Sri Sathya Sai District News
-
పట్టుగూళ్ల కేంద్రాన్ని పరిశీలించిన జేడీ
హిందూపురం: స్థానిక పట్టు గూళ్ల కేంద్రాన్ని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డెరెక్టర్ శోభారాణి శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రానికి రోజూ వస్తున్న గూళ్ల నాణ్యత, ధరలు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గూళ్లను పరిశీలించారు. తన గూళ్లు నాణ్యతగా ఉన్నా ధర తక్కువగా వేశారని ఓ రైతు వాపోయాడు. దీంతో మార్కెట్ అధికారి రైతుకు ధర సమజసం కాకపోతే తనవద్దకు వచ్చి తెలియజేస్తే రీలర్తో సంప్రదించి కొంతమేర పెంచేడానికి కృషి చేస్తామన్నారు. వెంటనే ఆ రైతుకు సంబంధించిన గూళ్ల లాట్ కొనుగోలు చేసిన రీలర్ను పిలిపించి కిలోపై మరో రూ.15 పెంచాలని చెప్పి రూ.585 ధర నిర్ణయించారు. రైతు సంఘం నాయకులు వెంకటరామరెడ్డి, సిద్ధారెడ్డి పలువురు జేడీని కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ప్రోత్సాహాకాలను మంజూరు చేయాలని కోరారు. -
ఘర్షణ కేసులో పలువురి అరెస్ట్
పుట్టపర్తి టౌన్: ఆరు రోజుల క్రితం కొత్తచెరువులో స్థల వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ మారుతీప్రసాద్ తెలిపారు. పుట్టపర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కొత్తచెరువు గ్రామానికి చెందిన దాల్మిల్ సూరి, మహాలక్ష్మి దంపతులు ఐదేళ్ల క్రితం స్థానిక ధర్మవరం రోడ్డులోని సర్వే నంబర్ 446లో 7.65 ఎకరాల భూమిని అనంతపురంలోని వేణుగోపాలనగర్కు చెందిన తిరుమలశెట్టి గారి సుశీలమ్మకు విక్రయించారు. అయితే ఆ భూమిని అప్పగించకుండా వేధిస్తూ వచ్చారు. దీనిపై ఈ నెల 7న సుశీలమ్మ గట్టిగా నిలదీసింది. ఆ సమయంలో ఘర్షణ పడిన సూరి, మహాలక్ష్మి దంపతులు తమ అనుచరులతో కలసి సుశీలమ్మ కుమారుడు సాగర్రెడ్డి, ఇద్దరు డ్రైవర్లు, మరో ఏడుగురు కూలీలపై ఐరన్ రాడ్లు, కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. ఘటనలో గాయపడిన తొమ్మిదిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన చిన్నకుళ్లాయప్ప, వెల్లూరు ఆంజనేయులు, వలిపి పెద్దన్న, బండ్లపల్లి ఆదినారాయణ, మహేష్ను శుక్రవారం మధ్యాహ్నం కొత్తచెరువు మార్కెట్ యార్డ్ సమీపంలో అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి
కళ్యాణదుర్గం: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో చరిత్రహీనులవుతారని ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహమ్మద్ అన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కంబదూరు మండలం డీసీ పల్లిలో సాగింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతతో కలసి నదీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలారి రంగయ్యతో కలసి వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అన్ని కులాలతో పాటు స్వచ్ఛంద సంస్థల హక్కులను దోచుకుతినడం పరిపాటిగా మారిందన్నారు. పేదల అభ్యున్నతి కోసం పరితపిస్తున్నఆర్డీటీ కార్యక్రమాలకు విదేశీ నిధులే ముఖ్యమన్నారు. ఎన్నికల ముందు సీట్ల కోసం, అధికారం చేపట్టిన తర్వాత మంత్రి పదవుల కోసం వారాల తరబడి చర్చలు జరిపిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు.. నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంపై పెదవి విప్పకపోవడం దుర్మార్గమన్నారు. ఆర్డీటీ అనేది మతానికి సంబంధించినది కాదని, కేవలం మానవత్వానికి సంబంధినదని గుర్తించాలన్నారు. 55 ఏళ్లుగా తలెత్తని సమస్య కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఆర్డీటీకి ఇంతటి కష్టం రాలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ భీమేష్, మండల కన్వీనర్ హనుమంతరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరతో పాటు ఆర్డీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేకపోతే చరిత్ర హీనులవుతారు ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం, మాజీ ఎంపీ తలారి రంగయ్య -
విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి టౌన్: విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారంతో పాటు మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ ఆ శాఖ ఎస్ఈ సంపత్కుమార్ను మీటర్ రీడర్లు వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఈని ఆయన చాంబర్లో కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. 20 సంవత్సరాలుగా మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నామని, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడంతో కుటుంబపోషణ భారమైందని వాపోయారు. పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకపోయినా తమకు న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎస్కో అకౌంట్ ఓనెన్ చేసి జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు రవి, వినోద్, నరేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
కొందరికే ‘వందనం’
పుట్టపర్తి అర్బన్: కూటమి సర్కార్ అట్టహాసంగా ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకం కొందరికే పరిమితం కావడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హుల జాబితాలను శుక్రవారం సచివాలయాల్లో ప్రదర్శించగా...విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున సచివాలయాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జాబితాలను చూస్తూ తమ పేర్లు వెతుక్కున్నారు. అయితే గతంలో ‘జగనన్న అమ్మఒడి’కి అర్హులై ఆర్థిక సాయం అందుకున్న చాలా మంది పేర్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అర్హులమైన తాము..ఇప్పుడు ఎందుకు అర్హత సాధించలేకపోయామని సచివాలయ సిబ్బందిని ప్రశ్నించినా వారి నుంచి సమాధానం కరువైంది. ఒక్క పుట్టపర్తి మండలం పెడపల్లిలోనే సుమారు 300 మంది పేర్లు అర్హుల జాబితాలో కనిపించ లేదు. ఇక జిల్లా వ్యాప్తంగా ఈ లిస్టు వేలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సర్కార్ చేసిన ‘అనర్హత’ మాయపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.2 వేలు కోత.. అర్హుల జాబితాలో ఉన్న వారికి కూడా రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే జమ కావడంతో వారు కూడా పెదవి విరిచారు. ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబే కోతలు, వాతలు లేకుండా ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో ఎంత మంది చదువుకుంటున్నా..రూ.15 వేల చొప్పున అందిస్తామని చెప్పారని, ఇప్పుడు పాఠశాల నిర్వహణ పేరుతో రూ.2 వేలు కోత విధించారంటున్నారు. జాబితాల్లో కనిపించని అర్హుల పేర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు -
ఉపాధ్యాయులకు తప్పని జాగరణ
అనంతపురం ఎడ్యుకేషన్/పుట్టపర్తి: సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీల)కు జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్లో జాగరణ తప్పడం లేదు. వరుసగా మూడోరోజూ పడిగాపులు కాశారు. శుక్రవారం సీరియల్ నంబరు 1001 నుంచి 1800 దాకా పిలిచారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రంతా కొనసాగింది. పరిశీలకులు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు దగ్గరుండి పర్యవేక్షించారు. భాషా పండితుల ఆందోళన గత జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తే... ప్రస్తుత కూటమి సర్కార్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 90 మందికి పదోన్నతులు, బదిలీలు కల్పించటంలో పూర్తిగా విఫలమైందని పండిట్లు ధ్వజమెత్తారు. ఏటా బదిలీలు, సర్దుబాటు పేరుతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఆందోళన చేశారు. పదోన్నతులు, బదిలీల అంశంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ వరుసగా మూడో రోజు శుక్రవారం అనంతపురంలోని ఆర్డీటీ సమ్మిళిత పాఠశాలలో చేపట్టిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ను అడ్డుకోవడంతో ఆగిపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను బయటకు వెళ్లాలని చెప్పడంతో... శాంతియుత నిరసన తెలియజేస్తామని చెప్పి ప్లకార్డులు పట్టుకుని మధ్యాహ్నం వరకు వరకూ వేదికపై కూర్చున్నారు. సంఘాల నాయకులు కలుగజేసుకోవడంతో.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పరిశీలకులు, డీఈఓ హామీ ఇచ్చారు. ఓవైపు కౌన్సెలింగ్.. మరోవైపు ఆందోళన -
సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు నిల్
● తేల్చి చెప్పిన భద్రతా కమిటీ సభ్యులు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం లేవని, అత్యంత కీలకమైన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వృథాగా ఉందని, సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పాటు సెక్యూరిటీ అంతంత మాత్రంగానే ఉందని సెక్యూరిటీ వింగ్ ఆడిట్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సెక్యూరిటీ వింగ్ ఆడిట్ కమిటీ సభ్యులైన డీఎస్పీ సాయిరాం (విజయవాడ), ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ లింగమయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖాధికారులు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలపై అణువణువూ తనిఖీ చేశారు. రూ.2.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ నిరుపయోగంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏమైనా అగ్రిప్రమాదం జరిగితే ప్రస్తుతం ఉన్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్తో ఎటువంటి ఉపయోగమూ లేదన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా ఆస్పత్రిలో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పూర్తిగా లేవని తెలుసుకున్నారు. వివిధ వార్డులకు సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించారు. పార్కింగ్కు స్థలం లేదని, బైక్లు, కార్లు, అంబులెన్స్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని గుర్తించారు. వాహనాలు ఎప్పుడైనా అగ్నిప్రమాదానికి గురైతే రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల చుట్టూ ప్రహరీని పకడ్బందీగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం డీఎస్పీలు సాయిరాం, నీలకంఠేశ్వర రెడ్డి సూపరింటెండెంట్ను కలిశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాయిస్ సీసీ కెమెరాలను అందుబాటులో తేవాలన్నారు. అదేవిధంగా వైద్యులపై దాడులకు పాల్పడితే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా చట్టాలున్నాయన్న బోర్డులను వివిధ వార్డుల్లో ఏర్పాటు చేయాలన్నారు. -
వివాహిత హత్య కేసులో వీడిన మిస్టరీ
పుట్లూరు: గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తే కాలయముడై ఆమెను హతమార్చినట్లుగా నిర్ధారించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పుట్లూరు పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ సత్యబాబు వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా దింబల్గుడి గ్రామానికి చెందిన సంగీత (21), నాగరాజు దంపతులు బతుకు తెరువు కోసం పుట్లూరు మండలానికి వలస వచ్చారు. ఎ.కొండాపురం గ్రామంలో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగించేవారు. గత ఏడాది అక్టోబర్ 15న సంగీత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గొంతు నులిమి హతమార్చినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో గురువారం భర్త నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో తన భార్యపై అనుమానంతో గొంతు నులిమి తానే హతమార్చినట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుడి అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐ వెంకటనరసింహ, సిబ్బందిని సీఐ సత్యబాబు అభినందించారు. గత ఏడాది అక్టోబర్లో వివాహిత అనుమానాస్పద మృతి హత్యగా నిర్ధారించిన పోలీసులు నిందితుడి అరెస్ట్ -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి కల్యాణం శుక్రవారం కమనీయంగా సాగింది. ఏటా జేష్ట్య మాసంలో స్వామివారికి నిత్య కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెలలో శనివారం, పర్వదినాలు తప్ప మిగతా రోజుల్లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా అర్చకులు ఆలయంలోని రంగ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుని కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయ పద్ధతిలో కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా భక్తులతో పాటు కర్ణాటక నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. అనంతరం వారంతా శ్రీవారిని దర్శించుకున్నారు. -
బెంగళూరు – బీదర్కు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 29 వరకు శుక్ర, ఆదివారాల్లో (5 సర్వీసులు మాత్రమే) రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. 15న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు ఎక్స్ప్రెస్ రైలు (06539) బయలుదేరి బీదర్ జంక్షన్కు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు బీదర్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బెంగళూరుకు మరుసటి తెల్లవారుజూమున 4 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి శని, సొమవారాల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయంరోడ్డు, రాయచూర్, కృష్ణ, యద్గారి, వాడి, షాహబాద్, కలబురిగి, హమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైలులో 2–ఏసీ, 3–ఏసీ, స్లీపర్బోగీలతోపాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 13 మండలాల్లో వర్షంపుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 13 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా బత్తలపల్లి మండలంలో 16.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పుట్టపర్తి మండలంలో 10.2 మి.మీ, అమడగూరు 6.2, అమరాపురం 5.4, ధర్మవరం 4.2, తలుపుల 2.2, నల్లచెరువు 2, సోమందేపల్లి 2.0, బుక్కపట్నం 1.8, తనకల్లు 1.8, తాడిమర్రి, ముదిగుబ్బ, గాండ్లపెంట మండలాల్లో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బీ ఫార్మసీ ఫలితాలు విడుదలఅనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీ ఫార్మసీ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ , (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎస్.శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు సోమందేపల్లి: స్థానిక ఓ కాలనీలో నివాసముంటున్న 15 ఏళ్ల వయసున్న బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన అదే ప్రాంతానికి చెందిన గోవిందరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. నాలుగు నెలలుగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యటు చేపట్టినట్లు వివరించారు. -
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ఈ–స్టాంప్ల విక్రయాలకు సంబంధించి విక్రయదారులకు కమీషన్ను రిజిస్ట్రేషన్ శాఖ చెల్లిస్తోంది. కాబట్టి అధిక ధరకు వారు విక్రయించరాదు. అలా కాదని అధిక ధరకు విక్రయించే వారి లైసెన్సు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ల కొరతపై ఇప్పటికే ఐజీ కార్యాలయానికి నివేదిక అందజేశాం. వచ్చే నెల మొదటి వారంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. – విజయలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
కుక్కల దాడిలో గొర్రెల మృతి
పుట్లూరు: వీధి కుక్కల దాడిలో 37 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. పుట్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద గొర్రెలను దొడ్డిలో ఉంచేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గొర్రెలను దొడ్డిలో వదిలి ఇంటికెళ్లి నిద్రించాడు. శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకునేలోపు దాదాపు 10 కుక్కలు చుట్టుముట్టి గొర్రెలపై దాడి చేస్తుండడాన్ని గమనించి, వాటి అదలించేలోపు 37 గొర్రెలు మృతి చెందాయి. జీవనాధారంగా ఉన్న గొర్రెల మృతితో శ్రీనివాసులు కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పులు చేసి ఇటీవల గొర్రెలను కొనుగోలు చేశానని, ఘటనతో రూ.3 లక్షలు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ అలివేలమ్మ, డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్బాషా, వీఆర్వో వెంకటనారాయణ, పంచాయతీ కార్యదర్శి సంధ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించి, నివేదిక సిద్ధం చేయించారు. గొర్రెల మృతితో నష్టపోయిన శ్రీనివాసులును ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
బదిలీ టీచర్లకు ‘స్పౌజ్’ తంటా
