటే నిమిషాల్లోనే విద్యుత్ పునరుద్దరిస్తారు. ఇందు కోసం స్మార్ట్ మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, తమ సిబ్బందితో మానిటరింగ్ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చకచకా స్మార్ట్ మీటర్లు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 14 వేల కార్యాలయాల్లో ఇప్పటికే 11 వేల కార్యాలయాల్లో స్మార్టు మీటర్లు ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల కార్యాలయాలకు గాను 7వేల కార్యాలయాల్లో ఇప్పటికే మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కార్యాలయాల్లో సైతం మరో 10 రోజుల్లో 100 శాతం ప్రీ పెయిడ్ స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు అనంతపురం నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని వీధి దీపాలకు సైతం స్మార్టు మీటర్లు అనుసంధానం చేయనున్నారు. ప్రీపెయిడ్ స్మార్టు విద్యుత్ మీటర్ ఇక స్మార్ట్ మీటర్ల ద్వారానే విద్యుత్ సరఫరా ఉమ్మడి జిల్లాలో 24 వేల కనెక్షన్లు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు విద్యుత్ వృథా ఖర్చు, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు కీలకంగా వ్యవహరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీధి దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతూనే ఉంటాయి. స్మార్ట్ మీటర్లకు వీధి దీపాలను అనుసంధానం చేస్తే సాయంత్రం 6 గంటల నుంచి వెలుగుతాయి. తిరిగి మరుసటిరోజు ఉదయం ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. దీంతో విద్యుత్ ఖర్చు సైతం అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది. -
ప్రజల నెత్తిన ‘బండ’ వేస్తారా?
ధర్మవరం: గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ కర్ణాటకకు వెళ్లి అక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలు చూపి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోనూ అదే రీతిలో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు తగ్గించలేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజల నెత్తిపై బండ వేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచడం సబబు కాదన్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా లేకపోవడం వల్ల హోటళ్లు, హాస్టళ్లు, పీజీలలో ఆకలి కేకలు వినిపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2008లో కేంద్రం గ్యాస్ ధరలు పెంచితే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడకుండా అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సిలిండర్పై రూ.50 చొప్పున భరించిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా రూ.1 సెస్ వేసి పెంచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు చంద్రబాబుకు నిజంగా తెలిస్తే పెంచిన గ్యాస్ ధరల భారం ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలన్నారు. 2008లో క్రూడ్ ఆయిల్ ఽబ్యారెల్ ధర 99 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ రూ.51, డీజిల్ రూ.36తో లభ్యమయ్యేదని గుర్తు చేశారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్లు ఉందని, అయినా లీటర్ పెట్రోల్ రూ.109, డీజిల్ రూ.90 ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తుల ధరల విషయం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా సరికాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కోటిరెడ్డి బాలిరెడ్డి, నీలూరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, కత్తె పెద్దన్న, కౌన్సిలర్లు బోయ రమాదేవి, కత్తె ఆదిలక్ష్మి, సబేహ, పద్మజ, సునీత తదితరులు పాల్గొన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామన్న నారా లోకేష్ హామీలు ఏమయ్యాయి? పెంచిన ధరలను ప్రభుత్వమే భరించాలి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి -
నా చావు వెనుక ఎవరి ప్రమేయమూ లేదు!
బత్తలపల్లి: ‘నా చావు వెనుక ఎవరి ప్రమేయం లేదు. కేసులు పెట్టుకోవద్దు’ అంటూ ఓ గర్భిణి ఉత్తరం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన బెల్లపుకొండ శ్రీనివాసులు కుమార్తె శ్రీలక్ష్మి(20)కి బత్తలపల్లికి చెందిన ఆలకుంట శ్రీనివాసులుతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అన్యోన్యంగానే ఉండేవారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి గర్భిణి. గురువారం వైద్య పరీక్షలకు వెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ సమయంలో భర్త శ్రీనివాసులు తన సోదరి కుమార్తెను పాఠశాలలో వదిలేందుకు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు ఎంత తట్టినా శ్రీలక్ష్మి తలుపు తీయకపోవడంతో బలవంతంగా తెరిచి లోపలకు ప్రవేశించాడు. అప్పటికే ఇంట్లో ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను గమనించి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను కిందకు దించి మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో శ్రీలక్ష్మి బంధువులు బత్తలపల్లికి చేరుకున్నారు. తమ బిడ్డను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు రిమాండ్ ఖైదీగా కడప జైలులో ఉన్నాడని, ఆయన వచ్చి ఫిర్యాదు చేసే వరకూ మృతదేహాన్ని అక్కడి నుంచి కదిలించేది లేదని భీష్మించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్, తహసీల్దార్ స్వర్ణలత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా మృతురాలు తన చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయానని, తండ్రి జైలులో ఉన్నాడని, తాను సంతోషంగా ఉండడం బంధువులకు ఇష్టం లేదని, తన మృతి వెనుక ఎవరి ప్రమేయం లేదని లేఖ రాసి పెట్టింది. కేసులు కూడా పెట్టుకోవద్దని అందులో కోరింది. ఈ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలక్ష్మి తండ్రి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఉరి వేసుకుని గర్భిణి ఆత్మహత్య నాలుగు నెలల క్రితం వివాహం అత్తింటి వారే చంపారంటూ బంధువుల ఆరోపణ -
అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తాలో ఫిర్యాదు
పెనుకొండ రూరల్: పంచాయతీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లోకాయుక్తను పెనుకొండ మండలం మావటూరు గ్రామ సర్పంచ్ నాగరాజు ఆశ్రయించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి పనుల్లో ఎక్కడేగాని రాజీ పడకుండా పూర్తి చేయించామన్నారు. ఇందుకు గాను రూ. 10 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం పంచాయతీలో రూ.7 లక్షల నిధులు ఉన్నా... అధికారులు మాత్రం బిల్లులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరంలో పదవీ కాలం ముగియనుందని, ఆ తర్వాత తన గోడు ఎవరూ పట్టించుకోరంటూ వాపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
మత్స్యకార స్కిల్ టెస్ట్లో ఘర్షణ
పెనుకొండ రూరల్: చేపల వేటకు సంబంధించి గురువారం గొల్లపల్లి జలాశయం వద్ద మత్స్యకారులకు ఏర్పాటు చేసిన స్కిల్ టెస్ట్లో ఘర్షణ చోటు చేసుకుంది. వివరాలు.. రొద్దం మండలం తురకలాపట్నం గ్రామ చెరువులో చేపల వేటకు సంబంధించి స్కిల్ టెస్ట్ను ఆ గ్రామ చెరువులో కాకుండా గొల్లపల్లి జలాశయంలో గురువారం మత్స్యశాఖ అధికారులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. గ్రామ సర్పంచ్, చెరువు ఆయకట్టు రైతులకు, గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా, దండోరా వేయించకుండా ఏకపక్షంగా స్కిల్ టెస్ట్ను మరో ప్రాంతంలో ఎలా నిర్వహిస్తారంటూ మండి పడ్డారు. టీడీపీ వర్గీయులకు వత్తాసు పలకడం సబబు కాదన్నారు. ఆ సమయంలో మరో వర్గం వారు జోక్యం చేసుకుని వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న కియా ఎస్ఐ రాజేష్, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. కాగా, తాము గ్రామంలోని మత్స్యకారులు, మండల అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చామని జిల్లా మత్స్య శాఖ అధికారి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. హాజరు కాని వారికి మరోమారు స్కిల్ టెస్టు నిర్వహిస్తామనడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తురకలాపట్నం వాసులు రొద్దం: తురకలాపట్నం చెరువులో చేపల వేట హక్కు కల్పించే విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు ఆ గ్రామస్తులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ చెరువులో కాకుండా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయంలో అధికారులు స్కిల్ టెస్ట్ ఏర్పాటు చేయడమే కాకుండా తమపై దాడికి ఉసిగొల్పారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ గ్రామ చెరువు పెద్దకోడిపల్లి సొసైటీ పరిధిలో ఉండేదని, గ్రామస్తులంతా చందాలు వేసుకుని రూ 5.50 లక్షలు పెద్దకోడిపల్లి సొసైటీకి చెల్లించి తమ చెరువు సొసైటీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. దండోరా వేయించి, తమ గ్రామ చెరువులోనే స్కిల్ టెస్ట్ ఏర్పాటు చేయించేలా అధికారులను ఆదేశించాలని కలెక్టర్కు విన్నవించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు చంద్రశేఖర్, మారుతి, పెద్ద రాజప్ప, మహేష్, వెంకటరాముడు, దేవరాజు, ఓబులేసు, ప్రకాష్, పెద్దన్న, నారాయణప్ప, వెంకటరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలను నివారించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం పుట్టపర్తి అర్బన్: సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లోనూ మాతాశిశు మరణాలు సంభవిస్తుండడం బాధాకరమని, వీటిని పూర్తి స్థాయిలో నివారించాలంటూ సంబంధిత వైద్యాధికారులకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం సూచించారు. జిల్లాలో గత ఫిబ్రవరిలో చోటు చేసుకున్న రెండు మాతృ, 9 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులతో శుకవ్రారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె సమీక్షించారు. రెండు మాతృ మరణాలపై పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రి డాక్టర్ నేహా తబ్సుమ్, 9 శిశు మరణాలపై హిందూపురంలోని జిల్లాస్పత్రి డాక్టర్ వెంకటేశ్వర్లు నివేదికలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జన్మించిన అనంతరం ఉత్పన్నమైన వివిధ రకాల రుగ్మతలతో శిశువులు మరణించడం బాధాకరమన్నారు. తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరూ తీర్చలేరని, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా కార్యకర్తలు నిరంతర పర్యవేక్షణతో మాతాశిశు మరణాల నివారణలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ నాగేంద్రనాయక్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలుఅనంతపురం టవర్క్లాక్: ఈ నెల 17న ఉమ్మడి అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నాట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతరాయంగా కంప్యూటర్లపై విధులు నిర్వర్తిస్తున్న కారణంగా జర్నలిస్టులు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న అనంతపురంలోని ప్రెస్క్లబ్లో కంటి వైద్య శిబిరాన్ని కేవలం జర్నలిస్టుల కుటుంబాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98491 52149, 73869 58666, 80745 86699,94900 62555 లో సంప్రదించాలన్నారు. హోటళ్లలో తనిఖీలుపుట్టపర్తి అర్బన్: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్ల వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులతో కలసి తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, సీఎస్డీటీ రామకృష్ణ గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డోమెస్టిక్ గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. కేంద్రీయ విద్యాలయలో ఇంటర్వ్యూలు గోరంట్ల: మండలంలోని పాలసముద్రం సమీపంలో ఉన్న నాసిన్ కేంద్రీయ విద్యాలయలో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ కోసం గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ బట్న కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల గడువు ముగిసిందని, దీంతో నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు చేపట్టి టీచర్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ప్యానెల్ సభ్యుడిగా డిప్యూటీ డీఈఓ జాన్రెడ్డెప్ప, పరిశీలకులుగా విద్యాలయ నిర్వహణ కమిటీ నామినీ చైర్మెన్ శేషు వ్యవహరించారు. వ్యక్తి దుర్మరణంఅనంతపురం సెంట్రల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన నారాయణరెడ్డి(45) కొన్నేళ్ల క్రితం పిల్లల చదువుల కోసమని అనంతపురానికి మకాం మార్చాడు. నగరంలోని కోవూరు నగర్లో నివాసముంటున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన మిత్రుడు నాగార్జునరెడ్డితో కలిసి రుద్రంపేట వైపు నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతూ 44వ జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై అదుపు తప్పి కిందపడ్డాడు. ఘటనలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పగాయాలతో నాగార్జునరెడ్డి బయటపడ్డాడు. ఘటనపై ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కసాపురంలో 19 నుంచి ఉగాది ఉత్సవాలు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి న పోస్టర్లను స్థానిక ఎమ్మెల్యే జయరాం, ఆలయ ఈఓ విజయరాజు గురువారం ఆవిష్కరించారు. 19న గ్రామోత్సవం, పంచాంగ శ్రవణం, 20న రథోత్సవం, 21న లంకాదహనం కార్యక్రమాలు ఉంటాయి. భక్తుల కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రభుత్వ అసమర్థత వల్లే కదిరి ఘటన
కదిరి టౌన్: ‘‘ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకూ ఎప్పుడూ.. ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినా... చిన్న పొరపాటు కూడా జరగలేదు. కానీ ఈ సారి చంద్రబాబు అసమర్థ పాలనలో రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం చక్రాల కింద ఆరుగురి కాళ్లు నలిగిపోయాయి. అందులో ఒకరి కాలు తీసేయాల్సి వచ్చింది. ఇది ముమ్మాటికీ పాలకుల అసమర్థతే’’ అని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. గురువారం ఆయన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ యాక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డితో కలిసి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఖాద్రీశుని రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని ముందస్తు సమాచారం ఉన్నా... సరైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కదిరి ఘటన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య, అసమర్థతకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఆలయాల అభివృద్ధి, ఆయా ఆలయాల ఔన్నత్యాన్ని కాపాడటం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం.. రద్దీకి తగ్గట్టు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందన్నారు. అందువల్లే రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట ఆలయాల్లో అపశ్రుతులు చోటుచేసుకుంటూ భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ పాపం మీదే బాబు.. ఖాద్రీశుడి రథోత్సవంలో కాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బీఎస్ మక్బూల్ అహ్మద్, వజ్ర భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. 2026లో తిరువీధులను వెడల్పు చేస్తామని చెబుతున్న టీడీపీ నేతలు... గతంలోనే వైఎస్సార్సీపీ సర్కార్ కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడితే అడ్డుకున్నారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనులు ఆపాలంటూ కోర్టులను ఆశ్రయించింది ఎవరో... ఆనాడు అభివృద్ధి పనులను అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఆనాడు టీడీపీ నేతలు విస్తరణ పనులను ఆడ్డుకోకుండా ఉండి ఉంటే నేడు ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావన్నారు. కదిరి రథోత్సవంలో చోటుచేసుకున్న ప్రమాదానికి పూర్తి బాధ్యత టీడీపీనే తీసుకోవాలన్నారు., ఇప్పటికై నా పచ్చ నేతలు స్వార్థ రాజకీయాలు మాని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. అప్పుల్లో నంబర్వన్.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం...అప్పుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలిపిందన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టు చేసి జైలుకు పంపించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే రూ.10,330 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో కేవలం రూ.2,766 కోట్లు కేటాయించారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చెన్నూర్ గంగాధర్, వైఎస్సార్ సీపీ 24వ వార్డు ఇన్చార్జ్ షామీర్ఖాన్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రథోత్సవంలో ఆరుగురు గాయపడటం బాధాకరం అభివృద్ధిని విస్మరించిన చందబ్రాబు.. అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు విలేకరుల సమావేశంలో బీఎస్ మక్బూల్ -
ఆవిర్భావం.. ఆనందోత్సాహం
సాక్షి, పుట్టపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం జిల్లా వ్యాప్తంగా పండువలా జరిగింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల, గ్రామాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తిలో ఘనంగా వేడుకలు.. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి నివాసంలో ఆయన సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. జగన్ సీఎంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి అన్నారు. హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. జగన్ను సీఎం చేసుకుందాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకుందామని మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. రాష్ట్రం బాగు పడాలంటే వైఎస్ జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. కదిరిలో వేడుకలు.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్, యాక్టివిటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణంతో పాటు కుమ్మరవాండ్లపల్లి గ్రామం, తలుపుల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మక్బూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పలు ఆలయాల ప్రతిష్ట దెబ్బ తింటోందన్నారు. ధర్మవరంలో భారీ బైక్ ర్యాలీ.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జై జగన్. నినాదాలతో ధర్మవరం పట్టణం దద్దరిల్లింది. వైఎస్సార్ సీపీ జెండా ఊరూవాడా రెపరెపలాడింది. కార్యకర్తల హృదయాంతరాల్లోంచి వచ్చిన జగన్నినాదం జిల్లా అంతా మార్మోగింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం పండుగలా సాగింది. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఎప్పుడూ ప్రజల పక్షానే పరిగి: అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె పరిగి మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్లో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగనన్నను మరోసారి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంతటి దరిద్రపు ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. జగన్ 2.0 నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్తుందన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ అబద్ధాల పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. జగనన్నను సీఎంగా చూడాలన్న ప్రజల ఆకాంక్ష మరోసారి నెరవేర్చడానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని కోరారు. పండగలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా మార్మోగిన జగన్నినాదం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచిన వైనం -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం(తీర్థవాది) గురువారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భృగుతీర్థం(కోనేరు)లో పుణ్యస్నానాలు ఆచరించారు. పక్షం రోజుల పాటు సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమై లోకం క్షేమంగా, భక్తులు సుఖ శాంతులతో ఉండేందుకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తామని అర్చక పండితులు వివరించారు. చక్రస్నానంలో భాగంగా శ్రీవారి సుదర్శన చక్రానికి భృగుతీర్థంలో స్నానం నిర్వహించే ముందు శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడికి స్నపన తిరుమంజనం గావించారు. తర్వాత పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శ కోసం భక్త జనులు పుష్కరిణి జలంతో స్నానమాచరించారు. తీర్థవాది ఉత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, పోలీసులతో పాటు పాల్గొన్న భక్తులందరూ రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో గడిపారు. చక్రస్నానంతో యజ్ఞఫలం.. ‘బ్రహ్మోత్సవాలు నిర్వహించిన వారికి.. ఇందుకు సహకరించిన వారికి ..