breaking news
Sri Sathya Sai District News
-
హెచ్చెల్సీలో వివాహిత మృతదేహం లభ్యం
బొమ్మనహాళ్: హెచ్చెల్సీలో గల్లైంతైన వివాహిత మృతదేహమై లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్కు చెందిన వరలక్ష్మి (27)కి బొమ్మనహాళ్ మండలంలోని మైలాపురం గ్రామానికి చెందిన నవీన్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం కర్ణాటకలోని రాంపురం పట్టణానికి దంపతులు ద్విచక్ర వాహనంలో వెళ్లి షాపింగ్ ముగించుకుని రాత్రి 8 గంటల సమయంలో మైలాపురం గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చెర్లోపల్లి వద్ద హెచ్చెల్సీ బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి కిందకు పడింది. వెనుకన కూర్చొన్న వరలక్ష్మి నేరుగా వెళ్లి కాలువలో పడి నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. నవీన్ నుంచి సమాచారం అందుకున్న వరలక్ష్మి అన్నదమ్ములు రమేష్, బసవరాజు, తల్లి నాగమ్మ అక్కడకు చేరుకుని కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గొడిసెలపల్లి వద్ద నీటిలో తేలియాడుతున్న వరలక్ష్మిని గుర్తించి వెలికి తీసి, వెంటనే బళ్లారిలోని విమ్స్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి తెలిపారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
కదిరి టౌన్: పట్టణంలో ద్విచక్ర వాహనాల వరుస అపహరణలకు కారణమైన యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. కదిరి ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ద్విచక్ర వాహనాలు అపహరణకు గురైనట్లుగా ఇటీవల పలువురు ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో బుధవారం కుటాగుళ్ల రైల్వే గేట్ వద్ద పల్లెపు అశోక్బాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించాడు. దాచి ఉంచిన ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ‘ఉమ్మడిశెట్టి అవార్డు’కు కవితల ఆహ్వానం అనంతపురం కల్చరల్: ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–25’కు గాను కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అవార్డు వ్యవస్థాపకుడు, సీనియర్ కవి డాక్టర్ రాధేయ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రచురించిన కవితా సంపుటాలను జనవరి 10వ తేదీలోపు ‘డాక్టర్ రాధేయ, చైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు, 13–1–606–1, షిరిడినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం – 515001’ చిరునామాకు పంపాలి. ఎంపికై న కవిని నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నారు. పూర్తి వివరాలకు 99851 71411లో సంప్రదించవచ్చు. హోర్డింగ్ మీద పడి వృద్ధురాలి మృతి కదిరి టౌన్: హోర్డింగ్ మీద పడడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మండలం కదిరికుంట్లపల్లికి చెందిన గంగులమ్మ (60) వ్యక్తిగత పనిపై కదిరికి వచ్చి అంబేడ్కర్ సర్కిల్లోని ఓ మొబైల్ షాపు వద్ద కూర్చొని ఉండగా పైనుంచి ఇనుప హోర్డింగ్ మీదపడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి బుధవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమార్తె విమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శ్రీగంధం చెట్ల నరికివేత బత్తలపల్లి: మండలంలోని సంజీవపురం గ్రామంలో రెండు శ్రీగంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. గ్రామానికి చెందిన నీలిమా ఆరేళ్ల క్రితం శ్రీగంధం మొక్కలను నాటారు. అందులో బొప్పాయి, ఇతర పంటలనూ అంతర సాగుగా చేపట్టారు. ప్రస్తుతం ఏపుగా పెరిగిన శ్రీగంధం రెండు చెట్లను దుండగులు మంగళవారం రాత్రి నరికి ఎత్తుకెళ్లారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు బుధవారం ఎస్ఐ సోమశేఖర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. చెట్టు మీద నుంచి జారి పడి వ్యక్తి మృతి వజ్రకరూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి వజ్రకరూరు మండలం ఎన్ఎన్పీ తండా నివాసి రమావత్ శంకర్నాయక్ (40) మృతి చెందాడు. ఆయనకు భార్య పార్వతి, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో పాటు జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మేకలకు ఆహారం కోసమని ఇంటి వద్ద వేపచెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక బుధవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బోరంపల్లికి చెందిన బొజ్జప్ప (45) బుధవారం యర్రగుడి గ్రామంలో జరిగిన దేవరకు వచ్చి, మొక్కు తీర్చుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ముదిగల్లుకు చెందిన దేవ అనే వ్యక్తి ఢీకొనడంతో రోడ్డుపై పడి బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దేవాను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. -
వృద్ధుడి అనుమానాస్పద మృతి
పుట్టపర్తి టౌన్: మండలంలోని పోతులకుంట గ్రామానికి చెందిన వెంటకరెడ్డి (80) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పోతులకుంట గ్రామ శివారున అప్పవాండ్లపల్లికి వెళ్లే మార్గంలో వెంకటరెడ్డికి ఉన్న 1.22 ఎకరాల భూమి సరిహద్దుల విషయంగా కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషయంగానే ఇద్దరిపై క్రిమినల్, సివిల్ కేసులూ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వెంకటరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మంగళవారం సాయంత్రం అప్పవాండ్లపల్లి రహదారిలో ఉన్న పొలంలో వెంకటరెడ్డి మృతదేహమై కనిపించాడు. అటుగా వెళ్లిన వారు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ విజయ్కుమార్, సీఐ మారుతీశంకర్, డ్వాగ్ స్క్వాడ్ సిబ్బంది, క్లూస్ టీం సభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే తన తండ్రిని ప్రత్యర్థులు గొంతు నులిమి హతమార్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు నారాయణరెడ్డి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఫెడరేషన్ కప్పు సాధిస్తాం
కదిరి అర్బన్: ఆల్ ఇండియా గోల్షాట్ బాల్ ఫెడరేషన్ కప్పును సాధించి తీరుతామంటున్న ఏపీ క్రీడాకారులు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులోని తిరుచునాపల్లిలో ఆల్ ఇండియా 3వ ఫెడరేషన్ కప్ సీనియర్ పురుషులు, మహిళల టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో జిల్లా గోల్ షాట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో ఉన్న హరీష్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో ఏపీ జట్టు క్రీడాకారులు ముమ్మర సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ నెల 25 నుంచి తమిళనాడులో గోల్షాట్బాల్ ఫెడరేషన్ కప్ టోర్నీ కదిరిలో ముమ్మర సాధన చేస్తున్న ఏపీ జట్టు క్రీడాకారులు -
● జెరూసలేము సందడి.. చూద్దాం రండి
గుంతకల్లు: క్రిస్మస్ సందర్భంగా గుంతకల్లులోని మస్తాన్పేట్లో నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి హృదయ్మోహన్ ఫెర్నాండెజ్, నిర్మలామేరి దంపతులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని విశదీకరించేలా బొమ్మలను కొలువుదీర్చారు. ఇందు కోసం తన ఇంటి మిద్దైపె ఓ ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేశారు. ఏసు పుట్టిన సమయంలో తోక చుక్క ఆవిర్భవించడం మొదలు... గొర్రెల కాపరుల చుట్టూ పెద్ద వెలుగు రావడం, అప్పటి నజరేతు, బేత్లహము, జెరూసలేము, ఈజిప్టు వాసుల వేషధారణ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ... దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఆఫ్రికా, బెంగుళూరు, ముంబయి, చైన్నె, హైదరాబాదు తదితర నగరాల నుంచి బొమ్మలను సేకరించి కొలువు దీర్చినట్లు తెలిపారు. నెల రోజుల పాటు సందర్శకుల కోసం బొమ్మల కొలువును ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. -
అటవీ సంపద కాపాడతాం
అటవీ సంపద అగ్నికి ఆహుతవకుండా తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రజలు, గొర్రెలు, ఆవుల కాపరులు అడవులకు నిప్పు పెట్టకుండా తగిన సూచనలిస్తాం. సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని కాపాడుతాం. స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అడవులకు నిప్పు పెట్టకుండా వారిలో చైతన్యం తీసుకొస్తాం. రోడ్డు పక్కన ఉన్న బోద గడ్డిని తొలగించి ఫైర్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తాం. ప్రజలు అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు సహకరించాలి. – శ్రీనివాసరెడ్డి, అటవీశాఖ రేంజర్, పెనుకొండ -
ఇత్తడి సామగ్రి మెరుగు పేరుతో పుత్తడి అపహరణ
ఉరవకొండ: ఇత్తడి పూజా సామగ్రిని మెరుగు పెడుతామంటూ నమ్మబలికి ఓ మహిళ మెడలోని బంగారం మాంగళ్యం చైన్ను అపహరించుకెళ్లిన ఘటన ఉరవకొండ మండలం నింబగల్లులో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన బాబు, స్వరూప దంపతుల ఇంటి వద్దకు బుధవారం ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. ఇత్తడి సామగ్రికి మెరుగు పెడతామనడంతో స్వరూప తన ఇంట్లోని సామగ్రిని అందజేసింది. వాటిని మెరుగు పెట్టిన తర్వాత ఆమె మెడలోని బంగారం మాంగల్యం చైన్ కూడా మెరుగు పెడతామని నమ్మబలికారు. అయితే దంపతులు అంగీకరించకపోవడంతో నమ్మకం లేకపోతే ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ తీసుకెళ్లి గిన్నెలో నీరు పోసి కొద్ది సేపు ఉంచాలని ఓ ప్యాకెట్ను అందించారు. దీంతో వంటగదిలోకి వెళ్లి తన మాంగల్యం చైన్ తీసి వారు ఇచ్చిన పౌడర్లో వేసి పరిశీలిస్తుండగా అక్కడకు చేరుకున్న ఆగంతకులు తాము కూడా చూస్తామంటూ ఒక్కసారిగా బంగారం చైన్ తీసుకుని దంపతులను పక్కకు తోసి ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నదిలో స్నానానికి వెళ్లి మృత్యు ఒడికి ● సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట తీవ్ర విషాదం ● శబరిమల నుంచి తిరిగివస్తుండగా ఘటన గార్లదిన్నె: అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లి తిరుగుపయనంలో నదీ స్నానానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నీటమునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో అతని స్వగ్రామం గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఎం.కొత్తపల్లికి చెందిన మల్లికార్జున, సరళ దంపతుల కుమారుడు నందకుమార్ (27) పుణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న బెంగళూరు నుంచి తన స్నేహితులతో కలసి శబరిమలకు వెళ్లి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. మంగళవారం తిరుగు ప్రయనమయ్యాడు. శబరిమల నుంచి 50 కిలో మీటర్లు దూరం దాటాక నది కనిపించడంతో అక్కడ స్నేహితులతో కలిసి నందకుమార్ స్నానానికి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి పైకిరాలేకపోయాడు. తోటి స్నేహితులు విఫలయత్నం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి గజ ఈతగాళ్లతో నదిలో వెతికించి నందకుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. బుధవారం నందకుమార్ మృతదేహాన్ని స్వగ్రామం ఎం.కొత్తపల్లికి తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దీంతో అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ఉపాధి చట్టం పేరు మార్పు దారుణం
పుట్టపర్తి టౌన్: మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరును ’వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకంగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసి చారిత్రక తప్పిదానికి తెరతీసిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై బుధవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. పేదలు వలసలను అరికడుతూ గ్రామాల్లోనే ఉపాధి కల్పించేలా 2002లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ చట్టం కింద 20 కోట్ల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్గా మార్చి రైతులు, కూలీల పొట్టకొట్టే చర్యలకు తెరలేపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై కూలీలను చైతన్య పరిచి ఉపాధి హామీ చట్టం పేరును అలాగే కొనసాగించేలా ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్ధి రామకృష్ణ, మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు గంగాద్రి, స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పవన్, రజక సంఘం జిల్లాకార్యదర్శి శంకర్, స్వర్ణలత, సురేంద్ర, ముత్యాలు గోవిందప్ప, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి -
గడ్డినీ చుట్టేస్తున్నారు!
గడ్డి చుట్టలు కడుతున్న ట్రాక్టర్ యంత్రంతలుపుల: యాంత్రీకరణను అందిపుచ్చుకున్న రైతులు చివరకు గడ్డినీ పరుపులా చుట్టేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యంత్రాన్ని ట్రాక్టర్ అమర్చుకుని గడ్డిని చుట్టేస్తుండడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఎకరా పొలంలో వరి గడ్డి కుప్పలు చేసి ఒక చోట చేర్చాలంటే 6 నుంచి 7 మంది కూలీలు రోజంతా చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎంత లేదన్నా రూ.4,800 ఖర్చు వస్తుంది. అదే యంత్రం సాయంతో గంటన్నర సమయంలోనే పని చక్క బెట్టేస్తున్నారు. దీంతో సమయంతో పాటు డబ్బూ ఆదా ఆవుతోంది. ఎకరాకు 50 నుంచి 60 చుట్టలు కాగా, చుట్టకు రూ. 35 నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు. -
శోకసంద్రంలో నేమకల్లు
● కన్నీళ్లతో సింధు అంత్యక్రియలు ● అనూష కోసం ముమ్మర గాలింపు బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామం శోకసంద్రమైంది. కాలువలో కలిసి పోయిన చిన్నారుల బతుకులు గ్రామాన్ని కలిచివేశాయి. తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సింధు (11) అంత్యక్రియలు బుధవారం గ్రామస్తుల కన్నీళ్ల మధ్య సాగింది. మరో బాలిక అనూష కోసం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో గాలింపు కొనసాగుతోంది. గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమారైలు సింధు (11), అనూష (9)ను ఎల్లెల్సీలో తోసేసిన ఘటనలో సింధు మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడంతో యావత్ గ్రామం దిగ్భ్రాంతికి లోనైంది. అయితే రెండో అమ్మాయి అనూష ఆచూకీ లభ్యం కాకపోవడం కలవర పెడుతోంది. దిగువ కాలువ వెంబడి కర్ణాటక పరిధిలోని నాగేనహాళ్లి, మోకా, దమ్మురు, తిరిగేరి ప్రాంతాల్లో పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. కుటుంబ కలహాలా? మానసిక సమస్యనా? లేక మరేదైనా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కల్లప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను పూర్తిగా కోలుకొని విచారణకు సహకరిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. మార్కెట్లోకి ‘ఆల్ న్యూ కియా సెల్టోస్’పెనుకొండ రూరల్: కియా పరిశ్రమ నూతన ఉత్పత్తి ‘ఆల్ న్యూ కియా సెల్టోస్’ కారును మంగళవారం పరిశ్రమలో లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కియా ఇండియా సీఈఓ గ్వాంగ్–గు–లీ మాట్లాడుతూ.. అత్యాధునిక హంగులు, భద్రత, సాంకేతిక ప్రమాణాలతో కూడిన ఆల్ న్యూ కియా సెల్టోస్ కారు ఉత్పత్తులను ప్రారంభించినట్టు వివరించారు. ముందు తరం కార్లకు ఏ మాత్రం తీసి పోకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆల్ న్యూ సెల్టోస్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కారు ఎగుమతుల్లో ఒక మైలు రాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ విభాగం, సిబ్బంది పాల్గొన్నారు. పంపనూరు హుండీ కానుకల ఆదాయం రూ.20.20 లక్షలు ఆత్మకూరు: మండలంలోని పంపనూరు గ్రామంలోని సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈఓ బాబు, జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు నెలలకు సంబంధించిన హుండీ ఆదాయం రూ.20,20954 వచ్చినట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి సైన్స్ఫేర్లో మనోళ్ల ప్రతిభ
అనంతపురం సిటీ/యాడికి: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో అనంతపురం జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిలో కణేకల్లు మండలం హనకనహాళ్లోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రవళ్లిక, నవాజ్, యాడికి మండలం కోనుప్పులపాడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని సుహాసిని, ఉరవకొండ కేసీజీహెచ్ఎస్కు చెందిన చంద్రశేఖర్, కోనాపురం హైస్కూల్ విద్యార్థి సాత్విక్ ఉన్నారు. వీరు జనవరి 19 నుంచి 23 వరకు హైదరాబాద్లో జరిగే సౌత్ ఇండియా సైన్స్ఫెయిర్ పోటీల్లో వారివారి ప్రాజెక్ట్లను ప్రదర్శించనున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ డీఈఓ మల్లారెడ్డి, జిల్లా సైన్స్సెంటర్ అధికారి నరసింహారెడ్డి, కోనుప్పలపాడు ఉపాధ్యాయులు అభినందించారు. -
పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి
ప్రశాంతి నిలయం: ‘పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి సాధ్యం. అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ పారిశ్రామికాభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలి’ అని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ అఽధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ సమీక్షించి, వాటికి అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 12 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. వాటి ద్వారా రూ.6,175 కోట్ల పెట్టుబడులతో 13,426 మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన 3,835 ఎకరాల భూమి కేటాయింపులు, ఇతర అనుమతులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, డీఆర్ర్డీఏ పీడీ నరసయ్య, ఏపీఐఐసీ అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. 26న దివ్యాంగుల ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత విభాగం అధికారులతో కలసి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
క్రిస్మస్ శోభ
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయం క్రిస్మస్ శోభను సంతరించుకుంది. దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది భక్తులు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు, విద్యుత్ దీపాలు, శాంతాక్లాజ్ రూపాలే కనిపిస్తున్నాయి. సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. గణేష్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన 50 అడుగుల క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి విదేశీ భక్తులు పలు భక్తిగీతాలను ఆలపించారు. గురువారం సాయికుల్వంత్ సభా మందిరంలో క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు చర్చీలు ముస్తాబయ్యాయి. -
ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
● కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన మార్గంలో నడవడం ద్వారా లోక కల్యాణం సాధ్యమవుతుందన్నారు. ప్రేమ, కరుణ, శాంతిలకు చిహ్నంగా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారన్నారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలన్నారు. వైభవంగా అంకురార్పణ పూజలుపావగడ: నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ గర్భగుడిలో కొలువు తీరిన స్వయంభూ అంత్య సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్ వద్ద బుధవారం అంకురార్పణ పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు బదరీనాథ్ వేద మంత్రాల పఠనంతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ నిర్మాణానికి నాంది పలికిన రొద్దం శేషయ్యశెట్టి వారసులు సురేంద్రబాబు, నాగరాజు, భాస్కర్, భాస్కర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ప్రశాంతి నిలయం: గ్రామీణ ప్రాంతాల్లోని సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని, భూమిపై స్వాధీనానుభవం కలిగిన చిన్న , సన్నకారు రైతులు మాత్రమే అర్హులన్నారు. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మినహాయింపు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2024 జూన్ 15 వరకూ జరిగిన సాదాబైనామా లావాదేవీలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందన్నారు. అర్హులైన రైతులు ప్రభుత్వం విధించిప గడువులోపు మీ సేవా కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్నాతకోత్సవానికి రాష్ట్రపతికి ఆహ్వానం అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ (సీయూఏపీ) తొలి స్నాతకోత్సవం 2026 సంవత్సరంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్నాతకోత్సవానికి ఆహ్వానించినట్లు వీసీ ఎస్ఏ కోరి తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పత్తి రైతులకు తప్పని తిప్పలు గుత్తి: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు తిప్పలు తప్పడం లేదు. వారంలో కేవలం బుధవారం ఒక్క రోజే పత్తి కొనుగోలు చేపడుతుండడంతో రైతులు తెల్లవారు జామున నాలుగు గంటలకే పత్తి వాహనాలతో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో చలి తీవ్రత తాళలేక గజగజ వణికి పోతున్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా పత్తిని కొనుగోలు చేస్తే ఎంతో వెసులుబాటుగా ఉంటుందని ఈ సందర్భంగా పలువురు రైతులు పేర్కొన్నారు. -
బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిపివేత
మడకశిర: జిల్లా వ్యాప్తంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీకి చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీలో 3,981, పోట్లమర్రి గ్రామ పంచాయతీలో 1,982, తాజాగా రామనపల్లి గ్రామ పంచాయతీలో 2,558 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన నేపథ్యంలో జిల్లా అధికారులు బర్త్, డెత్ రిజిస్ట్రేషన్ల యూనిట్లను పూర్తిగా బ్లాక్ చేశారు. జిల్లాలో 555 యూనిట్ల ద్వారా బర్త్,డెత్ జారీ అవుతున్నాయి. అయితే జిల్లాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం బయటికి రావడంతో ఈ యూనిట్లను జిల్లా అధికారి బ్లాక్ చేశారు. క్షేత్రస్థాయిలో పక్షాళన జిల్లాలో నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ కాకుండా వ్యవస్థను పక్షాళన చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఫార్మాట్ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఫార్మాట్ ప్రకారం వివరాలు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ముఖ్యంగా ఏ పంచాయతీకి ఎవరు గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు, ఇన్చార్జ్ కార్యదర్శులుగా ఏయే గ్రామ పంచాయతీలకు ఎవరెవరు పని చేస్తున్నారు, ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, తదితర వివరాలను ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు నేరుగా వచ్చి జిల్లా యంత్రాంగానికి ఫార్మెట్ ప్రకారం వివరాలు అందించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివరాలన్నీ ఫార్మాట్లో పొందుపరచిన తర్వాతనే మళ్లీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది. కలెక్టర్ సమీక్ష జిల్లాలో జరుగుతున్న నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై కలెక్టర్ శ్యాంప్రసాద్ కూడా సమీక్షించినట్లు సమాచారం. సంబంధిత అధికారులను తన కార్యాలయానికి పిలిపించుకుని ఈవ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి చెక్ పెట్టాలని సదరు అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలోనే మకాం వేసిన డీడీ జిల్లాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం వరుసగా వెలుగులోకి వస్తుండడంతో రాష్ట్ర జనన, మరణ నమోదుశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లాలోనే మకాం వేశారు. రెండో రోజైన మంగళవారం కూడా వివిధ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జారీ అయిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించారు. ఆయనతో పాటు జిల్లా బర్త్ అండ్ డెత్ నమోదు నోడల్ ఆఫీసర్ కళాధర్ కూడా వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆయన కదిరి మున్సిపాలిటీ, వివిధ గ్రామ పంచాయతీల కార్యాలయాలను వారు సందర్శించి పరిశీలన చేశారు. ఎక్కువగా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసిన గ్రామ పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. రామాపురంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో అధికారులు తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే అగళి మండలం కొమరేపల్లి, బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ పంచాయతీల లాగిన్లను హ్యాక్చేసిన కేటుగాళ్లు వేలాది నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తాజా మరో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అగళి మండలంలోనే రామనపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి నాలుగు రోజుల వ్యవధిలోనే హ్యాకర్లు 2,558 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. 555 బర్త్, డెత్ రిజిస్ట్రేషన్ యూనిట్ల బ్లాక్ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని పక్షాళన చేసిన తర్వాతే సర్టిఫికెట్ల జారీ -
గుంతకల్లు–మార్కాపురం మధ్య త్వరలో కొత్త రైళ్లు
గుంతకల్లు: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం గుంతకల్లు – మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లను తర్వలోనే ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు జంక్షన్ నుంచి ఈ రైలు (57407) రోజూ సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్కు రాత్రి 8.20 గంటలకు, మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్కు 11.30 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి (57408) ఉదయం 4.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్కు ఉదయం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్కు ఉదయం 10.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబోట్ల కృష్ణపురం, కుంభం, తర్లుపాడు మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. 99.5 శాతం పల్స్పోలియో పూర్తి పుట్టపర్తి అర్బన్: జిల్లాలో 99.5 శాతం 0–5 వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించినట్లు మాతశిశు మరణాలు యూనిసెఫ్ కన్సల్టెంట్, పల్స్పోలియో రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ నాగేందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 2037 పోలియో బూత్లలో 1,88,126 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. మంగళవారం చివరి రోజు కావడంతో నాగేందర్ జిల్లాలోని పలు కేంద్రాలను పరిశీలించారు. మొదట కలెక్టర్ శ్యాంప్రసాద్ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం లేపాక్షి, చాలకూరు గ్రామాల్లో పర్యటించారు. జిల్లాలో1,98,028 మంది చిన్నారులు ఉండగా రెండోరోజు 790 మంది పిల్లలకు, 200 మంది హైరిస్క్ పిల్లలకు మొబైల్ బృందాల ద్వారా పోలియో చుక్కలు వేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు సునీల్ కుమార్, మంజువాణి, నాగేంద్ర నాయక్, చెన్నారెడ్డి పాల్గొన్నారు. పరీక్షా పే చర్చ రిజిస్ట్రేషన్లు పెంచండిపుట్టపర్తి అర్బన్: భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం ఉన్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి జిల్లా నుండి రిజిస్ట్రేషన్లు పెంచాలని పరీక్షా పే చర్చ నోడలాఫీసర్, బుక్కపట్నం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. పరీక్ష పే చర్చా కార్యక్రమంలో 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకూ పాల్గొనవచ్చన్నారు. ఈనెల 6 నుంచి జనవరి 11 వరకూ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందన్నారు. పరీక్షల భయం, ఒత్తిడి పోగొట్టడమే పరీక్ష పే ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు https:// innoveteindia1. mygov. in లింకు ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఉప విద్యాధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలు తమ పరిధిలోని విద్యార్థులకు , తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. అటవీ ప్రాంతంలో డ్రోన్లతో పరిశీలన లేపాక్షి: అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్టకు పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు.అందులో భాగంగా లేపాక్షి పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు పోలీసుశాఖ డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించింది. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ ఆపరేషన్ను చేపట్టినట్లు హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ తెలిపారు. మంగళవారం డ్రోన్ ద్వారా మైదుగోళం, లక్ష్మీనరసింహస్వామి కనుమ అటవీ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, మార్గాలు, చెరువులు తదితర వాటిని రికార్డు చేశామన్నారు. తరచూ డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించడం ద్వారా మండలంలో నేర కార్యకలాపాలను అరికట్టడడంలో పెద్దగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నరేంద్ర, పోలీసు సభ్యులు పాల్గొన్నారు. -
6,012 టన్నుల యూరియా పంపిణీ : డీఏఓ
పుట్టపర్తి అర్బన్: జిల్లా రైతాంగానికి రబీ సీజన్లో 6,012 టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నెల 22 వరకూ 15,552 టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకూ 6,012 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. రాబోవు 8 రోజులకు 856 టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సొసైటీలు, ఆర్ఎస్కేలు, మార్క్ఫెడ్ గోదాములు, రీటైల్ , హోల్సేల్ కంపెనీల వద్ద 2,599 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. దీంతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చేసిన నానో యూరియా, నానో డీఏపీను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఎరువులను కొనుగోలు చేసే రైతులు బస్తాపై ముద్రించిన ఎంఆర్పీ మేరకే డబ్బు చెల్లించి డీలర్ నుంచి రసీదు పొందాలన్నారు. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారి బైపాస్లోని వై–జంక్షన్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ దాసరి రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిపై అనంతపురం వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా బత్తలపల్లి నుంచి యర్రాయపల్లికి వెళుతున్న ఆటో రాంగ్ రూటులో వెళ్లి ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కబడ్డీ జట్ల ఎంపికకదిరి అర్బన్: త్వరలో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా కబడ్డీ పురుషులు, మహిళల జట్ల ఎంపిక మంగళవారం కదిరిలో జరిగింది. పురుషుల విభాగంలో నవీన్, మోహన్, నరేష్, శ్రీనివాసులు, రాజశేఖర్, శివమణి, మారుతీ, మణిదీప్, శశిధర్, వేణు, రోహిత్కుమార్, ప్రసాద్ నారాయణస్వామి, శ్రీహరి ఎంపికయ్యారు. అలాగే మహిళల జట్టులో అయేషా, మేజబీ, జయశ్రీ, గీతాంజలి, గంగమ్మ, గంగోత్రి, మంజుల, స్వాతి, అశ్వని, తేజస్విని, తన్మయి, వాణి, వర్షిత, అనూష చోటు దక్కించుకున్నారు. ఈ ప్రక్రియను జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుహాసిని, కార్యదర్శి వెంకటరమణ, పీడీ వినోద్, సంధ్యారాణి, పద్మ పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీకి నిప్పు లేపాక్షి: మండలంలోని మామిడిమాకులపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 21న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి అదే గ్రామానికి చెందిన నారాయణమ్మ సోమవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. గమనించిన కొందరు వీడియో తీసి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు తెలపడంతో వారు ఎస్ఐ నరేంద్ర దృష్టికి తీసికెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే నారాయణమ్మ టీడీపీకి చెందిన వ్యక్తి కాదని, డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్గా కొనసాగుతోందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హామీ ఇచ్చారు. యేసు సందేశం.. సన్మార్గానికి సోపానం ప్రశాంతి నిలయం: ప్రేమ, క్షమ, కరుణ, నిస్వార్థ సేవలను అలవర్చుకుని దైవత్వాన్ని పెంపొందించుకోవాలంటూ మానవాళికి యేసు ప్రభువు ఇచ్చిన సందేశం సన్మార్గానికి సోపానమంటూ మంగళవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత చిన్నారులు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. ‘ఇమాన్యూయేల్, గాడ్ లైవ్స్ విథిన్’ పేరుతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ విద్యార్థులు సంగీత నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. యేసు తన చివరి రోజులలో సత్య రక్షణకు పాటుపడిన తీరును కంటికి కట్టినట్లుగా చూపి రక్తి కట్టించారు. -
వైఎస్సార్సీపీ నేత మామిడి తోటకు నిప్పు
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో విష సంస్కృతికి తెరలేపుతున్నారు. ఇన్నాళ్లూ అక్రమ కేసులు, భౌతిక దాడులుకు దిగిన టీడీపీ నేతలు, ఇప్పుడు ఆర్థిక వనరులను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని కొటిపి గ్రామ సమీపంలో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్కు చెందిన మామిడి తోటకు దుండగులు నిప్పు పెట్టడంతో 186 మామిడి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మామిడి చెట్లుకు నిప్పు పెట్టారని వాల్మీకి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని, భౌతికంగా దాడులు కూడా చేశారని, ఇప్పుడు తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో కక్షలకు తెరలేపుతున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలి● రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్చార్జ్ కమాండెంట్ మహేష్ కుమార్ పుట్టపర్తి టౌన్: పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోంగార్డులకు రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్చార్జ్ కమాండెంట్ మహేష్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లాలోని హోంగార్డులకు ఒక రోజు పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేష్కుమార్ హాజరై, మాట్లాడారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సబ్డివిజన్ అధికారులకు, ఆర్ఐలకు తెలియజేయాలన్నారు. అనంతరం దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి, హోంగార్డుల ఇన్చార్జ్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఉద్యోగావకాశాలు సద్వినియోగం చేసుకోండి
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్తచెరువులోని శివసాయి డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహించారు. మేళాకు 25 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి జాబ్మేళాను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించి 3000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉద్యోగం సంపాదించుకొని మంచి మార్గంలో పయనించాలన్నారు. ఉద్యోగం ప్రతి మనిషికి గౌరవాన్ని అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, సిడాప్ జేడీఎం సూర్యనారాయణతో పాటు కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. -
సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించేందుకు కృషి