అనంతపురం ఎడ్యుకేషన్: దంపతులిద్దరూ ఉద్యోగులై ఉండి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి ‘స్పౌజ్’ పాయింట్ల పద్ధతి తీసుకొచ్చింది. దీనిద్వారా బదిలీల్లో భార్య/భర్తలో ఒకరు ఐదు పాయింట్లు పొందవచ్చు. ‘స్పౌజ్’ కోటాలో బదిలీ అయ్యే భర్త లేదా భార్య పని చేస్తున్న సమీపంలోకి వెళ్లాలి. ఇద్దరూ వెళ్లొచ్చేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే ‘స్పౌజ్’ కోటాలో పాయింట్లు పొందిన చాలామంది భర్త/భార్య పని చేస్తున్న సమీపానికి కాకుండా జిల్లా కేంద్రానికి లేదా వారికి అనుకూలమైన స్కూళ్లకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో చాలామంది జిల్లా సరిహద్దు మండలాల్లో పని చేస్తున్నా.. వారి భాగస్వాములు మాత్రం ‘స్పౌజ్’ పాయింట్లు పొంది జిల్లా కేంద్రం, పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు. ‘స్పౌజ్’ సమీపంలోకి వెళ్లాల్సిందే! తాజాగా ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో ‘స్పౌజ్’ నిబంధనలను విద్యాశాఖ అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. భార్య, భర్త పని చేస్తున్న స్కూల్లో ఖాళీగా ఉంటే కచ్చితంగా అక్కడికి పోవాల్సిందే. అక్కడ ఖాళీ లేకపోతే సమీప స్కూళ్లు, మండలం, ఆ తర్వాత పక్క మండలాలకు వెళ్లాల్సి ఉంది. ఒకే స్కూల్కు అంటే ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు తక్కువ సంఖ్యలో ఉంటారని, ఈ నేపథ్యంలో అవసరాలకు దంపతులిద్దరూ ఒకేసారి సెలవు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుందని బాధిత టీచర్లు వాపోతున్నారు. పాయింట్లు ఎక్కువ ఉన్నా దూర ప్రాంతాలకు.. ఎక్కువ పాయింట్లు ఉండికూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కూడేరు మండలం గొట్కూరులో పని చేస్తున్న శ్రీదేవికి స్పౌజ్ పాయింట్లతో కలిపి 42.6 పాయింట్లు ఉన్నాయి. ఈమె భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల గణితం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది బొమ్మనహాళ్ మండలం గోవిందవాడకు వెళ్లారు. దీంతో శ్రీదేవి కూడా అక్కడికి పోవాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పడంతో ఆమె కూడా బొమ్మనహాళ్ మండలానికి వెళ్లారు. 35, 36 పాయింట్లు ఉన్న జనరల్ టీచర్లకు అనంతపురం చుట్టుపక్కన 16 శాతం హెచ్ఆర్ఏ స్కూళ్లు వచ్చాయి. తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, కదిరి, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, గుత్తి ప్రాంతాల్లో ఎక్కువమంది ‘స్పౌజ్’ టీచర్లు పాయింట్లు ఎక్కువ ఉన్నాకూడా భర్త/భార్య పని చేస్తున్న కారణంగా దూరంగా వెళ్లారు. ● ఉరవకొండ మండలంలో భర్త పని చేస్తున్న స్కూల్లో ఖాళీగా ఉండడంతో ‘స్పౌజ్’ పాయింట్లు పొందిన భార్య పక్కన మరో స్కూల్ను కోరుకుంది. కొందరు అభ్యంతరం చెప్పడంతో భర్త పని చేస్తున్న స్కూల్కు వెళ్లాల్సి వచ్చింది. ● రాష్ట్ర కేడర్ కల్గిన ఉద్యోగులు జిల్లాలో పని చేస్తుంటే ‘స్పౌజ్’ కింద వారి సమీపంలోకి వెళ్లాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భార్య అనంతపురం రూరల్ మండలంలో కోరుకోవాలని చూసినా...డీఈఓ ఒప్పుకోలేదు. ● శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరిలో భర్త సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. భార్య దాడితోటలో ఎస్జీటీగా పని చేస్తోంది. పిన్నదరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బత్తలపల్లి మండలం మాల్యవంతం ఇవ్వాలని కోరినా.. మండలం వేరే అవుతున్న కారణంగా ఇవ్వడానికి సాధ్యంకాదని డీఈఓ తేల్చి చెప్పారు. స్పష్టమైన ఆదేశాలు ‘స్పౌజ్’ పాయింట్లు పొందిన వారు ఇష్టానుసారంగా స్థానాలు కోరుకునేందుకు లేదు. ప్రత్యేకించి ఈ విషయంలో కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ‘స్పౌజ్’ పని చేస్తున్న స్కూల్కు సమీపంలోకి వెళ్లాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. – ఎం.ప్రసాద్బాబు డీఈఓ, అనంతపురం తప్పనిసరిగా ‘స్పౌజ్’ సమీపంలోకి వెళ్లాల్సిందే ‘స్పౌజ్’ పాయింట్లు పొందినవారికంటే జనరల్ టీచర్లకు సౌకర్యవంతమైన స్కూళ్లు ఎక్కువ పాయింట్లు ఉన్నా దూరానికి వెళ్తున్న ‘స్పౌజ్’ టీచర్లు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న విద్యాశాఖ తలలు పట్టుకుంటున్న ‘స్పౌజ్’ టీచర్లు -
1.10 లక్షల క్వింటాళ్లు
కూటమి సర్కారు పుణ్యమా అని అన్నదాతలు దగాకు గురవుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో సబ్సిడీ వేరుశనగ విత్తనకాయల పంపిణీలోనూ అన్యాయం చేస్తున్నారు. సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల కక్కుర్తి, ఏజెన్సీల ధనదాహం వెరసీ రైతులకు నాసిరకం విత్తనకాయలు అంటగట్టి నిలువునా ముంచుతున్నారు. ఏమాత్రమూ ప్రాసెసింగ్ చేయకుండానే విత్తనకాయలను ఏజెన్సీల నుంచి పంపిణీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి అనంత జిల్లాకు కావాల్సిన వేరుశనగ విత్తన కాయలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: విత్తన కాయలను రైతుల దగ్గర కొని, శుద్ధి చేసి నాణ్యమైన వాటిని అందించే బాధ్యత ఏపీసీడ్స్ కార్పొరేషన్ది. అయితే, కొన్ని రోజులుగా విత్తన వేరుశనగను సేకరించి.. వాటిని శుద్ధి చేసే బాధ్యతలను కొన్ని ఏజెన్సీలకు అప్పజెబుతున్నారు. ఇక్కడే మతలబు మొదలైంది. సాధారణంగా ఏజెన్సీలకు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిన తర్వాతే విత్తన కాయల శుద్ధి, సరఫరా జరగాలి. కానీ కొన్ని ఏజెన్సీలకు అనుమతులు ఇవ్వకముందే విత్తనకాయల సరఫరా మొదలుపెట్టాయి. వాస్తవానికి శుద్ధి చేసిన తర్వాత నాణ్యమైన విత్తనకాయలను మాత్రమే రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కేల)కు తరలించాలి. అక్కడ రైతులకు పంపిణీ చేస్తారు. అయితే.. ఏమాత్రమూ ప్రాసెసింగ్ (శుద్ధి) చేయకుండానే నాసిరకం కాయలను సంచుల్లో నింపి పంపిస్తున్నారు. ఏజెన్సీలు, అధికారుల కుమ్మక్కు రైతులకు నాణ్యమైన విత్తనకాయలు అందేలా చూడాల్సిన ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు ఏజెన్సీలతో కుమ్మకై ్క తమ బాధ్యతలను గాలికొదిలేశారు. విత్తన కాయలు శుద్ధి అవుతున్నాయా, నాణ్యతగా ఉన్నాయా, లేదా అనేది ఎక్కడా పరిశీలించలేదు. ఏజెన్సీలు విత్తనకాయలను శుద్ధి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఉన్నాయో, లేదో వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించిన అనంతరం వాటికి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ వారు కూడా సరఫరా ఏజెన్సీల ఇష్టారాజ్యానికి వదిలేశారు. అసలు ఏమాత్రమూ శుద్ధి చేయకుండానే ఇప్పటివరకు రెండు జిల్లాల్లో పెద్దఎత్తున విత్తన కాయలను ఆర్ఎస్కేలకు చేర్చారు. అక్కడక్కడ అనుమానం వచ్చిన చోట్ల ఆర్ఎస్కే సిబ్బంది విత్తనకాయలను పరిశీలించి..నాణ్యత లేనివాటిని వెనక్కి పంపిస్తున్నారు. దరఖాస్తు చేయకముందే అనుమతి ఇచ్చారట! ఉమ్మడి అనంతపురం జిల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీలో భాగంగా విత్తన శుద్ధి, ప్యాకింగ్, సరఫరాకు సంబంధించి మొత్తం 18 ఏజెన్సీలకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే రైతులకు విత్తన పంపిణీ మొదలుపెట్టారు. అయితే..అనుమతులు రాకముందు నుంచే కొన్ని ఏజెన్సీలు విత్తనకాయల సరఫరా మొదలుపెట్టడం గమనార్హం. అధికారులు భరోసా ఇవ్వడం వల్లే ఇలా చేశాయన్నది స్పష్టమవుతోంది. ఈ ఏజెన్సీల్లో కదిరిలోని శ్రీ కార్తికేయ ఆగ్రో సీడ్స్ తో పాటు మరికొన్ని ఉన్నాయి. వాస్తవానికి ఇవి గత నెల 31న అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే..అంతకుముందే అంటే మే 26, 27వ తేదీనే అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేయకముందే అనుమతి ఎలా ఇచ్చారన్నది అంతుపట్టని విషయం. పైగా ఈ ఏజెన్సీలకు ఫీల్డ్ సూపర్వైజర్ను కూడా సీడ్ కార్పొరేషన్ డీఎం నియమించడం అనుమానాలకు తావిస్తోంది. పావగడ నుంచి విత్తనకాయలు ఉమ్మడి అనంతపురం జిల్లా సీడ్ కార్పొరేషన్ అధికారికి కర్ణాటకలోని పావగడ వద్ద ఓ విత్తన శుద్ధి ప్లాంటు ఉన్నట్టు సమాచారం. అక్కడి నుంచి విత్తనకాయలను అనుమతులు లేకుండా ఏజెన్సీలకు సరఫరా చేసి.. అక్కడి నుంచి రైతులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. విత్తనకాయల శుద్ధి, నాణ్యతపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గానీ, కలెక్టర్ల పరిధిలో గానీ ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో రైతులు దగాకు గురవుతున్నారు. ఏజెన్సీలు, సీడ్ కార్పొరేషన్ అధికారులు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్న చందాన వ్యవహారం నడుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన సుబ్రమణ్యేశ్వర ఆగ్రోసీడ్స్ సంస్థను అడ్డుపెట్టుకుని ఇక్కడ సీడ్ కార్పొరేషన్ అధికారి భారీ దందా చేస్తున్నట్టు తెలిసింది. టెండర్లో క్వాలిఫై అయ్యారని ఇచ్చారట.. విత్తన కాయల పంపిణీలో అక్రమాలపై సీడ్ కార్పొరేషన్ డీఎం రామసుబ్బయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన తికమక సమాధానాలు ఇచ్చారు. క్వాలిఫై అయింది కాబట్టి సుబ్రమణ్యేశ్వర ఆగ్రో సీడ్స్ తరఫున ఏజెన్సీకి ఇచ్చామని ఒకసారి, అవి వ్యవసాయశాఖ ఇచ్చిన అనుమతులని మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైందని ఆయన చెప్పడం కొసమెరుపు. దీంతో మొత్తం వ్యవహారంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకూ సరఫరా అయినవిఇంకా రావాల్సినవిఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట సాగు2.40లక్షలు పైనేరైతులుశెనిక్కాయ మాటున డబ్బుల గుటుక్కు అనుమతులు రాకముందే ఏజెన్సీల నుంచి విత్తన కాయల సరఫరా 31న ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే 26నే అనుమతులు! ప్రాసెసింగ్ చేయకుండానే విత్తనకాయల సరఫరా మొత్తం వ్యవహారంలో ఓ అధికారిపై తీవ్ర విమర్శలు కాసుల కక్కుర్తితో రైతులను నిండా ముంచుతున్న వైనం -
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది
పెనుకొండ రూరల్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినా.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’ టీవీ డిబేట్లో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు ‘సాక్షి’కి ఆపాదించడంతో పాటు వ్యాఖ్యాతగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. 70 ఏళ్ల వయసున్న కొమ్మినేనిపై ప్రభుత్వం కక్ష కట్టి, కటకటాల పాలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అందుకే ఆయనపై నమోదు చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ నమోదు చేయించిందన్నారు. చివరకు జడ్జి కల్పించుకుని ఆ సెక్షన్ను తీసివేయించారంటే సర్కార్ కక్షసాధింపు చర్యలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ప్రశ్నించే గొంతుకలను కూటమి నొక్కుతోందన్నారు. ఈ క్రమంలోనే కూటమి శ్రేణులను, మహిళా సంఘాలను రెచ్చగొట్టి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పిందన్నారు. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న ‘సాక్షి’పై, సీనియర్ జర్నలిస్టులపై కూటమి సర్కార్ ఎన్ని కుట్రలు చేసి ఇబ్బందులకు గురిచేసినా.. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. సుప్రీం తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఉషశ్రీచరణ్ కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పండిట్లు బలి
● సర్దుబాటు పేరుతో రెండేళ్లకోసారి బదిలీ అవుతున్న డీఈఓ పూల్లోని పండిట్లు ● ఆరేళ్లలో నాలుగోసారి బదిలీ అవుతున్నామంటూ ఆవేదన ● పాఠశాల విద్య ఆర్జేడీని అడ్డుకున్న పండిట్లు అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ పూల్లో ఉన్న బాషా పండితుల ఇబ్బందులను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలూ స్పందించడం లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ గురువారం స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ సమ్మిళిత పాఠశాలలో జరుగుతున్న ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ను డీఈఓ పూల్లో ఉన్న పండిట్లు అడ్డుకున్నారు. అరగంటకు పైగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ను ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. డీఈఓ పూల్లో ఉన్న పండిట్లను ప్రతి రెండేళ్లకోసారి బలవంతపు బదిలీలు చేస్తున్నారన్నారు. గత ఆరేళ్లలో ఇది నాలుగోసారి బదిలీ అన్నారు. గత రెండేళ్లలో సర్దుబాటు పేరుతో మరొక చోటుకి పంపారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,300 మంది పండిట్లు డీఈఓ పూల్లో ఉంటే ఉమ్మడి జిల్లాలోనే 111 మంది ఉన్నారన్నారు. వీరిలో తెలుగు 89 మంది, హిందీ 14, ఉర్దూ ఏడుగురు, కన్నడ ఒకరు ఉన్నారన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా... 2024, డిసెంబర్ 20న జస్టిస్ మన్మధరావు ధర్మాసనం (సింగిల్ బెంచ్) పండితులకు అనుకూలంగా తుది తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 2019 నుంచి అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి 3 నెలల గడువులోపు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఆదేశించారన్నారు. పలుమార్లు విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదున్నారు. ఇంతలో ఎస్జీటీ సంఘాల నాయకులు స్టేటస్ కో తెచ్చి సమస్యను మరింత జటిలం చేశారని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చివరకు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల్లాగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సరైన న్యాయం చేయాలని కోరారు. ఎస్జీటీల బదిలీల అనంతరం చర్యలు తీసుకుంటామంటూ ఆర్జేడీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ఆర్డీటీపై ఆంక్షలు ఎత్తివేయాలి
కళ్యాణదుర్గం: ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రకు గురువారం ఆయనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఆర్డీటీ వరదాయినిగా ఉందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతూ పేదలకు అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. ఆర్డీటీని కాపాడుకునేందుకు జిల్లాలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, సీఎం చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరవాలన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆర్డీటీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఆర్డీటీ లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించి ఆ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం రంగయ్య పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వమే స్వయంగా వచ్చి పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించినా ప్రజల సహకారంతో రంగయ్య పాదయాత్ర ముందుకెళ్తోందన్నారు. ప్రజలు సమైక్యంగా పాదయాత్రకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ భీమేష్, మండల కన్వీనర్ హనుమంతరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ -
కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకున్న బాలిక
హిందూపురం టౌన్: రామగిరి మండలంలో దళిత మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటన మరువక ముందే హిందూపురంలో ఓ బాలిక కిడ్నాప్ ఉదంతం సంచలనం రేకెత్తించింది. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకున్న బాలిక నాటకీయ పరిణామాల మధ్య తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేరింది. ఇందుకు హిందూపురంలోని అల్ ఇందాద్ ట్రస్ట్ పూర్తి స్థాయిలో సహకరించింది. వివరాలు... గురువారం ఉదయం హిందూపురానికి చెందిన పదేళ్ల వయసున్న ఓ బాలికను ఐస్క్రీం, చాక్లెట్లు ఇప్పిస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వెంట పిలుచుకెళ్లాడు. లేపాక్షి – నగరిగెర గ్రామాల మధ్య ఉన్న వైన్ షాప్ వద్దకు చేరుకున్న తర్వాత ఆ బాలికను బయట ఉండమని చెప్పి వైన్ షాపులోకి వెళ్లాడు. అప్పటికే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలిక అవకాశం కోసం దొరకగానే తప్పించుకుంది. ఒంటరిగా రహదారిపై కనిపించిన బాలికను గమనించిన ఆటో డ్రైవర్ రామాంజి.. వెంటనే వివరాలు ఆరా తీసి, సురక్షితంగా లేపాక్షికి చేర్చాడు. అక్కడ తనకు పరిచయమున్న బాబా అనే వ్యక్తి విషయం తెలపడంతో ఆయన ద్వారా సమాచారం అందుకున్న అల్ ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అమన్, సభ్యులు సాదిక్, రహన్, బాబా ఫకృద్దీన్, మొయిన్, ఆరీఫ్, రామాంజినేయులు తదితరులు లేపాక్షికి వెళ్లి బాలికకు ధైర్యం చెప్పారు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నాపర్ బారి నుంచి బాలిక సురక్షితంగా బయటపడిన విషయం తెలుసుకున్న ఊపిరి పీల్చుకున్నారు. -
దళితులకు రక్షణ లేదు
కూటమి సర్కార్ హయాంలో దళితులపై దాడులు, దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఏడుగుర్రాలపల్లిలో 14 మంది దుర్మార్గులు ఓ దళిత బాలికపై నెలలుగా అత్యాచారకాండ సాగించినా దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి అనిత, ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న దళిత ఎమ్మెల్యే స్పందించకపోవడం దుర్మార్గం. మేమైనా వెళ్లి బాలిక కుటుంబానికి ధైర్యం చెబుదామనుకుంటే పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డగించారు. – ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ మడకశిర సమన్వయకర్త -
జీపులో వ్యక్తి అనుమానాస్పద మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని దాదులూరు కొట్టాల సమీపంలో 44వ జాతీయ రహదారిపై వాహనంలో వెళ్తున్న ఒక వ్యక్తి అనుమానస్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. అనంతపురం నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న ఓ జీపు (తుపాన్) రాత్రి సమయంలో రహదారి పక్కన డ్రైవర్ ఆపాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు కొందరు వాహనం దగ్గరకు వెళ్లి చూడగా.. అందులో ఓ వ్యక్తి ఇరుక్కొని విగతజీవిగా ఉన్నట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, వాహనంలో ఇరుక్కొని మృతి చెందిన వ్యక్తి కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి చెందిన వాడిగా తెలిసింది. కానీ వాహనం ప్రమాదానికి గురై అతను మృతి చెందాడా? లేక ఎవరైనా అతనిని హతమార్చి వాహనంలో పడేసి వెళ్లారా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.వివాహిత ఆత్మహత్య ధర్మవరం అర్బన్: స్థానిక గూడ్స్షెడ్డు కొట్టాలకు చెందిన వివాహిత ఈశ్వరమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త మల్లికార్జున, ముగ్గురు కుమారులు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గురువారం చెరువు ఒకటో మరువ వద్ద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఐ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మూడోరోజూ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ జిల్లాలోని 17 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అగళిలో 11.6 మి.మీ, నల్లమాడలో 9.8, బుక్కపట్నం 9.4, కొత్తచెరువు 9.4, గాండ్లపెంటలో 9, చిలమత్తూరులో 7.8, పుట్టపర్తిలో 7.6, నల్లచెరువులో 4.4, కదిరిలో 4.2, లేపాక్షిలో 4.2, ధర్మవరంలో 3.4, గుడిబండలో 3, రొద్దంలో 2.8, ఓడీ చెరువులో 2.4, సోమందేపల్లిలో 1.4, బత్తలపల్లిలో 1.2, అమరాపురంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. -
అన్యాయం జరిగినా స్పందించకూడదా?
