breaking news
Sri Sathya Sai District News
-
పంచాయతీ బోరు.. పంటకు నీరు!
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రకృతి వనరులన్నీ దోచేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గ్రామంలో తాగునీటి అవసరాల కోసం వేసిన బోరునీటిని తన పొలానికి మళ్లించుకుంటూ దర్జాగా జొన్న, వరి, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకుంటున్నాడు. దీంతో బోరులో నీటిమట్టం తగ్గిపోగా తాగునీటి అవసరాలకు పి.కొత్తపల్లి వాసులంతా సమీపంలో ఉన్న పేరూరు గ్రామానికి వెళ్తున్నారు. ప్రజలు కి.మీ దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నా... ‘తెలుగు తమ్ముడు’ మాత్రం తనకేం పట్టనట్లు పంటకు నీరు పారించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని పంచాయతీ బోరునీటిని గ్రామస్తులు తాగునీటి అవసరాలకే ఉపయోగపడేలా చూడాలని పి.కొత్తపల్లివాసులు కోరుతున్నారు. పి.కొత్తపల్లిలో కొన్నినెలలుగా ‘తమ్ముడి’ దందా తాగునీరులేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు -
తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు
పుట్టపర్తి టౌన్: ‘‘వార్డుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నాం. వీధిలైట్లు, తాగునీరు, రోడ్లు అన్నీ సమస్యే. ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఈ సమస్యలపై పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా ఉపయోగం లేదు. సమస్యలు పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకు నిర్వహించాలి. టీ తాగి... స్నాక్స్ తిని వెళ్లేందుకా’’ అంటూ టీడీపీ కౌన్సిలర్లే ఏడాది కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో చైర్మన్ తుంగా ఓబుళపతి ఆధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కమిషనర్ క్రాంతికుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు నాగమణి (12వ వార్డు), రమణమ్మ (10వ వార్డు) మాట్లాడుతూ..పుట్టపర్తి అభివృద్ధి గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి ఉన్నా..తాము అధికార పార్టీ కౌన్సిలర్లమే అయినా వార్డుల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, పారిశుధ్యంలోపించడంతో వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్లే ఎదురుదాడి చేయడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే సింధూరారెడ్డి, కమిషనర్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అనంతరం తేరుకున్న ఎమ్మెల్యే... సమష్టి కృషితో పుట్టపర్తిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలతో పుట్టపర్తికి నూతన శోభ తీసుకురావాలన్నారు. వీధిలైట్లు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పన్నులు వసూలు చేస్తేనే అభివృద్ధి.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే పాలకసభ్యుల సహకారం తీసుకుని ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ... ఆస్తి, నీటి... ఇతర పన్నులు దాదాపు రూ.12 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామని, కౌన్సిలర్లు కూడా చొరవ తీసుకుంటే వసూళ్లు పెరుగుతాయన్నారు. పట్టణాభివృద్ధికి దాతలు కూడా ముందుకు రావాలని కోరారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ జరపకుండానే వాటికి ఆమోదం తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్లు శ్రీలక్ష్మి, తిప్పన్నతోపాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రొటోకాల్ కూడా పాటించరా? 5వ వార్డు కౌన్సిలర్ సూర్యాగౌడ్ మాట్లాడుతూ... అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో కనీసం ఆ వార్డు కౌన్సిలర్కు కూడా సమాచారం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించకుండా భూమి పూజ ఎలా చేస్తారని నిలదీశారు. ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నామని నాలుగురోజుల కిందటే నోటీసులిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 వార్డు కౌన్సిలర్ చెరువు భాస్కర్రెడ్డి మాట్లాడుతూ... వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు మూలన పడిన కాంప్యాక్టర్లు, ఎలక్ట్రికల్ బ్యాటరీలు మరమ్మతులు చేయించాలన్నారు. రోడ్లు అధ్వానంగా మారాయని, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఏడాదిలో మనం చేసిన అభివృద్ధి ఇదేనా..? జనం ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల ఆవేదన ప్రజల నుంచి పన్ను వసూళ్లకు గట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశం -
హెచ్ఎన్ఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో హెచ్ఎన్ఎస్ఎస్ పనులపై సమీక్షించారు. జిల్లా పరిధిలోని పనులను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని, అధికారులు పనులు నిత్యం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు. టన్నెల్ మట్టి పనులు నెలాఖరులోగా పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్కు తెలిపారు. లైనింగ్, టన్నెల్తో పాటు బెడ్ వర్క్ పనులన్నీ ఆగస్టు 20వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ రాజా స్వరూప్కుమార్, ఈఈలు మురళి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శెట్టి, హెచ్ఎన్ఎస్ఎస్ భూసేకరణ విభాగం అధికారి ఇంతియాజ్, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఇందులో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీ–4, పీజీఆర్ఎస్, వసతి గృహాల తనిఖీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పీ–4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల పునఃపరిశీలనకు నిర్వహించే గ్రామ సభల గురించి ఆయా గ్రామాల్లో ముందుగానే ప్రచారం చేసి ప్రజలంతా పాల్గొనేలా చూడాలన్నారు. ‘స్వర్ణాంధ్ర విజన్’లో భాగంగా అధికారులంతా ఆయా మండలాల పరిధిలోని వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో నీరు, భోజన వసతిపై నివేదిక పంపాలన్నారు. స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి తప్పుల్లేని స్వచ్ఛ ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. శుక్రవారం ఆయన డీఆర్ఓ విజయసారథితో కలసి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఉన్న మృతులు, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, డబుల్ ఎంట్రీల తొలగింపునకు సహకరించాలని కోరారు. అలాగే మార్పులు, చేర్పుల కోసం 1,576 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరిని సమన్వయం చేసుకుని మార్పులు, చేర్పులుంటే చేసుకోవాలని సూచించారు. 1 జనవరి 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. సమావేశంలో రవినాయక్ (వైఎస్సార్ సీపీ), సతీష్కుమార్ (బీజేపీ), సామకోటి ఆదినారాయణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు భారీ వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు శనివారం భారీ వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. తర్వాత నాలుగు రోజులు కూడా వర్ష సూచన ఉందని తెలిపారు. 20న 14 మి.మీ, 21న 10 మి.మీ, 22న 15 మి.మీ, 23న 12 మి.మీ. చొప్పున వర్షం కురిసే సూచన ఉన్నట్లు వెల్లడించారు. సునీతమ్మా.. నోరు అదుపులో పెట్టుకో ● దద్దమ్మ ఎవరో ప్రజలందరికీ తెలుసు ● వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్ రెడ్డి సాక్షి, పుట్టపర్తి: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నోరు అదుపులో పెట్టుకోవాలని.. దద్దమ్మలు ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు బహిష్కరించారన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎంపీపీ ఎన్నికకు వస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నా.. పోలీసులు చేష్టలుడిగి చూశారన్నారు. గతంలో (2017) కనగానపల్లిలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ.. పరిటాల సునీత మంత్రి హోదాలో సమావేశానికి హాజరై వైఎస్సార్ సీపీ సభ్యులతో బలవంతంగా చేతులు ఎత్తించి సరిపూటి గీతను ఎంపీపీ చేసిన సంగతిని గుర్తు చేశారు. బలం లేకున్నా.. అధికార దాహంతో దౌర్జన్యాలకు పాల్పడుతూ.. బెదిరింపులకు దిగుతూ ఎన్నికల కోసం తహతహలాడుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి సర్కారు తీరు.. పోలీసుల వైఖరికి నిరసనగానే ఎన్నికలు బహిష్కరించినట్లు వివరించారు. జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తే.. హాజరై ఎంపీపీ సీటు కై వసం చేసుకుంటామన్నారు. ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు గుడిబండ: పొలం నుంచి ఇంటికి వస్తున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా... రైతు తీవ్రంగా గాయ పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం గుడిబండ మండల పరిధిలోని ఎస్.రాయాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన భూతరాజు తన పొలంలో వేరుశనగ సాగు చేశాడు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు గురువారం రాత్రి పొలానికి కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వస్తుండగా..మార్గమధ్యంలో హఠాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భూతరాజును కుటుంబ సభ్యులు గుడిబండ పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 430 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం మడకశిర: విజిలెన్స్ అధికారులు శుక్రవారం మడకశిరలోని పలు దుకాణాల్లో దాడులు చేశారు. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న లారీని తనిఖీ చేయగా... 430 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీంతో లారీతో పాటు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ జమాల్బాషా తెలిపారు. -
లేపాక్షిలో కేంద్ర బృందం పర్యటన
లేపాక్షి: స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్–2025లో భాగంగా కేంద్ర బృందం సభ్యులు రామాంజనేయులు, అనంత్ గురువారం లేపాక్షిలో పర్యటించారు. మురుగునీటి కాలువలు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. చెత్తను బయట వేయరాదని, ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛమైన నీరు సేవించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టపగలే రెండిళ్లలో చోరీ మడకశిర: స్థానిక పావగడ రోడ్డులోని రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ జరిగింది. ఆర్టీసీ బస్డాండ్ సమీపంలో నివాసముంటున్న కొలిమి నాగేంద్ర గురువారం ఉదయం 11గంటల సమయంలో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పనిపై బ్యాంకుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చే లోపు తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.70 వేల నగదు, జత బంగారు కమ్మలు, ఓ ఉంగరం అపహరించినట్లుగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ● నాగేంద్ర ఇంటి పక్కనే మేడపై నివాసముంటున్న శకుంతల ఇంట్లోనూ చోరీ జరిగింది. పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న ఆమె గురువారం ఉదయం 7 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు వస్తువులను చెల్లాచెదురు చేసి బంగారు నగలు అపహరించారు. కాగా, ఇంటి యజమానురాలు వచ్చి ఎంత మేర సొత్తు చోరీ అయింది నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే నాగేంద్ర ఫిర్యాదు స్వీకరించామని, శకుంతల వచ్చిన తర్వాత ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని సీఐ నగేష్బాబు తెలిపారు. క్లూస్టీంను రంగంలో దించి దొంగల వేలి ముద్రలను సేకరించినట్లు తెలిపారు. వేధింపులపై యువతి ఫిర్యాదు ధర్మవరం రూరల్: తనను ధర్మవరం మండలం తుంపర్తి గ్రామానికి చెందిన ప్రణవ్ అనే యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. వివరాలు.. ధర్మవరం పట్టణంలోని శివానగర్కు చెందిన ఓ యువతి బీటెక్ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు హైదరాబాద్లోని కోచింగ్ తీసుకుంటోంది. అక్కడే తన స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రణవ్ పరిచయమయ్యాడు. అనంతరం తరచూ పోన్ చేస్తుండేవాడు. ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకూ వెళుతుండేవాడు. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతూ అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పినా వినకుండా వెంటపడేవాడు. వారం రోజుల క్రితం యువతి హైదరాబాద్ నుంచి ధర్మవరానికి చేరుకుంది. అయిన ప్రణవ్ వదలకుండా ఇతరుల ఫోన్ నుంచి కాల్స్ చేయడంతో పాటు అసభ్యంగా మెసేజ్లు పెడుతూ వచ్చాడు. తాను చెప్పినట్లుగా నడుచుకోకపోతే హతమారుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపి వారి సమక్షంలో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. -
దిక్కు లేకుండా పోయింది
మా ఊరి పంచాయతీ స్థలంలో చాలా ఏళ్ల క్రితం పశువుల కోసం తాగునీటి తొట్టె నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తొట్టెను తొలగించి.. పక్కనే నివాసం ఉంటున్న నరసింహులు ఆక్రమించి తన స్వప్రయోజనాలకు వినియోగించేందుకు రూమ్ నిర్మించాడు. మొదట్లోనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాం. ఎంపీడీఓ వచ్చి బాత్రూమ్ కట్టడాలను అడ్డుకుని తిరిగి తాగునీటి తొట్టె నిర్మిస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీ బడానేతల అండతో అధికారులను గ్రామంలోకి రానీవ్వకుండా చేసి నిర్మాణం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉంది. – బయపురెడ్డి, గుంతపల్లి, కనగానపల్లి మండలం -
కర్నూలులో హాస్పిటల్పై పామిడి వాసుల దాడి
కర్నూలు(హాస్పిటల్): జ్వరం కారణంగా చికిత్సకు వచ్చి యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు గురువారం కర్నూలులోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై దాడి చేసి గాజు కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. వంద మందికి పైగా నిర్వహించిన ఈ దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... అనంతపురం జిల్లా పామిడికి చెందిన అనిత(21)కు కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ పోలీస్ కాలనీకి చెందిన ప్లాట్ల రమణ కుమారుడు నాగేంద్రతో ఏడాది క్రితం వివాహమైంది. తండ్రితో కలిసి నాగేంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనితకు ఈ నెల 15న జ్వరం రావడంతో సమీపంలో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి క్యాజువాలిటీలో ఆమెకు అవసరమైన చికిత్సను అందించి సాయంత్రం ఇంటికి పంపించారు. మరుసటి రోజు బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా, గురువారం ఉదయం పామిడి నుంచి వచ్చిన అనిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో శ్రీచక్ర హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అనితకు సకాలంలో వైద్యం అందించలేదని, మెరుగైన వైద్యం అందించి ఉంటే బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో ఆస్పత్రిపై రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. బయట ఉన్న మెడికల్షాపు అద్దాన్ని, గాజు తలుపును ధ్వంసం చేశారు. ఆస్పత్రిలోకి చొరబడి కనిపించిన ప్రతి వస్తువునూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ కియోస్క్, కిటికీలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామయ్య యాదవ్, నాగరాజురావు, శేషయ్య, విక్రమసింహ, తబ్రేజ్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిత మృతితో సంబంధం లేదు.. అనిత మృతికి ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని శ్రీచక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిత అనే యువతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వచ్చిందన్నారు. క్యాజువాలిటీలోనే సాయంత్రం వరకు ఆమెకు అవసరమైన మందులు ఇచ్చి, ఫ్లూయిడ్స్ పెట్టామన్నారు. ఆమె కోలుకోవడంతో ఇంటికి వెళ్తానంటే పంపించామన్నారు. మరుసటి రోజు రాత్రి అత్యవసర పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెను క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెంది ఉందన్నారు. ఆమె మృతికి, ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని, అయినా ఆస్పత్రిపై దాడి చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, డాక్టర్ బాలమద్దయ్య, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. యువతి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన ఆస్పత్రి అద్దాల ధ్వంసం -
‘తమ్ముడి’ దౌర్జన్యం
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు గ్రామాల్లో అమాయకుల భూములతో పాటు ప్రభుత్వ భూములు, పంచాయతీ స్థలాలను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో ‘తెలుగు తమ్ముళ్లు’ గ్రామ స్థాయి నుంచి అరాచకాలకు తెగబడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామస్తులు తిరగబడితే.. కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజలు మౌనంగానే భరిస్తున్నారు. పశువుల కోసం కేటాయించిన స్థలం కబ్జా.. కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం పశువుల తాగునీటి కోసమని కొంత స్థలాన్ని పంచాయతీ కేటాయించి, నీటి తొట్టెను ఏర్పాటు చేసింది. ఆ స్థలంపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత నరసింహులు... తొట్టెను ధ్వంసం చేసి బాత్రూమ్ను నిర్మించాడు. ఆరంభంలోనే గుర్తించిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎంపీడీఓ గ్రామ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ సమస్య వివరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదికలోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఈ మూడు నెలల వ్యవధిలోనే తొట్టె మాయమై బాత్రూమ్ వెలసింది. అడ్డుకునే వారు కరువు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నా అడిగే వారు ఎవరూ లేకుండా పోయారు. అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గ్రామస్తులు ఎవరయినా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అధికారంలో ఉన్నామని.. కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు, మూడు సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారని గ్రామానికి చెందిన కొందరు వాపోయారు. తాగునీటి తొట్టె సంగతిని ఎవరూ పట్టించుకోకపోతే భవిష్యత్తులో గ్రామంలోని మిగులు పంచాయతీ స్థలాలను కబ్జా చేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరంభంలోనే ఇలాంటి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుంతపల్లిలో పశువుల స్థలం కబ్జా నీటి తొట్టెను ధ్వంసం చేసి బాత్రూం నిర్మాణం గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు -
చోరీలపై అప్రమత్తంగా ఉండండి : డీఎస్పీ
కదిరి అర్బన్: చోరీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి సూచించారు. పట్టణ పోలీస్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావనితో కలసి ఆయన మాట్లాడారు. జిల్లాలో మధ్యప్రదేశ్ చెందిన చెడ్డీ, పార్థీ, బిళ్లూ గ్యాంగ్లతో పాటు నంద్యాలకు చెందిన చెంచు జాతి దొంగల సంచారం ఎక్కువగా ఉందన్నారు. ఈ ముఠాలు జిల్లాలోని పుట్టపర్తి, గాండ్లపెంట, ధర్మవరం, రాప్తాడు, తిరుపతి, కర్ణాటకలోని గౌరీబిదనూర్లో చోరీలకు పాల్పడ్డాయన్నారు. వీరు రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య విశాలమైన పెద్ద ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారన్నారు. కదిరిలోని ఎన్జీఓ కాలనీ, వాణి స్ట్రీట్, మగ్గాల క్వార్టర్స్, సైదాపురం, వైఎస్సార్ నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీలను అరికట్టేందుకు రాత్రి గస్తీలు ముమ్మరం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు కూడా ఇందుకు సహకరించాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తుల సంచారం ఉంటే డయల్ 100, టౌన్ సీఐ 94407 96851 కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పెట్రోలింగ్ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మూడు ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. -
నేడు రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక వర్గం ఎన్నికలు
గుంతకల్లు: స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలి ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీనియర్ డీపీఓ కోర్డినేషన్ హెచ్ఎల్ఎన్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలికి నిర్వహించే ఈ ఎన్నికల్లో కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు ఆరుగురు సభ్యులను రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోనున్నారు. గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్లో మొత్తం 943 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు రైల్వే ఇన్స్టిట్యూట్ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మజ్దూరు యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ మధ్యనే ఉంది. మజ్దూర్ యూనియన్ తరఫున కార్యదర్శిగా కె.యల్లప్ప, సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్కుమార్, కోశాధికారిగా ఎస్.సతానియల్తోపాటు ఆరుగురు కమిటీ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఎంప్లాయీస్ సంఘ్ తరపున కార్యదర్శిగా మల్లికార్జున, సంయుక్త కార్యదర్శిగా షెక్షావలి, కోశాధికారిగా నాగరాజుతోపాటు ఆరుగురు కమిటీ సభ్యులుగా బరిలో నిలిచారు. కాగా డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ హవా కొనసాగింది. పాకాల రైల్వే ఇన్స్టిట్యూట్లో యూనియన్ 6 పోస్టులు, సంఘ్ 3 పోస్టులు కై వసం చేసుకుంది. ఇక రేణిగుంట, నందలూరు, కడప ఇన్స్టిట్యూట్ పాలక మండళ్లను మజ్దూర్ యూనియన్ ఏకగ్రీవంగా కై వసం చేసుకుంది. గుత్తి రైల్వేఇన్స్టిట్యూట్లో క్లీన్ స్వీప్ చేసింది. -
బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు టౌన్: స్థానిక హనుమేష్నగర్ ఎల్ఐసీ కార్యాలయం గురువారం రాత్రి చైన్స్నాచింగ్ జరిగింది. తన సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న మల్లీశ్వరి అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. మల్లీశ్వరి కర్నూలు జిల్లా మద్దికెర సుబ్రమణ్యస్వామి ఆలయంలో పనిచేస్తోంది. పనిపై తన ఇంటి నుంచి పక్క వీధిలో ఉంటున్న తన అక్క సులోచన ఇంటికి గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఈ ఘటనతో ఆమె మెడపై గాయమైంది. గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను విచారించారు. చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గుంతకల్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. -
ఎరువుల దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
బత్తలపల్లి: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. పుంగనూరు ఏడీఏ శివకుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.శివన్న, వ్యవసాయాధికారి ప్రసాద్, బత్తలపల్లి ఏఓ ఓబిరెడ్డి పాల్గొన్నారు. పలు రికార్డులు, నిల్వలు పరిశీలించారు. నిల్వల్లో వ్యత్యాసమున్న రూ.3.05 లక్షల విలువైన 15.105 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల విక్రయాలకు సంబంధించి ప్రతి రైతుకూ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా, విజిలెన్స్ తనిఖీలతో అప్రమత్తమైన పలువురు తమ దుకాణాలకు తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తి దుర్మరణం గోరంట్ల (సోమందేపల్లి): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం గుంతపల్లికి చెందిన నరసింహారెడ్డి గురువారం సొంత పనిపై గోరంట్లకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన గుంతపల్లి సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనం నిలపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న గోరంట్ల పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
వ్యాధుల నియంత్రణలో పురోగతి
హిందూపురం: సీజనల్, అంటువ్యాధుల నియంత్రణలో వంద శాతం పురోగతి సాధించినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై పెనుకొండ డివిజన్లోని పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యులతో గురువారం ఆమె సమీక్షించారు. పీహెచ్సిలోని వైద్య సదుపాయలు, రోగులకు అందించిన సేవలు, పిల్లల ఆరోగ్య పరిస్థితి, రెగ్యులర్ హాస్టల్ విజిట్స్పై ఆరా తీశారు. ప్రమాదకరమైన వ్యాధులు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లయితే హయ్యర్ సెంటర్స్కు రెఫర్ చేయాలని సూచించారు. ఆంధ్రా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్కు ఆరుగురి ఎంపిక అనంతపురం: ఆంధ్రా అండర్–23 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక గురువారం ముగిసింది. అనంతపురానికి చెందిన ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో మచ్చా కె.దత్తారెడ్డి, పి.అర్జున్ టెండూల్కర్, జి.మల్లికార్జున, ఎస్.మహమ్మద్ కమిల్, టి. హేంద్ర రెడ్డి, ఎం.దీపక్ ఉన్నారు. మచ్చా దత్తారెడ్డి కుడిచేతి ఓపెనర్గా, వికెట్ కీపర్గా రాణిస్తున్నాడు. ఆంధ్ర అండర్ 23 రంజీ టోర్నీలో ప్రతిభ చాటాడు. అలాగే కుడిచేతి ఓపెనర్గా, ఆఫ్ స్పిన్నర్గా రాణిస్తున్న పి.అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే ఆంధ్ర అండర్ 23, 19 జట్లలో ప్రాతినిథ్యం వహించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన మల్లికార్జునకు అంతర జిల్లా మ్యాచ్ల్లో పది వికెట్లు తీసిన రికార్డు ఉంది. అలాగే ఎడమ చేతి మీడియ పేస్ బౌలర్ దీపక్ సైతం అంతర్ జిల్లా మ్యాచ్లో 11 వికెట్లు సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కమిల్ ఎడమ చేతి స్పిన్నర్. ఎడమ చేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆల్రౌండ్ ప్రతిభ కనబరుస్తున్నాడు. మహేంద్ర రెడ్డి కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అండర్–19, అండర్–23 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, మరో అర్ధసెంచరీ సాధించాడు. -
సాగు కృష్ణార్పణం
265 ఎంబీసీ పరిధిలోని చెరువుల సంఖ్యమడకశిర: జిల్లాలోని హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీనీవా సుజల స్రవంతి) మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలోని రైతులకు కృష్ణా జలాలు అందక గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలను అందించకపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలో పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 265 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కృష్ణా జలాలతో నింపి సాగునీరు అందించాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని రైతులు మండిపడుతున్నారు. తూతూ మంత్రంగా కృష్ణా జలాలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. మడకశిర నియోజకవర్గంలో మొత్తం 165 చెరువులున్నాయి. అందులో కేవలం 23 చెరువులకు మాత్రమే కృష్ణా జలాలను విడుదల చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో 19 చెరువులకు, హిందూపురం నియోజకవర్గంలో 4 చెరువులకు మాత్రమే కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను విడుదల చేసింది. మూడు నియోజకవర్గాల్లోని 219 చెరువులకు కృష్ణా జలాలు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతమెంతో ఘనం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మడకశిరకు క్రమంప్పకుండా కృష్ణా జలాలు వచ్చాయి. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మడకశిర మండలంలో కృష్ణా జలాలు పారాయి. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మడకశిరకు కృష్ణా జలాలు రావడం విశేషం. అలాగే మడకశిర చెరువును రెండుసార్లు నింపిన ఘనత కూడా వైఎస్ జగన్కే దక్కుతుంది. అయితే కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. మొదటి ఏడాది కూడా కృష్ణా జలాలు రాలేదు. ప్రస్తుత ఏడాది కూడా కృష్ణా జలాలను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అటకెక్కిన బైపాస్ కెనాల్.. మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలను అందించడానికి వీలుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకు కోసం రూ.214.85 కోట్ల నిధులను కూడా మంజూరు చేసి టెండర్లను కూడా పూర్తి చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కెనాల్ పనులను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తోంది. బైపాస్ కెనాల్ను అటకెక్కించారని రైతులు మండిపడుతున్నారు. హడావుడికే పరిమితమైన నేతలు.. మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చేశాయంటూ ప్రారంభంలో కూటమి నేతలు హడావుడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక అడుగు ముందుకేసి కూటమి నేతలను వెంటేసుకుని హంద్రీనీవా కాలువలను పరిశీలించారు. మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కృష్ణా జలాలతో చెరువులను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా కృష్ణా జలాలు రాకపోవడంతో రైతులు కూటమి నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెరువులన్నీ నింపేందుకు అవసరమైన నీరు5టీఎంసీలుకృష్ణా జలాలు అందని చెరువులుమడకశిర నియోజకవర్గంలో కృష్ణా జలాలు అందని చెరువులు ఎంబీసీ పరిధిలోని 265 చెరువులకు కృష్ణాజలాలు విడుదల చేస్తామని మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గొప్పలు కంటితుడుపుగా కేవలం 46 చెరువులకే నీళ్లు సాగునీరు లేక అందక రైతుల గగ్గోలు వైఎస్ జగన్ హయాంలో వరుసగా మూడేళ్లు కృష్ణా జలాలు 219142ఇది అగళి మండలంలోని కోడిపల్లి చెరువు. వర్షాకాలంలోనూ నీరులేక ఇలా వెలవెలబోతోంది. ఈ చెరువుపై ఆధారపడి దాదాపు 180 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. సరైన వర్షాలు రాకపోవడంతో ఈచెరువులోకి ఇంత వరకు నీరు చేరలేదు. దీంతో రైతులు కృష్ణాజలాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ చెరువుకే గాక అగళి మండలంలోని మిగిలిన చెరువులకు కూడా కృష్ణా జలాలు రావాలంటే హంద్రీనీవా అగళి మైనర్ కాలువను పూర్తి చేయాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇంత వరకు కాలువను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది అగళి మండలంలోని హంద్రీనీవా మైనర్ కాలువ. ప్రస్తుతం ఈ కాలువ నిరుపయోగంగా మారింది. కృష్ణా జలాలు పారక పోవడంతో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. అమరాపురం, అగళి మైనర్ కాలువ పనులను పూర్తి చేయడానికి వైఎస్ జగన్ హయాంలో రూ.69.90 కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. అంతలోనే ప్రభుత్వం మారడంతో ఈ కాలువల పనులకు నిధులు విడుదల ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం పనులను చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. పంటలు సాగుకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. -
20న ఫుట్బాల్ జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా ఫుట్బాల్ సీనియర్ సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్కుమార్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఆదివారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. 2009 డిసెంబర్ 31వ తేదీ లోపు జన్మించిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు అసోసియేషన్ కార్యదర్శి బీకే మహమ్మద్ సలీమ్ సెల్ నంబర్ 80995 98958కు సంప్రదించాలని సూచించారు.14 మండలాల్లో వర్షంపుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 14 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. అత్యధికంగా పెనుకొండలో 21.4 మి.మీటర్లు, గోరంట్లలో 17.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే రొద్దంలో 9.8, కొత్తచెరువులో 9.2, ధర్మవరంలో 5.8, పుట్టపర్తిలో 5.4, సోమందేపల్లిలో 5.4, చిలమత్తూరులో 3.8, రామగిరిలో 2.6, అమరాపురంలో 2.4. ఓడీసీలో 2.4, బత్తలపల్లిలో 2.2, సీకే పల్లిలో 1.6, బుక్కపట్నంలో 1 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో మరో నాలుగు రోజులు వర్షాలు కురవచ్చని పేర్కొన్నారు.ఇంటి నుంచే తపాలా సేవలుహిందూపురం: అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0తో ఇకపై వివిధ రకాల పోస్టల్ సేవలను ఇంటి నుంచే సెల్ఫోన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్ తెలిపారు. గురువారం డివిజనల్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీని ఈ నెల 22 నుంచి హిందుపురం డివిజన్ పరిధిలోని 472 పోస్ట్ ఆఫీసుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ నెల 21న డివిజన్ పరిధిలోని పోస్టు ఆఫీసులలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించబోమన్నారు. ఆ రోజు అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వేగవంతమైన సర్వీస్ డెలివరీ, కస్టమర్లకు స్నేహపూర్వక సేవలు అందించేందుకు చర్యలు చేపడుతునట్లు పేర్కొన్నారు. పెరిగిపోతున్న సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా పోస్టల్శాఖ కూడా మార్పుచెందుతోందన్నారు. -
సర్వేలతో కూటమి ఎమ్మెల్యేల హడల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పాలన మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే టీడీపీ ఎమ్మెల్యేల్లో సర్వేల గుబులు మొదలైంది. సంవత్సరంలోనే నాలుగేళ్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రే స్వయానా ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వ్యూహకర్త రాబిన్ శర్మ సర్వే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండింట్లోనూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఇద్దరు మంత్రులతో సహా 8 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు వెల్లడైనట్లు తెలిసింది. మరికొన్ని నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా పడనుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాలో ప్రచారం జరుగుతోంది.మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. కూటమి పాలన మొదలెట్టి ఈ ఏడాది జూన్ 12 నాటికి ఏడాది దాటింది. తాజా సర్వేల ప్రకారం 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై వ్యతిరేకత పెల్లుబికుతోందని చర్చ జరుగుతోంది. ఐవీఆర్ఎస్ ద్వారా జరిగిన సర్వేలో 60 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులపైనా నిప్పులు చెరిగినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే అయినా ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.వ్యతిరేకతకు ప్రధాన కారణాలివే..అన్ని నియోజకవర్గాల్లో ఉచిత ఇసుక అని చెప్పి.. ఎమ్మెల్యేలే అక్రమంగా తరలిస్తూ సామాన్యులకు అందకుండా చేస్తున్నారు. పలు నియోజవర్గాల్లో మట్టిని అక్రమంగా తోలుతూ సామాన్యులతో మాత్రం వేలకు వేలు వసూలు చేస్తున్నారు.సామాన్యులకు సంబంధించిన ఖాళీ స్థలాలు కనిపిస్తే ఎమ్మెల్యేల అనుచరులం అని చెప్పి పాగా వేసి కంచె వేస్తున్నారు. అధికారులకు చెప్పుకుంటున్నా పరిష్కారం లేదు.మద్యం సిండికేటు అయి పర్మిట్రూములు, బెల్టుషాపుల ద్వారా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతుండటం వల్ల మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.చాలామంది ఉద్యోగులు బదిలీలు, పోస్టింగ్ల విషయంలో సిఫార్సు లేఖలకు భారీగా వసూలు చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే మున్సిపాలిటీ అధికారులను పంపించి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. -
చంద్రబాబు అంటేనే మోసం
గోరంట్ల (సోమందేపల్లి): ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి, వడిగేపల్లి, పాలసముద్రం పంచాయతీలో జరిగిన బాబు ష్యూరిటీ .. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం 2.70 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేశారని గుర్తు చేశారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, అన్నదాన సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమల చేయకుండా ప్రజలకు మోసం చేస్తున్నారని, అవన్నీ ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకేటేష్, మేదర శంకర, జెడ్పీటీసీ సభ్యుడు జయరాంనాయక్, ఎంపీపీ ప్రమీల, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు ఫకృద్దీన సాబ్, నాయకులు జయచంద్రరెడ్డి, ఈశ్వరప్ప, శ్రీనివాసరెడ్డి, పోతుల రామకృష్ణరెడ్డి, రఘురాంరెడ్డి, శంకర్నాయక్, శ్రీధర్రెడ్డి, బాబావలి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
బంగారు కుటుంబాలను గుర్తించండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామసభలను నిర్వహించి పీ4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీ4 కార్యక్రమంపై బంగారు కుటుంబాలు, మార్గదర్శకులలు గుర్తింపు అంశంపై ఆర్డీఓలు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలన్నారు. బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని అర్హతలేనివి ఉన్నాయో గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. బంగారు కుటుంబాల నమోదు, తొలగింపులను జాగ్రత్తగా చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మానిటరింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సేవల విషయంలో ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు చోరవ తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ సేవలు అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ చేతన్, జేసీ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు సువర్ణ, మహేష్, ఆనంద్కుమార్, ఎస్ఎస్వీ శర్మ, సీపీఓ విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శివరంగ ప్రసాద్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీలకు ఎంపిక
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గొట్లూరు వద్ద ఉన్న నైరా ఎరుడైట్ ఈఎం స్కూల్కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి రోల్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ శ్వేతా తెలిపారు. చార్విక్ దేవ్ (అండర్–11), గగన్దీప్ (అండర్–11), ఫణిబాబు(అండర్–14), నందకిషోర్ (అండర్–14), లోచన్ (అండర్–17) ఎంపియ్యారన్నారు. జూలై 19, 20 తేదీల్లో కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను కరస్పాండెంట్ శ్వేతా, ప్రిన్సిపాల్ వెంకటేష్, కోచ్ భార్గవ్ తదితరులు అభినందించారు. -
మమ్మల్నెవడ్రా ఆపేది?