ఉత్సవాల్లో శ్రీవారిని దర్శించుకున్న వారికి ఇలా..అందరికీ శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది’ అని అర్చక పండితులు ఈ సందర్భంగా తెలిపారు. చక్రస్నానానికి ముందు స్వామివారికి పలు రకాల పూజలు నిర్వహించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం చేశారు. ధ్వజావరోహణం.. ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానిస్తూ గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసిన అర్చకులు..శ్రీవారి చక్రస్నానం అనంతరం దాన్ని ఽఅవరోహణం చేశారు. దీన్నే కదిరి ప్రాంతంలో కంకణాలు విప్పడం అంటారు. ధ్వజావరోహణంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లైందని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు. ఆలయం మూత.. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణం నాటి నుంచి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాలలోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని గురువారం స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ శుద్ధితో పాటు సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారిని మేల్కొల్పుతారు. అలంకరణ అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అర్చక పండితులు తెలిపారు. నేడు పుష్పయాగోత్సవం.. బ్రహ్మోత్సవాల ముగింపునకు నిదర్శనంగా శుక్రవారం (నేడు) ఆలయ ప్రాంగణంలో పుష్ప యాగోత్సవం నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలతో అలంకృతుడైన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులకు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన, పుష్ప, తాంబూలాలు సమర్పించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. ధ్వజావరోహణం అనంతరం ఆలయం మూత నేటి మధ్యాహ్నం 1 గంట నుంచి శ్రీవారి దర్శనం పుష్పయాగోత్సవంతో నేడు బ్రహ్మోత్సవాలకు ముగింపు -
క్వింటా చింతపండు రూ.23,800
హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.23,800 ప్రకారం ధర పలికింది. గురువారం మార్కెట్ యార్డుకు 4,954 క్వింటాళ్ల చింతపండు రాగా, అందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.23,800, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికిందన్నారు. నేడు ఖాతాల్లోకి ‘అన్నదాత సుఖీభవ’ నిధులు పుట్టపర్తి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి రూ.6 వేలు జమ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 2,65,262 మంది రైతుల ఖాతాల్లో రూ.106.02 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుండగా, పీఎం కిసాన్ కింద 2,46,262 మంది రైతులకు రూ.49.25 కోట్లు జమ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు ● జిల్లా కోర్టు సంచలన తీర్పు కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం: బాలుడి హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించింది. కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం తిప్పనపల్లికి చెందిన గొల్ల ఈరన్న కుమారులు సన్న ఈరన్న, చిత్తప్పలకు భూమి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి. సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్దన్ (11) తన చిన్నాన్న చిత్తప్ప తోటలోకి నీరు తాగడానికి వెళ్లి అక్కడ ఒక మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ను అడ్డగించిన చిత్తప్ప, బాలుడి తాత ఈరన్న, మామ మురుకుందప్పలు ఎందుకు తోటలోకి వచ్చావని ప్రశ్నించారు. తోటలో తనకు కూడా హక్కు ఉందని విష్ణువర్ధన్ అనడంతో కోపోద్రిక్తులైన ముగ్గురూ బాలుడిని కొట్టి, తాడును అతడి మెడకు బిగించడంతో మరణించాడు. అనంతరం అక్కడే ఉన్న టార్ఫాలిన్ పట్టలో చుట్టి గడ్డివాములో దాచిపెట్టి ముగ్గురూ వెళ్లిపోయారు. 2022 సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై బాలుడి తండ్రి సన్న ఈరన్న ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ యువరాజ్ కేసు నమోదు చేయగా.. కళ్యాణదుర్గం సీఐ శ్రీనివాసులు సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసులో తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భీమారావు గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ఏ–1 గొల్ల చిత్తప్పకు రూ.25 వేలు, ఏ–2 గొల్ల ఈరన్నకు రూ.50 వేలు, ఏ–3 మురుకుందప్పకు రూ.10 వేలు జరిమానా విధించారు. జరి మానా కట్టని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
నేత్రపర్వం..శ్రీవారి అలుకోత్సవం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అలుకోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలమని, కలియుగాంతంలో తాను అశ్వ వాహనంపై వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని చాటి చెప్పడం కోసమే శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగుతారని వేద పండితులు వివరించారు. అంతకుముందు యాగశాలలో నిత్యహోమం చేశారు. అనంతరం శ్రీవారిని విశేషంగా అలంకరించి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తులు ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ కీర్తించారు. ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు బ్రహ్మోత్సవాలతో పాటు అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవానికి ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. నేడు తీర్థవాది ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తీర్థవాది ఉత్సవం గురువారం భృగుతీర్థం(కోనేరు)లో భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయం ముందున్న ప్రధాన ధ్వజ స్తంభానికి కట్టిన కంకణాలు గురువారం మధ్యాహ్నం విప్పేస్తారు. దీంతో తీర్థవాది ఉత్సవం ముగుస్తుంది. అనంతరం స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి శుక్రవారం ఉదయం నుంచి స్వామివారు ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఈఓ దంపతులు రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ బహుళ దశమి అంటే శుక్రవారం (రేపు) రాత్రి జరగనున్న పుష్పయాగోత్సవంతో ముగియనున్నాయి. -
దోపిడీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
హిందూపురం: గత ఏడాది జూలైలో హిందూపురం మండలం కిరికెరలోని వెంకటాద్రి లే అవుట్ వద్ద సిమెంట్ వ్యాపారి నిత్యానందారెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే నెలలో ధర్మవరానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ సిక్ బాజాపీరాను పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం తొమ్మిది కేసులకు సంబంధించి 201.6 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ మహేష్ వెల్లడించారు. సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు మునిప్రతాప్, మునీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రైం బృందం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నిందితులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు వివరించారు. పట్టుబడిన వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన పఠాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీఖాన్ ఉన్నారన్నారు. వీరి నుంచి 5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐలు ఆంజనేయులు, రాజగోపాలనాయుడు, అబ్దుల్కరీం పాల్గొన్నారు. 5 తులాల బంగారు నగలు స్వాధీనం -
గ్యాస్ కొరత లేకుండా చూడాలి: జేసీ
ప్రశాంతి నిలయం: జిల్లాలోని గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలులో గ్యాస్ డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... యుద్ధ సంక్షోభంతో వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా చర్యలు తీసుకుంటామన్నారు. గృహ వినియోగదారులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న వంట ఏజెన్సీలకు ఇబ్బంది కలగకూడదన్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో కొరత రానీయకుండా చూసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్లీ 25 తర్వాతే సిలిండర్ బుకింగ్ చేసుకునేలా కేంద్రం నూతన నిబంధన విధించిందన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీఎంఎస్లో ట్యాబ్ల మాయంపై ఆర్జేడీ విచారణ అమరాపురం: మండలంలోని హలుకూరు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో మూడు నెలల క్రితం 22 ట్యాబ్లు అపహరణకు గురైన అంశంపై పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ బుధవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఈఓ జాన్రెడ్డప్పతో కలిసి పాఠశాలకు వెళ్లిన ఆయన.. ట్యాబ్లు ఎలా అపహరణకు గురయ్యాయనే అంశంపై బోధన, బోధనేతర సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించారు. పలు అంశాలపై సిబ్బంది చెప్పిన వివరణను రికార్డు చేసి, నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు శామ్యూల్ తెలిపారు. అనంతరం తరగతి గదికి వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా చదువుకోవాలని సూచించారు. హత్య కేసులో నిందితుడికి రిమాండ్ హిందూపురం: దళిత యువకుడిని హతమార్చిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. హిందూపురం అప్గ్రేడ్ రూరల్ పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గోళాపురం గ్రామానికి చెందిన దళిత యువకుడు పి.ప్రసన్న కుమార్ 2022లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రసన్నకుమార్ భార్య పవిత్ర.. రిషబ్ మిట్టల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. ఈ క్రమంలో భర్తను ప్రియుడు, అతని స్నేహితులతో కలసి కర్ణాటక సరిహద్దున హత్య చేయించింది. అయితే ఈ కేసు హిందూపురానికి చెందినది కావడంతో అక్కడి పోలీసులు దర్యాప్తును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో హతుడి భార్య పవిత్ర, రిషబ్మిట్టల్, స్నేహితులు ఒరిశా మకర్, శంబులింగంను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఒడిశాకు చెందిన పపునీ మాలిక్ అలియాస్ బోణి ని బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. -