● ‘సాక్షి’ పత్రికలో రాకుంటే దారుణం బయటకు వచ్చేదేకాదు ● మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడురూరల్: ‘దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక దళిత మైనర్ బాలికకు ఘోరమైన అన్యాయం జరిగింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుంటారా.. మేమేమైనా టెర్రరిస్టులమా..’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగర శివారు లోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ 14 ఏళ్ల దళిత బిడ్డను 18 మంది అఘాయిత్యం చేసిన ఘటనపై స్పందించి అండగా నిలిచేందుకు వస్తే అరెస్ట్ చేశారన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందో, ఈ ప్రాంతంలో ఎలాంటి పాలన సాగుతోందో అర్థమ వుతోందన్నారు. హోం మంత్రి, ఈ ప్రాంతంలోని ఎస్సీ శాసనసభ్యులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. టీవీలో ఎక్కడో ఏదో మాట్లాడారంటూ అరెస్ట్లు చేస్తున్న ప్రభుత్వం, దళిత బిడ్డకు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదన్నారు. దీనిపై గవర్నరును కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. దళితురాలిగా పుట్టడమే నేరమా.. దళితులుగా పుట్టడం తప్పా అందులోనూ బాలికగా పుట్టడం నేరమా అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు పేరూరులో విజయోత్సవాలు చేసుకున్నారా.. లేదంటే తమ దెబ్బకు ఎవరినీ రానీ యలేదన్నందుకు విజయోత్సవాలు చేసుకున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆ గ్రామానికి వెళ్లి తీరతామన్నారు. దీనిపై ప్రత్యేక జ్యుడీషియల్ విచారణ జరగాలన్నారు. ‘సాక్షి’ పత్రికలో వార్త వస్తే తప్ప ఈ ఘోరం వెలుగులోకి రాలేదని వాపోయారు. ప్రత్యేక పాస్పోర్ట్ కావాలా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు వీసాలు తీసుకోవాలా.. పాస్పోర్టులు ఉండాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారం కేసులో నిందితుల బంధువులు, టీడీపీ శ్రేణులు, పరిటాల సునీత బంధువులు పేరూరులో తమ వాహనాలపై రాళ్లతో దాడి చేసి భయోత్పాతం సృష్టించారన్నారు. పరిటాల సునీత అండతోనే కర్రలు, ఇతర మారణాయుధాలతో వీరంగం సృష్టించారన్నారు. పోలీసులు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 2014–2019 మధ్య జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలను ప్రశ్నించిన తనను రామగిరి మండలంలోకి అడుగు పెట్టనివ్వలేదని, దాని ఫలితం అనుభవించారన్నారు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న సునీత ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, మధుమతి రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు. -
పరామర్శపై పైశాచికం!
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ రూరల్/చెన్నేకొత్తపల్లి/కనగానపల్లి: సామూహిక అత్యాచారానికి గురైన రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లికి చెందిన మైనర్ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శిచేందుకు గురువారం ఉదయం బయలుదేరిన వైఎస్సార్సీపీ నాయకులను ఇటు పోలీసులు... అటు పచ్చ రౌడీలు అడుగడుగునా అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ఎమ్మెల్యే పరిటాల సునీత పోలీసులను అడ్డుపెట్టుకొని భయబ్రాంతులకు గురిచేసింది. అడుగడుగునా ఆటంకాలే.. ఏడుగుర్రాలపల్లిలోని దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం పేరూరు బయలుదేరారు. పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, ఎన్ఎస్ గేటు, రామగిరి, నసనకోట, ఎగువపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి, తగరకుంట, వేపకుంట, మద్దెలచెరువువ తదితర ప్రాంతాల్లో మకాం వేసిన పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అంతకుముందు పెనుకొండ వద్ద జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక పేరూరు వైపు వస్తుండగా పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఎస్ గేటు వద్ద మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను పేరూరు వెళ్లకుండా వెనక్కి పంపించారు. కనగానపల్లి మండలం మద్దెలచెరువు వద్ద మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డిని పోలీసులు అడ్డగించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తే.. పేరూరు వెళ్లేందుకు అనుమతులు తీసుకోవాలని, అనుమతులు లేకుండా వెళ్లాలంటే అంగీకరించేది లేదని పోలీసులు వాగ్వివాదనకు దిగారు. వాస్తవాలు బయటికి వస్తాయనే.. ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అల్లరిమూకలు మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండదండలతో కొన్నాళ్లు తప్పించుకు తిరిగారు. అయితే అసలు విషయం బహిర్గతం కావడంతో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏడుగుర్రాలపల్లికి వెళ్తే.. మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో పోలీసులను అడ్డు పెట్టుకుని పరిటాల సునీత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. ఎస్పీ ఘాటు హెచ్చరిక.. వైఎస్సార్సీపీ నాయకులు పేరూరు పర్యటనకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు లభించలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే అనుమతులు ఇవ్వలేదని సమాచారం. పైగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా గ్రామాలకు వెళ్తే.. ఊరుకునేది లేదని ఎస్పీ వి.రత్న తెలిపారు. టీడీపీ సంబరాలు.. వైఎస్సార్సీపీ నేతల పర్యటన గురించి తెలిసిన వెంటనే గొడవలకు ప్లాన్ చేసిన టీడీపీ నేతలు.. ఉన్నఫలంగా పేరూరులో సంబరాలు చేశారు. తల్లికి వందనం విడుదల సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఎక్కడిడెక్కడి నుంచో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి నానా రభస చేశారు. అయినా పోలీసులు వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ నాయకులపై అధికార జులుం అత్యాచార బాలిక కుటుంబాన్ని పరామర్శించకుండా అడ్డంకులు పోలీసులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే పరిటాల సునీత పేరూరుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నాయకులను అడ్డుకున్న వైనం ప్లాన్ ప్రకారం వాహనాలపై రాళ్లు రువ్విన పచ్చ రౌడీలు వాస్తవాలు బయటికొస్తాయన్న భయంతోనే దాడుల పర్వం తండ్రి మరణించాడు..తల్లి మతిస్థిమితం సరిగా లేదు..ఏ ఆధారమూ.. ఎవరి అండాలేని దళిత మైనర్ బాలికపై 14 మంది కీచకులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడితే... నేటికీ బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించలేదు. పైగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులనూ అడ్డుకుంది. పోలీసులను ఉసిగొల్పి అడ్డంకులు సృష్టించింది. రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయించి భయానక వాతావరణం సృష్టించి పైశాచిక ఆనందం పొందింది. పక్కా ప్లాన్తోనే దాడి.. ఎక్కడికక్కడ పోలీసులు ఆటంకాలు సృష్టించినా...వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు పేరూరుకు చేరుకున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడే మకాం వేసిన టీడీపీ అల్లరిమూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లిన వాహనాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రౌడీలు రాళ్లు రువ్వారు. ఘటనలో వైఎస్సార్సీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. -
కాలుతున్న పచ్చదనం
చిలమత్తూరు: జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో పచ్చదనం కాలి బూడిదవుతోంది. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వేప, చింత, కానుగ వృక్షాల నరికవేతను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పచ్చదనం కరువవుతోంది. హిందూపురం పరిసరాల్లోనే ఎక్కువ.. హిందూపురం రూరల్ మండలం తూముకుంట, గొళ్లాపురం పారిశ్రామికవాడలోని పలు ఫ్యాక్టరీలు, గార్మెంట్స్ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన కలప కోసం హిందూపురం పరిసర ప్రాంతాలతో పాటు శివారున ఉన్న కర్ణాటక ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లను నరికి తరలిస్తున్నారు. గొళ్లాపురం, తూముకుంట పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో భారీ వృక్షాలకు సంబంధించిన కలప పెద్ద ఎత్తున డంప్ చేసి ఉండడం కలకలం రేపుతోంది. సాధారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తుల కోసం కలపను బాయిలింగ్ చేయాల్సి వస్తోంది. ఇందుకోసం బ్రికెట్ను వినియోగించాల్సి ఉంది. అయితే బ్రికెట్ విలువ టన్నుకు రూ. 8 వేలు ఉండడంతో దానికి బదులు కలపనే పరిశ్రమల నిర్వాహకులు ఎంచుకున్నారు. ఫైర్ వుడ్కు సంబంధించి అనుమతులు పొంది నిబంధనలకు వ్యతిరేకంగా స్మగ్లర్ల ద్వారా వేప, చింత, కానుగ, ఇతర భారీ వృక్షాలను అడ్డగోలుగా నరికి పరిశ్రమకు తరలించి డంప్ చేస్తున్నారు. ఈ అక్రమాలు బయటకు పొక్కుండా కలపనంతా పొడి చేసి పెడుతున్నారు. ఈ విషయాన్ని బయట పెడితే పని నుంచి తొలగిస్తామని కార్మికులు బెదిరించినట్లుగా సమాచారం. వృక్ష సంపద కరిగి పోతున్న విషయం అటవీ అధికారులకు తెలిసినా... దీనిని తమ ఆదాయ వనరుగా మార్చకుని నోరు మెదపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మొక్కల పెంపకానికి రూ.కోట్లు కుమ్మరించే ప్రభుత్వాలు, ఉన్న వృక్ష సంపదను కాపాడేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల్లో ఇష్టానుసారంగా కలప వినియోగం అడ్డగోలుగా వేప, చింత, కానుగ వృక్షాల నరికివేత పట్టించుకోని అటవీ అధికారులు ఫైర్వుడ్కు అనుమతులిచ్చాం తూముకుంట, గొళ్లాపురం పారిశ్రామికవాడలో ఫైర్ వుడ్ వినియోగించేలా విరిగో పరిశ్రమతో పాటు కొన్ని గార్మెంట్స్కు కూడా అనుమతులు ఇచ్చాం. వాళ్లు ఏ సమయంలోనైనా పరిశ్రమలకు ఫైర్ వుడ్ను దిగుమతి చేసుకోవచ్చు. ఫైర్ వుడ్ కాకుండా ఇతర కలప వినియోగిస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేపడతాం. వాస్తవాలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, ఎఫ్ఆర్ఓ రాత్రి పూటే ఎక్కువగా పరిశ్రమల్లో ఫైర్ వుడ్ బదులు కలపను వినియోగిస్తున్నారు. హిందూపురం పరిసరాలతో పాటు శివారున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున కలప ఆయా పరిశ్రమలకు చేరుతోంది. అనుమతులు ఉన్న వాటిని పగటి సమయంలో దిగుమతి చేసుకుంటుంటారు. ఈ అంశంపై ఇటీవల అటవీ అధికారులు పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టారు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. – రవికుమార్, కార్మికసంఘం నేత -
ఎట్టకేలకు వినియోగంలోకి జనరేటర్
ధర్మవరం అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్కు ఏర్పాటు చేసిన జనరేటర్ ఎట్టకేలకు పనిచేయడం మొదలు పెట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గంలోని ఆస్పత్రిలో జనరేటర్ పనిచేయకపోవడం... విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు చోటు చేసుకుంటుండడంతో డయాలసిస్ రోగులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 11న ‘డైయాలసిస్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహికేర్ ఏజెన్సీ నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడారు. తీవ్రస్థాయిలో మందలించారు. దీంతో రహికేర్ ఏజెన్సీ నిర్వాహకుల నుంచి సమాచారం అందుకున్న జనరేటర్ కంపెనీ సాంకేతిక నిపుణులు బుధవారం ఏరియా ఆస్పత్రికి చేరుకుని జనరేటర్లో తలెత్తిన లోపాను సరిచేశారు. -
పంటల సాగులో వైవిధ్యం అవసరం
హిందూపురం: పంటల సాగులో వైవిధ్యతతో పాటు సాంకేతికను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ చండ్రాయుడు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా హిందూపురం మండలం కిరికెర, బసవనపల్లి రైతు సేవా కేంద్రాల్లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందుల వినియోగానికి స్వస్తి చెప్పాలన్నారు. కొత్త వంగడాలు, డ్రోన్ స్ప్రేయింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. ప్రతాప్, హేమంత రాజు, కె.బాలాజీ నాయక్, డాక్టర్ శిరీషతో పాటు మండల వ్యవసాయాధికారులు సురేంద్ర నాయక్, మహేష్ నాయక్, బీమా కంపెనీ ప్రతినిధులు అశోక్, నరేంద్ర, రైతు సేవ కేంద్ర సిబ్బంది కృష్ణవేణి, రైతులు పాల్గొన్నారు. న్యాయవాదికి ‘సంగం‘ బెదిరింపు లేఖ చిలమత్తూరు: న్యాయవాది గోవిందరాజులుకు హిందూపురం మున్సిపాలిటీ మాజీ కమిషనర్ సంగం శ్రీనివాసులు బెదిరింపు లేఖ పంపడం సంచలనం రేకెత్తించింది. ఆయన కమిషనర్గా పనిచేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మున్సిపల్ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులకు లేఖ రాయడంతో పాటు కమిషనర్గా తన నియామకాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టుకు వెళ్లడం వంటి అంశాలపై ఏ ఆధారాలతో ఆరోపణలు చేశావని లేఖలో సంగం శ్రీనివాసులు ప్రశ్నించారు. ఆధారాలు చూపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు దిగారు. అయితే ఈ అంశంలో న్యాయవాది గోవిందరాజులు కూడా లేఖ ద్వారా ఘాటుగానే స్పందించారు. హిందూపురం మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, కమిషనర్ అక్రమాలపై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టాలని ఉన్నతాదికారులుకు లేఖ రాసినట్లు వివరించారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోతే హైకోర్టు, ఏసీబీ కోర్టుకు వెళ్లి శ్రీనివాసులు అవినీతిపై పోరాడతానని పేర్కొన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే న్యాయవాది అయిన తనకు ఒక అధికారి బెదిరింపు లేఖ పంపడం వెనుక ఉన్న దురుద్దేశం తనకు తెలుసునన్నారు. కాగా న్యాయవాదికి కమిషనర్ రాసిన లేఖ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి అదృశ్యం ఉరవకొండ: నియోజకవర్గ కేంద్రానికి చెందిన వివాహిత షాహినా తన కుమారుడు, కుమార్తెతో కలసి గురువారం నుంచి కనిపించకుండా పోయింది. గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు. -
తెల్లవార్లూ టీచర్ల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీ టీచర్ల కౌన్సెలింగ్ తెల్లవార్లూ కొనసాగింది. తొలిరోజు 350 మంది పూర్తవగా... రెండోరోజు గురువారం సీరియల్ నంబరు 351 నుంచి 1,000 దాకా పిలిచారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ తెల్లవార్లూ కొనసాగింది. శుక్రవారం సీరియల్ నంబరు 1,001 నుంచి 1,800 వరకు కౌన్సెలింగ్ ఉంటుందని 11 గంటలకు ప్రారంభమవుతుందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. టీచరుపై రెచ్చిపోయిన పరిశీలకులు ‘బొచ్చు గాడివి నీకేం సమాధానం చెప్పాలి’ అంటూ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్లో పరిశీలకులుగా వచ్చిన జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు గురువారం ఓ టీచరుపై రెచ్చిపోయారు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు...తనకల్లు మండలంలో ప్రభాకర్ టీచరుగా పని చేస్తున్నారు. ఈయన భార్య స్పౌజ్ పాయింట్లు వాడుకున్నారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ సమయంలో భర్త పని చేస్తున్న తనకల్లు మండలంలోనే కోరుకోవాలంటూ అధికారులు సూచించారు. ఈ సమయంలో కలగజేసుకున్న భర్త ప్రభాకర్... సర్ తనకల్లు మండలం కాకుండా పక్క మండలం కదిరి రూరల్లో ఇచ్చేలా చూడాలని కోరారు. అలా కుదరదని ‘స్పౌజ్’ విషయంలో అందరికీ ఒకే నిబంధన పాటిస్తున్నామంటూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సదరు టీచర్.. ‘అన్నీ కరెక్ట్గా చేశామంటున్నారు.. అలా చేసినట్లు రాతపూర్వకంగా ఇవ్వండి’ అంటూ అడిగారు. దీంతో పక్కనే ఉన్న పరిశీలకులు సుబ్బారావు రెచ్చిపోయారు. ‘నువ్వు బొచ్చుగాడివి అడిగితే మేము చెప్పాలా’ అని మాట్లాడారు. సదరు టీచరు కూడా అంతేస్థాయిలో సమాధానం ఇచ్చారు. సాధారణ టీచరుకు ఇచ్చే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది అంతా వేదికపైకి దూసుకురావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. అందరూ సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిద్దాం
పుట్టపర్తి టౌన్: టికెట్ ఆదాయంతో పాటు పర్యాటక కేంద్రాలకు అదనపు బస్సులు నడిపి ప్రతి డిపో పరిధిలోనూ నష్టాలు తగ్గించి, ఆర్టీసీని లాభాల బాట పట్టిద్దామని డీపీటీఓ మధుసూదన్ పిలుపునిచ్చారు. ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలపై తన కార్యాయంలో జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ సిబ్బంది, అకౌంట్స్ విభాగం సూపర్వైజర్లతో గురువారం ఆయన సమీక్షించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి జిల్లాను ప్రథమ స్ధానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమయపాలన పాటించాలన్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి డ్రైవర్ కృషి చేయాలన్నారు. ప్రతి బస్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, బస్ టైమింగ్ బోర్డులు, శుభ్రమైన టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పర్యాటక కేంద్రాలకు రద్దీని బట్టి అదనపు బస్సులు నడపాలన్నారు. కార్గో ఆదాయాన్ని మరింత పెంచాలన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: సున్నితమైన విషయాలను పెద్దవి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రత్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకొంటున్న సున్నితమైన విషయాలను రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి కుటుంబాలను మరింత బాధ పెడుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో రామగిరి మండలంలో జరిగిన ఘటనపై బాధితుల పరామర్శ పేరుతో పోలీసులు అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు చట్టం ఉందని, బాలిక సంఘటన విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆందోళన ద్వారా బాధితుల వివరాలు బహిర్గతమై వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. బాధితులు హక్కులను భంగం కలిగించకుండా వ్యవహరించాలని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలకు సూచించారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. పట్టు గూళ్ల విక్రయ కేంద్రం నూతన భవన నిర్మాణం ● కేంద్ర వాటా రూ.4 కోట్ల మంజూరు హిందూపురం: పట్టణంలోని ఏపీ పట్టుగూళ్ల విక్రయ కేంద్రం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం రూ.8 కోట్లు ఖర్చు కానుండగా కేంద్రం వాటా రూ.4 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్ర నిధులు ఇంకా విడుదల కాలేదు. కాగా కొత్త పట్టుగూళ్ల విక్రయ కేంద్రం భవన నిర్మాణానికి అర్అండ్బీ అధికారులు డీఈ వెంకటరామిరెడ్డి, ఏఈ మోహన్బాబు సిబ్బంది కొలతలు, మార్కింగ్ వేశారు. త్వరలోనే కేంద్ర నిధులతో పనులు ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత విక్రయ కేంద్రం ముందుభాగంలో ఉన్న భవనంలోకి ప్రస్తుత కార్యాలయాన్ని మార్చాడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పట్టుగూళ్ల కేంద్రం అధికారి బదిలీ.. హిందూపురం పట్టుగూళ్ల విక్రయ కేంద్రం నిర్వాహణ అధికారి లక్ష్మిరెడ్డిని బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కడప విక్రయ కేంద్రానికి బదిలీ అయ్యారు. హిందూపురం విక్రయ కేంద్రం అధికారిగా కుప్పం నుంచి హంపయ్యను నియమించారు. రెండురోజుల్లో బదిలీలైన అధికారులు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాఽధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుక్కపట్నంలో ఏటీఎస్ సేవలు ప్రారంభం పుట్టపర్తి టౌన్: రవాణాశాఖ సేవలు సులభతరం చేయడమే లక్ష్యంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) మంజూరుకై బుక్కపట్నంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను ప్రారంభించినట్లు జిల్లా రవాణాఖ అధికారి కరుణసాగర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12 నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి వాహనదారుడు వాహన ఫిట్నెస్ పరీక్ష నిమిత్తం దగ్గరలో ఉన్న ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్కు వెళ్లాలన్నారు. గతంలో హిందూపురం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ఎఫ్సీ చేసుకొనేవారని, అలా కాకుండా సేవలను సులభతరం చేసేందుకు బుక్కపట్నంలో ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అట్రాసిటీ కేసు నమోదు నల్లమాడ: మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ హనుమంతరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై దాడిచేసి కులం పేరుతో దూషించాడంటూ దళిత యువకుడు కిషోర్ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం గురువారం అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
పరామర్శకు వెళ్తే భయమెందుకు?