గోరంట్ల (సోమందేపల్లి): అధికార అండతో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. గోరంట్ల మండల కేంద్రంలో ఏకంగా ప్రభుత్వ ఆస్తినే ధ్వంసం చేశారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ప్రహరీని స్థానిక టీడీపీ నాయకులు నిమ్మల యువ శేఖర్, వృషుభ దేవుడుతో పాటు మరో 14 మంది జేసీబీతో గోడను కూల్చి 10 చెట్లను తొలగించారు. దీనిపై ఆర్అండ్బీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన దినేష్, ప్రసాద్లకు చెందిన స్థలం ఆర్అండ్బీ అతిథి గృహం పక్కనే ఉంది. అయితే తమ స్థలానికి గోడతో పాటు చెట్లు అడ్డుగా ఉన్నాయని వారు టీడీపీ నాయకులను ఆశ్రయించారు. తమకు డబ్బు ముట్ట చెబితే వాటిని తొలగిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా లక్షలు చేతులు మరాయి. గురువారం ప్రహరీని కూల్చి వేయడంతో ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిమ్మల యువశేఖర్, వృషుభ దేవుడు, జయ, మోహన్, నరేష్, కట్ట నారాయణ, జై కృష్ణ, ప్రకాష్, ఆచారి విటలాచారి, మహేష్, మన్సూర్, గంగాధర్ టెంపో ఆదినారాయణ, రాము, దినేష్ , ప్రసాద్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. గోరంట్లలో ఆర్అండ్బీ ప్రహరీ కూల్చివేత టీడీపీ నాయకులపై కేసు నమోదు -
పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ
పరిగి: గ్రామ పంచాయతీల పరిధిలో నీటి, ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సమత ఆదేశించారు. బుధవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. తొలుత పి.నరసాపురం గ్రామానికి చేరుకున్న ఆమె డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. కాలువలు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని కార్యదర్శి తిప్పన్నను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు పక్కన చెత్త వేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నీటి నిల్వ ప్రదేశాలను బ్లీచింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డప్ప, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. నేత్రదానంధర్మవరం అర్బన్: మరణానంతరం తన నేత్ర దానంతో ఇద్దరికి కంటిచూపును అందించారు ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన బండ్ల నారాయణ(80). బుధవారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖరరెడ్డి వెంటనే బాధిత కుటుంబసభ్యులను కలసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారుడు బండ్ల మంజునాథ్, కోడలు శ్రీవనిత, కుమార్తె భాగ్యలక్ష్మి, తమ్ముడు బండ్ల రామాంజనేయులుకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్రెడ్డి, సభ్యులు ఖమ్మం మాధవ, జుజారు రఘు, ప్రభాకర్రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం యాదవ వీధిలో.. ● ధర్మవరం: స్థానిక యాదవవీధికి చెందిన వేల్పుమడుగు ఆంజనేయులు(62) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులు, డాక్టర్ బీవీ సుబ్బారావు, కౌన్సిలర్ కేతా లోకేష్.. మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, ఆప్తమాలిక్ ఆఫీసర్ షేక్ సికిందర్ సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని సోదరులు రాము, ప్రసాద్కు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలో చోరీతనకల్లు: మండల పరిధిలోని పెద్దపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయంలో బుధవారం చోరీ జరిగింది. ఆలయ తాళాలను తొలగించి లోపలకు ప్రవేశించిన దుండగులు హుండీని పగులగొట్టి అందులోని నగదుతో పాటు గర్భగుడిలోని ఇతర సామగ్రిని అపహరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడి ఆత్మహత్య గుడిబండ: మండలంలోని బాలేపట్టికి చెందిన మంజునాథ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. బాలేపల్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామలింగప్పకు ముగ్గురు సంతానం కాగా, మంజునాథ్ రెండో కుమారుడు. ఇంకా వివాహం కాలేదు. తరచూ కడుపు నొప్పితో బాధపడేవాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నొప్పి తీవ్రత తట్టుకోలేక స్టోర్ రూమ్లోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్కుళ్లాయప్ప తెలిపారు. పాము కాటుతో మహిళా రైతు మృతి ముదిగుబ్బ: మండలంలోని సిద్దన్నగారిపల్లికి చెందిన మహిళా రైతు సువర్ణ (44) పాముకాటుతో మృతి చెందారు. తన భర్త శివారెడ్డితో కలసి బుధవారం వ్యవసాయ తోటలో పని చేస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తిరుగుతున్నారు. ప్లాన్ చేసి దొరికిన కాడికి దోచుకుంటూ ఇటు బాధితుడికి, అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులక
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస దొంగతనాలు పోలీసుల పనితీరును సవాల్ చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగ్లా పక్కనే.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటి బయట రాత్రి ఉంచిన బైకులు తెల్లవారేసరికి మాయం అవుతున్నాయి. ఏడాది క్రితం ఎన్నికలకు ముందు సాక్షాత్తూ కలెక్టర్ బంగ్లాలోనే బంగారం అపహరించిన ఘటన జిల్లాను కుదిపేసింది. అయితే ఇప్పటి వరకూ ఏఒక్క కేసు దర్యాప్తులోనూ పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలూ లేవు. ఏడాది వ్యవధిలోనే.. ● పుట్టపర్తిలోని జానకీరామయ్య కాలనీలో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి మెయిన్ రోడ్డుపైకి చేరుకుని టిఫిన్ తిని ఇంటికెళ్లాడు. అప్పటికే తాళం బద్ధలుగొట్టి ఉంది. లోపలకెళ్లి చూస్తే చార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ కనిపించలేదు. ఘటనపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ రికవరీ చేయలేకపోయారు. ● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్వార్టర్స్ గేటు ఎదురుగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి రోజూ ఉదయాన్నే తన బైకును పగటి పూట చెట్టు కింద పార్క్ చేసి వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఉదయం పార్క్ చేసిన బైక్.. చీకటి పడే లోపు మాయమైంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని బాధితుడు వాపోతున్నాడు. ● చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన ఓ వ్యక్తి ఉదయం 7 గంటలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చాడు. టోకెన్ తీసుకుని.. వైద్యం పొందిన తర్వాత 11.30 గంటలకు బయలకు వచ్చి చూడగా.. బైక్ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాాడు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ● ఎన్నికలకు ముందు కలెక్టర్ నివాసముంటున్న బంగ్లాలోనే బంగారం ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు ఏమైందో? దొంగ ఎవరో? ఇప్పటికీ వెల్లడించలేదు. కొన్ని రోజుల పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయినా ఇప్పటికీ అరెస్ట్ చూపలేదు. ● మూడు నెలల క్రితం పుట్టపర్తి పట్టణ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జనరల్ ఆస్పత్రికి వచ్చిన ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన ఓ వ్యక్తి బైక్ గంట వ్యవధిలోనే మాయమైంది. ఇప్పటికీ రికవరీ చేయలేదని బాధితుడు పేర్కొన్నాడు. ● కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సందీప్ విల్లాలో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే బంగారం చోరీకి గురైంది. ఈ కేసు దర్యాప్తులోనూ పురోగతి లేదు. ● పుట్టపర్తి మున్సిపాలిటీ వెస్ట్ గేట్కు వెళ్లే దారిలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఇప్పటి వరకూ రికవరీ చేయలేదని బాధిత మహిళ వాపోతోంది. మరిచే లోపు మరో ఘటన పుట్టపర్తిలో చోరీల కలకలం.. నిత్య వార్తగా మారింది. ఒక ఘటన మరిచే లోపు మరో చోరీ వెలుగు చూస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (బుధవారం వేకువజాము 3.52 గంటల సమయంలో.. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం) పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్వార్టర్స్ ఎఫ్ బ్లాక్లో 9 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. రూ.8.25 లక్షల నగదు, 34 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. తన కుమార్తె పెళ్లి కోసం దాచిన మొత్తం బంగారాన్ని ఎత్తుకెళ్లారంటూ ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు. సవాల్ విసురుతున్న దొంగలు జిల్లాలో నిత్యమూ ఏదో ఒక చోట చోరీలు ఇప్పటి వరకూ ఏ ఒక్క కేసులో రికవరీ చూపని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే.. పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్లోని తొమ్మిది ఇళ్లలో దుండగులు ప్రవేశించి, విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. బుధవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. క్వార్టర్స్లోని మూడు బ్లాకుల్లో ఉన్న తొమ్మిది ఇళ్లల్లో ఏకకాలంలో బీభత్సం సృష్టించి రూ.9లక్షల నగదు, 34 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు ఒక్కడి ఇంట్లోనే రూ.8లక్షల నగదు, 29 తులాల బంగారు నగలను దుండగులు అపహరించారు. నగదు, బంగారాన్ని తన కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసి ఉంచినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రల ఆధారాల కోసం జల్లెడ పట్టారు. స్నిప్పర్ డాగ్ను రప్పించి దుండగుల కదలికలను పసిగట్టారు. ఆయా ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇదే ప్రాంతంలో కలెక్టర్ నివాసం ఉంటున్నారు. వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత పటిష్టంగానే ఉంటోంది. అయినా వరుస చోరీలు చోటు చేసుకోవడంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తమ్ముడూ.. అమ్మను బాగా చూసుకో
గుత్తి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మను బాగా చూసుకో’ అంటూ ఓ యువకుడు వీడియో కాల్లో తన సోదరుడికి సూచించి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. గుత్తి మండలం టి.కొత్తపల్లికి చెందిన సూర్యనారాయణ, శారదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నంద్యాల రేవంత్ కుమార్ (28) ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ తమకున్న 8 ఎకరాల్లో తమ్ముడు కిరణ్ కుమార్తో కలసి పంటలు సాగుతో పాటు బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగించేవాడు. పంటల సాగుతో పాటు బొలెరో వాహనం కొనుగోలుకు అప్పులు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక నష్టపోయాడు. అలాగే బొలెరో వాహనానికి సరైన బాడుగలు లేకపోవడంతో నెలవారీ కంతులు కట్టుకోలేక రూ.16లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ తరచూ మదనపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుత్తి నుంచి మిరపకాయల లోడు తీసుకుని హైదరాబాద్కు బయలుదేరిన రేవంత్కుమార్... తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు వద్దకు చేరుకోగానే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తమ్ముడికి వీడియో కాల్ చేశాడు. ‘ఇక నేను మీకు భారం కాను... అమ్మను బాగా చూసుకో’ అని చెప్పి పురుగుల మందు తాగాడు. గమనించిన బొలెరో వాహన క్లీనర్ వెంటనే అప్రమత్తమై వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. తెలంగాణలో గుత్తి మండలానికి చెందిన యువకుడి ఆత్మహత్య -
కేంద్ర బృందం పర్యటన
మడకశిర రూరల్: మండలంలోని మెళవాయి పంచాయతీలోని గ్రామాల్లో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 కేంద్ర బృందం సభ్యులు రామాంజనేయులు, శ్రీనివాసులు పర్యటించారు. యూ.రంగాపురం, మెళవాయి, జక్కేపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భోజన పథకం, అంగన్వాడీ సేవల అమలు తదితర వాటిని పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్యం పరిస్థితి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ, తడి.. పొడి చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద తయారీ తదితర అంశాలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాథ్, ఈఓఆర్డీ నాగరాజు నాయక్, కార్యదర్శి అశ్వత్థరెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొండకు తరలిన ఓబుళ లక్ష్మీనృసింహుడు చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో కొలువైన ఓబుళ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న గ్రామ సమీపంలోని కొండపై ఉన్న ఆలయం నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులను బుధవారం తిరిగి కొండపైకి చేర్చారు. ఈ 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉత్సవ మూర్తులను నూతన వస్త్రంలో ఉంచి పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా కొండకు తరలించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. రేషన్ బియ్యం స్వాధీనం పెనుకొండ రూరల్: అనంతపురం నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం మధ్యాహ్నం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద కియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో 60 సంచుల్లో (ఒక్కో సంచిలో 50 కిలోలు) ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ ముత్యాలుతో పాటు బియ్యం వ్యాపారి సోమును అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్డీటీ ప్రభావతికి అప్పగించారు. -
బ్లాస్టింగ్తో భయాందోళన
● పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు గ్రామాల ప్రజలు నల్లమాడ: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా చెరువువాండ్లపల్లి, సి.కొత్తపల్లి గ్రామాలకు సమీపంలో కాంట్రాక్టర్లు చేపట్టిన బ్లాస్టింగ్లతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భయంకరమైన శబ్దాలతో పాటు రాళ్లు ఎగిసిపడి పంట పొలాలు, గ్రామంల్లోని ఇళ్లపై వచ్చి పడుతున్నట్లు పలువురు వాపోయారు. భారీ శబ్ధాలకు భవనాలు కంపిస్తున్నాయన్నారు. టీవీలు పేలిపోతున్నాయని గ్రామాలకు చెందిన రామచంద్ర, రమేష్రెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, వేణుగోపాలరెడ్డి, శ్రీనివాసులు, గంగరాజు, వనజ, సుజాత, రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రాళ్లు మీదపడి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓపెన్ బ్లాస్టింగ్ జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 14న స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు పెనుకొండ రూరల్: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాను విజిలెన్స్ అధికారులు శివకుమార్, శివన్న, ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులు, నిల్వలు పరిశీలించారు. ఎస్ఎల్వీ, మన ఆగ్రో దుకాణాల్లో రికార్డులు సరిగాలేని 46 క్వింటాళ్ల విత్తనాలను గుర్తించారు. రూ.13.27 లక్షల విలువైన సరుకు విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఏఓ చందన ఉన్నారు. వృద్ధురాలిపై దాడి ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన గాండ్లపెంట: మండలంలోని మలమీదపల్లి పంచాయతీ బనాన్చెరువుపల్లికి చెందిన 78 ఏళ్ల వయసున్న ఎం.సరస్వతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆమె తలపై లోతైనా గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు.. ఈ నెల 12న ఉదయం 10.30 గంటలకు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి చేర్చి, విషయాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నివాసముంటున్న కుమారుడు సుబ్బారెడ్డికి తెలిపారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సమాచారాన్ని బావ నరసింహరెడ్డికి చేరవేశాడు. అప్పటికే నల్లచెరువు మండలం పాలపటిదిన్నె ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన ఆయన వెంటనే బనాన్చెరువుపల్లికి చేరుకుని పరిశీలించాడు. బాత్రూమ్లో పడి గాయపడి ఉంటుందని భావించి కదిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వృద్ధురాలి తలపై లోతైన గాయాలను గుర్తించిన వైద్యులు అవి బలంగా కొట్టడం వల్ల అయిన గాయాలుగా నిర్ధారించారు. దీంతో ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం నరసింహారెడ్డి బనాన్చెరువు పల్లికి చేరుకుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలంచాడు. ఇంటి వద్ద రక్తపు మరకలైన కట్టెతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల చెప్పులు, టవాలు పడి ఉండడం గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఎన్పీకుంట ఎస్ఐ వలీబాషా, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
‘కేఎస్ఎన్’ డిగ్రీ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను బుధవారం ప్రిన్సిపాల్ కేసీ సత్యలత, పరీక్షల విభాగాధిపతి హెచ్.శివశంకర్ బుధవారం విడుదల చేశారు. 623 మంది విద్యార్థినులు పరీక్ష రాయగా 71.75 శాతంతో 447 మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ (అనర్స్)లో 85 మందికి గాను 61 మంది. బీకాం (ఆనర్స్)లో 221 మందికిగాను 160 మంది, బీఎస్సీ (ఆనర్స్)లో 228 మందికి గాను 214 మంది, బీబీఏలో 29 మందికిగాను 12 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను కళాశాల ఎగ్జామినేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్కు సంబంధించి ఈ నెల 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రీవాల్యూషన్కు ఒక్కో పేపర్కు రూ.300, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.600 చెల్లించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల ఉప విభాగాధిపతి రమణ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, రామలింగారెడ్డి, నాగభూషణం, సింధు, రామకృష్ణ, రామాంజనేయులు, రేణుకాదేవి, ఆదినారాయణ, పర్వీన్, అనురాధ, రమాదేవి, లక్ష్మి, యూడీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నగదు బదిలీ పథకం ఉపసంహరించుకోవాలి’
పుట్టపర్తి టౌన్: హమాలీలకు శాపంగా మారే నగదు బదిలీ పథకం అమలు ఆలోచనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర పౌరసరఫరాల హమాలీల వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక సాయి ఆరామంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా హమాలీ యూనియన్ 5వ మహాసభలు జరిగాయి. అంతకు ముందు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సాయి ఆరామం వరకూ హమాలీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ మాట్లాడారు. హమాలీలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రతి నెలా 5న వేతనాలు చెల్లించాలని, సరుకు లోడింగ్.. అన్లోడింగ్ పనిని ఐదు రోజులకు కుదించాలని, హమాలీల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధానాన్ని రద్దు చేసి 12 రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీల కుటుంబాలకు అందాల్సిన పరిహారం త్వరగా అందించాలని కోరారు. అనంతరం జిల్లా హమాలీ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నేలకోటప్ప, ఉపాధ్యక్షులుగా శ్రీరాములు, చుక్కలింగం, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా రామదాసుతో పాటు 11మంది సభ్యలను ఎన్నుకున్నారు. -
అండర్–16 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం: ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకూ వైఎస్సార్ జిల్లా కడపలో జరిగే అండర్–16 సౌత్ జోన్ క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఎంపికై నా వారిలో ఆర్.సాత్విక్ (కెప్టెన్, అనంతపురం), ఎన్.సంజయ్కుమార్ (వైస్ కెప్టెన్, నార్పల), జి.కౌశిక్ (వికెట్ కీపర్, అనంతపురం), కె.అశ్విన్, యు.తన్మయ్ కార్తీక్రెడ్డి, అభినవ్ సాత్విక్ రెడ్డి, కుషాల్ సాయి, దేవాన్ష్, టి.కిరణ్కుమార్, వై.లిఖిత్, పి.నిహార్, ఎస్.కార్తీక్ (అనంతపురం), జియాద్ (హిందూపురం), జె.సంతోష్ (కదిరి), బి.అఖిల్ కుమార్ (గోరంట్ల), ఆదినారాయణ రెడ్డి (ఆత్మకూరు), బి.అఖిల్ కుమార్ (గొట్లూరు) ఉన్నారు. -
ఉల్లాసంగా ఉట్ల పరుష
బత్తలపల్లి/ధర్మవరం రూరల్: మండలంలోని అప్పరాచెరువు గ్రామంలో మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఉట్ల పరషను ఉత్సాహంగా సాగింది. పీర్ల చావిడి ఎదుట ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తైన ఉట్లమానును ఎక్కేందుకు సాయంత్రం 5 గంటలకు గ్రామంలోని వాల్మీకి (బోయ) సామాజిక వర్గానికి చెందిన 20 మంది యువకులు పోటీ పడ్డారు. వేడుకను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో అప్పరాచెరువు జనసంద్రమైంది. చివరికి రవితేజా అనే యువకుడు ఉట్లమాను పైకి ఎక్కడంతో ప్రజలు చప్పట్లు కొట్టి అభినందించారు. అంతకు ముందు మరగాళ్లు, కోలాటం, కీలుగుర్రాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే ధర్మవరం మండలం చిగిచెర్లలోనూ బుధవారం ఉత్సాహంగా ఉట్ట పరుషను గ్రామస్తులు నిర్వహించారు. అంతకు ముందు పీర్ల మకాన్లో ఉన్న మౌలాలీ స్వామికి చక్కెర చదివింపులు చేసి గజమాలలతో అలంకరించారు. -
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తిరుమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు (07009, 07010) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం (5 సర్వీసులు మాత్రమే) రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణుగుంట స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు. నాందేడ్–ధర్మవరం మధ్య.. నాందేడ్–ధర్మవరం మధ్య ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం రైళ్లు నడుపుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. నాందేడ్ జంక్షన్ (07189) నుంచి ఆగస్టు 1 (శుక్రవారం) రైలు బయలు దేరుతుందన్నారు. అలాగే, ఆగస్టు 3 (శనివారం) తిరుపతి జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. ధర్మబాద్, బాసర, నిజామబాద్, కామారెడ్డి, నెలగొండ, మిర్యాలగూడ, నడికుడి, రంపిచర్ల, వినుకొండ, కంభం, గిద్దలూరు, నంద్యాల, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, కదిరి సేష్టన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ నేతలకు పతనం తప్పదు మడకశిర: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు రాజకీయ పతనం తప్పదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మడకశిర నగర పంచాయతీ ఎన్నికలో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాతీర్పును అగౌరవపరచిన టీడీపీ నేతలను రానున్న ఎన్నికల్లో ప్రజలే ఓటుతో శిక్షించడం ఖాయమన్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకుని నగర పంచాయతీ దక్కించుకున్నామని సంబరపడుతున్న టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. ఏడాది కాలంలో టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడంపైనే నిమగ్నమై... మడకశిర అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టారని ఈరలక్కప్ప ఆరోపించారు. మంచికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. టీడీపీ నేతల ప్రలోభాలకు లొంగకుండా మంచికి అండగా నిలిచిన కౌన్సిలర్లందరికీ ఈరలక్కప్ప ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది భయపెట్టినా వైఎస్సార్ సీపీకి అండగా నిలిచిన కౌన్సిలర్లు అందరినీ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. నగర పంచాయతీని కోల్పోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరో 8 నెలల్లో మళ్లీ నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అప్పుడు ప్రజా మద్దతు సత్తా చాటుదామని ఆయన పిలుపునిచ్చారు. -
నవీన్ నిశ్చల్, కొండూరు సస్పెన్షన్
● పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నిర్ణయం చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్రెడ్డిలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్తలుగా పనిచేసిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. వాటిని విచారించిన క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విద్యార్థి అనుమానాస్పద మృతి ● నెల్లూరు జీజీహెచ్ ఎదుట స్నేహితుల ఆందోళన నెల్లూరు సిటీ: ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి చెందిన జానా శ్రీకాంత్ (23) నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఉన్న సన్ ఫార్మసీ కళాశాలలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రమణయ్య హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పార్ట్టైం పనిచేస్తున్నాడు. బుధవారం శ్రీకాంత్ హాస్పిటల్లో విధుల్లో ఉండగా కింద పడిపోయాడు. దీంతో సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ స్నేహితులు జీజీహెచ్కు చేరుకుని ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ ఆస్పత్రిలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడని ఆరోపించారు. అయితే సిబ్బంది మాత్రం హార్ట్ ఎటాక్ అని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యంతోనే తమ స్నేహితుడు మృతిచెందాడని ఆగ్రహించారు. ఈ క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రలోభపెట్టి.. పదవులు పొంది
మడకశిర: ప్రలోభపెట్టారు... అందుకు లొంగనివారిని భయపెట్టారు.. అధికారం కోసం పూర్తిగా దిగజారి ప్రవర్తించారు. చివరకు 9 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మద్దతుతో మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ నేతలు కై వసం చేసుకున్నారు. చైర్మన్గా నరసింహరాజు, వైస్ చైర్పర్సన్గా ప్రభావతి.. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం సమావేశం నిర్వహించారు. పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా... సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎంఎస్ రాజు హాజరయ్యారు. చైర్మన్ స్థానానికి టీడీపీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు, వైస్ చైర్మన్ స్థానానికి టీడీపీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ ప్రభావతి నామినేషన్లను దాఖలు చేయగా.. మిగతా వారు బలపరిచారు. దీంతో నరసింహరాజు చైర్మన్గా, ప్రభావతి వైస్ చైర్పర్సన్గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఆనందకుమార్ ప్రకటించారు. కాగా, పదవుల ఆశతో టీడీపీలో చేరిన 9 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో ఏ ఒక్కరికీ పదవులు దక్కలేదు. చైర్మన్ పదవిపై ఆశతో టీడీపీలో చేరిన 17వ వార్డు కౌన్సిలర్ సుభద్రను కూడా టీడీపీ నేతలు మోసం చేశారు. ఎన్నికను బహిష్కరించిన కౌన్సిలర్లు అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించిన మడకశిర చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. మడకశిరలో 20 వార్డులుండగా... గత మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పీఠంపై కన్నేసిన టీడీపీ నేతలు...వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 9 మందిని లాక్కున్నారు. తాగా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మద్దతుతోనే పదవులు దక్కించుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా... లక్ష్మీనరసమ్మ, రామచంద్రారెడ్డి, సతీష్రెడ్డి, అన్సర్, శ్రీనివాసులు, అంజన్ కుమార్ యాదవ్ వైఎస్సార్ సీపీని వీడలేదు. తాజాగా ఎన్నికను బహిష్కరించి తాము ప్రజలపక్షమని చాటారు. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్పర్సన్ పదవులు టీడీపీ కై వసం చైర్మన్గా నరసింహరాజు, వైస్ చైర్పర్సన్గా ప్రభావతి ఎన్నిక ఎన్నికను బహిష్కరించిన ఆరుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు -
జవాన్ భూమిపై ‘పచ్చ’ పాగా
సాక్షి, పుట్టపర్తి దేశ సరిహద్దులో పని చేసే ఆర్మీ ఉద్యోగుల భూములకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు జవాన్లు తమ భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ కలెక్టరేట్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్తచెరువు మండలం మైలసముద్రానికి చెందిన జవాన్ తన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారని, దయచేసి తన భూమిని రక్షించాలని వేడేకుంటూ సెల్ఫీ వీడియో రూపొందించి విడుదల చేయడంతో టీడీపీ నేతల భూ ఆక్రమణల పర్వం మరోసారి చర్చనీయాంశమైంది. ఏళ్లుగా కన్నేసి.. కూటమి రాగానే ఆకమ్రించి కేశాపురం రెవెన్యూ పొలం సర్వే నంబరు 326–2ఏలోని 2.75 ఎకరాలకు ప్రభుత్వం 1983లోనే మైలసముద్రం గ్రామానికి చెందిన కేశాని పెద్దక్కకు పట్టా ఇచ్చింది. పక్కనే సర్వే నంబరు 326–2బీలోని 2.35 ఎకరాలను మైలసముద్రం గ్రామానికి చెందిన కిలారి జానకమ్మకు పట్టా ఇచ్చింది. అయితే కేశాని పెద్దక్క పొలంపై కన్నేసిన కిలారి జానకమ్మ కుటుంబీకులు ఏళ్లుగా ఆక్రమించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరగానే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండదండలతో కిలారి జానకమ్మ భర్త కిలారి రామమోహన్, తనయుడు కిలారి గోవర్ధన్నాయుడు.. 2024 సెప్టెంబరులో 2.75 ఎకరాలను ఆక్రమించారు. పోలీసుల రక్షణతో (అప్పటి సీఐ ఇందిర) కేశాని పెద్దక్క పేరుతో ఉన్న భూమిలో టీడీపీకి చెందిన కిలారి రామమోహన్ తదితరులు మామిడి చెట్లు నాటారు. ఆ తర్వాత బోరుబావులు కూడా తవ్వించారు. దీంతో ఆ భూమి తమదని ఆక్రమణ సరికాదని కేశాని పెద్దక్క కుమారుడైన జవాన్ కేశాని రమేష్ టీడీపీ నాయకులను వేడుకున్నా వారు వినిపించుకోలేదు. పైగా పొలంలోకి వస్తే అంతుచూస్తామంటూ రమేష్ కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో జవాన్ రమేష్ కుటుంబీకులు ఏడాది కాలంలో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో... జవాన్ రమేష్ ఓ సెల్ఫీ వీడియో రూపొందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు మంత్రి లోకేశ్కు చెప్పినా ఫలితం లేదు.. మా భూమికి సంబంధించి 1983 నుంచి ఆధారాలున్నాయి. ఏడాది క్రితం వరకు పొలం మా ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఎకరా రూ.10 లక్షలపైనే పలుకుతోంది. దీంతో కొందరు టీడీపీ నేతలు మా పొలాన్ని ఆక్రమించారు. అధికారులకు మొరపెట్టినా ఎవరు పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి వచ్చిన సమయంలో విమానాశ్రయం వద్ద వినతిపత్రం అందజేశా. అయినా స్పందనలేదు. అవతలి వ్యక్తులు టీడీపీకి చెందిన వారు... అగ్రవర్ణాల వారు కావడంతో అధికారుల మా మొర ఆలకించడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నా. – రమేశ్, జవాన్ ఏడాది క్రితం దౌర్జన్యంగా ఆక్రమించిన ‘తమ్ముళ్లు’ కొత్తచెరువు మండలం మైలసముద్రంలో ఘటన అసోంలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ కేసాని రమేశ్ -
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం
హిందూపురం టౌన్: కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని, ఇందుకోసం సౌరశక్తిని విరివిగా వినియోగించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం పట్టణంలో శివారులోని జేవీస్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో కలెక్టర్ టీఎస్ చేతన్తో కలిసి ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ పథకం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. కోటి ఇళ్ల మీద రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ గ్రామంలో అయితే వేగంగా అన్ని ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకుంటే ఆ గ్రామానికి రూ.కోటి అందిస్తామన్నారు. ఆ నిధులతో గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుందని, బ్యాంకులు రుణ సౌకర్యాన్ని అందిస్తాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బాగుపడితే ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలన్నారు. సోలార్ ఏర్పాటు వల్ల విద్యుత్తు బిల్లు తగ్గుతుందని తెలిపారు. అనంతరం ‘రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్తు బిల్లు తగ్గించుకోండి‘ బ్రోచర్ను విడుదల చేశారు. అలాగే ఇప్పటికే తమ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకున్న వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఆర్డీఏ పీడీ నర్సయ్య, డీపీఓ సమత, ట్రాన్స్కో ఎస్ఈ సంపత్ కుమార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ సుపరిపాలనలో సమస్యల ఏకరువు హిందూపురం: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పర్యటించగా జనం సమస్యలు ఏకరువు పెట్టారు. బుధవారం ఉదయం మంత్రి చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ నల్లరాళ్లపల్లి గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు, మూడు ఇళ్లకు వెళ్లి ప్రజలతో సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు సమస్యలు ఏకరువు పెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియని మంత్రి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెబుతూనే...‘వాటి గురించి చూడండయ్యా’ అంటూ అధికారులపై రుసరుసలాడుతూ ముందుకు సాగారు. అనంతరం లేపాక్షి మండలంలోనూ పర్యటించారు. రచ్చబండ వద్ద మహిళలతో గ్యాస్ సిలిండర్ వచ్చిందా.. అంటూ ఆరా తీయగా.. మహిళలు సిలిండర్లు అందలేదని సమాధానం ఇచ్చారు. -
ఎకై ్సజ్పై ఎమ్మెల్యేల పెత్తనం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందాన మారింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎకై ్సజ్ అధికారుల పరిస్థితి. మద్యం అక్రమాలకు అడ్డు తగిలితే ‘మీకు శంకరగిరి మాన్యాలు చూపిస్తాం’ అని ఎమ్మెల్యేల బెదిరింపులు... కేసులు రాయకుండా ఏం చేస్తున్నారంటూ విజయవాడ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు వెరసి వారి విధులు దినదినగ గండంలా తయారయ్యాయి. ఓ వైపు కేసులు రాయలేక, మరోవైపు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రశాంతంగా.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే ఎక్కువ అమ్ముతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఎకై ్సజ్ చట్టం ప్రకారం రూ.5 లక్షలు జరిమానా రాయాలి. కానీ రైడింగ్ చేసి కేసులు రాద్దామంటే వెంటనే ఎమ్మెల్యేలు ఫోన్ చేసి కేసులు నమోదు చేయొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇటీవల పామిడిలో ఓ ప్రజాప్రతినిధి షాపుపై కేసు రాసినందుకు ఎకై ్సజ్ అధికారులపై మండిపడినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేల ఒత్తిడితో ఎక్కడా కేసులు నమోదు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో ప్రశాంతంగా విధులు నిర్వహించామని.. ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైడ్స్ చేసినందుకు ఏసీ బదిలీ.. హిందూపురంలో రెండు మాసాల క్రితం ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి కల్తీ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ను ఏకంగా బదిలీ చేశారు. కేసు రాసిన వారంలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు బదిలీ చేయించడంతో మిగిలిన అధికారులు భయపడుతున్నారు. కేసులు నమోదు చేస్తే ఎక్కడ బదిలీ చేస్తారో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాగైతే ఎంతకాలం ఉద్యోగం చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఎకై ్సజ్ సీఐ ఒకరు వాపోయారు. ఇప్పటికే బెల్టుషాపులు, పర్మిట్ రూములు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. బెల్టుషాపులు, పర్మిట్ రూములు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గడిచిన 10 నెలల్లో కూటమి సర్కారు తెచ్చిన కొత్త మద్యం పాలసీతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.1,400 కోట్లకు పైగా విలువైన మద్యం వినియోగమైంది. రోజూ సగటున రూ.4.69 కోట్ల విలువైన మద్యం వినియోగమవుతుండగా.. ఇటీవల వారం రోజుల పాటు జరిగిన పీర్ల పండగ సందర్భంగా రోజుకు రూ.7 కోట్ల మద్యం తాగినట్లు వెల్లడైంది. ఎమ్మార్పీకి మించి వసూలు చేసినా కేసులు కట్టొద్దంటూ హుకుం ఇటీవల ‘పురం’లో కల్లు దుకాణాలపై దాడులు చేశారని ఏసీ బదిలీ అక్రమాలపై కేసులు రాయాలంటూ మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు ఒత్తిళ్ల నడుమ నలిగిపోతున్న ఎకై ్సజ్ అధికారులు ఒత్తిడి భరించలేక సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్న వైనం రూ.1,400 కోట్ల మార్కు దాటేసింది.. -
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెండ్
చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని వైఎస్సార్ సీపీ నుంచి ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన వారిలో హిందూపురం 17వ వార్డు కౌన్సిలర్ వై. మాజీన్, 31వ వార్డు కౌన్సిలర్ పీసీ చిన్నమ్మ, టౌన్ బ్లాక్ కన్వీనర్ సీఎన్పీ నాగరాజు, హిందూపురం మున్సిపాలిటీకి చెందిన హబీబ్ ఉన్నారు. వీరిపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం ● ప్రభుత్వాన్ని హెచ్చరించిన పెన్షనర్ల సంఘం ● కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం ప్రశాంతి నిలయం: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గోకులం నుంచి కలెక్టరేట్ వరకు పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్టయ్య, ప్రధాన కార్యదర్శి నాగార్జున శెట్టి మాట్లాడుతూ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ బిల్తో పాటు పెన్షన్ వ్యాలిడేషన్ అమిడ్మెంట్ బిల్లును రద్దు చేయాలన్నారు. కేంద్రం 8వ పే కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం 12వ పే కమిషన్ను వెంటనే నియమించాలని, పెండింగ్లో ఉన్న డీఆర్ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుపై నగదు రహిత సేవలు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓకు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్మారెడ్డి, జేఏసీ చైర్మన్ లింగా రామ్మోహన్, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం యూనియన్ కార్యవర్గ సభ్యులు, జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన పెన్షనర్లు పాల్గొన్నారు. -
అప్రజాస్వామిక ఎన్నికను బహిష్కరిస్తున్నాం
మడకశిర: అప్రజాస్వామికంగా బుధవారం నిర్వహిస్తున్న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ బహిష్కరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు. నగర పంచాయతీ ఎన్నికలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగానికి తిలోదకాలిచ్చారని వారు ఆరోపించారు. మంగళవారం ఈరలక్కప్ప పట్టణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల సమావేశమై ఎన్నికపై చర్చించారు. టీడీపీ అరాచక పాలన, అనుసరిస్తున్న అప్రజాస్వామ్య చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించారు. అనంతరం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, జయరాజ్, శ్రీనివాసులు, అంజన్కుమార్ యాదవ్, అన్సర్, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ వాల్మీకి సతీష్కుమార్తో కలిసి ఈరలక్కప్ప విలేకరులతో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ నాయకులు అడ్డదారుల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏమాత్రం బలం లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అడ్డదారుల్లో ఎన్నికలో గెలవడం చేతగాని వారి పని అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని సవాల్ విసిరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మను, బీసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డిని పదవుల నుంచి దించిన టీడీపీ... దళితులు, బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రజలు వారిని క్షమించరు పార్టీ మారి తల్లి లాంటి వైఎస్సార్ సీపీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లను తాము క్షమించినా ప్రజలు క్షమించరని ఈరలక్కప్ప అన్నారు. పార్టీ ఫిరాయించిన వారెవరూ వచ్చే ఎన్నికల్లో గెలవలేరన్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. ఈ ఎన్నిక తర్వాత పార్టీ మారిన కౌన్సిలర్లకు కూటమి నాయకులు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. వారంతా పార్టీ మారి తప్పు చేశామని కుమిలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుతామన్నారు. అంతేకాకుండా పార్టీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లను పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు. మడకశిరలో అంబేడ్కర్ రాజ్యాంగానికి టీడీపీ తిలోదకాలు పార్టీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, కౌన్సిలర్లు -
15 నుంచి గ్రామ సభలు నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పీ–4 సర్వేలో ఎంపికై న బంగారు కుటుంబాలను మరోసారి పరిశీలించేందుకు ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పీ–4 కార్యక్రమంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సభల్లో ఇప్పటికే ఎంపికై న బంగారు కుటుంబాలను పరిశీలించి అర్హులైన వారిని తుది జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులను జాబితా నుంచి తొలగించాలన్నారు. బంగారు కుటుంబాల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. సమావేశంలో విజయవాడ నుంచి వచ్చిన అబ్జర్వర్ తమ్మిశెట్టి సాయి సాత్విక్, సీపీఓ విజయ్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హల్కూరుకు అరుదైన అవకాశం ● ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపిక ప్రశాంతి నిలయం: షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువగా ఉన్న గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజనకు అమరాపురం మండలంలోని హల్కూరు గ్రామం ఎంపికైందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హల్కూరు గ్రామ అభివృద్ధి ప్రణాళిక అమోదం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ... ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపికై న హల్కూరుకు కేంద్రం రూ.20 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి ఇంతకు ఐదురెట్లు పనులు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతుందన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అంగన్వాడీ భవన నిర్మాణం, ఆర్వో వాటర్ ప్లాంట్, ఎస్సీ కాలనీలో కరెంట్ స్తంభాల ఏర్పాటు, ఎస్హెచ్జీ రిసోర్స్ సెంటర్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కన్వీనర్ శివరంగ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఎల్డీఎం రమణకుమార్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.టీడీపీ నేతల బాహాబాహీ ● సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం రగడ ● పార్టీ కార్యాలయంలోనే సవిత, బీకే వర్గాల ముష్టి యుద్ధం గోరంట్ల: టీడీపీ నేతలు ముష్టి యుద్ధానికి దిగారు. గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే... గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం హిందూపురం ఎంపీ పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకే పదవి కావాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో సోమవారం పార్టీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో సహకార సంఘం అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి పార్టీ కార్యాలయంలో గౌనివారిపల్లి, కొండాపురం ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ పార్థసారథి వర్గం నుంచి గౌనివారిపల్లి పంచాయతీకి చెందిన వడ్డే రవి, మంత్రి సవిత వర్గం నుంచి కొండాపురం పంచాయతీకి చెందిన కృష్ణమూర్తి అధ్యక్ష పదవికోసం పట్టుబట్టారు. ఇరువురికీ సర్దిచెప్పేందుకు మండల నాయకులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల నాయకులు పార్టీ కార్యాలయంలోనే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని ముష్టి యుద్ధానికి దిగారు. ఈ ఘటనలో పార్టీ కన్వీనర్కు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష ఎంపిక మరోసారి వాయిదా పడింది. -
మడకశిర పీఠానికి నేడు ఎన్నిక