ప్రశాంతి నిలయం: జిల్లాలో సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ‘ప్రశాసన్ గావ్కి ఓర్’పై జిల్లాస్థాయి వర్క్షాప్ను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు అధికారులు పాల్గొన్నారు. శిల్పగురు అవార్డు గ్రహీతకు సత్కారం తోలుబొమ్మల తయారీ కళారంగంలో విశేష కృషికిగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శిల్ప గురు అవార్డును ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలు బొమ్మల తయారీ కళాకారిణి డి.శివమ్మ ఈ మధ్యనే అందుకున్నారు. దీంతో మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ను శివమ్మ శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళలు వ్యాపార వేత్తలుగా రాణించాలి పుట్టపర్తి టౌన్: ప్రతి మహిళ వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మహిళా సంఘం సభ్యులకు సూచించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో జిల్లా సమాఖ్య నాల్గవ వార్షిక మహాజన సభను జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా సమాఖ్య ఆడిట్ రిపోర్ట్, జమ ఖర్చులు, ఆదాయ వేయాలు, ఆస్తి పట్టిలను ముందు ఉంచి వాటిపై చర్చించి జిల్లా సమాఖ్య సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే 2025–26 మార్చి వరకు చేపట్టవలసిన కార్యక్రమాలను సభ్యలో చర్చించి ఆమోదించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి మహిళా వ్యాపారావేత్తగా ఎదగాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ నరసయ్య, 32 మండలాల మండలాల అధికారులు, డీపీఎంలు, సీసీలు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థి
అనంతపురం సిటీ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత జిల్లాలోని ఓడీచెరువు గ్రామ ఎస్సీ బాలుర సమీకృత వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న లక్ష్మీనరసింహ(14) రోడ్డు ప్రమాదానికి గురై పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. అయితే బాలుడి మృతదేహానికి ఆగమేఘాలపై పోస్టుమార్టం నిర్వహించి, స్వగ్రామానికి తరలించాలంటూ మెడికల్ కళాశాల హెచ్ఓడీ ఒత్తిడి మేరకు అందించిన వైద్య సేవలపై పలు అనుమానాలు రేకెత్తాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. మరణించిన బాలుడి తండ్రి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారని నిలదీశారు. దీంతో మార్చురీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులతో పాటు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి, ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ వెంటనే ఆస్పత్రి మార్చురీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని గమనించారు. మరణించిన విద్యార్థి తండ్రి పూజారి శివానందతో కలసి మార్చురీ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మంత్రి సవితతో పాటు మెడికల్ కళాశాలకు చెందిన కీలక అధికారి తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి విద్యార్థి ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యతను విస్మరించిన మంత్రి సవితను వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థి మృతికిఇ కారకులైన వార్డెన్, సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. అంత వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఏం జరిగిందంటే..గోరంట్ల మండలం కమ్మవారిపల్లికి చెందిన పూజారి శివానంద కుమారుడు లక్ష్మీనరసింహ ఓడీచెరువులోని ఎస్సీ బాలుర సమీకృత వసతి గృహంలో ఉంటూ అక్కడి జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదివేవాడు. ఈ నెల 14న అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండడంతో ప్రసాదం తీసుకురావాలని లక్ష్మీనరసింహ, ఎనిమిదో తరగతి విద్యార్థి భార్గవ్కు వార్డెన్ కృష్ణానాయక్, కమాటీ గురుప్రసాద్, వాచ్మెన్లు అఖిల, బాలమ్మ పురమాయించి, వారి ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి పంపారు. కదిరి–హిందూపురం మధ్య కొత్తగా వేస్తున్న నాలుగు వరుసల రహదారిపై వెళ్తుండగా ఎం.కొత్తపల్లి సమీపంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో విద్యార్థులిద్దరూ గాయపడ్డారు. వీరిని వెంటనే 108లో కదిరిలోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. లక్ష్మీనరసింహ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని తండ్రి రెండు చేతులెత్తి మొక్కినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు పసివాడి ప్రాణం బలైంది. మంగళవారం ఉదయం సర్వజనాస్పత్రిలో లక్ష్మీనరసింహ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత వార్డెన్ సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. అంతటితో తన పనైపోయిందని భావించిన ఆమె ఆ తర్వాత విద్యార్థి పరిస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఇలాకాలో ఈ నెల 14న ప్రమాదానికి గురైన హాస్టల్ విద్యార్థులు వార్డెన్, మరో ముగ్గురి సస్పెన్షన్తో చేతులు దులిపేసుకున్న మంత్రి పది రోజులుగా అనంతపురం జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం విద్యార్థి మృతి ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత -
వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించాలి
ప్రశాంతి నిలయం: వినియోగదారులు హక్కులు, చట్టాలపై పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు పురస్కారాలతను అందజేసి, అభినందించారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించిన స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, డీఈఓ క్రిష్టప్ప, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బాలల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి జిల్లాలో బాలల సంరక్షణ గృహాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లల భద్రత, సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారునలు జేసీ ఆదేశించారు. జూవైనల్ జస్టిస్ యాక్ట్–2015 మేరకు రిజిస్ట్రేషన్ పొందిన బాలల వసతి గృహాల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన తనిఖీ బృందం సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలోని తొమ్మిది బాలల వసతి గృహాల్లో పిల్లల ప్రస్తుత పరిస్థితులపై బృందం సభ్యులతో జేసీ సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ మేడా రామలక్మి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ నాగమల్లేశ్వరి, మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ గీతాబాయి, జిల్లా బాలల సంక్షేమ అధికారి మహేష్, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడు శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ మునిచంద్రిక, తదితరలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ -
క్రిస్మస్ సందడి
హిందూపురం: జిల్లాలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. ఈనెల 25న జరగనున్న పండుగకు క్రైస్తవులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని చర్చీలను విద్యుత్తు దీపాలు, స్టార్లతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపేలా ప్రత్యేకంగా బొమ్మలతో పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కొన్ని చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. హిందూపురంలోని సీఅండ్ఐజీ, న్యూజెరూసలెం, సీఅండ్ఐజీ కాంపౌండ్, లక్ష్మీపురం బైబిల్ మిషన్ తదితర చర్చీలను ఆకట్టుకునేలా అలంకరించారు. -
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలు అప్రతిష్టపాలు అవుతున్నాయి. ఓవైపు గుడి, బడి తేడా లేకుండా మద్యం దుకాణాలు, బెల్టు షాపులు ఏర్పాటు కావడంతో ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆలయాల్లో యథేచ్ఛగా దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకునేనాథుడే క
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీకి గురైన హుండీ సాక్షి, పుట్టపర్తి: జిల్లాలోని వివిధ ఆలయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హండీలు, ఆభరణాలు దొంగతనానికి గురవుతున్నాయి. అంతేకాదు ఆలయ అధికారులు కూడా దొంగతనానికి యత్నించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల నిర్వహణ అధ్వానంగా మారిందన్న విమర్శలున్నాయి. కదిరి మండలంలో ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఆభరణాలను అనుమతి లేకుండా తీసుకెళ్తున్న ఆలయ కార్య నిర్వాహక అధికారి మురళీకృష్ణను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు దేవదాయశాఖ కమిషరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఆలయంలోని ఆభరణాలను కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తరలిస్తూ పట్టుబడటం విశేషం. రామగిరి మండలంలో ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో పలుమార్లు హుండీ చోరీ చేశారు. హుండీలను దూరంగా ఎత్తుకెళ్లి నగదు దోచుకెళ్లి అక్కడే పడేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు సార్లు హుండీ చోరీ జరిగింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ముత్యాలమ్మ ఆలయ సమీపంలోనే అనధికారికంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండదండలు ఉండటంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో విచ్చలవిడిగా దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయాలకు వెళ్లి వస్తున్న మహిళల మెడలో చైన్లు లాకెళ్లిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రాత్రి వేళల్లో ఆలయాల్లో చొరబడి హుండీలు దోచుకెళ్తున్నారు. బయటి వాళ్లను పక్కన పెడితే ఆలయ నిర్వహణలో భాగమైనవారు సైతం చోరీలకు యత్నిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా ఆలయాల భదత్ర, ప్రాముఖ్యతను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. పలుమార్లు హుండీ చోరీ చంద్రబాబు హయాంలో ఆలయాలు అప్రతిష్టపాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న నిర్వాహకులు కదిరిలో ఆభరణాల దొంగతనానికి అధికారి యత్నం నసనకోటలో అనుమతులు లేకుండా బెల్టు షాపు ఏర్పాటు దేవాలయాల్లో తరచూ దొంగతనాలు.. గుప్త నిధుల తవ్వకాలు విచ్చలవిడిగా దొంగతనాలు అను‘మతి’ లేకుండా .. -
పెనుకొండలో పంచ‘బూతాలు’
పెనుకొండ: నియోజకవర్గంలో అనధికారిక ‘ఫైవ్ మెన్ కమిటీ’ కర్ర పెత్తనం పెరిగిపోయింది. ఆ ఐదుగురి టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ ..ఇలా అన్ని శాఖలను తమ కనుసన్నల్లో పెట్టుకుని చెలరేగిపోతున్నారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, భూసేకరణ, ‘కియా’ వ్యవహారాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఇతరత్రా వ్యవహారాలన్నీ వారే నడిపిస్తున్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో ప్రభుత్వ కార్యాలయాన్ని పంచుకున్నారు. వారి కనుసన్నల్లోనే కార్యాలయాల్ని నడుపుతున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సవిత ఆధ్వర్యంలోనే ఆ ఐదుగురు నేతలు పనిచేస్తున్నారని, అక్రమ వసూళ్ల మొత్తమంతా మంత్రి ఇంటికే చేరుతోందని టీడీపీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. మంత్రి కూడా ఆ ఐదుగురికే ప్రాధాన్యం ఇస్తున్నారని, వారు చెబితే చాలు అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పనిచేసి పెడుతున్నారని, వారు ధనార్జనలో మునిగిపోయినా పట్టించుకోవడం లేదని ఆ వర్గం అంటోంది. ఊరూరా దందానే.. పెనుకొండ నియోజకవర్గంలోని దుద్దేబండ, గొందిపల్లి, గుట్టూరు, అమ్మవారుపల్లి, పెనుకొండ, ఎర్రమంచి, సోమందేపల్లి మండలంలోని సోమందేపల్లి, నడింపల్లి గ్రామాల్లో మంత్రి అనుచరులు రూ.కోట్ల మట్టి దందా సాగిస్తున్నారని, అధికారులు సైతం మంత్రికి భయపడి చేతులు కట్టుకుని కూర్చున్నారని టీడీపీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇటీవల పెనుకొండ మండలం మావటూరు గ్రామంలో రొద్దంకు చెందిన ఓ టీడీపీ నాయకుని అండతో ఏకంగా బస్షెల్టర్నే కూల్చివేశారు. మంత్రి అండ చూసుకుని రెచ్చిపోతున్న ఆమె అనుచరుల ఆగడాలకు ఈ ఘటన నిదర్శనమని చెబుతున్నారు. అధికారులపై పెత్తనం.. మంత్రి అనుచరులు, ‘ఫైవ్ మెన్ కమిటీ’ సభ్యుల దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. రెవెన్యూ అధికారులైతే పెనుకొండ నియోజకవర్గమంటేనే భయపడిపోతున్నారు. అందుకే నియోజకవర్గ కేంద్రమైన పెనుకొండతో పాటు సోమందేపల్లిలో తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉండగా..ఇన్చార్జ్లతో నెట్టుకొస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా సోమందేపల్లి మండలంలో భూ వివాదాల కేసులు భారీగా ఉన్నాయి. వీటికి సంబంధించి తహసీల్దార్ తరచూ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో ఈ మండలం అంటేనే జంకుతున్నారు. ఇక మంత్రి అనుచరుల్లోని యువకులు స్థాయి మరచి అధికారులపై పెత్తనం చేస్తున్నారు. వేలు చూపిస్తూ తమ పనిచేయాల్సిందేనంటూ ఆదేశాలిస్తున్నారు. దీంతో ఇప్పటికే పనిచేస్తున్న అధికారులు మానసిక వేదనకు గురవుతున్నారు. పెనుకొండలో మంత్రి అనుచరుల ఒత్తిడి అధికంగా ఉంటుందన్న భయంతో ఈ మండలానికి తహసీల్దార్గా రావడానికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లోని ప్రతి పనికీ తమకు వాటా ఇవ్వాలని మంత్రి అనుచరులు హుకుం జారీ చేస్తుండడంతో అధికారులు హడలిపోతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు.. పెనుకొండ నియోజకవర్గంలో ‘ఫైవ్ మెన్ కమిటీ’ పేరుతో సాగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం, చివరకు పార్టీ నాయకులు, కార్యకర్తలపైనా మంత్రి చిన్నచూపు..తదితర అంశాలపై ఓ మాజీ ఎమ్మెల్యే ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఉన్న నాయకుడి అనుచర వర్గంతో సరిపోకే సవితకు మద్దతుగా నిలిచామని, ఇప్పుడు ఆమె కూడా అదే దారిలో వెళ్తే..తాము మరోదారి చూసుకోవాల్సి వస్తుందని టీడీపీలోని కొందరు సీనియర్లు చెబుతున్నారు. ‘‘టీడీపీనే ప్రాణం అనుకున్నాం. కానీ ఇప్పుడది పార్టీలాగా లేదు. కొందరి అక్రమార్జనకు కేంద్ర బిందువుగా మారిపోయింది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి కనీస గుర్తింపు లేదు. ఏదైనా సమస్య చెప్పినా స్పందించే నాయకుడు లేడు. ఇక ఈ రాజకీయాలు మాకొద్దు.’’ – మునిమడుగుకు చెందిన టీడీపీ యూత్ లీడర్ ఆవేదన ఇది. ఇలా ఒక్కరు..ఇద్దరు కాదు.. పెనుకొండ టీడీపీ కార్యకర్తలంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత నియోజకవర్గ వ్యవహారాలన్నీ ‘ఫైవ్ మెన్’కు అప్పగించడంతో వారు అక్రమ సంపాదనే ధ్యేయంగా రెచ్చిపోతున్నారు. నియోజకవర్గాన్ని ఏలుతున్న ‘ఫైవ్ మెన్’ అక్రమాలు, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న వైనం మంత్రి సవిత అండదండలే కారణం! -
సమస్యల పరిష్కారానికే ‘కరెంటోళ్ల జనబాట’
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ప్రశాంతి నిలయం: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను వెంటనే గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని పరిష్కారం చూపించాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించి నిరంతరం విద్యుత్ను సరఫరా చేయడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఆర్డీఓ సువర్ణ, విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించం ● కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 330 అర్జీలు అందగా..వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యను పరిష్కరించాలన్నారు. అంతకుముందు పలువురు దివ్యాంగులు తమ సమస్యలపై అర్జీలిచ్చేందుకు రాగా, కలెక్టర్ వేదిక నుంచి కిందకు దిగి వారి వద్దకు వెళ్లి సమస్యలు విని అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు ● ఎస్పీ సతీష్కుమార్ వెల్లడి హిందూపురం: జిల్లాలో నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన హిందూపురంలో పర్యటించారు. డీఎస్పీ మహేష్తో కలిసి బైక్పై పర్యటిస్తూ వాహన రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పట్టణంలోని ప్రధాన రహదారులు, రద్దీగా ఉన్న కూడళ్లలో 146 అత్యాధునిక ఫీచర్లతో కూడిన సీసీ కెమెరాలు అమర్చి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్, బస్టాండు పరిసరాల్లో నిరంతర నిఘా ఉంచుతామన్నారు. అలాగే రాత్రి వేళల్లో నిఘా కోసం నైట్ బీట్ సిబ్బంది మరింత పకడ్బందీగా పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అలాగే నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో పట్టణాన్ని పరిశీలిస్తుంటామన్నారు. ఎస్పీ వెంట సీఐలు రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం, జనార్దన్, పలువురు ఎస్ఐలు ఉన్నారు. -
ఐఈఎస్కు ఎంపికై న పెద్దొడ్డి యువకుడు
గుత్తి రూరల్: పెద్దొడ్డి గ్రామానికి చెందిన వంశీధర్రెడ్డి అనే యువకుడు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యాడు. భాస్కర్రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమారుడు వంశీధర్రెడ్డి తిరుపతి ఎస్వీ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ సాధించడమే ధ్యేయంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. అయితే ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో వంశీధర్రెడ్డి ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించి ఐఈఎస్కు ఎంపికయ్యాడు. వంశీధర్రెడ్డికి ఐఏఎస్ సాధించడమే ధ్యేయమని తల్లి వరలక్ష్మి సోమవారం తెలిపారు. వంశీధర్రెడ్డిని గ్రామస్తులు, స్నేహితులు బంధువులు అభినందించారు. -
‘నకిలీ’ ఏరివేతకు రంగం సిద్ధం
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 3,981, బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 1,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడంతో రాష్ట్ర స్థాయి అధికారులే రంగంలోకి దిగారు. జిల్లాలో ఇంకా ఏ పంచాయతీ నుంచైనా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పంచాయతీల నుంచి ఇటీవల కాలంలో జారీ అయిన అన్ని బర్త్ సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బర్త్ సర్టిఫికెట్లు ఎక్కువగా జారీ చేసిన పంచాయతీల నుంచి ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్ర జనన, మరణ నమోదుశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇప్పటికే విచారణ చేపట్టిన జిల్లా నోడల్ ఆఫీసర్, విచారణ అధికారి కళాధర్ కలిసి పలు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? లేదా హ్యాకర్ల పనేనా అని ఆరా తీసినట్లు తెలిసింది. జనన, మరణ నమోదుశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు సోమవారం గోరంట్ల, చిలమత్తూరు, సోమందేపల్లి, లేపాక్షి పంచాయతీల్లో పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఇటీవల జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేసినట్లు సమాచారం. జిల్లాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు వెలుగు చూసిన నేపథ్యంలో జనన, మరణ నమోదు శాఖ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో పునఃపరిశీలన చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ దశల వారీగా కొనసాగనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కువ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయో... ఆ గ్రామ పంచాయతీలను గుర్తించి పునఃపరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ జిల్లా పర్యటనకు వచ్చి ఇప్పటికే జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించినట్లు తెలిసింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు జిల్లా నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ల పునఃపరిశీలనకు శ్రీకారం జిల్లా పర్యటనకు వచ్చిన జనన, మరణ నమోదు శాఖ డీడీ నాలుగు పంచాయతీల్లో పరిశీలన అన్ని పంచాయతీల్లో బర్త్ సర్టిఫికెట్ల పునఃపరిశీలన.. జిల్లాకు వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు -
హైవేకు మరమ్మతులు
పరిగి: మండలంలోని నేతులపల్లి సమీపంలో కొడికొండ చెక్పోస్టు నుంచి కర్ణాటకలోని శిర వరకు నిర్మించిన 544ఈ జాతీయ రహదారిపై మరమ్మతు పనులను హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. జాతీయ రహదారి దెబ్బతిని వాహనాల రాకపోలకు ఇబ్బందిగా మారిన అంశంపై ‘నేషనల్ హైవే.. నాలుగేళ్లకే శిథిలం’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై హైవే అథారిటీ అధికారులు స్పందించారు. ఆదివారం జయమంగళ నదిపై నిర్మించిన వంతెనపై ఏర్పడిన గోతులకు ప్యాచ్ వర్క్ చేశారు. వ్యక్తి ఆత్మహత్య రొద్దం: మండలంలోని తురకలాపట్నం గ్రామానికి చెందిన చాకిల బైలాంజినప్ప (48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కాగానొక్క కుమార్తె 2020లో అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి కుమార్తైపె దిగాలుతో ఉండేవాడు. పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు మద్యానికి బానిసై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికహిందూపురం టౌన్: స్థానిక ఎన్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.ఫరీదా జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రగతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కళాశాలలో విద్యార్ధిని ఫరీదాను అభినందించారు. ఈ నెల 28వ తేదీ వరకూ తెలంగాణలోని మల్కాజ్ గిరి జిల్లాలో ఉన్న ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వారం రోజుల పాటు జాతీయ సమైక్యతా శిబిరం జరగనుంది. ఎస్కేయూ ఎన్ఎస్ఎస్ విభాగం నుంచి ఏపీ తరఫున ఫరీదా పాల్గొని రాష్ట్ర సంస్కృతీసంప్రదాయాలను వివరించనున్నారు. ఫరీదాను ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు రవినాయక్, ఎన్ఎస్ఎస్ పీఓ రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, కళాశాల సిబ్బంది అభినందించారు. 12వ పీఆర్సీని నియమించాలి ● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ డిమాండ్ పుట్టపర్తి అర్బన్: తక్షణమే 12 వేతన కమిషన్ను నియమించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తచెరువులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లయినా 12వ పీఆర్సీని నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్కుమార్ మాట్లాడుతూ... పదో తరగతి పరీక్షల దృష్ట్యా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు విద్యాశాఖేతర శాఖల అధికారులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది ఉపాధ్యాయులను అవమానపరచడమేనన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ను సెలవు దినాలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కోడూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఆర్.చంద్ర, గౌరవాధ్యక్షుడిగా త్రిమూర్తి, ఉపాధ్యక్షులుగా రవీంద్రారెడ్డి, రాజశేఖర్, ఉషారాణి, రాందాస్ నాయక్, బలరాముడు, కార్యదర్శులుగా లతారామకృష్ణ, ఆదిబయన్న, భానుప్రియ, నాగరాజు, యంజారప్ప, శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లుగా అంజనమూర్తి, జయరాంరెడ్డి, నరసింహారెడ్డి, ముత్యాలప్ప, వాసుకుమార్, రవికుమార్, రమణారెడ్డి, సంగీత, కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
గుండెపోటుతో ఎస్కేయూ విద్యార్థిని మృతి
రాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా, చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
వివాహిత అనుమానాస్పద మృతి
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన హరిజన నాగరాజు భార్య ప్రవల్లిక (30) నాలుగు రోజులు క్రితం తన ఇంట్లో శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, ప్రవల్లిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు తల్లి రామసుబ్బమ్మ ఫిర్యాదు చేసింది. తన కూతురు ప్రవల్లికతో నార్పల మండలం నల్లపరెడ్డిపల్లికి చెందిన ప్రహ్లాదరెడ్డి సన్నిహితంగా ఉండేవాడని, నాలుగు రోజుల క్రితం (గురువారం రాత్రి) మామిళ్లపల్లిలోని తన కూతురు ఇంటి వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. అతని వైఖరి కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, ప్రహ్లాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. దీంతో ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆదేశాల మేరకు కనగానపల్లి పోలీసులు, క్లూస్టీం సిబ్బంది మామిళ్లపల్లిలోని మృతురాలి ఇంటికి ఆదివారం చేరుకుని పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కూడా మృతురాలి ఇంటిని పరిశీలించి ప్రవల్లిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి కారకులైన వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రహ్లాదరెడ్డి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రిజ్వాన్ తెలిపారు. -
కలలో కనిపించి.. ఇలలో కొలువుదీరి
పావగడ: నాగలమడక గ్రామంలోని అంత్య సుబ్రహ్మణ్యం స్వామి సర్వాంతర్యామిగా వెలుగొందుతున్నాడు. ఏడు పడగల సర్పాకార సుబ్రహ్మణ్యం స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచాడు. దక్షిణ కర్ణాటక లోని ఆది కుక్కె సుబ్రహ్మణ్యం స్వామి, దొడ్డబళ్లాపురంలోని మధ్య ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి, నాగలమడకలోని అంత్య సుబ్రహ్మణ్యం స్వామి ఆలయాలను వరుసగా దర్శించి పూజలు నిర్వహించడం భక్తులకు ఆనవాయితీ. భక్తుల కొంగు బంగారంగా.. పూర్వం నాగలమడక గ్రామంలో అన్నంభట్లు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుక్కె ఆలయం నుంచి వచ్చి ఇక్కడ చేరుకున్నాడు. ఒక రాత్రి సుబ్రహ్మణ్యం స్వామి అతని కలలో వచ్చి తాను ఏడు పడగల సర్పాకారంలో పక్కనే ఉన్న పెన్నానది ఇసుక లో దాగి ఉన్నానని తనను వెలికి తీసి పెన్నానది ఒడ్డున ప్రతిష్టించాలని కోరాడు. ఆ మరుసటి రోజే అన్నంభట్లు ఏటిలోని ఇసుకను నాగలితో దున్నగా ఆశ్చర్యంగా ఓ ఏడు పడగల సర్పాకార శిల నాగలి చాలుకు దొరికింది. ఆ ఉద్భవ మూర్తిని ఏటి ఒడ్డున చిన్న బండల గుడి కట్టి ప్రతిష్టించాడు. అప్పటి నుంచి ఆ గ్రామానికి నాగలమడక గా పేరు వచ్చింది. తదనంతరం కొన్నాళ్లకు సమీపంలోని ఆంధ్రకు చెందిన రొద్దం గ్రామం నుంచి వర్తకుడు సుబ్బయ్య శెట్టి ఎడ్లబండి లో వ్యాపార నిమిత్తం బళ్లారి కి వెళ్తూ నదీ తీరాన విశ్రమించాడు. తన వ్యాపారం లాభసాటి గా సాగితే స్వామి వారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు. మొక్కు నెరవేరగా సుబ్బయ్య శెట్టి స్వామి వారికి ఆలయం కట్టించాడు. అప్పటి నుంచి నేటి వరకు సుబ్బయ్య శెట్టి వారసులే అంకురార్పణ ఫూజలు నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. అంచెలంచెలుగా ఆలయ అభివృద్ధి జరిగి నేడు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఎంతో రుచిరా.. నాగల మడక షష్టి సందర్భంగా ఉత్తర పినాకిని ఏటి ఒడ్డున భక్తులు తమ ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యం స్వామి ప్రసాదంగా కట్టెల పొయ్యి మీద వండే పెసర పులగం, వంకాయబజ్జి వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. వేడిగా ఉండే పులగం వంకాయ బజ్జిలోకి నెయ్యి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. అన్ని ప్రసాదాల్లోకి పెసర పులగం, వంకాయబజ్జి ప్రసాదం మొదటి స్థానంలో ఉంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న అంత్యసుబ్రహ్మణ్య స్వామి 24 నుంచి నాగల మడకలో బ్రహ్మోత్సవాలు -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పెనుకొండ: స్థానిక ప్రభుత్వ కళాశాలలో 1990–93లో డిగ్రీ బీఏ చదివిన వారు అదే కళాశాల ఆడిటోరియం వేదికగా ఆదివారం కలుసుకున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నది, ఏంచేస్తున్నారన్న విషయాలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు. నాటి అల్లర్లు, చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి అధ్యాపకులు విశ్వనాథరెడ్డి, గోవిందరెడ్డి, గోపాల్ తదితరులను సన్మానించారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి చేయూతనందిస్తామని ప్రకటించారు. కార్యకమానికి పూర్వ విద్యార్థులు రామకృష్ణ, సిద్ధయ్య, హఫీజ్, ఆయిల్ కృష్ణారెడ్డి, బోయ నరసింహ, మహేష్రెడ్డి, టీచర్ సంజీవరాయుడు, టీచర్ వెంకటేసులు, జయశ్రీ, సుకన్య, కల్పన, లక్ష్మీకాంతమ్మ, సుజాత, యశోద, మంజుల, అనిత తదితరులు నేతృత్వం వహించారు. -
ఫైనల్ రౌండ్కు తమిళనాడు
● ముగిసిన సంతోష్ ట్రోఫీ గ్రూప్ జీ మ్యాచ్లు అనంతపురం కార్పొరేషన్: కొన్ని రోజులుగా ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ గ్రూప్ జీ మ్యాచ్లు ఆదివారంతో ముగిశాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్ల్లో తమిళనాడు జట్టు 9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్ పోటీలకు జట్టు అర్హత సాధించింది. 6 పాయింట్లతో రెండో స్థానంలో పాండిచ్చేరి, మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఆంధ్ర , చివరి స్థానంలో అండమాన్ నికోబార్ జట్టు నిలిచాయి. చివరి లీగ్లో నెగ్గిన ఆంధ్ర చివరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 1–0 పాయింట్ల తేడాతో అండమాన్ నికోబార్ జట్టుపై విజయం సాధించింది. జట్టులో అక్ష రెడ్డి అద్భుత గోల్తో ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం గమనార్హం. మరో మ్యాచ్లో తమిళనాడు జట్టు 3–0 గోల్స్ తేడాతో పాండిచ్చేరిపై విజయం సాధించింది. పుట్బాల్కు ఆదరణ ఎక్కువ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పుట్బాల్కు మంచి ఆదరణ ఉందన్నారు. సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందన్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. పుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ మాట్లాడుతూ... ఏపీఎఫ్ఏ అధ్యక్షుడు కోటగిరి నాయకత్వంలో ఏపీలో పుట్బాల్ క్రీడ పుంజుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది ఔత్సాహికులు పుట్బాల్ నేర్చుకుంటున్నారన్నారు. జూనియర్ గరల్స్ విభాగంలో ఏపీ జట్టు ఆల్ ఇండియాలో 7వ ర్యాంకు సాధించిందన్నారు. కార్యక్రమంలో పుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, ఏపీఎఫ్ఏ కో ఆర్డినేటర్ రాయచోటి శ్రీనివాసులు, సిబ్బంది కిషోర్, చినరాజప్ప, సిరివెళ్ల శ్రీకాంత్, సాగర్, నాని పాల్గొన్నారు. -
విదేశాలకు నిలిచిన అరటి ఎగుమతి
తాడిపత్రి రూరల్: ఎగుమతుల ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్కు భారీగా ఆదాయం ఉండేది. ప్రతి నెలా ఆరు నుంచి ఎనిమిది సార్లు అరటి గెలలను ముంబయికి రవాణా చేసేవారు. ప్రతి సారి 600 నుంచి 700 టన్నుల కాయలు మొత్తం 36 నుంచి 40 కంటైనర్ల ద్వారా ఎగుమతి అయ్యేవి. తాడిపత్రి నుంచి ముంబయికి ఒకసారి అరటి కాయలను ఎగుమతి చేస్తే రైల్వేకి దాదాపు రూ.17లక్షల అదాయం సమకూరేది. ఈ మూడు నెలల పాటు అరటి ఎగుమతి ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి రూ.3.50 కోట్ల ఆదాయం రైల్వేకు సమకూరేది. అరటికి తగ్గిన డిమాండ్.. తాడిపత్రి ప్రాంతం అరటికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఆయా కంపెనీలు రైలు మార్గం ద్వారా ముంబయికి రవాణా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మహారాష్ట్రలో ఎక్కువగా అరటి సాగులోకి రావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తుండడంతో అక్కడి అరటి కొనుగోలుకు ట్రేడర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫలితంగా తాడిపత్రి నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తోటల నుంచి కంటైనర్లను తీసుకువచ్చే వాహనాలకు బాడగలు లేకుండా పోయాయి. కంటైనర్లలోకి అరటి బాక్స్లను లోడ్ చేయడం, చెట్ల నుంచి అరటి గెలలను కోయడం, వాటిని రసాయనాల్లో ముంచడం, కాయలను గ్రేడింగ్ చేయడం వంటి పనులు లేక వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. రూ.3.50 కోట్ల రైల్వే ఆదాయానికి గండి గతంలో రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా ఎగుమతి ఈ ఏడాది తాడిపత్రి నుంచి విదేశాలకు అరటి ఎగుమతి చేసే అవకాశాలు కనిపించడం లేదు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ద్వారా ఏటా నవంబర్ నుంచి ఏసీ కంటైనర్లతో ముంబయి మీదుగా అరటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది డిసెంబర్ నెల వచ్చినా ఒక్క కంటైనర్ కూడా తాడిపత్రి నుంచి ఎగుమతి కాలేదు. -
పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి పట్టణ సమీపంలో ఉన్న ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 21 నుంచి 23 వరకు 2,11,391 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 2037 పోలియో కేంద్రాలు, 8,149 మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించామన్నారు. 22, 23 తేదీల్లో పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలు, మురికి వాడలు, హైరిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలియో చుక్కలు వేసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించుకొని పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలియజేశారు. అలాగే కలెక్టరేట్కు రాకుండా www. meekosam. ap. gov. in లో ఆన్లైన్ ద్వారా కూడా అర్జీలు సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో తెలియజేవచ్చని సూచించారు. అర్జీదారులు ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. -
ఆకట్టుకున్న ‘త్వమేవహం’
ప్రశాంతి నిలయం: నవ విధ భక్తి భావనతో భక్తుడు దేవునిలో లీనమైపోవడమే నిజమైన దైవత్వం అన్న సత్యసాయి సందేశాన్ని వినిపిస్తూ సాగిన ‘త్వమేవహం’ నాటిక భక్తుల మదిని మైమరపింపజేసింది. ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం న్యూజిలాండ్ దేశానికి చెందిన సత్యసాయి భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలు, నృత్య ప్రదర్శనతో వారు నిర్వహించిన ‘త్వమేవహం’ నాటిక భక్తులను ఆకట్టుకుంది. అనంతరం భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
జగనోత్సాహం
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అనాథ ఆశ్రమాల్లో దుస్తుల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సీనియర్ నేత దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ జన్మదిన వేడుకలు జరిగాయి. కదిరి పట్టణంలోని గురుకులం అనాథ పిల్లల ఆశ్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం సర్కిల్లో కేక్ కట్ చేశారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్, సీనియర్ నేతలు ఇస్మాయిల్, పూల శ్రీనివాసరెడ్డి, వజ్ర భాస్కర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుమతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే స్థానిక వైఎస్సార్ సర్కిల్లో మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ భర్త చరణ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ చిత్రపటం ముందు కేక్ కట్ చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే కేక్కట్ చేసి మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఘనంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఊరూరా పండుగ వాతావరణం కేక్కట్ చేసి పంచిపెట్టిన అభిమానులు పలుచోట్ల వైద్య, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు పుట్టపర్తిలో రక్తదాన శిబిరం పెనుకొండలో ఘనంగా.. హిందూపురంలో కేక్ కటింగ్ మడకశిరలో ఉత్సాహంగా.. కదిరిలో అన్నదానంధర్మవరంలో సంబరాలు అభిమానం ఉప్పొంగింది. జై జగన్ నినాదం మార్మోగింది. ఊరూ వాడా తేడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి , వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదినాన్ని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అన్నిచోట్లా కేక్లు కట్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. వందేళ్లు వర్థిల్లు జననేతా అంటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. -
గంజాయికి యువత దూరంగా ఉండాలి
కదిరి టౌన్: గంజాయి, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కదిరిలో డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొదట ఆర్ఆండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్లకు లేదా లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. వాటిని అమ్ముతూ పట్టుబడితే నేరం రుజువైన వారికి పది నుంచి 20 ఏళ్ల వరకు శిక్ష ఉంటుందన్నారు. కదిరి ప్రాంతంలో ఇప్పటికి 40 నుంచి 42 మంది గంజాయి కేసుల్లో పట్టుపడినట్లు గుర్తు చేశారు. ఆర్ఆండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాని, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు, ఎస్లు, విద్యార్థి సంఘలు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
జగనన్న సాయం.. ఇవీ నిదర్శనాలు..