ఏడాది నుంచి దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురికావడం బాధాకరం. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ హెల్త్ బులిటెన్ ఇవ్వకపోవడం దారుణం. ఈ కేసులలో నిజా నిజాలు తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. బాధిత కుటుంబానికి ఆ గ్రామంలో ప్రాణహాని ఉంది. జిల్లాలోని మంత్రులు, హోంమంత్రి బాధిత బాలికను కనీసం పరామర్శించకపోవడం అత్యంత శోచనీయం. అనంతపురం సమీపంలో గిరిజన యువతి తన్మయి కూడా హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు ఐదు రోజుల ముందే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోవడంతో రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నాయి. వాస్తవిక పరిస్థితులను తెలుసుకొనేందుకు వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు చెప్పాలి. –ఉషశ్రీచరణ్,వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
గాలీవాన బీభత్సం.. వృద్ధుడి మృతి
రామగిరి: పేరూరు పంచాయతీ కురుగుండ్లకాలనీలో మంగళవారం రాత్రి గాలీవాన బీభత్సం చేసింది. వర్షంతోపాటు బలమైనగాలులు వీయడంతో గొర్రెలమంద వద్ద మంచంపై నిద్రిస్తున్న అశ్వర్థప్ప (70) సుమారు 10 అడుగుల దూరం ఎగిరి పడి మృతి చెందాడు. రెండు ఇళ్లు నేలమట్టంకాగా, పలు ఇళ్లపైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. గాలివేగం అంతకంతకూ పెరగడంతో 35కుపైగా విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. పదుల సంఖ్యలో భారీ చెట్లు కూలిపోయాయి. మృతుడు అశ్వర్థప్ప స్వగ్రామం పరిగి మండలం చిన్నంపల్లి కాగా, విషయం తెలుసుకున్న కుటుంబీకులు రాత్రే మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 19 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 19 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా లేపాక్షి మండలంలో 38.4 మి.మీ, చిలమత్తూరు 32.8, గోరంట్ల మండలంలో 32.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఇక హిందూపురం మండలంలో 26.4 మి.మీ, పరిగి 22.6, రొద్దం మండలంలో 21.6 వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మిగతా మండలాల్లోనూ 11 నుంటి 1.2 మి.మీ మధ్య వర్షపాతం నమోదైందనట్లు వెల్లడించారు. మరో రెండు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామగిరి మండలం పేరూరు కురుగుండ్లకాలనీలో ఘటన నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు -
టీచర్ల సహనానికి కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఉన్నతాధికారులు మళ్లీ టీచర్ల సహనానికి పరీక్ష పెట్టారు. పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ తొలిరోజు మంగళ వారం రసాభాస నడుమ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సాంకేతిక సమస్యలతో అర్ధరాత్రి తర్వాత వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు అని చెప్పి... బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని,జాబితాలోని 1 నుంచి 500 సంఖ్య వరకు హాజరుకావాలంటూ ఉదయాన్నే ఉపాధ్యాయులకు మెసేజ్లు పంపారు. కానీ సాయంత్రం 4 గంటలకు 1 నుంచి 350 సంఖ్య వరకు రావాలంటూ మెసేజ్లు పెట్టారు. ఎట్టకేలకు 4.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలో అవకతవకలు, స్టేషన్ పాయింట్ల నమోదులో అక్రమాలు, ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అర్హులు తదితర సమస్యలపై విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ స్పష్టం చేశారు. వెబ్ ఆప్షన్ల బహిష్కరణ.. భాషా పండితుల (ఎల్పీ) బదిలీల్లో భాగంగా బుధవారం రాత్రి ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల చేశారు. అయితే, ఫిర్యాదులు స్వీకరించ కుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై భాషా పండితులు ప్రక్రియను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నేడు కౌన్సెలింగ్ ఇలా... క్రమ సంఖ్య 351 నుంచి 700 వరకు ఉన్న ఎస్జీటీలకు గురువారం ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, క్రమ సంఖ్య 701 నుంచి 1,000 వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని అనంతపురం డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు గుంతలో పడి టీచర్కు గాయాలు బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ టీచర్ పి. రామిరెడ్డి, బుక్కపట్నంలో ఎస్జీటీగా పని చేస్తున్న సుధారాణి దంపతులు. భార్య కౌన్సెలింగ్ నేపథ్యంలో రామిరెడ్డి బుధవారం పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్కు వచ్చారు. రాత్రి భోజనం కోసమని కేంద్రం నుంచి బయటకు వెళ్తూ చీకట్లో ప్రమాదవశాత్తు గుంతలో పడ్డారు. చేతికి తీవ్ర గాయాలు కాగా,తోటి టీచర్లు ఆయన్ను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. నేడు పేరూరుకు వైఎస్సార్ సీపీ నాయకులు● అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి పరామర్శ రామగిరి: కీచకుల దుర్మార్గానికి బలైపోయిన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మండలంలోని పేరూరుకు వస్తున్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ జిల్లా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తండ్రి చనిపోగా.. మతిస్థిమితం సరిగాలేని తల్లి పంచన ఉంటున్న అమాయక దళిత బాలికపై 14 మంది దుర్మార్గులు నెలల తరబడి అత్యాచారం చేయగా బాలిక గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఈ అకృత్యాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాలిక కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించేందుకు మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఉషశ్రీ చరణ్, సాకే శైలజానాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం పేరూరు విచ్చేస్తున్నారు. తొలుత పేరూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. -
నాణ్యత నాస్తి..ధర జాస్తి
పుట్టపర్తి అర్బన్/ సాక్షి నెట్వర్క్: కూటమి సర్కార్ 40 శాతం రాయితీ అంటూ అట్టహాసంగా పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ తీసుకునేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. నైరుతి ముందస్తుగానే పలకరించగా ఇప్పటికే పలువురు రైతులు మార్కెట్లో విత్తనం కొన్నారు. మరికొందరు రైతులు రాయితీపై వచ్చే విత్తనం కోసం ఇప్పటి వరకూ వేచి చూసినా ప్రభుత్వం నాసిరకం విత్తనం పంపిణీ చేయడంతో తీసుకోకుండానే వెనుదిరిగారు. రెండు రోజుల్లో 1,389 క్వింటాళ్లే పంపిణీ.. జిల్లాకు ప్రభుత్వం 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించగా, ఇప్పటి వరకూ 29 వేల క్వింటాళ్ల విత్తనం మాతమ్రే వచ్చింది. దీంతో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అయితే విత్తన పంపిణీ మంగళవారం ప్రారంభించగా.. బుధవారం నాటికి కేవలం 1,389 క్వింటాళ్ల విత్తనం మాత్రమే రైతులు తీసుకున్నారు. చాలా మంది ఆర్ఎస్కేల వద్దకు వచ్చి విత్తనం నాణ్యత చూసి తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. నాణ్యత సరిగా లేక... చాలా ప్రాంతాల్లో విత్తనం నాణ్యత నాసిరకంగా ఉంది. చెత్తచెదారం, బుడ్డలు ఎక్కువగా ఉండటంతో ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. పైగా 40 శాతం రాయితీతో ప్రభుత్వం ఇస్తున్న ధరకే మార్కెట్లో నాణ్యమైన విత్తనం దొరుకుతుండటంతో రైతులంతా ప్రైవేటుగానే విత్తనం కొనుగోలు చేస్తున్నారు. ● ధర్మవరం మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో బుధవారం సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. విత్తనం నాణ్యత సరిగా లేకపోవడంతో కొనుగోలుకు రైతులు పెద్దగా ఉత్సాహం చూపలేదు. ● అమరాపురం మండలంలో పంపిణీ చేసిన విత్తన వేరుశనగ బస్తాల్లో బుడ్లు, చిరు విత్తనాలు అధికంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మూడు బస్తాల విత్తనకాయను మిషన్లో ఆడించగా 6 కేజీల వరకు బుడ్లు, చిరు విత్తనాలు 4 కేజీలు వచ్చినట్లు రైతు శశికుమార్ తెలిపారు. ● రొళ్లలో పంపిణీ చేసిన సబ్సిడీ విత్తన కాయలు నాసిరకం ఉన్నట్లు రైతులు గుర్తించారు. విత్తనం మరీ చిన్నగా ఉందని, దాన్ని విత్తితే మొలకెత్తదని రైతులు చెబుతున్నారు. రాయితీ పోను రైతువాటాగా చెల్లించాల్సిన మొత్తం వెచ్చిస్తే మార్కెట్లో నాణ్యమైన విత్తన వేరుశనగ తీసుకోవచ్చంటున్నారు. ● పరిగి మండలంలో బుధవారం పంపిణీ చేసిన విత్తన బస్తాల్లో జల్లు బుడ్డలు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో పాటూ బస్తాకు రూ.1,700 వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. రాయితీ విత్తన వేరుశనగకు స్పందన కరువు నాసిరకం విత్తనం తీసుకునేందుకు ముందుకు రాని రైతులు -
హత్యలు.. అత్యాచారాలు.. కబ్జాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భూకబ్జాలు, ఆక్రమణలు, హత్యలు, అత్యాచారాలకు కూటమి సర్కారు కేరాఫ్గా మారింది. ‘కూటమి’ పాలనా పగ్గాలు చేపట్టి గురువారానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు భారీ వైఫల్యాలను మూటగట్టుకుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్న భావన అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు, కళాశాలలకు తమ పిల్లలను పంపాలంటేనే బాలికల తల్లిదండ్రులు భయపడుతున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండడంతో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారింది. చెరపట్టిన మైనింగ్ మాఫియా హిందూపురం మొదలు తాడిపత్రి వరకూ అన్ని నదులనూ, వంకలనూ టీడీపీ నేతలు చెరపట్టారు. చిత్రావతి, హగరి నదులు ఇప్పటికే రూపు మారిపోయాయి. ఇక కొండలు, గుట్టలు ఏడాదిలోనే మాయమయ్యాయి. మైనింగ్, రెవెన్యూ శాఖలు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎప్పుడో మానేశాయి. సూపర్ సిక్స్ మోసం.. ‘ఆరు పథకాలు మీ జీవితాలనే మారుస్తాయంటూ’ ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలారు. ‘అమ్మఒడి’ లేదు, ‘ఉచిత గ్యాస్ సిలిండర్లు’ లేవు, రైతు సాయం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. ఒక్కటంటే ఒక్క పథకమూ లేదు. పేట్రేగుతున్న రౌడీషీటర్లు అధికార అండతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యుల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే కంచె వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కలుగుల్లో దాక్కున్న రౌడీషీటర్లందరూ చంద్రబాబు సర్కారు పుణ్యమా అని నేడు దర్జాగా తిరుగుతూ రెచ్చిపోతున్నారు. ఏడాదిలో నాలుగు హత్యలు ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు హత్యలు జరిగాయి. వీటన్నింటి వెనుకా టీడీపీ వర్గీయులే ఉండటం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే హిందూపురంలో మల్లికార్జున దారుణ హత్యకు గురయ్యారు. పాపిరెడ్డిపల్లెలో లింగమయ్యపై టీడీపీ నాయకులు దాడి చేసి చంపేశారు. రాప్తాడు మండలంలో దంపతులు ముత్యాలమ్మ, నారాయణరెడ్డిని పట్టపగలే నరికి హత్య చేశారు. మహిళల్లో ఆందోళన.. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికను 14 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతేకాదు ఇంటర్ విద్యార్థిని తన్మయిని అతి కిరాతకంగా చంపి పొలాల్లో పడేసిన ఘటన జిల్లా ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. తాడిపత్రిలో ఐచర్ వాహనంలో ఓ బాలిక, పుట్లూరు మండలంలో మరో బాలిక అత్యాచారానికి గురయ్యారు. మద్యం ఏరులు.. గతంలో ప్రభుత్వ పర్యవేక్షణలోనే మద్యం విక్రయాలు జరిగేవి. అప్పట్లో బహిరంగ మద్యంపై ఉక్కుపాదం మోపారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులకు వేళాపాళా లేకుండా పోయింది. బెల్టుషాపులు, పర్మిట్రూములతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంటుండటంతో పల్లెలు మత్తులో జోగుతున్నాయి. కరెంటు బిల్లులతో లబోదిబో.. అధికారంలోకి వస్తే ఒక్కపైసా కరెంటు చార్జీ పెంచబోనని చెప్పిన చంద్రబాబు.. కరెంటు చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచారు. రూ.800 బిల్లు వచ్చే మధ్యతరగతి కుటుంబానికి ఇప్పుడు రూ.1,500 వస్తోంది. కరెంటు చార్జీల పెంపుతో జనం అల్లాడిపోతున్నారు. కూటమి పాలనకు ఏడాది దారుణాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి అనంతపురం జిల్లా దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాలికపై సామూహిక అత్యాచార ఘటన భయభ్రాంతులకు గురి చేసిన గిరిజన యువతి దారుణ హత్య -
విద్యార్థికి సమ్యసల స్వాగతం
పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మోడల్ స్కూల్ ఇది. 300 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కనీస సౌకర్యాలు కరువు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవుల్లోనే వివిధ పనులు చేపట్టాల్సి ఉన్నా.. కూటమి సర్కార్ దృష్టి సారించలేదు. ఫలితంగా విద్యార్థులు మరో సంవత్సరం సమస్యలతో సహవాసం చేస్తూ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.పుట్టపర్తి/హిందూపురం టౌన్: వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరం తొలిరోజే సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ‘విద్యామిత్ర’ కిట్లు నేటికీ పాఠశాలలు చేరకపోవడం..ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను నేటికీ పూర్తికాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చినా ఉపయోగం లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇలా ఉండగా... ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల మోత మోగుతోంది.లక్ష మందికిపైగా విద్యార్థులు..జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 2012 పాఠశాలలుండగా.. 1 నుంచి 10వ తరగతి వరకూ 1,01,907 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ అందించేందుకు పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్టూడెంట్ కిట్స్ (విద్యామిత్ర కిట్లు) స్కూల్ పాయింట్కు చేరుస్తామని కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించినా..ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. నేటికీ జిల్లాలోని చాలా స్కూళ్లకు యూనిఫాం, బ్యాగులు, షూ చేరలేదు. దీంతో తొలిరోజు కిట్లు కాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, డిక్షనరీలు మాత్రమే విద్యార్థులకు సరఫరా చేయాలని విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలోని కొన్ని పాఠశాలలకు పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ జగన్ హయాంలో వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, జగనన్న కిట్లు..తదితర విద్యాసామగ్రి పాఠశాలలకు చేరేవని చెబుతున్నారు.పూర్తికాని టీచర్ల బదిలీల ప్రక్రియ..వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తిచేసి పునఃప్రారంభం నాటికి కొత్త స్కూళ్లల్లో చేరేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. పూర్తి కాలేదు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలయినా ఎస్జీటీల ప్రక్రియ కొనసాగుతోంది. బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు కొత్త స్కూళ్లకు వెళ్లాలి. అయితే వారి పాత స్థానంలోకి ఎవరూ రాకపోతే అలాంటి వారు వెనక్కురావాలి. ఈ స్థానంలోకి మరొకరు వచ్చేదాకా అక్కడే కొనసాగాలి.ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల మోత..జిల్లాలో 650 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల నిర్వాహకులు టెక్నో, ఈ–టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్... ఇలా వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో తరగతిని బట్టి రూ.20 వేల నుంచి రూ.80 వేల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇతర ఖర్చులు కలుపుకుంటే ఒక్కో విద్యార్థిపై అక్షరాల లక్షపైనే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ పాఠశాలలో చెప్పే సిలబస్కు సంబంధించిన పుస్తకాలు బయట ఎక్కడా దొరకవని, వీటితో పాటు నోటు పుస్తకాలు సైతం పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధన విధించారు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు అక్కడే పుస్తకాలు కొంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజుల నియంత్రణ ఉండేది. ఇక డోనేషన్లు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఇవేవీ అమలు కావడం లేదు. దీనిపై విద్యాశాఖాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.సౌకర్యాలు కరువు..వేసవి సెలవులు ప్రారంభం కాగానే పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి సౌకర్యాలన్నీ కల్పిస్తారు. గత ఐదేళ్లూ ఇదే పద్ధతిలోనే పనులు సాగాయి. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించింది. కనీసం గత ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ కింద చేపట్టిన భవనాలు, టాయిలెట్స్, ఇతరత్రా నిర్మాణాలు సైతం పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదిలోనే 4 వేల మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు బాట పట్టారు. ఇక ఈ సంవత్సరం ఎంత మంది ప్రభుత్వ స్కూళ్లను వీడుతారో త్వరలోనే తెలియనుంది.ప్రైవేటు దోపిడీ పెరిగిందికూటమి ప్రభుత్వంలో ఫీజులపై నియంత్రణ లేదు. అందుకే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల నిర్వాహకులు ఇష్టానుసారం పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కూడా లేని స్కూళ్లలోనే ఎల్కేజీకే రూ.30 వేలు పిండుకుంటున్నారు. పాఠశాలల ఆవరణలోనే పుస్తకాలు, విద్యా సామగ్రి విక్రయిస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులకు పట్టడం లేదు.– బాబావలి, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూవసతులు కల్పించాలిప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో వసతులు లేవు. ఇలా అయితే మాలాంటి వాళ్లు పిల్లల్ని ఎక్కడ చదివించాలి. నా కుమారుడిని ప్రైవేట్ స్కూల్లో చదివించలేక ప్రభుత్వ బడిలో 4వ తరగతిలో చేర్చాను. గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా పాఠశాలలపై దృష్టి సారించి అన్ని పాఠశాలల్లో వసతులు మెరుగుపరిస్తే బాగుంటుంది.– శ్రీ చందన, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం -
గాయపడిన మహిళా ఉద్యోగి మృతి
ఓర్వకల్లు: ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య ముకుంద ప్రియ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సచివాలయం–2లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. భర్త చంద్రారెడ్డి ఆర్మీకి వెళ్లడంతో కర్నూలులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ముకుంద ప్రియ నివాసముంటూ రోజూ కర్నూలు నుంచి స్కూటీపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో గత నెల 20న విధులకు వెళ్తుండగా రోడ్డుపై నిలబడిన లారీని ఢీకొన్నారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందారు. మృతురాలి తండ్రి రుక్మాంగదరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. -
పేరుకే మహా ప్రస్థానం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నాలుగు మహాప్రస్థానం వాహనాలు ఉండగా ఇందులో ఏ ఒక్కటీ అత్యవసరం సమయంలో నిరుపేదలకు ఉపయోగ పడడం లేదు. సర్వజనాస్పత్రికి చికిత్స కోసం వచ్చిన కంబదూరు మండలం పి.వెంకటాంపల్లికి చెందిన హరిజన మారెక్క(48) బుధవారం మృతి చెందింది. దీంతో వార్డు గోడలపై ఉన్న మహాప్రస్థానం వాహనం కోసం ఉదయం 9.30 గంటలకు మృతురాలి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. అయితే మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదని, రావడానికి రాత్రి 7 గంటలవుతుందని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఫోన్ కట్ చేశాడు. దీంతో మారెక్క కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులను సంప్రదించారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రాధేయపడిన తర్వాత చివరకు రూ.5,500తో ఒప్పుకుని మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు వచ్చారు. ఆస్పత్రిలో రోజూ 6 నుంచి 10 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మృతదేహాలను తరలించేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ తలారి రంగయ్య తన కోటా నిధుల్లో నుంచి రూ.10 లక్షలు వెచ్చించి మహాప్రస్థానం వాహనాన్ని సమకూర్చారు. ఈ వాహనాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అయితే ఆ వాహనానికి ఇంధనం సమకూర్చకపోవడంతో మూలన పడింది. ఇదే విషయమై ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. త్వరలో వాహనం రెగ్యులర్గా తిరిగేందుకు ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసేలా కలెక్టర్కు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. -