మడకశిర: అధికారం ఉంది.. ఇక తమకు అడ్డేముందన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను పీఠాల నుంచి కూలదోస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర నగర పంచాయతీ పీఠంపై కన్నేసిన టీడీపీ నేతలు కేవలం 5 స్థానాలతో విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీకి చెందిన చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారిని పదవీచ్యుతులను చేసిన పచ్చ నేతలు బుధవారం జరిగే ఎన్నికలో తమవారిని పీఠాలపై కొలువుదీర్చేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహించనుంది. ఈ మేరకు ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలోని మీటింగ్ హాలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులంతా సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానాలు పంపారు. అలాగే ఎన్నిక అధికారిగా పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ను ఈసీ నియమించింది. టీడీపీకి 5 స్థానాలే నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా...గత మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. టీడీపీ కేవలం ఐదుగురు స్థానాలను మాత్రమే నిలబెట్టుకోగలిగింది. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన లక్ష్మీనరసమ్మ చైర్పర్సన్గా, రామచంద్రారెడ్డి వైస్ చైర్మన్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే... నగర పంచాయతీపై టీడీపీ నేతలు కన్నేశారు. మెజార్టీ లేకపోయినా ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కుట్రలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి, పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. దీంతో 9 మంది కౌన్సిలర్లు టీడీపీ కండువా వేసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మాణం పెట్టి విజయం సాధించారు. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు కోల్పోగా.. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. పదవులపై ఉత్కంఠ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనుండడంతో ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు చైర్మన్ గిరీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి పచ్చకుండువా కప్పుకున్న 17వ వార్డు కౌన్సిలర్ సుభద్ర కూడా చైర్పర్సన్గా కొలువుదీరాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీళ్లిద్దరిలోనే ఎవరో ఒకరికి పీఠం దక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఇక వైస్ చైర్మన్ పదవిని వైఎస్సార్ సీపీ హయాంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డికి ఇచ్చారు. నగర పంచాయతీలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున ఈసారి కూడా వాల్మీకి వర్గానికి చెందిన వారికే వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని పలువురు కోరుతున్నారు. అయితే టీడీపీ నేతలు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇస్తారా...లేదా అన్నది బుధవారం తేలనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో అరాచకం ప్రలోబాలతో ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చకండువా ఎన్నిక దూరంగా వైఎస్సార్ సీపీభారీ పోలీస్ బందోబస్తు ఎన్నికల సందర్భంగా మడకశిర నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మడకశిర పట్టణ సీఐ నగేష్ తెలిపారు. కౌన్సిలర్లను మాత్రమే లోనికి అనుమతిస్తామని ఇతరులకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నా జోలికొస్తే అంతు చూస్తా
చిలమత్తూరు: తన అవినీతి అక్రమాలను బయటపెడుతున్న సాక్షి విలేకరిపై ఓ టీడీపీ నేత రెచ్చిపోయాడు. ‘నా జోలికొస్తే ఊరుకోను... నీ అంతు చూస్తా జాగ్రత్త’ అంటూ బెదిరింపులకు దిగాడు. హిందూపురం నియోజకవర్గంలో ఏడాది కాలం పరిస్థితులపై ఈనెల 13న ‘‘హిందూపురం.. అభివృద్ధి శూన్యం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనంలోనే చిలమత్తూరులో జరిగిన నాసిరకం రహదారి పనులు... ఆ పనుల పరస్థితిని తెలిపే చిత్రాలను సైతం ప్రచురించింది. దీంతో సదరు రహదారి పనులు చేసిన టీడీపీ నేత నాగరాజు యాదవ్ సాక్షి విలేకరిపై కక్షగట్టాడు. మంగళవారం విలేకరి శ్రీధర్రెడ్డికి ఫోన్ చేసి దుర్బాషలాడాడు. తనను గెలుక్కుంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వాస్తవాలు రాస్తే చంపేస్తారా..అని ప్రశ్నిస్తే... నువ్వు అలాంటి రాతలు రాస్తే అదే జరుగుతుందంటూ భయపెట్టాడు. నాగరాజు యాదవ్పై చర్యలు తీసుకోండి సాక్షి విలేకరిపై టీడీపీ నేత నాగరాజు యాదవ్ గూండాగిరీని చిలమత్తూరు పాత్రికేయ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నేతల అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమన్నారు. సదరు టీడీపీ నేత నాగరాజు యాదవ్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్ఐ మునీర్ అహ్మద్ను జర్నలిస్టులు కోరారు. దాడులు, బెదిరింపులు సరికాదు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి విలేకరులపై, పత్రికా కార్యాలయాలపై కూటమి నేతలు చేస్తున్న దాడులు ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయని జర్నలిస్టు నేతలు ఆంజనేయులు, నరసింహారెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్ట్లపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి నియంతృత్వ పాలన మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అలాంటి కలంపై దౌర్జన్యాలు సహించబోమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆంజనేయులు, శంకర్, సురేష్రెడ్డి, పవన్, నరసింహారెడ్డి, విశ్వనాథ్, వనం శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, నాగార్జున, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ విలేకరికి టీడీపీ నేత బెదిరింపులు చిలమత్తూరు పీఎస్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు -
80,109 జిల్లాలో రక్తపోటు బాధితులు 60,639 జిల్లాలో మధుమేహ బాధితులు
● ధర్మవరానికి చెందిన 32 ఏళ్ల సచివాలయ ఉద్యోగి ఇటీవల జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు మధుమేహం (షుగర్) వచ్చిందని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. అయితే తమ ఇంట్లో ఎవరికీ షుగర్ లేదని, అయినా ఇంత చిన్న వయసుకే తనకు ఎలా వస్తుందని వైద్యులతో వాదనకు దిగాడు. మరోచోట పరీక్షించున్నా ఫలితంలో మార్పులేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ● హిందూపురం పట్టణానికి చెందిన 37 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వారం రోజుల పాటు నిరంతరంగా తలనొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నాడు. రక్తపోటు అధికమైందని వైద్యులు చెప్పారు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం.. ఆహారపు అలవాట్లలో తేడా కారణంగా బీపీ పెరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. మసాలా, కారం, ఉప్పు తగ్గించాలని సూచించారు. ● 30 ఏళ్లకే బీపీ బారిన పడుతున్న వైనం ● ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న మధుమేహం ● బద్ధకంతో అనారోగ్యం బారిన యువత ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులుసాక్షి, పుట్టపర్తి మారిన ఆహార అలవాట్లు, జీవన శైలి మనిషిని జబ్బుల బారిన పడేస్తోంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో చాలా మంది చిన్న వయస్సులోనే రక్తపోటు, మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నలుగురు కలిస్తే అందులో ఇద్దరికి బీపీ, మధుమేహం ఉంటోంది. ఇక వయసు మీద పడే కొద్దీ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మూడు పదుల వయస్సులోనే... మారిన జీవనశైలి కారణంగా మూడు పదుల వయసులోనే.. బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. ఇక తీవ్ర ఒత్తిడితో మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి రంగంలోనూ పోటీ పెరిగింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడటం తదితర కారణాలతో లేని పోని రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. అయితే తాము బీపీ, షుగర్ బాధితులమని సగం మందికి తెలియకపోవడం గమనార్హం. ఏదైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్తే.. ఉన్నఫలంగా ఈ రెండూ బయటపడుతున్నాయి. ఆ తర్వాత పదే పదే ఆరోగ్యం గురించి ఆలోచించడంతో మరిన్ని రోగాలు వెంటాడుతున్నాయి. వయసు మీరిన తర్వాత రావాల్సిన రోగాలు.. సగం వయసులోనే సోకుతుండటంతో జీవితం ఒక్కసారిగా తలకిందులవుతోంది. చిన్న వయసులోనే ఆస్పత్రుల చుట్టూ.. పుట్టుకతోనే ఆస్పత్రులు చూడాల్సిన కాలంలో బతుకుతున్న సమాజంలో.. డాక్టర్ల చుట్టూ తిరగడం నిరంతర ప్రక్రియగా మారింది. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వెంటనే ఏదో రోగం వెంటాడుతోంది. మానసిక ఒత్తిళ్లతో బీపీ, షుగర్ వెంటనే పలకరిస్తున్నాయి. కంప్యూటర్ కాలంలో నిత్యం బిజీబిజీగా గడిపే వారంతా రోజులో గంటసేపు కూడా శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఏదో రోగం సోకిన తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. పట్టణాల్లోనే అధికం రక్తపోటు, మధుమేహం బాధితుల సంఖ్యను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. గ్రామాల కంటే పట్టణాలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రతి ఒక్కరూ శారీరకంగా శ్రమిస్తారు. అలాగే మసాలా, ఫాస్ట్ ఫుడ్ అందుబాటులో ఉండవు. సమయానికి తింటూ నిత్యం ఏదో పనిలో ఉంటారు. అయితే పట్టణ ప్రజలు నిత్యం బిజీగా ఉండటంతో పాటు సమయానికి భోజనం తినరు. శారీరక వ్యాయామం చేయరు. పైగా పిజ్జాలు, ఫాస్ట్ఫుడ్, మసాల ఆహారానికి అలవాటు పడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ రోగాల బారిన పడుతున్నారు. ఈక్రమంలో బీపీ, మధుమేహం మందుల విక్రయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మారిన జీవన శైలితో జబ్బుల బారిన జనంనియంత్రణే శ్రీరామరక్ష ప్రతి మనిషికీ ఆరోగ్యమే ప్రధానం. ఆరోగ్యం బాగుంటే కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లు బాగుంటే రోగాలు దరి చేరవు. శారీరక శ్రమ అవసరం. సోమరితనంతో లేనిపోని రోగాలు రావడం ఖాయం. ముందస్తు నియంత్రణ మార్గాలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. – డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి -
రైలు కింద పడి రైతు మృతి
చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మంలడం ఆమిదాలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు (40)కు భార్య శమంతకమణితో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పొలం వద్దకు కాపలాకు వెళ్లిన ఆయన సోమవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని, అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హిందూపురం రైల్వే పోలీసులు కుఏసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జేఎన్టీయూలో 1,935 సీట్ల తగ్గింపు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో సీట్ల ఖరారు పూర్తయింది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 69 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు గాను ఈ విద్యాసంవత్సరానికి 59,244 సీట్ల ఏఐసీటీఈ మంజూరు చేసింది. కళాశాలల నిజనిర్ధారణ కమిటీల సిఫార్సు మేరకు 1,935 సీట్లను తగ్తిస్తూ మొత్తం 57,309 ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేశారు. వీటిని ఏపీఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్ల ఎంపికకు అందుబాటులో తెచ్చేందుకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు సంబంధించి 77,296 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలపగా, 74,145 సీట్లను భర్తీ చేసుకునేందుకు వర్సిటీ తుది ఆమోదం తెలిపింది. కారులో నగదు చోరీ గోరంట్ల: స్థానిక పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఆపిన కారులో నుంచి నగదును దుండగులు అపహరించారు. వివరాలు.. గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన వసంతరావు, ఆయన సోదరుడు రామచంద్రరావు సోమవారం ఉదయం గోరంట్లలోని ఎస్బీఐ శాఖకు చేరుకుని రూ.7 లక్షలు డ్రా చేశారు. ఈ మొత్తాన్ని కారులో ఉంచుకుని రామచంద్రరావు కుమారుడి వివాహా వేడుకలు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న వాసవీ మహాల్ ఫంక్షన్ హాల్ను చూసేందుకు వెళ్లారు. ఫంక్షన్ హాల్ ఎదుట కారు నిలిపి లాక్ చేసుకుని లోపలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే లోపు కారు డోర్ అద్దం పగులగొట్టి ఉంది. కారులో ఉంచిన నగదు కనిపించలేదు. నగదు అపహరించారని నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, సీఐ శేఖర్ తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షాక్తో బాలికకు తీవ్రగాయాలు ధర్మవరం అర్బన్: స్థానిక శారదా నగర్లో నిర్మాణంలో ఉన్న కట్టడంలో ఆడుకుంటున్న ఓ బాలిక విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన మేరకు ఒంగోలుకు చెందిన హరి, రిపిక దంపతులు ధర్మవరం పట్టణానికి వలస వచ్చి గృహ నిర్మాణ పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం శాంతినగర్లో ఇంటి నిర్మాణ పనులకు వెళ్లిన వారు తమతో పాటు 11 ఏళ్ల కుమార్తె వెంకటేశ్వరినీ పిలుచుకెళ్లారు. కట్టడం వద్ద ఇనుపరాడ్పై పడిన విద్యుత్ తీగను గమనించని వెంకటేశ్వరి ఆడుకుంటూ వెళ్లి దానిని తాకింది. దీంతో షాక్కు గురై కుప్పకూలడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికకు వైద్యులు ప్రథమ చికిత్స అందజేసి, అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోల్డ్ స్కీమ్ పేరిట చీటింగ్ గుంతకల్లు టౌన్: గోల్డ్ స్కీమ్ పేరిట గుంతకల్లుకు చెందిన జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు నూరుల్లా రూ.లక్షల్లో కుచ్చుటోపీ పెట్టి ఉడాయించాడు. విషయం తెలియగానే బాధితులు పెద్ద సంఖ్యలో సోమవారం సాయంత్రం పాత గుత్తిరోడ్డులోని ఓ నర్సింగ్హోమ్ వద్ద ఉన్న సుల్తానియా జ్యువెలరీ షాపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. జ్యువెలరీ షాపును అద్దెకిచ్చిన యజమాని ఖాళీ చేయిస్తామని అక్కడికి వెళ్లడంతో బాధితులంతా అతడితో వాదించారు. పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల నిమిత్తం బంగారు షాపు నిర్వాహకుడు నూరుల్లాకి తాము పోగు చేసుకున్న డబ్బును నెలానెల చెల్లించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని ఇక్కడికి రప్పించి తమ డబ్బును తమకు ఇప్పించాలని బాధితులు కోరుతూ ఆర్డీఓ, టూటౌన్ పోలీసులను కలసి విన్నవించారు. -
జేఎన్టీయూలో కొత్త కోర్సు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్త కోర్సు అమలు చేస్తున్నట్లు వీసీ హెచ్.సుదర్శనరావు సోమవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు త్వరలో అటానమస్ హోదా దక్కనున్న నేపథ్యంలో క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో జాప్యం నెలకొని పేద, మధ్య తరగతి విద్యార్థులు క్యాంపస్లో చదివే అవకాశం లేకుండా పోతోంది. ఈ అంశంపై ‘విశ్వ ఖ్యాతి.. అధోగతి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై వీసీ స్పందించారు. ఉన్నత విద్యామండలితో ఫోన్లో సంప్రదించి కొత్త కోర్సు అమలుకు చర్యలు తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్లలో ఈ కొత్త కోర్సును ఎంపిక చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. కొత్త కోర్సు వివరాలు ఇలా: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ అనే కొత్త కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టారు. కన్వీనర్ కోటాలో 66 సీట్లను కేటాయించారు. కోర్సు ఫీజు రూ.75 వేలుగా నిర్ధారించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ● కంప్యూటర్ సైన్సెస్లో ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 66 సీట్లు కొత్తగా కేటాయించారు. ఒక్కో సీటుకు రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరిలో ఈ సీట్లు కేటాయిస్తారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ● ఈసీఈలో ఇప్పుడు ఉన్న సీట్లకు అదనంగా 66 సీట్లు కేటాయించారు. ఒక్కో సీటుకు కోర్సు ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ధేశించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఈ కోర్సులన్నింటినీ 2025–26 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. -
‘పోలీస్ స్పందన’కు 61 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని, అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజరీ సాయినాథరెడ్డి పాల్గొన్నారు జాతీయ హాకీ జట్టులో చోటు కదిరి టౌన్: హర్యానాలోని హిసార్ వేదికగా ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ఐపీఎస్సీ బాలికల అండర్ 17 ప్రీ నెహ్రూ కప్ హాకీ టోర్నీలో కదిరికి చెందిన సి.వి.లక్షిత ప్రతిభ చాటి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. కదిరిలోని చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సి.వి.మదన్కుమార్ కుమారై లక్షిత.. కర్ణాటకలోని కిట్టూరులో ఉన్న రాణి చెన్నమ్మ సైనిక స్కూల్లో చదువుతోంది. హాకీలో గోల్కీపర్గా ప్రతిభ చాటుతోంది. ఐపీఎస్సీ టోర్నీలో ఉత్తమ ప్రతిభ చూపడంతో లక్షితను హాకీ అండర్ 16 జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు సైనిక స్కూల్ కోచ్ జయలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా లక్షితను కదిరి వాసులు అభినందిస్తున్నారు. -
మంత్రి ఇలాకాలో విద్యార్థులకు అందని కోడిగుడ్లు
పరిగి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కోడి గుడ్లు అందకపోవడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం జైభీమ్ పార్టీ నాయకుడు ఊటుకూరు నాగరాజు ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ నాయకుడు చౌళురు రవి తదితరులు మోకాలిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డప్పు కొడుతూ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దారు హనుమంతుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సవితమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేమన్నారు. ఇప్పటికై నా మంత్రి సవిత తన నియోజకవర్గంలో కోడిగుడ్ల ఏజెన్సీ నిర్వాహకుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇటీవల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన రోజున సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకు మద్యాహ్న భోజనంలో కోడిగుడ్లను ఇవ్వడం జరిగిందని ఎంఈఓలు లక్ష్మీదేవి, శేషాచలం తెలిపారు. దీంతో కొరత కారణంగా సోమవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్లను ఇవ్వలేకపోయారని వివరించారు. డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేసిన జైభీం నాయకులు -
అందని ప్రయోజనాలు.. పెన్షనర్ల దిగాలు
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వారిపై బాబు సర్కారు కనికరం చూపడం లేదు. ఉద్యోగ విరమణ తరువాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నెలలు గడుస్తున్నా అందించకపోవడంతో ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు గత ఏడాది అక్టోబరు నుంచి పెండింగ్లో ఉంచారు. ఈ మొత్తం రూ.48 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మట్టిఖర్చులూ పెండింగ్ పెన్షనర్ చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తక్షణ సాయంగా మట్టిఖర్చుల (ఫ్యునరెల్ చార్జెస్) కింద రూ.25 వేలు ఇస్తారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 100 మంది వరకూ పెన్షనర్లు మరణిస్తే వీరికి సంబంధించి మట్టి ఖర్చులను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్లో ఉంచినట్లు తెలిసింది. 100 మందికి రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. మట్టిఖర్చుల కింద తక్షణ సాయంగా అందించాల్సిన డబ్బునూ పెండింగ్లో పెట్టడం ప్రభుత్వ కర్కశత్వానికి అద్దం పడుతోంది. గ్రాట్యూటీ, ఈఎల్కు ఎదురుచూపులు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో దాదాపు 200 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసినట్లు సమాచారం. వీరికి సంబంధించి గ్రాట్యుటీ సగటున రూ.14 లక్షలుగా చూసినా రూ.28 కోట్లు రావాల్సి ఉంటుంది. ● సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్లను (ఈఎల్) ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి వాటికి డబ్బులు తీసుకుంటారు. ఇలా ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఒక్కో ఉద్యోగికి ఈఎల్కు సంబంధించి 10 నెలల వేతనం ప్రభుత్వం చెల్లించాలి. సగటున నెలకు రూ.లక్ష వేసుకున్నా పది నెలలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలుగా 200 మందికి రూ.20 కోట్లను ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా చెల్లించ కుండా పెండింగ్లో ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం (నేడు) కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పెన్షనర్లు ధర్నాకు పిలుపునిచ్చారు.● మూడునెలలుగా మట్టి ఖర్చులనూ అందించని చంద్రబాబు సర్కారు ● పేరుకుపోయిన గ్రాట్యుటీ, ఈఎల్ బకాయిలు ● నేడు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా ● రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మల్లికార్జున (పేరు మార్చాం) గత ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ (ఎర్న్ లీవ్) డబ్బులు సుమారు రూ.10 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ తరువాత పింఛను తప్ప ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికీ తనకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ● ఒక ఉపాధ్యాయుడు గత ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ రూ.12 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ చేసి తొమ్మిది నెలలు అవుతున్నా బెనిఫిట్లు అందించలేదని, ఇటీవల ఇంట్లో శుభకార్యం చేసేందుకు రూ.10 లక్షలు అవసరమైతే తెలిసిన వారి నుంచి వడ్డీకి డబ్బు తీసుకున్నానని వాపోయారు. -
అర్జీదారుడు సంతృప్తి చెందాలి
● పీజీఆర్ఎస్లో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి ● అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘‘క్షేత్రస్థాయికి వెళ్లండి..సమస్యను స్వయంగా పరిశీలించండి.. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపండి’’ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 281 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కలెక్టరేట్లో అర్జీ ఇస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఎంతో నమ్మకంతో ఇక్కడిదాకా వచ్చి అర్జీ ఇస్తారని, అధికారులు బాధ్యత వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రేపు మడకశిర చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ● ఎన్నికల అధికారిగా పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ మడకశిర: స్థానిక నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశానికి కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులంతా తప్పకుండా హాజరు కావాలని కోరారు. పది, ఇంటర్ ప్రవేశాలకు 16న కౌన్సెలింగ్అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సీట్ల భర్తీకి ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కురుగుంట స్కూల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పదో తరగతికి సంబంధించి ఉరవకొండ స్కూల్లో ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1, హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ–7, అమరాపురంలో ఎస్టీ–1, ఓసీ–1, మలుగూరులో ఎస్సీ–2, ఎస్టీ–1 ఖాళీలున్నాయన్నారు. సీనియర్ ఇంటర్కు సంబంధించి... ఉరవకొండ ఎస్సీ–48, ఎస్టీ–3, బీసీ–3, ఓసీ–2, నల్లమాడలో 55, కురుగుంటలో ఎస్సీ–1, ఎస్టీ–2, బీసీ–2, హిందూపురం (బాలికలు)లో ఓసీ–1, అమరాపురంలో ఎస్సీ–1, ఓసీ–1, మలగూరులో ఎస్సీ–19, బీసీ–1 సీటు ఖాళీ ఉందన్నారు. 16న నేరుగా స్పాట్ కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. బీమా ప్రీమియం చెల్లింపునకు నేడు ఆఖరు అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో వాతావరణ బీమా పథకం కింద గుర్తించిన పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు మంగళవారంతో ముగియనుంది. బీమా కింద నోటిఫై చేసిన వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం ప్రీమియం కట్టాలి. పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, టమాటకు రూ.1,600, అరటికి రూ.3 వేల ప్రకారం జూలై 15 లోపు ప్రీమియం కట్టాలంటూ వారం క్రితం వ్యవసాయశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా వేలాది మంది ప్రీమియం చెల్లించాల్సిన ఉంది. ఈ క్రమంలో ఈనెలాఖరు వరకు గడువు పొడిగించాలని జిల్లా వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. -
హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకూ నీరు
బొమ్మనహాళ్: హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకు తుంగభద్ర జలాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీబీ డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం బొమ్మనహాళ్ వద్ద ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువను, రెగ్యులేటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ టీబీ డ్యాంకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల డ్యాం నంచి 1,400 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీకి వదిలామన్నారు. 105వ కిలోమీటర్ వద్దకు 500 క్యూసెక్కుల మేర వస్తున్నట్లు తెలిపారు. నవంబర్లో వర్షాలు వస్తే హెచ్చెల్సీకి నీటి వాటా పెంచుతామన్నారు. ఆంధ్రాలో అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో నీటిని తీసుకునేందుకు ఆలస్యం కావొచ్చన్నారు. టీబీ డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. 33 క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేయాల్సిన నేపథ్యంలో 80 టీఎంసీలకు కుదించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం పూర్తి స్థాయిలో నిండిందన్నారు. ప్రస్తుతం 39,667 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 25,181 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతోందన్నారు. డ్యాం 5 క్రస్ట్ గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 14,590 క్యూసెక్కులను నదికి విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్డీఓ ప్రవీణ్కుమార్రెడ్డి, జేఈ రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అలవాటు.. గ్రహపాటు
● హిందూపురానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కారులో బయలుదేరి బెంగళూరు విమానాశ్రయం వెళ్తారు. తెల్లవారుజామున 3 గంటలకు తిరుగు పయనమవుతారు. తెల్లవారుజామున 5.30 గంటలకు పడుకుని ఉదయం 10.30 గంటలకు లేస్తారు. ఆ తర్వాత నేరుగా మధ్యాహ్న భోజనం తింటారు. దీంతో ఉదయం టిఫిన్ తినడం మానేశారు. ఫలితంగా ముగ్గురికూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైగా మిగతా రోజుల్లో తెల్లవారుజాము వరకూ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● ‘కియా’ ఉద్యోగులు ఆరుగురు ఒకే విల్లాలో ఉంటారు. రోజూ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత టీ తాగేందుకు బాగేపల్లి టోల్ గేట్ వరకు వెళ్తుంటారు. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి 1 నుంచి 2 అవుతోంది. నిద్రపట్టేందుకు మరో గంట పడుతుంది. దీంతో అందరూ నిద్రలేచే సమయంలో నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం ఎప్పుడో నిద్రలేచి ఉన్నఫలంగా పది నిమిషాల్లో రెడీ అయి డ్యూటీకి వెళ్తున్నారు. నీరసం, నిద్ర ఒకేసారి వస్తుండటంతో విధులు కూడా సరిగా నిర్వహించలేక చివాట్లు తింటున్నారు.కొంపముంచుతోన్న కల్చర్ సిటీ కల్చర్ పేరుతో జిల్లా యువత కొత్త హంగులకు వెళ్లి లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. కొత్త కొత్త విధానాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ పెడదారి పడుతున్నారు. పుట్టపర్తి వంటి పట్టణాల్లో విదేశీయులు ఉండటంతో వారితో పరిచయం ఉన్నోళ్లు.. అర్ధరాత్రి వరకూ కాలయాపన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఫలితంగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలోని హిందూపురంతో పాటు చిలమత్తూరు, కొడికొండ చెక్పోస్టు, పెనుకొండ, పుట్టపర్తి ప్రాంతాల నుంచి యువత నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. టీ తాగాలంటే ఓ ప్రాంతం.. టిఫిన్ తినాలంటే మరో ప్రాంతానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఫలితంగా రాత్రింబవళ్లు తేడా లేకుండా తిరగడం మొదలుపెట్టారు. దీంతో జీవనశైలిలో మార్పులు రాగా రోగాల బారిన పడుతున్నారు. అర్థరాత్రి చక్కర్లు..అనర్థాలు జిల్లా యువకులు మెట్రో సిటీ యువతతో పోటీ పడాలని భావిస్తున్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి వేళ కార్లలో చక్కర్లు కొట్టడం ఫ్యాషన్గా మార్చుకున్నారు. ఈ క్రమంలో జిల్లా నుంచి బెంగళూరుకు రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. అయితే జాతీయ రహదారి కావడంతో చాలామంది ప్రమాదాల బారిన పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. మరికొందరు ఇలా అర్ధరాత్రి తిరుగుళ్లకు అలవాటు పడి నిద్రలేమితో ఆస్పత్రుల బాట పడుతున్నారు. బెంగళూరు పక్కనే ఉండటంతో గంట వ్యవధిలో వెళ్లి రావచ్చనే ఉద్దేశంతో టక్కున వెళ్లి వస్తున్నారు. పగటి పూట పనుల్లో బిజీగా ఉంటూ రాత్రివేళ తిరిగేందుకు అలవాటు పడి నిద్రకు దూరమైన లేనిపోని రోగాల కొని తెచ్చుకుంటున్నారు. యువకులే అధికం అర్ధరాత్రి వేళ చక్కర్లు కొట్టే వారిలో యువకులే 90 శాతం మంది ఉండటం విశేషం. విధులు ముగించుకుని వారంతపు సెలవుల్లో అయితే మద్యం తాగుతారు. ఆ తర్వాత కారుతో రోడ్డెక్కుతారు. రయ్ రయ్ మంటూ బెంగళూరు వరకు వెళ్లాలని గ్యాంగ్లో ఎవరో ఒకరు పట్టుబడుతారు. ఫలితంగా ఇష్టం లేని వారు కూడా ప్రమాదమని తెలిసినా.. వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం రద్దు చేసుకుంటే సెల్ ఫోన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. మిగతా రోజుల మాదిరిగా నిద్ర రాకపోవడంతంతో అరచేతిలో స్మార్ట్ ఫోన్ తీసుకుని నొక్కుతూ కాలయాపన చేస్తున్నారు. బయట తిరగడం మానేసిన తర్వాత సెల్ ఫోన్తో బిజీ అవుతున్నారు. ఫలితంగా నిద్రకు దూరం అవుతున్నారు. నిద్రలేమి సమస్యలో ఆస్పత్రులకు చేరడం అలవాటుగా మార్చుకున్నారు. యువత.. పెడదోవ స్నేహితులతో కలిసి బెంగళూరు వరకూ షికారు అర్ధరాత్రి రయ్రయ్ మంటూ రోడ్డుపై పయనం మరికొందరు పొద్దుపోయే వరకూ సెల్ఫోన్లలో బిజీ ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడుతోన్న యువత మానసిక, శారీరక సమస్యలతో సతమతం -
దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పీటీఎం, యోగాంధ్ర, ట్రైనింగులు తదితర బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను మళ్లించడంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ వేదికగా ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి .రామాంజనేయులు మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో బోధన అభ్యసన కార్యక్రమాలు జరిగేలా విద్యాశాఖ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు, 12వ పీఆర్సీ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ బకాయిలు చెల్లించాలని, సరెండర్ లీవ్ ఎన్క్యాస్మెంట్ మూడేళ్లయినా చెల్లించలేదన్నారు. పురపాలక, నగరపాలక పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నెలవారీ ప్రమోషన్ల ద్వారా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి రామాంజనేయులు -
అద్భుతం.. అద్వితీయం
పట్టు వస్త్రంపై దేశంలోని అన్ని భాషలలో శ్రీరామ నామాలను రూపొందించిన దృశ్యం ధర్మవరం: అతడో సాధారణ చేనేత కార్మికుడు.. అద్భుతమైన మేఽథాసంపత్తి ఉంది.. పట్టుచీరల డిజైన్లను రొటీన్కు భిన్నంగా కళాత్మకంగా రూపొందించడం అతడి ప్రత్యేకత. 2009లో హ్యాండ్లూమ్ విభాగంలో క్లస్టర్ డిజైనర్గా ఉద్యోగం పొందారు. అప్పటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందారు. తనలోని కళను పలువురికి నేర్పుతూ పట్టు విశిష్టతను ప్రపంచానికి డిజైన్ల రూపంలో చాటుతున్న ధర్మవరానికి చెందిన నాగరాజు ఈ ఏడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ డిజైనర్ అవార్డు అందుకోనున్నారు. సాంబ సినిమాతో ఆరంభం ధర్మవరం పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ వరకు చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైద్రాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం పట్టుచీరలపై కళాత్మకంగా వైరెటీ డిజైన్లు రూపొందిస్తూ తనలోని కళాకారుడిని ఈ లోకానికి పరిచయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ చిత్రంలో ఓ సన్నివేశానికి గానూ శంఖు, చక్రం, నామాలతో కూడిన డిజైన్ను బంగారు తాపడంతో పట్టు వస్త్రంపై 2004లో నాగరాజు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిజైన్ ప్రాచూర్యం పొందడంతో నాగరాజుకు పేరు వచ్చింది. ఆ తర్వాత 2009లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వారికి ఔట్ సోర్సింగ్ ద్వారా హ్యాండ్లూమ్లో డిజైనర్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ధర్మవరం హ్యాడ్లూమ్ క్లస్టర్ డిజైనర్గా నాగరాజుకు ఉద్యోగం వచ్చింది. ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాలలో చేనేత కార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు. అందుకున్న అవార్డులు ● 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్మెంట్లో ప్రతిభ చాటినందుకు గాను రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. ● 2020, మార్చిలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డును అందుకున్నారు. మహాత్ముని ఉప్పు సత్యాగ్రహం చిత్రాలను పట్టు వస్త్రంపై రూపొందించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ● 2024, ఆగస్టు 15న ఏపీ అట్ హోం కార్యక్రమంలో భాగంగా రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చేనేతల తరపున పాల్గొనే అవకాశం దక్కింది. ● ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన వివిధ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని చేనేత విశిష్టతను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు వివరించారు. ● ఈ ఏడాది ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే చేనేత దినోత్సవంలో ఉత్తమ డిజైనర్ అవార్డును నాగరాజును అందుకోనున్నారు. పట్టు వస్త్రాలపై విభిన్నమైన డిజైన్లతో ఆకట్టుకుంటున్న నాగరాజు ఉత్తమ డిజైనర్గా జాతీయస్థాయి అవార్డులు అందుకున్న సాధారణ చేనేత కార్మికుడు ఎంతో ఆనందంగా ఉంది ప్రశంసలు అందుకున్న డిజైన్లు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో పట్టు వస్త్రాలపై తాజ్మహల్ చిత్రాలను రూపొందించి ప్రదర్శించారు. 2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పాలను పట్టు వస్త్రంపై చేనేత మగ్గం సాయంతో అద్భుతంగా తయారు చేసి ప్రదర్శించారు. 2017, ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్లు, రాకెట్ చిత్రాలను పట్టు వస్త్రంపై తయారు చేసి విజయవాడలో ప్రదర్శించారు. ప్రముఖ పుణ్య క్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలి గోపురాన్ని పట్టు వస్త్రంపై డిజైన్ చేసి ఆలయానికి అందజేశారు. 2019లో గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్ముని దండీ యాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రాష్ట్రం తరపున ప్రదర్శించారు. 2019, డిసెంబర్లో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రాన్ని రూపొందించి హ్యాండ్లూమ్ కార్యాలయం తరపున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాధర్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై తయారు చేసి ఆమెకు అందజేశారు. 2021లో అయోధ్యలోని రామయ్యకు కానుకగా శ్రీరామ కోటి పట్టు వస్త్రాన్ని తయారు చేసి పంపారు. 2022లో త్రీడీ శారీ తయారు చేసి ఒకే పట్టు చీరపై మూడు డిజైన్లు రూపొందించి అబ్బుర పరిచాడు. ఈ ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ చిత్రంతో కూడిన పట్టు వస్త్రాన్ని తయారు చేసి ఆమెకు బహూకరించారు. సాధారణ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న నేను.. ఆసక్తితో డిజైనర్గా శిక్షణ తీసుకుని ఎన్నో విభిన్నమైన డిజైన్లను రూపొందించాను. చేనేతల సత్తాను జాతీయ స్థాయిలో చాటాలన్నదే నా సంకల్పం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులతో పాటు ఎన్హెచ్డీసీ తరపున జాతీయ అవార్డు అందుకున్నా. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ డిజైనర్గా జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది. –నాగరాజు, డిజైనర్, ధర్మవరం -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి పుట్టపర్తి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ శంకర్ నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా పరిషత్తు చైర్పర్సన్ హారికపై టీడీపీ నేతలు దాడి చేయడం దారుణమన్నారు, మహిళ అని కూడా చూడకుండా దాడులకు పాల్పడడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని అభివర్ణించారు. దౌర్జన్యాలు, దాడులతో ఆంధ్రప్రదేశ్ బిహర్ను తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. మహిళలు స్వేచ్ఛగా బయట తిరగాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. చైర్పర్సన్పై దాడి జరిగితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ‘ఆశల్ని’ ఆపేశారు! అధికారుల అలసత్వం.. రైతులకు అశనిపాతం ● హెచ్చెల్సీలో పూర్తి కాని మరమ్మతు పనులు ● సరిహద్దులో ఆగిన తుంగభద్ర జలాలు బొమ్మనహాళ్: రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ముందస్తుగా నీరొచ్చాయని పడిన సంతోషాన్ని ఆదిలోనే దూరం చేశారు. గంగపూజ నిర్వహించి స్వాగతించాల్సిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఈనెల 10న నీటిని హెచ్చెల్సీ కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105–272 కిలోమీటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. అయితే, హెచ్చెల్సీలో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఇబ్బంది లేకుండా 105వ కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్లను కిందికి దించి వేసి నీరు ఆంధ్రాలోకి ప్రవేశించకుండా ఆపేశారు. పర్యవేక్షణ కరువై ఇష్టారాజ్యం.. కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా హెచ్చెల్సీలో మరమ్మతు పనులు అనుకున్నట్లుగా సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 115 నుంచి 138 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులు, నాగలాపురం వద్ద, ఉద్దేహాళ్–మల్లికేతి బ్రిడ్జిలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పనుల పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ నీటిని సరిహద్దుల్లోనే ఆపేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతులు ఇప్పటికే బోర్ల కింద వరి నారు, మిరప నార్లు పోసుకున్నారు. తుంగభద్ర జలాలు వచ్చి ఉంటే నారుకు బాగుండేదని, బోరు నీటికి నారు పైరు ఎర్రగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించి తమకు సాంత్వన చేకూర్చాలని రైతులు కోరుతున్నారు. -
అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారుల
బత్తలపల్లి: అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది చేస్తూ తమ అధికారాలను ప్రభుత్వాధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు చల్లా శ్రీరాములుకు చెందిన భూమి కోర్టు పరిధిలో ఉన్నా.. లెక్క చేయకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమంగా కంచె తొలగించిన విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలో అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించి తమ అధికారాలను వారు దుర్వినియోగం చేశారన్నారు. రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధిత రైతుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేతిరెడ్డి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి, మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి, నాయకులు చల్లా కృష్ణమనాయుడు, చల్లా శ్రీరాములు, చల్లా మహేష్, చల్లా రంగానాయుడు, కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ షరాబ్ యోగానంద ఆచారి, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారులు తొలగించిన కంచెను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి -
టిప్పర్ ఢీ – వృద్ధుడి మృతి
ముదిగుబ్బ: టిప్పర్ ఢీ కొనడంతో ముదిగుబ్బ మండలం రామస్వామినాయక్ తండాకు చెందిన శ్రీనివాసులునాయక్ను(62) దుర్మరణం పాలయ్యాడు. స్వగ్రామం నుంచి ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. మృతునికి భార్య తులసీబాయి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహిత ఆత్మహత్యపరిగి: మండలంలోని మోదా పంచాయతీ పుట్టగూర్లపల్లిలో వివాహిత మంజుల(22) ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన మేరకు.. పుట్టగూర్లపల్లి నివాసి శ్రీనివాసులు తన కుమార్తె మంజులను అదే గ్రామానికి చెందిన సమీప బంధువు కుమారుడు జయచంద్రకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఏడాది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె ఆదివారం నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. గమనించిన బంధువులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉంటుందని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు. నేడు పోలీస్ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేస్తే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రా క్రికెట్ జట్టులో చోటుఅనంతపురం: ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో జరిగే వన్డే క్రికెట్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఆంధ్రా అండర్–19 పురుషుల క్రికెట్ జట్టులో జిల్లాకు నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో కోగటం హనీష్ వీరారెడ్డి, టీవీ సాయి ప్రతాపరెడ్డి, ఎ.జయంత్ కృష్ణ (తాడిపత్రి), ఎం.భువనేశ్వర్ (గుత్తి), ఎస్.రెహాన్ (గుంతకల్లు) ఉన్నారు. -
‘విశ్వ’ ఖ్యాతి..అధోగతి
అనంతపురం: రాయలసీమకే తలమానికంగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అనుబంధ కళాశాలలన్నీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా పొందుతుండడంతో వర్సిటీ పాత్ర పరిమితం కానుంది. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలే వర్సిటీకి వెన్నుదన్ను. ఆయా కళాశాలల విద్యార్థులు చెల్లించే యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ (యూసీఎస్) ఫీజులు వర్సిటీకి అతిపెద్ద ఆర్థిక వనరు. అయితే.. అనుబంధ కళాశాలల నుంచి స్వయం ప్రతిపత్తి కళాశాలలు (అటానమస్)గా మార్పు చెందుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం ప్రతి ఇంజినీరింగ్ కళాశాల అటానమస్గా మార్పు చెందాలని నిర్దేశించడం ఇందుకు ఊతంగా నిలుస్తోంది. జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో మొత్తం 69 ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. ఇందులో ఇప్పటికే 45 కళాశాలలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. మిగిలిన 24 ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరానికి అనుబంధ కాలేజీలుగా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి ఇవి కూడా స్వయం ప్రతిపత్తి పొందనున్నాయి. న్యాక్లో ఏ రకమైన గ్రేడ్ ఉన్నా అటానమస్ హోదా వస్తుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే అటానమస్ హోదా ఇచ్చేస్తున్నారు. అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్టీయూ కేవలం క్యాంపస్ కళాశాల, పులివెందుల, కలికిరి, ఓటీపీఆర్ఐ కాలేజీలకే పరిమితం కానుంది. వర్సిటీ బాధ్యతలు నామమాత్రం అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్టీయూ(ఏ) కేవలం డిగ్రీలు అందించే కార్యాలయంలా మారిపోనుంది. సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్కుల కేటాయింపులో అటానమస్ కళాశాలలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కులు వర్సిటీకి పంపితే స్నాతకోత్సవ డిగ్రీ మాత్రం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ బాధ్యతలు నామమాత్రం కానున్నాయి. ఒకప్పుడు ఏటా లక్ష మంది విద్యార్థులు వర్సిటీ కింద ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలకు పడిపోయింది. వచ్చే ఏడాది మరింత తగ్గి కేవలం మూడు వేలకు పరిమితం కానుంది. దీంతో యూసీఎస్ ఫీజులు కూడా వర్సిటీకి రావు. పురోగతికి కానరాని చర్యలు జేఎన్టీయూ (ఏ) పరిధిలో విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడనుంది. ఈ క్రమంలో క్యాంపస్ కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాలానుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను అందించే దిశగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు సరికొత్త కోర్సులు అమలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అయితే 78 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకునే క్యాంపస్ కళాశాలలో కొత్త కోర్సుల అమలుకు యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు 2023లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. పాలకమండలి ఆమోదం సైతం లభించింది. అయితే, ఇందుకు సంబంధించిన ఫైలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో పెండింగ్ పడిపోయింది. దీనిపై వర్సిటీ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. తగ్గిపోతున్న జేఎన్టీయూ(ఏ) ప్రాభవం ఇప్పటికే 45 కళాశాలలకు అటానమస్ వచ్చే ఏడాది అన్ని కళాశాలలకూ స్వయం ప్రతిపత్తి క్యాంపస్, పులివెందుల, కలికిరి కళాశాలలకే పరిమితం కానున్న వర్సిటీ -
● చూసిన కనులదే భాగ్యం..