రైతు కుటుంబానికి ఎంతో లబ్ధి ఇతను హిందూపురం మండలంలోని కిరికెర గేటుకు చెందిన నారాయణరెడ్డి. 2020 సంవత్సరంలో పాము కాటుకు గురయ్యాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆ సమయంలో స్థానికంగానూ ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితి కావడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించాల్సి వచ్చింది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న నారాయణరెడ్డి ఆ తర్వాత తనను ఆదుకోవాలని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. మానవత్వంతో ఆలోచించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే రూ.3.60 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే నారాయణరెడ్డి సోదరుడు సైతం అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోగా... సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. జగనన్న చేసిన మేలు జీవితంలో మరచిపోలేనని నారాయణరెడ్డి కృతజ్ఞతతో చెబుతున్నారు. – హిందూపురం టౌన్: ఈ చిత్రంలో కన్పిస్తున్నది మహిళా రైతు జయమ్మ కుటుంబం. రొళ్ల మండలం దొమ్మరహట్టి గ్రామం. ఈ కుటుంబం వైఎస్ జగన్ హయాంలో ఎంతో లబ్ధి పొందింది. ఈ కుటుంబానికి 2.75 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయాన్ని కూడా చేయలేక సతమతమవుతున్న రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఆ కుటుంబానికి కలిసొచ్చింది. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన జయమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు వరంగా మారాయి. ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాలతో లబ్ధి పొందిన జయమ్మ కుటుంబం మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకుంది. రైతు భరోసా కింద రూ.67 వేల లబ్ధి కలిగింది. రూ.48 వేల ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. సున్నా వడ్డీ కింద రూ.13 వేలు అందింది. ఇవే కాకుండా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ.1.76 లక్షల వరకు వచ్చింది. వైఎస్సార్ చేయూత కింద కూడా జయమ్మకు రూ.75 వేల లబ్ధి కల్గింది. జయమ్మ కోడలు సువర్ణ బీఫార్మసీ, తర్వాత ఎంఫార్మసీ చదివింది. రూ.3.35 లక్షల వరకు ఫీజురీయింబర్స్మెంట్ అందింది. వసతి దీవెన కింద రూ.80 వేలు జమ అయింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.8లక్షలకు పైగా మా కుటుంబానికి ఆర్థిక లబ్ధి కలిగినట్లు మహిళా రైతు జయమ్మ తెలిపింది. ‘వైఎస్ జగన్ రాక ముందు ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయాన్ని మానుకోవాలని నిర్ణయం తీసుకున్నా. అంతలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మా కుటుంబానికి మంచి రోజులు మొదలయ్యాయి. ఎన్నో పథకాల ద్వారా లబ్ధి కలగడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడ్డాం. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రైతులు బాగుపడతారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.’ అని జయమ్మ అన్నారు.– మడకశిర: మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న జూటరు హరినాథ్రెడ్డి రెక్కల కష్టంతోనే కుటుంబం గడుస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నేను తిరుపతి అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (ఏఐ) చదివాను. నాలుగేళ్లూ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చేసింది. ప్రస్తుతం పేరొందిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం దక్కింది. మా కుటుంబమంతా ఆనందంగా ఉంది. నా ఇంజినీరింగ్ కల నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటా. ఆయన మరోసారి అధికారం చేపట్టి నాలాంటి ఎందరికో మేలు చేయాలని కోరుకుంటున్నా. – జె.లిఖిత, గూనిపల్లి, బుక్కపట్నం మండలం చేనేతలకు చేయూత ధర్మవరం: గత పాలకులు నిర్వీర్యం చేసిన చేనేత రంగానికి వైఎస్ జగనన్న చేయూత నిచ్చారు. తన ఐదేళ్ల పాలనలో నేతన్నలకు అండగా నిలిచి ఎంతో మేలు చేశారు. చేనేతలు అత్యధికంగా నివసించే ధర్మవరం నియోజకవర్గంలో 1,04,305 కుటుంబాలుండగా...97,244 మందికి (93 శాతం) ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారు. నవరత్న పథకాల ద్వారా రూ.3,024 కోట్లు అందజేశారు. పిల్లల చదువులకు ‘అమ్మ ఒడి’ దగ్గర నుంచి నేతన్న నేస్తం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత తదితర పథకాలతో ఆదుకున్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 70 మంది చేనేతల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలతో పాటు గృహ నిర్మాణ సౌకర్యం కల్పించారు. ఇంజినీరింగ్ కల -
ఐదేళ్లలో వందేళ్ల అభివృద్ధి
పుట్టపర్తి అర్బన్: మండలంలో జగరాజుపల్లి గ్రామస్తులు గతంలో సమస్యలతో సహజీవనం చేసేవారు. గ్రామంలో ఎప్పుడు సభ నిర్వహించినా అధికారుల నిర్భంధం, రాస్తారోకోలు, ధర్నాలు జరిగేవి. ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి వెళ్లేందుకు సాహసించే వారు కాదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొలువుదీరాక జగరాజుపల్లి రూపురేఖలు మారిపోయాయి.రహదారి నిర్మాణంతో మొదలు..ఏ గ్రామానికై నా రహదారి ఉంటే అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. కానీ జగరాజుపల్లికి ఏళ్లుగా సరైన రోడ్డు లేదు. ధర్మవరం–గోరంట్ల ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్లు గ్రామంలోకి వెళ్లే రహదారి సరిగా లేక గ్రామస్తులు నరకం చూసేవారు. కానీ 2019 ఎన్నికల సమయంలో దుద్దుకుంట శ్రీధర్రెడ్డి గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువు దీరగానే రూ.3.5 కోట్లతో లింకు రోడ్డు వేయించారు.ప్రతి వీధిలోనూ అభివృద్ధి..వైఎస్ జగన్ తొలి విడతలోనే జగరాజుపల్లిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు. 27 మంది నిరుపేదలకు జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇళ్లను కూడా నిర్మించారు. సొంత స్థలమున్న వారికి 56 ఇళ్లు మంజూరు చేశారు. రూ.1.5 కోట్లతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో మరమ్మతులు చేయించారు. పాఠశాలలో ఫర్నీచర్ మొదలు ఆర్ఓ ప్లాంటు దాకా సౌకర్యాలు కల్పించారు. మోడల్ స్కూల్ ప్రహరీతో పాటు కేజీబీవీలో 8 గదులతో అధునాతన భవనానికి శ్రీకారం చుట్టారు. ఇక రూ.35 లక్షలతో ప్రతి వీధికీ సిమెంటు రోడ్లు వేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.4.5 లక్షలతో తాగునీటి పైప్ లైను, ఇంటింటికీ కొళాయి సౌకర్యం కల్పించారు. అలాగే రూ. 2 కోట్లతో 5 ఎంవీఏ కెపాసిటీతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు.పుట్టపర్తి మండల జగరాజుపల్లిలో 547 కుటుంబాలు 1,472 మంది జనాభా ఉన్నారు. గతంలో కనీస సౌకర్యాలకు నోచుకోని ఈ గ్రామం ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారింది. రూ.3.5 కోట్లతో తళతళ మెరిసే తారు రోడ్డు. ఊర్లో మిలమిల మెరిసే సిమెంట్రోడ్లు. కార్పొరేట్ స్కూళ్లను తలపించే పాఠశాలలు..ఇలా ఒకటేమిటి ఎటు చూసినా అభివృద్ధే కనిపిస్తుంది. ఎవరిని కదిపినా సంక్షేమ సంగతుల ప్రవాహం కొనసాగుతుంది. -
బాగు‘బడి’ంది ఆనాడే
మా స్కూల్కు జగన్ మామ వన్నె తెచ్చారు 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే చాలా మంది భయపడే వారు. వసతులు సరిగా ఉండవని అనుకునేవారు. కానీ జగన్ మామ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు అందంగా తయారయ్యాయి. మా పాఠశాలే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు స్కూళ్ల కంటే మిన్నగా మా స్కూల్లో వసతులు ఉన్నాయి. బెంచీలు, బ్లాక్ బోర్డులు, డిజిటల్ టీవీలు ఏర్పాటు చేశారు. పైగా అమ్మఒడి పథకం ద్వారా చదువుకునేందుకు డబ్బులిచ్చారు. – అఖిల్, 9వ తరగతి, సిద్ధరాంపురం ఉన్నత పాఠశాలపుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం జెడ్పీ హైస్కూల్లో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో గతంలో పలు సమస్యలు ఉండేవి. అయితే.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మనబడి నాడు–నేడు పథకం మొదటిదశలో మౌలిక సదుపాయాలు కల్పించారు. తాగునీటికి ఆర్ఓ ప్లాంటు, సరిపడినన్ని మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలో రెండు చొప్పున ఫ్యాన్లు, బ్లాక్బోర్డు, డిజిటల్ బోధన కోసం టీవీలు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద రూ.43 లక్షలతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
పోలియో రహిత జిల్లానే లక్ష్యం
● కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం కోరారు. ఇందుకోసం ఈనెల 21న (ఆదివారం) నిర్వహిస్తున్న పల్స్పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పల్స్పోలియో పై అవగాహన కల్పించడానికి శనివారం పుట్టపర్తిలోని ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గణేష్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అప్పుడే పుట్టిన బిడ్డ నుంతి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. జిల్లాలో 2,11,391 మంది పిల్లలకు 21వ తేదీ (ఆదివారం) ఉదయం నుంచి పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2,037 పోలియో బూత్లు, 8,140 మంది సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 21వ తేదీ పోలియో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం 22, 23 తేదీల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. రీసర్వే పారదర్శకంగా చేయండి.. ప్రశాంతి నిలయం: భూ తగాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జిల్లాలో చేపట్టిన రీసర్వే పారదర్శకంగా సాగాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీ–సర్వే, హాస్టల్ నిద్ర తనిఖీలు, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, జీఎస్ డబ్లూఎస్ డాక్యుమెంట్ల అప్లోడ్ తదితర అంశాలపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి అభ్యంతరాలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. తహసీల్దార్లు,ఆర్డీఓలు ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ నిద్ర, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలు స్థితిగతులు, పురోగతిపై చర్చించారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో తనిఖీల్లో భాగంగా విద్యార్థుల భద్రత, హాజరు, వసతి సదుపాయాలు తాగునీరు, విద్యుత్, సచివాలయాలు, భోజన నాణ్యత తదితర అంశాలపై నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సువర్ణ, వీఎస్ఎస్ శర్మ, మహేష్, అనంద్కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. బాలికతో అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు హిందూపురం: తమ కూతురుతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు యువకులపై చర్యలు తీసుకోవాలని ఓ ఇంటర్ విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక వన్టౌన్ పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. మేళాపురానికి చెందిన సురేష్, నిఖిల్ తమ అమ్మాయికి వాట్సాప్, ఇన్స్టాలో మెసేజ్లు పంపుతున్నారన్నారు. ఈనెల 18న తమ అమ్మాయిని లేపాక్షికి తీసుకెళ్లి, సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారన్నారు. శారీరకంగా వాడుకొని వదిలేస్తున్నారని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. ఈ విషయంపై వన్టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడును అడగ్గా, కేసు నమోదు చేశామన్నారు. మైనర్ కాబట్టి గట్టిగా చెప్పలేమని, విచారణ చేస్తున్నామన్నారు. -
నేషనల్ హైవే.. నాలుగేళ్లకే శిథిలం
పరిగి: నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్హెచ్ –544ఈ రహదారి నాలుగేళ్లకే శిథిలావస్థకు చేరుకుంది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు నుంచి కర్ణాటక ప్రాంతమైన శిర వరకూ ఎస్సార్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నేషనల్ హైవే నాలుగేళ్లకే శిథిలావస్థకు చేరుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిగి– ధనాపురం మధ్యలో నిర్మించిన వంతెన కూడా శిథిలావస్థకు చేరింది. రహదారిపై నెర్రెలు చీలి, వంతెన సైడ్వాల్ బీటలువారింది. పరిగి మండలంలోనే ఇలా ఉంటే హిందూపురం, పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లోనూ నేషనల్ హైవే –544ఈ నిర్మాణ పనులు మరెంత అధ్వానంగా చేశారోనన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
హక్కులపై అవగాహన కల్పించాలి
హిందూపురం: విద్యార్థులకు హక్కులపై అవగాహన కల్పిస్తూ.. బాధ్యతల పట్ల కూడా దిశానిర్దేశం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ అన్నారు. శనివారం ఆయన హిందూపురంలోని ఎల్ఆర్జీ పబ్లిక్ స్కూల్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికీ న్యాయానికి, చట్టానికి లోబడి జీవించడమే నిజమైన గొప్ప జీవితమని చెప్పారు. చట్టమే అందరికీ మార్గదర్శకమన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎంతో సావధానంగా సమాధానాలిచ్చారు. విద్యార్థులు న్యాయవ్యవస్థ పనితీరు, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. న్యాయవ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ -
ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండుకునే సమయం లేక కొందరు, ఓపిక లేక మరికొందరు.. ఆహార పదార్థాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఇదే కొందరు వ్యాపారులకు వరంగా మారింది. శాసీ్త్రయ వంట విధానాలకు స్వస్తి పలికి కొత్తదనం పేరుతో అశాసీ్త్రయ
చిలమత్తూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు అత్యంత సమీపంలో ఉండడంతో హిందూపురంలోనూ అక్కడి కల్చర్ విస్తరించింది. ఈ క్రమంలో స్థానికంగా ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుకాణాలు, బెల్టుషాపులూ తోడు కావడంతో ప్రస్తుతం హిందూపురంలో ఎటు చూసినా ఫాస్ట్ఫుడ్ సెంటర్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తదనం చూపి ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు నిర్వాహకులు పోటీ పడ్డారు. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. అశాప్త్రీయ పద్ధతుల్లో వండే ఆహారా పదార్థాలను భుజించి పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఫ్లేమ్ త్రోయర్తో చికెన్ వంటకం.. హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో ప్రభుత్వ కార్యాలయాలు, మద్యం దుకాణాలు, ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం ఉండడంతో నిత్యం జనం రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బడిముబ్బడిగా ఫాస్ట్ పుడ్ సెంటర్లు వెలిసాయి. అత్యధికులు మాంసాహారం వైపు మొగ్గుచూపుతుండడంతో వారికి వేడివేడిగా చికెన్ వంటకాలను అందించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో చికెన్ను వండే శాసీ్త్రయ విధానాలకు స్వస్తి పలికి అతి త్వరగా.. క్షణాల వ్యవధిలోనే వంటకం పూర్తయ్యేలా ఫ్లేమ్ త్రోయర్లను వినియోగిస్తున్నారు. సాధారణంగా వంట చేసే సమయంలో పాత్రకు దిగువన మంట పెడుతుంటారు. ఫ్లేమ్ త్రోయర్ (గ్యాస్ టార్చ్)తో చికెన్పై నేరుగా అత్యధిక వేడిని కలిగిన మంటను విరజిమ్మడం ద్వారా ఉడికీఉడకని వంటకాన్ని వేడివేడిగా అందజేస్తుంటారు. ఇలా చేసిన వంటకాల్లో ఫైబర్ శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో జీర్ణ వ్యవస్థ నెమ్మదించి హానికర సమ్మేళనాలు కడుపులోనే ఉండిపోవడం ద్వారా గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ టార్చ్ ద్వారా మాంసం కాల్చినప్పుడు హెటిరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ హానికర రసాయనాలు వెలువడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. వేడికి గ్యాస్ టార్చ్ లోహపు రసాయన కణాలు విడిపోయి నేరుగా ఆహారంపై పడే ప్రమాదం ఉంటుందంటున్నారు. ఇది తిన్న వారు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు.చర్యలు చేపడతాం ఫుడ్ గ్రేడ్ కాని గ్యాస్ టార్చ్లను ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో వాడుతున్నారు. ఇక మాంసహార విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. రుచి కోసమని అశాసీ్త్రయ విధానాలతో వండిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం. అలాంటి ఆహారం విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – గణేష్, ఫుడ్సేఫ్టీ అధికారి , హిందూపురం ఫ్లేమ్ త్రోయర్తో వండుతున్న చికెన్ పదార్థాలు కొత్త రుచి కోసం జనం పాకులాట -
గొల్లపల్లికి సంగాలప్ప స్వామి
బత్తలపల్లి: కురుబల ఆరాధ్యదైవం సంగాలప్ప స్వామి నాలుగు దశాబ్దాల తర్వాత శుక్రవారం మండలంలోని యర్రాయపల్లి నుంచి రాప్తాడు మండలం గొల్లపల్లికి చేరాడు. దీంతో గ్రామస్తులంతా ఆందోత్సాహాలతో స్వామి వారికి స్వాగతం పలికారు. దీంతో స్వామివారి విగ్రహం అప్పగింతకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కురుబ సామాజికవర్గంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వందేళ్ల నాటి వివాదానికి తెరపడింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి.. కురబల గుడికట్టు దేవుళ్లయిన గొల్లపల్లయ్యస్వామి, సంగాలప్పస్వామి అన్నదమ్ములు. ఏ ఉత్సవం జరిగినా ఇరువురు దేవుళ్లనూ ఊరేగించడం ఆనవాయితీ. అయితే సంగాలప్పస్వామి విగ్రహం విషయంలో యర్రాయపల్లి కమతం వంశస్తులు, గంగలకుంట కపాడం వంశస్తుల మధ్య వివాదం నెలకొంది. స్వామి విగ్రహాన్ని తమ గ్రామంలోనే ఉంచుకుంటామంటూ ఈ రెండు గ్రామాల వారు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే 1999లో యర్రాయపల్లికి చెందిన కమతం వంశస్తులు సంగాలప్పస్వామిని గంగలకుంటకు పంపారు. ఈ విషయంలో గంగలకుంట కపాడం వంశస్తులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఒక్కో ఊరిలో ఆర్నెళ్ల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం ఉండేలా 2005లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును అమలు చేయకుండా యర్రాయపల్లి కమతం వంశస్తులు హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీనిపై కపాడం వంశస్తులు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నవంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కమతం వంశస్తులు యర్రాయపల్లిలో స్వామివారి ఊరేగింపు చేశారు. అయితే సంగాలప్ప రెండోపూజ గొల్లపల్లయ్య స్వామితో కలిపి చేయడం ఆనవాయితీ కాగా, స్వామి ఉత్సవ విగ్రహాన్ని గొల్లపల్లికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సుప్రీం తీర్పుపై తాము రివ్యూ పిటీషన్ వేశామని, అంతవరకూ స్వామివారి ఊరేగింపు జరగనివ్వబోమని కపాడం వంశస్తులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు రంగంలోకి దిగారు. శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దారు. గొల్లపల్లిలో ఆనందోత్సహాలు.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమ గ్రామానికి సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహం విచ్చేస్తుండటంతో గొల్లపల్లి వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సాయంత్రం యర్రాయపల్లి గ్రామం నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉరేగింపుగా గ్రామం చివర వరకు తీసుకువచ్చారు. అనంతరం ఐచర్ వాహనంలో ఎక్కించి భారీ పోలీసు బందోబస్తు మధ్య గొల్లపల్లికి తరలివెళ్లారు. అక్కడ రాత్రి గొల్లపల్లయ్యస్వామితో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని తిరిగి యర్రాయపల్లికి చేర్చనున్నారు. భారీ బందోబస్తుతో గొల్లపల్లికి తరలింపు సంగాలప్ప స్వామిని శుక్రవారం గొల్లపల్లికి తీసుకువెళ్లే క్రమంలో బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 60 మంది పోలీసులు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేఽశారు. మరోవైపు బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలతతో పాటు మండలంలోని రెవెన్యూ సిబ్బంది అందరూ గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు -
విజ్ఞాన భాండాగారం.. సమస్యల హారం
అనంతపురం కల్చరల్: సరస్వతీ నిలయాలైన గ్రంథాలయాల్లోనూ రాజకీయమే నడుస్తోంది. ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల్లో గత పాలకులు సాగించిన అభివృద్ధి కంటికి కనిపించకూడదనే వైఖరి జిల్లా కేంద్ర గ్రంథాలయాధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా గ్రంథాలయం పేరును చెరిపేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సూచికలను తెలిపే శిలాఫలకాలను తెరమరుగు చేశారు. దశాబ్దాలుగా నిస్తేజంగా మారిపోయిన గ్రంథాలయాలను తీర్చిదిద్దడమే కాకుండా ఉద్యోగుల పాత బకాయిలను చెల్లించి మళ్లీ గాడిలో పడేసిన ఘనత డాక్టర్ వైస్సార్దేనని ప్రతి గ్రంథాలయ ఉద్యోగీ నేటికీ సగర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ పాలకులు మారిన్పప్పుడల్లా గ్రంథాలయాల్లో రాజకీయాలు చోటు చేసుకుంటూ గతాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సమస్యలపై దృష్టి సారించక నూతన పాలక మండలి బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నాయి. కేంద్ర గ్రంథాలయంతో కలిపి ఉమ్మడి అనంత జిల్లాలో మొత్తం 70 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ 1 గ్రంథాలయాలుగా జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటూ ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు ఉండగా, గ్రేడ్ – 2 గ్రంథాయాల పరిధిలో గుత్తి, ఉరవకొండ, పెనుగొండ, కదిరి, మడకశిర, తాడిపత్రి, కల్యాణదుర్గంతో పాటూ జిల్లాకేంద్రంలోని ఉమెన్స్ లైబ్రరీ ఉన్నాయి. ఇక మిగిలిన 58 గ్రంథాలయాలు గ్రేడ్ 3 పరిధిలో ఉన్నాయి. ఇవి కాక మరో 80 బీడీసీలు ( పుస్తక నిక్షిప్త కేంద్రాలు) ఉన్నాయి. వీటిన్నింటిలోనూ ఇప్పటి వరకూ 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెస్సు వసూళ్లు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో గ్రంథాలయాలు అభివృద్దికి ఆమడ దూరంగా ఉండిపోయాయి. అంతేకాక స్వీయ ఆదాయ వనరులపై పట్టు కోల్పోవడంతో ఉద్యోగులకు రానున్న రోజుల్లో ప్రతి నెలా జీతాలు చెల్లించడం కూడా అనుమానంగానే ఉంటోంది. నామమాత్రానికే ‘డిజిటల్’ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అనంతపురంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఇది గొప్పలు చెప్పుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడడం లేదు. ఈ లైబ్రరీలో దినపత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ తదితరాలను పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా చదువుకునే వెసులుబాటు ఉంది. అయితే డిజిటల్ లైబ్రరీ అభివృద్ధిని అటకెక్కించడంతో ఇది కూడా కేవలం దిన పత్రికలు చదువుకోవడానికి తప్ప మరేందుకు ఉపయోగపడడం లేదు. నిధుల కొరత జిల్లా గ్రంథాలయ సంస్థను నిధుల కొరత వేధిస్తోంది. పాఠకులకు కొత్త పుస్తకాలు తెప్పించాలంటే నిధులు లేవు. రచయితలకు చెల్లించాల్సినవి పాత బకాయిలు అలాగే పేరుకుపోయాయి. గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల పనితీరు, నిర్వహణ పర్యవేక్షణను కూడా అధికారులు పక్కన పెట్టేశారు. సెస్సు వసూలు విషయంలో నిర్ధిష్ట ప్రణాళిక లేక గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అభివృద్ధిని పట్టించుకోకుండా చరిత్రను చెరిపేసే ప్రయత్నం వెంటాడుతున్న నిధుల కొరత నిర్వీర్యమైన డిజిటల్ ౖలైబ్రరీనిధుల లేమి... అసౌకర్యాలు.. సరిపడా సిబ్బంది లేక ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దీనికి తోడు గత పాలకుల అభివృద్ధి ఏ మాత్రమూ కనిపించకూడదనే అజ్ఞానంతో చరిత్రను చెరిపేసే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. పర్యవేక్షణ చేస్తున్నాం ఉమ్మడి జిల్లాలో మొత్తం 70 శాఖా గ్రంథాలయాలున్నాయి. ఇవి కాక మరో 80 వరకు పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. వీటిన్నింటినీ మేము క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం. చిన్నా చితక సమస్యలను పరిష్కారించే దిశగా సాగుతున్నాం. సెస్సు వసూళ్లు కూడా వేగవంతం చేస్తున్నాం. – రమ, సెక్రటరీ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయం -
పోషక యాజమాన్యంపై అవగాహన తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: సుస్థిర వ్యవసాయంలో భాగంగా పోషక యాజమాన్యంపై ఎప్పటికపుడు అవగాహన పెంచుకుని క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ ఏడీ దేవానంద కుమార్, ఏపీఎంఐపీ ఏపీడీ ధనుంజయ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో కోరమాండల్, ఐపీఎల్, స్టాన్, ఇఫ్కో తదితర ఎరువుల కంపెనీల ఆధ్వర్యంలో ఆధునిక ఎరువుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రసాయన ఎరువులు అధిక మోతాదులో వాడకంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో పాటు నేల భౌతిక రసాయన లక్షణాలు దెబ్బతిని నిస్సారవంతంగా మారుతున్నాయన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో భూమిలో సేంద్రియ పోషకాలు (ఆర్గానిక్) పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నానో యూరియా, డీఏపీని ప్రోత్సహించాలని సూచించారు. నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి స్థూలపోషకాల (మ్యాక్రో న్యూట్రియంట్స్)తో పాటు జింక్, బోరాన్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి సూక్ష్మపోషకాలను (మైక్రో న్యూట్రియంట్స్) ఏ పంటకు ఎంత మోతాదులో వాడాలో వివరించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్స్ (హెచ్ఓలు), ఆయా కంపెనీల ప్రతినిధులు మూర్తి, గోవింద రావు, వీబీవీ రమణారెడ్డి, మణిక ళ్యాణ్, వెంకటేష్, మంజునాథ్, టీఎం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. గవిమఠం భూములు అన్యాక్రాంతం కానీయం ఉరవకొండ: స్థానిక గవిమఠం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. పట్టణంలోని గవిమఠంతో పాటు పెన్నహోబిలంలో ఆర్జేసీ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ గవిమఠానికి చెందిన ఆరు ఎకరాల్లో రెండు ఎకరాలు ఆక్రమణకు గురైయినట్లు గుర్తించమన్నారు. ఆక్రమణలను తొలగించడానికి షాపు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. మిగిలిన నాలుగెకరాల్లో కాయగూరల మార్కెట్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి, ఏడాదికి ఒకసారి మఠానికి బాడుగ చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కర్ణాటకలోని తుముకూరు మఠం పరిధిలో46 గదులకు సంబంధించి అద్దె సొమ్ము మఠం ఖాతాకు జమయ్యేలా చేస్తామన్నారు. పెన్నహోబిలానికి రెగ్యులర్ ఈఓను నియమించి నూతన రథం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆలయంలో సాండ్ బ్లాస్ట్ పనులను ఆర్జేసీ పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీ గంజి మల్లికార్జునప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ హరిత, గవిమఠం సహయ కమిషనర్ రాణి, ఇన్స్పెక్టర్ వన్నూర్స్వామి తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ శిశువు మృతి కదిరి అర్బన్: మండలంలోని కాళసముద్రం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలో ఈ నెల 16న గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన 3 రోజుల చిన్నారి అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కదిరి రూరల్ అప్గ్రేడ్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
కమిటీల ఏర్పాటులో మడకశిర ఫస్ట్
● కమిటీలు పూర్తయిన 10 నియోజకవర్గాల్లో 21న రచ్చబండ ● వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ● నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణం కీలకమైన కమిటీల ఏర్పాటులో మడకశిర నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అమరావతి నుంచి కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో సంస్థాగత కమిటీల నియామకం పూర్తయిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే అదేరోజు పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక నియోజకవర్గాల కమిటీల నియామకంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించారన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. ప్రస్తుతం నియాకమైన కమిటీలు యాక్టివిటీగా ఉండాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేయడం వల్ల పేదలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని టెలీకాన్ఫరెన్స్లో నాయకులకు సూచించారు. -
బెదిరింపులకు భయపడం
హిందూపురం: జిల్లా కేంద్రం సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తహసీల్దార్, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని జిల్లా కేంద్ర సాధన సమితి నాయకులు ధ్వజమెత్తారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ర్యాలీ పోలీసు ఆంక్షల నడుమ ప్రశాంతంగా సాగింది. సమితి సభ్యులు, న్యాయవాదులు, వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ఇందాద్, గౌరవాధ్యక్షుడు ఉమర్ ఫరూక్, ఉపాధ్యక్షులు శ్రీరాములు, బాలాజీమనోహార్, రైతుసంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు బాబావలి తదితరులు మాట్లాడారు. జిల్లా కేంద్రం సాధనలో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారంటూ కేసు నమోదుహిందూపురం జిల్లా కేంద్ర సాధన సమితి నాయకులు 12 మందిపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్న అభియోగంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. జిల్లా కేంద్రం సాధన సమితి నాయకులు -
అక్రమ బిల్లులకు ఆమోదం
పుట్టపర్తి టౌన్: ఎక్కడైనా సరే చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కానీ పుట్టపర్తిలో మాత్రం శుక్రవారం ఎమ్మెల్యే అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. కోరం లేనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చైర్మన్ వెళ్లిపోయిన తర్వాత ఆరుగురు టీడీపీ సభ్యులతో కౌన్సిల్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమ బిల్లులకు ఆమోదం తెలుపుకున్నారు. పుట్టపర్తిలో పరాకాష్టకు చేరిన ఈ అధికార దుర్వినియోగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరిగిందంటే... మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 20 మంది సభ్యులున్న కౌన్సిల్లో టీడీపీ సభ్యులు ఆరుగురు ఉన్నారు. మిగతా 14 మందిలో చైర్మన్ ఒక్కరే హాజరు కాగా, వివిధ కారణాలతో 13 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేనందున సమావేశాన్ని వాయిదా వేయాలని చైర్మన్ భావించారు. అయితే ఈ సమయంలో కమిషనర్ కలుగజేసుకుని ఎక్స్అఫిషియో సభ్యురాలి హోదాలో ఎమ్మెల్యే సమావేశానికి వస్తున్నారని ప్రకటించారు. దీంతో ఆమెకు గౌరవం ఇచ్చిన చైర్మన్ ఓబుళపతి 12.30 గంటల వరకూ వేచి చూశారు. అయినా ఆమె రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ వెంటనే కౌన్సిల్లో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి..చైర్మన్ లేకపోయినా పలు బిల్లులు ప్రవేశపెట్టి ఆరుగురు టీడీపీ సభ్యులతోనే ఆమోదింపజేశారు. అన్నీ అక్రమ బిల్ల్లులే.. సత్యసాయి శతజయంత్యుత్సవాల కోసం పుట్టపర్తి పట్టణంలో ఇటీవల పలు అభివృద్ధి పనులు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఈ సమావేశంలో ఆమోదింపజేసుకోవాలని టీడీపీ సభ్యులు భావించారు. కాంట్రాక్టర్లంతా టీడీపీ వారే కావడంతో ఎమ్మెల్యే వారికి వంత పాడారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు గైర్హాజరైనట్లు తెలిసిన వెంటనే పల్లె సింధూరారెడ్డి బిల్లుల ఆమోదానికి పెద్ద ప్లాన్ వేశారు. చైర్మన్ ఓబుళపతి సభలో ఉన్నంత వరకూ అక్కడకురాని ఆమె...చైర్మన్ వెళ్లిపోగానే కౌన్సిల్కు వచ్చి హడావుడి చేశారు. చైర్మన్ మినిట్స్ బుక్కులో సంతకం చేశారు కాబట్టి బిల్లులకు ఆయన ఆమోదం తెలిపినట్టేనంటూ పలు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. అనంతరం నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తన స్థాయి మరచి మరీ ఆరోపణలు చేశారు. కాగా, అవన్నీ దొంగ బిల్లులేనని అందుకే తాము లేని సమయంలో ఆమోదింపజేసుకున్నారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట చైర్మన్, సభ్యులు లేకుండానే పుట్టపర్తిలో మున్సిపల్ సమావేశం కోరం లేకపోయినా బిల్లులకు ఆమోదం దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యానికి పాతర వేసిన ఎమ్మెల్యే సింధూర ప్రజాస్వామ్య విరుద్ధం కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి నేను వెళ్లిపోయాను. ఆ తర్వాత కేవలం ఆరుగురు సభ్యులతో టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సమావేశం నిర్వహించి పలు బిల్లులకు ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకు భయపడి ఆమె చెప్పినట్లంతా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ బిల్లులను కూడా రద్దు చేస్తాం. – తుంగా ఓబుళపతి, మున్సిపల్ చైర్మన్ -
బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులకు బకాయిగా ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలి. సబ్సిడీ బకాయిలను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపు కోవడం సరైన చర్య కాదు. బైవోల్టిన్ పట్టు రైతుల ప్రోత్సాహక బకాయిలను విడతల వారీగానైనా మంజూరు చేసి ఆదుకోవాలి. – వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, పట్టు రైతుల సంఘం కరుణ చూపాలి కేంద్ర ప్రభుత్వం పట్టు రైతులకు సబ్సిడీని సకాలంలో చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు రైతులపై కరుణ చూపి తన వాటా మొత్తం చెల్లించాలి. బైవోల్టిన్ రైతులకు ఇప్పటి వరకూ రూ. రూ.76 కోట్ల మేర ప్రోత్సాహకం ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే చాలా మేలు జరుగుతుంది. – దశనాథరెడ్డి, పాపసానిపల్లి, మడకశిర మండలం -
మార్పులకనుగుణంగా బోధన సాగాలి
పుట్టపర్తి అర్బన్: ఇంటర్మీడియట్ విద్య, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులకు అనుగుణంగా బోధనలో ముందుకు సాగాలని అధ్యాపకులకు ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ సూచించారు. మారిన ఇంటర్ సిలబస్, పరీక్షల విధానంపై ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర ట్రస్ట్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓఎస్డీ రమేష్ మాట్లాడుతూ... గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారన్నారు. దీంతో మ్యాథ్స్ పరీక్షల్లో వంద మార్కులకు ఒక్కటే పేపర్ఉంటుందని, కనిష్టంగా 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా, మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని, అయితే 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని వివరించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్, గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలు రాయనున్న వారికి కొత్త మార్పులు వర్తించవన్నారు. కొత్తగా ఎలక్ట్రివ్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఏ గ్రూపు విద్యార్థులనైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసలుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐఓలు చెన్నకేశవప్రసాద్, వెంకటరమణనాయక్, మంగళకర ట్రస్ట్ చైర్మన్ సురేష్కుమార్, జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ -
‘ఉపాధి’కి మంగళం!