‘ప్రిఫరెన్షియల్’లో దుర్వినియోగం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ కార్యాలయ సిబ్బంది నిర్వాకం కారణంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ దుర్వినియోగమైందని డీఈఓ ప్రసాద్బాబుకు పలువురు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. బుధవారం డీఈఓను కలిసి ఆధారాలను అందజేశారు. నగరంలోని కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఏ ఇంగ్లిష్కు సంబంధించి ఆరు పోస్టులున్నాయన్నారు. కొత్త బదిలీల చట్టం ప్రకారం 50 శాతం అంటే వీటిలో మూడు పోస్టులు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చూపించాల్సి ఉండగా... ఏకంగా ఐదు పోస్టులను ఇచ్చారన్నారు. ఈ కారణంగా సీనియారిటీ జాబితాలో మిగిలిన టీచర్లకు చాలా నష్టం వాటిల్లిందని, ఈ అంశంపై డీఈఓకు గ్రీవెన్స్ ఇచ్చినా సమస్యకు పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. పీహెచ్ (అంధులు) కేటగిరీ కింద ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆదిమూలం శ్రీనివాసులు ప్రస్తుత బదిలీలో తప్పనిసరిగా ఉన్నారన్నారు. అయితే ఆయన పీహెచ్ కేటగిరీని వదిలి జనరల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నట్లు తన ఇష్టపూర్వక లేఖను సమర్పించారన్నారు. ఈ లెక్కన ఆయన పేరును జనరల్ కేటగిరీలో చూపాల్సి ఉందన్నారు. అతను జనరల్ కేటగిరీలోకి వస్తే, తర్వాత ఉన్న మహిళా టీచర్ను బాలికల పాఠశాలకు కేటాయించకుండా పురుష టీచరును నియమించారన్నారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న జిల్లా పరిషత్ యాజమాన్య టీచర్లు తిరిగి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను ఎంచుకున్నారన్నారు. వీటిపై అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఎస్ఏ ఇంగ్లీష్ కె.సురేష్బాబు జెడ్పీ నుంచి కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, రంగస్వామిని గుంతకల్లులోని ప్రభుత్వ పాఠశాల, గణితం టీచరు డి.అమరేంద్రకుమార్ రెడ్డిని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారన్నారు. అలాగే ఎస్ఏ సోషల్ కె.మాదార్బీని ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారన్నారు. అక్రమ బదిలీలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత సీనియారిటీలో ఉన్న అర్హులైన ఉపాధ్యాయులకు ఆ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయ సిబ్బంది నిర్వాకంపై డీఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు -
ప్రమాదంలో చిన్నారి మృతి
బత్తలపల్లి: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై తల్లిదండ్రులతో కలసి వెళుతున్న చిన్నారి మృతి చెందింది. వివరాలు.. బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన చాకలి నరసింహులు, మణికంఠేశ్వరి దంపతులు బుధవారం ఏడాది వయసున్న తమ చిన్నారి తన్మయితో కలిసి ద్విచక్ర వాహనంలో ధర్మవరం వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో తలిదండ్రులతో పాటు చిన్నారికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలిస్తుండగా తన్మయి(1) మృతి చెందింది. తల్లిదండ్రులకు నడుము, కాళ్లు విరిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, ఈడిగ కాశప్ప, లింగమయ్య, ఈశ్వరయ్య, బండి నాగభూషణ, వెంకటరాముడు తదితరులు బాధితులను పరామర్శించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు తనకల్లు: మండలంలోని ముత్యాలవారిపల్లిలో ఈ నెల 3న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన పుప్పాల గిరిష్బాబు, సంధ్యారాణి దంపతుల కుమారుడు నిశాంత్ (3) అక్కడికి సమీపంలోని నీటి సంప్లో పడి మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజే బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. అయితే బాలుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన ఎస్ఐ గోపి... బుధవారం స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి గ్రామానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికి తీయించి అక్కడే పోస్టుమార్టం జరిపించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సైబర్ నేరగాళ్ల అరెస్ట్
కదిరి అర్బన్: సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా సభ్యులను కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ నిరంజనరెడ్డి వెల్లడించారు. పుట్టపర్తికి చెందిన టి.శ్రీనివాసరావు, టి.దుర్గాబాయి దంపతులు గతంలో కర్నూలులో వాటర్ ఫిల్టర్ పరికరాల వ్యాపారం చేసేవారు. అందులో నష్టాలు చవిచూశాక 2023లో పుట్టపర్తికి మకాం మార్చారు. పుట్టపర్తిలోని కోటక్ మహేంద్ర బ్యాంక్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న సాయిభార్గవి, ధర్మవరంలో సిమ్కార్డులు అమ్ముకుని జీవనం సాగిస్తున్న శివానందతో పరిచయం పెంచుకున్నారు. సాయిభార్గవి ద్వారా కోటక్ మహేంద్ర బ్యాంక్లో ఖాతాలు తెరుస్తూ శివానంద్ వద్ద నుంచి పొందిన సిమ్కార్డులతో ఆర్వో ప్లాంట్ల యజమానులను సంప్రదించేవారు. ప్లాంట్కు సంబంధించిన పరికరాలు సగం ధరకే ఇస్తామని నమ్మబలికి తమ బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదలాయించుకుని ఆ తర్వాత సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను మార్చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వీరి ఖాతాలకు నగదు బదలాయించి మోసపోయారు. ఈ క్రమంలో కదిరి మండలం బోడేనాయక్తండాకు చెందిన బాబ్జీనాయక్ గత ఏడాది జులై 16న తాగునీటికి ఉపయోగించే రూ.15 వేల విలువైన ఏటీఏం కాయిన్ బాక్స్ కోసం రూ.8 వేలను ఫోన్పే చేసి మోసపోయాడు. దీనిపై బాబ్జీనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో బుధవారం కదిరి కొండ వద్ద తచ్చాడుతున్న శ్రీనివాసరావు దంపతులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.4 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 13 డెబిట్ కార్డులు, 52 సిమ్కార్డులు, 2 చెక్బుక్కులు, 8 బ్యాంక్ పాసుపుస్తకాలు, 2 పాన్కార్డులు, 6 బిల్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.4 లక్షల నగదు స్వాధీనం -
చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం
అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ సీనియర్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా టోర్నీలో భాగంగా రెండో రౌండ్లో చిత్తూరు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో చిత్తూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు సాధించింది. జట్టులో సీఆర్ జ్ఞానేశ్వర్ 118 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 108 పరుగులు, బి.అభిషేక్రెడ్డి 128 బంతుల్లో 16 ఫోర్లతో 116 పరుగులు, ఏవీ సూర్య 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన వైఎస్సార్ కడప జట్టు 14.5 ఓవర్లలో 94 పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది. వర్షం రావడంతో మ్యాచ్ను రద్దు చేసి రెండు జట్లకు సమాన పాయింట్లు కేటాయించారు. కాగా, రెండో రౌండ్ మ్యాచ్ల్లో చిత్తూరు జట్టు గణనీయమైన పాయింట్లు దక్కించుకోవడంతో అగ్రస్థానానికి ఎగబాకింది. ● కర్నూలు – నెల్లూరు జిల్లా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో కర్నూలు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నయీముల్లా 86 బంతుల్లో 58 పరుగులు, ఎస్కే కమరుద్దీన్ 26 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 25.1 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆరు వికెట్లు నష్టపోయింది. కె.నిఖిలేశ్వర రెడ్డి 38 పరుగులు, శోభన వర్మ 19 పరుగులు, రోషన్ పవన్ 40 పరుగులు సాధించారు. వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం నెల్లూరు జట్టు గెలుపొందినట్లు ప్రకటించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం: రోజు యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను కలెక్టర్తో కలసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఔత్సాహికులతో కలసి మంత్రి యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి దరిచేరదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రమంతటా యోగా దినోత్సవాలను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు. అంతకుముందు విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్లు బెళుగుప్ప: మండలలోని జీడిపల్లి రిజర్వాయర్తో పాటు పరివాహక ప్రాంతంలోని కోనంపల్లి గ్రామంలో పంటలు, నీటి వినియోగాన్ని ట్రైనీ కలెక్టర్లు పరిశీలించారు. ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ట్రైనీ కలెక్టర్లు సచిన్రహర్, నరేంద్ర పాడల్, పృథ్వీరాజ్కుమార్, సందీప్ రఘువంశీ, నాగ వెంకటసహిత్, పర్హిన్ జాహిద్, మనీషా బుధవారం జీడిపల్లి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ అనిల్కుమార్ స్వాగతించారు. కోనంపల్లి వద్ద బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ పంటకు నీటి వినియోగంపై డ్రిప్, స్ప్రింక్లర్ల పనితీరును ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ఖాన్ను అడిగి తెలుసుకున్నారు. జీడిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన అంశాలను హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజాస్వరూప్, ఈఈ శ్రీనివాసులు వివరించారు. కార్యక్రమంలో మండల హార్టికల్చర్ అధికారి కృష్ణతేజ, ఎంఐఓ మల్లేష్, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ (45) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. వివరాలు... చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లికి చెందిన ఓ మహిళ పెద్ద కర్మ కార్యక్రమంలో గురువారం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొత్తచెరువు నుంచి సప్లయర్స్ సామగ్రిని తెప్పించుకున్నారు. అదే సప్లయర్స్లో కూలి పనులతో జీవనం సాగిస్తున్న సత్యనారాయణ పనిలో భాగంగా బుధవారం గంగినేపల్లికి చేరుకున్నాడు. షామియానా ఏర్పాటు చేస్తూ ఇంటికి తాడు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కొత్తచెరువు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందనట్లు నిర్ధారించారు. ఘటనపై సీకేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రెవెన్యూలో బదిలీలలు
సాక్షి టాస్క్ఫోర్స్: తహసీల్దార్ల బదిలీలు ధర్మవరం నియోజకవర్గ ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. జిల్లాలో ఎక్కడైనా తహసీల్దార్ను బదిలీ చేసేటప్పుడు ఆ స్థానంలో ప్రతిభ ఉన్న తహసీల్దార్ను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ధర్మవరం నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిభ ఆధారంగా కాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కింది స్థాయి అధికారికి తహసీల్దార్గా ఎఫ్ఏసీ బాధ్యతలు కట్టబెట్టడంపై అన్ని వర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. అక్రమాలే ఆయన ప్రవృత్తి.. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతే కాక రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నది కూడా ఇక్కడ నుంచే కావడం విశేషం. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన తహసీల్దార్ బదిలీల ఉత్తర్వుల్లో ధర్మవరం తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న నటరాజ్ను చిలమత్తూరుకు బదిలీ చేశారు. అయితే ఆయన స్థానలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న సురేష్కు ఎఫ్ఏసీ (పుల్ అడిషనల్ చార్జ్) బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సురేష్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బత్లలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా పని చేసిన ఆయన అన్ని తానై ఉండి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. డి.చెర్లోపల్లి పొలంలో దాదాపు 60 వరకు నకిలీ డీపట్టాలు మంజూరు చేశారు. అలాగే అర్హుల పేర్లు తొలగించి అనర్హులకు పట్టాలు కట్టబెట్టారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు అప్పట్లో విచారణ చేపట్టి వాస్తవమని నిర్ధారించారు. అంతేకాక ఏడాది క్రితం కలెక్టరేట్లో పని చేసిన సమయంలోనూ అన్నీ తానై నడిపి చుక్కల భూములు, ఫ్రీహోల్డ్, అసైన్డ్మెంట్ కమిటీల విషయంలో ఏకంగా తహసీల్దార్లతోనే ముడుపులు దండుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలే ప్రవృత్తిగా ఉన్న అలాంటి అధికారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పోస్టింగ్ వెనుక కలెక్టరేట్లో పనిచేస్తున్న పలువురికి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లుగా ఆ శాఖలోని ఉద్యోగులే అంటున్నారు. ఈ తతంగం వెనుక ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలోని ఓ అధికారి చక్రం తిప్పినట్లుగా సమాచారం. ధర్మవరం తహసీల్దార్ను బదిలీ చేసి డీటీకి పూర్తి స్థాయి బాధ్యతలు గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డీటీకి ఎఫ్ఏసీ ఇవ్వడంపై అనుమానాలు పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుని అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు -
51 ఏళ్ల తర్వాత కలిశారు
హిందూపురం టౌన్: స్థానిక ఎస్డీజీఎస్ కళాశాలలో 1972–74లో కలసి ఇంటర్మీడియట్ చదువుకున్న వారు 51ఏళ్ల తర్వాత బుధవారం ఓ తోటలో ఒక్కటయ్యారు. వీరిలో చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ పదవీవిరమణ పొందారు. స్నేహితులను చూడగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. అలనాటి అల్లరి ఆటలు, పాటలు, చదువు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు దేవాంగం శంకరప్ప, సత్యనారాయణ, ఆనందరెడ్డి నేతృత్వం వహించగా శంకరప్ప, సత్యనారాయణ, ఆనందరెడ్డి, ధనలక్షి్, శ్రీనివాసులు, అనంతరామ్, రమేష్, సుందరమూర్తి, మహీధర్, వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు. -
దాడులు సరికాదు: ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్: ప్రజాస్వామ్యంలో దాడులు సరైన చర్య కాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నేతల దాడులు, కూటమి ప్రభుత్వం సూచనలతో జరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ను ఆమె ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’ టీవీ డిబేట్లో ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగానే.. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేశారన్నారు. చర్చలో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను అన్యాయంగా ‘సాక్షి’కి ఆపాదించి కార్యాలయాలపై కూటమి నేతలు దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలన్నారు. ‘సాక్షి’లో జరిగిన చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అతని వ్యక్తిగతమన్నారు. అయినప్పటికీ అందుకు బాధ్యుడిని చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం అక్రమమన్నారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. -
ఆరు టన్నుల చీనీ కాయల అపహరణ
బత్తలపల్లి: పక్వానికి వచ్చిన ఆరు టన్నుల చీనీ కాయలను రాత్రికి రాత్రే దుండగులు అపహరించుకెళ్లారు. వివరాలు.. బత్తలపల్లి మండలం తిమ్మనకొట్టాల గ్రామానికి చెందిన ఎరికల గోపాల్.. డి.చెర్లోపల్లి సమీపంలోని సర్వే నెంబర్ 468లో తనకున్న పది ఎకరాల్లో నుంచి మూడు ఎకరాలు వరి సాగు చేయగా, మిగిలిన ఏడు ఎకరాల్లో చీనీ పంట సాగు చేస్తున్నాడు. పదేళ్లుగా పంట చేతికి అందుతోంది. ఈ సారి కూడా పక్వానికి వచ్చిన కాయలను రెండు రోజుల తరువాత తొలగించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం సాయంత్రం తోటలోకి వెళ్లి చూడగా 150 చెట్లలోని సుమారు ఆరు టన్నుల చీనీకాయలను అపహరించుకెళ్లినట్లుగా గుర్తించాడు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.2.10 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. కాగా, పది రోజుల క్రితం మాలగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి తోటలోని చీనీకాయలను కూడా దుండగులు అపహరించిన వైనం మరువక ముందే ఎరికల గోపాల్ తోటలో కాయలు అపహరణకు గురి కావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఘటనపై బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మోదీ పాలన స్వర్ణ యుగం ● రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అనంతపురం టవర్క్లాక్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిందని, ఈ 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ పటిష్టం చేసి స్వర్ణ యుగంలా మార్చాడని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్కరణల అమలుతో దేశాభివృద్ధికి ప్రధాని మోదీ బాటలు వేశారన్నారు. ప్రధానంగా రైతులు, పేదలు, యువకులు, మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేశారన్నారు. ఇటీవల పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు విద్రోహులను ముప్పతిప్పలు పెట్టాయన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ తోక ముడిచేలా చేశారన్నారు. సాధ్యం కాని ఎన్నో పనులను ఆచరణలో పెట్టి చూపారన్నారు. అధికారం కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకునేలా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. భూసార పరీక్షలు చేయించుకోండి పుట్టపర్తి అర్బన్: రైతులే స్వయంగా తమ పొలాల్లోని మట్టిని తీసుకెళ్లి భూసార పరీక్షలు చేయించుకుని పంటల సాగు చేపట్టాలని జాతీయ నూనె గింజల పరిశోధనా స్థానం డాక్టర్ దొరై మురుగన్, కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ త్రికళ మాధవి అన్నారు. వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు, చెర్లోపల్లి గ్రామాల్లో ఐసీఏఆర్, న్యూఢిల్లీ సహకారంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులను చైతన్య పరిచారు. రైతు సంక్షేమ కార్యక్రమాల కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం పలువురు రైతులకు భూసార పరీక్ష పత్రాలు, ఇద్దరు అభ్యుదయ రైతులకు కంది విత్తనాలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో రేకులకుంట ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఏరువాక శాష్త్రవేత్త రామసుబ్బయ్య, ఏడీఏ సనావుల్లా, రైతులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం ● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పుట్టపర్తిటౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంగళవారం పుట్టపర్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాబోవు రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు సాగిస్తామన్నారు. -
చైతన్య పాఠశాల ఎదుట ధర్నా
కదిరి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కదిరిలోని శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారం చేస్తున్న పాఠశాలపై విద్యాశాఖాధికారులు తనిఖీలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఆన్లైన్ ద్వారా శ్రీచైతన్య విద్యాసంస్థలు ఇంటికే పుస్తకాలు పంపుతున్నారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రీ ప్రైమరీ అడ్మిషన్లను చేపట్టారని మండిపడ్డారు. సీబీఎస్సీ, ఇంటర్నేషనల్ విద్య పేరుతో రూ.లక్షల మేర ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ధర్నాలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర, నాగార్జున, బాబ్జాన్, గణేష్, అఖిల్, మహేష్నాయక్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఫర్నీచర్ ధ్వంసంపై సమాచారం అందుకున్న సీఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘాల నాయకులపై కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా ఎస్ఎఫ్ఐ మహేంద్ర, బాబ్జాన్, ఎంఎస్ఎఫ్ సాకే హరి, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ గణేష్, ఎంఎస్ఎఫ్ సోము, రాజుతో పాటు మరో 10 మంది పాఠశాలలో అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన విద్యార్థి సంఘం నాయకులు -
● ధర్మవరం వాసి నేత్రదానం
ధర్మవరం అర్బన్: స్థానిక మార్కెట్ వీధికి చెందిన రేపాకుల రమేష్(58) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులు, పోలా ప్రభాకర్, డాక్టర్ బీవీ సుబ్బారావు, జయరామ్, మోహన్.. మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప పర్యవేక్షణలో కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, భాస్కర్రెడ్డి, రఘువీరా సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమార్తెలు రేపాకుల శ్రుతి, శ్రీరక్షకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేత్రాలు మరో ఇద్దరికి చూపును అందిస్తాయని తెలిపారు. నీట మునిగి బాలుడి మృతి చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు చెరువు పడిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన ప్రసాద్, అంజలి దంపతుల కుమారుడు దీక్షిత్ (7) ఉన్నాడు. గ్రామ శివారులోని చెరువులో మంగళవారం దుస్తులు ఉతికేందుకు వెళుతున్న తన అవ్వ నాగలక్ష్మమ్మతో కలసి దీక్షిత్ కూడా వెళ్లాడు. అవ్వ దుస్తులు ఉతుకుతున్న సమయంలో గట్టున ఉన్న దీక్షిత్ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నాగలక్ష్మమ్మ వేసిన కేకలు వృథా అయ్యాయి. వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో తాత కాటమయ్యతో పాటు చుట్టుపక్కల వారు చెరువు వద్దకు చేరుకుని గాలించి వెలికి తీసేలోపు బాలుడు మృతిచెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. -
మొండిగా ముందుకు..