పుట్టపర్తి అర్బన్: మండలంలోని సుబ్బరాయునిపల్లి సమీపంలో చౌటవంకలో వెలసిన సప్తమాతృక అక్కమ్మ దేవతల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాలికల కుంకుమార్చన, బాలుర నెమలి ఈకల నివేదన కార్యక్రమంతో జాతర పూర్తయింది. ఈ సందర్భంగా అక్కమ్మ దేవతల మూల విరాట్లను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అక్కమ్మ దేవతలకు ప్రతీకగా ఏడుగురు బాలికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దైపె కుంకాలు చెరిగారు.ఎడ్ల బండ్లను ఊరేగించారు. -
ఆరోగ్య పరిరక్షణపై దృష్టి
ధర్మవరం రూరల్: ప్రజలు జీవనశైలి, ఆహార నియమాలు, శారీరక శ్రమ, వ్యాధులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం సూచించారు. శనివారం ఆమె పోతుకుంట బీసీ కాలనీలో పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన వినయ్ కుటుంబాన్ని కలసి, మరణానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇతర సాంక్రమిక వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరి దినచర్యలో యోగా ఒక భాగం కావాలన్నారు. ముఖ్యంగా యువత జీవనశైలి, ఒత్తిడి మీద విస్తృతంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. గుండె జబ్బుల మీద రాష్ట్ర ప్రభుత్వం ‘స్టెమీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చెన్నారెడ్డి, మండల వైద్యాధికారులు పుష్పలత, దిలీప్, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్రెడ్డి, ఎంఎల్హెచ్పీ గౌతమి, ఏఎన్ఎం శ్యామల, హెల్త్ అసిస్టెంట్ తిరుపాల్ నాయక్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంగారు దుకాణాలపై మెరుపు దాడులు హిందూపురం: కర్ణాటక పోలీసులు చోరీలకు సంబంధించి ఆభరణాల రికవరీలో భాగంగా హిందూపురంలోని బంగారు దుకాణాలపై శనివారం రాత్రి మెరుపు దాడులు చేశారు. మెయిన్ బజారులోని పలు షాపుల వద్ద విచారణ చేపట్టారు. ఒకటి, రెండు షాపుల వద్ద కొంత బంగారు సొత్తు రికవరీ చేసినట్లు సమాచారం. దొంగ ఏ షాపు పేరు చెప్తే ఆ షాపు నిర్వాహకుడిని వేధింపులకు గురిచేస్తారని పలువురు దుకాణదారులు భయపడిపోతున్నారు. పోలీసులు మాత్రం దొంగసొత్తులను హిందూపురం, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు కొంటుంటారని చెబుతున్నారు. బాలికపై అసభ్య ప్రవర్తనఅనంతపురం: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు ‘పోక్సో’ కేసు నమోదు చేశారు. వివరాలు.. అనంతపురానికి చెందిన బాలిక తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం రోజూ బయటకు వెళ్లేవారు. 9వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంట్లో ఉన్న తాతకు కాఫీ చేసి ఇవ్వడానికి స్టవ్ వెలిగించింది. ఈ క్రమంలోనే గ్యాస్ లీకవుతోందని గమనించిన బాలిక... విషయాన్ని తన తాతకు చెప్పింది. వెంటనే ఆయన తమ ఇంటి సమీపంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న శివారెడ్డి కుమారుడు ఆనంద రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే ఇంటి లోపలికి వెళ్లిన ఆనంద రెడ్డి బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. -
హిందూపురం.. అభివృద్ధి శూన్యం
చిలమత్తూరు: రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయింది. అయితే ఎన్నికల హామీల అమలును విస్మరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలమైంది. అయినా ఏడాది పాలనలో హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందంటూ టీడీపీ నేతలు కరపత్రాల ద్వారా ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధి కోసం ఏకంగా రూ.171.2 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంటున్నా పనులు ఎక్కడ చేశారు.. ఎంత వెచ్చించారు అన్న వివరాలు పొందుపరచలేదు. ప్రజాప్రతినిధి పీఏలు, టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికి కొన్ని పనులు చేపట్టి, బిల్లులు చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన పనులకే బిల్లులు! హిందూపురం పట్టణంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. రోడ్లపైనే మురుగు పారుతున్నా పట్టించుకునే వారు లేరు. పూడికతీత పనుల్లో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడి పనులు చేస్తున్నట్టు జియో ట్యాగ్ చేసి, చేసిన పనులకే బిల్లులు పెట్టించుకునే ఎత్తుగడ వేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కౌన్సిల్లో ప్రశ్నించినా జియో ట్యాగింగ్ చూపి నిధుల మంజూరుకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఇలా పట్టణంలో నాసిరకం పనులు చేసి రూ.లక్షలు దండుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ● పట్టణంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీలు అనేకం ఉన్నాయి. రూ.18.5 కోట్లు ఖర్చు చేసి సీసీ డ్రెయిన్లు, రోడ్లు, వీధి దీపాలు వేశామని ప్రచారం చేసుకుంటున్న నాయకులు.. మరి రోడ్లపైకి మురుగు ఎందుకు వస్తుందో సమాధానం చెప్పలేకపోతున్నారు. మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానం.. ఏడాది పాలనపై ముద్రించిన కరపత్రంలో పేర్కొన్నట్లు హిందూపురం మున్సిపాలిటీలో రోడ్లు లేవు. ఏడాది క్రితం పరిగి బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేసిన రోడ్డు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. రైల్వే రోడ్డు విస్తరణ ముందుకు సాగలేదు. ఇరుకై న గుంతల రోడ్డులోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఇది ప్రధానమైన రోడ్డు కాగా.. ఆక్రమణదారులకు సహకరించే క్రమంలో విస్తరణ పనులు కావాలనే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొటిపి రహదారి గుంతలమయంగా మారింది. డీబీ కాలనీలో రోడ్లే లేవు. అక్కడక్కడా గుంతలు పూడ్చి వాటిని రోడ్ల మరమ్మతుల కింద పాలకులు జమకట్టేశారు. వీటి కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశామని పేర్కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● నియోజకవర్గంలోని లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో పొలాలకు దారుల ఏర్పాటు పేరుతో ఉపాధి హామీ నిధులు వెచ్చించారు. అయితే రియల్టర్ల భూములున్న ప్రాంతాలకు రోడ్లు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో రోడ్లు లేని గ్రామాలున్నా వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. చిలమత్తూరులో జనవరిలో అంబేడ్కర్ విగ్రహం నుంచి వడ్డి చెన్నంపల్లి వరకు, ప్రభుత్వ ఆస్పత్రి వరకు రహదారి నాసిరకంగా వేసి బిల్లులు చేసుకున్నారు. ఆ రోడ్లు కూడా పెద్ద వర్షం వస్తే కంకర తేలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సంజీవరాయునిపలి రహదారి గుండా రోడ్డు మరమ్మతులు నాసిరకంగా చేసి మమ అనిపించారు. ఎస్.ముద్దిరెడ్డిపల్లి, మదిరేపల్లి వంటి రహదారుల దుస్థితి కూడా అధ్వానంగానే ఉంది. అభివృద్ధి అంతా బూటకం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏడాది పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల సమయం తప్ప ఆయన ఏనాడైనా ప్రజల బాగోగులు విన్నారా..? చుట్టం చూపుగా అలా రావడం.. వెళ్లిపోవడం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. స్థానికేతరులకు పట్టం కట్టిన ప్రజలపై ఇలా చిన్నచూపు చూడటం సరికాదు. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. – టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం మౌలిక సదుపాయాలూ కరువే ప్రజల సమస్యలు వినేవారెవరు? అతిథిగా అలా వచ్చి వెళ్లిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఇదీ హిందూపురం నియోజకవర్గంలోని దుస్థితి -
హిందీ టీచర్ను నియమించండి
హిందూపురం: తమకు హిందీ టీచర్ను నియమించాలని హిందూపురం మండలం తూముకుంట గ్రామ పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూముకుంటలోని పారిశ్రామిక వాడలో బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి పిల్లలు 50 మంది స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే భాష తెలియని కారణంగా మరో వంద పిల్లలు పాఠశాలకు దూరమయ్యారు. విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా హిందీ టీచర్ను నియమించకపోవడంతో చివరకు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి నాలుగు నెలల క్రితమే ఆర్జేడీతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అయినా ఇప్పటి వరకూ హిందీ టీచర్ను నియమించకపోవడంతో వలస కార్మికుల పిల్లలు బడికి దూరమవుతున్నారు. దీంతో హిందీ టీచర్ను ఏర్పాటు చేసి, తమ పిల్లలు భవిష్యత్తును కాపాడాలని వలస కార్మికులు కోరుతున్నారు. బాలికలకు రక్షణ కరవు.. ప్రస్తుతం తూముకుంట పాఠశాలకు ప్రహరీ లేదు. ఈ పాఠశాలలోని రెండే గదుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు వంద మంది విద్యార్థులు ఉన్నారు. ప్రహరీ లేకపోవడంతో తరచూ తాగుబోతులు పాఠశాలలో చేరి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ బాలికపై అఘాయిత్యం కూడా జరిగింది. అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధం
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పుట్టపర్తి అర్బన్: జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజాబేగం అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని డీసీహెచ్ మధుసూదన్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయన్నారు. జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సునీల్, డెమో బాబాఫకృద్ధీన్, సీహెచ్ఓ శివరాం, ఐసీడీఎస్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద కారకుడికి జైలు పెనుకొండ: వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి తనతో పాటు మరో ముగ్గురిని క్షతగాత్రులను చేసిన ఓ వ్యక్తికి పెనుకొండ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జప్ప 3 నెలల జైలు శిక్ష విధించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు... అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి, రఘునాయక్, సుధాకర్, కుళ్లాయప్ప తదితరులు ఓ పని నిమిత్తం 2018 జూన్ 18న క్రూజర్ వాహనంలో పెనుకొండకు బయలుదేరారు. వాహనం అమర్నాథరెడ్డి నడుపుతున్నాడు. వీరి వాహనం ఆర్టీఓ చెక్పోస్ట్, రబ్బర్ ఫ్యాక్టరీ మధ్యకు రాగానే టైరు పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని వ్యక్తులందరూ గాయపడ్డారు. ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో ప్రమాదానికి అమర్నాథ్రెడ్డి కారకుడిగా నిర్ధారించి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన పెనుకొండ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జప్ప నేరం రుజువు కావడంతో ముద్దాయి అమర్నాథ్రెడ్డికి 3 నెలల జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారని ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. డెంగీతో బాలింత మృతి గార్లదిన్నె: డెంగీ జ్వరంతో ఓ బాలింత మృత్యువాతపడింది. ఈ ఘటనతో కల్లూరులో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన షేక్ చాందిని (22)కి ఏడాదిన్నర క్రితం గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన షేక్ సాదిక్ అనే కూలీతో వివాహమైంది. రెండు నెలల క్రితం చాందిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల ఆరో తేదీన చాందినికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరం అని తేల్చారు. దీంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సవీర ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స చేయించినా జ్వరం తగ్గకపోవడంతో చాందిని శుక్రవారం మృతి చెందింది. భార్య మరణాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. పసికందును ఎత్తుకుని.. తల్లిలేని లోటు ఎవరు తీరుస్తారంటూ కన్నీరుమున్నీరయ్యాడు. -
ప్రాణాలు బలిగొన్న చేపల వేట సరదా
గుమ్మఘట్ట: చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. స్థానికులు తెలిపిన మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన మన్సూర్ బాషా (34), కర్ణాటకలోని రాంపుర గ్రామానికి చెందిన జబీవుల్లా (28) ఇద్దరూ మంచి స్నేహితులు. మన్సూర్బాషాకు భార్య టబూ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. టైలరింగ్తో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాగే జబీవుల్లాకు భార్య గుల్జార్భాను, ఇద్దరు కుమారులు ఉన్నారు. డ్రైవింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. చేపల వేట అంటే ఎంతో ఆసక్తి ఉన్న ఇద్దరూ గురువారం గాలాలు తీసుకుని ద్విచక్ర వాహనంపై గుమ్మఘట్ట మండలంలోని బీటీ ప్రాజెక్ట్కు చేరుకున్నారు. గాలం వేసే సమయంలో ప్రమాదవశాత్తు మన్సూర్బాషా అదుపు తప్పి నీటిలో పడిపోవడంతో స్నేహితుడిని కాపాడేందుకు తనకు ఈత రాకపోయినా జబీవుల్లా దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మృతిచెందారు. శుక్రవారం ఉదయం నీటిలో మృతదేహాలు తేలియాడుతుండడం గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీయించారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతులను మన్సూర్బాషా, జబీవుల్లాగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నీట మునిగి ఇద్దరు యువకుల మృతి -
రాజీమార్గమే రాజమార్గం
హిందూపురం: రాజీమార్గమే రాజమార్గమని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లునాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకొని కక్షిదారుల సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలన్నారు. ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చి రాజీ కావడంతో డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. ఇందుకు లోక్అదాలత్ బాగా ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో న్యాయవాదులు సిద్ధు, రాజశేఖర్, కళావతి, సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు. జాబిలికి ఇంటర్నేషనల్ గ్లోరీ పురస్కారం పెనుకొండ: పట్టణానికి చెందిన ప్రముఖ కవి జాబిలి చాంద్బాషాకు ఇంటర్నేషనల్ గ్లోరీ పురస్కారం దక్కింది. శుక్రవారం హైదరాబాద్లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాకవి సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న చాంద్బాషాకు ప్రముఖ కవులు రమణాచారి, రఘువీర్ప్రతాప్, డాక్టర్ చక్రవర్తి తదితరులు పురస్కారం అందజేసారు. -
కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి!
కదిరి అర్బన్: వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇంటి పెద్ద మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన కదిరి మండలం బందార్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. బందార్లపల్లికి చెందిన నవీన్కుమార్ (35)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మగ్గం పనితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా భార్య మృతి చెందింది. అప్పటి నుంచి చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటూ వారిని నవీన్కుమార్ అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తున్నాడు. పెడదోవ పట్టించిన పరిచయం.. బందార్లపల్లికి చెందిన విశ్వనాథ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కదిరిలోని ఓ హోటల్లో విశ్వనాథ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం విశ్వనాథ్ భార్యతో నవీన్కుమార్కు పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన విశ్వనాథ్ పలుమార్లు నవీన్కుమార్ను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. నవీన్కుమార్ తీరులో మార్పు రాకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులను పిలుచుకుని విశ్వనాథ్ కదిరికి మకాం మార్చాడు. అయినా నవీన్కుమార్ తరచూ తన భార్యతో చాటింగ్ చేస్తూ.. అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్లిపోవడాన్ని గమనించిన విశ్వనాథ్ ఎలాగైనా నవీన్కుమార్ను అడ్డు తొలగించి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ క్రమంలో నవీన్కుమార్ హత్యకు పథకం రచించిన విశ్వనాథ్.. అతని ప్రతి కదలికపై నిఘా ఉంచాడు. శుక్రవారం ఉదయం బందార్లపల్లికి చేరుకుని గ్రామ శివారున కాపుకాశాడు. బహిర్భూమికని ఒంటరిగా వస్తున్న నవీన్కుమార్ ఎదురుపడగానే ఒక్కసారిగా కళ్లలో కారంపొడి చల్లాడు. అనంతరం సిద్ధంగా ఉంచుకున్న కత్తితో కడుపు, ఛాతీపై పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్కుమార్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కదిరి రూరల్ యూజీపీఎస్ సీఐ నిరంజనరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విశ్వనాథ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి ప్రాణం బలిగొన్న వివాహేతర సంబంధం -
16న రామగిరి ఎంపీపీ ఎన్నిక
రామగిరి: టీడీపీ అరాచకంతో రెండుసార్లు వాయిదా పడిన రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పదవికి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీ ఎన్నిక ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెజార్టీ లేకపోయినా ఎలాగైనా రామగిరి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుయుక్తులు, కుట్రలు, అల్లర్లకు పాల్పడగా... ఇప్పటికే రెండు సార్లు ఎన్నిక వాయిదా పడింది. తాజాగా అధికారులు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వగా..ఈసారైనా ఎన్నిక సజావుగా జరిగేనా అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. 10 స్థానాల్లో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులే.. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్రిజర్వడ్ మహిళకు కేటాయించడంతో రామగిరి స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆమె అనారోగ్యంతో 2024 డిసెంబర్ 30న మృతి చెందగా...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. కుట్రలు.. అల్లర్లతో వాయిదాల పర్వం.. ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో 2025 మార్చి 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అధికారంలోకి ఉన్న టీడీపీ నాయకురాలు ఎలాగైనా తన సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని కుట్ర చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. అంతేకాకుండా మిగతా వారినీ భయపెట్టి ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థులకు రక్షణ కల్పించేందుకు మరో ప్రాంతానికి తరలించింది. సరిగ్గా ఎన్నిక రోజున వారందరినీ రామగిరికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నాయకులు బలవంతంగా తీసుకువెళ్లారు. దీంతో ఘర్షణ వాతావరణం చేటుచేసుకోగా, ఎన్నిక సమయానికి ఎంపీటీసీ సభ్యులు రామగిరి చేరుకోలేక పోయారు. దీంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. అనంతరం మే 19న మరోసారి రామగిరి ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినా ...టీడీపీ నేతల బెదిరింపులతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీలు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక్క అభ్యర్థితో పీఠం కోసం టీడీపీ పాకులాట రామగిరి ఎంపీపీ మహిళకు రిజర్వ్ అయ్యింది. టీడీపీ తరఫున గెలిచింది ఒకే ఒక ఎంపీటీసీ...పైగా మహిళ కాదు. అయినప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు రామగిరి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈనెల 16న జరిగే ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ వైపు నిలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ పురుషులే కాగా, మహిళా స్థానం ఎలా దక్కించుకుంటారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈసారైనా ప్రక్రియ సజావుగా జరిగేనా..? ఇప్పటికే టీడీపీ ఓవరాక్షన్తో రెండుసార్లు వాయిదా మెజార్టీతో పీఠం దక్కించుకునేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ -
పెద్దమ్మతల్లికి ఆషాఢ అలంకరణ
ధర్మవరం రూరల్: పట్టణంలోని సాలే వీధిలో వెలసిన పెద్దమ్మతల్లి ఆషాఢ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకుడు వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని చీరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాకు వర్ష సూచన బుక్కరాయసముద్రం: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భారీ గాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. -
నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య పుట్టపర్తి టౌన్: నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులను ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, సూపరింటెండెంట్ నరసింహులుతో కలసి జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. నాటుసారా, నవోదయం, అక్రమ మద్యం రవాణాపై రివ్యూ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించి నాటుసారా తయారీదారులు, అమ్మకందారులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. శిస్తు కట్టని మద్యం అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్లు కల్తీ కాకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి గోవింద్నాయక్, శ్రీరామ్తో పాటు ఎక్పైజ్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం
సాధారణ ప్రసవానికి.. సిజేరియన్కు మధ్య తేడాల గురించి, సిజేరియన్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అలాంటి ఫిర్యాదులు వస్తే తప్పకుండా విచారణ చేపట్టి తగిన చర్యలకు సిఫారసు చేస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే వైద్యులు నిర్ణీత సమయంలో ఆస్పత్రుల్లోనే ఉండాలి. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసినా డ్యూటీ కాల్ వస్తే.. వెంటనే వెళ్లాలనే నిబంధన అమలు చేస్తున్నాం. – ఫైరోజాబేగం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి -
పేదలకు విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో పేద పిల్లలకు విద్య దూరమవుతోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు విద్యావ్యవస్థ అభివృద్ధికి చేసిన మంచి పని అంటూ ఏ ఒక్కటీ లేదని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అభూత కల్పన చేస్తున్న సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ జగనన్న తీసుకువచ్చిందేనన్నారు. శ్రీ సత్యసాయిజిల్లా కొత్త చెరువు ప్రభుత్వ హైస్కూల్లో తల్లిదండ్రులకు టీచర్స్ మీటింగ్లో పిల్లలకు పాఠాలు బోధించిన మీరు రెండు నెలల క్రితం అదే జిల్లాలో ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థినిపై మృగాళ్లు దాడి చేస్తే ఇంత వరకు బాధితురాలి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అక్కడ బాధింపబడిన కుటుంబం మీ పార్టీకి చెందిన వారే అని ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కిరాతకులు మీవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓ బాధిత బాలికలకు భరోసా కల్పించలేని మీరు రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పిస్తారో చెప్పాలన్నారు. కుమారుడు లోకేష్ భవిష్యత్తుపై ఉన్న భరోసా పేద ప్రజలపై సీఎం చంద్రబాబుకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి చంద్రబాబు అసమర్థ పాలనే కారణమన్నారు. పాఠశాల సమస్యలపై మంత్రికి విద్యార్థుల వినతి పరిగి: తమ పాఠశాలలో నెలకొన్న వాటర్ ప్లాంట్, ప్రహరీ, క్రీడా మైదానం తదితర సమస్యలను పరిష్కరించాలని మంత్రి సవితకు ధనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విన్నవించారు. శుక్రవారం మంత్రి సవిత పరిగి మండలంలో పర్యటించారు. తొలుత కొడిగెనహళ్లి పంచాయతీ బిందూనగర్లో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ధనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో ఆరా తీశారు. ప్రహరీతో పాటూ క్రీడా మైదానం చదును తదితర అంశాలను మంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అనంతరం పి.నరసాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య పుట్టపర్తి టౌన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లికి చెందిన చాకలి మహేంద్ర (36)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తండ్రి వైద్యానికి, కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. వ్యాధి నయం కాకపోవడంతో కొంత కాలం క్రితం తండ్రి మృతి చెందాడు. తన సంపాదనతో అప్పులు తీర్చడం సాధ్యం కాదని తరచూ మదన పడుతున్న ఆయన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లుంగీతో ఉరి వేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గమనించిన భార్య వెంటనే బంధువుల సాయంతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న సీఐ సునీత అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. అధికారుల వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం గుంతకల్లు/టౌన్: అధికారుల వేధింపులు తాళలేక విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుని బంధువులు, తోటి ఉద్యోగులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న అన్సూర్ గతంలో గుత్తి ట్రాన్స్కో పరిధిలోని ఆర్టీఎస్ఎస్ (220కె.వి)లో కాంట్రాక్ట్ హెల్పర్గా పనిచేసేవాడు. పరస్పర బదిలీల్లో భాగంగా గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో ఉన్న 132కేవీ సబ్స్టేషన్కు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ను గుత్తికి బదిలీ చేశారు. అయితే ఈ బదిలీల్లో తనకు అన్యాయం జరిగిందని ఓ సహోద్యోగి ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో సంబంధిత ట్రాన్స్కో అధికారులు అన్సూర్ను తిరిగి గుత్తికి వెళ్లిపోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం విధుల్లో ఉన్న సమయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. తాము ఆస్పత్రికి వెళ్లేలోపు అతడిని రెఫర్ చేశారని, ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వన్టౌన్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత ట్రాన్స్కో అధికారిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. -
జోరుగా ఆశల ‘పరవళ్లు’
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓ.ఆర్.కే రెడ్డి, డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్, హెచ్చెల్సీ ఈఈ చంద్రశేఖర్ డ్యాం వద్ద స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు బోర్డు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాయనం వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ ఓ.ఆర్.కే రెడ్డి, డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ మాట్లాడుతూ తుంగభద్ర ఎగువ కాలువకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలి తరువాత ప్రతి రెండు గంటలోకసారి నీటి విడుదలను పెంచుతామని తెలిపారు. కాలువకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రా, కర్ణాటక కోటా కలిపి నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ఈ నెల 10 నుంచి నవంబర్ 30 వరకూ దాదాపు 1,300 క్యూసెక్కులు వదులుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం నుంచి నదికి నీటిని విడుదల చేశామన్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఇటీవల 80 టీఎంసీలకు కుదించామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్కు తుంగభద్ర జలాలు చేరుతాయని అధికారులు తెలిపారు. నిలకడగా ఇన్ఫ్లో.. గురువారం కూడా తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. ఈ క్రమంలో 11 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 31,130 క్యూసెక్కులు నదికి, మరో 8,979 క్యూసెక్కులను హెచ్చెల్సీ, ఎల్లేల్సీ తదితర కాలువలకు వదులుతున్నారు. మొత్తంగా డ్యాంలో ఇన్ఫ్లో 45,944 కూసెక్కులు, ఔట్ఫ్లో 40,109 క్యూసెక్కులుగా నమోదైంది. విషయాలు తెలియవంట..గతంలో హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తుంటే స్థానిక అధికారుల్లో హడావుడి ఉండేది. ఎక్కడైనా కాలువలు దెబ్బతిన్నాయా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలా.. అని పరిశీలించడంతో పాటు నీటి వినియోగంపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈసారి మాత్రం బోర్డు అధికారులే వెంటపడుతుంటే నీటిని తీసుకోవడానికి హెచ్చెల్సీ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్చార్జ్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి విషయమే పట్టనట్లు ఉన్నారు. తాజాగా గురువారం నీటి విడుదలపై ఆయనను వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు ఉన్నారని, మిగితా విషయాలు తనకు తెలియవని, బోర్డు అధికారులతో మాట్లాడి కనుక్కో అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హెచ్చెల్సీ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హెచ్చెల్సీకి నీటి విడుదల రెండు రోజుల్లో సరిహద్దుకు చేరనున్న జలాలు -
ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసనలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, అవ్వా సురేష్, ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి వేధింపులతో మనస్తాపం● ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎస్పీకి అబ్బాయి సెల్ఫీ వీడియో గుత్తి: మండలంలోని రజాపురం గ్రామానికి చెందిన నారాయణస్వామి అనే యువకుడు ఓ అమ్మాయి వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైలు పట్టాలపై గురువారం ఉదయం సెల్ఫీ వీడియో తీసి ఎస్పీ కార్యాలయానికి పోస్టు చేశాడు. డీపీఓ నుంచి సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు సెల్ఫీ వీడియో ఆధారంగా రైలు పట్టాలపై పరుగు తీశారు. గుత్తి–అనంతపురం మార్గ మధ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. యువకుడి సెల్ఫోన్ పామిడి వద్ద స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గాలించినా యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కేజీబీవీలో కోతుల హల్చల్ కూడేరు: స్థానిక కేజీబీవీలో కోతుల బెడదతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. గదుల్లోకి చొరబడి ట్రంక్ పెట్టెల్లోని దుస్తులు, ఇతర వస్తువులను లాగి పడేస్తున్నాయి. స్టోర్ గదిలోకి వెళ్లి వంట సామగ్రిని చెల్లాచెదురు చేస్తున్నాయి. తరగతి గదుల్లోకి చేరి బాలికలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భోజనం సమయంలో తరిమేందుకు ప్రయత్నిస్తే దాడికి యత్నిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది కోరుతున్నారు. -
వేడుకగా గురుపౌర్ణమి
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి ఆలయాలకు గురువారం భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అన్న ప్రసాదం స్వీకరించారు. వేడుకలను పురస్కరించుకుని మందిరాల్లో షిరిడీ సాయినాథునికి ప్రత్యేక పూజలు జరిగాయి. విద్యుద్దీప కాంతుల నడుమ ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. విశ్వగురు సత్యసాయి.. అచంచలమైన ప్రేమ, భక్తి విశ్వాసాలను పంచిన విశ్వగురువు సత్యసాయి అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అభివర్ణించారు. గురువారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రశాంతి భజన బృందం ‘గురువందనం’ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలతో కచేరీ నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద గురుపౌర్ణమిని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రసంగిస్తూ ఆత్మను గురువుకు కృతజ్ఞతతో లొంగిపోయి ఆరాధించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా మానవ జీవితంలో మహిమాన్మిత ఘట్టాలను పొందుతారన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రేమ అనే భావన అచంచలమైనదని, ప్రకృతిలోని ప్రతి పుష్పం, చల్లటి గాలి కూడా ప్రేమతత్వాన్ని పంచుతాయన్నారు. కేంద్ర మంత్రిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు సన్మానించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ మోహన్, చక్రవర్తి, సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. వంద మంది రైతులకు పనిముట్ల పంపిణీ.. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో ఎంపిక చేసిన వంద మంది రైతులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఉచితంగా పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం శాంతిభవన్ అతిథి గృహంలో కేంద్ర మంత్రి పవిత్రమైన రుద్రాక్ష మొక్కలు నాటారు. -
తల్లిదండ్రుల స్పందన అంతంతే
కనగానపల్లి/ చిలమత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం–2.0)లకు జిల్లాలో స్పందన కరువైంది. వారం రోజులుగా కలెక్టర్ మొదలు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు పూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహణపై తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంల మెడపై కత్తిపెట్టి ఒత్తిళ్లు చేశారు. ఇంతచేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. గురుపౌర్ణమి కావడం, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రైతులు, కూలీ చేసుకునే పిల్లలు కావడంతో పనులు మానుకుని వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. చాలా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ ఫొటోలు తీయించి మమ అనిపించారు. ఫొటోల అప్లోడ్పైనే ఆసక్తి.. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫొటోల కోసం తల్లిదండ్రులను బలవంతంగా పిలిపించి వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల అభివృద్ధి, పురోగతిపై చర్చకంటే కూడా కార్యక్రమం నిర్వహించామా...ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేశామా పని అయిపోయిందా అనే విధంగా జరిగాయి. ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదంటూ తల్లిదండ్రులు నిట్టూర్చారు. ‘నాడు–నేడు’ పనులు చేపట్టక ఎక్కడికక్కడ ఆగిపోయిన తరగతి గదుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. పీటీఎంల నిర్వహణకు ప్రభుత్వం చాలీచాలని నిధులు కేటాయించడంతో అవి సరిపోక తమ జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని పలువురు హెచ్ఎంలు వాపోయారు. ● రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి కేజీబీవీలో సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ 200 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. అయితే అందులో 50 మంది పేరెంట్స్ కూడా హాజరు కాకపోవడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ● హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో తూతూమంత్రంగా సాగాయి. చిలమత్తూరు మండలంలోని లక్ష్మీపురంలో గతంలో పాఠశాల నిర్మాణానికి కేటాయించిన స్థలం మరొకరిది అంటూ పంచాయతీ కార్యదర్శి సావిత్రమ్మ తీర్మానం చేయడంపై ప్రజలు పేరెంట్స్ కమిటీ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆ స్థలంలోనే ఎంపీపీ పురుషోత్తమరెడ్డి విద్యార్థుల కోసం సొంత డబ్బుతో తరగతి గదులు కూడా నిర్మించారన్నారు. ఇప్పుడు ఇతరులు సాగులో ఉన్నారంటూ పాఠశాలకు కేటాయించిన స్థలం స్వాధీనం చేసే ప్రయత్నాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల స్థలం జోలికి ఎవ్వరూ రాకూడదంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మొక్కుబడిగా మెగా పీటీఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి చూపని తల్లిదండ్రులు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేసేందుకే ప్రాధాన్యత చాలీచాలని నిధులతో హెచ్ఎం జేబులకు చిల్లు -
కరువు శాశ్వత పరిష్కారానికి చర్యలు
ప్రశాంతి నిలయం: రాయలసీమలో కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు చర్యలు చేపడదామని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కరువు పీడిత జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శివరాజ్సింగ్ చౌహాన్ పాల్గొని ప్రసంగించారు. కరువును శాశ్వతంగా పరిష్కరించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కలసికట్టుగా ఆలోచించి కరువు నివారణకు చక్కటి పరిష్కారం కనుక్కోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఎన్ఆర్ఈజీఎస్, వాటర్షెడ్ తదితర పథకాల కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇతర శాఖల ద్వారా కూడా కరువు నివారణకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యాన శాఖ పరిధిలో పరిస్థితుల గురించి తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, రాష్ట్ర హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితి, వివిధ పంట సాగు వివరాలు, ఇరిగేషన్ అంశాలపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. బుందేల్ఖండ్ రీజియన్ మాదిరిగా రాయలసీమ జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించాలని, సీమ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనంతపురం జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ శర్మ, శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, కర్నూల్ జాయింట్ కలెక్టర్ నవ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ -
నకిలీ బంగారంతో బురిడీ
గుంతకల్లు: నకిలీ బంగారంతో ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీసుస్టేషన్లో గురువారం ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ విలేకరులకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్కు చెందిన తిమ్మయ్య గారి భార్గవ్కుమార్, తెల్ల శివానంద్ బుధవారం 4 బంగారు గాజులు తీసుకుని పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వెళ్లారు. గాజులను నకిలీవిగా గుర్తించిన బ్యాంకు అప్రైజర్ ఈ విషయాన్ని అసిస్టెంట్ మేనేజర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వారిని నిలదీయగా అక్కడి నుంచి ఉడాయించారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్ ద్వారా ఫిర్యాదు అందుకున్న కసాపురం ఎస్ఐ వెంకటస్వామి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. గురువారం కసాపురం రోడ్డులోని ఎస్బీఐ బజార్ బ్రాంచ్లో మరోసారి నకిలీ బంగారం కుదువ పెట్టడానికి భార్గవ్కుమార్, శివానంద్ రాగా.. అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం ముఠా గుట్టు రట్టయింది. క్రాంతి కుమార్, వేణుగోపాల్ సూత్రధారులు గుంతకల్లు పట్టణంలోని ఫక్కీరప్ప కాలనీకి చెందిన చాగంటి క్రాంతి కుమార్, కమ్మర వేణుగోపాల్లు నకిలీ బాగోతంలో సూత్రధారులుగా తేది. బంగారం వ్యాపారం చేసే వీరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 70 శాతం సిల్వర్పై 30 శాతం బంగారు కోటింగ్ వేసి ఉంగరాలు, గాజులు తదితర వాటిని తయారు చేసేవారు. స్థానిక మోమినాబాద్కు చెందిన జావేద్తో నకిలీ బంగారంపై హాల్మార్క్ గుర్తు వేయించాక.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం, ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లక్షలాది రూపాయల రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. కర్నూలుకు చెందిన ఎరుకల శ్రీనివాసులు, పులిపాటి నరేంద్ర, మేకల శ్రీనివాసులు, మల్లెమాల నరేష్కు కూడా నకిలీ బంగారం తక్కువ రేటుకు అమ్మేవాళ్లని తేలింది. నిందితులు 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 39 గ్రాముల నాలుగు బంగారు గాజులు, 13 నకిలీ బంగారు ఉంగరాలు, 5 వెండి ఉంగరాలు, 145 గ్రాముల కాపర్వైర్, 15 గ్రాముల వెండి కడియం, 4 వెండి కాళ్ల పట్టీలతోపాటు రూ.4 లక్షలు విలువ చేసే వెయింగ్ మిషన్ (హాల్మార్క్ ముద్ర వేసే)తోపాటు రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ డీఎస్పీ వివరించారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన కానిస్టేబుల్స్ జాఫర్, కిషోర్కుమార్, ఓబులేసు, మహబుబ్బాషా, అశోక్, నజీర్లను అఽభినంచించారు. -
భక్తి శ్రద్ధలతో శ్రీగిరి రఽథోత్సవం
పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగుతూ ఊరేగింపుగా విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్ కూడలి, చింతతోపు, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ విభాగంలో చోటుధర్మవరం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన చందమూరి నారాయణరెడ్డి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టాలపై యువకుడి మృతదేహం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గురువారం ఉదయం 7 గంటలకు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లేత నీలం రంగు టీ షర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించిన 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడి మృతదేహం ఎడమ చేతిపై నేహ అనే పచ్చబొట్టును గుర్తించారు. అంతకు మించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 99513 25345లో సంప్రదించాలని ధర్మవరం రైల్వే పోలీసులు కోరారు. -
ఆన్లైనా? ఆఫ్లైనా!?