షీప్ యూనియన్ ఎన్నికలు నిర్వహించండి
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా షీప్ యూనియన్ జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వమించకపోవడం బాధాకరమని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పశుశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం జరిగిన గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడీ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యతన జరిగిన సమావేశానికి రిజిస్ట్రార్ హోదాలో జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్, పర్సన్ ఇన్చార్జ్ హోదాలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్మన్, షీప్ యూనియన్ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుడు, పలువురు సభ్యులు హాజరయ్యారు. జిల్లా కమిటీకి సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేస్తే.... జీవాల పరిరక్షణ, కాపర్ల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సొసైటీలకు ఎన్నికలు నిర్వహించామని, వివిధ కారణాలతో కొన్ని సొసైటీల్లో ఎన్నికలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తొందరలోనే జిల్లా యూనియన్ ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఎన్సీడీసీ కింద రాయితీతో అందించిన రూ.10.60 కోట్ల రుణాల్లో 350 మంది నుంచి ఇంకా రూ.4.45 కోట్ల బకాయిలు ఉన్నందున వాటిని సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అలాగే హిందూపురం, లేపాక్షి, గోరంట్ల, ముదిగుబ్బ, కదిరి, చెన్నేకొత్తపల్లి ఏరియా పశువుల ఆస్పత్రి పరిధిలో ఔషధి కేంద్రాలను షీప్ సొసైటీల ద్వారా నిర్వహించే అంశం, సొసైటీల పునరుద్ధరణ, ఆడిట్ రిపోర్టు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్ -
చిన్నారి చికిత్స కోసం విరాళాల సేకరణ
పరిగి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న లేపాక్షికి చెందిన నటరాజ్, శైలజ దంపతుల మూడేళ్ల కుమారుడు కేయాన్స్ అద్విక్కు ఆర్థిక సాయం అందించేందుకు పరిగి మండలం ఊటుకూరు యువకులు సిద్ధమయ్యారు. స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫి(ఎస్ఎంఏ) వాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలు దక్కాలంటే దాదాపు రూ.16 కోట్ల విలువైన ఏవీఎక్స్ఎస్–101 ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుందని బెంగళూరులోని ఓ కార్పొరేట్ వైద్యుల సూచించారు. దీంతో ఆ స్థాయి వైద్యం అందించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఊటుకూరు గ్రామానికి చెందిన యువకులు... ప్రజలను చైతన్య పరుస్తూ విరాళాల సేకరణ చేపట్టారు. ఓడీచెరువు విద్యార్థికి ఏడు గోల్డ్ మెడల్స్ఓడీచెరువు: మండల కేంద్రం ఓడీ చెరువుకు చెందిన పిన్ను నరసింహబాబు కుమార్తె సాయి పౌష్ణవి వైద్య విద్యలో ఏకంగా ఏడు బంగారు పతకాలు దక్కించుకుని ప్రతిభ చాటింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఆమె వైద్య విద్యను అభ్యసించింది. ఆదివారం ఆ కళాశాల స్నాతకోత్సవంలో ఆ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా ఆమె బంగారు పతకాలతో పాటు పట్టాను అందుకుంది. తన ప్రతిభతో ఓడీ చెరువు ఖ్యాతిని ఇనుమడింపజేసిన పౌష్ణవిని ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు. చైన్స్నాచర్ అరెస్ట్ బుక్కరాయసముద్రం: మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. గత నెల 14న బీకేఎస్లోని గాంధీనగర్ సమీపంలో ఓ హోటల్లో ఉన్న ముత్యాల శ్రీదేవి తలపై చైన్ స్నాచర్ ఇనుప రాడ్తో దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై బాధివతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బీకేఎస్ సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాంప్రసాద్ మంగళవారం తడకలేరు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పీఎస్కు తరలించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో చైన్ స్నాచింగ్కు పాల్పడిన విషయం బహిర్గతమైంది. యువకుడిని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన చెడిపోతుల మహేష్గా గుర్తించారు. ప్రస్తుతం అనంతపురంలోని ఓబులదేవనగర్లో నివాసముంటున్నాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడేవాడు. నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. యువకుడి ఆత్మహత్యబొమ్మనహాళ్: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో బేకరీ నిర్వహిసూత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారుడు తిరుమల (21) కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న ఇండో–అమెరికన్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో వదిలేసి ఖాళీగా ఉంటున్నాడు. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు సూచించినా తిరుమలలో మార్పు రాలేదు. ఇదే విషయంగా సోమవారం రాత్రి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో గదిలోకి తలుపు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న తిరుమలను గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వైభవంగా నిడిమామిడమ్మ దేవత ప్రతిష్ట
పుట్టపర్తి అర్బన్: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నిడిమామిడమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మంగళవారం వైభవంగా జరిగాయి. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో రూ.లక్షల వ్యయంతో ఇటీవల నూతన ఆలయాన్ని నిర్మించారు. మూడు రోజులుగా సాగుతున్న ప్రతిష్టాపన ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పూజల్లో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ రంగన్న, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, కో–ఆప్షన్ సభ్యుడు మాబూసాహెబ్, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెనికాని గంగాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి అవుటాల రమణారెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ రవినాయక్, సొసైటీ మాజీ అధ్యక్షురాలు ఉషారాణి, మాధవరెడ్డి, సర్పంచ్ బాలు, నంజిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బ్రహ్మోత్సవాలను రాజకీయ వేదికలా వాడుకోకండి’
కదిరి అర్బన్: ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను రాజకీయ వేదికలా వాడుకోవడం సబబు కాదని టీడీపీ, బీజేపీ నేతలకు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హితవు పలికారు. మంగళవారం కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవంలో తాను పాల్గొంటే హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరా తీశారన్నారు. తనకు ఫోన్ చేసి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, విష్ణువర్దన్రెడ్డి మధ్య వివాదాన్ని అడిగి తెలుసుకున్నారన్నారు. వారి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఇలా శ్రీవారి బ్రహ్మోత్సవాలను వేదికగా మార్చుకోడం తగదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని సమస్య, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన చట్టం హామీలపై మాట్లాడకుండా కేవలం కల్తీ నెయ్యిపై మాట్లాడడం సిగ్గు చేటన్నారు. కుక్కను తప్పించబోయి దంపతులకు తీవ్ర గాయాలు ● భర్త పరిస్థితి విషమం బత్తలపల్లి: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు కిందపడి గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు.. బత్తలపల్లిలోని బళ్లారి దుర్గమ్మ గుడి వెనుక భాగంలో నివాసముంటున్న సాకే నరసింహులు కుమారుడు సాకే నరేష్ తన భార్య గాయత్రితో కలిసి కదిరిలో మంగళవారం జరుగుతున్న రథోత్సవానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అక్కడ వేడుక ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణమై గుమ్మల్లకుంట బస్టాఫ్ సమీపంలోకి చేరుకోగానే ఉన్నఫళంగా రోడ్డుపైకి వచ్చిన వీధి కుక్కను తప్పించే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్నాడు. ఘటనలో రోడ్డుపై పడిన దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహకారంతో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి క్షతగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. నరేష్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, నరేష్ కియా పరిశ్రమలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్పై కేసు నమోదుఅనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్పై బెదిరింపులకు పాల్పడి ఆయన పరువుకు భంగం కలిగించిన కేసులో యూట్యూబర్ హనుమంతరెడ్డిపై అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపిన మేరకు... గత ఫిబ్రవరిలో ఆదిమూర్తినగర్లోని వ్యవసాయశాఖ డివిజన్ కార్యాలయంలో ఏడీ అల్తాఫ్ఖాన్ను యూట్యూబర్ హనుమంతరెడ్డి కలిసి డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ కథ చూస్తానని బెదిరించాడు. అలాగే తన ఫొటో వాడుకుని పరువుకు భంగం కలిగించేలా యూట్యూబ్ చాన్లో రీల్ వైరల్ చేశాడు. దీంతో తన పరువు, ప్రతిష్టతలను దెబ్బతీశాడంటూ ఫిబ్రవరి 23న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందన లేదని అనంతరం హైకోర్టును బాధితుడు ఆశ్రయించారు. దీంతో యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా హనుమంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం