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో అత్యధికులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల్లో విద్యాశాఖ అధికారులు సీనియార్టీ జాబితాలో అసంబద్ధాలు తొలగించకుండానే మొండిగా ముందుకు వెళ్లాలని చూశారు. అయితే, ఫిర్యాదులను పట్టించుకోకుండా కౌన్సెలింగ్కు సిద్ధమవడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో సీరియల్ నంబరు 1 నుంచి 350 వరకు ఉన్న టీచర్లకు బదిలీలు చేపడతామని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి ఉరుకులు, పరుగులతో ఎస్జీటీలు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తీవ్ర ఇబ్బందులు.. కౌన్సెలింగ్ కేంద్రంలో తాగేందుకు కూడా నీటి వసతి కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలు అంటూ, ఉన్నతాధికారుల నుంచి లింక్ రాలేదంటూ రాత్రి 9 గంటల దాకా గడిపారు. ఎట్టకేలకు 9.30 గంటల సమయంలో కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు మైకుద్వారా ప్రకటించారు. ముందుగా జాబితాలోని 1 నుంచి 30 మంది టీచర్లు రావాలని పిలవగా.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనేక ఫిర్యాదులు ఇచ్చినా అవేవీ పట్టించుకోకుండా సీనియార్టీ జాబితాలో మార్పు చేయకుండా ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఒక టీచరుకు 32 పాయింట్లు రావాల్సి ఉండగా 27 పాయింట్లు వచ్చాయని, రెండుసార్లు రీఅపోర్స్మెంట్కు గురైన మరో టీచరుకు రావాల్సిన 7 ప్రత్యేక పాయింట్లు వేయలేదని, తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్న స్పౌజ్ పాయింట్లు ఫైనల్ జాబితాలో కనిపించడం లేదని.. ఇలా పదుల సంఖ్యల్లో సమస్యలు ఉన్నాయన్నారు. దీంతో సీనియార్టీలో వందలు, వేలల్లో తేడా వస్తోందంటూ వాపోయారు. ఇవేవీ పరిష్కరించకుండా వారిని అన్యాయం చేస్తారా అని నిలదీశారు. కమిషనర్ నుంచి అనుమతులు తీసుకుని వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతనే కౌన్సెలింగ్ జరపాలంటూ పట్టుబట్టారు. పోలీసులకు సమాచారం ఇంతలో విద్యాశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. రాప్తాడు పోలీసులు చేరుకున్నారు. అయినా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనక్కి తగ్గలేదు. నిబంధనల మేరకు రావాల్సిన పాయింట్లు వేసే వరకు జరపకూడదంటూ తెగేసి చెప్పారు. దీంతో డీఈఓ పలుమార్లు ఆర్జేడీ, రాష్ట్ర అధికారులతో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. 150 మందికి మాత్రమే కౌన్సెలింగ్ తొలి 150 మందికి సంబంధించిన సీనియార్టీలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో చివరకు ఆ 150 మందికి మాత్రమే జరుపుతామన్నా సంఘాల నాయకులు ఒప్పుకోలేదు. చివరకు పలువురి జోక్యంతో వారికి కౌన్సెలింగ్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని డీఈఓ ప్రకటించారు. అయితే వారికి కూడా బుధవారం ఉదయం ఫైనల్ సీనియార్టీ జాబితాలో మార్పులు చేసి ప్రకటిస్తామని వెల్లడిస్తామన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాసిన వారు ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్కు సిద్ధమైన విద్యాశాఖ అడ్డుకున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు 8 గంటల ఆలస్యంగా 10.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ -
యోగాంధ్ర ఏర్పాట్ల పరిశీలన
ధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, స్వచ్చంధ సేవా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ మహేష్కు సూచించారు. మంత్రి సత్యకుమార్, కలెక్టర్ చేతన్, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తహసీల్దార్ నటరాజ్, ఎంపీడీఓ సాయిమనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్ ఉన్నారు. దాడి కేసులో ముగ్గురి అరెస్ట్ ధర్మవరం అర్బన్: వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్న షేక్ అన్వర్పై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. అన్వర్ భార్య ముబీనా అక్క హసీనా భర్త 14 సంవత్సరాల క్రితం మృతిచెందడంతో ఆమె ఇందిరమ్మకాలనీలో నివసిస్తున్న ఇంతియాజ్ బాషాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. బక్రీద్ రోజు హసీనాను ఇంటికి పిలిచి ఇలాంటి సంబంధాలు మంచివి కావని అన్వర్, ముబీనా హితవు పలికారు. ఈ విషయాన్ని ఇంతియాజ్కు హసీనా తెలపడంతో అతను ఆదివారం తన స్నేహితులు చాంద్బాషా, మహేష్తో కలసి అన్వర్ ఇంటికెళ్లి దాడి చేసి గాయపరిచారు. గాయపడిన భర్తను స్థానిక ప్రభుత్వాస్పత్రి భార్య ముబీనా తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న అనంతరం మంగళవారం బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు అరికట్టాలి
పుట్టపర్తి టౌన్: నిజాన్ని నిర్భయంగా రాస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్న ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులను అరికట్టి, దుండగులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు, ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో జర్నలిస్టులు మాట్లాడారు. టీవీలో చర్చ సందర్భంగా ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదించడం సరికాదన్నారు. చర్చలో పాల్గొన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కక్షగట్టి డిబేట్లో వ్యాఖ్యాతగా ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆరెస్టు చేయించిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు.ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలపైనే దాడులు చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై కూడా వరుసగా రెండురోజులు కూటమి పార్టీల నేతలు దాడులు చేశారన్నారు. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందన్నారు. అందువల్ల దాడి ఘటనలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి వారి వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్చిన అవసరం ఉందన్నారు. పత్రికల్లో, టీవీల్లో ఏదైనా ఓ కథనం, చర్చ అభ్యంతరకరంగా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలి గానీ, గూండాలతో దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులు సాయికృష్ణారెడ్డి, విజయశేఖర్రెడ్డి, కేశవరెడ్డి, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు -
యోగాతో రుగ్మతలు దూరం
లేపాక్షి: రోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక రుగ్మతలు దూరమవుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒత్తిడిని అధిగమించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు. మే 21న పుట్టపర్తి నుంచి యోగాంధ్ర ప్రారంభించామని వెల్లడించారు. ఇటీవల పుట్టపర్తిలో రెండు వేల మందితో, కదిరిలో 3 వేల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇపుడు లేపాక్షిలోనూ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొంటారని తెలిపారు. అనంతరం యోగా గురువులు శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి అభ్యాసకులతో వివిధ ఆసనాలను వేయించారు. కలెక్టర్తో పాటు పలువురు అధికారులు కూడా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ, టూరిజం శాఖ ఇన్చార్జి నరసయ్య, ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ నరసింహమూర్తి, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు, ఆయుష్ డాక్టర్ సాహితీ, ఎంఈఓలు నాగరాజు, కుళ్లాయప్ప, ఐసీడీఎస్, వెలుగు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదనపు గదులు ప్రారంభించిన కలెక్టర్ స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలోని అదనపు గదులను మంగళవారం ఉదయం కలెక్టర్ టీఎన్ చేతన్ ప్రారంభించారు. అదేవిధంగా విద్యాలయలోని ఎన్సీసీ గదులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటక కేంద్రాల్లో యోగాపై అవగాహన యోగా దినోత్సవంలో కలెక్టర్ చేతన్ -
బది‘లీలలు’ ఇంతింత కాదయా!
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ, అనుబంధ శాఖల్లో బదిలీల పర్వం ఇష్టారాజ్యంగా జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనవంతులు, బలవంతులు పైచేయి సాధించి కోరుకున్న చోట పోస్టింగ్ సాధించినట్లు తెలిసింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పాడి, మతద్యి, మార్కెటింగ్శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరిగాయి. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే చాలా మంది ఉద్యోగులు బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిఽధుల పలుకుబడి, వారి సిఫారసులు, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పోస్టులకు రూ.లక్షల్లోనే బేరం.. వ్యవసాయ శాఖలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక డిప్యూడీ డైరెక్టర్ శివప్రసాద్ బదిలీ అయ్యారు. 9 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీఏ), దాదాపు 57 మంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ (ఏఓ)కు బదిలీ ఉత్తర్వులు అందాయి. అయితే ఇందులో అనంతపురం ఏడీఏ, రూరల్ ఏఓతో పాటు మరో నాలుగు స్థానాలకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆ శాఖలో ప్రచారం సాగుతోంది. ఏడీఏ పోస్టుకు రూ.20 లక్షలు, ఏఓ పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు, మరో ఐదారు పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బేరసారాలు జరిగాయనే ప్రచారం సాగుతోంది. ఇందులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నేతలు, కొందరు అగ్రీ ఇన్పుట్ డీలర్లు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన ఆప్షన్లు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో సంబంధం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటూ అడ్డదిడ్డంగా బదిలీలు చేసినట్లు చెబుతున్నారు. కాగా వ్యవసాయశాఖ ఏఓ బదిలీ జాబితాలు ఆపేయాలని మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చినట్లు చెబుతున్నారు. అంతా గందరగోళం.. పశుసంవర్ధకశాఖలో బదిలీ ఉత్తర్వులు వెలువరించి.. ఆ తర్వాత తక్షణమే వెనక్కి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. జాబితాలు వెల్లడించొద్దని డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే మత్స్యశాఖ పరిధిలో రెండు ఎఫ్డీఓ పోస్టుల విషయం కూడా తేల్చలేదు. పట్టు పరిశ్రమ శాఖ రెండు జిల్లాల అధికారులకు బదిలీ ఉత్తర్వులు అందాయి. అనంతపురంలో పనిచేస్తున్న డి.ఆంజనేయులు కర్నూలుకు, కర్నూలులో పనిచేస్తున్న విజయకుమార్ అనంతపురానికి బదిలీ అయ్యారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా జేడీ పద్మమ్మ చిత్తూరుకు, అక్కడ పనిచేస్తున్న శోభారాణి శ్రీ సత్యసాయి జిల్లాకు బదిలీ అయ్యారు. పట్టు పరిశ్రమల శాఖలో కొందరు సెరికల్చర్ అధికారులు (ఎస్ఓ) బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది అధికారులు మంగళవారమే ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డిని కొనసాగించారు. ఏపీడీగా ఉన్న ఫిరోజ్ఖాన్ను కర్నూలు ఏపీఎంఐపీడీ ఏపీడీగా బదిలీ చేశారు. శ్రీశైలంలో పనిచేస్తున్న ధనుంజయను ఇక్కడ ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ చేశారు. ఇక్కడ హెచ్ఓగా ఉన్న పల్లవికి ఏడీగా పదోన్నతి కల్పించి కుప్పం ఏడీగా బదిలీ చేశారు. ఉద్యానశాఖ ఏడీ నరసింహారావును నెల్లూరుకు బదిలీ చేసి ఆయన స్థానంలో దేవానంద్ను ఇక్కడకు పంపారు. అలాగే నలుగురు హెచ్ఓలకు బదిలీ ఉత్తర్వులు అందాయి. గుంటూరుకు బదిలీ అయిన మార్కెటింగ్శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. అలాగే వ్యవసాయ, ఉద్యానశాఖలో పలువురు అధికారులు మంగళవారం రిలీవ్ అయ్యారు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో ఇష్టారాజ్యం బలవంతులు, ధనవంతులు కోరుకున్న చోట పోస్టింగ్ ఏఓ జాబితాలు ఆపేయాలని ఉత్తర్వులు! -
డైయాలసిస్
కిడ్నీ బాధితులకు చికిత్సలో భాగంగా కీలకంగా అందజేసే డయాలసిస్ ప్రక్రియ అవసానదశలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గ కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి దుర్భర పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.ధర్మవరం అర్బన్: డయాలసిస్ అనగానే గుండె గుభేలుమంటుంది! మరణానికి చేరువైపోయామోననే భావన రోగుల్లో వ్యక్తమవుతుంటుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించే మూత్రపిండాలు మొరాయిస్తే, వాటి పనిని యంత్రాలకు అప్పగించడమే డయాలసిస్. దాదాపు 80 శాతం పాడయ్యేవరకూ కిడ్నీలు తమ విధిని సక్రమంగానే నిర్వహిస్తాయి. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా పని చేయడానికి మొండికేస్తాయి. దీనినే వైద్య పరిభాషలో ‘కిడ్నీ ఫెయిల్యూర్’ అంటారు. ఇలాంటి సమయంలో రోగి బతకాలంటే ‘డయాలసిస్’ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం రోగుల ప్రాణాలకు భరోసానివ్వలేకపోతోంది. డయాలసిస్ చేసే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని యంత్రాలు ఆగిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ఆయాసం ఎక్కువై ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంటోంది.నాలుగు నెలలుగా పనిచేయని జనరేటర్ధర్మవరంలోని మారుతీనగర్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాతాశిశు సంరక్షణ కేంద్రం నూతన భవనాన్ని నిర్మించి, ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేంద్రంలోనే ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. కేంద్రం నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకు అప్పగించారు. ఏజెన్సీ ద్వారా రోజూ 5 నుంచి 15 మంది రోగులకు డయాలసిస్ నిర్వహిస్తుంటారు. డయాలసిస్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదు. అయితే నాలుగు నెలలుగా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం చోటు చేసుకుంటుండంతో డయాలసిస్ రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని అధిగమించేలా ఏర్పాటు చేసిన జనరేటర్ సైతం పనిచేయడం లేదు. దీంతో ఒక్కో రోగికి డయాలసిస్ ప్రక్రియ పూర్తి చేయడానికి పది గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది.పట్టించుకోని ఏజెన్సీడయాలసిస్ సెంటర్లో జనరేటర్ పనిచేయడం లేదనే అంశాన్ని రహి కేర్ ఏజెన్సీకి సిబ్బందితోపాటు కిడ్నీ బాధితులూ ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకపోయింది. ఏజెన్సీ మేనేజర్ వీరా నిర్లక్ష్యపు సమాధానాలతో ఫోన్ కట్ చేస్తున్నాడని పలువురు రోగులు వాపోతున్నారు. ఇదే అంశాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రోగులు కోరారు. అయినా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.మౌలిక సౌకర్యాలు లేవుడయాలసిస్ సెంటర్ను భవనం పై అంతస్థులో ఏర్పాటు చేయడంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లో ఉన్న ఒక్క వీల్ఛైర్ సరిగా లేదు. కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసే సమయంలో అనారోగ్యానికి గురైతే వెంటనే ఆక్సిజన్ పెట్టాల్సి ఉంది. అయితే సెంటర్లో ఆక్సిజన్ సౌకర్యం లేదు. రోగి తీవ్ర అనారోగ్యానికి గురైతే వెంటనే మరో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. సెంటర్లో కనీసం తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులతో పాటు వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పదిరోజుల క్రితం రోగి మృతిధర్మవరంలోని కదిరిగేటు సమీపంలో ఉండే కిడ్నీ బాధితుడు రెడ్డప్పకు డయాలసిస్ చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపోయింది. జనరేటర్ లేకపోవడంతో కరెంటు వచ్చే వరకూ వేచి ఉన్నాడు. ఆ సమయంలో ఆయాసం ఎక్కువై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మృతిచెందాడు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండి ఉన్నా... లేదా, జనరేటర్ పనిచేసి ఉన్నా రెడ్డప్ప ప్రాణాలతో ఉండేవాడని కిడ్నీ బాధితులు అంటున్నారు.ఎప్పుడు పోతుందో చెప్పలేండయాలసిస్ చేసే సమయంలో తరచూ కరెంటు పోతోంది. దీంతో నాలుగు గంటలు సమయం పట్టే డయాలసిస్కు 10 గంటలవుతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. డయాలసిస్ చేసే సమయంలో కరెంటు పోతే మాకు శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక నరక యాతన అనుభవిస్తుంటాం. అధికారులు స్పందించి జనరేటర్ను బాగు చేయించాలి. – నాగరత్న, కిడ్నీ బాధితురాలు, గొట్లూరు గ్రామం, ధర్మవరంవారానికి మూడుసార్లు వస్తున్నానా ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఫిబ్రవరి నుంచి వారానికి మూడుసార్లు డయాలసిస్కి వస్తున్నా. డయాలసిస్ సమయంలో కరెంటు పోతే ఆయాసం పెరిగి పోతోంది. బీపీ తగ్గిపోయి, షుగర్ లెవల్స్ పడిపోయి కాళ్లు, చేతులు వాపులు వస్తున్నాయి. జనరేటర్ పనిచేయడంలేదని రహి కేర్ ఏజెన్సీ వారికి ఫోన్ చేస్తే పట్టించుకోవడంలేదు. విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేస్తే మాకేమి సంబంధం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పదిరోజుల క్రితం రెడ్డప్ప అనే రోగికి డయాలసిస్ చేసే సమయంలో కరెంటు పోయి చనిపోయాడు. ఆక్సిజన్ లేకపోవడంతోనే అతను చనిపోయినట్లుగా తెలిసింది. ఈ పరిస్థితి మరొకరికి రాకుండా చర్యలు తీసుకోవాలి.– ప్రభాకర్, కిడ్నీ బాధితుడు, ధర్మవరంప్రాణాలు పోయే పరిస్థితికిడ్నీలు చెడిపోయి సగం ప్రాణంతో బతుకుతున్నాం. డయాలసిస్ చేయించుకుంటునే మాకు బతుకు. అయితే గంటల కొద్ది కరెంటు పోతోంది. దీంతో డయాలసిస్ చేసే సమయంలో మిషన్లు ఆగిపోతున్నాయి. జనరేటర్ కూడా పనిచేయడం లేదు. ఇప్పటికై నా డయాలసిస్ కేంద్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.– నారాయణస్వామి, కిడ్నీ బాధితుడు, మల్కాపురం -
పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్
నల్లమాడ: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన యువకుడు పోతులయ్య నల్లమాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల వయసున్న బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. మాయ మాటలతో అత్యాచారం సాగించాడు. విషయాన్ని బాలిక ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోతులయ్యపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