పుట్టపర్తి అర్బన్: సర్కార్ చర్యలతో ఉపాధి హామీ పథకం లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఇప్పటికే కూలీలకు రూ.కోట్లలో బిల్లులు బకాయిగా ఉన్న ప్రభుత్వం... ఈ ఏడాది కేవలం రెండు నెలలు పనులు మాత్రమే చూపి చేతులెత్తేసింది. దీంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉద్యాన రైతులకూ సర్కార్ మొండి చేయి చూపుతోంది. 10 నెలల నుంచి తోటల పెంపకానికి ఇచ్చే బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులు సకాలంలో మంజూరు చేయించాల్సిన ప్రజాప్రతినిధులు కూడా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రూ.కోట్ల బిల్లులు పెండింగ్.. ఉపాధి హామీలో భాగంగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు మార్చి నుంచి ఇప్పటి వరకూ సుమారు రూ.4.8 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మొక్కలు నాటుకున్న రైతులకూ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు అప్పులు చేసి మరీ మొక్కలు కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేక భూగర్భ జలమట్టం కూడా తగ్గింది. ఫలితంగా మొక్కలన్నీ వాడుముఖం పట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉపాధి హామీ నిధులైనా మంజూరైతే ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు అందించవచ్చని బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రూ.2 లక్షలకే పరిమితం.. గత మూడేళ్లలో జిల్లా రైతులు 15,951 ఎకరాల్లో ఉద్యాన తోటలు సాగు చేశారు. గతంలో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద 5 ఎకరాల్లోపు మొక్కలు నాటి మూడేళ్ల పాటు వాటిని సంరక్షించుకునే రైతులకు రూ. 5 లక్షల వరకూ బిల్లు చెల్లించేవారు. అయితే ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు పరిమితం చేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కల ధరలు, నీటి సరఫరా ఖర్చు, ట్రాక్టర్ బాడుగలు, కంచె, కూలీల ఖర్చు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే బిల్లులు చాలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిమితి రూ. 2 లక్షలకే కుదిస్తే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే తోటలు సాగు చేసిన రైతులకు మొదట్లో అరకొరగా వచ్చిన బిల్లులు... ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. 10 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఒక నీళ్ల ట్యాంకర్ నీళ్లకు రూ. 1,000 వరకూ ఖర్చు వస్తోందని, పొలం దున్నడానికి ట్రాక్టర్కు గంటకు రూ. 1000 బాడుగ ఇవ్వాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇలా ఖర్చులు పెరుగుతుండగా...ప్రభుత్వం మాత్రం పరిమితులు విధిస్తూ బిల్లులు బకాయి పెట్టడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు చెబుతున్నారు.ఒక్కో మొక్క సంరక్షణకు రూ.5.45.. ఉపాధి హామీ పథకానికి మంగళం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కూలీలకు పనులు కల్పించి వలసలు నివారించడం.. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండి ఉద్యాన తోటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు ఊతంగా నిలిచిన పథకాన్ని చంద్రబాబు సర్కార్ నీరు గారుస్తోంది. బిల్లులు మంజూరు చేయకుండా కూలీలను అష్టకష్టాలు పెడుతోంది. అలాగే డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద ఉద్యాన తోటలు సాగుచేసిన రైతుకు బిల్లులు ఇవ్వకుండా అప్పుల పాలు చేసింది. డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద ఉద్యాన తోటలు సాగు చేసే రైతులకు మొదటి ఏడాది మొక్కలకు గుంతలు తీయడం, మొక్కల రవాణా, నాటడం, నీళ్లు పెట్టడం, కంచె, పొలం దున్నడం తదితర పనులకు ఉపాధి హామీ పథకం కింద బిల్లులు చెల్లిస్తారు. ఒక్కో మొక్కకు ఒక్కసారి వాటరింగ్కు రూ.5.45 మేర చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా మూడు నెలల పాటు ఉండే వేసవిలో ఒక్కో మొక్కకు నీరు అందించేందుకు సుమారు రూ.1,000 వరకూ బిల్లు ఇస్తారు. ఎరువులు, పొలం దున్నడం, కంచె ఏర్పాటు తదితర వాటికి రెండు, మూడో సంవత్సరాల్లో బిల్లులు ఇస్తారు. ఈ బిల్లులు ప్రస్తుతం రూ.4.8 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. -
ప్రోత్సాహం కరువు
మడకశిర: పట్టు రైతుపై చంద్రబాబు సర్కార్ కరుణ చూపడం లేదు. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించకుండా వేధిస్తోంది. బకాయిలు రూ.కోట్లలో చేరినా ఆ ఊసే ఎత్తడం లేదు. పట్టు రైతులకు అందించే సబ్సిడీల్లో కేంద్రం తన వాటా మొత్తం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా మొత్తం చెల్లించకుండా మొండిచేయి చూపుతోంది. బకాయిలన్నీ పూర్తి స్థాయిలో విడుదల చేసి ఆదుకోవాలని పట్టు రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీనే అధికం.. పట్టు రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా చేయూత ఇస్తోంది. పట్టు రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో షెడ్లు, ప్లాంటేషన్, షూట్ రేరింగ్ తదితర వాటిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ క్రమంలో ఓసీ, బీసీ రైతులకు 50 శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తుండగా...రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 శాతం మాత్రమే సబ్సిడీ అందిస్తోంది. మిగిలిన 25 శాతం రైతులు తమ వాటాగా భరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు కేంద్రం 65 శాతం సబ్సిడీ అందిస్తుండగా...రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం మాత్రమే ఇస్తోంది. మిగిలిన 10 శాతం వాటాను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అరకొర సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బకాయిలు బండగా మారాయి. బకాయి బండ.. రాష్ట్రంలోని పట్టు రైతులకు ప్రభుత్వం రూ.90 కోట్ల వరకు బకాయి పడింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించినా.... రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రేషం షెడ్లు, ప్లాంటేషన్, షూట్ రేరింగ్ తదితర వాటి కోసం కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో పట్టు రైతులు ఆందోళనకు సిద్ధం కాగా, ఇటీవలే సబ్సిడీ రూపంలో అందించాల్సిన రూ.14 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే బైవోల్టిన్ రైతులకు కేజీకి రూ.50 చొప్పున చెల్లించాల్సిన రూ.76 కోట్ల ప్రోత్సాహకాన్ని మాత్రం విడుదల చేయలేదు. పట్టు రైతును పట్టించుకోని చంద్రబాబు సర్కార్ బైవోల్టిన్ రైతుల ప్రోత్సాహకం బకాయి రూ.76 కోట్లపైనే విడతల వారీగా ఇవ్వాలని విన్నవించినా.. పట్టించుకోని వైనం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న పట్టురైతులు పట్టు రైతులకు చంద్రబాబు సర్కార్ శఠగోపం పెట్టేందుకు సిద్ధమైంది. బైవోల్టిన్ పండించే పట్టు రైతులకు ప్రోత్సాహం కింద కేజీకి రూ.50 చొప్పున ఇవ్వాల్సిన మొత్తం రూ.76 కోట్లకు చేరినా.. దాని గురించే పట్టించుకోవడం లేదు. రైతులు ఎన్నిసార్లు విన్నవించినా కనీస స్పందన లేకపోవడంతో రైతులు చంద్రబాబు తీరుపై పెదవి విరుస్తున్నారు. -
ఉన్నత లక్ష్యాలతో బంగారు భవిష్యత్తు
● కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా శ్రమిస్తే భవిష్యత్తు బంగారు మయమవుతుందని విద్యార్థులకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ సూచించారు. శుక్రవారం రాత్రి కొత్తచెరువులోని బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహం పరిసరాలు, వంట గది, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం సౌకర్యాలపై విద్యార్థులతో ఆరా తీశారు. చేపట్టాల్సిన మార్పులపై వార్డెన్కు పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. అనంతరం పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థుల నుంచి రాబట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ను పొదుపుగా వాడుకుందాం : డీఆర్ఎంగుంతకల్లు: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రైల్వే క్లబ్లో విద్యుత్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఆర్ఎంతోపాటు ఏడీఆర్ఎం సుధాకర్, గతి శక్తి సీపీఎం రామకృష్ణా, సీనియర్ డీఈఈ శ్రీనిబాష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ విద్యుత్ పొదపులో గుంతకల్లు రైల్వే డివిజన్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంతకల్లులోని డీటీటీసీ కేంద్రంతోపాటు హాస్టల్కు బిల్డింగ్కు ఫస్ట్ ప్రైజ్ను రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకోగా, డివిజన్లోని రాయచూర్ రైల్వేస్టేషన్ మెరిట్ సర్టిఫికేట్ను కేంద్ర మంత్రి చేతులుగా అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా పలువురి ఉద్యోగులకు ప్రోతాహ్సంల్లో భాగంగా సరిఫికెట్స్తోపాటు బహుమతులు అందించారు. -
సున్నా లేదు.. పావలా అసలే లేదు !
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ డాంభికాలు ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చూస్తే వ్యవసాయ, అనుబంధ రంగాలను పూర్తిగా విస్మరించేసింది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఏ రూపంలోనూ ఉపశమనం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రూ.లక్షలోపు పంట రుణాలకు సంబంధించి బడుగు రైతులకు సున్నావడ్డీ వర్తింపు లేదు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ ప్రయోజనమూ కల్పించలేదు. అసలు ప్రభుత్వం పంట రుణాలు, సున్నావడ్డీ, పావలావడ్డీ వంటి ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. నాడు వ్యవసాయ రంగానికి పెద్దపీట.. వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి గత వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేద, బడుగు, సన్న, చిన్నకారు రైతులకు బాసటగా నిలిచారు. ఏటా ఖరీఫ్, రబీలో బ్యాంకుల ద్వారా రూ. లక్ష లోపు పంట రుణాలు రెన్యూవల్స్, కొత్త రుణాలు తీసుకున్న రైతులపై వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అందుకోసం వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకం అమలు చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్, సహకార బ్యాంకుల పరిధిలో పంట రుణాల కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 5.80 లక్షల మంది వరకు రైతులకు ఏటా రూ.10 వేల కోట్ల వరకు పంట రుణాలు పంపిణీ చేశారు. అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న సన్న చిన్నకారు, బడుగు రైతులు 7,61,502 మందికి ఏకంగా రూ.156 కోట్ల మేర సున్నావడ్డీ నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది. అందులో అనంతపురం జిల్లా పరిధిలో 3,39,362 మంది రైతుల ఖాతాల్లోకి రూ.71 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 4,32,140 మంది రైతుల ఖాతాల్లోకి రూ.75 కోట్ల మేర సున్నా వడ్డీ జమ చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పెద్ద మొత్తంలో పావలావడ్డీ ద్వారా ప్రయోజనం కల్పించారు. రూ.లక్ష లోపు పంట రుణానికి గత ప్రభుత్వం సున్నావడ్డీ వర్తింపు సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి పావలావడ్డీ చెల్లింపు వడ్డీ వర్తింపుపై స్పందించని చంద్రబాబు సర్కార్ -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
పరిగి: మండలంలోని ధనాపురం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎన్.అవంతి... జాతీయ స్థాయి అండర్–14 వాలీబాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థిని శుక్రవారం హెచ్ఎంతో పాటు పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. ధర్మవరం పోలీసులకు ఏబిసీడీ అవార్డు ధర్మవరం రూరల్: ధర్మవరం పోలీసులకు రాష్ట్రస్థాయి ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డు దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచే కేసుల వివరాల ఆధారంగా ప్రతి మూడు నెలలకోసారి ఏబీసీడీ అవార్డును ప్రకటిస్తారు. ఈ క్రమంలో 2024లో నాగలూరు వంక వద్ద గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం అది హత్యగా నిర్ధారణ కావడంతో పక్కా ఆధారాలతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన అప్పటి ఎస్పీ రత్న, ధర్మవరం రూరల్ సీఐ ఎన్. ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు చత్రూనాయక్, బాలకృష్ణ, అనిల్కుమార్ను అభినందిస్తూ శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏబీసీడీ అవార్డును డీజీపీ హరీష్కుమార్ గుప్తా అందజేశారు. సబ్సిడీ విత్తన వేరుశనగలో రాళ్లుబ్రహ్మసముద్రం: రబీ సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగలో నాణ్యత కొరవడింది. శుక్రవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలోని రైతు సేవ కేంద్రం (ఆర్ఎస్కే) నుంచి ఓ రైతు సబ్సిడీ విత్తన వేరుశనగ తీసుకున్నాడు. 30 కిలోల బస్తా రూ.1,650 చొప్పున వసూలు చేశారు. అయితే ఈ బస్తాలో కిలో వరకు రాళ్లు ఉండటంతో రైతు కంగుతిన్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా పంపిణీ చేస్తే ఎలా అంటూ వాపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు● 22 నుంచి 30వ తేదీ లోపు దరఖాస్తుల స్వీకరణ ● ఐసీడీఎస్ పీడీ ప్రమీల పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు ఐసీడీఎస్ పీడీ ప్రమీల తెలిపారు. జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 11 అంగన్వాడీ కార్యకర్తలు, 58 ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 22 నుంచి 30వ తేదీలో ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల్లో దరఖాస్తులు పొంది, 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలన్నారు. గడువు దాటిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు. -
వైద్యం దూరం చేసే కుట్ర
పెనుకొండ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు అప్పటికే 20 శాతం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాలను, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదు. దీనివల్ల పేదలకు వైద్యం దూరమవుతుంది. దీనిపై ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఆర్డీఓతో పాటు ఇతర అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. పేద విద్యార్థులు మెడికల్ విద్యను చదవాలన్నా, సామాన్యులను నాణ్యమైన వైద్యం అందాలన్నా మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. – శివ కుమార్, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం నాయకుడు -
నేటి నుంచి ‘సుశాసన్ సప్తాహ్’
ప్రశాంతి నిలయం: సుపరిపాలన, ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం, మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో చేపట్టిన ‘సుశాసన్ సప్తాహ్ –ప్రశాసన్ గావ్కీ ఓర్’ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 25వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయాలు, పంచాయతీల్లో ప్రత్యేక ప్రజా ఫిర్యాదు పరిష్కార శిబిరాలు నిర్వహించి పరిష్కరించిన సేవలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 23న జిల్లా స్థాయిలో ప్రచార–అవగాహన వర్క్షాపు నిర్వహించి జిల్లాలో అమలవుతున్న మంచి పరిపాలన విధానాలను సేకరించి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సర్వేయర్ ఇంట్లో ఏసీబీ సోదాలు తనకల్లు: మండల పరిధిలోని మల్లిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్వేయర్ శ్రీరాములు ఇంట్లో బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. శ్రీరాములు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మంగళం పంచాయతీలో విలేజ్ సర్వేయర్గా పని చేస్తున్నాడు. భూమి సర్వే చేయడానికి ఓ వ్యక్తి వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సర్వేయర్ శ్రీరాములు స్వగ్రామమైన మల్లిరెడ్డిపల్లికి వచ్చి అతని ఇంట్లో సోదాలు చేసినట్లు సమాచారం. ఏసీబీ డీఎస్పీగా ప్రసాద్రెడ్డి బాధ్యతల స్వీకరణ అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రసాద్రెడ్డి సూచించారు. గురువారం నగరంలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత సేవల కోసం ప్రభుత్వం 1064 టోల్ఫ్రీ, 9440446181 డీఎస్పీ నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుదారులు ధైర్యంగా ముందుకు రావాలని, అప్పుడే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు జయమ్మ, మోహన్ప్రసాద్, హమీద్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. కురాకులపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ అనంతపురం ఎడ్యుకేషన్: నిధుల దుర్వినియోగం విషయంలో కంబదూరు మండలం కురాకులపల్లి పంచాయతీ కార్యదర్శి వి.అశ్వర్థరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 15 లక్షల దాకా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అశ్వర్థరెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రమాదపుటంచు!
పొగ మంచు..హిందూపురం: వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. దీంతో సాయంత్రం నుంచి ఉదయం 7 గంటల వరకూ 44వ జాతీయ రహదారిపై దట్టమైన మంచు తెరలు కమ్ముకుని రహదారులు కనిపించక వాహనదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఈ నెల 14న తెల్లవారుజామున పొగమంచు కారణంగా దారి కనిపించక ఓ ప్రైవేట్ బస్సు హిందూపురంలోని రోడ్డు పక్కన ఉన్న ఓ సెల్ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో ప్రయాణాలు సాగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయరాదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కనిష్టంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రహదారులను మంచు దుప్పటి కప్పేస్తోంది. 100 నుంచి 200 మీటర్ల వరకూ రోడ్డు కనిపించని పరిస్థితి. దీంతో ఉదయం 9 గంటలైనా వాహనాలకు లైట్లు వేసుకుని నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. దగ్గరికి వచ్చే వరకూ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు. ● ప్రయాణిస్తున్న రహదారి స్థితిగతులపై అవగాహన ఉండాలి ● మంచు తెరలు తొలిగిపోయాక ప్రయాణాన్ని కొనసాగించాలి. ● వాహనానికి వెనుక, ముందు రేడియం స్టికర్లను అతికించాలి. ● వాహనాలకు ఫాగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం సురక్షితం, ● పసుపు వర్ణంతో వెలిగే దీపాలు చలికాలంలో ఎంతో మంచిది. ● వాహనాన్ని స్పీడ్ లిమిట్లో పెట్టుకోవాలి. ● ముందు వెళ్తున్న వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేయడం ప్రమాదకరం. ● వాహనాలను రోడ్ల పక్కకు తీసుకెళ్లి ఖాళీ ప్రదేశం, లేదా బాగా వెలుతురు ఉన్న చోట పార్కింగ్ చేయాలి. ● రోడ్డుపై ఆగిపోతే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసుల సాయం తీసుకోవాలి. ● అద్దాలను తుడిచే వైఫర్లు సక్రమంగా ఉంచు కోవాలి. పొద్దు మునిగితే అలుముకుంటున్న దట్టమైన మంచు మంచు తెరల మధ్య దగ్గరికొచ్చే వరకూ కనిపించని వాహనాలు సికింద్రాబాద్కు చెందిన రాళ్లపల్లి వినీల (35) ఈ నెల 6న బెంగళూరు నుంచి స్వస్థలానికి ద్విచక్ర వాహనంపై వెళుతూ.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు చేరుకోగానే పొగ మంచులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సేఫ్టీబార్ కనిపించక ఢీకొని, రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ... ఇది ఒక్క వినీల విషయంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా మంది పొగ మంచు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారులను కప్పేస్తున్న మంచు.. జాగ్రత్తలు పాటిస్తే మంచిది.. -
పర్యవేక్షణ కరువు.. పని బరువు
బత్తలపల్లి: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్లు వ్యవహారంలో అధికారుల పర్యవేక్షణ లోపం... సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ చిన్న పంచాయతీ పోట్లమర్రి నుంచి ఏకంగా 1,982 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన విషయం కూడా జిల్లా అధికారులు గుర్తించకపోవడం విమర్శలు తావిస్తోంది. ఇక పోట్లమర్రి పంచాయతీ అధికారులు పని తప్పించుకునేందుకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాన్నీ బత్తలపల్లి–1 సచివాలయం నుంచే జారీ చేయిస్తుండటంతో హ్యాకర్లు పోట్లమర్రి పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి–3 సచివాలయం లాగిన్ ఐడీని హ్యాక్ చేసి ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు తెలుస్తోంది. లాగిన్ ఐడీ కూడా వాడని సిబ్బంది.. బత్తలపల్లి పంచాయతీ నుంచి వేరుపడి పోట్లమర్రి పంచాయతీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇక్కడ నలుగురు కార్యదర్శులు పని చేశారు. ప్రస్తుతం మండలంలోని సంజీవపురం సచివాలయ కార్యదర్శి భాస్కర్ పోట్లమర్రి పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ సచివాలయానికి లాగిన్ ఐడీ లేకపోవడంతో హ్యాకర్లు కొత్తగా లాగిన్ ఐడీ, పాస్ వర్డులను క్రియేట్ చేసుకొని బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసుకున్నారనే విషయం తెలుస్తోంది. బత్తలపల్లి–3 సచివాలయ సిబ్బందే లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని వాడి ఉంటే ఏ ధ్రువీకరణ పత్రం జారీ అయినా పంచాయతీ కార్యదర్శి సెల్ఫోన్కు ఓటీపీ వచ్చేది. తద్వారా నకిలీలకు పూర్తిగా చెక్ పడేది. కానీ ఇక్కడి సిబ్బంది తమ పంచాయతీ పరిధిలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ బాధ్యతను కూడా బత్తలపల్లి–1 పంచాయతీకి అప్పగించడంతో హ్యాకర్ల పని సులువైనట్లు తెలుస్తోంది. అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే... నకిలీ బర్త్ సర్టిఫికెట్లు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే జరిగే నష్టం మనం ఊహించలేం. మన పొరుగు దేశాల నుంచి అసాంఘిక శక్తులు తరచూ దేశంలోని వచ్చేసి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. అలాంటి వారు ఈ నకిలీ పత్రాలతో మన దేశ పౌరసత్వం పొందితే పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టడం లేదు. ఇంత జరిగినా ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో పోట్లమర్రి పంచాయతీ అధికారులు నేటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు జారీపై ఆరా ఎంపీడీఓ నరసింహనాయుడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ/వార్డు సచివాలయాల అధికారి (ఎంజీఓ) రామ్మోహన్నాయుడు, పోట్లమర్రి పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శి భాస్కర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ అంశంపై చర్చించారు. బత్తలపల్లి–3 సచివాలయానికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల లాగిన్ ఐడీ లేకపోవడం వల్ల హ్యాకర్లు లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు పొందారన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఈ క్రమంలో 1,982 నకిలీ సర్టిఫికెట్లలో ఇప్పటి వరకు 450 సర్టిఫికెట్లును రద్దు చేసినట్లు కార్యదర్శి భాస్కర్ తెలిపారు. మిగిలిన వాటిని కూడా రెండు, మూడు రోజుల్లో రద్దు చేస్తామన్నారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సర్వత్రా విమర్శలు సచివాలయాలపై పర్యవేక్షణ లేక అంతా ఇష్టారాజ్యం -
వణుకుతున్న అనంత
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి ‘అనంత’ చలికి గజ గజ వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పతనమవుతుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. వేకువజామున పొగమంచుతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గురువారం మడకశిర మండలంలో 9.4 డిగ్రీలు, శెట్టూరు మండలంలో 10.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో కూడా 11 డిగ్రీల నుంచి 16 డిగ్రీల మధ్య రికార్డు అయ్యాయి. పగలు కూడా ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదవుతుండటంతో చలి ప్రభావం కనిపిస్తోంది. సాయంత్రం 5 గంటలకే పొగమంచు మొదలై మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ కొనసాగుతోంది. దీంతో పగలు రాత్రి లేకుండా చలిగాలులతో జనం వణుకుతున్నారు. మడకశిరలో 9.4 డిగ్రీలు, శెట్టూరులో 10.5 డిగ్రీలు -
టేకులోడు సచివాలయానికి తాళం
చిలమత్తూరు: నెలల తరబడి నెలకొన్న నీటి సమస్య తీర్చడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టేకులోడులో మహిళలు గురువారం నిరసనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన పీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలకృష్ణ పీఏ ఉత్తుత్తి హామీపై ఆగ్రహం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామసభలో పాల్గొనేందుకు ఈ ఏడాది జూలై 26న టేకులోడుకు వచ్చాడు. ఆ సమయంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ఆయన్ను అడ్డుకున్నారు. తాగునీటి కోసం తాము అల్లాడిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య తీర్చేంత వరకూ కదలనివ్వబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అప్పటికప్పుడు ఫోన్లో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరావు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆరు నెలలు దాటినా ఆ హామీ నెరవేరకపోవడం.. తాగునీటి సమస్య ఇంకా తీవ్రతరం కావడంతో గురువారం మహిళలు సచివాలయం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. చేతగానప్పుడు ఎందుకు హామీలివ్వాలంటూ బాలకృష్ణపై పీఏ తీరును నిరసించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఎంపీడీఓ భాస్కర్ మహిళలతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. నీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయింపు ఎమ్మెల్యే పీఏ హామీ నీటమూట అయ్యిందంటూ ఆగ్రహం -
ప్రైవేటీకరణ సరికాదు
●వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తే తమ డాక్టర్ కల నెరవేరుతుందన్న ఆశతో ఎందరో పేద విద్యార్థులు ఇంటర్లో బైపీసీ తీసుకుని కష్టపడి చదువుతున్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే వారంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికై న చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో పేద వైద్య విద్యార్థుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. – సంతోష్, హెచ్టీ హళ్లి గ్రామం, రొళ్ల మండలం -
రూటు మార్చిన కేటుగాళ్లు
●రామగిరి మండలానికి చెందిన సాకే సదాశివ కలెక్టరేట్ ఉద్యోగి నంటూ జనాన్ని బురిడీ కొట్టించాడు. పింఛన్లు ఇప్పిస్తానని నమ్మబలికి పుట్టపర్తిలో రూ.లక్షల్లో వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గాలించి ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలోనూ చాలా కేసులు ఉన్నట్లు రామగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటన గత అక్టోబరులో వెలుగు చూసింది. గత మే నెల 8వ తేదీన తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఓ మహిళ హల్చల్ చేసింది. బేకరీ, హోటల్, చికెన్ పకోడా దుకాణాల్లో తనిఖీల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కొందరు ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా... ఆశాబీ పేరుతో ఎవరూ లేరని తేల్చి చెప్పారు. ఆలోపే సదరు మహిళ అక్కడి నుంచి జారుకుంది. పుట్టపర్తిలో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్కు ఈ ఏడాది మార్చిలో పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. ఆస్తి పన్ను బకాయి చాలా ఉందని, వెంటనే చెల్లిస్తే సగం వరకూ మాఫీ అయ్యే అవకాశం ఉందని నమ్మబలికాడు. ఫోన్ పేకు డబ్బు పంపితే చాలంటూ తన నంబరు కూడా పంపాడు. అయితే ఆ డాక్టర్ తెలివిగా వ్యవహరించి.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. సాక్షి, పుట్టపర్తి ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పేరుతో హల్చల్ చేస్తున్నారు. మొబైల్ కాల్స్ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. మోసపోయామని ప్రజలు తెలుసుకునే లోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. ఆ తర్వాత మొబైల్స్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగు చూశాయి. పెరిగిన సైబర్ మోసాలు.. హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. దుండగులు అమాయక ప్రజలను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్ లోన్ అప్రూవల్ అయిందని.. ట్యాక్స్ ఆన్లైన్లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లలో దుండగులు చొరబడుతున్నారు. వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని వసూళ్లు చేస్తున్నారు. అనుమానం వచ్చినవారు ఫుడ్ సేఫ్టీ విభాగంలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెబితే.. అక్కడి నుంచి పరారవుతున్నారు. ఆ తర్వాత వారందరూ నకిలీ అధికారులని తేలింది. అధికారులపైనే ఆరోపణలు.. కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను పెట్టుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాట వేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, తూనికలు – కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల్లో ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అధిక వడ్డీ ఆశ కల్పించి.. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు టీ స్టాల్, హోటల్, చాట్ బాండార్లను అడ్డాగా చేసుకుంటున్నారు. అయా ప్రాంతాల్లో తిష్టవేసి అక్కడికి వచ్చే వారితో మాట కలుపుతారు. తమను ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకుని పదే పదే ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అనే పేరు కనిపించే వాట్సాప్ గ్రూప్లను చూపిస్తూ నమ్మబలుకుతారు. ఫోన్ నంబరు ఇచ్చి.. వారం రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో ఫోన్లు చేస్తుంటారు. ఆర్థిక వివరాలు ఆరా తీస్తారు. తాము పెద్ద ప్రాజెక్టు చేస్తున్నామని కాస్త డబ్బు అవసరమని చెబుతారు. అధిక వడ్డీ ఇస్తామంటూ వల విసురుతారు. కొన్ని రోజులు నమ్మకంగా లావాదేవీల జరుపుతారు. ఆ తర్వాత భారీగా అమౌంట్ తీసుకుని ఉడాయిస్తారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అధికారుల పేరుతో డబ్బు వసూలు జిల్లాలో నకిలీ అధికారుల హల్చల్ పన్నుల రూపంలో ఆన్లైన్లో దందా ఫుడ్ సేఫ్టీ పేరుతో చిల్లర రాబడుతున్న వైనం రోజుకో చోట వెలుగు చూస్తున్న మోసాలు -
కమీషన్ల కోసమే
మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పేద విద్యార్థుల డాక్టర్ కల నెరవేరుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. అందువల్లే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు మెడికల్ కళాశాల నిర్వహణ తమ చేతకాదంటూ ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైంది. కమీషన్ల కోసమే చంద్రబాబు పీపీపీ పేరుతో బడాబాబులకు మేలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని మేం ఒప్పుకోం. – సోమేష్కుమార్, కదిరి -
తీరు మారకపోతే పోరుబాటే
●వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో ఏకంగా 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ పూర్తయితే నిరుపేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు మెడికల్ సీట్లూ దక్కుతాయి. కానీ చంద్రబాబు పేదలకు వైద్యాన్ని దూరం చేసే కుట్రలో భాగంగానే ‘పీపీపీ’ మంత్రం జపిస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ‘కోటి సంతకాల’తో ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తో మరో పోరాటానికి శ్రీకారం చుడతాం. – ధర్మతేజరెడ్డి, బుక్కపట్నం -
చీనీ, అరటి చెట్ల దగ్ధం
బత్తలపల్లి: ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో వ్యవసాయ ఉపకరణాలు, చీనీ, అరటి చెట్లు కాలి బూడిదయ్యాయి. వివరాలు... బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన రైతు నాగేష్ వేల్పుమడుగు రోడ్డు పక్కన తనకున్న నాలుగు ఎకరాల్లో చీనీ చెట్లు, మరో నాలుగు ఎకరాల్లో అరటి చెట్లు సాగు చేశాడు. వీటికి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హైఓల్టేజీ కారణంగా విద్యుత్ మెయిన్లైన్ నుంచి స్టార్టర్ పెట్టెలోకి వచ్చిన వైర్లు వేడెక్కి కరిగి షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయి. మంటలు చెలరేటి తోటలను చుట్టుముట్టడంతో స్థానికుల సాయంతో రైతు నాగేష్ మంటలను అదుపు చేయగలిగాడు. అయితే అప్పటికే 20 కట్టల డ్రిప్ పైపులు, 90 చీనీ, 40 అరటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. మద్యం దుకాణానికి నిప్పు తాడిమర్రి: మండల కేంద్రంలోని బాలాజీ మద్యం దుకాణానికి దుండగులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలో కల్లుగీత కార్మికులకు మద్యం షాపు కేటాయించగా యర్రమల భాస్కర్గౌడ్ దక్కించుకుని మద్యం విక్రయాలు చేపట్టాడు. గత 23న దుండగులు నిప్పు పెట్టడంతో రూ.7 లక్షల వరకు సరుకు కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతం నుంచి దుకాణాన్ని ముంటిమడుగు వెంకటప్రసాద్ రైస్మిల్లు సమీపంలోకి మార్చాడు. గురువారం వేకువజాము 1.30 గంటల సమయంలో మద్యం దుకాణం వెనుక వైపున నివాసముంటున్న యర్రమల మురళీగౌడ్ నిద్రలేచి బయటకు వచ్చిన సమయంలో దుకాణం కిటికీ నుంచి పొగ రావడం గమనించాడు. దీంతో విషయాన్ని వెంటనే దుకాణం నిర్వాహకులకు తెలపడంతో వారు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే మంటల్లో రూ.1.70 లక్షల విలువైన మద్యం కాలిపోయింది. ఘటనపై ఎస్ఐ కృష్ణవేణి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపంతో ఆగిన ప్యాసింజర్ రైలు చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లి రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు గురువారం దాదాపు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరిన ప్యాసింజర్ రైలు బసంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకోగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు రెండు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకొని మరమ్మతులు చేయడంతో ముందుకు సాగింది. వ్యక్తి ఆత్మహత్య తాడిపత్రి రూరల్: పుట్లూరు– చల్లవారిపల్లి రైల్వే గేట్ మధ్య గురువారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) ముంబయి– చైన్నె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పింక్ కలర్ చొక్కా, బ్లూకలర్ డ్రాయర్, పంచ ధరించాడని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడిపత్రి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. డాక్టర్ రామసుబ్బయ్య కన్నుమూత అనంతపురం: ప్రముఖ వైద్యులు డాక్టర్ రామసుబ్బయ్య గురువారం కన్నుమూశారు. సేవే పరమావధిగా భావించి చివరి క్షణం వరకూ తన వృత్తికి న్యాయం చేస్తూ వచ్చిన డాక్టర్ రామసుబ్బయ్య మృతి జిల్లాకు తీరని లోటని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఉచిత బస్సు.. ఆపితే ఒట్టు
చెన్నేకొత్తపల్లిలో బస్సు కోసం పరుగులు తీస్తున్న మహిళలుఉచిత బస్సు ప్రయాణం మహిళలను కష్టాలకు గురి చేస్తోంది. గురువారం వివిధ పనుల నిమిత్తం వచ్చిన మహిళలు.. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లో బస్సుల కోసం చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొన్ని బస్సులు మహిళలను చూసి ఆపకుండా వెళ్లిపోయాయి. ఓ బస్సు బస్టాండ్లో ఆగకుండా న్యామద్దల సర్కిల్కు సమీపంలో ఆగింది. బస్సు కోసం చిన్నారులను ఎత్తుకుని మహిళలు, వృద్ధులు పరుగులు తీశారు. తీరా సర్కిల్ వద్దకు చేరుకునే లోపు బస్సు అక్కడి నుంచి వెళ్లింది. బస్టాండ్ల వద్ద బస్సులు ఆపనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని (సీ్త్ర శక్తి) ఎందుకు అమలు చేసిందని మహిళలు మండిపడ్డారు. – చెన్నేకొత్తపల్లి: -
సాదాసీదాగా అహుడా గ్రీవెన్స్
అనంతపురం క్రైం: అహుడా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సాదాసీదాగా జరిగింది. అనంతరం సంబంధిత అధికారులతో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్తో కలిసి జేసీ శివ్నారాయణ్ శర్మ సమీక్షించారు. అనధికార లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్మవరం పరిధిలోని కొణుతూరు లే అవుట్లో ప్లాట్ల విక్రయానికి అనంతపురంలోని అహుడా కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెనుకొండ, మడకశిర ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్ల విక్రయానికి వేలం నిర్వహించాలన్నారు. హిందూపురం, కోడూరు ఎంఐజీ లేఅవుట్ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమంలో అహుడా సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ కేఎండీ.ఇషాక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దుష్యంత్, డీఈ రేవంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్, ఏఓ రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు. ‘ఐఈఎస్’కు సిద్ధరాంపురం వాసి ఆత్మకూరు: ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్కు (ఐఈఎస్) ఆత్మకూరు మండలం పి.సిద్ధరాంపురం గ్రామానికి చెందిన తాళ్లూరు హరికృష్ణ ప్రసాద్ ఎంపికయ్యారు. 2017లో ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన 2022 వరకూ ఓ ప్రైవేటు సంస్థలో సివిల్ ఇంజనీర్గా పని చేశారు. 2024లో చిత్తూరు జిల్లా రామకుప్పంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈగా పని చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది నిర్వహించిన ఐఈఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్లో ప్రతిభ చాటి నవంబర్లో జరిగిన మౌఖిక పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా, జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్తో అత్యున్నతమైన పోస్టుకు ఎంపికయ్యారు. వృద్ధురాలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈనెల 17న మృతి చెందిన కృష్ణమ్మ (70) మృతదేహానికి గురువారం సర్వజనాస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే కృష్ణమ్మ మృతి చెందిందంటూ మృతురాలి కుమార్తె పార్వతి వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సూపర్ స్పెషాలిటీలో జరిగిన మృతిపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ఆరా తీశారు. కార్డియాలజిస్టు డాక్టర్ సుభాష్ చంద్రబోస్, అక్కడి సిబ్బంది తదితరులతో మాట్లాడారు. మృతురాలి బంధువుల ఆరోపణలపై ఆరా తీశారు. మృతదేహం వెలికితీత అగళి: మండలంలోని కొడిపల్లి చెరువు వెనుక ముక్కడపల్లికి వెళ్లే మార్గంలోని బావిలో బుధవారం సాయంత్రం స్థానికులు గుర్తించిన వ్యక్తి మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు వెలికి తీశారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో అక్కడే మృతదేహానికి మడకశిర ప్రభుత్వాస్పత్రి వైద్యులతో పంచానామా చేయించి, ఖననం చేయించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మార్పులకనుగుణంగా బోధన సాగించాలి
అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ విద్య, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నూతన సంస్కరణలను తీసుకువచ్చిందని, వీటికి అనుగుణంగా బోధనలో ముందుకు సాగాలని అధ్యాపకులకు ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ సూచించారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో డీవీఈఓ వెంకటరమణానాయక్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆర్ఐఓ సురేష్బాబుతో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల తరువాత ఇంటర్ విద్యలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారన్నారు. దీంతో మ్యాథ్స్ పరీక్షల్లో వంద మార్కులకు ఒక్కటే పేపర్ఉంటుందని, కనిష్టంగా 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా, మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని, అయితే 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని వివరించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్, గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలు రాయనున్న వారికి కొత్త మార్పులు వర్తించవన్నారు. కొత్తగా ఎలక్ట్రివ్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఏ గ్రూపు విద్యార్థులనైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసలుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ -
నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టండి
కూడేరు: ‘తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువులను అధికారులుగా మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతున్నారు’ అని సీఎం కార్యాలయ తరఫున వచ్చిన అధికారి పార్వతి, జిల్లా ఉద్యానాధికారి ఉమాదేవిని రైతులు నిలదీశారు. ‘బ్యాడిగి మిరపకు తెగుళ్లు – నివారణ చర్యలు’ అంశంపై గురువారం కూడేరు మండలం ముద్దలాపురంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు హాజరయ్యారు. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తుండగా పలువురు రైతులు అడ్డుకుని నకిలీ విత్తనాలు, ఎరువులతో తామేలా నష్టపోతున్నది ఏకరవు పెట్టారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంధించడంతో సమాధానం చెప్పలేక అధికారులు తటపటాయించారు. చివరకు ఈ విషయంపై సీఎం కార్యాలయానికి నివేదిక అందజేస్తామని భరోసానిచ్చారు. అనంతరం మిరపలో ఆశించే తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో మండల ఎంపీఈఓ యాస్మిన్, ఎంపీఈఓలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. సీఎం కార్యాలయ తరఫున వచ్చిన అధికారిని నిలదీసిన రైతులు -
‘సూపర్’లో వృద్ధురాలి మృతి
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలి మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వృద్ధురాలు మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన కృష్ణమ్మ (85)ను కుటుంబసభ్యులు ఈ నెల 10న సూపర్ స్పెషాలిటీలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 11న ఆమెకు తాత్కాలిక పేస్ మేకర్ చేశారు. అనంతరం వేయాల్సిన సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్గా సేకరించి ఈ నెల 16న శాశ్వత పేస్మేకర్ను వేశారు. బుధవారం సబ్క్లీవియన్ వీన్కు ఉన్న పైప్ను తొలగించిన కాసేపటికి వృద్ధురాలు కృష్ణమ్మ దగ్గుతో ఇబ్బంది పడుతూ అపస్మాకర స్థితికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతురాలి కుటుంబీకులు ఆగ్రహానికి లోనయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కృష్ణమ్మ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. సింగిల్ పేస్ మేకర్ కోసం రూ.65వేలు చెల్లించేవరకూ ఆపరేషన్ను చేయలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను దీనిపై కార్డియాలజిస్టు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఖండించారు. పేదలు ఇబ్బంది పడకూడదని, తమ వద్ద ఉన్న డ్యూయల్ చాంబర్ పేస్ మేకర్ను వేరే కంపెనీ వారికి ఇచ్చి సింగిల్ పేస్ మేకర్ తీసుకున్నామన్నారు. నయాపైసా తీసుకోకుండా ఉచితంగా పేస్ మేకర్ వేశామని, ఇందుకు కృతజ్ఞతభావం లేకున్నా పర్వాలేదని, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన -
● మంత్రి లోకేష్ మాటలకు అర్థాలే వేరు
స్కూల్ పిల్లలు అధిక బరువు కలిగిన పాఠ్యపుస్తకాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల బ్యాగ్ బరువు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బ్యాగ్ బరువును తగ్గించేశారు. నాసిరకం బ్యాగులను అందజేయడంతో నాలుగు నెలలకే అవి చిరిగి పోయాయి. చిరిగిన బ్యాగ్లతో ఇబ్బందులు పడలేక చాలా మంది విద్యార్థులు కొత్తవి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది చూసిన పలువురు ‘నారా లోకేష్ మాటలకు అర్థాలే వేరు’ అని ఎద్దేవా చేస్తున్నారు. – పుట్టపర్తి: -
కుటుంబ పోషణ ఎలా?