రొళ్ల: విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మల్లినమడుగు పంచాయతీ పరిధిలోని రైతులు బీజీహళ్లిలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తాజాగా మంగళవారం ఎం.రాయాపురం పంచాయతీ పరిధిలోని రైతులు బీజీహళ్లిలోని సబ్స్టేషన్ను ముట్టడించారు. దాదాపు 40 రోజులుగా లో ఓల్టేజీతో పాటు విద్యుత్ కోతలతో పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేరుశనగ, మొక్కజొన్న, రాగి, వరి, మిరప, అరటి, దానిమ్మ, మల్బరీ తదితర పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. తాము అధికారంలోకి వస్తే రోరజూ 9 గంటల నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామంటూ ఎన్నికల సమయంలో టీడీపీ పెద్దలు హామీనిచ్చారని, అయితే అధికారం చేపట్టిన తర్వాత నిరంతర కోతలతో తమను దగా చేశారని మండిపడ్డారు. లోఓల్టేజీ సమస్య కారణంగా మోటార్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. సమస్యకు పరిష్కారం చూపే వరకూ అక్కడి నుంచి వైదొలిగేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా ఆందోళన కారులతో మండల విద్యుత్ శాఖ ఏఈ నిజాముద్దీన్ చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. వారం రోజుల్లోపు సమస్య పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తూ నిరసనను విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, వైస్ సర్పంచ్ సీఎం ఘట్ట రవి, వార్డు మెంబర్ వజీర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. పంటలు ఎండుతున్నాయంటూ సబ్స్టేషన్ ముట్టడి -
భక్తుల ‘బ్రహ్మ’రథం
కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది దాకా భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ● బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.25 గంటల నుంచి 8.45 గంటల మధ్య ప్రారంభించాల్సి ఉండగా ఉదయం 9.35 గంటలకు ముందుకు కదిలింది. ● గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాగా ఆలస్యంగా నడిచింది. సరిగ్గా సాయంత్రం 3.08 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది. ● ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. ● తిరు వీధుల ఆక్రమణల కారణంగా బ్రహ్మరథం లాగేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. ● రథోత్సవంలో బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి పాల్గొన కుండా హౌస్ అరెస్ట్ చేయించడంపై భక్తులు ఎమ్మెల్యే కందికుంటపై ఆగ్రహించారు. కొందరు శాపనార్థాలు పెట్టారు. అయితే, తాము అతన్ని హౌస్ అరెస్ట్ చేయలేదని పోలీసు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. ● రథం తిరువీధుల గుండా వెళ్తుంటే భక్తులు దవణం, మిరియాలు, అరటి పండ్లు రథంపైకి విసిరి స్వామి వారిని స్మరించుకున్నారు. ● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం. ● జేబు దొంగలు ఈసారి కూడా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. ఎంతో మంది భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు పోగొట్టుకొని లబోదిబోమన్నారు. ● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరి కొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు. ● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఆయన కుమారుడు వంశీకృష్ణ ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియ జేశారు. భక్తులతో గోవింద నామస్మరణలను పలికించి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చారు. ● భక్తుల కోసం పట్టణంలో ఈసారి కూడా అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ● నృసింహాలయంలో భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. ● తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి గుండుకు రూ. 200 వసూలు చేసినట్లు పలువురు ఆరోపించారు. ● తేరు శివాలయం దాటి కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా భక్తుల తోపులాటతో ఆరుగురు భక్తులు తేరు కుడివైపు ఉన్న ముందు చక్రం కింద పడ్డారు. వారిని బయటకు తీయడానికి 40 నిమిషాలు పట్టింది. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఏసీబీ సోదాలతో అలజడి
అనంతపురం క్రైం: భవన నిర్మాణాల అనుమతి అంశంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అనంతపురం నగరపాలక సంస్థలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన బృందం ఉదయం 10.30 గంటలకు చేరుకుని టౌన్ప్లానింగ్ విభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. నగరంలో అక్రమ కట్టడాలు, సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నివాస గృహాల పేరుతో కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించిన అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. టౌన్ప్లానింగ్ ఆఫీసర్ ల్యాప్టాప్, సిబ్బంది వినియోగించే కంప్యూటర్లలోని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ దరఖాస్తులు... అనుమతులు.. పెండింగ్లో ఉంచడానికి గల కారణాలు.. ప్లానింగ్ మేరకు భవనాలు నిర్మించారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఏసీబీ రాకతో జారుకున్న అధికారులు ఏసీబీ రాకతో కీలక విభాగాల అధికారులు క్షణాల వ్యవధిలో నగరపాలక సంస్థ ఆవరణం నుంచి జారుకున్నారు. రెవెన్యూ విభాగం, ఇంజినీరింగ్ విభాగం పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇదిలా ఉండగా సాయంత్రం 4 గంటల దాకా టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు అనంతరం ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీ బిల్లుల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు చాలా కాలంగా దుమారం రేపుతున్నాయి. సంబంధిత విభాగాల అధిపతులు ఈ ఆరోపణలపై కనీస విచారణ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారుల వివరాలను ఆరా తీసిన ఏసీబీ అధికారులు కొన్ని ఇంజినీరింగ్ పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ‘రెవెన్యూ’లో రాబందులు నగర పాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో రాబందులు చేరాయి. పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నాయి. ఏసీబీ అధికారుల బృందం ఓ వైపు సోదాలు చేస్తుంటే.. మరో వైపు ఆ విభాగంలోని కొంతమంది ఆర్ఓల సూచనల మేరకు కీలక రికార్డులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిసింది. వీటిలో చాలా వరకు నూతన నిర్మాణాల పన్ను విధింపు, పేరు మార్పు, గుత్తల మార్పులు, చేర్పులున్నట్లు తెలిసింది. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్లియర్ చేయకుండా లంచం కోసం చాలా కాలంగా పెండింగ్ ఉంచడం, కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎక్కడ సోదాలు చేస్తారోనని భయపడి గుత్తల వసూళ్ల పేరుతో బయటికెళ్లిపోయారు. ఫిర్యాదులపై సోదాలు.. నగరంలో అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులపై అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రికార్డుల పరిశీలన కొనసాగుతోందన్నారు. బుధవారం క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు, సెట్బ్యాక్ తనిఖీలు చేపడతామన్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు జారీ చేసే విధానంలో అవకతవకలు జరిగాయన్న అనుమానాల నేపథ్యంలో కీలక ఫైళ్లు, పత్రాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థలో నిశ్శబ్దం టౌన్ప్లానింగ్లో రికార్డులు, ఫైళ్లు స్వాధీనం ఫిర్యాదులపై నేడు క్షేత్రస్థాయిలో నిర్మాణాల పరిశీలన -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్, డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. మంగళ వారం సాయంత్రం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి జిల్లాలో 107 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా చూసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తప్పవన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పక్కాగా విద్యుత్, వైద్య సదుపాయాలు, గాలి, వెలుతురు, గదుల్లో ఫ్యాన్లు ఉండేలా చూడాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పరీక్ష మొదలైనప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా పేపర్ లీక్ అయినట్లు తెలిస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ దేవరాజ్, 107 సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చ’ పంచన చేరి.. పిచ్చి ముదిరి..