చదువుతోనే ఉజ్వల భవిత
పుట్టపర్తి: చదువుతోనే ఉజ్వల భవిత సాధ్యమని, విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన 225 మంది పది, ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్స్’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సోమవారం కొత్తచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ టీఎస్ చేతన్, డీఈఓ కృష్ణప్ప తదితరులు విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు, మెమొంటోలు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన రూ.20 వేల ఆర్థిక సాయం వారి ఉన్నత చదువులకు కొంతమేర ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం డీఈఓ కృష్ణప్ప మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు పలువురు అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘ప్రైవేట్’కే అధిక ప్రాధాన్యం.. ప్రతిభా అవార్డులు అందించే విషయంలో ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాలో 400 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలల్లో పదో తరగతి చదివిన 85 మందికే ప్రతిభా పురస్కారాలు అందించారు. కానీ ప్రైవేటు పాఠశాల్లో చదివిన 102 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించడం విశేషం. కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి విద్యార్థులకు ఎమ్మెల్యే సింధూరరెడ్డి, కలెక్టర్ చేతన్ పిలుపు పది, ఇంటర్లో ప్రతిభ చూపిన వారికి ‘షైనింగ్ స్టార్’ అవార్డుల ప్రదానం -
7 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 7 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురం మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక గుడిబండ మండలంలో 5.4 మి.మీ, రొళ్ల 4.2, అగళి 4.2, హిందూపురం 4.2, రొద్దం 1.8, పుట్టపర్తి మండలంలో 1.8 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గోరంట్ల, ఓడీ చెరువు, చిలమత్తూరు తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. రానున్న నాలుగు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, హిందూపురంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. దీంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లగా...మురుగు నీరు రోడ్లపైకి చేరింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. దీంతో పాదచారులు, వాహనదానదారులు ఇబ్బందులు పడ్డారు. పిడుగుపాటుకు నలుగురికి గాయాలు హిందూపురం: హిందూపురం పట్టణ సమీపంలోని మోత్కుపల్లి వద్ద పిడుగుపడి నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి వర్షం రాగా, రాకేష్రెడ్డి, ఫణిత్కుమార్, తరుణ్, వంశీ మోత్కుపల్లి సమీపంలోని చింతచెట్టు కిందకు చేరారు. చెట్టుపై పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న నలుగురూ గాయపడ్డారు. రాకేష్ కడుపు, నడుము భాగంలో, ఫణిత్కు గొంతుకు, తరుణ్కు తొడభాగంలో గాయాలయ్యాయి. వంశీ సొమ్మసిల్లిపడిపోయాడు. వీరిని కుటుంబ సభ్యులు, స్నేహితులు హిందూపురం ప్రభుత్వ తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
పరిగి: మండలంలోని ఎన్.ముద్దిరెడ్డిపల్లికి చెందిన బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు అఖిల్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపారు. నాలుగు రోజలు క్రితం మైనర్ బాలికతో పాటు అఖిల్ కనిపించకుండా పోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టి ఆచూకీ గుర్తించి బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో అఖిల్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, బాలికకు సోమవారంతో మైనారిటీ తీరినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. -
ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేం
కుందుర్పి: ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేమని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేని పాలకులు.. ఆవు లాంటి ఆర్డీటీని జిల్లా నుంచి తరిమేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర సోమవారం ఆరో రోజు కుందుర్పి మండలం యర్రగుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్డీటీనీ కాపాడుకుని తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో ఆర్డీటీ సేవలు ఆగిపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను అరెస్ట్ చేసినా... చైతన్యవంతులైన ప్రజలే ఆర్డీటీని కాపాడుకుంటారని అన్నారు. గ్రామానికి చెందిన చిట్టెమ్మ మాట్లాడుతూ.... తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న తాను ఇప్పటి వరకూ ఆర్డీటీ ఆస్పత్రిలోనే ఉచితంగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల విదేశీ నిధులు రాకపోవడంతో ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీటీ లేకపోతే తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ● ఆర్డీటీ సేవల పునరుద్ధరణకు తలారి రంగయ్య సాగిస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు పోలీసులను పావుగా వాడుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. పాదయాత్ర అపిలేపల్లికి చేరుకున్న సందర్భంగా ఆయన తలారి రంగయ్యను కలసి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాటాడారు. ఆర్డీటీ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు తిప్పేస్వామి, తరిమెల గోకుల్రెడ్డి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఎంపీపీ కమలానాగరాజు, పార్టీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, మున్సిపల్ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు ఫయాజ్, సత్యనారాయణరెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆరో రోజు పాదయాత్రలో మాజీ ఎంపీ తలారి రంగయ్య -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి, పుట్టపర్తి: జర్నలిస్టుల అక్రమ అరెస్టులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కొమ్మినేని జర్నలిస్ట్గా ప్రజాస్వామ్యంలో తన పాత్రను మాత్రమే పొషించారన్నారు. మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు కూడా జాతీయ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన అంశాలనే చెప్పారన్నారు. వాటిని వక్రీకరించి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నిజం చెప్పేవారి గొంతునొక్కేందుకు పోలీసులను ప్రయోగిస్తోందన్నారు. మరోవైపు కూటమి నేతలు సాక్షి కార్యాలయాలపై దండెత్తడం కూటమి సర్కార్ అరాచక పాలనకు అద్దం పడుతోందన్నారు. -
‘సాక్షి’ కార్యాలయంపై దాడి గర్హనీయం
సాక్షి, నెట్వర్క్: సాక్షి చానల్ డిబేట్లో జరిగిన ఒక సంఘటనను సాకుగా తీసుకుని సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు తన వ్యక్తిగత విషయాన్ని వెల్లడించగా.... దాన్ని సాక్షి చానల్కు ఆపాదించడమే కాక ‘సాక్షి’ కార్యాలయంపైకి దండెత్తడం దారుణమన్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. అలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో జర్నలిస్టులు టి.మల్లికార్జున, గోవింద్, మురళి, జాకీర్ తదితరులు ఎస్ఐ. వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. హిందూపురంలో పత్రికా విలేకరుల సంఘం ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సురేష్రెడ్డి, రాజేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రొద్దం పోలీసు స్టేషన్లోనూ నాగరాజు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. -
ఖజానా శాఖలో బదిలీలు
అనంతపురం అర్బన్: జిల్లా ఖజానా శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం జారీ చేశారు. 20 మంది సీనియర్ అకౌంటెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అకౌంటెంట్లు, 11 మంది అటెండర్లు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను బదిలీ చేస్తూ ఇతర ప్రాంతాలకు పోస్టింగ్ ఇచ్చారు. వ్యవసాయ శాఖలో... అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ శాఖలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న ఎం. నాగమణిని, నంద్యాలలో పనిచేస్తున్న ప్రవీష్కుమార్ను అనంతపురంలోని డీఏఓ కార్యాలయానికి బదిలీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న సునీతను డీడీఏ(ఎస్సీ) కార్యాలయానికి, అనంతపురంలో పనిచేస్తున్న మధుమతిని హిందూపురం ఏడీఏ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వంచకుడికి రిమాండ్ కదిరి టౌన్: యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వంచకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కదిరి సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. కదిరి పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లికి చెందిన ప్రకాష్ లోబర్చుకున్నాడు. శారీరక అవసరాలు తీర్చుకున్న అనంతరం పెళ్లికి నిరాకరిస్తూ వేధించసాగాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ నెల 3న కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కదిరిలోని హిందూపురం మార్గంలో ఉన్న గట్లు వద్ద ప్రకాష్ను గుర్తించి అరెస్ట్ చేసి, అనంతపురంలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి అర్బన్: నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు వైద్య పరీక్షలు, టీకాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్బేగం ఆదేశించారు. టీకాల కార్యక్రమంపై సోమవారం తన చాంబర్లో వైద్యాధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ నాగరాజు, ఎస్ఓ కళాధర్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, బాలాజీనాయక్ , వైద్యాధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. తల్లీకొడుకు అదృశ్యం కదిరి టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో స్థానిక అడపాలవీధికి చెందిన షేక్ నజీమా, తన రెండేళ్ల వయసున్న కుమారుడితో కలసి ఈ నెల 2న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి గాలింపు చేపట్టినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి షేక్ షబానా ఫిర్యాదు మేరకు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. కాగా, గతంలోనూ ఆమె తన కొడుకును తీసుకెళ్లి 10 రోజుల తరువాత తిరిగి వచ్చినట్లుగా తల్లి పేర్కొనడం గమనార్హం. పాము కాటుతో వ్యక్తి మృతి సోమందేపల్లి: మండలంలోని చాలకూరు గ్రామానికి చెందిన ఆదినారాయణ (40) పాము కాటుతో మృతిచెందాడు. రొద్దం మండలం చెరుకూరు గ్రామం వద్ద మామిడి తోటలో కూలి పనులకు ఆదివారం వెళ్లాడు. సోమవారం ఉదయం పని ప్రాంతంలో పాము కాటు వేయడంతో పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదినారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్ టవర్ ఎక్కి హల్చల్ తనకల్లు: స్థానిక 42వ జాతీయ రహదారి పక్కనే బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ను సోమవారం రాత్రి ఆషిక్ అనే యువకుడు ఎక్కి హల్చల్ చేశాడు. దాదాపు వంద అడుగులు ఎత్తు ఉన్న టవర్ చివరి భాగానికి చేరుకుని అక్కడే కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. పోలీసులు టవర్ వద్దకు చేరుకుని కిందికి దిగి రావాలని పదే పదే కోరినా అతడు స్పందించలేదు. దీంతో చాలా సేపు పోలీసులు టవర్ వద్దే వేచి చూసి చివరకు పక్కకు వెళ్లారు. పోలీసులు లేరని తెలుసుకున్న యువకుడు తనంతకు తాను టవర్ దిగి వెళ్లిపోయాడు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి రాప్తాడు: ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పామిడి మండలం రామరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే నారాయణ (82) 15 ఏళ్లుగా చిన్మయనగర్ సమీపంలోని పంచాయతీరాజ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఉన్న సిమెంట్ పెల్లల పరిశ్రమలో 12 ఏళ్లుగా కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలంగా ఫిట్స్ రావడం, మతి స్థిమితం సరిగ్గా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాప్తాడులో పని ఉందంటూ బయలుదేరిన ఆయన పండమేరు వంక రైల్వే వంతెనపై వెళుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొంది. ఘటనలో ఎగిరి పట్టాల పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి చిన్న కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేటి నుంచి విత్తన వేరుశనగ పంపిణీ
పుట్టపర్తి అర్బన్: రాయితీపై రైతులకు అందజేసే విత్తన వేరుశనగ పంపిణీని జిల్లాలో మంగళవారం ప్రారంభం కానుంది. పుట్టపర్తి మండలం పెడపల్లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి విత్తన పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) సుబ్బారావు తెలిపారు. ఆ వెంటనే ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విత్తన పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వం జిల్లాకు 63,918 క్వింటాళ్ల విత్తనం కేటాయించగా, ఇప్పటి వరకూ 29 వేల క్వింటాళ్ల విత్తనం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కే–6, టీసీజీఎస్–1694 విత్తనం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ.2,790 కాగా, 40 శాతం సబ్సిడీ పోనూ రైతు తన వాటాగా రూ.1,674 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక కదిరి లేపాక్షి రకం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ.2,460 కాగా, సబ్సిడీ పోనూ రైతు తన వాటాగా రూ.1,476 చెల్లించాల్సి ఉంటుందన్నారు. గరిష్టంగా 3 బస్తాల విత్తనం అందించనున్నట్లు డీఏఓ వెల్లడించారు. ఇక కందులు కూడా మినీకిట్స్ రూపంలో త్వరలోనే పంపిణీ చేస్తారన్నారు. -
తల్లికి ‘వంచన’
చిత్రంలో కనిపిస్తున్నది పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన నారాయణస్వామి, శిల్ప దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకం అందుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు.. ఇంట్లో అందరికీ పథకం వర్తిస్తుందంటే ఆనందపడ్డారు. కానీ అధికారం చేపట్టాక పథకం ప్రస్తావనే లేకపోవడంతో ఇప్పుడు ఆరుగురు పిల్లలను చదివించడం ఇబ్బందిగా మారి ఒకరిద్దరిని చదువు మాన్పించే పరిస్థితి నెలకొంది. ఫీజులు కట్టలేక ఇబ్బందులు మాకు ఇద్దరబ్బాయిలు. ఓడీ చెరువులోని ఓ ప్రైవేటు స్కూలులో చదివిస్తున్నాం. ఇద్దరికీ చాలా ఖర్చు వస్తోంది. ఫీజులు కట్టేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మా కుటుంబానికి ఏటా తల్లికి వందనం పథకం కింద రూ.30 వేలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే ఒక ఏడాది మిస్ అయింది. ఈసారైనా డబ్బులు జమ చేయాలని కోరుతున్నాం. – భారతి, పరాకువాండ్లపల్లి, తనకల్లు మండలం అవస్థలు పడుతున్నాం మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నార్పలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పెద్ద కుమారుడు ఎనిమిదో తరగతి, చిన్న కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. ఇద్దరికీ ఏడాదికి రూ.80 వేలు ఫీజులు కడుతున్నాం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం వర్తించడంతో ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లించగలిగాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకం లబ్ధి చేకూరలేదు. దీంతో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. – ఎ.దేవి, రామాపురం, తాడిమర్రి. సాక్షి, పుట్టపర్తి: ఇంట్లో ఎందరుంటే అందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు చేస్తామని 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఏడాది గడిచిపోయింది. ఇప్పటికీ అతీగతి లేదు. ఈ సారైనా నెరవేరేనా? గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తల్లికి వందనం పథకం అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు సక్రమంగా ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తూ వచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ఫీజులను సకాలంలో తల్లిదండ్రులు చెల్లించగలిగారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాది పాటు పథకం లబ్ధిని ఎగ్గొట్టి తాజాగా ఈ నెల 15 లోపు ప్రకటించింది. గతేడాది తరహాలోనే ఈసారి కూడా పథకం లబ్ధి చేకూరకపోవచ్చునని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు సంస్థల్లో ఫీజుల మోత.. తల్లికి వందనం పథకం అతీగతీ లేకపోవడంతో ప్రైవేటు సంస్థల్లో ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడికి విద్యార్థులను పంపించలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. డిమాండ్కు అనుగుణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి తెరలేపారు. నాలుగేళ్లలో రూ.946 కోట్లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగు విడతలుగా జిల్లాకు ‘అమ్మ ఒడి’ పథకం కింద రూ.946 కోట్లు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఏటా సగటున 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ప్రస్తుతం జిల్లాలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 2.37 లక్షల మంది ఉన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో వీరిలో ఎంత మందికి లబ్ధి చేకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అమ్మఒడి పథకాన్ని ‘తల్లివందనం’గా మార్చిన కూటమి ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అందరికీ ఆర్థిక సాయం అంటూ హామీ ఏడాది ముగిసినా లబ్ధిదారులకు అందని నగదు తల్లులను వంచించిన చంద్రబాబు ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఎందరు ఉన్నా.. ఒక్కొక్కరికీ రూ.15 చొప్పున అందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం’ – ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. -
ఆ డాక్టర్పై చర్యలు తీసుకోండి