నేను 20 ఏళ్లుగా పాలిష్ చేసిన బండలను కటింగ్ చేసే పని చేస్తున్నా. వారానికి రూ.2వేలకు పైగా సంపాదించేవాడిని. ప్రస్తుతం అరకొరగా బండలు వస్తుండటంతో సంపాదన సగానికి తగ్గిపోయింది. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాలేదు. –సూరి, చుక్కలూరు యూనిట్లు నడపలేం ప్రభుత్వం పెంచిన రాయల్టీతో బండల పాలిష్ యూనిట్లు నడపడం చాలా కష్టం. అనధికారికంగా పాత రాయల్టీతో బండలు వస్తున్నా.. పనులు చేయడానికి కార్మికులు ముందుకు రావడం లేదు. అప్పులు తెచ్చి యూనిట్లను నడుపుతున్నాం. ప్రస్తుతం వడ్డీలకు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇలా అయితే యజమానులు దివాళా తీయాల్సి వస్తుంది – గౌస్పీరా, బండల పాలిష్ యూనిట్ యుజమాని, తాడిపత్రి -
ఎమ్మెల్యేను మార్చండి.. బైకర్లపై దృష్టి పెట్టండి
చిలమత్తూరు: హిందూపురంలో సమస్యలు తిష్టవేశాయని, పట్టించుకునే వారే కరువయ్యారంటూ సోషియల్ మీడియా వేదికగా పట్టణ ప్రజలు గగ్గోలు పెట్టారు. హిందూపురానికి చెందిన ఓ ఫేస్బుక్ పేజీలో సమస్యలపై స్పందించండంటూ పెట్టిన పోస్టింగ్కు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రోడ్డు సమస్యలు, డ్రైనేజీ సమస్యలపై కామెంట్ చేసిన ప్రజలు... ట్రాఫిక్ సమస్యపై, ఇష్టారాజ్యంగా దూసుకెళుతున్న బైకర్లపై విరుచుకుపడ్డారు. ఏకంగా ఎమ్మెల్యేను మార్చండి అంటూ ఒకరు, ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మరొకరు సూటిగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలైనా అభివృద్ధి పనులు చేపట్టలేదని, కనీసం ఇప్పటికై నా అభివృద్ధి పనులు చేపట్టాలని మరొకరు వ్యాఖ్యానించారు. ఫేస్బుక్ పేజీలో హిందూపురం ప్రజల స్పందన -
కలెక్టరేట్లో ఘనంగా సెమీ క్రిస్మస్
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సెమీ క్రిస్మస్ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , స్థానిక ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రామసుబ్బారెడ్డి, వివిద కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. బీచ్ గేమ్స్కు 19న క్రీడాకారుల ఎంపిక పుట్టపర్తి టౌన్: పశ్చిమ భారత దేశంలోని కేంద్ర పాలిత దీవులైన డబ్యూ, డామన్, దాద్రా, నాగర్ హవేలీలో జనవరి 5 నుంచి 10వ తేదీ వరకూ జరిగే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కు ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారుల ఎంపిక ఈ 19న చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి కిషోర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సెపక్ తక్రా క్రీడల్లో ఒపెన్ ఏజ్ విభాగంలో పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డ్, రెండు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రంతో ఈ నెల 19న ఉదయం 9 గంటలకు విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి వద్ద కృష్ణానది దక్షిణం వైపు ప్రాంతానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 98661 34016, 90524 64770లో సంప్రదించవచ్చు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ●అఘాయిత్యానికి ఒడిగట్టిన బాలుడు పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఈ నెల 14న తన ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా.. వారి ఇంటి ఎదురుగా ఉన్న 17 ఏళ్ల బాలుడు చాకెట్లు ఇస్తానంటూ ఇంట్లోకి పిలుచుకెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు కొత్తచెరువు పీఎస్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ సతీష్కుమార్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ విచారణకు డీఎస్పీ విజయ్కుమార్ను ఆదేశించారు. దీంతో విజయ్కుమార్ ఆ గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలుడిపై కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. పల్స్పోలియోను విజయవంతం చేయండిధర్మవరం అర్బన్: ఈ నెల 21న తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్ఓ డాక్డర్ ఫైరోజాబేగం ఆదేశించారు. బుధవారం ధర్మవరంలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ను ఆమె తనిఖీ చేశారు. అనంతరం బీసీ హాస్టల్ను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, శానిటేషన్ మెరుగు పరచాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్తో కలసి స్క్రబ్ టైఫస్ వ్యాధిపై సమీక్షించారు. ప్రజలకు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి చెన్నారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పొట్టేళ్ల దొంగ అరెస్ట్ తలుపుల: స్థానిక కుమ్మరపేటలో నివాసముంటున్న గంగయ్యకు చెందిన 19 పొట్టేళ్లను ఈ ఏడాది నవంబర్ 28న దుండగులు అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం కదిరి – పులివెందుల మార్గంలో బట్రేపల్లి వద్ద బుధవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులను గమనించి సుమోలో పొట్టేళ్లను తరలిస్తున్న వారు వాహనాన్ని ఆపి ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న రాప్తాడు పంచాయతీ పరిధిలోని చిన్మయనగర్కు చెందిన ఎరికల నాగభూషణ కుమారుడు చిన్నా పట్టుబడ్డాడు. 19 గొర్రెలను స్వాధీనం చేసుకుని విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్గా ఇస్మాయిల్
కదిరి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ) మెంబర్గా కదిరి నియోజకవర్గ నేత ఎస్ఎండీ ఇస్మాయిల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి పార్టీలో అత్యున్నతమైన పదవిని కట్టబెట్టిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అసాంఘిక శక్తులను అణచివేయండి ● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం ముదిగుబ్బ: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అదే విధంగా సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్ కేసులు తదితర వాటి గురించి సీఐ శివరాముడును ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విజుబుల్ పోలీసింగ్ పెంచాలని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. నేడు ముదిగుబ్బ రైల్వే గేట్ బంద్ ముదిగుబ్బ: మరమ్మతుల కారణంగా ముదిగుబ్బ – కదిరి మధ్య ఉన్న రైల్వే గేట్ను గురువారం మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారి శివం మోతూర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కదిరి– అనంతపురం మధ్య తిరిగే వాహనాలు బైపాస్ మీదుగా, అలాగే పుట్టపర్తికి వెళ్లే వాహనదారులు పాతూరు గేటు మీదుగా వెళ్లాలని సూచించారు. -
బాదనహాళ్ రైల్వేస్టేషన్ ప్రారంభం
రాయదుర్గం టౌన్: డి.హీరేహాళ్ మండలం బాదనహాళ్ వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే క్రాసింగ్ స్టేషన్ను నైరుతీ రైల్వే గతిశక్తి విభాగం చీఫ్ ప్లానింగ్ మేనేజర్ సంజయ్కుమార్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ చంద్ర బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. నూతన ట్రాక్పై అజ్మీర్ నుంచి మైసూరు వారాంతపు ప్రత్యేక రైలు సర్వీసుకు పచ్చ జెండా ఊపి రాకపోకలు ప్రారంభించారు. రాయదుర్గం–బళ్లారి నడుమ గతంలో బాదనహాల్, సోమలాపురం, పులకుర్తి, ఓబుళాపురం వద్ద రైల్వే స్టేషన్లు ఉండేవి. బ్రాడ్గేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాదనహాళ్, పులకుర్తి స్టేషన్లను తొలగించారు. దీంతో రాయదుర్గం నుంచి సోమలాపురం మధ్య సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి స్టేషన్ ఉండేది కాదు. ఈ మార్గంలో ఒకే రైలు మార్గం ఉండడం వల్ల ఎదురుగా మరో రైలు వస్తే అటు సోమలాపురంలో గానీ, ఇటు రాయదుర్గంలో గానీ రైలు ఆగాల్సి వచ్చేది. దీంతో రైల్వే అధికారులు గతంలో ఉన్న బాదనహాల్ వద్ద క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, లూప్ లైన్లను నిర్మించారు. -
ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్
● నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు రొద్దం: పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి కొందరు ఇసుకను తవ్వుకుని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా భూగర్భ జలమట్టం తగ్గి బోర్లలో నీరురాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇసుక తవ్వకాలతో పెన్నాలో భారీ గోతులు పడటంతో నది రూపురేఖలు కోల్పోయింది. ఈ ఇసుక అక్రమ రవాణాపై ‘పెన్నా మొత్తం గోతులే’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు ప్రారంభించారు. చెరుకూరు పెన్నానది నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి ● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ప్రశాంతి నిలయం: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 2047 విజన్ ప్రణాళికల అమలుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్యం మేరకు వంద శాతం ప్రగతి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. కొనసాగుతున్న టెట్ పరీక్షలు ● పుట్టపర్తిలోని కేంద్రాన్ని పరిశీలించిన డీఈఓ కిష్టప్ప పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. స్థానిక సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం డీఈఓ కిష్టప్ప పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరుతెన్నెలను డిపార్ట్ మెంటల్ అధికారి వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల అభ్యర్థులను పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి కేటాయించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 100 మంది, సాయంత్ర 100 మందికి పరీక్షలు రాస్తున్నారని, ఇప్పటి వరకు సగటున 90 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని డిపార్ట్ మెంటల్ అధికారి తెలిపారు. రేపు అవగాహన సదస్సు పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ పరీక్షా విధానం, సిలబస్లో వచ్చిన మార్పులు, సంస్కరణలపై ఈ నెల 19వ తేదీన జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సదస్సుకు ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ ప్రత్యేకాధికారి రమేష్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ సురేష్ బాబు హాజరవుతారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరు కావాలన్నారు. -
తమిళనాడు, పుదుచ్చేరి శుభారంభం
అనంతపురం కార్పొరేషన్: భారత సీనియర్ పురుషుల సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీ బుధవారం ఆర్డీటీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో ఆర్డీటీ మైదానం కలకల లాండింది. బుధవారం గ్రూప్ జీలో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ జట్లు బరిలో దిగాయి. తొలిరోజు తమిళనాడు, పుదుచ్చేరి జట్లు శుభారంభం చేశాయి. తొలి మ్యాచ్లో తమిళనాడు, అండమాన్ జట్లు తలపడగా తమిళనాడు జట్టు క్రీడాకారులు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించారు. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండా 6–0 గోల్స్ తేడాతో జట్టును గెలిపించారు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్లో ఆంధ్ర, పుదుచ్చేరి జట్లు తలపడ్డాయి. ఆంధ్ర జట్టు గట్టి పోటీ ఇచ్చినా.. తొలి అర్ధభాగంలో పుదుచ్చేరి జట్టు గోల్ సాధించింది. అనంతరం రెండో అర్ధభాగంలో ఆంధ్ర జట్టు గోల్ చేయడంతో ఆట పోటాపోటీగా సాగింది. చివరి నిమిషంలో పుదుచ్చేరి జట్టు రెండు కీలక గోల్స్ సాధించి 3–1 గోల్స్ తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. పోటీలను ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం డేనియల్ ప్రదీప్ పర్యవేక్షించారు. అట్టహాసంగా సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ మ్యాచ్లు ప్రారంభం -
యూరియా.. రబీలోనూ లేదయా
పుట్టపర్తి టౌన్: ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులు ఇవ్వకుండా వేధించిన చంద్రబాబు సర్కార్...రబీలోనూ తన పంథాను వీడటం లేదు. రబీ ప్రణాళికను వ్యవసాయాధికారులు మందుగానే పంపినా అవసరమైన ఎరువులు జిల్లాకు సరఫరా చేయలేదు. ఫలితంగా రైతులు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. బుధవారం పుట్టపర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. 280 బస్తాల యూరియా మాత్రమే నిల్వ ఉండటం.. రైతులు భారీగా తరలి వచ్చారు. దీంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో వారంతా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం తాము మొక్కజొన్న, జొన్న, వరి పంటలు సాగు చేస్తున్నామని... రెండు బస్తాల యూరియా ఇస్తే ఏ పంటకు వేయాలని అధికారులతో గొడవకు దిగారు. ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసిన యూరియాను కూడా అధికార పార్టీ మద్దతుదారులకే ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జిల్లా కేంద్రం పుట్టపర్తి నడిబొడ్డున యూరియా పంపిణీ జరుగుతుంటే అటు వ్యవసాయ అధికారులు గానీ, ఇటు సొసైటీ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఉన్న యూరియాను అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు స్థానికంగానే కావాల్సినంత డీపీపీ, కాంప్లెక్స్ ఎరువులు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు కావాల్సినన్ని సరఫరా చేయాలని కోరారు. రైతులకు తప్పని కష్టాలు -
మా భూముల్లోకి వస్తే జాగ్రత్త!
పుట్టపర్తి అర్బన్: ‘‘ఇది జలవనరుల శాఖ స్థలం..ఇందులో ఎలాంటి కట్టడాలు, ఆక్రమణలు చేయరాదు. ఎవరైనా ఈ హెచ్చరికను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అంటూ పుట్టపర్తిలో కనిపిస్తున్న బ్యానర్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. అభివృద్ధి పనుల పేరుతో ఆక్రమణ! సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సమయంలో పుట్టపర్తిలోని అత్యంత విలువైన భూములపై కొందరు కన్నేశారు. ఈ క్రమంలోనే జలవనరులశాఖకు చెందిన మూడు స్థలాలపై కన్నేశారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ భూ ఆక్రమణ పర్వాన్ని వివరిస్తూ నవంబర్ 30వ తేదీన ‘జలవనరుల భూములకు ఎసరు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన జలవనరులశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు మంగళవారం తమ స్థలాల్లో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరో రెండు స్థలాల్లో ఆక్రమణ ఇలా.. ● ఇరిగేషన్ కార్యాలయం సమీపంలోని ఎనుములపల్లి చెరువు వద్ద సర్వే నంబర్ 110లో 30 సెంట్లు స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో గుంత ఉండటంతో దీన్ని టీడీపీ నాయకులు మట్టి తోలి చదును చేశారు. ప్లాట్లుగా విభజించుకుని కట్టడాలు కట్టేందుకు సిద్ధమయ్యారు. ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో చదును చేసే పనులను నిలిపివేశారు. ● పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి చిత్రావతి బ్రిడ్జి వద్ద సర్వే నంబర్ 275లో అర ఎకరా స్థలం ఉంది. ఇందులో ఆరపు సంత పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం, కంచె ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖ అధికారులు నోటీసు బోర్డు ఏర్పాటు చేసినా నిర్మాణ పనులు ఆగలేదు. దీంతో మున్సిపల్ కమిషనర్తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లకు గుణపాఠం.. ఆర్టీసీ డిపో పక్కన జలవనరులశాఖ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని టీడీపీ ముఖ్య నేత హడావుడి పెట్టడంతో ఓ కాంట్రాక్టర్ అంచనాలు, అనుమతులు లేకుండానే పనులు చేపట్టారు. ఇప్పుడు తమ భూమిలో జలవనరులశాఖ హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ పార్కు నిర్మాణానికి తాము అంచనాలే వేయలేదని, ఆ పనులతో తమకు సంబంధం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. మరి ఇప్పుడా కాంట్రాక్టర్ ఖర్చు చేసిన కాసులు పచ్చ నేత ఇస్తారా...లేక ముఖం చాటేస్తారా తెలియాల్సి ఉంది. ఈ ఘటన కాంట్రాక్టర్లకు గుణపాఠంగా మారింది. నేతలు చెప్పారని పనులు చేస్తే పరిస్థితి ఇంతేనంటూ వారంతా చర్చించుకుంటున్నారు. ఇది ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న సర్వే నంబర్ 127లోని అరఎకరా స్థలం. జలవనరుల శాఖకు సంబంధించిన ఈ స్థలంపై ఎప్పటి నుంచో కన్నేసిన టీడీపీ ముఖ్య నేత సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సమయంలో శుభ్రం చేసి పార్కింగ్ స్థలంగా వాడుకుంటామని ‘కథలు’ చెప్పారు. ఆ తర్వాత అనుమతులు లేకుండా పార్కు నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తికాకముందే ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కూడా పార్కును అట్టహాసంగా ప్రారంభించి గుర్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ భూఆక్రమణ బాగోతం ‘సాక్షి’ వెలుగులోకి తేగా...జలవనరులశాఖ అధికారులు మేల్కొన్నారు. ఇప్పుడా స్థలంలో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు. ..ఇలా పుట్టపర్తి పట్టణంలోని మూడు ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన జలవనరుల శాఖ స్థలాలు ఆక్రమణకు గురికాగా, ‘సాక్షి’ కథనంలో మేల్కొన్న అధికారులు ఆయా స్థలాల్లో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన జలవనరుల శాఖ ఇప్పటికే ఆయా స్థలాల్లో హడావుడిగా అభివృద్ధి పనులు రూ.కోట్ల భూములకు ఎసరు పెట్టిన టీడీపీ ముఖ్య నేత బాబా శత జయంత్యుత్సవాల పేరుతో స్థలాల స్వాధీనం ‘సాక్షి’ కథనంతో మేల్కొన్న అధికారులు.. పారని ‘పచ్చ’ పాచిక -
నేటి నుంచి సంతోష్ ట్రోఫీ మ్యాచ్లు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ సీనియర్ మెన్స్ నేషనల్ సంతోష్ ట్రోఫీ ఫుట్బాట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్ఏ) ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రూప్ జీలో భాగంగా ఆంధ్రతో పాటు తమిళనాడు, అండమాన్, పాండిచ్చేరి జట్లు తలపడనున్నాయి. ఇసుక ట్రాక్టర్ సీజ్ రొద్దం: మండలంలోని చెరుకూరు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ఎస్ఐ వీరాంజనేయులు మంగళవారం వెల్లడించారు. మళ్లీనాయకినిపల్లి గ్రామానికి బయపరెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా చెరుకూరు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద అడ్డుకుని, ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు వివరించారు. ఇసుక తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. వృద్ధుడి ఆత్మహత్య పుట్టపర్తి టౌన్: జీవితంపై విరక్తితో ఓ వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లిలో నివాసముంటున్న పెద్ద వెంకట్రాముడు (72)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు చేసిచ్చాడు. భార్య చనిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా జీవితాన్ని తాళలేక సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న వెంకట్రాముడిని వెంటనే సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందాడు. ఘటనపై పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
● సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం ఓడీచెరువు/నల్లమాడ: అమడగూరు, ఓడీ చెరువు, నల్లమాడ పోలీస్స్టేషన్లను ఎస్పీ ఎన్.సతీష్కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రిజిస్టర్లు, కేసుల రికార్డులు, అలాగే పెండింగ్లో ఉన్న కేసుల స్థితి, దర్యాప్తు పురోగతిని స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల నిమిత్తం వచ్చే వారితో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, ఫిర్యాదులను సీరియస్గా తీసుకొని పరిష్కారం చూపాలని ఆదేశించారు. రాత్రివేళల్లో గస్తీలు పెంచి, చోరీల నివారణకు అడ్డుకట్ట వేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. నల్లమాడ పోలీస్స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఉండటంతో వర్షం వస్తే కారుతోందా అంటూ సీఐ నరేంద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ కూడలిలో గతంలో పోలీస్స్టేషన్ నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని సీఐతో కలిసి ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ నరేంద్రరెడ్డి, ఓడీ చెరువు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, అమడగూరు ఎస్ఐ సుమతి, ట్రైనీ ఎస్ఐ చెన్నయ్య పాల్గొన్నారు. సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి పుట్టపర్తి టౌన్: సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ నాయకులతో కలసి ఏడీసీసీ బ్యాంక్ ఎదుట సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కోఆపరేటివ్ అధికారి కృష్ణానాయక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. జీఓ నంబర్ 36తోపాటు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, 2019–24వేతన సవరణ చేపట్టాలని, ఉద్యోగులు పదవీవిరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని 2019 సంవత్సరం తరువాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సొసైటీ లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు, అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ, కన్వీనర్ ప్రతాపరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, యూనియన్ నాయకులు హనుమంత్రెడ్డి, దామోదర్, అన్వర్, రామాంజనేయులు, భారతి, నాగవేణి పాల్గొన్నారు. -
గుట్టుగా గుప్త నిధుల వేట
గుప్తనిధుల ముఠా సభ్యుల ఆగడాలు మితిమీరిపోయాయి. పురాతన ఆలయాలు, కట్టడాలు లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారు. వీరి ఆగడాలకు ప్రాచీన కట్టడాలతో పాటు పవిత్రమైన ఆలయాలు, విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. రొద్దం: అత్యాశ.. మూఢనమ్మకం వెరసి జిల్లాలో గుప్తనిధి వేటగాళ్ల అన్వేషణ నిత్యకృత్యమైంది. ఈ నేపథ్యంలో చారిత్రక ఆలయాలు, కట్టడాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. రొద్దం మండలంలో తరుచూ ఏదోక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. మండలంలోని అత్యధిక గ్రామాలు చారిత్రక నేపథ్యం ఉన్నవే కావడంతో గుప్తనిధులు ఉంటాయని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. తాజాగా రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పురాతన యల్లమ్మదేవి ఆలయం ఎదుట గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఏకంగా జేసీబీను ఉపయోగించి రాత్రికి రాత్రి దాదాపు 20 అడుగుల మేర గుంత తవ్వారు. ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ పెద్ద గుంత తీసి ఉండడం, పూజా సామగ్రి పడి ఉండడం గమనించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముఠా సభ్యులకు స్థానికుల అండ? గుప్త నిధుల ముఠా సభ్యులకు స్థానికులు అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముఠా సభ్యులు పక్కాగా ప్రణాళిక వేసి రాత్రి సమయాల్లో తవ్వకాలను చేపడుతున్నారు. తవ్వకాలకు సహకరించేలా మండలంలో ప్రత్యేక బృందం ఉన్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి గుప్త నిధుల వేటగాళ్ల బారి నుంచి పురాతన ఆలయాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. జూదరుల అరెస్ట్సోమందేపల్లి: స్థానిక వినాయక్ నగర్ వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురిని ట్రైనీ ఎస్ఐ గోపాలకృష్ణ మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడిని ఢీకొన్న లారీ యాడికి: లారీ డ్రైవర్ అజాగ్రత్త ఓ వృద్ధుడికి శాపంగా మారింది. ప్రమాదంలో రెండు కాళ్లనూ వృద్ధుడు కోల్పోయాడు. వివరాలు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 83 ఏళ్ల గంధోడి నారాయణ కుమారులు బస్టాండు ప్రాంతంలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దుకాణం వద్దకు నారాయణ నడుచుకుంటూ బయలుదేరాడు. తాడిపత్రి వైపు నుంచి బళ్లారికి వెళుతున్న లారీ డ్రైవర్ స్థానిక ఓ హోటల్ వద్ద ఆపే క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న నారాయణను ఆనుకుని ముందుకు పోనిచ్చాడు. దీంతో నారాయణ అదుపు తప్పి కిందపడడంతో అతని రెండు కాళ్లపై లారీ వెనుక చక్కాలు దూసుకెళ్లాయి. రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వృద్ధుడి కుమారులు వెంటనే కారులో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు. లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. చారిత్రక ఆలయాలే లక్ష్యం ఆనవాళ్లు కోల్పోతున్న పురాతన ఆలయాలు తవ్వకాల్లో జేసీబీల వినియోగం -
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
మడకశిర: మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టి, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, రూ.6,400 కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు బద్రీనాథ్, గిరీష్, రాహుల్, యశ్వంత్, చిత్రలింగ, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా -
రికార్డుల నిర్వహణలో అలసత్వం వద్దు
ఎన్పీకుంట: రెవెన్యూకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకూడదని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను, మ్యుటేషన్ ఫైళ్లను, రిజిస్టర్లను పరిశీలించారు. మండలంలో చేపట్టిన రీ–సర్వే పురోగతిని సమీక్షించారు. అలాగే స్వామిత్వ, గ్రామ కంఠాల రీసర్వే పనులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితమైన రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయండి ప్రశాంతి నిలయం: జిల్లాలోని సబ్రిజిస్టార్ కార్యాలయంలో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయ సిబ్బంది, హెల్ప్డెస్క్ను సంప్రదించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రిజిస్టార్ కృష్ణకుమారి, సబ్రిజిస్టార్లు పాల్గొన్నారు. చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు జిల్లాలో చెరువులు, వాగులు ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే గుర్తించి బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని ఇరిగేషన్శాఖ అధికారులను జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో నిఘా కమిటీ సమావేశం నిర్వహించారు. చెరువులు, వాగులపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలతో వరదలు, నీటి కొరత ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు సువర్ణ, వీవీ ఎస్ శర్మ, మహేష్, ఆనంద్కుమార్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ -
సంక్రాంతికి ‘పాడి’ పోటీలు
అనంతపురం అగ్రికల్చర్: రాయలసీమ జిల్లాల పరిధిలో తొలిసారిగా పాడి ఆవులతో పాల దిగుబడి, లేగదూడల ప్రదర్శన పోటీలు నిర్వహించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు, ఏడీలు, డాక్టర్లతో ఆ శాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ సమీక్షించారు. ఇప్పటి వరకూ కోస్తా జిల్లాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారని, తొలిసారిగా అనంతపురం జిల్లాలోనూ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డైరెక్టరేట్ అనుమతితో పోటీలు ఏర్పాటు, ప్రోత్సాహకాలు, ఇతరత్రా పురస్కారాలు అందజేస్తామన్నారు. రైతుల పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి రెండో వారంలో అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో పెద్ద ఎత్తున పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాల దిగుబడి పోటీలకు జిల్లా నలుమూలల నుంచి కనీసం 150 నుంచి 200 వరకు పాడి ఆవులు తరలివచ్చేలా చూడాలన్నారు. అలాగే వందల సంఖ్యలో లేగదూడలతో ప్రదర్శన నిర్వహించాలన్నారు. ఇదే సందర్భంలో గర్భకోశవ్యాధి శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు, వైద్య చికిత్సలు అందజేయాలన్నారు. పశుసంపద, జీవసంపద పరిరక్షణ, నాణ్యమైన పాడి ఉత్పత్తి కోసం పాడి రైతులను ప్రోత్సహించే క్రమంలో మొదటిసారిగా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు జేడీ తెలిపారు. సమావేశంలో డీడీలు డాక్టర్ వై.రమేష్రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీలు రామచంద్రారెడ్డి, రత్నకుమార్, రాధిక, సుబ్రహ్మణ్యం, సురేష్, డాక్టర్లు గోల్డ్స్మన్, శారద, మహేష్, ఉష, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆకుతోటపల్లిలో నిర్వహణకు నిర్ణయం -
బతిమాలుతున్నా వినడం లేదు
పెన్నానదిలో ఫిల్టర్ బోరు వేసుకుని మా పొలంలో పంటలు సాగుచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అయితే బోరు వద్ద ఇసుకను అక్రమంగా పెద్ద ఎత్తున తవ్వుతుండటంతో బోరు బయటపడి ధ్వంసమైంది. బోరు వద్ద ఇసుక తవ్వకాలు చేయొద్దని చెప్పినా మా మాటలు పట్టించుకోవడం లేదు. బోరు తేలిపోతే నీరు రాక సాగు చేసిన పంట ఎండిపోతాయని రైతులందరూ బతిమాలుతున్నా వారికి పట్టడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలి. – రవి, రైతు, పి.కొత్తపల్లి -
అ‘విశ్రాంత’ పోరాటం
సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్లో దాచుకున్న డబ్బులు.. ఉద్యోగ విరమణతో అందే ఆర్థిక ప్రయోజనాలతో ఎన్నెన్నో కలలు కన్న వారి ఆశలు ఆడియాశలుగానే మారుతున్నాయి. బిడ్డ పెళ్లికి, సొంత ఇంటికి, పిల్లల చదువులకు ఢోకాలేదనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక.. అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చివరకు గ్రూపు లైఫ్ ఇన్సూరెన్స్ (జీఎల్ఐ) డబ్బులు కూడా అందక అవస్థలు పడుతున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల వ్యవధిలోనే తాము దారుణంగా మోసపోయామని పెన్షనర్లు వాపోతున్నారు. అనంతపురం కల్చరల్: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల విషయంలో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆచరణను పూర్తిగా విస్మరించారు. 30 ఏళ్ల పాటు తాము దాచుకున్న డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫలితంగా ఒక రిటైర్డు ఉద్యోగి తాను చేసుకున్న ప్లానింగ్ మొత్తం తల కిందులవుతోంది. ఉద్యోగ విరమణ పొందిన మూడు నెలల్లోపు పెన్షనరీ బెనిఫిట్స్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నా... చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఎప్పుడో ఒకసారి వాటిని జమ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో మనోవేదనకు లోనైన పలువురు... బెనిఫిట్స్ అందకనే చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక వైద్య సేవలను ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చేయడంతో తాము పొందిన వైద్య సేవలకు ఇప్పటి వరకూ మెడికల్ రీయింబర్స్మెంట్ జమ కావడం లేదు. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా కొత్త పంథాను ఎంచుకున్న ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో ఆడుకుంటోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ తాము చూడలేదని పెన్షనర్లు అంటున్నారు. కష్టాలు పంచుకునేలా... కష్టాలు సుఖాలు, ఇబ్బందులు సౌకర్యాలు, మరెన్నో ఎత్తుపల్లాలను పంచుకునేలా పెన్షనర్ల దినోత్సవం రానే వచ్చింది. ఏటా డిసెంబరు 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి లలిత కళాపరిషత్తు, ఉపాధ్యాయభవన్తో పాటు పెన్షనర్ల సంఘాలలో వేడకలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఉపాధ్యాయ భవన్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పలువురు పెన్షనర్లను సన్మానించనున్నారు. అలాగే లలితకళాపరిషత్లో జరిగే కార్యక్రమంలోనూ తమ సమస్యల వాణిని వినిపించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తరలిరానున్నారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల వయస్సు దాటిన పెన్షనర్లను సన్మానించనున్నట్లు నిర్వాహకులు పెద్దన్న గౌడ్ తెలిపారు. సందర్భం ః నేడు పెన్షనర్ల దినోత్సవం చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై పెన్షనర్ల అసంతృప్తి రిటైర్డ్ ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు ఆర్థిక ప్రయోజనాలు అందక అష్టకష్టాలుప్రభుత్వ నిర్లక్ష్యం దారుణం పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించకపోవడం నిరంకుశ ధోరణికి నిదర్శనం. ఇప్పటి వరకూ డీఆర్, 11వ పీఆర్సీ బకాయిలు విడుదల కాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఇటీవల కొంతమంది చనిపోయారు కూడా. వారికేమి న్యాయం చేసినట్లో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ఇక వైద్య సేవలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇలా అయితే ఉద్యమ బాట తప్పదు. – శీలా జయరామప్ప, ప్రధానకార్యదర్శి పెన్షనర్ల సంఘం -
రాత్రింబవళ్లూ తవ్వుతున్నారు
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెన్నానదిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్కు వినతులు అందించాం. అయినా ఇసుక దందా ఆగడం లేదు. పెన్నానదిని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న రైతుల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. – రామచంద్రారెడ్డి, చిన్నమంతూరు -
అయ్యో ‘పాప’ం
ముక్కుపచ్చలారలేదు.. ముచ్చటగా మూడు నెలలైనా నిండనూ లేదు..అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా ఒదగాల్సిన పసి గుడ్డు.. ఆలనాపాలనకు నోచుకోలేదు.. ఆతల్లికి ఏమైందో.. ఆడ పిల్లనుకుందో...అప్పుడే భారమైందో.. ఏమైందో.. తొమ్మిదినెలలు మోసి..పురిటినొప్పులు భరించి.. ప్రసవ వేదన అనుభవించి..పాలిచ్చి.. లాలించాల్సిన అమ్మ మనస్సు కఠినమైందో.....అరిష్టమనుకున్నారో..అత్తింటి ఆరళ్లు పొత్తిళ్ల నుంచి విడదీశాయో.. తప్పెవరిదని.. ప్రశ్నించలేని తనం.. నేనేంచేశానని నిలదీయలేని హృదయం.. నేనెవరినని చెప్పుకోలేక..నన్నెందుకు వదిలేస్తున్నారని నిలదీయలేక..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. ముళ్లపొదలే ఇళ్లయిన వేళ.. గుక్కపెట్టి ఏడిస్తుంటే.. అటుగా వెళ్లేవారు చూసి అయ్యో‘పాప’ం..అన్నారు.. అక్కున చేర్చుకున్నారు.. ఈహృదయవిదారక ఘటన కదిరి మండలం కాళసముద్రం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. కదిరి అర్బన్: ముళ్లపొదల్లో పడి ఉన్న పసిపాప అరుపులు విని గొర్రెల కాపరులు దగ్గరకు వెళ్లారు. సమాచారాన్ని రూరల్ మండల పోలీసులకు అందించారు. రూరల్ అప్గ్రేడ్ పోలీస్టేషన్ సీఐ నిరంజన్రెడ్డి స్థానిక అంగన్వాడీ సిబ్బంది సహాయంతో చిన్నారని కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాప ఆరోగ్యంగానే ఉందని, జిల్లా కేంద్రంలోని శిశుసదన్కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. పాప ఎడమ చేతికి వేలు లేకుండా పుట్టింది. కాగా, పాప తల్లిదండ్రులు ఎవరు, ఇక్కడ ఎందుకు వదిలేశారనే విషయం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
సమస్య తీరదు