ఈ ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12న వెలువడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి సన్నద్ధమయ్యారు. కానీ, ఫలితాలు వెలువడి మూడు నెలలు గడుస్తున్నా డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ప్రవేశాలను గత ఏడాది మాదిరిగా ఆన్లైన్లో చేపడతారా?, లేకపోతే అంతకుముందు మాదిరిగా ఆఫ్లైన్లో చేపడతారా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి, గోప్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. హిందూపురం టౌన్: ఉన్నత విద్యపై కూటమి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా.. నేటికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది కూడా ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యంగా చేపట్టంతో అనేక కళాశాలల్లో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ ఉన్నత విద్య నిర్వీర్యం.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిగ్రీలో ప్రవేశాలకు మూడు నెలలుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నా నేటీకీ షెడ్యూల్ విడుదల కాలేదు. జూన్లోనే పాఠశాలలు, ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మరో వైపు డిగ్రీ కళాశాలలు కూడా నెల రోజుల క్రితమై పునఃప్రారంభమయ్యాయి. అయినా డిగ్రీలో అడ్మిషన్ల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే పలు ప్రైవేటు, కార్పొరేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి, గుట్టు చప్పుడు కాకుండా తరగతులనూ నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేయడం ద్వారా ప్రైవేట్ కళాశాలలు పుంజుకోగా, పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు వెనుకబడి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుతో ఉన్నత విద్య నిర్వీర్యమవుతోందననే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 8 వేల మంది విద్యార్థుల ఎదురుచూపులు.. 2025–26 విద్యాసంవత్సరంలో డిగ్రీలో అడ్మిషన్లు పొందడానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 10వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. గత ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యంగా చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా చాలా కళాశాలల్లో 30 నుంచి 40 శాతం సీట్లు మిగిలిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎస్కేయూ పరిధిలో మొత్తం డిగ్రీ కళాశాలలుప్రభుత్వ డిగ్రీ కళాశాలలుప్రైవేటు డిగ్రీ కళాశాలలు30 వేల వరకుమొత్తం విద్యార్థుల సంఖ్య డిగ్రీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ విడుదల కానీ షెడ్యూల్ ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించిన ప్రైవేటు కాలేజీలు 86 1373 -
ఘర్షణ కేసులో 21 మంది అరెస్ట్
రాయదుర్గం: వివాహేతర సంబంధ కారణంగా ఆస్తి విధ్వంసాలకు పాల్పడిన 21 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లికి చెందిన అనంతరాజు కొంత కాలంగా అదే మండలం మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంగా వివాదం తలెత్తి సోమవారం రాత్రి అనంతరాజుపై దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అనంతరాజు, ఆయన బంధువులు మైలాపురం చేరుకుని లోకేష్, విజయ్ ఇళ్లల్లోకి చొరబడి తలుపులు, టీవీ, రెండు ద్విచక్రవాహనాలు, కారు ధ్వంసం చేయడంతో పాటు పది ట్రాక్టర్ల ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఇరు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆస్తి నష్టానికి కారకులైన 21 మంది యువకులను గురువారం అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, ఇదే కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతరాజును డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అనంతరాజుపై దాడికి కారకులైన మైలాపురం గ్రామానికి చెందిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ నబీరసూల్, బొమ్మనహాళ్ పోలీసులు పాల్గొన్నారు. -
నిడిగల్లు వాసికి జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు
తాడిమర్రి: మండలంలోని నిడిగల్లు గ్రామానికి చెందిన బీదాల పెద్దన్నకు జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు దక్కింది. బళ్లారి సమీపంలోని ఆదానీ సిమెంట్స్లో దక్షిణ భారతదేశ జోనల్ హెడ్గా పనిచేస్తున్న ఆయన, డాక్టర్ రమేష్ చంద్, నీతి అయోగ్ సభ్యులతో కలసి కంపెనీ సమీపంలోని గ్రామాల్లో 29 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, 65 వేల మందికి పైగా రైతుల జీవనోపాధుల మెరుగు పరచడంలో చేసిన కృషికి గాను అవార్డు దక్కింది. బుధవారం ఢిల్లీలో జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన కృషి విక్రమ్ – 2025 జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిడిగల్లు వాసులు హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ కన్వీనర్ సాకే హరి అరెస్ట్ పుట్టపర్తి టౌన్: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్న ఆర్డీటీ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ సాకే హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కొత్తచెరువు సీఎం పర్యటనలో ఆర్డీటీని కాపాడాలని జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న సీఐలు రెడ్డెప్ప, జయపాల్రెడ్డి తదితరులు సాకే హరిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను సీఎంకు తెలియజేయడానికి చెప్పుకొనేందుకు వెళ్తున్న జేఏసీ నాయకులు, సభ్యలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రైల్వే ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలి గుంతకల్లు: రైల్వే ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కోరారు. గురువారం గుంతకల్లు రైల్వే ఆస్పత్రికి విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మాల రాజరాంకు మెడికల్ బ్రాంచ్ సెక్రటరీ రమేష్తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఆస్పత్రిలో ముఖ్యమైన సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్లతోపాటు 7 నర్సింగ్ స్టాఫ్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఫార్మిసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్ పోస్ట్లు భర్తీకి నోచుకోలేదన్నారు. ఇక్కడి నుంచి అనంతపురం, కర్నూలులోని కార్పొరేట్ ఆస్పత్రులకు రైల్వే ఉద్యోగులను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. గుంతకల్లు పట్టణానికి సమీపంలో ఉన్న బళ్లారి సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రికి రెఫరల్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకముందు సీఎండీ నిర్మాల రాజరాం రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ విభాగాన్ని పరిశీలించి రోగులకు అందతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను నిరసిస్తూ అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అశోక స్థూపం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ఉపాధ్యక్షుడు ధర్మసింగ్ నాయక్, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్ భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు మాట్లాడుతూ.. ట్రోలింగ్తో న్యాయ వ్యవస్థపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సైతం జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
హిందూపురం: మండలంలోని మలుగూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వివరాలు.. సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన నరసింహులు మరో వ్యక్తితో కలసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా మలుగూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అటకాయించి మలుగూరు గ్రామానికి దారి అడిగారు. చెబుతుండగానే కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో కేకలు వేయడంతో దుండగులు ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిచంఆరు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఇళ్లల్లో చోరీ లేపాక్షి: మండలంలోని మైదుగోళం గ్రామంలో మంగళవారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. పది రోజుల క్రితం గ్రామంలో చోటు చేసుకున్న హత్య నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన శాంతమ్మ, బేబీ శ్యామల కుటుంబాలు ఈ 5న గ్రామాన్ని వీడిపోయాయి. తాళం వేసిన ఇళ్లను గుర్తించిన దుండగులు మంగళవారం రాత్రి లోపలకు చొరబడి బంగారు నగలతో పాటు, కిరాణా దుకాణంలోని నగదునూ అపహరించారు. విషయం తెలుసుకున్న బాధితులు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతిఅమరాపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. వివరాలు.. అమరాపురంలోని గాడి దొడ్డయ్య ఇంటి సమీపంలో ఉన్న చింత చెట్టులో ఉన్న తుట్టె నుంచి తేనెను సేకరించేందుకు బుధవారం అదే గ్రామానికి చెందిన యువకులు తిప్పేస్వామి (35), గిరీష్ సిద్ధమయ్యారు. చెట్టు ఎక్కి తేనె తుట్టె వైపుగా సాగుతుండగా చెట్టు మధ్యలో నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలి షాక్కు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిప్పేస్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన గిరీష్కు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. కాగా, కుమారుడు మృతితో ఒంటరిగా మారిన తల్లి పుట్టమ్మ వేదనకు అంతులేకుండా పోయింది. -
‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్లో డెత్
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం సొంతంగా నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోం నుంచి జీజీహెచ్కు రెఫర్ అయిన యువకుడు ఆర్థో వార్డులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ మృతుడి కుటుంబీకులు దాదాపు ఆరు గంటలకు పైగా ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వివరాలు.. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, లక్ష్మీదేవి దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న రెండో కుమారుడు రాజేష్ (22) బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో తన ఎడమ కాలు నొప్పిగా ఉందంటూ 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 3న మేడా నర్సింగ్ హోంకు వెళ్లి డాక్టర్ ఆత్మారాంను సంప్రదించారు. ఆ రోజు అడ్మిషన్లో ఉంచుకున్న అనంతరం ఇక్కడైతే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని, జీజీహెచ్కు వెళితే అక్కడ ఉచితంగా వైద్యం చేస్తారని డాక్టర్ ఆత్మారాం తెలిపి, సిఫారసు చేయడంతో 4న ఆగమేఘాలపై జీజీహెచ్లోని ఆర్థో విభాగంలో వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీయించిన అనంతరం ఎడమ కాలులో చీము ఉన్నట్లు నిర్ధారించి, ఈ నెల 7న శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కానీ, సిబ్బంది కాని పట్టించుకోక పోవడంతో రెండు రోజుల పాటు నొప్పి తాళలేక రాజేష్ విలవిల్లాడినట్లు తల్లి లక్ష్మీదేవి కన్నీటి పర్యతమయ్యారు. నొప్పి వచ్చినప్పుడల్లా పీజీ వైద్యులు పరీక్షించి ఓ టాబ్లెట్, ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేవారని వివరించారు. బుధవారం ఉదయం టిఫిన్ తింటున్న సమయంలో రాజేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయాన్ని వెంటనే డాక్టర్లకు తెలపడంతో వారు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారని వాపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రాజేష్ మృతి చెందాడంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించారు. మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం చేసి మృతుడి కుటుంబీకులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఖర్చు పెట్టలేరనే జీజీహెచ్కు వెళ్లమన్నా కాలు నొప్పితో రాజేష్ మేడా నర్సింగ్ హోంకు వచ్చాడు. ఒక రోజు ట్రీట్మెంట్ ఇచ్చా. మూడు సార్లు ఆపరేషన్ చేయాల్సి ఉందని, అందుకు బోలెడంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పా. వారికి ఆర్థిక స్థోమత లేక పోవడంతో నేనే జీజీహెచ్కు రెఫర్ చేసి, ఉచితంగా ఎంఆర్ఐ తీయించి, సర్జరీ చేశా. మృతికి సెప్టిసేమియా కారణమై ఉండవచ్చు. – డాక్టర్ ఆత్మారాం, మెడికల్ సూపరింటెండెంట్, జీజీహెచ్ వివాదాస్పదంగా మారిన జీజీహెచ్ ఆర్థో వార్డులో యువకుడి మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ 6 గంటలకుపైగా కుటుంబీకుల ఆందోళన దరిదాపులకు రాని సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం -
కోవూరు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయం
చిలమత్తూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరుమాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు చేసిన దాడిని హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఖండించారు. దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. బుధవారం హిందూపురంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందలాది టీడీపీ గూండాలు మూకుమ్మడిగా ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దారుణాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రసన్నకుమార్రెడ్డిని హతమార్చేందుకే ఈ దాడి జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. తమ కంటి ముందే విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల తీరు అమానుషం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా బరితెగించడం సిగ్గుచేటని టీఎన్ దీపిక మండిపడ్డారు. మామిడి రైతులను పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై పోలీసులు విధించిన ఆంక్షలు చూస్తుంటే సీఎం చంద్రబాబు భయపడ్డారనేది స్పష్టమవుతోందన్నారు. పోలీసులను ఉసిగొల్పి రైతులను భయభ్రాంతులకు గురి చేసేలా లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ఈ దుశ్చర్యను బట్టి చూస్తే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అర్థం అవుతోందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు బనాయించినా, బెదిరింపులకు దిగినా రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉంటారనే విషయం ఈ పర్యటనతో స్పష్టమైందన్నారు. ఇప్పటికై నా వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిమానాన్ని గుర్తించి తమ నిరంకుశ ధోరణికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు హితవు పలికారు. వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ధ్వజం -
సచివాలయ బది‘లీలలు’
అనంతపురం అర్బన్: ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మెరిట్ (ర్యాంక్) ఆధారంగా బదిలీలు నిర్వహించాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా రాజకీయ సిఫారసులకు తలొగ్గారు. ఫలితంగా స్థానాల కేటాయింపులో అర్హులైన ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీంతో బాధిత ఉద్యోగులు న్యాయం కోసం కలెక్టర్ వినోద్కుమార్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో అత్యధికంగా వ్యవసాయ శాఖ పరిధిలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, పోలీసు శాఖ పరిధిలోని మహిళ సంరక్షకులు (మహిళ పోలీసు) ఉన్నారు. సిఫారసులకే పెద్దపీట వ్యవసాయశాఖలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగిందనే అరోపణలున్నాయి. బదిలీల ప్రక్రియలో అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మెరిట్ ఆధారంగా కాకుండా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తొలి ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంక్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ సుస్మితకు, అదే జిల్లాలో 3వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 6వ ర్యాంక్ ఉన్న జనార్ధన్కు.. దివ్యాంగుల కోటా కింది శిరీష్.. వారు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కాకుండా అధికారులకు తమకు ఇష్టమొచ్చిన చోటికి పోస్టింగ్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. వీరు కోరిన ఆప్షన్లను వీరి తర్వాతి ర్యాంకు వారికి కట్టబెట్టినట్లుగా తెలిసింది. ఇదే తరహాలో చాలా మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అధికారులు ఇష్టానుసారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఎటూ తేల్చని అధికారులు బదిలీల ప్రక్రియలతో తమకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్కు ఈ నెల 2న అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతే కాక కలెక్టర్ను వారు ఇప్పటికి మూడుసార్లు కలసి న్యాయం చేయాలని కోరారు. ఇక 4న కలెక్టర్కు మహిళ సంరక్షకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులవుతున్నా అధికారులు ఎటూ తేల్చలేదని బాధిత అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిలీవ్ కావాలని మరోవైపు అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయని వాపోతున్నారు. సత్వర పరిష్కారంతోనే ఊరట అందిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సత్వర పరిష్కారంతోనూ బాధితులకు న్యాయం చేకూరుతుంది. అయితే సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. న్యాయం కోసం అనంత కలెక్టర్కు ఉద్యోగుల ఫిర్యాదు వ్యవసాయ, పోలీసు శాఖల్లో అడ్డగోలు వ్యవహారం వ్యవసాయ శాఖలో తారస్థాయిలో అక్రమాలు వారమవుతున్నా ఫిర్యాదుపై ఎటూ తేల్చని వైనం సత్వర పరిష్కారంతోనే బాధితులకు ఊరట -
రైల్వే రక్షణ కవచం
గుంతకల్లు: రైలు ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్య. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో అత్యధికంగా ఒకే లైనుపై రెండు రైళ్లు ఎదురెదురుగా దూసుకురావటం వల్ల చోటు చేసుకున్నవే ఉండడం బాధాకరం. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించగలిగి ప్రయాణికుల భద్రతకు భరోసానిచ్చే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఈఎస్)ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనే పేరుతో పిలువబడే టీసీఈఎస్ పనితీరును ఇప్పటికే క్షేత్ర స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దశల వారీగా గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. రక్షణ కవచం పని చేస్తుంది ఇలా.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రైళ్లలో మెక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొలిజన్ పరికరాలను రైలు ఇంజన్లో ఏర్పాటు చేస్తారు. వీటిని రైల్వే ట్రాక్లకు అనుసంధానిస్తారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా రైలింజన్లోని కవచ్ యాంటీనాలు రేడియో ఫ్రీక్వెన్సీల స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. ప్రయాణంలో ఉండగా లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం... సిగ్నల్ దాటి ముందుకెళ్లడం... పరిమితికి మించిన వేగంతో రైలు ప్రయాణించడం, రైలు వేగాన్ని లోకో పైలెట్ నియంత్రించలేకపోవడం తదితర సమస్యలు ఎదురైనప్పుడు కవచ్ వ్యస్థ స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెడుతుంది. సిగ్నల్ జంప్ కాగానే వెంటనే లోకో పైటెల్ను అప్రమత్తం చేస్తుంది. బ్రేయ్లను నియంత్రిస్తుంది. నిర్ణీత దూరం లోపు అదే లైనులో మరో రైలును గమనించినప్పుడు స్వయం చాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. కి.మీ రూ.50 లక్షలు వ్యయం.. గుంతకల్లు డివిజన్ దాదాపు 1450 కి.మీ మేర విస్తరించి ఉంది. ఇందులో వాడి–రేణిగుంట, గుత్తి–ధర్మవరం, ధర్మవరం–పాకాల. పాకాల–కాట్పాడి, నంద్యాల–యర్రగుంట్ల, గుంతకల్లు–బళ్లారి సెక్షన్లలో దశల వారీగా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రసుత్తం గుంతకల్లు–డోన్ మధ్య ఉన్న 69 కి.మీలకు కి.మీకు రూ.50 లక్షలు చొప్పన దాదాపు రూ.345 కోట్లను రైల్వే శాఖ ఖర్చు చేసింది. ఈ మార్గంలో తిరిగే దాదాపు 20 నుంచి 30 రైలింజన్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే వాడి–రేణిగుంట మధ్య 538 కి.మీల పరిధిలో ఉన్న 60 స్టేషన్లతో పాటు 200కు పైగా రైలింజన్ల్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా ఒకే లైనుపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొన్న ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రయాణికులు చనిపోవడంతో పాటు రైల్వేకు భారీ నష్టాలూ చేకూరాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా రైళ్లు పరస్పరం ఢీకొనకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ సమకూర్చుకుంది. దాని పేరే ‘కవచ్’. కవచ్ వ్యవస్థతో ఆటోమేటిక్గా ఆగిపోనున్న రైళ్లు ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్ మార్గంలో ఏర్పాటు త్వరలో గుంతకల్లు డివిజన్లోని అన్ని సెక్షన్లలో ఏర్పాటుకు చర్యలు ప్రయాణికుల భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైలు ప్రమాదాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా కవచ్ లాంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం గుంతకల్లు – డోన్ సెక్షన్లో కవచ్ను ఏర్పాటు చేశాం. త్వరలో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లలో ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నాం. – చంద్రశేఖర్, సీనియర్ డీఎస్టీఈ, గుంతకల్లు -
1542 నాటి శాసనం లభ్యం
పావగడ: తాలూకాలోని పొన్న సముద్రం గ్రామం నుంచి బుడ్డారెడ్డి హళ్లికి వెళ్లే మార్గ మధ్యంలో ఓ పెద్ద బండపై కన్నడ లిపిలో చెక్కిన 9 వరుసల శిలా శాసనాన్ని స్థానిక చరిత్ర పరిశోధకుడు బీవీ రమేష్ బాబు మంగళవారం గుర్తించారు. శాసనానికి సంబంధించి అద్భుతంగా చెక్కిన సీ్త్ర పురుషుల చిత్రం ఉంది. క్రీ.శ. అక్టోబర్ 9, 1542లో శాసనం చెక్కినట్లుగా అందులో పేర్కొన్నారు. పొన్నసముద్రం కబిల అంగజోళ జక్కయ్యన మక్కళు నాగయ్య తదితర సహోదరుల ప్రతిష్ట జ్ఞాపకంగా ఈ శాసనం, శిల్పాలు చెక్కినట్లుగా అందులో పేర్కొన్నట్లు రమేష్బాబు తెలిపారు. హత్య కేసు నమోదుగాండ్లపెంట: ఉపాధి కూలీ మృతి కేసు మలుపు తిరిగింది. సమగ్ర దర్యాప్తు అనంతరం హత్య కేసుగా పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. గాండ్లపెంట మండలం కురుమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టకిందపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో అదే గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చెన్నక రంగారెడ్డి (55) మృతి చెందిన విషయం తెలిసిందే. ఉపాధి బిల్లుల చెల్లింపుల విషయంగా ప్రశ్నించినందుకు క్షేత్ర సహయకుడు మనోహర్, ఆయన భార్య స్వాతి, మామ దాదెప్ప సోమవారం రాత్రి రాళ్లతో ఆయనపై దాడికి తెగబడ్డారు. ఘటనలో అపస్మారక స్థితికి చేరుకున్న రంగారెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. హతుడి వదిన వెంకటరత్నమ్మ ఫిర్యాదు మేరకు మనోహర్, స్వాతి, దాదెప్పపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నీట మునిగి రాజస్థానీల మృతి కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీట మునిగి రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్కు చెందిన జుట్టూ(22), భగత్సింగ్(25), సురేష్ బతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం వలస వచ్చి ఉడ్వర్క్ షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలోని వెంకటేష్ బాబు తోటలోకి వెళ్లి, అక్కడ బొప్పాయి పండ్లను ఆరగించిన అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జుట్టూ కాలు జారి ట్యాంక్ పడ్డాడు. గమనించిన భగత్సింగ్ వెంటనే ట్యాంక్లోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. సురేష్, స్థానిక రైతుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రెక్కీ నిర్వహించి.. గొలుసు అపహరణ!
రాప్తాడు రూరల్: రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును యువకుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన రమణయ్య, పద్మావతి దంపతులు కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని నందమూరినగర్లో స్థిరపడ్డారు. సొంతూరిలో ఉన్న భూముల్లో భర్త వ్యవసాయం చేస్తున్నాడు. పద్మావతికి గుండె శస్త్రచికిత్స జరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లలేక ఇంటికి సమీపంలోనే కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కనే ఓ బంకు ఏర్పాటు చేసుకుని కూల్డ్రింక్స్, స్నాక్స్ విక్రయిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఓ యువకుడు వచ్చి బంక్ వద్ద దాదాపు గంట పాటు కూర్చొని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే యువకుడు మరోమారు వచ్చాడు. సిగరెట్ తీసుకుని తాగాడు. 2.30 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ‘పెద్దమ్మా...తాగేందుకు కొన్ని నీళ్లు ఇవ్వు’ అని అడిగాడు. దీంతో పద్మావతి ఫ్రిజ్ తెరుస్తుండగా ఒక్క ఉదుటన వెనుక నుంచి అరవకుండా నోటిని గట్టిగా అదిమపెట్టి మెడలో ఉన్న బంగారు చైనును లాక్కొని, ఆమెను గిరాటేసి వెళ్లిపోయాడు. ఈ హఠత్పరిణామంతో కాసేపటి వరకూ ఆమె కోలుకోలేక పోయింది. చైన్స్నాచింగ్కు పాల్పడిన యువకుడు ఎలాంటి బెదురు లేకుండా నింపాదిగా నడుచుకుంటూ వెళ్లడం విశేషం. ఘటనపై బాధితురాలు అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలసీఉలు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమరాలను పరిశీలిస్తున్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ధర్మవరం అర్బన్: మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక వన్టౌన్ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వారు వెల్లడించారు. ధర్మవరంలోని గీతానగర్కు చెందిన చితా రమాదేవి(55)తో ఎదురింటిలో నివాసముంటున్న యలమకూరు రాజశేఖర్ అలియాస్ చాకలి శేఖర్ రెండేళ్ల క్రితం రూ.10వేలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేదు. అప్పు చెల్లించాలంటూ రమాదేవి రెండు పర్యాయాలు నిలదీసింది. దీంతో అవమానంగా భావించిన రాజశేఖర్ గత నెల 29న రమాదేవి ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టి అరవకుండా నోరు అదిమిపెట్టి రెండు చేతులతో కిందకు తోసేశాడు. అనంతరం టెంకాయ తాడు తీసుకుని ఆమె గొంతు బిగించాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత తేరుకున్న ఆమె స్థానికుల సాయంలో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 4న ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ నాగేంద్రప్రసాద్... ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మృతి చెంది పోస్టుమార్టం అయ్యే వరకూ ఆస్పత్రిలోనే తచ్చాడుతున్న రాజశేఖర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో రమాదేవిని తానే హత్య చేసినట్లుగా ఆయన అంగీకరించడంతో మంగళవారం హత్య కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
టీడీపీ ట్రోల్స్పై న్యాయవాదుల ఆగ్రహం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సాగిస్తున్న ట్రోల్స్పై జిల్లా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ట్రోల్స్ను ఖండిస్తూ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న ట్రోలింగ్ను న్యాయవ్యవస్థపై దాడిగా అభి వర్ణించారు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తిపైనే ట్రోలింగ్ చేస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రోలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు బార్ అసోసియేషన్ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బుధ, గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు విధుల బహిష్కరణ -
‘నేతన్న నేస్తం’ అమలు చేయండి
ధర్మవరం అర్బన్: చేనేత కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ధర్మవరంలోని కేశవనగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులకు గత జగన్ ప్రభుత్వం ఏటా రూ.24వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తామని, చేనేత కార్మికులకు రెండు సెంట్ల స్థలంతోపాటు వర్క్ షెడ్ కట్టిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకూ నేత కార్మికులకు చేసిన మేలంటూ ఏదీ లేదన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. మరమగ్గాలను అరికట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించుకోక పోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఎక్కడేగాని ప్రస్తావించక పోవడం బాధాకరమన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సైతం చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై ఈ నెల 10న జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, విజయభాస్కర్, నాయకులు శ్రీనివాసులు, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ -
ఆకుతోటపల్లి వాసులకు దుద్దుకుంట పరామర్శ
ఓడీచెరువు: కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఓడీ చెరువు మండలం ఆకుతోటపల్లి వాసులను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి పరామర్శించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్న వారిని నేరుగా కలసి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం బాధితులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దామోదరరెడ్డి, ఎంపీపీ పర్వీన్భాను, పార్టీ టౌన్ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్ ● రూ.12 లక్షల విలువైన సొత్తు రికవరీ అనంతపురం: ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగలు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు అపహరిస్తున్న విక్కీ అలియాస్ షామీర్తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న ఫరూక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రెండో పట్టణ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు. గుజరాత్లోని సూరత్కు చెందిన సలీం కుమారుడు మాదిరి కర్రి విక్కీ అలియాస్ షామీర్ (20) తన ఆరేళ్ల వయసులోనే పారిపోయి అనంతపురానికి చేరుకున్నాడు. అప్పట్లో విజయనగర కాలనీలోని అనాథ ఆశ్రమంలో ఉంటూ రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ రాత్రి సమయాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని, చివరకు దొంగతనాల్లో రాటుదేలాడు. 2024, నవంబర్లో అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్న ఇంట్లోకి వారం వ్యవధిలో రెండు సార్లు చొరబడి రెండు బంగారు గాజులు అపహరించాడు. అలాగే ఈ ఏడాది జూన్లో ఓ యమహా బైక్, గోవాలో ఐ ఫోన్, ఆపిల్ ల్యాప్టాప్ను అపహరించాడు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ప్రనస్నాయపల్లి రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షామీర్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వరుస చోరీలు వెలుగుచూశాయి. గతంలో చోరీ చేసిన సొత్తుతో పాటు పలు సందర్భాల్లో అపహరించిన 8 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లను రికవరీ చేశారు. అలాగే నాలుగు సెల్ఫోన్లను కొనుగోలు చేసిన ఫరూక్ అరెస్ట్ చేసి నాలుగు సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఇద్దరి నుంచి రికవరీ చేసిన మొత్తం ఆరు తులాల బంగారు గాజులు, 12 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, ఒక స్కూటీ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీసీఎస్ సీఐ వలిబాషా, జయపాల్రెడ్డి, టూ టౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్, ఎస్ఐ రుష్యేంద్రబాబును ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. గురుకులంలో విద్యార్థినికి గాయాలు గుత్తి రూరల్: మండలంలోని రజాపురంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినికి అనుమానాస్పద స్థితిలో గాయాలయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన చిన్న కుళ్లాయప్ప, వరలక్ష్మి దంపతుల కుమార్తె పి.మైథిలి.. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తరగతి గదిలో రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలతో పడి ఉంది. గమనించిన గురుకుల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. కాగా ఘటనపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మాత్రం తరగతి గదిలో డెస్క్ మధ్యలో ఇరుక్కొని కింద పడటంతో కాళ్లు విరిగాయని చెబుతోందని, అయితే తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. -
నెల్లూరుపై కడప విజయం
● అనంతపురం, చిత్తూరు మ్యాచ్ డ్రా అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సీనియర్ మల్టీ డే క్రికెట్ మ్యాచ్లో నెల్లూరుపై కడప జట్టు విజయం సాధించింది. అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్ డ్రా అయింది. వివరాలు.. మూడో రోజు ఓవర్నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులతో బ్యాటింగ్కు వచ్చిన అనంతపురం జట్టు 90 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి 196 బంతుల్లో 9 సిక్సర్లు, 16 ఫోర్లతో 164 పరుగులు చేశారు. చిత్తూరు రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జట్టులో బ్యాటర్ ధ్రువ 48 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 81 పరుగులు, మరో బ్యాటర్ మోనిష్ 64 పరుగులు సాధించారు. కాగా, అనంతపురం జట్టుపై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత ప్రదర్శించిన చిత్తూరు జట్టుకు మూడు పాయింట్లు, అనంతపురం జట్టుకు ఒక పాయింటు దక్కింది. రెండో మైదానంలో నెల్లూరు జట్టుతో తలపడిన కడప జట్టు 5 వికెట్లతో విజయం సాధించి ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 179 పరుగులు ఆరు వికెట్ల నష్టానికి బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు 215 పరుగులకు ఆలౌట్ అయింది. నెల్లూరు బ్యాటర్ రేవంత్ రెడ్డి 76 పరుగులు సాధించాడు. 259 పరుగుల లక్ష్యాన్ని కడప జట్టు సునాయసంగా ఛేదించింది. కేవలం 43.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. కడప బ్యాటర్లు ధ్రువ 103 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్లతో 101 పరుగులు చేసి విజయానికి తోడ్పాటునందించాడు. కడప బౌలర్లు శ్రీకాంత్ 5 వికెట్లు, ఆశిష్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. -
‘వందే భారత్’కు అదనపు కోచ్లు
అనంతపురం సిటీ: ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్–యశ్వంత్పూర్–హైదరాబాద్ మధ్య తిరిగే వందేభారత్ (20703/20704) రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్కుమార్ మంగళవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్లతో నడుస్తుండగా.. అదనంగా మరో ఎనిమిది కోచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 16న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మడకశిర: మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఈనెల 16న నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ తెలిపారు. ఈ ఎన్నిక నోటిఫికేషన్ను ఈనెల 12న జారీ చేస్తారన్నారు. ఇదిలా ఉండగా ఇంతకు మునుపు మడకశిర నగర పంచాయతీ చైర్పర్సన్గా వైఎస్సార్సీపీకి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్గా రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. 20 మంది సభ్యులున్న మడకశిర నగర పంచాయతీలో 15 మంది వైఎస్సార్సీపీ తరుఫున గెలుపొందారు. కేవలం ఐదుగురు మాత్రమే టీడీపీ తరుఫున గెలుపొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి చేర్పించుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న చైర్పర్సన్, వైస్ చైర్మన్లను పదవుల నుంచి దించారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు కొత్తచెరువు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఈ నెల 10న సీఎం చంద్రబాబు కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా కార్యక్రమానికి హాజరవుతారన్నారు. కార్యక్రమానికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అందలేదని, అందిన వెంటనే తెలియజేస్తామన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్ డైవర్షన్లను చేశామని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి మరికొన్ని డైవర్షన్లు చేస్తామని వెల్లడించారు. కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. -
రైలు ప్రయాణికులకు మరింత భద్రత
ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించనున్నట్లు ఆర్పీఎఫ్ సౌత్ సెంట్రల్ జోన్ డీఐజీ షదాన్ ఖాన్ తెలిపారు. సౌత్ సెంట్రల్ పరిధిలోని ధర్మవరం ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పరిసరాలను, పలు పరికరాల పనితీరు పరిశీలించారు. అనంతరం ఆర్పీఎఫ్ మహిళా వసతి గృహంలో పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రైల్వే శాఖలో మహిళా ఉద్యోగుల భద్రతాపరంగా మహిళా వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు డివిజనల్ ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్కుమార్ జైస్వాల్, సీఐ నాగేశ్వరరావు, అధికారులు రోహిత్గౌడ్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒక్క హామీనైనా అమలు చేశారా?