సాక్షి, పుట్టపర్తి: అతనో ఆకతాయి...పచ్చ నేతల పంచన చేరాడు. మద్యం మత్తులో పిచ్చి ముదిరి మహిళలను టార్గెట్ చేశాడు. అక్కా అంటూనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడాడు. ఆమె చెప్పు తీస్తాననే సరికి కాళ్లబేరానికొచ్చాడు. ఆ తర్వాత అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం వాగడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కూడా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్పందించారు. అతణ్ని కొన్నేళ్ల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొంటూ.. చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగుడు...వాగుడు.. పులేటిపల్లికి చెందిన బి.భాస్కర్రెడ్డి మద్యం మత్తులో పలువురు మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం పరిపాటిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. ఓ మహిళను వేధింపులకు గురి చేసే విధంగా మెసేజీలు (రాయలేని భాషలో) చేయడంతో పాటు.. ఫోన్లో మాట్లాడిన ఉదంతం వెలుగు చూసింది. భాస్కర్రెడ్డి చేష్టలను గమనించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి.. గతంలోనే అతన్ని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేయించారు. ప్రస్తుతం అతను ‘పరిటాల’ కోటరీకి అనుకూలంగా ఉంటూ.. నిత్యం మద్యం సేవిస్తూ.. వైఎస్సార్సీపీని, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ లేనిపోని అభాండాలు వేస్తూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు రాయిస్తున్నాడు. అధికారులను బెదిరించి.. తమ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. రెవెన్యూ అధికారులను బెదిరించి కొన్ని భూములు కూడా కాజేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సామాన్య ప్రజలను సైతం భాస్కర్రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పులేటిపల్లికి చెందిన భాస్కర్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని గతంలోనే పలుమార్లు వెల్లడించినట్లు చెన్నేకొత్తపల్లి మండల వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సన్నిహితుల కనుసన్నల్లో నడుస్తూ.. వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని అతనికి సూచించారు. ‘చెప్పుతో కొడతా భాస్కర్’.. ఓ మహిళతో పులేటిపల్లి భాస్కర్రెడ్డి మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో ‘ఏం భాస్కర్.. అక్కా అంటావ్.. తలకాయ తిరిగే కూతలు కూస్తావా? నీ స్మైల్ బాగుంది.. ఐ లైక్ యూ.. ఐ లవ్ యూ అని మెసేజీలు చేస్తావా? పులేటిపల్లికి వచ్చి చెప్పుతో కొడతా.. ఏం అనుకుంటున్నావో! గతంలో కూడా ఓసారి వార్నింగ్ ఇచ్చినా.. అయినా మారలేదు. నీ పెళ్లాంతోనే చెప్పుతో కొట్టిస్తా. అక్కా అంటావ్.. ఇలాంటి మెసేజీలు చేస్తావా? నీ నంబరు కూడా నా దగ్గర లేదు. కొవ్వు పట్టి చేస్తున్నావ్. ఒకట్రెండు సార్లు కాదు.. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇలా చేశావ్. కళ్లు తిరుగుతున్నాయా? బట్టలు ఊడదీసి ఊరేగిస్తా..’ అంటూ మహిళ ఘాటుగా హెచ్చరించారు. తగ్గి మాట్లాడిన భాస్కర్.. ‘అక్కా.. ఇంకోసారి మిస్టేక్ జరగదు. నేను స్థానికంగా లేను. బెంగళూరులో ఉన్నాను. ఏదో తెలియక చేసినా. నా గురించి తెలుసు కదా అక్కా. ఈసారికి వదిలెయ్ ప్లీజ్’ అంటూ బతిమాలాడు. నువ్వంటే గౌరవం అక్కా అంటూ నమ్మబలికాడు. మద్యం మత్తులో ఆకతాయి అసభ్య ప్రవర్తన అర్ధరాత్రి వే ళ మహిళలకు ఫోన్ కాల్స్ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు ‘పరిటాల’ కోవర్టుగా పులేటిపల్లి భాస్కర్రెడ్డి -
ఐరావతంపై నారసింహుడు
● ఆలయంలో పోటెత్తిన భక్త జనం కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి తెల్లటి ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్య కస్యపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలని కోరగా... స్వామి వారు వారి కోరిక మేరకు తెల్లటి ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఐరావతంపై విహరించే ఖాద్రీశుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో కాలుమోపేందుకు కూడా చోటు లేని విధంగా భక్తులతో కిక్కిరిసి పోతోంది. అంతకుముందు ఆలయ అర్చకులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేసిన అనంతరం కలశాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. స్వామివారికి నిత్య కైంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. పూజల అనంతరం తెల్లవారుజామున రథంపైకి ప్రవేశిస్తారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు రథంపైకి తీసుకొస్తారు. -
అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందే అర్జీలన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో పాల్గొన్నారు. డీఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ సూర్య నారాయణరెడ్డి, డీఆర్ఓ సువర్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 265 అర్జీలు రాగా, పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అర్జీదారుడు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలను పెండింగ్లో ఉంచకూడదన్నారు. విద్యుత్ స్తంభాలను తొలగించాలి.. కొత్తచెరువులో రోడ్డు వెడల్పు పనులు పెండింగ్ పడ్డాయని, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి ప్రమాదాలను నివారించాలని గ్రామానికి చెందిన వడ్డె పాపన్న ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయమై ఎన్నిసార్లు అర్జీలిచ్చినా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. జిల్లాకు 6,390 హెచ్పీవీ టీకాలు ప్రశాంతి నిలయం: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ముప్పు తప్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందించే హెచ్పీవీ టీకాలు జిల్లాకు 6,390 వచ్చాయని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలికలందరికీ హెచ్పీవీ టీకాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి హెచ్పీవీ టీకాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోలా బేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, ఆరోగ్యశ్రీ కోర్డినేటర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి నాగేంద్ర నాయక్, మెప్మా పీడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ● సోమవారం పరీక్షకు 135 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు మ్యాఽథ్స్ పేపర్–2బీ, ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్, బయాలజీ పరీక్ష నిర్వహించారు. జనరల్కు సంబంధించి 4,714 మందికి గాను 4,656 మంది హాజరు కాగా.. 58 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్కు సంబంధించి 737 మందికి గాను 660 మంది హాజరుకాగా, 77 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్న కేశవప్రసాద్ పేర్కొన్నారు. మొత్తమ్మీద 5,451 మందికి గాను 135 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ వెల్లడించారు. అయ్యో ‘పాప’ం ● నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి కనగానపల్లి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి సమీపంలోని నీటి తొట్టెలో పడి ప్రాణాలు పొగొట్టుకొంది. ఈ సంఘటన సోమవారం కుర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కుర్లపల్లి గ్రామానికి చెందిన హరిజన నరేష్, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. సోమవారం సాయంత్రం వేళ కుటుంబీకులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్న కూతురు అంకిత (18 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని నీటి తొట్టెలో పడిపోయింది. అరగంట తర్వాత ఇంట్లో పని ముగించుకుని బయటకు వచ్చిన చిన్నారి తల్లి... పాపకోసం చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం లేకపోగా ఇంటికి వచ్చి మరోసారి ఆవరణ అంతా పరిశీలించగా... నీటి తొట్టెలో తేలుతూ చిన్నారి అంకిత కనిపించింది. దీంతో ఆమె పాపను వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తూ దుఃఖ సాగరంలో మునిగారు. -
విద్యుత్ కోతలపై రైతన్నల ఆగ్రహం
రొళ్ల: విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు కన్నెర్ర చేశారు. ఏకంగా సబ్స్టేషన్ వద్దకే వెళ్లి ఆందోళనకు దిగారు. అప్రకటిత కోతలతో పంటలకు సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించి ఆదుకోవాలని కోరారు. నెలరోజులుగా సమస్య.. మల్లినమడుగు పంచాయతీకి బీజీహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. పంచాయతీ పరిధిలోని మల్లినమడుగు, కాల్వేపల్లి, జీరిగేపల్లి, హెచ్టీ వడ్రహట్టితో పాటు హెచ్టీ హళ్లి, హొసగొల్లహట్టి గ్రామాలకు నెలరోజులుగా త్రీఫేస్ విద్యుత్ సరిగా సరఫరా కావడం లేదు. దీంతో రబీలో సాగు చేసిన వివిధ పంటలు ఎండుతున్నాయి. దీని గురించి రైతులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం సోమవారం ఆయా గ్రామాలకు చెందిన రైతులు బీజీహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... నెల రోజులుగా కనీసం రోజుకు మూడు గంటలు కూడా త్రీఫేస్ విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. దీంతో రబీలో బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ, రాగి, మొక్కజొన్నతో పాటు వాణిజ్య పంటలైన మల్బరీ, దానిమ్మ, వక్క, అరటి తదితర పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ నిజాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. దీంతో రైతులు మల్లినమడుగు పంచాయతీకి ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయాలని, ఇందుకోసం సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా అందిస్తామని రైతులు ఏఈకి తెలిపారు. స్పందించిన ఏఈ.. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. బీజీహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన విద్యుత్ శాఖ ఏఈ హామీతో శాంతించిన వైనం -
మెరుగైన వైద్య సేవలు అందించండి
ధర్మవరం అర్బన్: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్ రమేష్నాథ్ హెచ్చరించారు. సోమవారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్ట్రేషన్ రికార్డులు, వివిధ వార్డులను పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మందులు బయటకు రాస్తున్నారా అంటూ ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలోని సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ఆమోదంతో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి, ముఖ్యమైన మందుల కొనుగోలుకు ఆ నిధులను ఉపయోగించుకోవాలని సూపరింటెండెంట్కు సూచించారు. ఆస్పత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. రోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు హెచ్చరించిన వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్ రమేష్నాథ్ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ -
చూసి తరిద్దాం