పనులు పూర్తి కావు.. సోమందేపల్లి: జాతీయ రహదారి 44కు అనుబంధంగా హిందూపురం మీదుగా బెంగళూరుకు వెళ్లే మార్గంలో సోమందేపల్లి మండలం చాకర్లపల్లి రైల్వే గేట్ వద్ద చేపట్టిన ఆర్ఓబీ పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా తరచూ రైల్వే గేటు పడుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి రోగులను తరలించే అంబులెన్స్లు సైతం రైల్వే గేట్ పడినప్పుడు అర గంటకు పైగా ఆపేయాల్సి వస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితి విషమించి ఆస్పత్రికి చేరేలోపు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం. ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు.. 2019 ఎన్నికల సమయంలో రూ.5 కోట్లతో చాకర్లపర్లి రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో కొంత మేర పనులు చకచకా సాగాయి. ఏడాదిన్నరగా పనులు ముందుకు సాగడం లేదు. దీనిపై రైల్వే అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించకపోవడంతో రోజురోజుకూ ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. స్ధానికంగా పార్లమెంట్ సభ్యుడు బి.కె పార్ధసారథి, మంత్రి సవిత ఉన్నా... పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్తో పాటు గూడ్స్ రైళ్లు దాదాపు 50కు పైగా ఈ గేట్ మీదుగా సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో రైలు వస్తున్న ప్రతిసారీ 15 నిమిషాల నుంచి అరగంటకు పైగా గేట్ వేసేస్తున్నారు. ఇలాంటి సమయంలో అత్యవసర పనిపై బయలుదేరిన వారు రైల్వే గేట్మెన్తో వాగ్వాదానికి దిగుతుంటారు. ఇటీవల గేటు పడడంతో మంత్రి సవిత కాన్వాయ్ చిక్కుకుపోయింది పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారుల విస్తరణలో భాగంగా రైల్వే లైన్ వద్ద చేపట్టిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు ఆరేళ్లుగా అసంపూర్తి పనులతో చాకర్లపల్లి రైల్వే గేట్ వద్ద ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. నత్తనడకన చాకర్లపల్లి ఆర్ఓబీ నిర్మాణం గేట్ పడితే గంటల కొద్దీ ట్రాఫిక్కు అంతరాయం సమస్య పరిష్కారించాలి సుదీర్ఘకాలంగా రైల్వే గేటు సమస్య తీరడం లేదు. రైల్వే అధికారులు స్పందించి ఆర్ఓబీ పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి. గంటల తరబడి గేటు పడుతుండడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – గంగమ్మ, ఎంపీపీ, సోమందేపల్లి పాలకులు చొరవ తీసుకోవాలి ఆరేళ్లుగా నత్తనడకన రైల్వే ఆర్ఓబీ పనులు సాగుతున్నాయి. రోజూ గేటు పడితే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి చొరవ తీసుకుని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – జావీద్, న్యాయవాది, సోమందేపల్లి -
రైతులను బెంబేలెత్తిస్తున్న విషసర్పాలు
పుట్టపర్తి అర్బన్: పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ విషసర్పాలు సంచరిస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న, రాగి తదితర పంటల్లో పాముల బెడద ఎక్కువగా ఉన్నట్లుగా రైతులు వాపోతున్నారు. పొలాల్లో సంచరిస్తున్న ఎలుకల కోసం వచ్చే పాములు బీడు భూముల్లో పొదల మాటున దాగుంటున్నాయని, ఆదమరచి అటుగా వెళితే కాటేస్తున్నాయని అంటున్నారు. పాముకాటుకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడం చాలా ఇబ్బంది ఉంటోందని వాపోతున్నారు. ముఖ్యంగా కంటికి చిన్నగా కనిపించే జెర్రీ సైతం కాటేస్తే శరీరం మొత్తం ఎర్రబారి మంటలెక్కి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీ విద్యార్థినులకు కలెక్టర్ ప్రశంస పరిగి/తాడిమర్రి/ప్రశాంతి నిలయం: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై న పరిగి, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లిలోని కేజీబీవీ విద్యార్థినులను సోమవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ను కలిసిన వారిలో పరిగి కేజీబీవీ విద్యార్థినులు ఆర్. మానస (కబడ్డీ), లాస్య ప్రియ(రగ్బీ), హర్దిని (హ్యాండ్బాల్), పవిత్ర (హ్యాండ్బాల్), ఎస్ఓ రమాదేవి, పీఈటీ అశ్విని, తాడిమర్రి కేజీబీవీ విద్యార్థినులు ఎస్.స్వాతి (బేస్బాల్), ఎస్ఓ వాణిశ్రీ, తదితరులు ఉన్నారు. పరిష్కార వేదికకు 80 వినతులుపుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ,లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ ఇస్మాయిలపాల్గొన్నారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా వెంకటరమణయ్య కర్నూలు(అగ్రికల్చర్): ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా డిప్యుటేషన్పై కర్నూలు జిల్లా డ్వామా పీడీ పి.వెంకటరమణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖలో డివిజినల్ డెవలప్మెంటు ఆఫీసర్గా ఉన్న ఆయన గత ఏడాది నవంబరు 20 నుంచి డ్వామా పీడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల శిక్షణ కోసం విశాఖపట్నం వెళ్లారు. జనవరిలో మిల్లెట్ మేళాఅనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థల ఫోరం ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ ఓ.ఆనంద్ విడుదల చేసి, మాట్లాడారు. సహజ వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, స్థానిక వినియోగంపై దృష్టి సారించి మిల్లెట్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎకాలజీ సెంటర్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లావ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీమల్లారెడ్డి, టింబక్టు ప్రతినిధి శ్రీకాంత్, రెడ్స్ డైరెక్టర్ భానూజా, తదితరులు పాల్గొన్నారు. -
ఆశా వర్కర్ల సమస్యలకు అధికారులే కారణం
పుట్టపర్తి అర్బన్: ఆశావర్కర్ల సమస్యలు నెరవేరకపోవడానికి వైద్యాధికారులే కారణమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వైద్య సిబ్బంది కూడా ఇష్టానుసారంగా విధులు కేటాయిస్తూ ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఒక్కోసారి నాలుగు రకాల సర్వేలు చేయాలంటూ ఒత్తిళ్లు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల విషయంగా ఇబ్బంది పడుతున్న ఆశాలకు న్యాయం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,700 మంది ఆశావర్కర్లు ఉన్నారని వీరికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎంహెచ్ఓకు అందజేశారు. డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా -
ఘనంగా కేంద్రీయ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం
గోరంట్ల: మండలంలోని పాలసముద్రం వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయలో ఆ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాసిన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్రెడ్డి హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయ తమ క్యాంపస్లో ఏర్పాటు కావడం మంచి పరిణామమన్నారు. ప్రిన్సిపాల్ బట్నా కృష్ణారావు మాట్లాడుతూ.. 1963లో ఏర్పాటైన కేంద్రీయ విద్యాలయ ప్రస్థానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఐదో తరగతి విద్యార్థినులు శ్రీకాంత్రెడ్డి రక్తాన్ని సేకరించి పరీక్షలు నిర్వహించి ‘0’ పాజిటివ్గా నిర్ధారించడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శివాంగి, అనామికా, షీమా, నసీమా, బల్కిస్, భాగ్యలక్ష్మి, లక్ష్మీదేవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడి
కనగానపల్లి: మండలంలోని వేపకుంట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త దివిటి రమణపై స్థానిక టీడీపీ నాయకుడు చండ్రాయుడు దౌర్జన్యానికి తెగబడ్డాడు. బాధితుడు రమణ తెలిపిన మేరకు... గ్రామంలోని టీడీపీ నాయకుడు చండ్రాయుడు, రమణకు పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు పొలాల గట్లకు అనుకుని గాలిమరల స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కేవలం చండ్రాయుడుకు మాత్రమే పరిహారం మంజూరు కావడంతో తన పొలానికి ఆనుకుని స్తంభాలు ఏర్పాటు చేయకూడదని సోమవారం పొలం వద్ద పనులను రమణ అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న చండ్రాయుడు అక్కడకు చేరుకుని దాడిచేయడంతో రమణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ విషయంపై సాయంత్రం ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేత ఫిర్యాదును మాత్రమే పోలీసులు స్వీకరించి, తన ఫిర్యాదును తిరస్కరించారని బాధితుడు వాపోయాడు. -
ఇంధన పొదుపు సామాజిక బాధ్యత
పుట్టపర్తి టౌన్: భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవిన విధానం అందించాలంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును నిత్య జీవితంలో ఓ భాగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో సోమవారం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. ఇంధన పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అవసరం మేరకే విద్యుత్ను వాడాలన్నారు.సోలార్ గృహోపకరణాలతో ఈ సమస్యను అధిగమించవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్సీడీసీఎస్ ఎస్ఈ సంపత్కుమార్, డీఈ శివరాం, కమిషనర్ క్రాంతికుమార్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
బైక్ ఢీకొని వైఎస్సార్సీపీ నేత మృతి
పుట్టపర్తి టౌన్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో వైఎస్సార్సీపీ నేత మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం సిద్ధరాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత నేలకోటప్ప(69), సిద్ధరాపురం సర్పంచ్ రమణయ్య సోమవారం ఉదయం పుట్టపర్తిలో జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొనేందుకు స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యంలో బుక్కపట్నం చేరుకోగానే రోడ్డు పక్కన వాహనాన్ని ఆపారు. అదే సమయంలో తలుపుల మండలం అపిలేపల్లి గ్రామానికి చెందిని మల్లికార్జున కొత్తచెరువు వైపు నుంచి ముదిగుబ్బకు పల్సర్ బైకుపై వెళుతూ స్యూటీని ఢీకొనడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన రమణయ్య, నేలకోటప్పను స్థానికులు వెంటనే సత్యసాయి సూపర్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో నేలకోటప్ప మృతి చెందాడు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న పుట్టపర్తి వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుడు రమణయ్యను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో మార్చురీకి చేర్చిన నేలకోటప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. -
హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
మడకశిర రూరల్: జిల్లాలో విలువైన ఖనిజ సంపదను గుర్తించేందుకు వీలుగా చేపట్టనున్న టైమ్ డొమైన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ (టీడీఈఎం) సర్వేకు సంబంధించి హెలికాఫ్టర్ టేకాఫ్, రాత్రి పార్కింగ్కు అనువైన స్థలం కోసం మడకశిర మండలం కల్లుమర్రిలోని జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానాన్ని అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ నెల 20 నుంచి 2026, మే 31 వరకు ఈ సర్వేను భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఔట్సోర్స్ ఏజెన్సీ ద్వారా హెలిబోర్న్ సర్వే చేపట్టనున్నారు. స్థల సరిశీలనలో తహసీల్ధార్ కల్యాణ చక్రవర్తి, ఆర్అండ్బీ డీఈ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. జనవరి ఒకటి నుంచి రైళ్ల రాకపోకల్లో మార్పు అనంతపురం సిటీ: అనంతపురం మీదుగా సంచరించే పలు రైళ్ల రాకపోకల వేళలు జనవరి ఒకటి నుంచి మారనున్నాయి. ఈ మేరకు అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్కుమార్ సోమవారం రాత్రి వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు (22231) ఇక నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు అనంతపురానికి ఉదయం 10.03 గంటలకు అనంతపురానికి చేరుకుని 10.05 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే ఎక్స్ప్రెస్ (22232) అనంతపురానికి 5.33కు వచ్చి 5.35 గంటలకు బయలుదేరుతుంది. ఽయశ్వంత్పూర్–మచిలీపట్నం మధ్య నడిచే రైలు (17212) అనంతపురానికి సాయంత్రం 4.33 గంటలకు వచ్చి 4.44 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ (18464) సాయంత్రం 6.28 గంటలకు అనంతపురానికి వచ్చి 6.30 గంటలకు వెళ్లిపోతుంది. శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లం బయలుదేరే రైలు (07127) అనంతపురానికి ఆయా తేదీల్లో సాయంత్రం 7.53 గంటలకు వచ్చి 7.55 గంటలకు వెళ్లిపోతాయి. ఈ రెండు రైళ్లు అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పాకాల, కాట్పాడి మీదుగా కొల్లం జంక్షన్కు చేరుకుంటాయి. -
పత్తి కొనుగోలులో కొర్రీలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు మందగించాయి. మార్కెటింగ్శాఖ సహకారంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో వారంలో ఒక్క రోజు మాత్రమే కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ)తో కొనుగోళ్లు చేస్తున్నారు. అది కూడా కేవలం అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్యార్డులో మాత్రమే చేపట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది. నాణ్యత లేదంటూ.. గతంలో తాడిపత్రి, గుత్తి కేంద్రాల ద్వారా వారంలో ఐదు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను చేపట్టేవారు. అయితే ఈ సారి కేవలం గుత్తికి మాత్రమే పరిమితం చేసి అందులోనూ ఒక్కరోజు మాత్రమే కొనుగోలు చేస్తుండటం విశేషం. పత్తి పొడవు రకం క్వింటా రూ.8,110 తో మద్ధతు ధర ఖరారు చేసినా... తేమ శాతం, పరిపక్వత (మైక్రోనైర్), రంగు మారడం, దుమ్ము, ధూళి పేరుతో ఎంఎస్పీ కన్నా తక్కువ ధర చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రధానంగా నిబంధనల మేరకు 8 శాతం తేమ ఉన్న వాటికి ఎంఎస్పీ ఉంటుంది. ఆ పై ప్రతి ఒక శాతం పెరుగుదలకు ఒక శాతం చొప్పున రేటు తగ్గిస్తున్నారు. శుభ్రంగా ఉంటేనే తీసుకురండి.. పత్తిని బాగా ఆరబెట్టి శుభ్రంగా ఉన్నదానిని మాత్రమే మార్కెట్కు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. తడిసిన పత్తి, రంగుమారినది, చెత్తాచెదారం ఉన్నది, గుడ్డి, పురుగుపట్టినది, నీళ్లు చల్లినది, పాత పత్తి, ముడుచుకుపోయినది తీసుకురావద్దని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా బ్యాంకు పాస్పుస్తకం, ఆధార్తో పాటు మొదట శ్యాంపిల్గా తీసుకువస్తే... ప్రతి బుధవారం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వారంలో ఒక్కరోజే కొనుగోలు చేస్తామంటున్న అధికారులు గుత్తిలో ప్రతి బుధవారం కేంద్రం నిర్వహణ నాణ్యత పేరుతో ఎంఎస్పీ కంటే తక్కువ ధర చెల్లింపు -
అమరజీవి త్యాగం మరువలేనిది
● పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో పొట్టి శ్రీ రాములు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులయ్యారన్నారు. ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వ అధికారులు అందరూ పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సేవలో నిబద్ధత, నిజాయతీ, బాధ్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాపై రైతుల ధర్నా రొద్దం: మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..ఇసుక అక్రమ రవాణా వల్ల పెన్నానది రూపురేఖలు కోల్పోయిందన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలించడం వల్ల భూగర్భజలం తగ్గి తమ బోర్లు ఒట్టిపోయాయన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే తమపైనే దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. అనంతరం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో చిన్నమంతూరు రామంద్రారెడ్డి, రామాంజి, సూరి, తిమ్మయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు. కలుషిత ఆహారం.. విద్యార్థినులకు అస్వస్థత నల్లచెరువు: స్థానిక కేజీబీవీలో ఈ నెల 9వ తేదీన కలుషిత ఆహారం తిని ముగ్గురు ఇంటర్ విద్యార్థిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... స్థానిక కేజీబీవీలో 230 మందికిపైగా విద్యార్థినులు ఉన్నారు. ఈ నెల 9వ తేదీన నవిత, సమంత, ఉషారాణి రోజూలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపక్రమించారు. భోజనం సగం తిన్నాక ఒక రకమైన వాసన రావడంతో మధ్యలోనే వదిలేసి పాఠశాల ఎస్ఓకు చెప్పగా... ఆమె హుటాహుటిన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయితే విషయం బయటకు రాకుండా ఉండేందుకు ముగ్గురు విద్యార్థినులను అదేరోజు ఇళ్లకు పంపించినట్లు సమాచారం. వీరిలో నవిత అనే బాలిక కోలుకుని సోమవారం పాఠశాలకు వచ్చింది. మిగతా ఇద్దరు విద్యార్థినులు ఇంటి వద్దే చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. ఈ విషయంపై ఎస్ఓ శిరీషను వివరణ కోరగా... ఈ నెల 9వ తేదీన ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం పెట్టించుకుని.. సాయంత్రం వరకూ ప్లేట్ మూసి ఉంచారన్నారు. అందువల్లే భోజనం వాసన వచ్చిందన్నారు. అయినప్పటికీ విషయం తెలియగానే వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష చేయించానన్నారు. వైద్యులు కూడా వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు చెప్పలేదన్నారు. -
‘కోటి’ గొంతుకల గర్జన
సాక్షి, పుట్టపర్తి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఉద్యమం’ ర్యాలీ విజయవంతమైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా సేకరించిన లక్షలాది సంతకాల పత్రాలను విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పుట్టపర్తిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాల పత్రాల వాహనానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ జెండా ఊపారు. అనంతరం స్థానిక గణేష్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు భారీ జన సందోహం మధ్య సాగింది. దారి పొడవునా ‘జై జగన్’ నినాదాలతో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉషశ్రీచరణ్తో పాటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్, మాజీ మంత్రి నర్సేగౌడ, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, సీనియర్ నేతలు పూల శ్రీనివాసరెడ్డి, వజ్రభాస్కర్రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, వేణురెడ్డి, పురుషోత్తంరెడ్డి, ప్రణీత్రెడ్డి, రమేశ్ నాయక్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా ప్రభంజనం ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి పట్టణంలో ఉదయం నుంచి కోలాహలం నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి భారీ కాన్వాయ్లో నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తికి చేరుకున్నారు. దీంతో గణేష్ సర్కిల్ నుంచి పార్టీ కార్యాలయం వరకు సందడి నెలకొంది. అనంతరం సంతకాల పత్రాల బాక్సులను వాహనంలోకి ఎక్కిస్తుండగా... బండిళ్లు మోసేందుకు యువత ఉత్సాహం చూపించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండాలతో ర్యాలీలో కదం తొక్కారు. దారి పొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇది ప్రభుత్వానికి హెచ్చరిక.. ప్రజలు చేసిన ప్రతి సంతకం ప్రభుత్వానికి ఇచ్చే శక్తివంతమైన హెచ్చరిక అని ఉషశ్రీచరణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పార్టీలకు అతీతంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని భారీ సంఖ్యలో సంతకాలు చేశారన్నారు. ప్రజల ఆరోగ్య హక్కు కోసం జగనన్న తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసం ప్రైవేటీకరణలోకి నెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జగనన్న హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలై వాటిలో 7 పూర్తవగా, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు జరిగాయన్నారు. మిగతా కాలేజీల పనులు వివిధ దశల్లో ఉన్నప్పటికీ వాటిని పీపీపీ పేరిట ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు సిద్ధం కావడం అన్యాయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో 2,450 మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందే.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్నింటినీ పూర్తి చేసి ప్రభుత్వమే నడపాలన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు కావడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విరమించుకోవాల్సిందే.. తన బినామీలను బాగుపర్చేందుకే చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని.. హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి లక్షలాది మంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలనుంచి సేకరించిన సంతకాల పత్రాలను తాడేపల్లికి పంపుతున్నామని, వీటిని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేస్తారన్నారు. స్వచ్ఛందంగా మద్దతు తెలిపి నినదించిన ప్రజానీకం పుట్టపర్తి పురవీధుల్లో మార్మోగిన ‘జై జగన్’ నినాదం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతులు విజయవాడకు తరలింపు పుట్టపర్తిలో జన ప్రభంజనం మెడికల్ కళాశాలలప్రైవేటీకరణపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు గణేష్ సర్కిల్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఉషశ్రీచరణ్ జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పుట్టపర్తిలో కదం తొక్కారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు సిద్ధమైన చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుట్టేలా రణన్నినాదం చేశారు. వైఎస్సార్ సీపీ జెండాలు చేతబట్టుకుని తమ అండ ఇదేనంటూ గొంతెత్తి చాటారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నిర్వహించిన ర్యాలీలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా కదలి వచ్చి గర్జించారు. సీఐ శివాంజనేయులు దురుసు ప్రవర్తన ప్రజా ఉద్యమంలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీ ప్రారంభమయ్యే వరకు పార్టీ కార్యాలయం గేటు దాటి రాకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రోడ్లపై తిరిగేందుకు మీకు పర్మిషన్ ఇవ్వలేదు.. కాదు.. కూడదంటే కేసులు నమోదు చేస్తా’’ అంటూ హెచ్చరించారు. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ర్యాలీ చేస్తే కేసులు నమోదు చేస్తారా? పర్మిషన్ ఇచ్చాకే ర్యాలీ చేసేందుకు వచ్చామని సమాధానం ఇచ్చారు. -
బాల్యానికి మాదీ భరోసా
● బాల్య వివాహాలు చేయబోమన్న తల్లిదండ్రులు ● హామీ ఇస్తూ కలెక్టర్కు బాండ్ సమర్పణ ప్రశాంతి నిలయం: చిన్నారుల బంగారు బాల్యానికి మాదీ భరోసా అంటూ పలువురు తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. అంతేకాదు తమ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు చేయబోమని హామీ ఇస్తూ కలెక్టర్కు ఏకంగా బాండ్ సమర్పించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పలువురు బాలికల తల్లిదండ్రులు కలెక్టర్ శ్యాం ప్రసాద్ను కలిశారు. బాల్య వివాహ ముక్త భారత్–100 రోజుల కార్యక్రమం వల్ల బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు తెలిశాయన్నారు. తాము బాల్యవివాహాలు చేయబోమని, ఎక్కడైనా బాల్య వివాహం జరిగినా అడ్డుకుంటామన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ... ‘మేము సైతం’ అంటూ బాల్య వివాహాల నిర్మూలనకు స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
గడువులోపు అర్జీలన్నీ పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలన్నీ నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై ప్రజలు 336 అర్జీలు సమర్పించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం వివిధ శాఖలకు పంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ పెండింగ్లో పెడితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్జీఓ సువర్ణ, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కుట్టు మిషన్లు ఇవ్వలేదు.. బీసీ కార్పొరేషన్ ద్వారా తమకు కుట్టుపై శిక్షణ ఇచ్చినప్పటికీ మిషన్లు, ఇతర ముడి సామగ్రి ఇవ్వలేదని, అంతేకాకుండా రుణాలు సైతం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మోసం చేసిందని మహిళలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్పతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మూడు నెలలు సొంత ఖర్చులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కుట్టు శిక్షణ తీసుకున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని 9 నెలలు పూర్తికావస్తున్నా... ప్రభుత్వం మాత్రం మిషన్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు. అంగన్వాడీల్లో ఆహారం బాగోలేదు.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను అందిస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్ను వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల సరఫరా చేసే కోడిగుడ్లు నిబంధనల మేరకు 50 గ్రాములు ఉండాలని, కానీ 25 గ్రాములే ఉంటున్నాయన్నారు. పాడైపోయిన చిక్కీలను విద్యార్థులకు అందిస్తున్నారని, నాణ్యత లేని సరుకులను సరఫరా చేస్తున్నారన్నారు. సదరు ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని కోరారు. అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశం ‘పరిష్కార వేదిక’కు ప్రజల నుంచి 336 అర్జీలు -
మరో నకిలీ బాగోతం
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్లకు శ్రీసత్యసాయి జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన అంశం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించగా...ఈ కేసు విచారణ కొలిక్కిరాకముందే జిల్లాలోని మరో పంచాయతీ లాగిన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. సదరు పంచాయతీ నుంచి ఏకంగా 1,500 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. జిల్లా అధికారులు గుట్టుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. హ్యాకర్ల పనేనా..? తాజాగా వెలుగు చూసిన 1,500 నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సదరు పంచాయతీ లాగిన్ నుంచే ఇతర రాష్ట్రాల వారికి బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్థానిక అధికారులను జిల్లా అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్న అధికారులు...ఇది హ్యాకర్ల పనేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఇతర రాష్ట్రాల వారే.. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, ఈ బర్త్ సర్టిఫికెట్లు పొందిన వారంతా ఇతర రాష్ట్రాల వారేనని విచారణ అధికారులు గుర్తించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లను పొందినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందిన వారిలో ఎక్కువగా ఒకే సామాజిక వర్గం వారు ఉండడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో గ్రామ పంచాయతీ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై కూడా జిల్లా అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రేపో మాపో పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. హ్యాకర్లే పంచాయతీల లాగిన్లను హ్యాక్ చేసి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు విచారణ అధికారులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హ్యాకర్లు ఇంకెన్ని పంచాయతీ లాగిన్లు హ్యాక్ చేశారో అన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బర్త్ సర్టిఫికెట్ల జారీపై నిఘా.. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి వేలాదిగా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే జిల్లాలోని మరో గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం అందించి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి జారీ అయిన సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని విచారణ అధికారులు తేల్చినట్లు సమాచారం. ఈ ఫేక్ సర్టిఫికెట్లన్నీ కూడా రద్దు చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలోని మరో పంచాయతీ లాగిన్ హ్యాక్! 1,500 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం గుట్టుగా విచారణ చేస్తున్న అధికారులు ఇప్పటికే సంచలనం రేపిన కొమరేపల్లి పంచాయతీ లాగిన్ వ్యవహారం ఏకంగా 3,981 నకిలీబర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు నిర్ధారించిన అధికారులు తాజాగా మరో పంచాయతీలోనూ ఇదే తతంగం -
ఊరూరా ‘బెల్ట్’ దందా
పుట్టపర్తి టౌన్: జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. జిల్లా వ్యాప్తంగా 87 మద్యం దుకాణలేనని ప్రభుత్వం చెబుతున్నా ఊరూరా బెల్ట్ షాపులు తెరిచారు. మారుమూల గ్రామమైనా సరే ఏ సమయంలోనైనా సరే మద్యం మాత్రం అందుబాటులో ఉంటోంది. నిబంధనలకు పాతర ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పరిధిలో 8 కిలోమీటర్ల దూరంలో మద్యం, మాంసం దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. అలాగే విక్రయాలు చేపట్టకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణం నడిఒడ్డున హనుమాన్ సర్కిల్తో పాటు పెద్ద బజార్, గుట్టప్రాంతంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సత్యసాయి సూపర్ ఆస్పత్రి వద్ద ఏకంగా బెల్టు షాపు ఏర్పాటు చేశారు. తాగి ఊగేందుకు బెంచ్లు కూడా ఉంచారు. వివిధ వార్డుల్లోనూ బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దీంతో ప్రశాంతత కోసం పుట్టపర్తికి వస్తున్న విదేశీయులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు జిల్లా వ్యాప్తంగా 8 ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 87 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 80 దుకాణాలు అధికార పార్టీకి చెందిన వారివే. మద్యం దుకాణాలతో పాటు బెల్టు షాపుల్లోనూ బాటిల్పై రూ. 20 నుంచి రూ.30 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. 800 వరకు బెల్ట్ షాపులు జిల్లాలో 87 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రతి మద్యం షాపు పరిధిలో 8 నుంచి 10 బెల్టు షాపులను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. బెల్టు షాపు నిర్వాహకులు రూ.లక్ష డిపాజిట్ చెల్లించి వైన్ షాపుల నుంచి మద్యం తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే తమకు అనుకూలమైన చిల్లర దుకాణాల్లో కూడా మద్యం అమ్ముతున్నారని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 87 మద్యం దుకాణాలకే అనుమతులు ఒక్కో షాపు పరిధిలో 10 దాకా బెల్ట్ షాపులు ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోనూ ఏజోరుగా మద్యం అమ్మకాలు అనుమతులు లేవు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఉన్న దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. బెల్టు షాపులకు అనుమతులు లేవు. ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు. జనావాసాల మధ్య మద్యం అమ్మకాలు జరిపితే స్థానికులు సమాచారం ఇస్తే చర్యలు చేపడతాము. – గోవిందనాయక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి బెల్ట్ షాపుల నిర్వహణపై ఇరు వర్గాల ఘర్షణతలుపుల : మండలంలోని కదిరి –పులివెందుల రోడ్డులో బి.కొత్తపల్లి వద్ద బెల్ట్ షాపుల నిర్వహణపై హోటల్ నిర్వాహకులు ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాయపడిన బయపురెడ్డి, శీలమ్మను 108 అంబులెన్స్లో కదిరికి తరలించారు. -
కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం మెడికల్: పారిశుధ్య కార్మికుల ఆందోళనతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 50 ఏళ్లు దాటిన వారు విధుల్లోకి రావొద్దంటూ పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డి అల్టిమేటం జారీచేయడమే కాకుండా వారి స్థానాల్లో కొత్త కార్మికులను తీసుకున్నారు. దీంతో ఆదివారం పారిశుధ్య కార్మికులు, ఏజెన్సీ మేనేజర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్త కార్మికులను పనిచేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. కార్మికులను బయటకు పంపారు. ఇక్కడికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో పారిశుధ్య కార్మికులు సర్వజనాస్పత్రి ముందు బైఠాయించారు. చివరకు పోలీసులు 16 మంది మహిళా పారిశుధ్య కార్మికులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న తమను విధుల్లోకి తీసుకోకపోగా అరెస్టు చేస్తారా అంటూ కార్మికులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. మాలాంటోళ్లని ఇంత ఇబ్బంది పెడుతున్నారేంటంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల అరెస్టును వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నాయకులు రామిరెడ్డి, ఏటీఎం నాగరాజు, ముర్తుజా, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఖండించారు. సమస్యను ఎస్పీ జగదీష్, డీఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం కార్మికులను పోలీసులు విడిచిపెట్టారు. 50 ఏళ్లు దాటిన వారిని విధుల్లోకి తీసుకోని ఏజెన్సీ మేనేజర్లు ఆందోళనకు దిగిన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తవారిని ఇప్పుడే తీసుకోవద్దు పారిశుధ్య కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకు కొత్తవారిని ఇప్పుడే విధుల్లోకి తీసుకోకూడదని, సర్వజనాస్పత్రిలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు సాయితేజారెడ్డి, హరిలను ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశించారు. ఆదివారం ఆర్డీఓ తన కార్యాలయంలో ఏజెన్సీ మేనేజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. రెండు నెలలుగా ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అందరి ముందూ అవమానపరుస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎవ్వరూ తమ పట్ల ఇంత దురుసుగా వ్యవహరించలేదన్నారు. ఆర్డీఓ స్పందిస్తూ ఏజెన్సీ కాంట్రాక్టర్ తక్షణం తమను కలవాలని మేనేజర్లకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
కారు ఢీకొని మహిళ మృతి
ధర్మవరం రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం తుంపర్తి కాలనీలో నివాసముంటున్న మల్లేశ్వరమ్మ (50) కుమారుడు శివ అయ్యప్ప స్వామి మాల వేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కోనమల్లేశ్వరస్వామి సన్నిధిలో నిద్ర చేయాలని నిర్ణయించుకున్న వారు సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లారు. కాలనీ నుంచి రోడ్డుపైకి చేరుకోగానే పుట్టపర్తి వైపు ఽ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు డీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి, కుమారుడిని స్థానికులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లేశ్వరమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన శివకు చికిత్స అందజేశారు. ఘటనపై ధర్మవరం రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుల బైక్ వీలింగ్.. పాత్రికేయుడిపై దాడిలేపాక్షి: స్థానిక జాతీయ రహదారిపై హిందూపురానికి చెందిన కొందరు యువకులు బైక్ వీలింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళుతూ వీలింగ్ చేస్తున్న యువకులను స్థానిక పాత్రికేయుడు ఒకరు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేశాడు. ఆలయ దర్శనానికి వచ్చే పర్యాటకులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలకబోతుండగా అప్పటికే మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. ‘మా ఇష్టం. అడగడానికి నీవెవ్వరు? పోలీసులే మమ్మల్ని ఏమీ అనడం లేదు. నీవెంత? వచ్చేవారు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారు’ అంటూ దాడికి తెగబడ్డారు. సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో పాత్రికేయుడి బైక్ తాళాన్ని లాక్కొని ఉడాయించారు. కొట్నూరు, చోళసముద్రం, గలిబిపల్లి క్రాస్ నుంచి లేపాక్షి పిల్లిగుండ్ల కాలనీ వరకూ రోజూ కొందరు యువకులు బైక్ రేసింగ్, వీలింగ్లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