చిలమత్తూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్సిక్స్ హామీలు ఇచ్చి మరచిపోయారు. ప్రజలను కూడా మరచిపోయి.. ప్రాజెక్టులు, అమరావతి, యోగాంధ్ర అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేష్రెడ్డి విమర్శించారు. 143 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. హిందూపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రమేష్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరడం లేదని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారని, ఈ వైఫల్యానికి కారణం మీరు కాదా అని మండిపడ్డారు. చంద్రబాబు తనను తాను మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్తో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు పార్టీ లైన్ దాటి వైఎస్సార్సీపీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని రమేష్రెడ్డి హెచ్చరించారు. గీత దాటిన వారి లిస్ట్ అధిష్టానం వద్ద ఉందని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. స్వలాభమే బాబుకు ముఖ్యం రాష్ట్రంలో ప్రజలు అప్పుల పాలవుతున్నా సీఎం చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్వలాభం కోసమే ప్రభుత్వం నడుపుతున్నారని, పేదలను ఆదుకునేందుకు కాదన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు ఇంటికెళ్లి నా కుటుంబం అన్న సీఎం చంద్రబాబు, గెలిచాక నాకేంటి సంబంధం అంటున్నాడని విమర్శించారు. సీనియర్ నాయకుడు బాలాజీ మనోహర్ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో స్థానికేతరులను గెలిపించుకొని పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో పురం ప్రజలు ఉన్నారని, ఇకనైనా స్థానికులకు అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీకి పట్టంకట్టాలన్నారు. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుమతిరెడ్డి మాట్లాడుతూ ఏదైనా సమస్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ గళమెత్తితేగాని కూటమి ప్రభుత్వంలో చలనం ఉండడం లేదన్నారు. ఆయన వస్తున్నారంటే అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తోందన్నారు. ఇప్పుడు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ మాజీ సీఎం జగన్ సమస్య తెలుసుకోవడానికి వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి, రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఏ శివ, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆసిఫుల్లా, జిల్లా అధికార ప్రతినిధి శివశంకర్రెడ్డి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, కవితారెడ్డి, శ్రీరామిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ సురేష్కుమార్రెడ్డి, మండల కన్వీనర్లు రాము, రామకృష్ణారెడ్డి, సయ్యద్ నిస్సార్, ఎంపీపీ రత్నమ్మ, వైస్ ఎంపీపీ అంజన్రెడ్డి, తిమ్మిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా తదతరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్రెడ్డి -
మానవతా విలువలతోనే జీవితం సంపూర్ణం
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనల మేరకు మనిషి మానవతా విలువలు పాటించడం ద్వారా సంపూర్ణుడు అవుతాడని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు విషాల్రావు పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారు నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత ప్రదర్శనతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అంతకుముందు విషాల్రావు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య సత్యసాయి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ను ఆవిష్కరించారు. నేడు మానవతా విలువల సదస్సు మానవతా విలువలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రశాంతి నిలయంలో మానవతా విలువలపై సదస్సు జరగనుంది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత ఉదయం 8 గంటలకు వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 8.55 గంటలకు సదస్సు లక్ష్యాన్ని వివరిస్తూ ప్రసంగం, 9 గంటలకు సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రారంభోపన్యాసం ఉంటుంది. రామకృష్ణ మిషన్, వివేకానంద ఎడ్యూకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కోల్కత్తా వైస్ చైర్మన్ స్వామి సర్వోత్తమా నంద మానవతా విలువపై ప్రసంగిస్తారు. తర్వాత ముఖ్య అతిథి హరిభౌ కృష్ణారావు బాగ్డే ప్రసంగిస్తారు. సాయంత్రం సదస్సు తీర్మానాలను వివరిస్తారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇల్లు, ఇంటి పట్టాలు, సామాజిక పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై 172 అర్జీలు వచ్చాయి. పుట్టపర్తి డివిజన్ నుంచి 60, పెనుకొండ 44, ధర్మవరం 41, కదిరి నుండి 27 వినతులు అందాయి. అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. డీఆర్ఓ విజయ సారధి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి అర్డీఓ సువర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధురాలి ఆస్తి వెనక్కి ఇప్పించిన ఆర్డీఓ
ధర్మవరం అర్బన్: నానమ్మ ఆస్తిని రాయించుకుని ఆమె బాగోగులు పట్టించుకోని మనవడితో ఆస్తి వెనక్కి ఇప్పించారు ఆర్డీఓ మహేష్. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం వృద్ధురాలికి ఆస్తి వెనక్కి ఇస్తున్నట్లు తీర్పు పత్రాలను ఆర్డీఓ మహేష్ ఆమెకు అందించారు. వివరాలు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన 70 ఏళ్ల గాజుల వెంకట లక్ష్మమ్మ భర్త గాజుల తిప్పన్న కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె పేరు మీద ఉన్న ఇంటిని మనవడు గాజుల అనిల్కుమార్ పేరున గిఫ్ట్డీడ్ను చేసింది. కాని ఆమె బాగోగులు పట్టించుకోకుండా వదిలేయడంతో పింఛన్ డబ్బుతో జీవిస్తోంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనవడిని డబ్బు అడిగినా పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో గాజుల వెంకట లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు అధికారులు అనిల్కుమార్కు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో సీనియర్ సిటిజన్ నిర్వహణ సంక్షేమ చట్టం 2007 కింద ఆమె మనవడికి ఇచ్చిన గిఫ్ట్డీడ్ను రద్దు పరుస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు. అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రవమంలో వచ్చిన అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 55 మందితో అర్జీలు స్వీకరించారు. సమస్యలపై ఎస్పీ నేరుగా పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి చట్ట పరిధిలో తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతివ్వండి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను, వారి సమస్యలను కలెక్టర్కు తెలియజేసేందుకు ఈనెల 14న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిరసన కార్యక్రమం తలపెట్టామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఎస్సీ జనసంఘ్ జాతీయ అధ్యక్షులు దానసగారిపల్లి కుళ్లాయప్ప కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ బీసీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దాడులు చేస్తున్నారు. అనంతపురం ఆలుమూరు గ్రామంలో దళితుల భూమిని ఆక్రమిస్తే కొంత మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మరికొంత మంది బీసీ, మైనార్టీలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పుట్టపర్తిలో జర్నలిస్ట్ డాక్యుమెంట్ తయారు చేస్తే దాడి చేసి కేసులు పెట్టారన్నారు. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ భూమిని ఆక్రమించడమే గాక బీసీ నేతను అణగదొక్కేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఈదాడులపై ఈనెల 10న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సాకే ఆదినారాయణ, జైభీమ్ రామాంజనేయలు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. వేసవి శిక్షణ ప్రారంభం ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, మానవతా విలువలు అన్న అంశంపై శిక్షణ ఇస్తున్నారు. నందగిరి, ప్రశాంతి నిలయం, అనంతపురం, బృందావన్ క్యాంపస్ విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు రామ కథ పేరుతో ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్ ప్రశాంతి నిలయంలో భక్తులకు ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సోమవారం నార్త్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు ప్రారంభించారు. ఈనెల 11 వరకు క్యాంప్ నిర్వహించనున్నారు. మా భూమిలోకి పోకుండా అడ్డుకుంటున్నారు ● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జవాన్ ఫిర్యాదు ప్రశాంతి నిలయం: తాము కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని సీఆర్పీఎఫ్ జవాన్ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కనగానపల్లి మండలం కుర్లపల్లికి చెందిన వై.చెన్నారెడ్డి ఓడిశాలోని రాయ్ఘడ్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేస్తున్నారు. ఆయన 2012లో కుర్లపల్లి గ్రామం సర్వేనంబర్ 248–4బీలో 5.16 ఎకరాల భూమిని బంధువుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో జవాన్ 2017లో కోర్టులో పిటిషన్ వేసి.. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు పంటలు సాగు చేశారు. 2021లో మళ్లీ ఆ భూమిని సాగు చేయకుండా దౌర్జన్యపరులు అడ్డుకున్నారు. దీంతో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న తమ భూమికే గ్రామంలో రక్షణ లేకపోతే ఎలా అని జవాన్ చెన్నారెడ్డి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
అంబేడ్కర్ స్మృతివనం ప్రైవేటీకరణపై ఆగ్రహం
మడకశిర: విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మడకశిరలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీఓ ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ వైఎస్జగన్ హయాంలో రూ.కోట్లు వెచ్చించి అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం స్మృతి వనాన్ని ప్రైవేట్పరం చేయడం దళితులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలోనే స్మృతి వనాన్ని నిర్వహించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శివన్న, క్రిష్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నరసింహ, బూత్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మంజునాథ్, మైనార్టీ సెల్ కార్యదర్శి సికిందర్, పట్టణ వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు గోపి, వైఎస్సార్సీపీ దళిత నాయకులు ధను, నగేష్, బీసీ సెల్ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచులు రంగనాథ్, హనుమంతప్ప, టీడీపల్లి రంగనాథ్, అంజినప్ప, అంజలి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాల ఆందోళన -
జన హృదయ నేత వైఎస్సార్
● లక్షలాది మందికి పునర్జన్మనిచ్చిన ఆరోగ్యశ్రీ ● అనంతరం 108, 104 పథకాలు అమల్లోకి తెచ్చిన మహానేత ● కరువుతో అల్లాడుతున్న సమయంలో అనంతకు వైఎస్ ఆసరా ● జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చింది వైఎస్సారే ● రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో ఊరట ● అద్భుత పథకాల ఆవిష్కర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి నేడు సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక పథకం దేశం కాదు ప్రపంచం దృష్టినే ఆకర్షించడం సామాన్య విషయం కాదు. ఏకంగా ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి సంస్థలు ఆరోగ్యశ్రీని పొగిడాయంటే ఈ పథకం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేరు వినగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకు వస్తారు. దేశవ్యాప్తంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పథకాల రూపకర్తగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ పురుడు పోసుకుంది అనంతలోనే 2004 సంవత్సరానికి ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతం. పదిరూపాయలు పెట్టి వైద్యం కూడా చేయించుకోలేని దుస్థితి. ఇలాంటి సమయంలో మొదటి దశలో అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడే పథకం పురుడు పోసుకుంది. అనంతపురంతో పాటు మహబూబ్నగర్, శ్రీకాకుళంలో ఒకేరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. 168 వ్యాధులతో ప్రారంభమైన ఈ పథకం తర్వాత 958 చికిత్సలకు వైద్యం అందించింది. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందారు. పుట్టుకతోనే చెవిటి మూగ ఉన్న పిల్లలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షలు వెచ్చించి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయించిన ఘనత వైఎస్సార్దేనని అందరికీ తెలిసిందే. 108, 104 పథకాలు... ఆపదలో నేనున్నానంటూ కుయ్ కుయ్మంటూ వచ్చే 108 వాహనాల రూపకర్తా వైఎస్సారే. ప్రమాదంలో గాయపడి నిస్సహాయ స్థితిలో ఉండే వేలాదిమందికి ఈ వాహనాలే ప్రాణభిక్ష పెట్టాయి. రాత్రనకా పగలనకా ఏ సమయంలో పిలిచినా పలికే ఈ వాహనాల పథకాన్ని వైఎస్సార్ సృష్టించారు. ఈ పథకం ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ అమలు చేశాయి. వైద్య సలహాల కోసం 104 పథకాన్నీ రూపొందించారు. 104కు ఫోన్ చేస్తే చాలు వైద్య సలహాలు అందేవి. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. దార్శనికుడు వైఎస్సార్ జిల్లాలో కరువు నివారణలో భాగంగా సాగు – తాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తాగునీటి పథకంగా ఉన్న హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే ఫేజ్–1కు రూ.1,305 కోట్లు, ఫేజ్–2కు రూ.1,880 కోట్లు విడుదల చేశారు. ఆయన హయాంలోనే ఫేజ్–1 పనులను పూర్తి చేశారు. ఫేజ్–2 పనులు 60శాతం మేర పూర్తి చేశారు. 2008 నుంచి ఏటా హంద్రీ–నీవా ద్వారా కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నాయి. అలాగే తుంగభద్ర ఎగువ కాలువ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాలోని కణేకల్లు వరకు కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఉంటుంది. అక్కడి నుంచి హెచ్ఎల్ఎంసీ, జీబీసీ, మిడ్పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఆనాడు కరువు పరిస్థితులతో తాగునీళ్లో రామచంద్రా అనే పరిస్థితులు జిల్లాలో ఉండేవి. కిలోమీటర్ల మేర దూరంలోని వ్యవసాయబోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకునే వారు. నేడు జిల్లాలో శాశ్వతంగా తాగునీటి ఇబ్బందులు తొలగిపోయావంటే అది మహానేత వైఎస్సార్ చలవే అని చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ఉరవకొండ నియోజకవర్గం నుంచి హిందూపురం వరకు తాగునీటిని అందించారు. అనంతపురం నగరానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే జిల్లాలో 60 శాతానికి పైగా జనాభాకు నేడు తాగునీటి సరఫరా జరుగుతోంది. -
34 ఏళ్ల తర్వాత భేటీకి వచ్చిన మల్కాపురం పీర్లు
మొహర్రం ఉత్సవాల్లో 34 ఏళ్ల తర్వాత ధర్మవరం మండలం మల్కాపురం పీర్లు భేటీ కోసం బత్తలపల్లికి వచ్చాయి. గతంలో మండలంలోని 24 గ్రామాల పీర్లు వెంకటగారిపల్లి సత్రం వద్ద భేఠీ అయ్యేవి. 1992లో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం వల్ల భేటీకి కొన్ని గ్రామాల పీర్లు వెళ్లడం లేదు. అప్పటి నుంచి మల్కాపురం పీర్లు కూడా భేటీకి వెళ్లడం లేదు. ఇప్పడు బత్తలపల్లి కూడలిలో సోమవారం జరిగిన భేటీకి ఆ గ్రామానికి చెందిన పీర్లు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మల్కాపురంలో గ్రామోత్సవం అనంతరం పోట్లమర్రికి చేరుకున్న పీర్లకు ఇక్కడ పీర్లు ఘనస్వాగతం పలికి భేటీ తీసుకున్నారు. అక్కడ నుంచి బత్తలపల్లి కూడలికి రెండు గ్రామాలకు చెందిన పీర్లు తరలివచ్చాయి. -
కదిరిలో చెడ్డీగ్యాంగ్ హల్చల్
కదిరి టౌన్: పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో మధ్యప్రదేశ్కు చెందిన చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. కాలనీకి చెందిన బోడెల్ల నరసారెడ్డి ఇంటిలో 17 తులాలు బంగారు, 1500 గ్రాముల వెండి చోరీ చేసింది. పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన వివరాలు..నరసారెడ్డి కుటుంబం ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటోంది. ఇదే అదనుగా భావించిన మధ్యప్రదేశ్కు చెందిన చెడ్డీ గ్యాంగ్ ఆదివారం అర్ధరాత్రి ఇంటిలో చొరబడ్డారు. ఇంటిలో ఉన్న 30 గ్రాముల బంగారు నక్లెస్, 60 గ్రాముల 4 బంగారు గాజులు, 20 గ్రాముల బంగారు డాలర్, 40 గ్రాముల మూడు జతలు కమ్మలు, 20 గ్రాముల రెండు ఉంగరాలు, 1500 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.9.5 లక్షలు ఉంటుంది. సోమవారం ఇంటి పక్కన ఉన్న నరసారెడ్డి బంధువులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇంటి వద్దనున్న సీసీకెమెరా పుటేజీ పరిశీలించగా ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తేలింది. 17 తులాల బంగారు, 1500 గ్రాముల వెండి చోరీ -
స్థల ఆక్రమణకు టీడీపీ నాయకుల యత్నం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు నల్లచెరువు: మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తన స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పడుచూరి నగేష్ కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగేష్కుమార్కు జాతీయ రహదారి పక్కనున్న వేరుశనగ ఫ్యాక్టరీ ముందు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అల్లాబకాష్, టీడీపీ మండల మాజీ కన్వీనర్ శివారెడ్డి, ఆయన అల్లుడు ప్రసాద్రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారు. జేసీబీతో చదును చేయిస్తుండగా నగేష్కుమార్ అడ్డుకున్నాడు. వారం రోజుల్లో ఇక్కడ భవనం నిర్మిస్తామని, దిక్కున్న చోట చెప్పుకో అని సదరు వ్యక్తులు బెదిరించారని నగేష్కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
చంద్రబాబు.. పెద్ద మోసకారి
స్వలాభం కోసమే బాబు పాలన సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి: ‘ప్రతి ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు నాయుడుకు అలవాటే. ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుని గెలవడం.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈసారి ప్రతిపక్ష పాత్రలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోన్న క్రమంలోనే ఒకట్రెండు పథకాలను అరకొరగా ఇచ్చారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీశ్రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అధ్యక్షతన ఆదివారం నియోజకవర్గ స్థాయిలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించాలని.. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేంపల్లి సతీశ్రెడ్డి అన్నారు. గడిచిన ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు.. ఓ మోసగాడు.. మాయలోడు అనే విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అయ్యేదని గుర్తు చేశారు. పేదలకు చేదోడు – వాదోడుగా వైఎస్ జగన్ నిలిచారని, నేడు చంద్రబాబు కేవలం తన కార్యకర్తలకు మాత్రమే సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే తనకు ఇదివరకు పుట్టపర్తి తెలుసన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు దున్నేయడం, చెట్లను నరికేయడం వంటి సంప్రదాయాలను ఇక్కడ చూడాల్సి రావటం దౌర్భాగ్యమన్నారు. వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో జిల్లాకు రెండుసార్లు వచ్చారని, జన ప్రభంజనం చూశామని సతీశ్రెడ్డి అన్నారు. జగన్ వస్తే భారీ సంఖ్యలో జనాలు వస్తారని, ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చిస్తారనే భయంతో చంద్రబాబు ప్రభుత్వం హెలికాప్టర్ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా.. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్య కిరణాలను ఆపలేమన్న రీతిలో వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరి తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతుంటారని, ఎవరితో పోల్చుకోవాలనే విషయంలో కనీస ఇంగిత జ్ఞానం, సిగ్గు ఉండాలని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేశ్రెడ్డి అన్నారు. ‘గాంధీజీ వారసులు ఎవరో మనకు పెద్దగా తెలియదు.. అంబేడ్కర్ ఆశయాలు తప్ప వారసులు కనిపించరు.. కానీ చంద్రబాబు తన కుమారుడిని రాజకీయంగా తెచ్చి మంత్రిని చేశాడు. మనవడి పేరు మీద రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి’ అని దుయ్య బట్టారు. సూపర్ సిక్స్తో సహా వందకు పైగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇంటింటికీ తిరిగి హామీలు.. వంచనల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మాజీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు మోసాలపై ఇంటింటికీ వెళ్లితెలియజేస్తాం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీశ్రెడ్డి పుట్టపర్తిలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’కి హాజరు చంద్రబాబు పాలన స్వలాభం కోసమేనని మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యకర్తల బాగు కోసమే పథకాలు తెచ్చారన్నారు. వైఎస్సార్సీపీ డిమాండ్ చేయకుంటే ఉచిత గ్యాస్, తల్లికి వందనం కూడా వచ్చేవి కాదన్నారు. తల్లికి వందనం గురించి అడిగితే.. అమ్మ ఒడి వచ్చిందని చెబుతున్నారని, దీన్నిబట్టి తమ నాయకుడి పథకాలకు పేరు మార్చినా.. ప్రజల్లో చెరగని ముద్ర అలాగే ఉందని అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరకు ఏమీ తెలీదని, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందు ఉంటే.. సినిమాల్లో హీరోలకు డూప్లా ఆమె వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సూపర్సిక్స్ పేరుతో ప్రజలను వంచించిన చంద్రబాబు.. రెడ్బుక్ను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు, మద్దతుదారులపై అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కూటమి పార్టీల నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. తమ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో శరవేగంగా అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలో పుట్టపర్తిని జిల్లా చేయటంతో పాటు వేల సంఖ్యలో జగనన్న ఇళ్లు కట్టించామని, రెండు జాతీయ రహదారులు, ఒక గ్రీన్ఫీల్డు హైవే పనులు చేపట్టామని, రూ.864 కోట్లతో నియోజకవర్గంలో 193 చెరువులు నింపే పనులకు శ్రీకారం చుట్టామని శ్రీధర్రెడ్డి గుర్తు చేశారు. వీటన్నింటిని ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.జనాలొస్తారనే బాధ.. పోల్చుకోవడానికి సిగ్గుండాలి.. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం కొత్తచెరువులోని శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్టర్, ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ కళాశాల పరిసర ప్రాంతాలు పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పుట్టపర్తి సమీపంలోని సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన సీఎం కొత్తచెరువులోని జిల్లా పరిషత్, జూనియర్ కళాశాల ఆవరణలో జరిగే మోగా పేరెంట్స్ సమావేశంలో పాల్గొంటారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అదికారుకు సూచించారు. పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అధికారును ఆదేశించారు. ప్రతి అధికారీ అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాణరెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, మహేష్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, సీపీఓ విజయకుమార్, డీఈఓ క్రిష్టప్ప, పౌరసంబంధాల శాఖ జిల్లా మేనేజర్ రాజు, డీపీఓ సమత, జిల్లా రవాణాధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశిఅగళి: తొలి ఏకాదశి సందర్భంగా మధూడి గ్రామంలో భూతప్ప ఉత్సవాలు నిర్వహించారు. భూతప్ప వేషధారుల సంప్రదాయక నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. భూతప్పలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని వివిధ ఆలయాల్లో ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.వాహనదారులకు ఝలక్ ● లైసెన్స్ లేదని రూ.5వేల జరిమానాహిందూపురం: నూతన మోటార్ వాహనాల చట్టం అమలుతో వాహనదారులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఏకంగా రూ.5వేలు జరిమానా విధించారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని రహమత్పురం సర్కిల్ వద్ద ఆదివారం టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని వారికి, త్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందికి రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. రూ.వందల్లో వేసే ఫైన్లు ఒక్కసారిగా రూ.వేలల్లో వేయడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు.టీబీ డ్యాంకు నూతన శోభబొమ్మనహాళ్: తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో డ్యాంకు నూతన శోభ వచ్చింది. ఆదివారం 52,815 క్యూసెక్కులు నదికి, 6 వేల క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు పంపారు. డ్యాంలో ప్రస్తుతం 77 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని నదికి వదిలుతున్నారు. మరో 4 రోజుల్లో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడతో ఆయకట్టు రైతులు వరినారు సాగుతో పాటు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రసుత్తం తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.21 అడుగులకు నీరు చేరింది. ఇన్ఫ్లో 52,805 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 62,027 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 77.180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,593.19 అడుగుల వద్ద 13.900 టీఎంసీల నీటి నిల్వంతో, 25,556 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 190 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండిందని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. -
కనుల పండువగా ఆషాఢ ఏకాదశి
ప్రశాంతి నిలయం: సత్యసాయి భక్తుల నడుమ ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం ఉదయం మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు సాయిని కీర్తిస్తూ దిండి పల్లకీని ఊరేగింపుగా మహాసమాధి చెంతకు తీసుకువచ్చారు. పాండురంగడు.. సత్య సాయిల అవతార లక్ష్యం ఒక్కటేనన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. సనాతన భారత చరిత్రలో అనేకమంది సాధువులు మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన తీరును చక్కగా వివరించారు. సాయంత్రం మహారాష్ట్ర, గోవా బాలవికాస్ చిన్నారులు ‘వాల్యూస్ వర్సెస్ వాల్యూస్’ పేరుతో మనిషి నిత్య జీవితంలో విలువలు పాటించాల్సిన ఆవశ్యకతను, పురాణాల ఆధారంగా విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఆకట్టుకున్న సత్యసాయి బాల వికాస్ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన -
పరిశ్రమల జాడేదీ..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాదిగా విచిత్ర పరిస్థితి నెలకొంది. ‘మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం, ఇంటింటికీ ఉద్యోగమిస్తాం, లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తాం’ అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ నేతల నోట ఆ మాటే నేడు రావడం లేదు. ఆ మాటలు ఇప్పుడు వారికి కొరగానివిగా తయారయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా రాప్తాడు, పెనుకొండ, హిందూపురం ప్రాంతాలు చిన్న, సూక్ష్మ, భారీ పరిశ్రమలకు అనుకూలం. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఎంఎస్ఎంఈల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అరాచకాలతో రాంరాం.. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం పరిశ్రమల ఏర్పాటుకు బాగా అనుకూలమని చెబుతారు. నియోజక వర్గం గుండా జాతీయ రహదారి వెళ్తుండడం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగంగా చేరుకునే అవకాశం తదితర సానుకూలతలున్నా హత్యలు, భూకబ్జాలు, ఆక్రమణలు, రౌడీయిజం, దొంగతనాలు వెరసి చిన్న పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. శాంతిభద్రతలు అదుపుతప్పడంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు రావడానికి వెనకాడుతున్నారు. గడిచిన ఏడాదిలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపాన పోలేదు. ‘కొత్త పారిశ్రామిక పాలసీ తెచ్చాం, పెట్టుబడులు పెట్టండి’ అంటూ అధికారులు ఎంత బతిమాలినా ‘మాకొద్దు బాబూ’ అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలకు కూడా గండం ఏర్పడింది. పెనుకొండ.. హిందూపురంలోనూ అంతే పెనుకొండ, హిందూపురం ప్రశాంతంగా ఉండే పట్టణాలు. అలాంటిది నేడు రాజకీయ నాయకుల అండతో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. స్వయానా ప్రజాప్రతినిధులే ఉసిగొలిపి ఇదంతా చేయిస్తున్నారు. పెనుకొండలో ఓ రీమిక్స్ప్లాంట్ యాజమాన్యాన్ని స్వయానా మంత్రి బెదిరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. చిన్న పరిశ్రమ నెలకొల్పడానికి ఎవరైనా వచ్చినా వసూళ్లకు తెగబడుతున్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే పీఏలుగా చెప్పుకుంటూ కొందరు చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి సర్కారు వచ్చినప్పటినుంచీ అక్కడ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. మద్యం, జూదం తీవ్రస్థాయిలో జరుగుతుండటంతో పెట్టుబడిదారులు హిందూపురం రావడానికి మొగ్గు చూపడం లేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం అదీ ఇవ్వలేదు. ఏడాది ముగిసినా చిన్న పరిశ్రమకూ దిక్కులేదు లక్షల్లో ఉద్యోగాలని ఒక్కటీ ఇవ్వలేదు ఎంఎస్ఎంఈలు పెట్టడానికీ మొగ్గుచూపని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాప్తాడులో దారుణ పరిస్థితుల నేపథ్యంలో అటువైపే చూడని వైనం పెనుకొండ, హిందూపురం పట్టణాల్లోనూ ఇంతే... ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతీ అందక అల్లాడిపోతున్న నిరుద్యోగులు -
కోలాహలంగా పెద్దసరిగెత్తు
● ఖాశీంస్వామిని దర్శించుకున్న భక్తులు బత్తలపల్లి: మండల కేంద్రం బత్తలపల్లిలో బొప్పేపల్లి ఖాశీంస్వామి మొహర్రం ఉత్సవాల్లో కీలక ఘట్టం ఆదివారం పెద్ద సరిగెత్తు కోలాహలంగా సాగింది. హిఽందువులు, ముస్లింలు కలసికట్టుగా పెద్దసరిగెత్తు నిర్వహించారు. ఉదయం నుంచే ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పీర్లస్వాములకు చక్కెర, పానకాలు చదివించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్లను పూలు, వస్త్రాలతో అలంకరించి గుండం చుట్టూ తిప్పారు. రాత్రంతా గుండంలోకి మొద్దులను వేసి రగిలించి అలావు తొక్కారు. వివిధ వేషధారణలతో ఉన్న వ్యక్తులు వరస అయిన వారి వద్దకు వెళ్లి గుండంలోని బూడిదను పూసి ఆనందం వెలిబుచ్చారు. బత్తలపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పానకం దుత్తలతో ఊరేగింపుగా వెళ్లడం ఆకట్టుకుంది. గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి, రాఘవంపల్లి, ఈదుల ముష్టూరు గ్రామాల్లో పెద్దసరిగెత్తు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సోమశేఖర్ గ్రామపెద్దలకు సూచించారు. నేడు భేటీ..: బత్తలపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో సోమవారం ఉదయం 9 గంటలకు వివిధ గ్రామాల పీర్లు భేటీ అవుతాయి. ఈ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. భేటీని తిలకించేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ను బైపాస్ మీదుగా మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటలలోపు భేటీ ముగించాలని ఆయా గ్రామాల పెద్దలకు పోలీసులు సూచించారు. -
భక్తరపల్లిలో రేపు భూతప్ప ఉత్సవాలు
మడకశిర రూరల్: తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద భూతప్ప ఉత్సవాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మినీ భూతప్ప ఉత్సవాలు ఉంటాయని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు, సంతానం లేని మహిళలు ఉత్సవాలకు భారీగా తరలివస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఈమేరకు ఏర్పాట్లు చేసింది. జాతీయస్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ధర్మవరం: జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న 15వ జాతీయస్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారిణులు మధురిమ బాయి, వైష్ణవి, వర్ష ఎంపికయ్యారని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ శనివారం తెలిపారు. అలాగే కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్గౌడ్, చందు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్, అమునుద్దిన్, కిరణ్ హర్షం వ్యక్తం చేశారు. రేపు ఫుట్బాల్ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికహిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో సోమవారం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్స్ బాల, బాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. 2012 జనవరి 1 నుంచి 2013 డిసెంబర్ 31 లోపు జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల వారు తమ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రేపటి ఎంపిక కార్యక్రమానికి రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కార్యదర్శి మహమ్మద్ సలీమ్ను 80995 98958 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. పారిశుధ్య కార్మికునికి పాముకాటు ధర్మవరం అర్బన్: పట్టణంలోని ఎర్రగుంట రైల్వే బ్రిడ్జి సమీపంలోని పార్కు వద్ద శనివారం శుభ్రం చేస్తున్న సమయంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుడు శాంతమూర్తికి పాము కాటు వేసింది. గట్టిగా కేకలు వేయడంతో తోటి కార్మికులు వచ్చి ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్సన్ కార్మికుడు శాంతమూర్తిని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అనంతరం కార్మికుడిని పుట్టపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శాంతమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని తోటి కార్మికులు తెలిపారు. ఇదిలా ఉండగా కాటు వేసిన పామును కార్మికులు పార్కులోనే చంపేశారు. -
సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
పుట్టపర్తి టౌన్: సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుని నేరాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి ఎస్పీ రత్న సూచించారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి కిట్లు, లెదర్ బ్యాగులు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత అధునిక యుగంలో సాంకేతిక నైపుణ్యాలను ప్రతి పోలీస్ అధికారి మెరుగుపరుచుకోవాలన్నారు. నేర నియంత్రణలో స్పెషల్ బ్రాంచ్ పాత్ర కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం తెలుకొని నియంత్రణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఆర్ఐ వలి, సోషల్ మీడియా ఎస్ఐ మునిప్రతాప్తోపాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మోసపోతున్నా.. మేలుకోరా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆశ ఉండొచ్చుగానీ.. అత్యాశ ఉండకూడదు అంటారు. ఈ అత్యాశే వేల మందిని ముంచేసింది. డబ్బు పోగొట్టుకునేలా చేసింది. రోజుకో యాప్.. రోజుకో సైబర్ మోసం పత్రికల్లో చూస్తూనే ఉన్నా ఎగబడి మరీ కట్టేశారు. చివరకు బిచాణా ఎత్తేస్తే గానీ వాని అసలు విషయం తెలియరాలేదు. వారం రోజుల క్రితం ‘లుక్ యాప్’ గొలుసుకట్టు ఫైనాన్స్ పేరుతో బురిడీ కొట్టించిన కేసులో ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది రూ.30 కోట్లు పైనే పోగొట్టుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయులు..ఐటీ ఉద్యోగులూ.. పిల్లలకు జీవిత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సైతం ‘లుక్’ ఉచ్చులో ఇరుక్కోవడం విస్మయం కలిగిస్తోంది. రూ.20 వేలు కడితే రోజూ రూ.700 ఇస్తామని అనడంతో రెండు జిల్లాలో సుమారు 800 మందికి పైగా ఉపాధ్యాయులు ‘యాప్’లో డబ్బులు పోశారు. ఇక ఐటీ ఉద్యోగులు వచ్చే జీతాలు సరిపోకనో లేదా అత్యాశకు వెళ్లారో గానీ వేలకు వేలు ఎగబడి కట్టారు. చివరకు మాయగాళ్లు మొత్తం ఊడ్చుకుని నిండా ముంచేశారు. అనంతపురంలోని కమలానగర్లో వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు భారీ సంఖ్యలో డబ్బులు కట్టి మోసపోయినట్టు తెలుస్తోంది. లుక్ యాప్ ఎక్కడిదో, యజమాని ఎవరో, కార్యాలయం ఎక్కడో ఎవరికీ తెలియదు. వేలం వెర్రిగా కట్టేశారంతే! గతంలో మోసాలు జరిగినా... గతంలో అనంతపురం జిల్లా కేంద్రంగా భారీ స్కాములు జరిగాయి. ఈ–బిడ్ పేరుతో లక్ష రూపాయలు కడితే నెలకు రూ.30 వేలు ఇస్తామని చెప్పగా వేల మంది కట్టారు. నాలుగైదు నెలలు బాగానే ఇచ్చారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. రూ.230 కోట్ల మేర బాధితులకు శఠగోపం పెట్టారు. దీంతో కొంతమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత జయలక్ష్మి అనే మహిళ రూ.30 కోట్ల మేరకు చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టింది. తర్వాత కొద్దిరోజులకే ఆదరణ చిట్స్ పేరుతో రూ.50 కోట్లు ఎగ్గొట్టారు. ఇలా పలు ఘటనలు జరిగినా అత్యాశకు పోవడం వల్లే మోసపోతున్నట్టు తెలుస్తోంది. ‘లుక్’ యాప్ బాధితులు 20 వేల మంది పైనే అత్యాశే కొంప ముంచిన వైనం బాధితుల్లో ఉపాధ్యాయులు, ఐటీ ఉద్యోగులూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ ముందుకు రాలేక ఇబ్బంది అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న పరమేష్.. తన పిల్లలకు స్కూలు ఫీజులకై నా డబ్బులు సంపాదించచ్చనే ఉద్దేశంతో ‘లుక్’ యాప్లో రూ.20 వేలు కట్టాడు. కట్టిన నాలుగు రోజులకే కంపెనీ మూసేశారు. దీంతో వారం రోజుల నుంచి బ్యాంకుకు సెలవు పెట్టి ఇంట్లోనే కూర్చున్నాడు. వీరిద్దరే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ‘లుక్’ బాధితులు వేలల్లోనే ఉన్నారు. కురుగుంటకు చెందిన సురేష్ రూ.40 వేలు లుక్ యాప్లో డిపాజిట్ చేశాడు. నాలుగు రోజులు బాగానే సంపాదించాడు. ఈ క్రమంలోనే మరో 10 మందిని చేర్పించాడు. వారం రోజుల తర్వాత చూస్తే మొత్తం కంపెనీ ఎత్తేశారు. తనతో పాటు తాను కట్టించిన వారి డబ్బంతా పోయింది. దీంతో అవమానంగా భావించిన సురేష్ ఇటీవల ఇంటి నుంచి అసలు బయటకు రావడం లేదు. -
సాయి నామం.. దివ్య చరితం
ప్రశాంతి నిలయం: ఆశాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు చేపట్టిన ఆశాడీ దిండి పర్తియాత్ర శనివారం ప్రశాంతి నిలయం చేరుకుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాత్రికులు సత్యసాయి మహాసమాధి చెంత పల్లకీని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. అంతకుముందు వారు ధర్మవరం రైల్వేష్టేషన్లో రెండు రోజుల క్రితం దిగి అక్కడి నుంచి సత్యసాయి పల్లకీని ఊరేగిస్తూ పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి వేషధారణలో సత్యసాయి బోధించిన మానవతా విలువలను ప్రచారం చేస్తూ పాదయాత్ర సాగించారు. అలరించిన సంగీత కచేరీ ఆశాఢ ఏకాదశి సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఆర్యా అంబేకర్ బృందం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. ఆశాఢ ఏకాదశి విశిష్టతను వివరిస్తూ చక్కటి భక్తిగీతాలను ఆలపించారు. బాలవికాస్ చిన్నారులు ఆశాఢ ఏకాదళి వైభవాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి అవకాశం
పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాప్తాడుకు చెందిన కురుబ నాగిరెడ్డి, గంగన గోపాల్రెడ్డి, ముదిగుబ్బకు చెందిన వీరాంజనేయులు, అంకే లక్ష్మన్న, పుట్టపర్తికి చెందిన పి.సుధాకరరెడ్డి, జి.శేషురెడ్డిలను నియమించారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో చోటు పుట్టపర్తి టౌన్: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీల్లో జిల్లా నుంచి పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువజన విభాగం అధికార ప్రతినిధిగా వి.అమరనాథరెడ్డి (ధర్మవరం), రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్ ప్రెసిడెంట్గా టి.గంగాధర్రెడ్డి (పెనుకొండ), ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా డి.లక్ష్మానాయక్ (ధర్మవరం) స్టేట్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా కె.సురేష్కుమార్రెడ్డి (హిందూపురం) స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా జి,రమేష్ (ధర్మవరం) స్టేట్ పంచాయతీ వింగ్ జనరల్ సెక్రటరీగా కె.నాగరాజు (పుట్టపర్తి)స్టేట్ పంచాయితీ వింగ్ సెక్రటరీగా కె. రవీంద్రరెడ్డి ( పుట్టపర్తి )నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ‘కొర్రపాడు’ అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన కొర్రపాడు హుస్సేన్పీరా, రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజాశేఖర్రెడ్డి (రాజారెడ్డి)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందాయి. -