ఖాద్రీ వైభవం.. కదిరి: అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం రానేవచ్చింది. అశేష భక్త జన సందోహం మధ్య మంగళవారం (నేడు) ఉదయం 8.25 నుంచి 8.45 గంటల మధ్య శుభ మేష లగ్నమందు తేరు ప్రారంభించేందుకు ఆలయ అర్చక పండితులు శుభ ముహూర్తంగా నిర్ణయించారని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల గుండా ఉన్న భవనాలు సైతం భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లేదు. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే శ్రీవారి రథోత్సవం నాడు రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు. దేశంలోనే మూడో పెద్ద తేరు తమిళనాడు ఆండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతిపెద్ద బ్రహ్మరథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో 8 అడుగుల డయామీటర్తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రథ చక్రాలకు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పట్టణంలో అడుగడుగునా అన్నదానానికి దాతలు ముందుకొచ్చారు. భారీ బందోబస్తు.. ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, 250 మంది సివిల్ పోలీసులు, 150 మంది ఏఆర్ పోలీసులు, 120 మంది హోంగార్డులతో పాటు మరో 26 మందితో కూడిన ప్లటూన్ బలగాలను నియమించినట్లు ఆయన వెల్లడించారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. తిరువీధుల్లోకి ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.ఎక్కడెక్కడి నుంచో విచ్చేసిన జనం... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం. బ్రహ్మే రథసారథిగా మారే సందర్భం. ఉగ్రుడైన లక్ష్మీనారసింహుడు శాంతమూర్తిగా రథంపై కొలువుదీరి భక్తులకు కనిపించే కమనీయ దృశ్యం. లక్షలాదిమంది ఒకచోట చేరే ఆధ్యాత్మిక సౌరభం. అదే ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం. మంగళవారం ఉదయం సరిగ్గా 8.45 గంటలకు ప్రారంభం కానుంది. నేడే ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి బ్రహ్మ రథోత్సవం దేశంలోనే మూడవది, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రథం 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా భారీ పోలీసు బందోబస్తు.. అడుగడుగునా అన్నదానానికి ఏర్పాట్లు -
రైల్వే ఉద్యోగులకు అవార్డులు
గుంతకల్లు: రైల్వే మెకానికల్ విభాగంలో విధి నిర్వహణలో భాగంగా గత నెల మెరుగైన ప్రతిభ కనబరిచిన ముగ్గురికి మ్యాన్ ఆఫ్ ది మంత్ అవార్డులు దక్కాయి. వీరిలో వీఎస్ శివప్రకాష్ ఎస్ఎస్ఈ (తిరుపతి), యు.నారాయణ టెక్నీషియన్ –2 (ధర్మవరం), టి.నరసింహులు టెక్నీషియన్ –1 (కడప) ఉన్నారు. సోమవారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో అవార్డులను డీఆర్ఎం చంద్రశేఖర గుప్తా చేతుల మీదుగా వారు అందుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం యు.సుధాకర్, సీనియర్ డీఎంఈ మణికుమార్, డీఎస్ఓ సాయి విజయ్ పాల్గొన్నారు. -
చింతపండు @ 20 వేలు
హిందూపురం: స్థానిక మార్కెట్ యార్డులో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.20 వేలు పలికింది. సోమవారం మార్కెట్కు 5,200 క్వింటాళ్ల చింతపండు రాగా, అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టం రూ.10 వేల చొప్పున క్రయ విక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ చింతపండు క్వింటాల్ గరిష్టంగా రూ.12,500, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు ఆయన వెల్లడించారు. యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి సరైన ధరలకు విక్రయించుకోవాలని యార్డు కార్యదర్శి సూచించారు. పరిష్కార వేదికకు 63 వినతులుపుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి అనంతపురం సెంట్రల్: ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. స్థానిక రుద్రంపేట సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పిస్తాహౌస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 65 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి గాయపడడంతో స్థానికులు గుర్తించి, అదే రోజు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కోరారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ పేర్కొన్నారు. ప్రతి కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. 7, 8, 9, 10 తరగతి, ఇంటర్ రెండో సంవత్సరంలో ప్రస్తుతం ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https:// apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్లైన్ ద్వారా అందజేసే దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సంబంధిత కేజీబీవీల్లో ధ్రువపత్రాలు పరిశీలించి తరగతుల వారీగా సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అనాథ, నిరుపేద ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఓపెన్ ‘పది’ హాల్ టికెట్ల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా ఈ నెల 16 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్టికెట్లను ఏపీ ఓపెన్స్కూల్ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అనంతపురం డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అలాగే ఏఐ సెంటర్ల నుంచి కూడా పొందవచ్చన్నారు. వాట్సాప్–మనమిత్ర ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 95523 00009కు ‘ఏజీ’ అని మెసేజ్ పంపాలి. ‘చూస్ సర్వీస్’ లేదా ‘సేవను ఎంచుకోండి’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఎడ్యుకేషన్ సర్వీస్’ లేదా ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘ఏపీ ఓపెన్స్కూల్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, మార్చ్–2026 హాల్ టికెట్స్’ను ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థి ‘అడ్మిషన్ నంబరు, పుట్టినతేదీ’ నమోదు చేయాలి. అనంతరం ‘కన్ఫమ్’పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు. -
హిందూపురం బాలలు ఫుట్బాల్లో రాణిస్తున్నారు. పోటీ ఎక్కడ జరిగినా సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో మెరుస్తున్నారు. ఉన్నత లక్ష్యాలను అందుకునేందుకు కఠోర సాధన చేస్తున్నారు.
హిందూపురం టౌన్: స్థానిక హిందూపురం యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులు గెలుపునకు చిరునామాగా నిలిచారు. వరుస విజయాలను నమోదు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. తమ పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ జట్టులో దక్కించుకుని అసమాన ప్రతిభను చాటుతున్నారు. ● హ్యాట్రిక్ విజయం ఏటా ఆర్డీటీ ఆధ్వర్యంలో జరిగే రూరల్ ఫుట్బాల్ లీగ్ ట్రోఫీని హిందూపురం యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ జట్టు వరుసగా మూడు సార్లు కై వసం చేసుకుంది. ఇటీవల జరిగిన అండర్–12 బాలుర విభాగంలో పోటీల్లో యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ జట్టు ఫైనల్లో ఆత్మకూరు జట్టుపై 1–0 స్కోరుతో విజయం సాధించి, టోర్ని విజేతగా నిలిచింది. దీంతో వరుసగా మూడోసారి కూడా ట్రోఫీని దక్కించుకుని రికార్డు నెలకొల్పింది. ● జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణింపు 2022లో ప్రారంభమైన హిందూపురం యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్లో కోచ్ బీకే మహమ్మద్ సలీమ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు శిక్షణ పొందుతూ మెరికల్లా మారుతున్నారు. కోచ్ స్ఫూర్తితో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించారు. క్లబ్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ సహకారంతో కోచ్లు సలీమ్, వెంకటేష్ నేతృత్వంలో క్రీడాకారులు నిరంతర సాధనతో రాటు దేలుతున్నారు. ఇప్పటి వరకూ క్లబ్ తరఫున 16 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అలాగే 8 మంది రాష్ట్ర జట్టులో ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ స్థాయి టోర్నీల్లో ఆడారు. దూసుకుపోతున్న యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులు వరుసగా మూడు సార్లు ఆర్డీటీ రూరల్ ఫుట్బాల్ లీగ్ కై వసం -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
పెనుకొండ: వేర్వేరు ఘటనలో అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరితో పాటు ఒక అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.15.5 లక్షల విలువైన బంగారు నగలు, వెండి సామగ్రి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ సీఐ రాఘవన్ తెలిపారు. సోమవారం స్తానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి తాలూకా నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉల్లెడ మల్లేష్, నవీన్కుమార్, అనంతపురంలోని టీవీ టవర్ ప్రాంతంలో నివాసముంటున్న షికారి శివ అలియాస్ అర్జున్ ఉన్నారు. గత నెల 17న రొద్దం మండలం శేషాపురం గ్రామ ఆలయంలో హుండీ అపహరించి అందులోని 100 గ్రాముల వెండి సామగ్రి, గోరంట్ల, ధర్మవరం వన్టౌన్ పీఎస్ల పరిధిలో పలు ఇళ్లలో చొరబడి బంగారు నగలు, కనగానపల్లి, సీకేపల్లి పీఎస్ల పరిధిలో 2 ద్విచక్ర వాహనాలను అపహరించిన కేసులో కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లేష్, నవీన్కుమార్ నిందితులని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 8న వీరిద్దరూ రొద్దం మండలం పెద్దమంతూరులోని జెడ్పీహెచ్ఎస్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా ఎస్ఐ వీరాంజనేయులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారన్నారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. అలాగే సోమవారం ఉదయం పెనుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షికారీ శివని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో పెనుకొండ, సోమందేపల్లిలోని ఇళ్లలో జరిగిన చోరీ కేసుల్లో నిందితుడిగా నిర్ధారణ అయిందన్నారు. ఇతని నుంచి రూ.5.5 లక్షల విలువ చేసే రెండు బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రూ. 15.5 లక్షల విలువజేసే బంగారు నగలు, వెండి, 2 ద్విచక్ర వాహనాల స్వాధీనం -
కర్కశంగా చంపి.. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి..