సందర్భం నేడు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే
దేశంలో నాణ్యమైన విద్యను అందించే సంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలు గుర్తింపు పొందాయి. తమ పిల్లలను ఈ విద్యా సంస్థల్లో చేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఏటా అడ్మిషన్లు పొందేందుకు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాకు తలమానికంగా ఉన్న నాసిన్లో ఏర్పాటైన విద్యాలయలో సోమవారం నిర్వహించనున్నారు. గోరంట్ల: చక్కటి విద్య, మంచి అలవాట్లు, సమానత్వం వంటి నైతిక విలువలను పెంపొందిస్తూ విద్యార్థులను ఉన్నత స్థానానికి ఎగబాకేలా చేయడంలో కేంద్రీ విద్యాలయ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. గోరంట్ల సమీపంలోని పాలసముద్రం వద్ద నాసిన్లో ఏర్పాటైన కేంద్రీయ విద్యాలయ... ప్రారంభమైన ఆరు నెలల్లోనే ఉత్తమ విద్యాబోధనతో తన ప్రత్యేకతను చాటుకుంది. ఎలాంటి అభద్రత, అసౌకర్యాల భావన లేకుండా విద్యార్థులు ఒక పద్దతిని పాటిస్తూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 1 నుంచి 5వ తరగతివరకూ ఒక్కో తరగతికి 40 మంది చొప్పున 200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మార్నింగ్ అసెంబ్లీతో మొదలై.. ఉదయం 8.40 గంటలకు అసెంబ్లీ నిర్వహణతో కేంద్రీయ విద్యాలయ ప్రారంభమై మధ్యాహ్నం 2.40 గంటలకు ముగుస్తుంది. ప్రత్యేక రోజుల్లో అందుకు అనుగుణంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్తుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా క్రీడలు, యోగా, సంగీతం లాంటి అంశాల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నిరంతర విద్య, క్రీడలలో లీనమవ్వడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతోంది. ఆధునిత సాంకేతికత, నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు, ఒలంపియాడ్ కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. డిజిటల్ ల్యాబ్లు, స్మార్ట్ తరగతి గదులు, విద్యార్థి క్లబ్లు ఏర్పాటు చేసి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు. పాఠశాలలో నాలుగు హౌస్లు ఏర్పాటు చేసి వ్యక్తిత్వ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపునకు చర్యలు తీసుకున్నారు. మార్నింగ్ అసెంబ్లీకి హాజరైన విద్యార్థులు తరగతి గదిలో పాఠాలు వింటూ జిల్లాకు తలమానికంగా సెంట్రల్ స్కూల్ ఏర్పాటు మెరుగైన విద్యతో ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాలవిలువలతో కూడిన విద్య పిల్లల అభ్యసన సామర్థ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు, సామూహిక భావన వంటివి పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, రాజ్యాంగ విలువలు నేర్పిస్తున్నాం. సృజనాత్మకత పెంపొందేలా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాల నుంచి విద్యార్థి బయటకు వెళ్లే సమయానికి వారి జీవన గమనానికి పునాదులు బలంగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – బట్నా కృష్ణారావు, ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయ, పాలసముద్రం -
ర్యాలీని జయప్రదం చేయండి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పుట్టపర్తి టౌన్/పెనుకొండ రూరల్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులతో సోమవారం నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ ప్రతులను ఇప్పటికే పుట్టపర్తిలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేర్చామని తెలిపారు. సంతకాల ప్రతులతో సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మీదుగా మామిళ్లకుంట క్రాస్ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని నియోజవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిశీలకులు రమేష్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని వారు కోరారు. నేడు డయల్ యువర్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు నేరుగా 89777 16661 నంబర్కు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఫోన్ చేయాలని సూచించారు. నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈ సమర్పించుకోవచ్చన్నారు. ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో తెలియజేవచ్చని సూచించారు. అర్జీదారులు ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. అరటి తోటలో కొండచిలువపుట్లూరు: కుమ్మనమల సమీపంలోని అరటి తోటలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. అంకన్న అనే రైతు తన అరటి తోట వద్దకు వెళ్లిన సమయంలో ఎనిమిది అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ ఏదో జంతువును మింగేసి కదలలేని స్థితిలో కనిపించింది. వెంటనే ఆయన తోటి రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కాసేపటికి అక్కడకు చేరుకున్న రైతులు అరటి తోటల్లో ఇలాంటి కొండచిలువ ఉంటే ప్రమాదమని భావించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వచ్చి కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలేశారు. ముదిగుబ్బ రైల్వేగేటు మూసివేత ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని రైల్వే గేటును మరమ్మతుల కారణంగా ఈనెల 16, 17 తేదీల్లో మూసివేస్తున్నట్లు ఎస్ఎస్ఈ శివం మాతూర్ ఒక ప్రకటనలో తెలిపారు. కదిరికి వెళ్లే వాహనదారులు బైపాస్ మీదుగా, పుట్టపర్తికి వెళ్లే వారు పాతూరు గేటు నుంచి వెళ్లాలని సూచించారు. -
ఉపాధ్యాయుడి దుర్మరణం
ఓడీచెరువు(అమడగూరు): ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ముదిగుబ్బకు చెందిన హరికృష్ణ (36) అమడగూరు మండలం జవుకలకొత్తపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిపై కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన ఆయన అక్కడ పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అమడగూరు సబ్ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మహమ్మదాబాద్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుమతి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, హరికృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్కు పురస్కారాలు
గుంతకల్లు: ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్కు జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రంతోపాటు వసతి గృహం, డివిజన్ పరిధిలోని రాయచూర్ రైల్వేస్టేషన్ విద్యుత్ను ఆదా చేసి జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం జరిగిన బహుతుల పంపిణీ కార్యక్రమంలో ‘2025 నేషనల్ ఎనర్జీ కన్వర్షన్’ అవార్డును డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రం, వసతి గృహం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ రాష్ట్రపతి దౌప్రదిముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. రాయచూర్ రైల్వేస్టేషన్ ‘ఉత్తమ ఇంధన పొదుపు రైల్వేస్టేషన్’ అవార్డును కేంద్ర మంత్రి మనోహర్లాల్ చేతుల మీదుగా డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీనిబాష్ సంయుక్తంగా అందుకున్నారు. షీల్డ్తోపాటు రూ.10 లక్షల నగదు పురస్కారం అందజేసినట్లు వారు తెలిపారు. -
జీఎంసీల్లో ఫిజియోథెరపీ కోర్సు
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అనంతపురం మెడికల్: రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)ల్లో ఫిజియోథెరపీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతపురంలోని కస్తూరి ఫిజియోథెరపీ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేసి, మాట్లాడారు. కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బెన్డెక్ట్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
ఘనంగా కనకదాస జయంత్యుత్సవం
చిలమత్తూరు: హిందూపురంలోని మోతుకపల్లిలో భక్త కనకదాస జయంత్యుత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక జ్యోతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గొరవయ్యల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కురుబలు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కారు ఢీ – విద్యార్థులకు తీవ్ర గాయాలుఓడీ చెరువు: కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఓడీచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న భార్గవ్ (8వ తరగతి), నరసింహ (9వ తరగతి) ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నారు. ఆదివారం భోజనాలు తీసుకుని వచ్చేందుకు అయ్యప్పస్వామి ఆలయం వద్దకు హాస్టల్ సిబ్బందికి చెందిన స్కూటీలో వెళుతుండగా ఎం.కొత్తపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన భార్గవ్, నరసింహను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, కొన్ని రోజులుగా హాస్టల్లో విద్యార్థులకు భోజనాలు సిద్ధం చేయకుండా సమీపంలోని ఆలయం వద్ద పెడుతున్న ఆహారాన్ని సమకూరుస్తున్నట్లుగా సమాచారం. దుకాణంలోకి దూసుకెళ్లిన బస్సుహిందూపురం: స్థానిక బెంగళూరు రోడ్డు లోని బోయపేటలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సెల్ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి ఆత్మహత్య రొద్దం: మండలంలోని లక్సానిపల్లికి చెందిన నారాయణప్ప(79) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా తీవ్ర అనార్యోగంతో బాధ పడుతున్న ఆయన జీవితంపై విరక్తితో ఆదివారం శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు పెనుకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అవమానించాడని హతమార్చారు
● రైతు హత్య కేసులో వీడిన మిస్టరీ ● ముగ్గురి అరెస్ట్.. నిందితులందరూ కర్ణాటక వాసులే ● వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: మూడు నెలల క్రితం అమడుగూరు పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న రైతు హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. కర్ణాటకలోని చిక్బళ్లాపురం జిల్లా బాగేపల్లి తాలూకా హెబిలిదేవరవంక గ్రామానికి చెందిన రైతు ముత్తప్ప తన అన్న కుమార్తెతో కర్ణాటకలోని చామాలవారిపల్లికి చెందిన సోమశేఖర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సోమశేఖర్ను ముత్తప్ప చెప్పుతో కొట్టించాడు. ఈ అవమానాన్ని తాళలేని సోమశేఖర్ అప్పటికే ముత్తప్పతో భూతగాదా ఉన్న బాగపల్లి తాలూకా కొత్తూరుకు చెందిన రైతు సురేష్తో జత కట్టాడు. అనంతరం ఇద్దరూ కలసి ఎలాగైనా ముత్తప్పను హతమార్చాలని నిర్ణయించుకుని బాగేపల్లి తాలూకా బోయపల్లికి చెందిన ఆనంద్ సహకారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 3న అమడగూరు మండలం ఆకులవారిపల్లి శివారున టమాట పంట వద్ద కాపలాకు వెళ్లిన ముత్తప్పను దారుణంగా హతమార్చి ఉడాయించారు. ఘటనపై ముత్తప్ప భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమడగూరు పీఎస్ పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించి, ఆదివారం ఉదయం ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నరేంద్రరెడ్డి, ఓడీచెరువు పీఎస్ సిబ్బంది లోకేశ్వర్రెడ్డి, కరుణాకర్రెడ్డిని అభినందించారు. విద్వేషాలు రెచ్చగొడుతూ పోస్టింగ్ నల్లచెరువు: విద్వేషాలు రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు నల్లచెరువు గ్రామ యువకులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు రెండేళ్ల క్రితం మతం మారి తన పేరును షేక్ మహమ్మద్ ఆసీఫ్గా మార్చుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేస్తూ వివాదాలకు తెరలేపాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ మక్బూల్బాషాకు ఆదివారం స్థానిక యువకులు ఫిర్యాదు చేశారు. -
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న పాలకులు
అనంతపురం: ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను పాలకులు హరిస్తున్నారని, చివరకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి తిండి తినాలి అనే అంశాలను కూడా పాలకులు నిర్ణయిస్తున్నారని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు విమర్శించారు. అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్ అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంయుక్తంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ ’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యత పొందిన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం పలికిన వ్యక్తికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించడం చూస్తే మనం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నామో అర్థం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను పాలకులు గాలికొదిలేసి.. ప్రభుత్వ సంస్థల పేర్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు రోజ్గార్ యోజనగా మార్చేందుకు బిల్లు ప్రవేశపెట్టారన్నారు. నెహ్రూ లైబ్రరీని ప్రధానమంత్రి లైబ్రరీగా, ఔరంగాబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా, ఇస్లామిక్ నగర్ను ఈశ్వర్నగర్గా మారుస్తున్నారన్నారు. ఉన్న పేర్లను తీసేసి కొత్త పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వందేమాతరాన్ని కూడా రాజకీయం చేశారన్నారు. బ్రిటిషర్లతో పోరాడి ఉరి తీయబడిన వారి పేర్లు అండమాన్ విమానాశ్రయానికి పెట్టకుండా.. బ్రిటీషర్లను క్షమించమని కోరిన సావర్కర్ పేరు పెట్టారని విమర్శించారు. సావర్కర్ పేరుతో ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోనే బీజేపీ అతి సంపన్న పార్టీ అన్నారు. రూ.10,070 కోట్లు అధికారికంగా కలిగి ఉందన్నారు. ఇదంతా కార్పొరేట్ల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు అన్నారు. ఇలాంటి బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, అక్రమమని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. బీజేపీ ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా అలాగే ఎందుకు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీని ఉపయోగించుకుని బీజేపేతర పార్టీ నాయకులపై కేసులు పెడుతూ.. చట్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై బూటు విసిరిన లాయర్ను కనీసం అరెస్ట్ కూడా చేయలేదన్నారు. న్యాయవ్యవస్థ పెద్ద ప్రమాదంలో పడిందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. న్యాయ వ్యవస్థను రక్షించుకోకపోతే అన్యాయం రాజ్యమేలుతుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, లౌకితత్వాన్ని కాపాడుకునేందుకు ఆయా శక్తులను అధికారం నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఐలు జాతీయ నాయకులు నర్రా శ్రీనివాసరావు, ఎస్కేయూ న్యాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎ.చంద్రశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ వంశీకృష్ణ, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పి.ప్రసూన, డాక్టర్ హేమలత, నరసింహులు, వెంకటస్వామి, ఐలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీ చిత్తప్ప, కే వీరరాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాలి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు -
చలి పంజా
చెన్నేకొత్తపల్లి వద్ద పొగ మంచుతో నిండిన రహదారి 0000000000అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ఈ నెల 8న ఎన్నడూ లేనంతగా పొగమంచు పూర్తిగా కమ్మేసింది. క్రమంగా పొగమంచు తగ్గినా.. చలి మాత్రం పంజా విసురుతోంది. రోజురోజుకూ చలితీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలవుతోంది. శీతల గాలులలో మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం కనిపిస్తోంది. ఆదివారం మడకశిర మండలంలో 8.2 డిగ్రీలు, శెట్టూరులో కూడా 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో కనిష్టం 9 నుంచి17 డిగ్రీలు, గరిష్టం 27 నుంచి 32 డిగ్రీలు రికార్డయ్యాయి. ప్రధానంగా మడకశిర, హిందూపురం, పెనుకొండ, ఉరవకొండ, శింగనమల ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అటు మనుషులు, ఇటు జంతుజాలం, పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు రోజుల కిందటితో పోల్చితే గాలి నాణ్యత కొంత మెరుగ్గా ఉన్నా అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితిలోనే ఉన్నట్లు తెలిపారు. మడకశిరలో 8.2 డిగ్రీలు, శెట్టూరులో 10.1 డిగ్రీలు -
అరటి కష్టనష్టాలపై అధ్యయనం
అనంతపురం అగ్రికల్చర్: అరటి తోటలు ‘అనంత’ రైతుల్లో అలజడి రేపుతున్న తరుణంలో సమగ్ర అధ్యాయానికి తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డి బృందం ఇటీవల మూడు రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. ఉద్యానశాఖ జిల్లా అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్, దేవానంద్ తదితరులను వెంటబెట్టుకుని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, కళ్యాణదుర్గం, శెట్టూరు, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు, నార్పల, పెద్దపప్పూరు తదితర మండలాల్లో అరటి తోటలను పరిశీలించి రైతుల అనుభవాలు, మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకున్నారు. చాలా మంది రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని గుర్తించారు. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి ఎరువులు వేయడం, విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారీ చేస్తుండటం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నట్లుగా నిర్ధారించారు. ఫ్రూట్కేర్ యాక్టివిటీపై దృష్టి సారించాలి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, సిగటోక తెగులు వల్ల నాణ్యత లేనందున వ్యాపారులు ‘అనంత’ అరటిపై మొగ్గుచూపడం లేదని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు మూడేళ్లుగా అరటి సాగు పెరగడం, అక్కడ నాణ్యత బాగున్న కారణంగా ట్రేడర్లు అటువైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ‘అనంత’తో పోల్చుకుంటే ఖర్చు తక్కువగా ఉండటం కూడా కారణమన్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఫ్రూట్కేర్ యాక్టివిటీపై దృష్టి సారిస్తే... మున్ముందు మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చన్నారు. లోపాల గుర్తింపు ‘సాక్షి’తో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది రైతులు డ్రిప్ ద్వారా పురుగులు, తెగుళ్ల మందు వదులుతుండటం వల్ల సిగటోక తెగులు, మచ్చలు, కాయలపై చారలు లాంటివి తొలగడం లేదన్నారు. ఇది ఒక విధంగా నష్టాలకు కారణమవుతోందన్నారు. అరటిలో దిగుబడులు, నాణ్యతను తామర పురుగు దెబ్బతీస్తోందన్నారు. సిగటోక లక్షణాలు గుర్తించిన తర్వాత ప్రొపికొనజోల్ +మినరల్ఆయిల్, కార్బండిజమ్ + మాంకోజెబ్ + మినరల్ ఆయిల్, టిబుకొనజోల్ + ట్రైఫ్లాక్సోస్ట్రోబీన్ + మినరల్ ఆయిల్, ఆజాక్సీస్ట్రోబీన్ + టిబుకొనజోల్ + మినరల్ ఆయిల్, పైరాక్సోస్ట్రోబీన్ + ఏపినికోనజోల్ + మినరల్ ఆయిల్... ఈ ఐదు రకాల కాంబినేషన్ మందులు దశల వారీగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఎండ అధికంగా ఉన్నప్పుడు గెలలు వచ్చిన తర్వాత మినరల్ ఆయిల్ వాడకూడదన్నారు. ప్రతి పిచికారీ మధ్య 20 రోజుల విరామం ఉండాలన్నారు. గెలలకు పలుమార్లు పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది తగ్గించుకోవాలంటే పూమొగ్గ ఏర్పడే సమయంలో 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 500 మి.లీ నీటిలో కలిపి సూది సహాయంతో ఒక్కో పూమొగ్గకు 1 మి.లీ మందు వేయాలన్నారు. చివరి హస్తాలు ఎదుగుదలకు 10 రోజుల ముందు మగ పుష్పగుచ్చాలు చెట్టు నుంచి తొలగించాలన్నారు. గెలలపై 5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0–0–50) పిచికారీ చేయాలని, హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత గెలకు 17 జీఎస్ఎం మందం కలిగిన పాలిప్రోపిలిన్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కవర్ తొడగాలని సూచించారు. గెలలు కోతకు వచ్చే 35 నుంచి 45 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదన్నారు. పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూసారం పెంచుకుంటే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయని వివరించారు. లోపాలు గుర్తించిన ‘తిరుపతి’ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి.శ్రీనివాసరెడ్డి డ్రిప్ ద్వారా పురుగు మందులు ఇవ్వడం వల్ల సిగటోక తెగులు పూమొగ్గకు ఇంజెక్షన్ ఇవ్వకపోవడంతో నాణ్యతపై ప్రభావం మోతాదుకు మించిన పెట్టుబడులతో తగ్గిన లాభాలు -
చిరుత దాడిలో పొట్టేళ్ల మృతి
పెనుకొండ: పట్టణంలోని చెరువు రోడ్డుకు చెందిన వడ్డే వెంకటేష్, వడ్డే శ్రీనివాసులుకు చెందిన మూడు పొట్టేళ్లపై చిరుత దాడి చేసి, చంపేసింది. వివరాలు.. వడ్డే వెంకటేష్, వడ్డే శ్రీనివాసులు ఇంటి సమీపంలో పొట్టేళ్లను కట్టేశారు. శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని కొండ నుంచి వచ్చిన చిరుత పొట్టేళ్లపై దాడి చేసింది. మూడు పొట్టేళ్లను చంపేసింది. ఉదయం ఈ విషయాన్ని బాధితులు గమనించి, అటవీశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు డీఆర్ఓ చాంప్లానాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాహుల్, పశువైద్యాధికారి జాహ్నవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.బాధితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామని అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
రాజీపడితే ఓడినట్లు కాదు.. గెలిచినట్లే
అనంతపురం: రాజీపడితే ఓడినట్లు కాదు.. గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ లోక్ అదాలత్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో 9 బెంచులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ తీర్పుల్లో ఎటువంటి అప్పీలుకూ అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులలో కేసులు పరిష్కారమైనప్పుడు ఆ కేసుల్లో ఎవరో ఒక్కరే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని, ఇందులో ఇద్దరూ విజేతలేనని స్పష్టం చేశారు. మోటారు వాహనాల ప్రమాద కేసులు 54 పరిష్కారం కాగా.. మొత్తం రూ.97.45 లక్షలు, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 41 పరిష్కారం కాగా, రూ.92.88 లక్షలు, సివిల్ దావాల్లో పరిష్కారం అయిన మొత్తం రూ.2.72 కోట్లు, ఎన్ఐ యాక్టులో రూ.81.36 లక్షల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. మొత్తం 15, 574 కేసులకు గాను రూ.7.43 కోట్ల పరిహారం దక్కింది. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు
ఎన్పికుంట: మండలంలోని గంగినాయుని పల్లికి చెందిన ఓ యువకుడికి స్క్రబ్ టైఫస్ బారి న పడినట్లు మండల వైద్యాధికారి ఆనంద్వర్ధన్ తెలియజేశారు. యువకుడికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగీ, మలేరియా, రక్త పరీక్షలు చేయించాడు. జ్వరం తగ్గకపోవడంతో బెంగళూరు సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేరగా, ఎలిశా పరీక్షలు చేయడంతో స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శనివారం ఇంటికి వచ్చిన యువ కుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ నాగలక్ష్మి, ఆరోగ్య కార్యకర్త రమేష్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైరస్పై అవగాహన కల్పించండి ఓడీచెరువు (అమడగూరు):స్క్రబ్ టైఫస్ వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. శనివారం అమడగూరు పీహెచ్సీని డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్, కంప్యూటర్ గది, వార్డు, కాన్పు గదులను పరిశీలించా రు. పల్స్పోలియో కార్యక్రమంపై ఆరాతీశారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వందశాతం ఫలితాలు సాధించాలికదిరి అర్బన్: వందరోజుల ప్రణాళికను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి కిష్టప్ప ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి వంద రోజుల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంద రోజుల్లో చదవాల్సిన విధానాన్ని డీఈఓ విద్యార్థులకు తెలియజేశారు. పదో తరగతిలో మంచి మార్కులే లక్ష్యంగా సాధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులు మంచి మార్కులు సాధింంచేందుకు కృషి చేయాలని సూచించారు. అంతకు మునుపు ఆయన కదిరి పట్టణంలో నిర్వహిస్తున్న నవోదయ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబుల్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటాచలం ఉన్నారు. ఓం నమో నరసింహా..కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. కదిరి పరిసర ప్రాంతల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా కర్ణాటక, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హజరై ఖాద్రీశుడిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు ఓం నమో నారసింహా.. ఓం నమో నారసింహా .. నామస్మరణతో మార్మోగాయి. మహిళపై పంది దాడిధర్మవరంఅర్బన్: పట్టణంలోని సత్య సాయినగర్కు చెందిన రజియా అనే మ హిళ శనివారం ఇంటి బయట ఉండగా అకస్మాత్తుగా పంది దాడి చేసింది. ఆమె చేతి రెండు వేళ్లను కొరికింది. ఆమె గట్టిగా కేక లు వేయడంతో స్థానికులు పందిని తరిమేశారు. చికిత్స నిమిత్తం ఆమెను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేశారు. పట్టణంలో పందులు, కుక్కల బెడద అధికమైందని ప్రజలు అంటున్నారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశపరీక్ష
లేపాక్షి/హిందూపురం: లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యాసంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అందులో మొత్తం 6,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,899 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. హిందూపురంలోని 1,242 మందికి ఐదు కేంద్రాలు కేటాయించగా, అందులో 584 మంది హాజరయ్యారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాలను పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఆకిస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలను డీటీ మైనుద్దీన్, ఎంఈఓలు గంగప్ప, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. -
కేసులో శిక్ష పడిన నువ్వా మాట్లాడేది?
● మా పార్టీ అధినేతను విమర్శించే స్థాయి నీకెక్కడిది కందికుంట ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజం కదిరి టౌన్: ‘డీడీల కుంభకోణం కేసులో శిక్ష పడిన నువ్వు కూడా మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తావా?’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కదిరిలోని తన స్వగహంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గెలుపోటముల గురించి కందికుంట మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 2004 ఎన్నికల్లో కందికుంట ఓడిపోయాడని, 2009లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కాడని, 2014లో అత్తార్ చాంద్బాషా చేతిలో, 2019లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సిద్దారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికీ ఉంటుందన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ కందికుంట అని పట్టణ ప్రజలందరికీ తెలుసన్నారు. కందికుంట ఆయన ఇంటి ముందు, వెనుక గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా రింగ్ రోడ్డు, ఎన్పీ కుంట రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ నాసిరకంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు వస్తే అతివృష్టి, అనావృష్టి తప్ప అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. గత ప్రభుత్వంలో హంద్రీ–నీవా ద్వారా ప్రతి చెరువు నింపామన్నారు. తమ పార్టీ అధినేత గురించి మాట్లాడే అర్హత కందికుంటకు లేదన్నారు. దిగజారి అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. నీ కంటే మాస్ భాషతో మేమూ మాట్లాడగలం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే ముందు కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది.. నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారు అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. మాటలు మాని అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు. సనాతన ధర్మం గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియాలి కదిరి టౌన్: సనాతన ధర్మం గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియాలని వీరజానందస్వామిజీ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరజానందస్వామిజీ (కందిమల్లయ్యపల్లి) హాజరై మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఖాద్రీ ఆలయం ప్రధాన అర్చకులు కుమార్స్వామి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, డాక్టర్ మదన్కుమార్, కృష్ణ మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేడు ‘అనంత’లో సున్నీ కాన్ఫరెన్సు అనంతపురం కల్చరల్: నగరంలో రెండో రోడ్డులోని బహువుద్దీన్ మసీదు వేదికగా ఆదివారం సున్నీ కాన్ఫరెన్సు జరగనుంది. తెహరికె ఫైజానే ఉమర్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహ్మద్ ప్రవక్త (స) కేశదర్శనం, ప్రవక్త ధరించిన అరుదైన దుస్తులు, ఇతర వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సున్నీ కాన్ఫరెన్స్కు వివిధ రాష్ట్రాల నుంచి పేరుగాంచిన మత పెద్దలు హాజరై ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారు. శనివారం సాయంత్రం మసీదు వద్ద నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం రాత్రి భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా పరదా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. -
రమణీయం.. బ్రహ్మ రథోత్సవం
లేపాక్షి: మండలంలోని కంచిసముద్రం గ్రామంలో గోందావళి సద్గురు బ్రహ్మ చైతన్య స్వామి 112వ ఆరాధన మహోత్సవంలో భాగంగా శనివారం సీతారాముల బ్రహ్మ రథోత్సవం ఘనంగా సాగింది. స్వామి వారికి విశేష పూజలు చేసిన అనంతరం బ్రహ్మచైతన్య ఆలయంలో ఏకాదశ వార రుద్రాభిషేకం, గోమాత పూజ, సహస్రనామ పూజ, తారకమంత్రం జపం, నవగ్రహ జపం, సూర్యాప్రార్థన, అఖండ రామనామ సంకీర్తన, సుందరకాండ పారాయణం నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను బహ్మరథం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించారు. మహా మంగళ హారతి అనంతరం బ్రహ్మ రథోత్సవం ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా జై శ్రీరాం, జైజై శ్రీరాం నినాదాలు మార్మోగాయి. వైఎస్సార్సీపీ హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపికా ఉత్సవంలో పాల్గొని సీతారాములకు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ సయ్యద్నిస్సార్, సర్పంచ్ గంగరాజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఆదినారాయణ, నాయకులు ఆనంద్, వెంకటేశ్, గోపాలప్ప, నాగరాజు, నరేష్, మైలారప్ప, చంద్రశేఖర్, గోపి, సజ్జప్ప, బాలు, నందీష్, బాలక్రిష్ణ, లక్ష్మినారాయణ, సురేష్రెడ్డి పాల్గొన్నారు. -
మెళవాయిలో హైకోర్టు జడ్జి చంద్ర ధనశేఖర్ పర్యటన
మడకశిరరూరల్: మండల పరిధిలోని మెళవాయి గ్రామంలో శనివారం ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్ పర్యటించారు. గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు, సీనియర్ న్యాయవాది గోవిందరెడ్డిని ఆయన పరామర్శించారు. గోవిందరెడ్డి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. గోవిందరెడ్డి దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్కు గోవిందరెడ్డి కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ, మడకశిర జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆర్. అశోక్కుమార్, హైకోర్టు న్యాయవాది చిన్నప్పరెడ్డి, సర్పంచ్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు. ఇసుక టిప్పర్ పట్టివేత శింగనమల: వైఎస్సార్ కడప జిల్లా వేటూరు నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పరును శనివారం శింగనమల క్రాస్లో మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి శింగనమల పోలీస్స్టేషన్కు తరలించినట్లు జిల్లా మైనింగ్ డీడీ ఆదినారాయణ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో మైనింగ్ ఆర్ఐ సుప్రజ పాల్గొన్నారు. -
భూమి ఆక్రమించారని హఠాన్మరణం
●గుండెపోటుతో మృతిచెందిన వృద్ధురాలు పుట్టపర్తి అర్బన్: తన భూమి ఆక్రమించుకున్నారన్న విషయం తెలిసి మండలంలోని రాచువారిపల్లికి చెందిన నరసమ్మ (85) శనివారం గుండెపోటుతో మృతిచెందింది. వివరాలు.. గ్రామా నికి చెందిన నరసమ్మ (సంజీవమ్మ) భర్త గౌరన్న సుమారు 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి వర్ధనమ్మ, సరోజమ్మ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నరసమ్మకు చెందిన ఇళ్లు గతంలోనే పాఠశాల నిర్మాణానికి తీసుకున్నారు. దీంతో ఆమె పుట్టపర్తిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అవసాన దశలో నడవలేని స్థితిలో కూతుళ్ల వద్ద నివసిస్తోంది. వీరికి ప్రభుత్వం సర్వే నంబర్ 560–3బీలో 5.30 ఎకరాల భూమికి పట్టా పొందారు. ఆమె గ్రామంలో లేక పోవడంతో అదే గ్రామానికి చెందిన లెక్కల ఉమాదేవి నకిలీ పట్టాదారుపాసుపుస్తకం తీసుకొని శుక్రవారం జేసీబీతో చదును చేసే పనులు ప్రారంభించారు. నరసమ్మకు విషయం తెలియగానే గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిందని కూతుర్లు వర్దనమ్మ, సరోజమ్మ చెప్పారు. -
భళా బసవన్న
● 98 వరి ధాన్యం బస్తాలను ఒక్కటిన్నర కిలోమీటర్ లాగిన వృషభం బొమ్మనహాళ్: మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన వన్నూరుస్వామి వృషభం 98 వరి ధాన్యం బస్తాలను ఒక్కటిన్నర కిలోమీటర్ లాగి భళా అనిపించుకుంది. 98 వరి ధాన్యం బస్తాలు (ఒక్కో బస్తా 52 కేజీలు) 8 ఎడ్ల బండ్లలో నింపి ఒకదానికొకటి జత చేశారు. ముందుభాగంలోని బండికి వన్నూరుస్వామికి చెందిన వృషభాన్ని కట్టి ముందుకు పోనివ్వగా.. ఎడ్ల బండ్లను ఒకటిన్నర కిలోమీటర్ మేర ఎద్దు లాగడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలు వృషభ ‘రాజసాన్ని’ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. మరో పక్కన ఉండే మనుషులు మారుతున్నా వృషభం మాత్రం అలాగే ముందుకు సాగడం చూసి కేరింతలు, ఈలల వేస్తూ జేజేలు పలికారు. వృషభానికి పూలమాలు వేసి గ్రామంలో ఘనంగా ఊరేగించారు. -
జరిమానాలు సరే.. వసూళ్లేవీ?
● ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల బృందం ఐదు నెలల క్రితం తనిఖీ నిర్వహించింది. విద్యుత్ మీటర్ కనెక్షన్ తీసుకోకుండా అక్రమంగా విద్యుత్ వినియోగించడంతో పాటు మీటర్ ఉండి మీటర్ నుంచి డైరెక్టుగా విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి 24 మందిపై కేసులు నమోదు చేసి రూ.3.50 లక్షల జరిమానా విధించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిమానాలు వసూలు చేయలేదు. ● అనంతపురం నగరంలోని చంద్రబాబునగర్లో మహబుబ్బాషా అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. మీటర్ నుంచి కాకుండా డైరెక్ట్గా విద్యుత్ను వాడుకుంటూ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తుండడంతో రెండేళ్ల క్రితం విద్యుత్శాఖ విజిలెన్సు అధికారులు గుర్తించి రూ.2 లక్షలు జరిమానా విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతను ఒక్క పైసా కూడా జరిమానా చెల్లించలేదు. దీంతో ప్రతి నెలా సర్చార్జీల కింద రూ.4 వేలు చొప్పున ఇప్పటి వరకూ దాదాపు రూ.3 లక్షలకు పైగా ఉంది. జరిమానా వసూలులో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. ● తాడిపత్రి పట్టణ, రూరల్ మండలాల్లో విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా కేటగిరి 1 సర్వీసులకు డైరెక్టుగా విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి 18 మందిపై కేసులు నమోదు చేసి రూ.2.20 లక్షలు అపరాధ రుసుమును విధించారు. అయితే వారి నుంచి అరకొరగా రెండు నెలలకు ఒకసారి రూ.వెయ్యి, రెండు వేలు మాత్రం వసూలు చేస్తున్నారు. మరి కొందరు వారి పేరిట కాకుండా వారి కుటుంబ సభ్యుల పేరుతో కొత్త మీటర్ సర్వీసులు తీసుకొని జరిమానాలో పైసా కూడా చెల్లించలేదు. అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ను అక్రమంగా వినియోగిస్తున్న వారిపై ఆశాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. విజిలెన్స్ బృందం తరచూ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమార్కులపై భారీగా కేసులు నమోదు చూస్తూ జరిమానాలు విధిస్తోంది. రెండేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,716 కేసులు నమోదు చేసి రూ.7.25 కోట్ల మేర జరిమానాలు విధించారు. అయితే జరిమానాల వసూళ్లపై మాత్రం విద్యుత్ యంత్రాంగం దృష్టిసారించలేదు. ఈ రెండేళ్ల కాలంలో కేవలం రూ.2 కోట్ల వసూళ్లు కూడా దాటలేదంటే ఏస్థాయిలో విద్యుత్ అధికారులు పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నెలవారి విద్యుత్ బిల్లులతో సరి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్లు తీసుకున్న కొందరు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించి విజిలెన్సు అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 వేల మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. జరిమానాలను వినియోగదారుల విద్యుత్ బిల్లుకు జోడించారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న విద్యుత్ అధికారులు జరిమానాలు చెల్లించండి అంటూ మాట వరుసకు సైతం వినియోగదారులను అడగడం లేదు. నెలవారి బిల్లును మాత్రం కట్టించుకొని మమ అనిపిస్తున్నారు. జరిమానా మొత్తం రూ.5 వేలు లోపు ఉంటే లైన్మెన్, రూ.5 వేలు దాటితే లైన్ ఇన్స్పెక్టర్లు, రూ.10 వేలు ఆపైన జరిమానా ఉంటే ఏఈలు, రూ.20 వేలు పైన ఉంటే ఏడీ, డీఈ స్థాయి అధికారులు జరిమానాలు వసూలు చేయాల్సి ఉంది. అయితే విద్యుత్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో జరిమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేవలం వినియోగదారులతో నెలవారి బిల్లు మాత్రం వసూలు చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జరిమానాల వసూళ్లపై దృష్టి సారించాల్సి ఉంది. విద్యుత్ అక్రమ వినియోగదారులపై 11,716 కేసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.7.25 కోట్ల జరిమానా రూ.2 కోట్లు కూడా దాటని వసూళ్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు వసూళ్లపై దృష్టి సారిస్తాం జరిమానాల వసూళ్లపై విద్యుత్ అధికారులు దృష్టి సారించాలి. ప్రతి నెల దీనిపై సమావేశాలు నిర్వహించి పురోగతిపై దృష్టి సారిస్తాం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ అధికారులు బృందంగా ఏర్పడి జరిమానా విధించిన వినియోగదారులతో వసూలు చేసే విధంగా దృష్టి సారించాలి. – శేషాద్రి శేఖర్, విద్యుత్శాఖ ఎస్ఈ, అనంతపురం -
నకిలీ బంగారంతో రుణం.. ముద్దాయిల అరెస్టు
ఓడీచెరువు: నకిలీ బంగారంతో బ్యాంక్లో రుణం పొంది ఉడాయించాలని చూసిన ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఓడీచెరువు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఈ నెల 9న ఓడీచెరువు ఎస్బీఐలో బంగారు ఆభరణాల్లో లక్క ఉంచి తూకం ఎక్కువ చూపించి బ్యాంకులో తాకట్టుపెట్టి ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకొని మోసం చేసిన కేసులో బ్యాంక్ మేనేజర్ ఏసుదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓడీచెరువు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఇందులో భాగంగా ఓడీ చెరువు మండలం డబురువారిపల్లికి చెందిన అందే జయప్ప, కర్ణాటక రాష్ట్రం యలహంకకు చెందిన ముస్తాక్ పాషా, రఘుకుమార్, బెంగళూరు వాసి సి.నగేష్లను శుక్రవారం ఓడీచెరువు మండలం ఎంబీ క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి టయోటా ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముద్దాయిలు చెప్పిన మేరకు ఓడీచెరువు ఎస్బీఐలో ఉన్న నకిలీ బంగారు ఆభరణాలను పెద్దమనుషుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తులో ఎస్ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, రమేష్నాయక్, కానిస్టేబుళ్లు లోకేష్, గోవర్ధన్ సహకరించినట్లు ఎస్డీపీఓ విజయ్కుమార్ తెలపారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చంద్రబాబు మౌనం వీడాలి
● సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అనంతపురం అర్బన్: పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఇప్పటికై నా మౌనం వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సీపీఐ వందేళ్ల వేడుక సందర్భంగా గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన ఉద్యమవీరుల కుటుంబాల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దేశానికి ప్రమాదకరమన్నారు. దేశాన్ని మతరాజ్యంగా మారుస్తున్న బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, నితీష్కుమార్పై ఉందన్నారు. మోదీ బయటికు గాంధీ పేరు జపిస్తున్నా.. మనసులో మాత్రం గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సేనే ఉన్నారని ఆరోపించారు. పాలనలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నారని, రాష్ట్ర సంపదను అనుయాయులకు దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
పక్కదారి పట్టిన దాణా
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పశువుల దాణా పక్కదారి పట్టింది. 50 శాతం సబ్సిడీతో పశుసంవర్ధక శాఖ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఈ ప్రక్రియ కాస్త ప్రహసనంలా మారింది. ఇప్పటికే గోకులం షెడ్లు, ప్రత్యమ్యాయ విత్తనాలు, సబ్సిడీ వేరుశనగ తదితరాలన్నింటిలోనూ టీడీపీ నాయకుల పెత్తనం తారాస్థాయికి చేరుకుంది. అర్హులను కాదని టీడీపీ సానుభూతిపరులకే దాణా అందజేయాలంటూ నేతల ఒత్తిళ్లు తాళలేక కొన్ని మండలాల్లో పశువుల ఆస్పత్రుల తలుపులను సిబ్బంది మూసేస్తున్నారు. జిల్లాకు చేరిన 599 టన్నుల దాణా.. జిల్లా వ్యాప్తంగా 1.2 లక్షల మంది రైతుల వద్ద సుమారు 3.5 లక్షల పాడి పశువుల ఉన్నాయి. ఇప్పటి వరకూ సుమారు 599 టన్నుల పశువుల దాణా జిల్లాకు చేరినట్లు సమాచారం. దీనిని చిన్న, సన్న కారు పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో అందజేయాలని నిబంధనలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటికే మూడు విడతలుగా పశువుల దాణా మంజూరైంది. మొదటి విడతలో 250 టన్నులు, రెండో విడతలో 169 టన్నులు, మూడో విడతగా ప్రస్తుతం 180 టన్నులు మంజూరైంది. ఒక్కో ఆర్ఎస్కేకు 10, 20 బస్తాలు అందజేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాడిరైతులు ఉండడంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల మితిమీరిన జోక్యం కారణంగా పార్టీలను అంటగట్టి రైతులకు దాణా పంపిణీ చేస్తున్నారు. దాణా ఇవ్వలేదు వైఎస్సార్సీపీ సానుభూతి పరుడునని నాకు పశువుల దాణా ఇవ్వలేదు. నాకు ఇవ్వొద్దంటూ టీడీపీ నాయకులు చెప్పినట్లు డాక్టర్ చెప్పడంతో కొప్పడ్డాను. దీంతో నన్ను బయటకు పంపేసి, తలుపులు మూసేశారు. – లక్ష్మీనరసప్ప, పాడి రైతు, వెంగళమ్మచెరువు పార్టీలను అంటగట్టి పంపిణీ చేస్తున్న వైనం టీడీపీ ఒత్తిళ్లను తాళలేక పోతున్నామంటున్న అధికారులు -
జీజీహెచ్లో అక్రమ వసూళ్లు
● మగ బిడ్డ పుడితే రూ.2వేలు.. ఆడ బిడ్డకు రూ. వెయ్యి ● వైద్యాధికారుల విచారణలో నిగ్గుతేలిన వాస్తవం ● ఇద్దరి సస్పెన్షన్ అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో బిడ్డ పుడితే సంబంధీకుల నుంచి రూ.వేలల్లో డబ్బును అక్కడి సిబ్బంది లాగేసుకుంటున్నారు. ఇటీవల అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గర్భిణికి సిజేరియన్ చేసి శిశువును వెలికి తీశారు. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్ వద్దనే ఓ ఎంఎన్ఓ రూ.వెయ్యి, లేబర్ వార్డులో ఎఫ్ఎన్ఓ రూ.వెయ్యి బలవంతంగా వసూలు చేసుకున్నారు. అలాగే శింగనమల నియోజకవర్గానికి చెందిన గర్భిణి ఆడ శిశువును ప్రసవించడంతో రూ.వెయ్యి ఇచ్చే వరకూ వదిలేది లేదంటూ భీష్మించారు. తామే పేదలమని అంత ఇచ్చుకోలేమని వారు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. చివరకు రూ.500తో సరిపెట్టారు. ఈ అంశాలు కాస్త జీజీహెచ్ సూపరింటెండెంట్ కేఎల్ సుబ్రహ్మణ్యం దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలాబాయి, ఏఓ మల్లికార్జునరెడ్డి విచారణ చేపట్టారు. దీంతో అక్రమ వసూళ్లు వాస్తమని నిర్ధారణ కావడంతో ఎఫ్ఎన్ఓ పార్వతి, ఎంఎన్ఓ నరసింహులును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. దారుణ పరిస్థితులు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోజూ 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతాయి. ఉమ్మడి జిల్లా నుంచి ప్రసవానికి ఇక్కడకు వచ్చే వారిలో 90 శాతం నిరుపేదలే ఉంటున్నారు. అయినా వీరు ప్రసవిస్తే కుటుంబ సభ్యులను అక్కడి సిబ్బంది బృందాలుగా ఏర్పడి వెంటాడి మరీ డబ్బు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. మగ బిడ్డ పుడితే రూ.2 వేలు, ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి చెల్లించాల్సిందేనంటూ వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా వేధింపులకు గురి చేస్తుంటారు. అంతేకాక దోబీలు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రసవానికి వెళ్లే సమయంలో గర్భిణికి స్టెరిలైజేషన్ చేసిన తెల్లచీరను ఇస్తారు. ప్రసవానంతరం ఆ చీరను బాలింత కుటుంబసభ్యులు శుభ్రంగా ఉతికి ఇవాల్సి వస్తోంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి చక్రాల కిందపడి ఒకరు మృతి చెందగా... లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్రవాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. రాయదుర్గం టౌన్: మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప (55) వ్యక్తిగత పనిపై గురువారం రాయదుర్గానికి వచ్చాడు. పని ముగించుకుని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన టి.వీరాపురం సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవరటేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య వడ్రక్క, ఓ కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో పాటు జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జయానాయక్ తెలిపారు. తాడిపత్రి రూరల్: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి తన ఇద్దరు కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన అన్న కుమారుడు బండి చరణ్ (18)తో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం తాడిపత్రిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు బయలుదేరాడు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో బైక్ నడుపుతున్న బండి చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలేటికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిలేటి కుమారులు అర్జున్, సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. సచివాలయ సిబ్బందికి మెమోలు గాండ్లపెంట: మండలంలోని సోమయాజులపల్లి గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీఓ టి.రామకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం డిప్యూటీ ఎంపీడీఓ పద్మనాభరెడ్డితో కలసి తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉండాల్సిన పది మంది ఉద్యోగులకు గాను కేవలం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఒక్కరే ఉన్నారు. హాజరు పట్టీలో సంతకాలు కూడా లేవు. దీంతో గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాముకాటుతో వివాహిత మృతి పరిగి: మండలంలోని గొరవనహళ్లికి చెందిన వివాహిత శీగిపల్లి కొల్లమ్మ(46) పాముకాటుతో మృతి చెందింది. ఆమెకు భర్త నరసింహప్ప, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పైళ్లెంది. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం ముల్లమోతుకపల్లి వద్ద మొక్కజొన్న తూర్పారబెట్టడానికి పనికి వెళ్లిన ఆమె సాయంత్రం పాము కాటుకు గురైంది. విషయం తెలుసుకున్న కూలీలు వెంటనే ఆమెను హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళుతుండగా రాప్తాడు మండలం మరూరు టోల్ప్లాజా వద్దకు చేరుకోగానే మృతి చెందింది. ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి రాయదుర్గం టౌన్: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటనతో జీవనం సాగిస్తున్న వృద్ధుడు (70) గురువారం ఉదయం మృతిచెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా పాత రైల్వేస్టేషన్ భవనం వద్ద ఉండేవాడు. ఈ క్రమంలో కనీస చికిత్సకు సైతం నోచుకోక ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
మెరుగైన వైద్య సేవలు అందాలి
● ఎస్సీఆర్ పీసీఎండీ డాక్టర్ నిర్మల రాజారాం గుంతకల్లు: రైల్వే ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్య సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మల రాజారాం సూచించారు. స్థానిక రైల్వే ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన పది పడకల ఐసీయూ చిల్డ్రన్స్ వార్డుతో పాటు ఆధునికీకరించిన మహిళలు, పురుషుల మెడికల్ వార్డులను గురువారం డీఆర్ఎం చంద్రశేఖరగుప్త, ఏడీఆర్ఎం యు.సుధాకర్తో కలసి ఆమె ప్రారంభించి, మాట్లాడారు. రూ.3.14 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రైల్వే ఆస్పత్రి సీఎంఎస్ డాక్టర్ వేణుగోపాలరెడ్డి, సీనియర్ డీఎఫ్ఎం సందీప్, సీనియర్ డీఎంఈ మంగాచార్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పిల్లలూ.. మోదీతో మాట్లాడతారా?
కదిరి: పరీక్షల ఒత్తిడిని జయించడం, పరీక్షలను ఒక పండుగలా భావించడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవితంలో ముందుకు సాగడంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే వారు పరీక్షలపై తమ అభిప్రాయాలు, సందేహాలు, భయాలు, అనుభవాలు, తదితర అంశాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పరీక్షలకు ఎలా సన్నద్దమవ్వాలి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? లక్ష్య సాధనలో అనుసరించాల్సిన మార్గాలు, పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ప్రధాని మోదీ సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రశ్నలు 500 అక్షరాల్లోపే.. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో 6 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠాలు బోధించే టీచర్లు/అధ్యాపకులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు 2026 జనవరి 11లోపు https:// innovateindia1mygov in/ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పంపించే ప్రశ్న 500 అక్షరాలకు మించి ఉండకూడదు. పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేస్తారు. విజేతలకు 2026 జనవరి 26న ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం వస్తుంది. వీరికి ప్రశంసా పత్రాలతో పాటు ‘ఎగ్జామ్ వారియర్స్’ కిట్లు బహుమతిగా ఇస్తారు. 2026 జనవరి 26న ‘పరీక్షా పే చర్చ’ జనవరి 11 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం 6 నుంచి ఇంటర్ వరకు అర్హులు విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లూ అర్హులే -
ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్
● పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ.. ఆస్పత్రిలో చికిత్స ధర్మవరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు ధర్మవరానికి పాకాయి. పట్టణంలోని శాంతినగర్కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు ఈనెల 8వ తేదీన తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమె నడుము మీద నల్లమచ్చను గుర్తించారు. వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి పంపి ఐజీఎం ఎలిసా పరీక్ష చేయించారు. గురువారం వచ్చిన ఫలితాల్లో ఆమె పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ధర్మవరం ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తెలిపారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల టైఫస్ జబ్బు వస్తుందని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ పురుగు కుట్టడం వల్ల శరీరంపై నల్లని మచ్చ ఏర్పడటంతోపాటు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడతారన్నారు. శరీరంపై నల్లనిమచ్చలు కనిపిస్తే... వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం వృద్ధురాలికి ధర్మవరం ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. గంగమ్మ తల్లి సొత్తు చోరీపై విచారణ కదిరి అర్బన్: మండల పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ అమ్మవారి కానుకల చోరీ ఘటనపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గురువారం కర్నూలు నుంచి వచ్చిన దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్.. ఆలయ అర్చకులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గంగమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆటోలో తీసుకువెళ్తున్న ఈఓను గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు ఆలయ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈనెల 10వ తేదీనే ఆరుగురు సిబ్బందిని డిప్యుటేషన్పై యర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి పంపామన్నారు. ఆలయ రికార్డుల పరిశీలన అనంతరం పోలీసుల వద్ద ఉన్న సమాచారం తెలుసుంటామని, అలాగే బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలను సేకరించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులను పంపుతామన్నారు. ఎన్ఎస్గేట్లో భారీగా బందోబస్తుచెన్నేకొత్తపల్లి: రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇతర ప్రాంతాల వారు రామగిరి వైపునకు వెళ్లకుండా ఎన్ఎస్ గేట్లోనే అడ్డగించారు. రామగిరి వైపునకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపారు. నేడు షీప్ సొసైటీ ఎన్నికలు అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీస్) ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడానికి పశు సంవర్థకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా ఈనెల 5వ తేదీన 55 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా వివిధ కారణాలతో 13 సొసైటీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో విడతలో కూడా పలు సొసైటీలకు ఎన్నికలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం తోపుదుర్తి, అమ్మవారిపేట, కాలువపల్లి, టి.కొత్తపల్లి, చెర్లోపల్లి, దోసులుడికి, గొల్లలదొడ్డి, శీబాయి, వైసీ పల్లి, మలయనూరు, గొల్లపల్లి, నడిమిదొడ్డి, జి కొట్టాల, సింగనగుట్టపల్లి, పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి, జి.కొత్తపల్లి, బొమ్మేపర్తి, అయ్యవారిపల్లి, పీసీ ప్యాపిలి, కాటికానికాలువ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి, కొడపగానిపల్లి, రామస్వామితండా, నసనకోట, పి.కొత్తపల్లి, ఆత్మకూరు సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రజాస్వామ్యానికి పాతర
సాక్షి, టాస్క్ఫోర్స్: ఇది రామగిరి..ఇక్కడ మేం ఏమైనా చేయగలం..మేం చెప్పిందే వేదం..మేం చేసిందే చట్టం అన్న రీతిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. బలంలేకున్నా బరితెగించి రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో నిలిచారు. ప్రజాస్వామ్యానికి పాతర వేసి వైఎస్సార్ సీపీకి చెందిన కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను ప్రలోభాలకు గురి చేశారు. గురువారం జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో సాయిలీలకు టీడీపీ కండువా కప్పి దౌర్జన్యంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపీగా ఏకగ్రీవం చేశారు. రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా... అందులో పేరూరు–1, పేరూరు–2, మాదాపురం, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రిలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కాగా, రామగిరి ఎంపీటీసీ సభ్యురాలు మీనుగ నాగమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 డిసెంబరులో ఆమె అనారోగ్యంతో మృతి చెందగా... ఎంపీపీ స్థానం దక్కించుకునేందుకు పరిటాల కుటుంబం కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. తమ పార్టీ తరఫున మహిళా ఎంపీటీసీలు లేకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. టీడీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్ ఘటనలతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నాలుగుసార్లు వాయిదా పడింది. ● ఈ ఏడాది మార్చి 27న ఎంపీపీ ఎన్నికకు అధికారులు తొలిసారి నోటిఫికేషన్ ఇవ్వగా... సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని పరిటాల కుటుంబం కుట్రలు పన్నింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1 ఎంపీటీసీ సభ్యుడు కర్రెన్న, మాదాపురం ఎంపీటీసీ సభ్యుడు సంపత్కుమార్లకు పచ్చ కండువాలు కప్పి తమవైపునకు లాక్కుంది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు మార్చి 27న నిర్వహించిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను బహిష్కరించారు. దీంతో కోరం లేక అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. ● మే 18న రెండోసారి ఎంపీపీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా.. అనెక్జర్ లెటర్ ఇవ్వడానికి 17వ తేదీ రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు పేరూరు నాగిరెడ్డి, హరినాథ్రెడ్డి, బోయ రామాంజనేయులపై టీడీపీ నేతలు దాడి చేయడమేకాక వారి వాహనాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురిచేశారు. అంతేకాకుండా 18వ తేదీన రామగిరి ఎన్నికలో పాల్గొనేందుకు వస్తున్న పేరూరు–2 ఎంపీటీసీ భారతిని పెనుకొండలో సినిమాతరహాలో కిడ్నాప్కు యత్నించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆరోజు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికను బహిష్కరించగా రెండోసారి వాయిదా పడింది. ● జూలై 16వ తేదీన మూడోసారి, ఆగస్ట్ 13వ తేదీన నాల్గోసారి రామగిరి ఎంపీపీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా.. రామగిరిలో తమకు భద్రతలేదని భావించిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఆ రెండు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో మరోసారి అధికారులు ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా టీడీపీ నేతలు అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రామగిరి మండలంలోని వైఎస్సార్ సీపీ నేతలను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇళ్లు, వాహనాలు, పొలాల్లోని పచ్చని చెట్లను లక్ష్యంగా చేసుకొని రోజూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీన వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యపై పరిటాల సమీప బంధువులు దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అప్పటి నుంచి మరింత పేట్రేగి పోయిన టీడీపీ నేతలు తమకు అడ్డుగా వస్తే అంతం చేస్తామంటూ గ్రామాల్లో మితిమీరి ప్రవర్తించారు. చివరకు వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ కప్పల సాయిలీలను భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. గురువారం జరిగిన ఎన్నికలో ఆమెను అప్రజాస్వామికంగా ఎన్నిక చేసుకుని సంబరపడుతున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నికలో ‘పరిటాల’ నిసిగ్గు రాజకీయం వైఎస్సార్ ఎంపీటీసీలకు ప్రలోభాలు, బెదిరింపులు కుంటిమద్ది ఎంపీటీసీ కప్పల సాయిలీలకు బలవంతంగా పచ్చకండువా కోరం లేకపోయినా నలుగురితో ఎన్నిక పూర్తి ఎంపీపీగా గెలిచామంటూ సంబరాలు టీడీపీ దుర్మార్గాలకు నిరసనగా ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్ సీపీ దూరం అధికారం కోసం పరిటాల కుటుంబం ఎంతకై నా దిగజారుతుందని రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో మరోసారి రుజువైంది. బలం లేకపోయినా ఎంపీపీ ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ నేతలు...వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. చివరకు వైఎస్సార్ సీపీకి చెందిన కుంటిమద్ది ఎంపీటీసీ సాయిలీలకు పచ్చకండువా వేసి ఎంపీపీగా నిలబెట్టారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఉప ఎన్నికను బాయ్కాట్ చేయగా.. నలుగురు ఎంపీటీసీలతోనే ఉప ఎన్నిక ముగించారు. దాడులు... దౌర్జన్యాలే లక్ష్యం.. బలం లేకున్నా... బరిలో నిలిచి.. నాలుగుమార్లు వాయిదా.. -
సైబర్ సెల్కు ‘నకిలీ’ కేసు
మడకశిర: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడంపై జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ లోతుగా విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దాని ఆధారంగా ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసి సూత్రధారులను గుర్తించాలని స్థానిక అధికారులను ఆదేశించింది. లాగిన్ హ్యాక్ అయ్యిందా... నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో తొలుత గ్రామ కార్యదర్శులను అనుమానించిన అధికారులు...వారి పాత్రపైనే ఎక్కువగా దృష్టి పెట్టి విచారణ చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా ఐదుగురు గ్రామ కార్యదర్శులు పనిచేయగా...వారందరికీ వేర్వేరుగా విచారించారు. అయితే వారందరకూ కూడా తాము పంచాయతీ లాగిన్ వాడలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ లాగిన్ హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇక నుంచి ఈకేసు దర్యాప్తు మొత్తం సైబర్ క్రైం పోలీసులు కనుసన్నల్లోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొలిక్కిరాని నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారం పంచాయతీ లాగిన్ హ్యాక్ అయినట్లు భావిస్తున్న అధికారులు సైబర్ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
ప్రశాంతి నిలయం: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని, ఇందుకోసం ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయం, ప్రకృతి సేద్యం, పట్టు పరిశ్రమల శాఖ, డ్వామా, డీఆర్డీఏ, అటవీ శాఖ అధికారులు, లీడ్ బ్యాంక్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, వాటి లక్ష్యాలు, ప్రస్తుత ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల అవసరతలను సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రతి శాఖ తమ నెలావారీ లక్ష్యాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలన్నారు. పది సూత్రాల కార్యాచరణ పక్కాగా అమలు చేయాలి.. పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన పది సూత్రాలతో కూడిన కార్యాచరణను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లో అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంతో గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ మంత్రి భరద్వాజ్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, పురోగతిపై ఈ నెల 13వ తేదీలోపు సమగ్ర సమాచారంతో నివేదికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలలో సానుకూల అభిప్రాయం పెంపొందించేందుకు అధికారులంతా కృషి చేయాలన్నారు. సిలిండర్పై అధికంగా వసూలు చేస్తే చర్యలు వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరాలలో నిర్దేశించిన ధరకంటే అధికంగా వసూలు చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ‘దీపం–2’ పథకం అమలుపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో వినియోగదారునితో గ్యాస్ బాయ్స్ అధికంగా వసూలు చేయకుండా ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే కచ్చితంగా సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తప్పవన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సీఎస్డీటీలు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
●మంచు కురిసే వేళలో..
అనంతపురంలో పొగమంచు మధ్య వెళ్తున్న రైలుఅనంతపురం అగ్రికల్చర్: ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పతనమయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో జనం గజ గజ వణుకుతున్నారు. గురువారం విడపనకల్లులో 10.03 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు సత్యసాయి జిల్లా సోమందేపల్లి, మడకశిరలో కూడా 10.4 డిగ్రీలు నమోదైంది. అలాగే వజ్రకరూరు 11.2 డిగ్రీలు, గుమ్మగట్ట 11.3, తనకల్లు 11.4, అమడగూరు 11.5, శెట్టూరు 11.5 , బొమ్మనహాల్ 11.7, నల్లచెరువుల, కణేకల్లు 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా మండలాల్లో ఈ సీజన్లోనే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు రికార్డయ్యాయి. దీంతో చలి ప్రభావం బాగా పెరిగింది. -
రీసర్వేపై రివర్స్ గేర్!
జిల్లాలోపుట్టపర్తి అర్బన్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ‘జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకంపై చంద్రబాబు రచ్చరచ్చ చేశారు. రీ సర్వే పేరుతో భూములను లాగేసుకుంటారని, భూమిపై హక్కులు పోతాయని అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారు. కానీ అధికారంలోకి రాగానే అదే చంద్రబాబు... ‘ఏపీ రీ సర్వే ప్రాజెక్టు’ పేరుతో భూముల రీ సర్వేపై దృష్టి సారించారు. ఉన్నతాధికారులను సైతం పొలాలకు పంపి సిబ్బంది మెడపై కత్తి పెట్టి రీ సర్వే చేయిస్తున్నారు. ఇది చూసిన రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు యూటర్న్ మరోసారి రుజువైందంటున్నారు. ఐదు విడతలు.. 166 గ్రామాలు.. జిల్లాలో 32 మండలాల పరిధిలో 461 రెవెన్యూ గ్రామాలుండగా.. సుమారు 8,924 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతం ఉంది. దీన్ని సంపూర్ణంగా సర్వే చేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ రీసర్వేకు శ్రీకారం చుట్టింది. ఆర్డీఓలు, తహసీల్దార్ల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించింది. 355 మంది విలేజ్ సర్వేయర్లతో ప్రక్రియ ప్రారంభించింది. అప్పట్లోనే మూడు విడతల్లో 136 గ్రామాల్లో సర్వే పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...గతంలో వద్దని గగ్గోలు పెట్టిన రీసర్వేను పునఃప్రారంభించారు. రెండు విడతల్లో 55 గ్రామాల్లో రీసర్వే చేట్టారు. ఇందులో 30 గ్రామాల్లో సర్వే పూర్తికాగా, మరో 25 గ్రామాల్లో సర్వే సా...గుతోంది. మొత్తంగా జిల్లాలో ఇప్పటివరకూ ఐదు విడతల్లో 166 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యింది. సరిహద్దు రాళ్లు లేవు, మ్యుటేషన్లు రావు వైఎస్ జగన్ హయాంలో భూముల రీ సర్వే పూర్తి కాగానే సరిహద్దు రాళ్లు పాతేవారు. యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్ రికార్డులు రూపొందించడంతో పాటు ఎలాంటి ఖర్చులు లేకుండా మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే సర్వే పూర్తి చేస్తోంది. దీంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ మాత్రం దానికి సర్వే చేయడం ఎందుకని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు రీసర్వేనే తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ఉద్దేశంతో సర్వే చేయిస్తున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. సరిహద్దురాళ్లు పాతకపోతే సర్వే చేసి ఏం ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు. నాడు వద్దని ఆందోళన... నేడు చేయాల్సిందేనని హుకుం భూముల రీసర్వేపై చంద్రబాబు వింత వైఖరి ఇప్పటికే జిల్లాలో ఐదు విడతల్లో 166 గ్రామాల్లో పూర్తి ప్రస్తుతం 25 గ్రామాల్లో కొనసాగుతున్న రీసర్వే -
దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పిస్తాం : ఎస్పీ
హిందూపురం: దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన దివ్యాంగుల హక్కుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఏ దివ్యాంగుడినీ కించపరిచేలా మాట్లాడినా, భయపెట్టినా శిక్షార్హులవుతారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి, హిందూపురం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి షెక్షావలి, న్యాయ సలహాదారుడు ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు చిలమత్తూరు: మండలంలోని కొడికొండలో ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురి చేస్తూ చర్చి ప్రాంతంలో బలవంతం చేయబోయిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జ్ ఎస్ఐ నరేంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వెల్లడించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలుతనకల్లు: రైతులకు నకిలీ ఎరువులు, మందులను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం ఏడీఏ లక్ష్మీనాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంతో పాటు కొక్కంటిక్రాస్లో ఉన్న ఎరువుల దుకాణాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలోని కేఎస్ఆర్ ఫర్టీలైజర్, కొక్కంటిక్రాస్లో ఉన్న వెంటేశ్వర ఫర్టీలైజర్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫర్టీలైజర్స్లో కలిసి రూ. 2.70 లక్షలు విలువైన ఎరువులను స్టాప్సేల్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తనకల్లు, ధర్మవరం ఏఓలు భారతి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ‘రూ.700 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యం’ అనంతపురం అగ్రికల్చర్: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.700 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక డీసీసీబీ ప్రధాన కార్యాయలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని బ్రాంచ్ మేనేజర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2026 మార్చి 31 నాటికి నిర్ధేశించుకున్న మేర డిపాజిట్లు సేకరించాలన్నారు. ఇందుకోసం కచ్చితమైన ప్రణాళిక అమలు చేయాలన్నారు. గడువు మీరిన రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్కాబ్ డైరెక్టర్ సురేంద్ర, సీనియర్ మేనేజర్ తేజస్వి, సీఈఓ కె.సురేఖారాణి, డీజీఎంలు పాల్గొన్నారు. ధర్మవరంలో పట్టపగలే చోరీ ధర్మవరం అర్బన్: స్థానిక లింగశెట్టిపాళ్యంలో బుధవారం ఉదయం సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఘటనపై వన్టౌన్ పీఎస్లో బాధితురాలు మౌలిక ఫిర్యాదు చేసింది. వివరాలు... వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల సమయంలో టేబుల్పై ల్యాప్టాప్, సెల్ఫోన్ పెట్టి పనిలో నిమగ్నమైన ఆమె.. కాసేపటి తర్వాత మిద్దైపెకి వెళ్లి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో తల్లి, తమ్ముడు లోపల గదిలో ఉండగా బయట గదిలో టేబుల్పై ఉంచిన కంపెనీ ల్యాప్టాప్, సెల్ఫోన్ను దుండగుడు అపహరించుకెళ్లాడు. గేటు శబ్దం రావడంతో ఎవరో వచ్చారని కుటుంబ సభ్యులు బయటకెళ్లి చూశారు. గేటు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి బయటి గదిని పరిశీలించారు. టేబుల్పై ఉన్న ల్యాప్టాప్, సెల్ఫోన్ కనిపించలేదు. దీంతో అవి అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని వెంటనే చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పీఏబీఆర్కు తగ్గిన ఇన్ఫ్లోకూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) లోకి బుధవారం ఇన్ఫ్లో బాగా తగ్గిపోయింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కుల చేరుతుండగా, 470 క్యూసెక్కులు తగ్గించారు. దీంతో 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. అలాగే హెచ్చెల్సీ లింక్ చానల్ ద్వారా 150 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్లో 5.18 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో రెండు గేట్ల ద్వారా 460 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్ డ్యామ్కు విడుదల చేస్తున్నారు. -
వెలుగుల చామంతి
గాండ్లపెంట: విద్యుత్ వెలుగుల కాంతిలో చామంతి పూల సాగు చేపట్టి గాండ్లపెంట మండలం ద్వారనాల గ్రామానికి చెందిన రైతు శ్రీనాథ్రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గ్రామ సమీపంలో కదిరి – రాయచోటి ప్రధాన రహదారి పక్కన తనకున్న ఐదు ఎకరాల్లో ఆయన చామంతి పూల సాగుచేపట్టాడు. బెంగళూరు రూరల్ పరిధిలోని ఆనేకల్లు ప్రాంతం నుంచి ఒక్కో మొక్కను రూ.1.50 నుంచి రూ.3 వరకూ వెచ్చించి కొనుగోలు చేశాడు. పంట సాగులో వినూత్న పద్ధతులు అవలంభించడంతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పంటను హైదరాబాద్, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. కృత్రిమ కాంతితో సత్ఫలితాలు సాధారణంగా చామంతి మొక్క ఏపుగా ఎదిగి అధిక దిగుబడి ఇవ్వాలంటే రోజుకు 14 గంటల వెలుగు ఉండాలి. అయితే శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండడంతో రైతు శ్రీనాథ్రెడ్డి తన పొలంలో చేపట్టిన చామంతి సాగులో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను అమర్చాడు. పగటి వేళ సూర్య కాంతితో పాటు రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగు కారణంగా మొక్క నాటిన నెల రోజులకే ఒకటిన్నర ఎత్తుకు ఏపుగా పెరిగి నెలన్నరకే పంట కోతకు వచ్చింది. ఆ తర్వాత విద్యుత్ బల్బులు తొలగించేశాడు. ఈ విధానం ద్వారా నాలుగు నుంచి ఆరు నెలల వరకూ అధిక దిగుబడి వచ్చింది. ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం ఉండదు. పశువుల పేడ ఎరువు మాత్రమే వినియోగిస్తే చాలు. నీటి తడులు కూడా చాలా తక్కువ. దీంతో పెట్టుబడుల భారం కూడా తగ్గింది. విద్యుత్ వెలుగుల్లో పూలసాగు ద్వారనాల రైతు వినూత్న పద్ధతులుపొరుగు రాష్ట్రాల మార్కెట్కు తరలిస్తా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా మొక్క నాటిన నెలన్నరకే ఏపుగా పెరిగి పూలు కోతకు వస్తాయి. ఆ సమయంలో విద్యుత్ దీపాలను తొలగించేస్తా. ఎకరాకు 4 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిని తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు పంటను తరలిస్తా. – శ్రీనాథ్రెడ్డి, రైతు, ద్వారనాల -
దోచుకునేందుకే వైద్య విద్య ప్రైవేటీకరణ
పుట్టపర్తి టౌన్: తనకు దోచి పెట్టే అస్మదీయులకు మెడికల్ కళాశాలలు కట్టబెట్టి వైద్య విద్య ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు తెరలేపారని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ధ్వజమెత్తారు. కోటి సంతకాల ముగింపు సందర్భంగా బుదవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇందులో కొన్ని కళాశాలల భవనాలు పూర్తయి తరగతులూ కొనసాగుతున్నాయన్నారు. మరికొన్ని కళాశాలల భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రూ. 8వేల కోట్లు ఖర్చు పెడితే ఈ కళాశాలలన్నీ అందుబాటులోకి వచ్చి ఏటా 20,500 మంది పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగే అవకాశముందన్నారు. తన 18 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేని చంద్రబాబు ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా తన అనుయాయులకు కట్టబెట్టి దోచుకునేందుకు తెరలేపారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరం కావడంతో పాటు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించి స్వచ్చందంగా సంతకాలు చేసి కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అక్రమ బిల్లులపై సంతకాలా? సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన సత్యసాయి బాబా శతయంతి ఉత్సవాల సమయంలో తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు గాను రూ.80 లక్షలు ఖర్చు అయినట్లుగా పెట్టిన బిల్లుపై సంతకాలు పెట్టాలంటూ మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతిని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. దాతలు నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వారు వేయించిన రోడ్డుకు సంబంఽధించి కూడా బిల్లులు చేయాలని ఒత్తిళ్లు చేయడం పల్లె దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సంతకం పెట్టకపోతే బిల్డింగ్ కూలుస్తామని, చెత్త ఎత్తనివ్వకుండా అడ్డుకుంటామని, తాగునీటి సరఫరా నిలిపి వేసి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరింపులకు దిగడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశప్ప, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధాకర్రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి ఫొటో సాయి, నాయకులు అవుటాల రమణారెడ్డి, గోవర్దన్రెడ్డి, ఎంపీపీలు శ్రీధర్రెడ్డి, ఏవీ రమణారెడ్డి, కన్యాకుమారి, కవిత, సాయిగీత, రవినాయక్, నరసారెడ్డి, ఈశ్వరయ్య, కేశప్ప, శ్యామ్సుందర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, జయప్ప, లక్ష్మీరెడ్డి, గంగాద్రి, మాధవరెడ్డి, రామాంజనేయులు, శ్రీధర్రెడ్డి, భాస్కర్, షామీర్ బాషా, జగన్మోహన్ చౌదరి, సతీష్రెడ్డి, సందీప్నాయుడు, వాల్మీకి శంకర్, రుషీకేశవరెడ్డి, నాగిరెడ్డి, రంగప్ప, భాస్కర్, మల్లికార్జున, కుళ్లాయప్పనాయక్, విజయకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి -
టీచర్ల నిరసన ర్యాలీ
మడకశిర: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మడకశిరలో టీచర్లు బుధవారం ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక అమరాపురం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం కార్యాలయం ఎదుట కాసేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. 2010 సంవత్సరానికి ముందు నియామకమైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూన్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలని కోరారు. టెన్త్ వంద రోజుల ప్రణాళికలో పబ్లిక్ సెలవులు, పండుగ దినాలను మినహాయించాలన్నారు. డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 18న డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కళ్యాణచక్రవర్తికి అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, జిల్లా కార్యదర్శి నరసింహప్ప, స్థానిక యూటీఎఫ్ నాయకులు మహలింగప్ప, జోగప్ప, మూడ్లగిరియప్ప తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ రూరల్: టెట్ నుంచి ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం పెనుకొండలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ ఆనంద్కుమార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, నాయకులు నరేష్కుమార్, నారాయణ స్వామి, రమేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