బొలెరో.. బైక్ ఢీ: ఇద్దరు మృతి
బత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి బైపాస్ రోడ్డులోని వేల్పుమడుగు క్రాస్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. మండలంలోని గంటాపురం గ్రామానికి చెందిన ఓబిలేసు(38) శనివారం ఉదయం తన బైక్పై బత్తలపల్లి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. ఇదే సమయంలో పీర్లను దర్శించుకునేందుకు గంటాపురం వెళ్లేందుకు రోడ్డుపై ఉన్న సదాశివ(32)ను తన బైక్పై ఎక్కించుకున్నాడు. వీరి వాహనం బత్తలపల్లి బైపాస్ వద్ద వేల్పుమడుగు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో అనంతపురం నుంచి తమిళనాడుకు జీవాలతో వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, ఏఎస్ఐ సోమశేఖర్మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను హైవే అంబులెన్స్లో ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గంటాపురం గ్రామస్తులు, మృతుల బంధువులు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న తమ వారిని చూసి వారంతా కన్నీరు మున్నీరయ్యారు. ఓబిలేసుకు భార్య రమణమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సదాశివకు భార్య శివకాంతతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రమణీయం.. రథోత్సవం
హిందూపురం: ‘హరేరామ... హరే కృష్ణ’ నామస్మరణతో హిందూపురం పురవీధులు మార్మోగాయి. హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బహుద రథయాత్ర హిందూపురంలో వైభవంగా సాగింది. తొలుత స్థానిక పాలిటెక్నికల్ కళాశాల కృష్ణాలాండ్ వద్ద గోవింద చరణ్ దాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవీ ఉత్సవమూర్తులకు పూజలు చేసి ప్రత్యేకంగా సిద్ధం చేసి 32 అడుగుల రథంలో కొలువుదీర్చారు. అనంతరం ఆశేష భక్త జనుల నడుమ ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర బైపాస్రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్, వాసవీధర్మశాల ఫంక్షన్ హాలు మీదుగా వాల్మీకి భవన్కు చేరింది. రథయాత్రలో మహిళలు కోలాటం, చిన్నారులు భరతనాట్యం చేశారు. కృష్ణ సంకీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. వాల్మీకి భవన్ వద్ద శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీసీ నాయకులు కొండూరు వేణుగోపాల్రెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. వైభవంగా జగన్నాథుడి రథయాత్ర పురంలో మార్మోగిన శ్రీకృష్ణ నామస్మరణ -
అమాయకుల జోలికెళ్తే ఊరుకోం
పుట్టపర్తి అర్బన్: అధికారం ఉంది కదా అని అమాయకుల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కూటమి నాయకులను హెచ్చరించారు. ఐదురోజుల క్రితం పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వీరనారప్ప కుటుంబీకులకు చెందిన మామిడి తోటలో సుమారు 300 చెట్లను ప్రత్యర్థులు నరికి వేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న దుద్దుకుంట శ్రీధర్రెడ్డి శనివారం పార్టీ నాయకులతో కలిసి వెంగళమ్మచెరువుకు వెళ్లారు. మామిడి తోటకు వెళ్లి దుండగులు నరికిన చెట్లను పరిశీలించారు. బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నగరిగా పేరొందిన పుట్టపర్తిలోనూ రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్నారు. చెట్లు నరికే విష సంస్కృతికి కూటమి నేతలు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎంతో కాలం ఉండదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ప్రజలు, రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రైతులు ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి చెట్లను నరికి వేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతు వీరనారప్ప కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దుద్దుకుంట శ్రీధర్రెడ్డి వెంట ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ తిప్పన్న, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు ఈశ్వరయ్య, రవినాయక్, మాజీ కన్వీనర్లు నరసారెడ్డి, గంగాద్రి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, తిప్పారెడ్డి ఉన్నారు. రాజకీయ కక్షతో పచ్చని చెట్లు కొట్టడం దుర్మార్గం మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి -
పుట్టపర్తిలో ఇసుక తోడేళ్లు
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు సహజ వనరులపై కన్నేశారు. ముఖ్యంగా బాగా డిమాండ్ ఉన్న ఇసుకనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని.. అధికారులను మామూళ్ల మత్తులో జోకొట్టి.. నదుల నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రవాణాకు ప్రత్యేక వ్యవస్థ కూటమి నేతలు కొందరు సిండికేటుగా మారి చిత్రావతి నదిలో ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. చిత్రావతి నదిలోకి ట్రాక్టర్లు వెళ్లేందుకు పుట్టపర్తి దుర్గమ్మ గుడి పక్క నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హారతి ఘాట్ మీదుగా కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకు ఇసుక ట్రాక్టరుకు ముందుగా రెండు బైకులు వెళ్తుంటాయి. ఏదైనా ఇబ్బందులుంటే బైక్పై ఉన్న వ్యక్తులు ముందే సమాచారం ఇస్తారు. అలాగే ఇసుక ట్రాక్టర్ వెనుక కూడా రెండు బైకులు వస్తుంటాయి. వెనుక నుంచి ఎవరు వచ్చినా బైక్లపై ఉన్న వారు చూసుకుంటారు. ఇలా కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకూ ఇసుక ట్రాక్టర్లకు రక్షణగా వెళ్తారు. ఇలా ఇసుక ట్రాక్టర్కు రక్షణగా వెళ్లినందుకు ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వని ట్రాక్టర్ల సమాచారం పోలీసులకు ఇచ్చి పట్టిస్తారు. ఎనుములపల్లి శివారు నుంచి ఒక సమూహం.. దుర్గమ్మ గుడి దగ్గర నుంచి మరో గ్రూపు.. ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తూ భారీగా వెనుకేసుకుంటున్నారు. కావాలంటే రూ.1,000 తీసుకో.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎవరైనా అధికారి వెళితే...ఆయనకూ మామూళ్ల ఎర వేస్తారు. వినకపోతే వారి ఉన్నతాధికారుల పేర్లు చెప్పి భయపెడతారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం చిత్రావతి నదిలో ఇసుకను ట్రాక్టర్లకు నింపుతుండగా.. ఇరిగేషన్ అధికారి ఒకరు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే ‘మీ పై అధికారులకు లంచం ఇచ్చాం. ఈ రోజంతా తరలిస్తూనే ఉంటాం. నీకూ కావాలంటే రూ.వెయ్యి ఇస్తాం. ఈ రోజంతా ఇటు వైపు చూడొద్దు. కాదు.. కూడదు అంటే ఇష్టం వచ్చింది చేస్కో. ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. మా ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు అడ్డుకునేది’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సదరు అధికారి మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కు వచ్చారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాకపోతే పోలీసులు వచ్చే లోపు ఇసుకాసురులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇలా వారు తప్పించుకుని వెళ్లేందుకు కూడా కొందరు సహకరించినట్లు తెలుస్తోంది. చిత్రావతి నదిని తోడేస్తున్న ‘తమ్ముళ్లు’ పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక దోపిడీ ప్రశ్నించిన ఓ ఇరిగేషన్ అధికారికి బెదిరింపులు ఉన్నతాధికారులకు భారీగా సమర్పించుకున్నామని వెల్లడి -
లోక్ అదాలత్లో 10,089 కేసుల పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 10,089 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులో కేసులు పరిష్కారమైతే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుందని, అదే లోక్ అదాలత్లో అయితే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, బార్ అసోసియేట్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో మోటారు వాహనాల ప్రమాద కేసులు 28 పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.1,57,55,000 నష్ట పరిహారం ఇప్పించారు. సివిల్ కేసులు 75 పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.5,35,59,388. ప్రీలిటిగేషన్ కేసులు 3,876 పరిష్కారం కాగా, ఇందులో మొత్తం రూ.1,98,98,382. ఎన్ఐ యాక్ట్ కేసులు– 22 మొత్తం రూ.31,50,000. 10న మెగా పీటీఎం సమావేశాలు ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 10న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ వి.రత్నతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి మెగా పీటీఎం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థీ తల్లిందడ్రులతో కలసి పీటీఎంకి హాజరు కావాలని, ఉపాధ్యాయులందరూ విధిగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరిస్తారన్నారు. అలాగే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈఏడాది ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతిలో 20,789 మంది, 6వ తరగతిలో 24 వేల మంది చేరారన్నారు. డ్రాప్ అవుట్స్ నివారించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. సామాజిక భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే పీ–4 కార్యక్రమం లక్ష్యమన్నారు. తల్లికి వందనంకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 14,703 ఫిర్యాదులు అందాయని, అందులో 10,803 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. మిగిలిన ఫిర్యాదులను మరోసారి పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. -
మార్కెటింగ్ కల్పించాలి
అన్సీజన్ కారణంగా పట్టుచీరల అమ్మకాలు బాగా తగ్గాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా షోరూం నిర్వాహకులు ఆషాఢం డిస్కౌంట్ ఇవ్వాలంటున్నారు. దీంతో మేం నష్టపోతున్నాం. ప్రభుత్వం పట్టుచీరల వ్యాపారులకు సొసైటీల ద్వారా అన్సీజన్లో పట్టు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. అలాగే పరిశ్రమల శాఖ నుంచి రాయితీ రుణాలను అందివ్వాలి. చేనేత కార్మికులకు ముడిపట్టురాయితీలు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పట్టుచీరల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం. తీవ్రంగా నష్టపోతున్నాం ఆషాఢం ఎఫెక్ట్ పట్టుచీరల వ్యాపారంపై తీవ్రంగా చూపుతోంది. ఇప్పటికే చేనేత సంక్షోభం కారణంగా పట్టుచీరల ఉత్పత్తి తగ్గింది. అన్సీజన్ కారణంగా రూ.లక్షల పెట్టుబడి స్తంభించిపోతోంది. ఆషాఢం డిస్కౌంట్ సేల్స్, అన్సీజన్ పట్టుచీరల వ్యాపారులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – నరేంద్ర, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం. -
మొహర్రం.. ఆధ్యాత్మిక సౌరభం
బత్తలపల్లి: మొహర్రం సందర్భంగా ఆధ్యాత్మిక సౌరభాలు వికసిస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం బత్తలపల్లిలోని ఖాసీంస్వామి పీర్లు భేటీకి రావాలని వివిధ గ్రామాల పీర్లకు ఆహ్వానం పలికేందుకు గ్రామాల పర్యటనకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ఉదయం గ్రామోత్సవం.. బత్తలపల్లి, గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి గ్రామాల్లో ఉదయం పీర్లకు గ్రామోత్సవం నిర్వహించారు. వందలాది మంది భక్తులు పీర్లు వెంట నడిచారు. తమ ఇళ్ల వద్దకు వచ్చిన పీర్లకు భక్తులు చక్కెర చదివించారు. అలావ్ తొక్కుతూ సందడి చేశారు. అనంతరం బత్తలపల్లి పీర్లు గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రికి వెళ్లగా.. ఆయా గ్రామాల పెద్దలు పీర్లతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం బత్తలపల్లి పీర్లు రాత్రికి మకాన్కు చేరుకున్నాయి. కాగా, మొహర్రం ఉత్సవాల్లో భాగంగా పీర్లస్వాముల వెంట వచ్చిన భక్తులకు, ప్రజలకు మాజీ సర్పంచు సింగారం నాగేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అదేవిధంగా బత్తలపల్లి ఎస్సీ కాలనీవాసుల ఆధ్వర్యంలోనూ అన్నదాన కార్యక్రమం జరిగింది. భేటీకి వివిధ గ్రామాల పీర్లకు స్వాగతం పలికిన బత్తలపల్లి పీర్లు ఆయా గ్రామాల్లో బత్తలపల్లి పీర్లకు ఘనస్వాగతం -
గూగూడుకు పోటెత్తిన భక్తులు
నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున చిన్నసరిగెత్తు సందర్భంగా అర్చకులు హుసేనప్ప కుళ్లాయిస్వామి పీరును ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాసేపు తొక్కిసలాట జరిగింది. చిన్న సరిగెత్తులో భాగంగా స్వామి వారి భక్తులు ఫకీర్లుగా మారి జలధి పోయే వరకు నియమనిష్టగా ఉంటారు. – నార్పల/ సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
కార్మికుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: కార్మికుల జీవితాలతో చెలగాటమాడరాదని కూటమి ప్రభుత్వాన్ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు హెచ్చరించారు. ఏడు నెలలుగా బకాయిపడిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఐఎఫ్టీయూ ఏసురత్నం, రైతు కూలీ సంఘం రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రామకృష్ణ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు మాట్లాడుతూ.. నెలలుగా వేతనం చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వేతనాలు చెల్లించాలంటూ 85 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యోగా డే అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వానికి కార్మిక కుటుంబాల ఆకలి కేకలు వినిపించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఏడు నెలల వేతన, 40 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఏబీఆర్ నుంచి హిందూపురం వరకూ ట్రంక్లైన్ కార్మికులకు ఆరు నెలల వేతనాలు, 26 నెలల పీఎఫ్ బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. ఫేస్–4 కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర కార్మికులకు రెండు నెలల వేతనం, 18 నెల పీఎఫ్, మడకశిర కార్మికులకు మూడు నెలల వేతనం, 36 నెలల పీఎఫ్, హిందూపురం కార్మికులకు 15 నెలల వేతనం, 15 నెలల పీఎఫ్ చెల్లించాల్సి ఉందన్నారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ కార్మికులకు బకాయిలు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 కోట్ల నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఐదు రోజుల క్రితం ప్రకటించారని, అయితే ఆ డబ్బు నేటికీ కార్మికుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, రాము, తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు ఏడు నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలి అనంత కలెక్టరేట్ ఎదుట ధర్నా మద్ధతు పలికి న సీపీఎం, వైఎస్సార్టీయూ, ఐఎఫ్టీయూ, రైతుసంఘాలు -
ధర పట్టుకుంది
ఇంత కాలం నష్టాలు చవి చూసిన పట్టుగూళ్ల రైతులు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారం రోజులుగా పట్టుగూళ్ల ధరలు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ధరలు మరికొంత కాలం నిలకడగా కొనసాగాలని కోరుకుంటున్నారు. మడకశిర: జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో బైవోల్టిన్ పట్టు సాగు చేసే రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మంది పట్టు రైతులు బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు పెరుగుతుండడంతో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్లో సందడి నెలకొంది. గతమంతా నష్టాలే.. ఐదారు నెలలుగా పట్టుగూళ్లకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూ వచ్చారు. కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.600లోపే ఉండేది. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. కిలో పట్టుగూళ్లు గరిష్టంగా రూ.600కు పైగా ధర పలుకుతోంది. ఈ నెల 2న గరిష్ట ధర రూ.655కు చేరుకుంది. 3న స్వల్పంగా తగ్గి గరిష్టంగా రూ.630తో క్రయ విక్రయాలు సాగాయి. తాజాగా మార్కెట్కు శుక్రవారం దాదాపు 1,541 కిలోల పట్టుగూళ్లను రైతులు తీసుకురాగా, ధర గరిష్టం రూ.648కు ఎగబాకింది. పెరుగుతున్న క్రయవిక్రయాలు మార్కెట్లో ధర నిలకడగా కొనసాగుతుండడంతో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్లో క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 8 రోజుల్లోనే 39,180 కిలోల బైవోల్టిన్ పట్టుగూళ్లు హిందూపురం మార్కెట్లో అమ్మకానికి రైతులు తీసుకువచ్చారు. వారం రోజుల క్రయవిక్రయాలను పరిశీలిస్తే... జూన్ 26న మార్కెట్కు 6,272 కిలోల పట్టుగూళ్లను రైతులు తీసుకువచ్చారు. అలాగే అదే నెల 27న 7,140 కిలోలు, 28న 6,847 కిలోలు, 29న 7,130 కిలోలు, 30న 4,061 కిలోల చొప్పున బైవోల్టిన్ పట్టు గూళ్ల క్రయవిక్రయాలు సాగాయి. ఈ నెల 1న 1,705 కిలోలు, 2న 3,641 కిలోలు, 3న 2,384 కిలోల పట్టు గూళ్లను మార్కెట్లో రైతులు విక్రయించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తుండడంతో పట్టుగూళ్ల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రోత్సాహక ధనం విడుదలపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బైవోల్టిన్ పట్టు రైతులకిచ్చే ప్రోత్సాహక ధనాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ నయా పైసా కూడా చెల్లించలేదని వాపోతున్నారు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్లలో విక్రయించే బైవోల్టిన్ పట్టుగూళ్లకు ప్రతి కిలోకు రూ. 50 చొప్పున ప్రోత్సాహక ధనాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఈ ప్రోత్సాహక ధనాన్ని చెల్లించలేదు. దీంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రోత్సాహక ధనాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని పలుమార్లు విజయవాడకు పట్టు రైతుల సంక్షేమ సంఘం నాయకులు వెళ్లి కూటమి ప్రభుత్వ పెద్దలను కలసి విన్నవించారు. అయినా ఫలితం దక్కలేదు. క్రమేణ పెరుగుతున్న బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు కొన్ని రోజుల క్రితం కిలో రూ.600 లోపే,, తాజాగా రూ.655 వరకు గరిష్ట ధర -
పేకాటరాయుళ్ల అరెస్ట్
బత్తలపల్లి: స్థానిక మారుతీనగర్లో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. వివరాలను ఆయన వెల్లడించారు. అందిన పక్కా సమాచారంతో శుక్రవారం మారుతీనగర్లోని జొన్నలగడ్డ రంగనాయుడు ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్డు వద్దకు డీఎస్పీ హేమంత్కుమార్తో పాటు సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1,01,050 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. తనిఖీల్లో స్థానిక పోలీసులతో పాటు డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. హత్య కేసు నమోదు ధర్మవరం అర్బన్: ఈ ఏడాది మే 29న గుర్తు తెలియని వ్యక్తులు ధర్మవరంలోని గీతానగర్లో నివాసముంటున్న చింతా రమాదేవి(55) ఇంట్లో చొరబడి ఆమె గొంతుకు తాడు బిగించి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతి చెందడంతో దుండగులపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కాగా, ఆమె భర్త సుబ్రహ్మణ్యం కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. ఒంటరిగా జీవిస్తున్న తన తల్లిపై హత్యాయత్నం చేశారంటూ కూతురు దీపిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
కలుషిత ఆహారం అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుల డిమాండ్ ధర్మవరం రూరల్/పుట్టపర్తి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో గురువారం కలుషిత ఆహారం అందించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, వేముల అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువకుడి ఆత్మహత్య పరిగి: ఉద్యోగం రాలేదన్న బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన శ్రీరాములు కుమారుడు కురుబ సోమశేఖర్ (29) మెకానికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి, నాలుగేళ్ల పాటు బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేశాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సొంతూరిలోనే మేకలను కాచుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక తనకు ఉద్యోగం రాదన్న బెంగతో గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు తన తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున ఇంటికి చేరుకున్న తల్లి తిప్పక్క ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి బోరున విలపించింది. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. ఆక్రమణలు తొలగించకుండానే స్నాన ఘట్టాల నిర్మాణం పుట్టపర్తి అర్బన్: సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని చిత్రావతి నదిలో నిర్మిస్తున్న స్నాన ఘట్టాలు విమర్శలకు తావిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో సత్యసాయి శత జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చిత్రావతి నది ఒడ్డున స్నాన ఘట్టాలు, నది తీరం వెంబడి ఇరువైపులా సుమారు కిలోమీటరుకు పైగా రాతితో బండింగ్ పనులు, నది మధ్యన సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపు రూ.3.5 కోట్లను వెచ్చిస్తున్నారు. అయితే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసే స్థలం చాలా వరకూ ఆక్రమణకు గురైంది. ఇలాంటి తరుణంలో ఆక్రమణలు తొలగించకుండా నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమవుతోంది. ఆక్రమణలు తొలగించకపోతే నది కుచించుకుపోయి, భారీ వర్షాలు కురిస్తే వరద మొత్తం పట్టణంలోకి చొరబడి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఆక్రమణలు తొలగించిన తర్వాతనే స్నాన ఘట్టాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. -
హామీలతో నయవంచన
గోరంట్ల: సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను నయవంచన చేస్తున్నారని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఓట్లు వేయించుకుని.. అవసరం తీరాక హామీలను గాలికి వదిలేశారని విరుచుకుపడ్డారు. గోరంట్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో– చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పోస్టర్లను జిల్లా అధ్యక్షురాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది దాటినా హామీలు సంపూర్ణంగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని దుయ్యబట్టారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా.. నిరుద్యోగ భృతి చెల్లింకుండా యువతను దగా చేశారన్నారు. 18 ఏళ్లు నిండి 59 ఏళ్ల వయసు వరకు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరించి, ఏ విధంగా మోసం చేశారో ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యకుడు రఘురామిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాంనాయక్, పట్టణ కన్వీనర్ మేదర శంకర, జిల్లా స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యుడు గంపల వెంకటరమణారెడ్డి, ముఖ్యనాయకులు, బూదిలి రవీంద్రారెడ్డి, వానవోలు రాజేంద్రప్రసాద్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
పట్టుచీరల వ్యాపారి బలవన్మరణం
ధర్మవరం అర్బన్: పట్టుచీరల వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. వ్యసనాలు మానుకోవాలని ప్రాధేయపడినా మారలేదని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని శాంతినగర్కు చెందిన బండి జగదీష్ (30)కు నేసేపేటకు చెందిన అంజలితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. జగదీష్ పట్టుచీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఏడాది కిందటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్లో సంపాదించిన సొమ్ముతో పాటు బయట అప్పులు చేసి మరీ పెట్టి.. నష్టపోయాడు. పద్ధతి తప్పిన భర్తను తిరిగి మార్చుకోవడానికి భార్య ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. మందలించినా, ప్రాధేయపడినా అతనిలో మార్పు కనిపించలేదు. చేసేదిలేక ఆమె నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికీ జగదీష్ వ్యసనాలను వదులుకోలేదు. భార్య తిరిగి కాపురానికి రాకపోవడం, వ్యసనాలను వీడలేకపోవడంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లోని బాత్రూమ్లోకి వెళ్లి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే జగదీష్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెడు అలవాట్లు, బెట్టింగ్తో విపరీతంగా అప్పులు -
అరాచకాలు దాచేసి.. అబద్ధాలు అచ్చేసి!
ఇచ్చిన హామీలే నీటిమూటలనుకుంటే ఇంటింటికీ సుపరిపాలన అంటూ ముద్రించిన కరపత్రాలు మరీ ఘోరంగా ఉన్నాయంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు నెరవేర్చామా లేదా అన్నది చెప్పకుండా చేయని పనులపై అబద్ధాలు అచ్చువేసి కరపత్రాలు పంచుతున్నారు. వీటిని చదువుతున్న సామాన్యులు కూడా అర్థం కాక బిక్కముఖం వేస్తున్న పరిస్థితి. ‘సూపర్ సిక్స్’పై ఎక్కడా ఒక్కమాట కూడా చెప్పకనే.. ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్త్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న కూటమి ఎమ్మెల్యేలు పంచుతున్న కరపత్రాల్లో ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మహిళలపై దాడులు గణనీయంగా తగ్గాయని ముద్రించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. అనంతపురంలో ఇంటర్ చదివే గిరిజన బాలిక తన్మయి దారుణ హత్యకు గురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీపీపై దారుణంగా దాడి చేశారు. రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎస్సీ,ఎస్టీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. కానీ, వాటన్నింటినీ దాచి దాడులు తగ్గినట్టు చిత్రీకరించడం చర్చనీయాంశమైంది. గంజాయి, డ్రగ్స్ ముఠా పేట్రేగి పోతున్నా కూటమి ప్రభుత్వం వచ్చాక రాయదుర్గం ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా గంజాయి సాగు చేస్తూ దొరికిపోయాడు. తాడిపత్రిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తూ పోలీసులకు సవాలుగా మారింది. అనంతపురంలో ఇటీవలే గంజాయి బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. హిందూపురంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతోంది. ఇంత దారుణంగా రెండు జిల్లాలో గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదవుతుంటే.. సురక్షిత ఆంధ్రప్రదేశ్ అని, రౌడీషీటర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఏడాది పాలన కరపత్రాల్లో భజన చేశారు. గుంతల రోడ్లకు గంతలు.. ఉమ్మడి జిల్లాలో గుంతలు పడిన రోడ్లకు కూటమి సర్కారు గంతలు కట్టింది. ఎక్కడ చూసినా రోడ్లు ఛిద్రమై వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు రూ.866 కోట్లు విడుదల చేశామని కరపత్రాల్లో పొగుడుకున్నారు. కానీ రోడ్లు బాగుపడకపోగా బిల్లులు మాత్రం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. మరోవైపు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అంటూనే ఇటీవలి కాలంలో కరెంటు కోతలు విపరీతంగా విధించారు. ముందే రెక్కీ.. ఆకస్మికంగా గ్రామాల పర్యటన చేసే పరిస్థితి కూటమి నేతలకు లేదు. ఎక్కడ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతానికి ముందురోజే అనుచరులను పంపించి అక్కడ వ్యతిరేకులెవరైనా ఉంటే బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటే వారికి ముందే నచ్చజెప్పి వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇంటింటికీ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న సామాన్యులు వాట్సాప్ గ్రూపుల్లో సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. డ్రైనేజీ, రోడ్లు, కరెంటు స్తంభాలు, డీపీలు, ఆస్పత్రుల్లో వసతులు ఇలా ఒకటేమిటి రకరకాల సమస్యలతో వాట్సాప్ గ్రూపులు మోత మోగుతున్నాయి. ‘సుపరిపాలన’ కరపత్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గాయని ముద్రణ క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితి ‘ఉమ్మడి అనంత’లో పెరిగిన అత్యాచారాలు, హత్య ఘటనలు రైతులకు ఉచిత విద్యుత్ అంటూనే.. విపరీతంగా కోతలు గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం అంటూ పత్రాల్లో భజన -
పద్మనాభుడి మాన్యం.. పరాధీనం
చిలమత్తూరు: హిందూపురంలోని నానెప్ప సత్రం ఎదురుగా ఉన్న సుప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన మాన్యం భూములు వివాదంలో చిక్కుకున్నాయి. శ్రీకంఠపురం పరిధిలోని సర్వే నంబరు 131–3సీలో తనకున్న 17 ఎకరాల్లో రెండు ఎకరాలను 1925లో స్థానిక వైద్యుడు నానెప్ప అనే బ్రాహ్మణుడు అనంత పద్మనాభస్వామి ఆలయానికి దానం చేశారు. మిగిలిన 15 ఎకరాల భూమిలో ఎస్డీజీఎస్ కళాశాల ఉంది. తనకు వారసులెవరూ లేకపోవడంతో ఉన్న భూమిని దానం చేశారు. అప్పటి నుంచి ఆ భూమిలో కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్న చంద్రవంక బావి నుంచి నీటిని వినియోగించుకుని పూల మొక్కలు పెంచుతూ వాటి పూలను స్వామి వారి సేవకు వినియోగిస్తూ వస్తున్నారు. కాలక్రమేణ ఆ భూమిలో దేవదాయశాఖ అనుమతితో కొందరు వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా అద్దెను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెల్లిస్తూ వస్తున్నారు. రూ.80 కోట్ల విలువైన మాన్యంపై కన్నేసి.. హిందూపురం పరిసరాల్లో భూముల విలువ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పద్మనాభస్వామి ఆలయ మాన్యం విలువ రూ.80 కోట్లకు పైగా చేరుకుంది. దీంతో ఆలయానికి చెందిన రెండు ఎకరాలపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. లేని వారసులను సృష్టించి ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులను లోబర్చుకుని సృష్టించిన పత్రాలను న్యాయస్థానంలో సమర్పించి చివరకు ఆ భూమిని తమ వశం చేసుకున్నారు. ఆ భూమి ఆలయానిదేనంటూ కోర్టుకు దేవదాయశాఖ విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే అంశంపై ఆ భూమిలో దుకాణాలు నిర్వహిస్తున్న పలువురు హిందూ సంఘాల నాయకులతో కలసి ఉద్యమాలు చేపట్టారు. అన్యాక్రాంతమైన ఆ భూమిని తిరిగి ఆలయానికి దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు పట్టని దురాక్రమణ.. అనంత పద్మనాభస్వామి ఆలయ మాన్యం దురాక్రమణపై ప్రజాప్రతినిధులు సైతం పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చివరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. రూ.80 కోట్లు విలువైన ఆలయ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కోర్టుకు నకిలీ ప్రత్రాలు సమర్పించి తప్పుదోవ పట్టించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రజాప్రతినిధులు సైతం అక్రమార్కులకే వంత పాడుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బావిలో నిధులు కాజేందుకేనా? ఆలయ మాన్యంలోని చంద్రవంక బావిలో అనంత పద్మనాభుడికి చెందిన అపారమైన నిధి, నిక్షేపాలు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పూర్వం సుల్తానుల బారి నుంచి ఆలయాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో విలువైన వజ్ర, వైఢూర్యాలు, బంగారం, ఇతర విలువైన సామగ్రిని బావిలో దాచినట్లుగా స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు బావిలో నిధులు కాజేందుకు కోర్టును తప్పుదోవ పట్టించి ఆలయ మాన్యం భూములను తమ వశం చేసుకున్నారని, ఆ తర్వాత నింపాదిగా బావిలోని నిధి నిక్షేపాలను వెలికి తీసి సొంతం చేసుకునే కుట్రకు తెరలేపారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బావిని పురావస్తు శాఖ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ సైతం స్థానికుల నుంచి వినిపిస్తోంది. రోడ్డున పడనున్న 50 కుటుంబాలు.. స్వామి మాన్యంలో సుమారు 46 నుంచి 50 దుకాణాలు వెలశాయి. వీరు ప్రతి నెలా సత్రానికి అద్దె కూడా చెల్లిస్తున్నారు. వివిద రకాలుచిరు వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుతం భూమిని తమ వశం చేసుకున్న వారు అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగించేందుకు సిద్ధమయ్యారు. నోటీసులు ఇస్తే దాదాపు ఆరు దశాబ్దాలుగా అక్కడ దుకాణాలు నిర్వహిస్తున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముండడంతో పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఈఓ బదిలీకి కుట్ర.. అన్యాక్రాంతమైన అనంత పద్మనాభస్వామి ఆలయ మాన్యం భూములను తిరిగి ఎలాగైనా ఆలయానికే దక్కేలా చేయడానికి ఆలయ ఈఓ నాగేంద్రుడు పోరాటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ ఎదుట ఫ్టెక్సీ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ అంశం ఆలయ మాన్యం దక్కించుకున్న ప్రైవేట్ వ్యక్తులకు గిట్టలేదు. దీంతో ఎలాగైనా ఈఓను అక్కడి నుంచి బదిలీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా సమాచారం. రూ.80 కోట్ల విలువైన ఆ భూమి తమ పూర్వీకులదంటూ తెరపైకి ప్రైవేట్ వ్యక్తులు ఆధారాల సృష్టించి దక్కించుకున్న వైనం ఆలయ మాన్యం వదలబోమంటున్న దేవదాయ శాఖ -
●తుంగభద్ర తుళ్లింత
బొమ్మనహాళ్: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు. రెండున్నర అడుగుల మేర ఎత్తి నదికి 58,260 క్యూసెక్కులు, వివిధ కాలువలకు 4,506 క్యూసెక్కులు కలిపి మొత్తం 62,766 క్యూసెక్కులను బయటికి పంపుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోపే ఆమేరకు నీరు చేరడం గమనార్హం. దీంతో డ్యాంలో 78.100 టీఎంసీలు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు. 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత 58,260 క్యూసెక్కుల నీరు నదికి -
రాజకీయ క్రీనీడలో భూసేకరణ సమావేశం
చిలమత్తూరు: మండలంలోని టేకులోడు గ్రామంలో సెజ్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీడీపీ నేతలు దబడి దిబిడిగా మార్చేశారు. ఆర్డీఓ వస్తున్నారని రైతులంతా రావాలని హాజరు కావాలని ముందస్తుగా అధికారులు ప్రకటించారు. అయితే గురువారం ఉదయం సమావేశానికి స్థానిక తహసీల్దార్ తప్ప మరే అధికారి హాజరు కాలేదు. మొత్తం సమావేశాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, సురేంద్రబాబు దగ్గరుండి నడిపించారు. వేదికపై తహసీల్దార్ ఒక్కరే అధికారి కాగా, మిగిలిన వారందరూ టీడీపీ నాయకులు ఆక్రమించేశారు. రైతులకు అనుకూలంగా మాట్లాడాల్సిన నాయకులు బెదిరింపు ధోరణితో రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పక్క నియోజకవర్గాల్లో భూములు తక్కువ ధరకే వస్తున్నాయని, ఇక్కడ రైతులు కూడా ప్రభుత్వం అందించే స్వల్పపాటి పరిహారం తీసుకొని భూములు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన గ్రామ సభ కాస్త పక్కదారి పట్టడంతో రైతుల్లో అసహనం వ్యక్తమైంది. తక్కువ ధరకే దౌర్జన్యంగా భూములు కొట్టేయాలని చూస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సెజ్ ఏర్పాటుకు భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించేలా అప్పటి సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకున్నారని, ప్రస్తుతం రూ.12 లక్షలకే భూములు అప్పగించాలంటూ ఒత్తిడి చేయడం సబబు కాదని పలువురు రైతులు వాపోయారు. కాగా, సెజ్ ఏర్పాటుకు భూములు సేకరిస్తే నిర్వాసితులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తహసీల్దార్ నటరాజ్కు సీపీఎం నేత ప్రవీణ్కుమార్ వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. తహసీల్దార్ తప్ప వేదికపై కూర్చున్న వాళ్లందరూ టీడీపీ నేతలే గ్రామ సభలో రైతుల గొంతు నొక్కే ప్రయత్నం -
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ముగ్గురు సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా డాక్టర్ రామ్కుమార్ కాకాని (డైరెక్టర్, ఐఐఎం రాయ్పూర్), పాలకమండలి నామినీగా ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ (వీసీ, గీతం వర్సిటీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అలోక్కుమార్ రాయ్ (వీసీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో బాబుగంజ్, లక్నో) వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోని సభ్యులు సమావేశమై ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ తుది నియామకం చేయనున్నారు. కాగా, ఎస్కేయూ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ప్రస్తుతం ఉన్నారు. ఇన్చార్జి పాలనలోనే ఏడాది పూర్తయింది. సాధారణ ఉద్యోగిని రిజిస్ట్రార్గా నియామకం చేశారు. కనీసం డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని నియామకం చేయాల్సి ఉండగా, నిబంధనలు బేఖాతరు చేస్తూ రీసెర్చ్కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ను రిజిస్ట్రార్గా నియామకం చేశారు. ఏడాది కాలంలో వర్సిటీకి ఒక్క యూజీసీ ప్రాజెక్ట్ రాలేదు. కీలక నిర్ణయాలు అన్నీ జాప్యం కావడంతో వర్సిటీ పురోగతి మందగించింది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయి వీసీ వస్తే వర్సిటీ పురోగతి గాడిన పడుతుందని ఉద్యోగులు, విద్యార్థులు భావిస్తున్నారు. సగం ధరకే వాహనమంటూ కుచ్చుటోపీ ● తాడిపత్రి పోలీసుల అదుపులో మోసగాళ్లు? ● ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాల స్వాధీనం తాడిపత్రి టౌన్: సగం ధరకే అంటూ ప్రజలను మోసం చేసి ద్విచక్ర వాహనాలను అంటగడుతున్న తాడిపత్రికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో తాడిపత్రిలోనే వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, ఆటోలు విక్రయించినట్లు గుర్తించి, ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాల కోసం పోలీసులు వల పన్నారు. కాగా, తాడిపత్రి పట్టణంలోని పెద్దబజార్కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని దుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే పూర్తిగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునేంత వరకూ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా పోలీస్స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ద్విచక్రవాహనాలు ప్రత్యక్షం కావడంతో పట్టణ వాసుల అవాక్కయ్యారు. కాగా, సగం ధరకే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్స్టేషన్ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల యజమానులు, పోలీసులూ ఉన్నట్లు సమాచారం. తాడిపత్రికి చెందిన కొందరు ధనవంతులు సైతం కార్లు, లారీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలి
ప్రశాంతి నిలయం: ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలని, సంపూర్ణ ఆరోగ్యంతోనే చక్కగా జీవించవచ్చని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కిలో కందిపప్పు, కిలో రాగిపిండి, కిలో గోధుమపిండి, కిలో శనగపిండి, కిలో వేరుశనగ, నూనె, 30 కోడిగుడ్లు, 250 గ్రాముల చిక్కీ బర్ఫీలు, కిలో శనగలు, 8 రకాల పౌష్టికాహార పదార్థాలతో కూడి కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,172 మంది టీబీ రోగులకు చికిత్స పొందుతున్నారన్నారు. వారికి జిల్లాలో గల రెండు కంపెనీల సహకారంతో పౌష్టికాహారం ఆరు నెలలకు ఒకసారి చొప్పున అందించనున్నట్లు చెఆప్పరు. పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో దాతలు సింగ్వూ కంపెనీ ప్రతినిధులు ఆదిత్య, డీఎస్ఓ వంశీకృష్ణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్, డీఎస్ఏటీఓ డాక్టర్ ఎస్.ఎ.సునీల్ కుమార్, ఎంఓడీటీసీ డాక్టర్ గాయత్రి, టీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర ఫౌండేషన్పై మంత్రి సమీక్ష
ధర్మవరం అర్బన్: స్థానిక నియోజకవర్గ పరిధిలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గురువారం సమీక్షించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ ప్రక్రియలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ సాయి మనోహర్, విద్యావేత్త సురేంద్రనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర సామాజిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్క రంగంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల పరిశీలన ధర్మవరం అర్బన్: ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్ మరింత నిఘా ఉంచాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, సిబ్బందికి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి.కృష్ణవేణి సూచించారు. ధర్మవరంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని గురువారం జేటీసీ సందర్శించారు. పట్టణంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఎంవీఐతో సమావేశమై మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రేపు ‘అనంత’లో జగన్నాథ యాత్ర