● ఇల్లాలిని బలిగొన్న వివాహేతర సంబంధం ● అనాథలైన ముగ్గురు చిన్నారులు తాడిపత్రి రూరల్/పెద్దపప్పూరు: వివాహేతర సంబంధం ఓ ఇల్లాలి ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భర్తే ఆమెను చంపి, కర్కశంగా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం గద్దరగుట్టపల్లి గ్రామానికి చెందిన గంగరాజు, రంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం తాడిపత్రిలోని జయనగర్ కాలనీలో స్థిరపడ్డారు. గంగరాజు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరి కుమార్తె శ్రీలేఖకు 8 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మేడిమాకులపల్లి గ్రామానికి చెందిన సమీప బంధువులు సుంకన్న, రాములమ్మ దంపతుల కుమారుడు ఎరికల సుధాకర్తో వివాహమైంది. పెళ్లి సమయంలో 10 తులాల బంగారు నగలను కట్నంగా శ్రీలేఖ తల్లిదండ్రులు ఇచ్చారు. మేడిమాకులపల్లిలోనే కాపురముండేవారు. వీరికి కుమారులు ఏడేళ్ల వరుణ్సాయి, ఆరేళ్ల దీక్షిత్, ఐదేళ్ల రిత్విక్ ఉన్నారు. ఉపాధి కోసం భర్త దూరంగా.. రెండేళ్ల క్రితం సుధాకర్ తన భార్య వద్ద ఉన్న 8 తులాల బంగారు నగలను అమ్మి ఆ డబ్బు తీసుకుని సంపాదన పేరుతో దుబాయి వెళ్లాడు. దీంతో శ్రీలేఖ పుట్టింటికి చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి సపర్యలు చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చింది. భర్తకు దూరంగా ఉండడంతో మరో వ్యక్తితో శ్రీలేఖ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దుబాయి నుంచి వచ్చిన భర్త.. లారీ డ్రైవర్గా జీవనం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో భార్య వివాహేతర సంబంధం బయటపడడంతో పలు మార్లు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గొడవ పెరిగి తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురినీ పోలీసులు మందలించి పంపారు. అనంతరం భర్తను వదిలి వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో కలసి శ్రీలేఖ వెళ్లిపోయింది. దీంతో పోలీసుల సుధాకర్ ఆశ్రయించి వారి ద్వారా ఆమెను తిరిగి పిలుచుకుని వచ్చాడు. ఆ తర్వాత కూడా శ్రీలేఖ భర్తకు దూరంగా ఉంటూ తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న పీజీకి మకాం మార్చింది. ఫిర్యాదుకు నిరాకరణ తనతో కాపురం చేయకుండా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించుకోలేని సుధాకర్ భార్యను హతమార్చడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పీజీ వద్దకెళ్లిన సుధాకర్ మాయమాటలతో తన భార్యను పిలుచుకుని లారీలో పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని మొదటి మలుపు వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీ బిగించి హతమార్చిన అనంతరం కాలికి చున్నీ కట్టి మృతదేహాన్ని లారీలో నుంచి లాగి కిందకు పడేశాడు. కాలికి కట్టిన చున్నీతోనే రోడ్డు పక్కన ఈడ్చుకుంటూ వెళ్లి మోరీ కింద పడేసి నేరుగా పెద్దపప్పూరు పీఎస్కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, శ్రీలేఖ మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న హతురాలి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. హతమార్చిన అల్లుడు కానీ, అతని కుటుంబసభ్యులు కాని ఆస్పత్రికి వచ్చేవరకూ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వబోమని భీష్మించారు. దీంతో ఆరు గంటల పాటు పోస్టుమార్టం ఆగిపోయింది. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలు పాలు కావడంతో చిన్నారులు అనాథలయ్యారంటూ మార్చురీ వద్ద బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. చివరకు హతురాలి తల్లి రంగమ్మకు పోలీసులు నచ్చచెప్పి ఫిర్యాదు స్వీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నవ సమాజ నిర్మాణంలో మహిళలే కీలకం : డీఎంహెచ్ఓ
పుట్టపర్తి టౌన్: నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం అన్నారు. సోమవారం పుట్టపర్తిలోని జానకీరామయ్య కల్యాణమంటపంలో ఏపీఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేసి, మాట్లాడారు. మహిళలు ఆత్మవిస్వాసంతో ముందుకు సాగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు లింగా రామ్మోహన్, రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, సభ్యులు రమాదేవి, పరిమళ, అంజులాదేవి, నాగమణి, జయంతి, రామాంజనమ్మ, సుమలత, మానస, సూర్యనారాయణ, మురళీకృష్ణ, ఫిరోజ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు. మహిళా దొంగ అరెస్ట్ కదిరి టౌన్: వివాహిత మెడలోని బంగారు గొలుసు అపహరించిన కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను సోమవారం వెల్లడించారు. ఖాద్రీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ప్రజా గరుడ సేవ ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆ సమయంలో భక్తుల మధ్యలో చొరబడిన ఓ ఆగంతకురాలు... ఓ వివాహిత మెడలోని 5 తులాల బంగారు చైన్తో పాటు మంగళసూత్రాన్ని అపహరించి, తన సహచరురాలుకి పంపించింది. విషయాన్ని గమనించిన భక్తులు వెంటనే మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వీఆర్ఏకు షోకాజ్ పెనుకొండ రూరల్: మునిమడుగు గ్రామానికి చెందిన వీఆర్ఏ సుబ్బరాయుడుకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన కోడి పందెం ఆడుతున్నట్లుగా ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్ అయ్యాయి. ఇదే అంశం దినపత్రికల్లోనూ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తహసీల్దార్ కె.స్వాతి సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
యువకుడి దుర్మరణం
చిలమత్తూరు: టిప్పర్ ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటరమణమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వెంకటరమణమ్మ భర్త పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈమె పెద్ద కుమారుడు గజేంద్ర (19) హిందూపురం సప్తగిరి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పనినిమిత్తం ఆదివారం బైకుపై బయటకు వెళ్లిన గజేంద్ర స్థానిక 544ఈ జాతీయ రహదారిలో లేపాక్షి వైపు నుంచి చిలమత్తూరు వైపు బైకును తిప్పుకుంటుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. టిప్పర్ టైరు గజేంద్ర తలపై వెళ్లడంతో తల నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుమారుడు కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండడం చూసి వెంకటరమణమ్మ గుండెలవిసేలా రోదించింది. కాగా, గతంలో ఇదే చోట ఫార్చునర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. క్వారీలు ఉండటంతో నిత్యం టిప్పర్లు ఈ మార్గంలో ఎక్కువగా వెళ్తుంటాయి. డ్రైవర్లు అతివేగంతో ఇష్టారాజ్యంగా నడుపుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు, పోలీసులు టిప్పర్ వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తు న్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు.ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ● కలెక్టర్ శ్యాంప్రసాద్ పుట్టపర్తి అర్బన్: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లోని ఎస్జీ కన్వెన్షన్ కల్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ ముందడుగు వేయడం శుభపరిణామ మన్నారు. ప్రతి మహిళ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఏఎస్పీ అంకిత సురానా మాట్లాడుతూ మహిళలు, యువతులు ఆత్మరక్షణ విద్యలో ఆరితేరాలన్నారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రుణాల మెగా చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. సబ్సిడీపై 10 కుట్టుమిషన్లు, చిలమత్తూరు రైతు సేవా కేంద్రం ద్వారా ఎఫ్పీఓకు రూ.15 లక్షల విలువైన ట్రాక్టర్ను పంపిణీ చేశారు. మహిళా ఉద్యోగులు, వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్ విశా ఫెర్రర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజైన ఆదివారం రాత్రి మరోసారి గరుడారూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహునికి వాహనంగా మరోసారి పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ.. మలి గరుడసేవ అని కూడా అంటారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరు వీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం మళ్లీ రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పు దేవున్ని దర్శించుకున్నారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ఉభయదారులుగా ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ రెడ్డెప్పశెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిరి ప్రదక్షిణ... లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు ఆదివారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో కదిరి కొండ వద్దకు చేరుకొని ప్రదక్షిణ చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులు గత ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భవిష్యత్లో గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య బాగా పెరగవచ్చని ఆలయ అధికారులు చెబుతున్నారు. నేడు గజ వాహనం.. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సోమవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిస్తారు. -
మహిళలకు సీఎం చంద్రబాబు మోసం
పెనుకొండ (సోమందేపల్లి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. సోమందేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తే నేడు చంద్రబాబు మాత్రం హామీలను అటకెక్కించి ప్రజలను దారుణంగా మోసగించారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ ప్రతినెలా రూ.1,500 ఇస్తానన్న చంద్రబాబు ఆ విషయమే పట్టించుకోవడం లేదన్నారు. హామీల ప్రకారం ఇప్పటికి రూ. 97,200 కోట్లు ఆడపడుచులకు బకాయి పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ఫింఛన్ ఇస్తానని చెప్పి కుచ్చుటోపీ పెట్టారన్నారు. ‘తల్లికి వందనం’ కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని చెప్పి 20 లక్షల మందికి మొండిచేయి చూపారన్నారు. ఉచిత బస్సుతో మహిళలకు చుక్కలు చూపుతున్నారన్నారు. ఇకపై చంద్రబాబు ఎంత చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు నాగమణి, కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు డీసీ అశోక్, టౌన్ కన్వీనర్ గోవిందమ్మ గారి శ్రీనివాసులు, ఉప సర్పంచ్ వేణు, గట్టా మంజునాథ్, ఏ. నరసింహమూర్తి, ట్రాక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.కోట్లలో బకాయి పడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండిపాటు -
‘మాకు కుదరదు.. మీరే పూడ్చేయండి’
హిందూపురం: కంటికి రెప్పలా కూతుళ్లను కాపాడుకున్న ఆ తండ్రి చివరికి ఎవరూ లేని అనాథలా కాలగతిలో కలసిపోయాడు. అందరూ ఉన్నా కూడా చివరికి అనాథలా అందరి నుంచి అందనంత దూరానికి వెళ్లిపోయాడు. తమ మతం కాదు, కులం కాదు.. అయినా మానవత్వమే తమ మతమంటూ ముందుకు వచ్చిన కొందరు ఆ వృద్ధుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. హిందూపురంలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. వివరాలు.. స్థానిక సేవామందిరం వద్ద ఉన్న ప్రశాంతి మందిరం వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా జీవనం గడుపుతున్న అనంతపురానికి చెందిన ఆర్టీసీ విశ్రాంత డ్రైవర్ బలిజ పెద్ద సిద్ధన్న ఆదివారం మృతి చెందాడు. ప్రశాంతి మందిరం సేవకులు ఫోన్ ద్వారా ఆయన ఇద్దరు కుమార్తెలకు సమాచారం చేరవేయగా.. ‘మాకు వచ్చేందుకు కుదరదు, మీరే పూడ్చేయండి’ అంటూ వారు కుండబద్దలు కొట్టారు. దీంతో మందిరం నిర్వాహకురాలు సిస్టర్ వల్సల్ హిందూపురంలోని టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆయన మానవతా రక్తదాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్, ఉబెదుల్లా హుసేన్ సహకారంతో హిందూ సంప్రదాయాల ప్రకారం సిద్ధన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉమర్ ఫారూఖ్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. కులమతాలకతీతంగా ఒకరినొకరు గౌరవించుకోవాలని కోరారు.