అనంతపురం కల్చరల్: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనంత వేదికగా మరోసారి పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకలకు సర్వాంగ సుందరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కళాకారులు, ఇస్కాన్ మందిరాల ప్రతినిధులు అనంతకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన పూరీ రథయాత్రను 2015లో ఇస్కాన్ మందిరం అనంతలో ఘనంగా నిర్వహించింది. దేశంలోనే అతి పెద్దదైన పూరీ జగన్నాథుడి వేడుకలను దూరాభారం వల్ల చూడలేని వారికి.. వారి ముంగిటనే రథయాత్రను చూసే భాగ్యాన్ని ఇస్కాన్ తీసుకువచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటి వరకూ ఆరు సార్లు వైభవంగా రథయాత్ర వేడుకలు జరిగాయి. ఈ నెల 5న సాగే వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. రథయాత్ర సాగుతుందిలా.. తొలుత రెండు రోజుల పాటూ రథయాత్ర ఘనంగా నిర్వహించాలని ఇస్కాన్ ప్రతినిధులు భావించారు. కానీ ఒక్కరోజు యాత్రకు కూడా జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతివ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి రథయాత్ర సజావుగా సాగేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో కళాజాత, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వేద పఠనం నడుమ జగన్నాథ రథయాత్ర శనివారం ఉదయం లలిత కళాపరిషత్తులో ప్రారంభం కానుంది. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు సాగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక కేఎస్ఆర్ కాలేజ్ సమీపంలో మహా అభిషేకంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. నగర పాలక సంస్థ కార్యాలయం, సుభాష్రోడ్, టవర్క్లాక్, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్రోడ్, గాంధీబజార్, పాతూరు మీదుగా బసవన్నకట్ట నుంచి మళ్లీ సప్తగిరి సర్కిల్ మీదుగా లలిత కళాపరిషత్తుకు చేరుకుంటుంది. విశిష్ట అతిథిగా శ్రీమాన్ సత్యగోపీనాథ్ ప్రభు విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. సినీనటుడు సుమన్ ఆత్మీయ అతిథిగా విచ్చేసి రథయాత్రను ప్రారంభిస్తారు. అలాగే కళాజాతను పలువురు ప్రజాప్రతినిధులు ఆరంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన కళాకారులు అనంతకు విచ్చేసి తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. నగర వీధుల్లో శోభాయమానంగా సాగే రథయాత్రలో అనంత వాసులు భాగస్వాములు కావాలని గురువారం ఇస్కాన్ మందిరంలో జరిగిన సమావేశంలో నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తరలి రానున్న జాతీయ ఇస్కాన్ సభ్యులు, సినీ ప్రముఖులు హైకోర్టు ఆదేశంతో ముందుకు కదలనున్న రథచక్రాలు -
మహారాష్ట్ర భక్తుల పర్తి యాత్ర
ధర్మవరం అర్బన్: పర్తి యాత్రలో భాగంగా ధర్మవరం రైల్వే స్టేషన్కు గురువారం చేరుకున్న మహారాష్ట్ర వాసులు పాదయాత్రగా పుట్టపర్తికి తరలివెళ్లారు. దాదాపు 500 మందికి పైగా భక్తులు వారి సంప్రదాయ రీతిలో భజనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ వెళుతుండగా పట్టణ ప్రజలు సాదరస్వాగతం పలికారు. ఇద్దరిపై కేసు నమోదుకదిరి అర్బన్: యువకుడిపై రాళ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను సీఐ నారాయణరెడ్డి గురువారం వెల్లడించారు. కదిరిలోని నిజాంవలీ కాలనీకి చెందిన కేదార్ మహేష్కుమార్పై అదే కాలనీకి చెందిన రాకేష్, నగేష్ రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. స్నేహితులైన ఈ ముగ్గురి మధ్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్కుమార్పై వారు దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేష్, నగేష్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూదరుల అరెస్ట్ పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పరిధిలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి ఎస్ఐ రంగడు యాదవ్ గురువారం మోదా పంచాయతీ పరిధిలోని బందార్లపల్లి శివారున తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించగానే పేకాటరాయులు పారిపోయారు. పోలీసులు వెంటాడి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.70,500 నగదు, 19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించారు. జూదరులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనులపై కఠిన చర్యలు పుట్టపర్తి టౌన్: ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి మద్యం షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రోహిబిషన్, ఎకై ్సజ్ అధికారి గోవింద నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం దకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలన్నారు. బార్లలలో రాత్రి 11 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. ప్రతి మద్యం షాపులోనూ 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ఒకరికి 3 కంటే ఎక్కువ మద్యం సీసాలు విక్రయించరాదన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు చేయరాదన్నారు. .సుంకం చెల్లించని మద్యం, కల్తీ మద్యం విక్రయించిన దుకాణ యజమానులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్పీ పదోన్నతుల సీనియార్టీ జాబితా విడుదల అనంతపురం: డీఎస్పీ పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక (అడహాక్ ) సీనియార్టీ జాబితాను అధికారులు విడుదల చేశారు. 2024–25 ప్యానల్లో సీనియార్టీ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీఐలు ఉన్నారు. వీరిలో కె.దేవానంద్ (అనంతపురం), ఎం.ఆదినారాయణ (పీటీసీ అనంతపురం), బి.మోహన్ ( శ్రీసత్యసాయి), కె.సాయినాథ్ (అనంతపురం), ఎస్వీ భాస్కర్గౌడ్ (అనంతపురం), కె.రాఘవన్ (శ్రీసత్యసాయి), పి.సత్యబాబు (అనంతపురం), జి.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి (శ్రీసత్యసాయి) ఉన్నారు. కలుషిత నీరు తాగి 16 జీవాల మృతి బెళుగుప్ప: కలుషిత నీరు తాగి 16 జీవాలు మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటకు యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా అందించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గొర్రెల మంద అక్కడకు చేరుకుంది. దాహంతో ఉన్న గొర్రెలు, మేకలు అప్పటికే తొట్టెలో ఉన్న యూరియా కలిపిన నీటిని తాగాయి. కాసేపటి తర్వాత 10 గొర్రెలు, 5 మేకలు, ఓ పొట్టేలు మృత్యువాత పడడంతో కాపరులు తిప్పయ్య, మహేష్, వన్నూరుస్వామి, రామాంజనేయులు, అంజనప్ప, లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. -
పంచాయతీకి ట్రాక్టర్ అప్పగింత
సాక్షి, టాస్క్ఫోర్స్: ఎట్టకేలకు ఏడాది తర్వాత పేరూరు మేజర్ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ తిరిగి పంచాయతీకి చేరింది. స్వచ్ఛ భారత్ పనుల కోసం ప్రభుత్వం పేరూరు పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వగా.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సొంత పనులకు వాడుకోవడంతో పాటు ఇతర రైతులకు అద్దెకు ఇస్తూ సొమ్ముచేసున్నాడు. దీనిపై ‘పంచాయతీకే పంగనామం’ శీర్షికన ఈనెల 1వ తేదీ మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమాల పర్వాన్ని బట్టబయలు చేసింది. ఈ కథనం తీవ్ర చర్చనీయాంశం కాగా, టీడీపీ నాయకులు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. వెంటనే ట్రాక్టర్ను పంచాయతీకి స్వాధీనం చేయాలని ఆదేశించడంతో.. టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ బుధవారం ట్రాక్టర్ను పంచాయతీ ఆఫీసు వద్దకు తీసకువెళ్లి కార్యదర్శి సత్యమ్మకు తాళాలు అప్పగించారు. అయితే ఏడాదిగా ట్రాక్టర్ను అద్దెలకు ఇచ్చి సంపాదించిన మొత్తాన్నీ పంచాయతీ ఖాతాకు జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 10న జిల్లాలోని కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి సీఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 10న సీఎం చంద్రబాబు కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉందన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ప్రతి శాఖకు బాధ్యతలు అప్పగించామని, లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్లో స్పెషలిస్ట్ వైద్యులతో పాటు అత్యవసర మందులను, అంబులెన్స్ను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వైవీఎస్ శర్మ, డీపీఓ సమత, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, జిల్లా రవాణా శాఖ అధికారి జే.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం తదితరులు పాల్గొన్నారు. జలజలా తుంగభద్రమ్మ.. ● టీబీ డ్యాం 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత బొమ్మనహాళ్: ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండగా తుంగభద్రమ్మ పరుగులు తీస్తోంది. దీంతో అధికారులు బుధవారం జలాశయం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 14,136 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. డ్యాం ఎగువ భాగంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి 32,494 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,625.46 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 78.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నం డ్యాం క్రస్ట్ గేట్లలో నాలుగింటిని, రాత్రి 7 గంటల సమయంలో మరో రెండింటిని ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. -
అధికారులు అన్యాయం చేశారు
అనంతపురం అర్బన్: బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు తమకు తీవ్ర అన్యాయం చేశారని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించలేదన్నారు. ర్యాంక్ (మెరిట్) ఆధారంగా బదిలీలు నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా స్థానాలు కేటాయించారని మండిపడ్డారు. రాజకీయ సిఫారసు ఉన్నవారికి వారు కోరుకున్న స్థానాలు కేటాయించారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కలెక్టరేట్కు వచ్చిన పలువురు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు గతనెల 28న బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. ఆరోజున కౌన్సెలింగ్కు హాజరైన తమ నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకుని..మీ ఆప్షన్లలో ఏదో ఒకటి తర్వాత ఇస్తామని చెప్పారన్నారు. తీరా పోస్టింగ్ ఆర్డర్స్ ఒకటో తేదీన పంపారని, అందులో తామిచ్చిన ఆప్షన్లకు సంబంధం లేని మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. ముందు ర్యాంకులో ఉన్న తమను కాదని తరువాత ర్యాంక్ వాళ్లకు తమ స్థానాలు ఇచ్చారని ఆరోపించారు. అంతే కాకుండా దివ్యాంగులు, మెడికల్, ఒంటరి మహిళలు, స్పౌజ్కు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇలా బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు నేత్ర, జహీర్, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ర్యాంక్ ప్రకారం ఇవ్వలేదు ఉమ్మడి జిల్లాలో నాది 6వ ర్యాంకు. శ్రీసత్యసాయి జిల్లాలో 3వ ర్యాంక్. నేను కదిరిలో పనిచేస్తున్నారు. బదిలీల్లో కదిరి, నల్లచెరువు, గాండ్లపెంట ఆప్షన్ ఇచ్చా. నాకు ముదిగుబ్బ మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. నేను ఆప్షన్లో ఉంచిన స్థానాలను ఇవ్వకుండా నా తరువాత ర్యాంక్ వారికి కేటాయించారు. – జనార్దన్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇష్టానుసారంగా ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో నాది 5వ ర్యాంక్, శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంక్, నేను తలుపుల మండలంలో పనిచేస్తున్నా. నల్లచెరువు, ఎన్పీకుంట, నల్లమాడ మండలాలకు ఆప్షన్ ఇచ్చాను. అయితే నా ఆప్షన్లు కాకుండా తనకల్లు మండలం కోటపల్లి సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. మా తరువాతి ర్యాంకు వారికి మా ఆప్షన్ స్థానాలు ఇచ్చారు. – సుస్మిత, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పీహెచ్ కోటా అమలు చేయలేదు పీహెచ్ కేటగిరీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆ కేటగిరీలో ఉన్న నాకు అన్యాయం చేశారు. నేను నల్లమాడ మండలం వేళ్లమద్ది సచివాలయంలో పనిచేస్తున్నా. బదిలీ ఆప్షన్ ఇటుకలపల్లి, బత్తపల్లి సచివాలయం–2, ఆత్మకూరు మండలం బి.యాలేరు ఇచ్చాను. అయితే అవేవీ కాకుండా బుక్కపట్నం మండల అగ్రహారం సచివాలయానికి నన్ను బదిలీ చేశారు. – శిరీష, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ఆవేదన రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారని ధ్వజం -
కూటమి మోసాలను ప్రజలందరికీ వివరిస్తాం
రొద్దం: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి సర్కార్ అసమర్థపాలనను ప్రజలందరికీ వివరించేందుకు వైఎస్సార్ సీపీ ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం ఆమె రొద్దంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో కలిసి క్యూఆర్ కోడ్తో రూపొందించిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..కూటమి సర్కార్ చేసిన మోసాలను ప్రజలందరికీ వివరిస్తామన్నారు. ఆరు వారాలపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామగ్రామానా నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు..అమలు తీరు..ఏడాది కూటమి పాలనలో ఒక్కో కుటుంబం ఎంతమేర నష్టపోయిందో వివరిస్తామన్నారు. ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు.. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రజలందరికీ అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. ప్రభుత్వ పథకాలు అందిస్తామంటూ గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారన్నారు. కానీ ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుదోగ్య భృతి, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు ఇలా ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారన్నారు. ‘తల్లికి వందనం’ అమలుకూ సవాలక్ష ఆంక్షలు పెట్టారన్నారు. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుందో కూడా తెలియడం లేదన్నారు. పెనుకొండ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత... బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం గురించి మాట్లాడటం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు ఉషశ్రీచరణ్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎంపీటీసీ సభ్యురాలు కురుబ రత్నమ్మ, వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామంద్ర, నాయకులు ఎన్. నారాయణరెడ్డి, చిలకల రవి, సి.నారాయణరెడ్డి, సినిమా నారాయణ, లక్ష్మీనారాయణరెడ్డి, అమీర్, నరేంద్రరెడ్డి, తిమ్మయ్య, జట్టి శ్రీనివాస్రెడ్డి, వినయ్కుమార్రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
‘పురం’ మున్సిపాలిటీ నిధులకు కన్నం
చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ ఆదాయానికి కన్నం వేశారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులకు గానూ ఎయిర్టెల్ సంస్థ నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన మొత్తంలో ఏకంగా రూ. 33.94 లక్షలు కోత వేశారు. ఇలా ఓ ప్రైవేటు సంస్థకు లబ్ధి కలిగేలా వ్యవహరించిన వైనం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏం జరిగిందంటే..... పట్టణంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు భారతీ ఎయిర్టెల్ సంస్థ సిద్ధమైంది. కేబుల్ వైరు వేసేందుకు మెటల్ రోడ్డు, సీసీ రోడ్లను తవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కలిగే నష్టానికి గానూ మున్సిపాలిటీకి నిర్ణయించిన మొత్తాన్ని డీడీ రూపంగానో, నేరుగా మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాలోనో జమ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జూన్ నెలలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 7,700 మీటర్లు సీసీ రోడ్డు, 2,200 మీటర్ల మేర మెటల్ రోడ్డుల గుండా ఫైబర్ కేబుల్ వేయాలని భారతీ ఎయిర్టెల్ సంస్థ నిర్ణయించుకుంది. ఇందుకు గానూ 2022–23 ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అలాగే ప్రతి ఏటా 10 శాతం అదనంగా పెంచి అంచనాలు తయారు చేయాల్సి ఉంటుంది. 2022–23 ప్రకారం మీటరుకు రూ. 464 మేర మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. ఏటా 10 శాతం పెంచితే..2025–26 సంవత్సరం నాటికి 30 శాతం అంచనా పెంచి మున్సిపాలిటీకి చెల్లించేలా అంచనాలు తయారు చేయాలి. ఆ లెక్కన మీటరుకు రూ.464 మేర చెల్లించాల్సి ఉండగా..మూడేళ్లకు 30 శాతం అదనంగా అంటే రూ. 139 చేరిస్తే మీటరుకు రూ. 603 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మెటల్ రోడ్డుకు 2022–23 లెక్క ప్రకారం మీటరుకు రూ.295 చెల్లించాల్సి ఉంది. మూడేళ్లకు పెంచాల్సిన మొత్తం రూ.89 కాగా పాత ధరనే చెల్లించేలా అంచనాలు తయారు చేసి ఆమోదించారు. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన మొత్తంలో రూ.33.94 లక్షలు కోత పడింది. కాగా పాత ధరల మేరకే ఇప్పుడూ డబ్బు చెల్లించేలా టెలికాం సంస్థ యాజమాన్యానికి ఏఈ శంకర్ ఈ ఎస్టిమేషన్ వేసి డిమాండ్ నోటీసు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు రాసిన లేఖలో సీసీ రోడ్డు అని పేర్కొనగా, ధర మాత్రం మెటల్ రోడ్డుగా ఉంది. అధికారపార్టీ నేతల పాత్రపై అనుమానాలు..? ఈ తతంగం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెలికాం సంస్థ నుంచి మున్సిపాలిటీకి అందాల్సిన నిధులు ఎమ్మెల్యే కార్యాలయానికి మళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీకి రూ.లక్షలు నష్టం కలిగేలా కొందరు నేతలు అధికారులతో చేతులు కలిపి ఈ కుంభకోణం చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెలికాం రిస్టోరేషన్లో అవకతవకలు రూ.33.94 లక్షలు దారి మళ్లినట్లు అనుమానాలు -
పుట్టపర్తిలో ఢిల్లీ వాసి మృతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి సన్నిధిలో శేష జీవితం గడిపేందుకు వచ్చిన ఢిల్లీకి చెందిన సత్యకుమార్ మధుకరన్ మీనన్ (64) మృతి చెందారు. తోడు ఎవరూ లేని ఆయన కొన్ని రోజుల క్రితం పుట్టపర్తికి వచ్చి ప్రియాంక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. నాలుగు రోజులుగా గది తలుపులు తీయలేదు. బుధవారం ఉదయం ఆయన నివాసముంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో సీఐ సునీత, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించి, మృతదేహాన్ని గుర్తించారు. గుండె నొప్పి కారణంగా కిందపడి మృతి చెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణంగోరంట్ల: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. గోరంట్ల మండలం కసిరెడ్డిపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రోడ్డుపై పడిన అతని తల మీదుగా వాహనం చక్కాలు దూసుకెళ్లాయి. దీంతో మృతుడు ఎవరైంది ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లుగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు. భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య ధర్మవరం అర్బన్: స్థానిక ప్రియాంక నగర్లో నివాసముంటున్న లింగారెడ్డి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు ఉన్నారు. వంట పనితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో బుధవారం భార్యతో గొడవపడిన ఆయన క్షణికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కిందకు దించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ధర్మవరం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బంగారు నగల అపహరణ హిందూపురం: స్థానిక మార్కండేయ నగర్లో నివాసముంటున్న లేపాక్షి పశువైద్యశాక ఉద్యోగి కృష్ణవేణి ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం ఇంటికి తాళం వేసి కృష్ణవేణి కుటుంబసభ్యులు మరో ఊరికి వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండగులు అదే రోజు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేవించారు. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, పట్టుచీరలు, విలువైన సామగ్రిని అపహరించారు. బుధవారం ఉదయం తిరిగి వచ్చిన ఇంటి యాజమాని ఇంట్లో జరిగిన చోరీని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లోని గైనిక్ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో రోగికి ప్రాణం పోశారు. వివరాలు... గుత్తికి చెందిన లక్ష్మి గత నెల 23న ఆయాసం, రక్త హీనతతో బాధపడుతూ జీజీహెచ్లోని గైనిక్ ఓపీకి వచ్చింది. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని,, పలు రకాల స్కానింగ్లు నిర్వహించారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 4.3 ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పాటు గర్భసంచికి రెండు వైపులా భారీ పరిమాణంలో కణితులు పెరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం దృష్టికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య తీసుకెళ్లి చర్చించారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేయలేమని హెచ్బీ 10 శాతానికి చేరుకున్న తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రక్తం ఎక్కిస్తూ వచ్చారు. హిమోగ్లోబిన్ శాతం మెరుగు పడిన తర్వాత బుధవారం డాక్టర్ షంషాద్బేగం నేతృత్వంలో డాక్టర్ నిస్సార్ బేగం, డాక్టర్ సౌజన్య, పీజీలు డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ రమణి, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర, స్టాఫ్నర్సులు సుప్రియ, ఉషారాణి బృందంగా ఏర్పడి శస్త్రచికిత్స చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి 6 కిలోల బరువున్న భారీ కణితులను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం లక్ష్మి ఆరోగ్యం కుదుట పడుతోందని డాక్టర్ షంషాద్ బేగం తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ తరహా శస్త్రచికిత్సను సర్వజనాస్పత్రిలో పూర్తి ఉచితంగా చేసినట్లు తెలిపారు. తొలగించిన కణితిని బయాప్సీకి పంపామని, క్యాన్సర్ నిర్ధారణ అయితే తదుపరి చికిత్సకు రెఫర్ చేస్తామని పేర్కొన్నారు. -
300 మామిడి చెట్ల నరికివేత
పుట్టపర్తి టౌన్: మండలంలోని వెంగలమ్మచెరువు గ్రామంలో వైఎస్సార్ ీసీపీ సానుభూతిపరుడు వీరనారప్ప తోటలోని మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. మూడేళ్ల క్రితం దాదాపు 400 మామిడి మొక్కలను ఆయన నాటారు. మంగళవారం సాయంత్రం తోటలో పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి చొరబడి 300 చెట్లను నరికి వేశారు. బుదవారం మధ్యాహ్నం రైతు కుటుంబ సభ్యులు తోట వద్దకెళ్లి చూడగా నరికి వేసిన చెట్టు కనిపించాయి. ఘటనపై పుట్టపర్తి రూరల్ పీఎస్ ఎస్ఐ లింగన్నకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన దాయాదులు లింగప్ప, రాము, లక్ష్మీనారాయణపై అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వారు తనపై దాడి చేశారని, ఆర్థికంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, నరసారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుడికి ధైర్యం చెప్పారు. ‘తల్ సైనిక్’ ఎంపికే లక్ష్యం కావాలి ● ఎన్సీసీ కర్నూలు గ్రూప్ కమాండర్ అలోక్ త్రిపాఠి కూడేరు: ఈ ఏడాది ఆగస్టులో న్యూఽఢిల్లీలో జరిగే తల్ సైనిక్ క్యాంప్నకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన చేయాలని ఎన్సీసీ క్యాడెట్లకు కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి సూచించారు. కూడేరు మండలంలోని ఎన్సీసీ నగర్లో సీఏటీసీ–5 ఎన్సీసీ ఽశిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 500 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. బుధవారం కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి హాజరై, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్లో శిక్షణను పరిశీలించారు. ఏకాగ్రత, ఆత్మ విశ్వాసమున్నపుడే అన్నింటా రాణించగలుగుతారని పేర్కొన్నారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు సునీత, రాజ్యలక్ష్మి, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్మీటర్ల’పై క్యూఆర్ కోడ్తో పోరాటం : సీపీఎం
అనంతపురం అర్బన్: స్మార్ట్మీటర్ల ఏర్పాటుపై ప్రజా నిరసన ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ తెలిపారు. ప్రజలతో క్యూర్కోడ్ స్కాన్ చేయించి తమ వ్యతిరేకతను నేరుగా సీఎం కార్యాలయానికి తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యవర్గ సభ్యులతో కలిసి క్యూఆర్ కోడ్ ప్రతులను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 6న ప్రజా సముదాయం ఉండే కూడళ్లలో ప్రజల ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయిస్తామన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా చేపట్టిన క్యూఆర్ కోడ్ పోరులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి, చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
103 మంది విద్యార్థులకు ఏకోపాధ్యాయురాలా?
డి హీరేహాళ్(రాయదుర్గం): ఏకోపాధ్యాయురాలితో తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయంటూ కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామస్తులు బుధవారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. 103 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయురాలు ఎలా నెట్టుకొస్తోందో చెప్పాలంటూ నిలదీశారు. నిత్యం హాజరు వేయడం, అల్లరి చేయకుండా కంట్రోల్ చేయడం మినహా పుస్తకాలు తెరవలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎంఈఓకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రైవేటు బడుల్లో ఖరీదైన చదువులకు పంపడం తమ వల్లకాదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి మరో ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు -
మంత్రి కేశవ్కు సమస్యల ఏకరవు
కూడేరు: మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏకరవు పెట్టారు. కూడేరు మండలం జయపురంలో బుధవారం మంత్రి కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ ఆయనను కలిసి, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రోజూ ఉదయం 6 గంటలకే పంచాయతీల్లో ఉండాలని, చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దిన పత్రిక పట్టుకొని నోట్ కమ్ ఫొటో దిగాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీ రాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించినట్లు గుర్తు చేశారు. రోజూ ఉదయం 6 గంటలకే వెళ్లడం చాలా ఇబ్బందవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలను వేరు చేసి పంచాయతీరాజ్ పనులను మాత్రమే తమకు అప్పగించేలా చూడాలని విన్నవించారు. స్పందించిన మంత్రి.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, కార్యదర్శులు రాఘవ, నాగరాజు, హరీష్, వెంకటనారాయణ,రమాదేవి, సుభాషిణి, లక్ష్మీకాంతమ్మ, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరుతో నష్టం
ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కాలంలో ఉపాధ్యాయుల బదిలీలు, శిక్షణలు నిర్వహించాలి. ఈ ఏడాది పాఠశాలల ప్రారంభంలోనే బదిలీలు చేపట్టారు. ఇదే సమయంలోనే శిక్షణ పేరుతో తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించలేక ఉపాధ్యాయులు సతమతమయ్యారు. దీంతో 1వ తరగతి చేరే విద్యార్థులు కరవయ్యారు. ప్రభుత్వ తీరుతో తీరని నష్టం చేకూరుతోంది. – బడా హరిప్రసాదరెడ్డి, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు -
రాకెట్లలో దళిత యువ రైతుపై దాడి
ఉరవకొండ: మండలంలోని రాకెట్లలో దళిత యువ రైతు హనుమంతుపై అదే గ్రామానికి చెందిన చిన్న సుంకప్ప కుటుంబసభ్యులు దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... రాకెట్లలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న దళిత వెంకటేష్ కుమారులు హనుమంతు, రామాంజనేయులు కలిసి ఇటీవల నెట్టం రాధాకృష్ణ నుంచి సర్వేనంబర్ 320–బీ1లోని 74 సెంట్లలో 15 సెంట్లను కొనుగోలు చేశారు. ఈ స్థలానికి చెక్కు బందీ మేరకు దక్షిణం వైపు బండి రస్తా ఉంది. భూమి విక్రయించే ముందు రాధాకృష్ణ కుటుంబసభ్యులు చూపించిన సర్వే హద్దుల్లోనే హనుమంతు సోదరులు పంట దిగుబడిని, పశువుల మేత వామిని హనుమంతు వేశాడు. అయితే ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన చిన్న గుండ్లొల్ల చిన్న సుంకప్ప కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం దౌర్జన్యంగా ఆక్రమించి, అందులో ఎరువులను, మట్టిని వేసుకున్నారు. తమ స్థలంలోకి ఎందుకు చొరబడుతున్నారని అడిగితే.. ఇది మాదే స్థలం అంటూ ఎదురు తిరిగారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో మరోమారు మరికొంత స్థలాన్ని ఆక్రమించేందుకు ముళ్లకంపలు తొలగించడంతో హనుమంతు గమనించి ప్రశ్నించాడు. అంతే చిన్న సుంకప్ప, ఆయన కుటుంబ సభ్యులు చందు, మణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాదిగ లం... కొ.. అంటూ దూషణలకు పాల్పడటమే కాకుండా కిందపడేసి చెప్పులతో కొట్టారు. కాసేపటి తర్వాత పెదనాన్న, పెద్దమ్మ వచ్చి అతడిని వారి నుంచి విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయినా శాంతించని చిన్నసుంకప్ప కుటుంబ సభ్యులు మరోమారు ఇంటిలోకి చొరబడి హనుమంతుపై చెప్పులు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ రాత్రి భయంభయంగా గడిపిన బాధితుడు బుధవారం మధ్యాహ్నం ఉరవకొండ పోలీసుస్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తమ భూమిలోకి అకారణంగా ప్రవేశించి, ఆక్రమణకు పాల్పడి, ఇదేమని అడిగిన తనపై చెప్పులతో దాడిచేసి, కులం పేరుతో దూషించారని, వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
యువకుడి ప్రాణాలు బలిగొన్న మీటర్ వడ్డీ
పావగడ: మీటర్ వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పావగడ తాలూకా వైఎన్ హొసకోట పీఎస్ పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన వైటీ మంజునాథ్ (38)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఈ క్రమంలో పంట దిగుబడులు సక్రమంగా రాకపోవడంతో అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డాడు. ఇదే అదనుగా భావించిన వడ్డీ వ్యాపారులు ఒత్తిళ్లు చేస్తూ సాధారణ వడ్డీని కాస్త మీటర్ వడ్డీ కిందకు మార్చుకున్నారు. వడ్డీల కిందనే రూ.లక్షల్లో చెల్లించినా అప్పులు తీరలేదు. వడ్డీలకు వడ్డీలు పెరుగుతూ రూ.15 లక్షలకు పైగా చేరుకుంది. ఈ భారం నుంచి బయటపడేందుకు గ్రామంలో తనకు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఇందుకు గాను వారానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ వడ్డీలు చెల్లించే దుస్థితికి వడ్డీ వ్యాపారులు తీసుకెళ్లారు. నానాటికీ వడ్డీల భారం పెరగడం, అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన మంజునాథ్ మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వైఎన్ హొసకోట పీఎస్ ఎస్ఐ మాళప్ప నాయక్కుడి తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా వజ్ర భాస్కరరెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కె.వజ్ర భాస్కర రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఆర్గనైజేషన్ యాక్టివిటీ)గా నియమించారు. ఈ మేరకు మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి టౌన్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం అన్నారు. జాతీయ డెంగీ మాసోత్సవాల పోస్టర్లు, బ్యానర్లను అధికారులతో కలసి తన కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని అన్ని గ్రామాల్లోనూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు నెల రోజుల పాటు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. చిరుత దాడి.. గాడిద పిల్ల మృతి వజ్రకరూరు: మండలంలోని కడమలకుంట గ్రామ పరిసరాల్లో చిరుత దాడిలో ఓ గాడిద పిల్ల మృతి చెందింది. యజమాని చాకలి వెంకటేష్ సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం ఫారెస్ట్ బీట్ ధికారి సతీష్కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేష్, ప్లాట్ వాచర్ మల్లికార్జున తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి చిరుత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. చిరుత సంచారాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. రైలులో ప్రయాణికుడి మృతి గుంతకల్లు: ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్వివాంగుల బోగీలో ప్రయాణిస్తున్న అతని వద్ద కనీసం టికెట్ కూడా లేదు. సరైన సంరక్షణ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండడమే మృతికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. ఎరుపు రంగులో ఉండి.. కాఫీ కలర్ టీ షర్టు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. కుక్కపై చిరుత దాడి అగళి: మండలంలోని కురసంగనపల్లి శివారున రైతు రంగరాజు పొలంలో మంగళవారం వేకువజామున కుక్కపై చిరుత దాడి, సగానికి పైగా తినేసింది. అలాగే గిరయప్పకు చెందిన జీవాల మందపై దాడి చేసి నాలుగు గొర్రెలను హతమార్చింది. కాగా, అగళి మండలం గాయత్రీ కాలనీ, పి.బ్యాడిగెరే, కరిదాసన్నపల్లి గ్రామాల్లో చిరుత సంచరిస్తూ గొర్రెలు, మేకలు, ఆవులు, తదితర వాటిపై దాడి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళలో పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరారు. -
వద్దొద్దు.. ఇప్పుడే వద్దు!
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది జిల్లా హెచ్చెల్సీ అధికారుల తీరు. ప్రకృతి కరుణించడంతో నిండుకుండలా మారిన తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు నీటి విడుదలకు టీబీ బోర్డు సిద్ధమైనా.. హెచ్చెల్సీ అధికారులు మాత్రం ఇప్పుడే వద్దంటూ తిరకాసు పెట్టారు.అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ అధికారుల తాజా నిర్ణయం ఆయకట్టు రైతులకు తీరని నష్టం కలిగించేలా మారింది. జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురిసినా ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఎగువన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి కొద్దిరోజులుగా భారీ స్థాయిలో వరద చేరుకుంటోంది. త్వరలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10 నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లా హెచ్చెల్సీ అధికారులు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి... ఇప్పుడే అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి విడుదల ఇప్పుడే వదంటూ బోర్డుపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు. నత్తనడకన పనులు చేపట్టి.. ఉమ్మడి జిల్లాకు వరదాయినిగా తుంగభద్ర జలాశయం నిలిచింది. కొన్నేళ్లుగా చెప్పుకునే స్థాయిలో వర్షాలు వస్తుండడంతో దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైన ప్రాజెక్ట్పై అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హెచ్చెల్సీ ప్రధాన కాలువపై కల్వర్టులు కూలిపోవడంతో పలు చోట్ల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీల మరమ్మతు పనులు కూడా చేపట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి గత జనవరిలో దాదాపు రూ. 30 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. వెనువెంటనే పనులు చేపట్టాల్సింది పోయి ఏప్రిల్ వరకూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూడా నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలోహెచ్చెల్సీకి నీరు విడుదలైతే కాలువకు గండ్లు పడే ప్రమాదముంది. కల్వర్టులు, ఇతర పనులు జరుగుతున్నాయంటూ మరో పదిరోజులు గడువు కావాలని హెచ్చెల్సీ అధికారులు విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది హెచ్చెల్సీ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ నష్టం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తీసుకునే అవకాశముంది. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు కేటాయించిన నీటి కోటాలో ఈ ఏడాది భారీ కోత పడింది. గతేడాది భారీ వర్షాలకు ఒక గేటు కొట్టుకుపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచేందుకు వీలు కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. వాస్తవానికి కొత్త గేటు అమర్చడానికి ఐదారు నెలలకు పైగా సమయం ఉన్నా.. కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చినా గేటు ఏర్పాటు అంశంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో టెండర్లు పిలవడంలో జాప్యం చోటు చేసుకుని తాత్కలికంగా అమర్చిన గేటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టీబీ డ్యాంలో 80 టీఎంసీలకు మించి నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతకు మించి నీరు చేరుకుంటే దిగువకు వదిలేయాల్సిందే. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటి విడుదలకు టీబీ బోర్డు సుముఖత వద్దంటూ హెచ్చెల్సీ అధికారుల తిరకాసు అధికారుల నిర్ణయంతో ఆయకట్టు రైతులకు తీరని నష్టం ఇంకా నిర్ణయం తీసుకోలేదు హెచ్చెల్సీకి నీటిని తీసుకోవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు అవసరముందో.. లేదో.. అనే అంశంపై నీటి సంఘాల నాయకులతో చర్చిస్తాం. అవసరముందని చెబితే తప్పకుండా తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని తీసుకుంటాం. ఆలస్యమైనా పర్వాలేదని అంటే పనులను వేగవంతంగా పూర్తి చేసి, నీటిని తీసుకుంటాం. – విశ్వనాథరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ, హెచ్చెల్సీఆయకట్టుకు తీరని నష్టం దామాషా ప్రకారం 140 టీఎంసీల నీటి లభ్యత ఉంటే హెచ్చెల్సీకి 32 టీఎంసీల నికర కేటాయింపులు ఉంటాయి. ఈసారి తుంగభద్ర జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలకు మించి నిల్వ ఉంచరాదని నిర్ణయించారు. దీంతో హెచ్చెల్సీకి కేవలం 18.396 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఇందులో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను, మిగిలిన 8.396 టీఎంసీల్లో ప్రవాహ నష్టాలు ఉంటాయి. ఇక మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించాలి. ఫలితంగా హెచ్చెల్సీ పరిధిలో లక్ష ఎకరాలకు పైగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. ఇది హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. తుంగభద్ర నుంచి నీరు విడుదలయ్యే సమయం దగ్గరలోనే ఉందని తెలిసినా పనులు వేగవంతం చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రజాప్రతినిధులు కూడా తమకు ఆదాయం సమకూరే పనులపై మాత్రమే శ్రద్ద చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్కూల్ బస్సుల కండీషన్పై ప్రత్యేక దృష్టి
అనంతపురం సెంట్రల్: విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సుల కండీషన్పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ వీర్రాజు పేర్కొన్నారు. స్కూల్ బస్సుల కండీషన్ అంశంపై రవాణాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆర్టీఓ సురేష్నాయుడుతో కలసి జిల్లాలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో 600 పై చిలుకు స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ బస్సులన్నీ కండీషన్లో ఉన్నాయో? లేదో పరిశీలించాని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధిక లోడు, ప్యాసింజర్లతో వెళ్లే గూడ్స్ వాహనాలు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తిరిగే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు. నగర శివారున వాహనాల ఛేజింగ్ నగర శివారున వాహనాల ఛేజింగ్ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారిని బెంబేలెత్తించింది. వివరాలు... జిల్లా రవాణా శాఖకు చెందిన ఏఎంవీఐ కేవీఎల్ఎన్ ప్రసాద్ మంగళవారం నగరంలోని టీవీ టవర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన రెండు బొలెరో వాహనాల నిండా చేపల వలలు, ఆపై బోట్లు (పుట్టి) వేసుకుని వాటిపై మనుషులు కూర్చొని ప్రయాణిస్తుండడం గమనించిన ఆయన వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే బొలెరో డ్రైవర్లు ఆపకుండా శరవేగంతో దూసుకెళ్లి పోవడంతో ఏఎంవీఐ తన వాహనంలో వెంబడిస్తూ రాప్తాడు పంగల్ రోడ్డు దాటిన తర్వాత అడ్డుకున్నారు. వాహనాలను ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. విచారణలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వాహనాలకు పర్మిట్లు, ట్యాక్స్లు లేకపోవడం, ప్రమాదకరంగా ప్రజలను తీసుకెళుతుండడంతో కేసు నమోదు చేసి జరిమానా విధించారు.