పుట్టపర్తి టౌన్: తన భార్య మృతికి కారణమైన కదిరి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రుచితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కదిరికి చెందిన బాధితుడు మనోహర్ కోరారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. డాక్టర్ రుచితారెడ్డి తన దైనందిన విధుల అనంతరం స్థానికంగానే నిర్వహిస్తున్న రేణుకా వైద్యశాలలో రోగులకు చికిత్స చేస్తుంటారన్నారు. ఈ క్రమంలో కదిరిలోని గాంధీనగర్లో నివాసముంటున్న మనోహర్... అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చికిత్స నిమిత్తం రేణుకా వైద్యశాలకు తీసుకెళ్లారు. రూ.5 వేల ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. పది రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ కూడా సరైన చికిత్స అందజేయకపోవడంతో తిరుపతిలోని సిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మే 2న ఆమె మృతి చెందింది. డాక్టర్ రుచితారెడ్డి నిర్లక్ష్యం, సరైన వైద్యం అందించకపోవడంతోనే ఆమె మృతి చెందినట్లుగా అక్కడి వైద్యులు నిర్ధారణ చేశారని బాధితుడు తెలిపాడు. తన భార్య మృతికి కారణమైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని కదిరి పీఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయకుమార్ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డీఎస్సీ కదిరి పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. కాగా, ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 80 వినతులు అందగా.. ఎస్పీ రత్న స్వయంగా స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు. పోలీసు స్పందనలో బాధితుడు మనోహర్ ఫిర్యాదు వివిధ సమస్యలపై 80 వినతులు -
రేషన్ బియ్యం పట్టివేత
బత్తలపల్లి: స్థానిక బృందావనం కాలనీలో నివాసముంటున్న మల్లికార్జున నాయక్... తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 750 కిలోల రేషన్ బియ్యాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రీజినల్ విజిలెన్స్ అధికారులు శ్రీగోపాలుడు, రవీంద్రనాథ్, బత్తలపల్లి సీఎస్డీటీ రామకృష్ణ తెలిపారు. బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత ఆత్మహత్యలేపాక్షి: మండలంలోని తిరుమలదేవరపల్లి గ్రామానికి చెందిన వివాహిత సవిత అలియాస్ సునీత(39) ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమార్తె మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
పుట్టపర్తి టౌన్: రోజూ యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినం మాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం పుట్టపర్తిలో చేపట్టిన అవగాహన ర్యాలీని వారు ప్రారంభించి, మాట్లాడారు. ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, లేపాక్షి ప్రాంతాల్లో పర్యాటక యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, కమిషనర్ క్రాంతికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు లేపాక్షిలో జిల్లా స్థాయి యోగా లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం ఉదయం జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బెల్టుషాపులు బంద్ చేయించి గ్రామంలోకి అడుగు పెట్టండి ● ఎకై ్సజ్ పోలీసులతో నాటుసారా తయారీదారుల వాగ్వాదం గుంతకల్లు: గ్రామాల్లో బెల్టుషాపులు బంద్ చేయిస్తే తాము నాటుసారా తయారీని మానుకుంటామని ఎకై ్సజ్ పోలీసులతో గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండా వాసులు వాగ్వాదానికి దిగారు. పులగుట్టపల్లి పెద్ద తండాలో ఆదివారం సాయంత్రం గుంతకల్లు ఎకై ్సజ్ అధికారులు వెంకటేష్, గోపాల్నాయక్, నాగరాజు తనిఖీలు చేపట్టారు. లాలూస్వామి నాయక్ ఇంట్లో పది లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో లాలూస్వామి నాయక్ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కృష్ణానాయక్, నెట్టప్పనాయక్, బాలాజీనాయక్తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ శేఖర్నాయక్ అక్కడకు చేరుకుని లాలూస్వామి నాయక్కు మద్దతుగా నిలిచారు. బెల్టుషాపులు బంద్ చేయించకుండా మరోసారి గ్రామంలోకి కాలుపెడితే పొలిమేర కూడా దాటలేరంటూ హెచ్చరించారు. ఘటనపై ఎకై ్సజ్ సీఐ శివసాగర్ను వివరణ కోరగా... జరిగిన ఘటన వాస్తవమేనని అంగీకరించారు. ఇప్పటికే లాలూస్వామి నాయక్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
‘నారాయణ’లో పాఠ్య పుస్తకాల గది సీజ్
హిందూపురం టౌన్: స్థానిక నారాయణ ఒలంపియాడ్ స్కూల్లో సోమవారం ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి విక్రయిస్తుండగా ఎంఈఓ గంగప్ప గుర్తించి సీజ్ చేశారు. కాగా, ఇదే అంశంపై సోమవారం ఉదయం ఎస్ఎఫ్ఐ, ఎస్ఎస్యూఐ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల వద్ద ధర్నా జరిగింది. పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి విక్రయిస్తుండడంతో విద్యార్ధి సంఘాల నాయకులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎంఈఓ వాటిని పరిశీలించి, విద్యా సామాగ్రి నిల్వ చేసిన గదిని సీజ్ చేశారు. పట్టణంలోని నారాయణ, చైతన్య, భాష్యం పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, పాఠ్య పుస్తకాల పేరుతో అక్రమంగా వేలాది రూపాయలు ఫీ వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, జిల్లా అధ్యక్షుడు సురేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఆఫ్రిద్, ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షుడు భరత్, అజ్మల్, ఉమేష్, చింటూ, మోరియా, ఇస్మాయిల్, కుశాల్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల ‘యోగ’ం
బొమ్మనహాళ్: ప్రచార ఆర్భాటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి సర్కార్ తీరుతో అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రతి పనికీ సర్వేల పేరుతో ఇటు సచివాలయ సిబ్బందిని, అటు ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పని ఒత్తిడికి లోనైన సచివాలయాల కార్యదర్శుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తాజాగా యోగ యాప్ అంటూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులకు కష్టాల ‘యోగ’ం రెట్టింపయింది. ఫేస్ రికగ్ననైజేషన్తో తిప్పలు సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి యోగా యాప్ చూపించి వారు వస్తారో లేదో తెలుసుకుని వివరాలు నమోదు చేయాలి. హాజరయ్యేందుకు ఆసక్తి చూపితే వివరాల నమోదు సమయంలో వారి ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి దరఖాస్తు పూర్తి చేసినట్లే. ఇంత వరకూ అంతా బాగున్నా... నో ఆప్షన్ పెడితే... ఆ కుటుంబంలో ఎవరో ఒకరిది ఫేష్ రికగ్ననైజేషన్ లేదా బయోమెట్రిక్తో వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. నో ఆప్షన్ కింద వివరాలు నమోదు చేయడం కార్యదర్శులకు చుక్కలు చూపిస్తోంది. ‘కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆసక్తి లేదంటే ఫొటో తీస్తారా? బయోమెట్రిక్ కావాలని అడుగుతారా? అసలు ఎందుకివ్వాలి? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి?’ అంటూ గృహ యజమానులు అసహనం వ్యక్తం చేస్తుండడంతో వారికి నచ్చచెప్పుకోలేక కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. అసలే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేపర్లు, సోషల్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయని, ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఓటీపీలు అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు శిక్షణ... మరోవైపు పోటీలు మూడు రోజుల క్రితం యోగాంధ్ర యాప్లో పంచాయతీల్లో యోగాసనాలపై మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చినట్లు వివరాలు నమోదు చేయాలని నిబంధన పెట్టారు. ఒక వైపు మండల స్ధాయిలో మాస్టర్స్ ట్రైనర్స్తో శిక్షణా కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సచివాలయ స్ధాయిలో యోగా తరగతులు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే సూచించారు. ఇది పూర్తి కాకుండానే పంచాయతీల పరిధిలో పోటీలు ఎలా పెట్టాలో, శిక్షణ లేని వారు పోటీల్లో ఎలా పాల్గొంటారో అర్ధం కావడం లేదని సచివాలయ కార్యదర్శులు వాపోతున్నారు. ప్రజా సేవలకు దూరంగా... ఒక్కో సచివాలయ పరిధిలో వేలాది మందిని సర్వే చేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నదీ.. లేనిది వివరాలు నమోదు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఉన్నతాధికారులకే ఓ అంచనా లేదు. అన్నీ బాగుండి సర్వర్ మొరాయించకపోతే పూర్తి చేయడానికి ఒక్కో వ్యక్తి దగ్గర కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో కార్యదర్శులు ప్రజా సేవలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సచివాలయల వద్దకు రేషన్కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో సర్వేల పేరుతో కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. యోగా డే యాప్ సర్వే పేరుతో కార్యదర్శులకు సర్కార్ టార్గెట్లు ఓటీపీలతో తప్పని ఇక్కట్లు -
రాష్ట్ర స్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లాకు కాంస్య పతకం
ధర్మవరం రూరల్: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భీమవరం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ , మేనేజర్ అరవింద్ గౌడ్, కోచ్ మారుతీకుమార్ ఆదివారం తెలిపారు. మొదటి లీగ్ మ్యాచ్లో నంద్యాల జిల్లా జట్టుపై 16–0, రెండో రోజు నెల్లూరు జిల్లా జట్టుపై 11–0, తిరుపతి జిల్లా జట్టుపై 3–1 స్కోరుతో విజయం సాధించి సెమీపైనల్కు జిల్లా జట్టు చేరుకుంది. అనంతపురం జిల్లా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పెనాల్టీ షూట్ అవుట్లో 3–2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడో స్థానం కోసం ప్రకాశం జిల్లా జట్టుతో తలపడి 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. జిల్లాకు చెందిన హేమ బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు దక్కించుకుంది. ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను జిల్లా స్పోర్ట్స్ ఆఽఽథారిటీ హాకీ కోచ్ హుస్సేన్, సీనియర్ క్రీడాకారులు బీవీ శ్రీనివాసులు, బండి వేణుగోపాల్, పళ్లెం వేణుగోపాల్, అంజన్న, గౌరీ ప్రసాద్, తదితరులు అభినందించారు. ● ఇదేనా సంపద సృష్టి!గుంతకల్లు: తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టి చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని హామీనిచ్చిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత కంటికి కనిపించని దోపిడీకి తెరలేపారు. ఒకే దూరం.. ఒకే రకమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి రూ.10 వ్యత్యాసంతో చార్జీలు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. గుంతకల్లుకు చెందిన ఓ ప్రయాణికుడు ఆదివారం ఉదయం పల్లె వెలుగు బస్సులో బురుజల మీదుగా పత్తికొండకు వెళ్లాడు. 35 కి.మీ. దూరం ప్రయాణానికి రూ.40 టికెట్ ధర చెల్లించాడు. అనంతరం సాయంత్రం పల్లె వెలుగు బస్సులోనే బురుజల మీదుగా గుంతకల్లుకు చేరుకున్నాడు. ఇందుకు టికెట్ ధర రూ.50 చెల్లించాడు. ఉదయం రూ.40 తీసుకున్నారు... సాయంత్రం రూ.50 తీసుకుంటున్నారు ఎందుకంటూ కండక్టర్ను నిలదీయడంతో ఉదయం 35 కి.మీ. దూరం ఉందని, సాయంత్రం 40 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోందని కండక్టర్ తెలపడంతో ప్రయాణికులు అవాక్కయారు. ఈ వ్యత్యాసం వెనుక ఉన్న దోపిడీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలని విమర్శలు గుప్పించారు. -
అప్పులు తీర్చే మార్గం కానరాక వ్యక్తి ఆత్మహత్య
బత్తలపల్లి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన సిరప్పగారి శ్రీరాములు(41)కు భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ, ఇతర అవసరాలకు గ్రామంలో తెలిసిన వారి వద్ద పదేళ్ల క్రితం అప్పులు చేశాడు. ఈ అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.12 లక్షలకు చేరుకుంది. అప్పు తీర్చాలంటూ ఒత్తిళ్లు తీవ్రం కావడంతో దిక్కు తోచని స్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఐపీ నోటీసులు పంపాడు. అనంతరం అప్పులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక పదేళ్ల క్రితం గ్రామం విడిచి చైన్నెకు వలస వెళ్లి అక్కడే కూలి పనులతో జీవనం సాగించసాగాడు. ఐదు నెలల క్రితం చైన్నె నుంచి తిరిగి వచ్చి బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న బీసీ కాలనీలో నివాసముంటున్నాడు. తన పరిస్థితిని తలుచుకుని మదనపడుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తన భార్య రామాంజినమ్మతో ‘నేను అప్పులు తీర్చలేను, అప్పలోళ్లకి నా మొహం కూడా చూపించలేకున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. రాత్రి భోజనం ముగించుకున్న రామాంజినమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి మిద్దిపైకి వెళ్లి నిద్రించింది. ఇంట్లో నిద్రించిన శ్రీరాములు అర్ధరాత్రి సమయంలో ప్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కిందకు దిగి వచ్చిన కుటుంబసభ్యులు.. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న శ్రీరాములును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, రామాంజినమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
పుట్టపర్తి టౌన్: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడం, పెండింగ్ చలానాలు, తదితరాలను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని, చలనాలు పెండింగ్ లేకుండా చెల్లించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అలాగే పాత నేరస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. శక్తి యాప్ వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు – రాయలచెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదరిపల్లికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. రైలులో తలుపు వద్ద నిలబడి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కింద పడినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
బాబురెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
సోమందేపల్లి: నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చల్లాపల్లి బాబురెడ్డి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బాబు రెడ్డి సతీమణి ఉమాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఽధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ సత్యనారాయణ అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్గా డాక్టర్ కేవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జీఎంసీలోని న్యూరో సర్జరీ విభాగాధిపతిగా ఉన్న ఆయనను తాత్కాలిక అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఇక్కడ పని చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును ఒంగోలు ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావును కడప జీజీహెచ్కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రతి విద్యార్థికీ మిత్ర కిట్లు అందించాలి బత్తలపల్లి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ప్రతి విద్యార్థికీ అందేలా చొరవ తీసుకోవాలని ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్, విద్యాశాఖ జేడీ సుబ్బారావు పేర్కొన్నారు.బత్తలపల్లిలోని ఎమ్మార్సీలో పంపిణీకి సిద్దంగా ఉన్న మిత్ర కిట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అందిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, డిక్షనరీలు, బ్యాగులు, బెల్ట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. నిర్ణీత సమయంలోపు కిట్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఎంఈఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్నాయక్, ఎమ్మార్సీలు గోవిందరెడ్డి, వెంకటరమణ, సునీత, మంజుల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నరసింహమూర్తి, షరీఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైళ్లలో తనిఖీలు కదిరి టౌన్: స్థానిక రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. కదిరి రైల్వే ఎస్ఐ రహీమ్, సిబ్బంది పాల్గొన్నారు. తన్నుకున్న ‘తమ్ముళ్లు’గార్లదిన్నె: మండలంలోని కనుంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులతో రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, కుమార్, వెంకటలక్ష్మికి అదే పార్టీకి చెందిన రాము, సంతోష్, ఇందు, నల్లమ్మతో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఇరు వర్గాలు రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఘటనలో గాయపడిన ఇరు వర్గాల వారినీ స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలింపుదారుల అరెస్ట్ అనంతపురం సిటీ: రైలులో గంజాయి తరలిస్తూ అనంతపురం రైల్వే స్టేషన్లో ఇద్దరు యువకులు రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన మేరకు... అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన రైలులో అనంతపురంలో దిగిన ప్రయాణికుల బ్యాగ్లు పరిశీలించారు. సమయంలో రెండు బ్యాగ్లో 24 కిలోల గంజాయిని గుర్తించి, సంబంధీకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రాప్తాడు మండలం సీపీఐ కాలనీ, కంబదూరు కొట్టాలకు చెందిన బిస్కట్ ఫయాజ్, బిస్కట్ మహబూబ్పీరా ఉన్నారు. వీరు భువనేశ్వర్ నుంచి గంజాయి తెచ్చి ఎక్కువ ధరకు అమ్మేవారని విచారణలో నిర్దారణ అయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఎస్ఐలు పవన్కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లు తెలిపారు. -
429 మందికి ఎస్ఏలుగా పదోన్నతి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 429 మంది ఎస్జీటీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్ పదోన్నతులు లభించాయి. ఇందులో పీఎస్హెచ్ఎంలుగా 141 మంది (కన్నడ 1, తెలుగు 130, ఉర్దూ 10) ఉన్నారు. అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ 46 మంది, హిందీ 01, తెలుగు 01, ఉర్దూ 01, బీఎస్ (తెలుగు) 38 మంది, బీఎస్ (ఉర్దూ) 04, గణితం (తెలుగు) 80 మంది, గణితం (ఉర్దూ) 05, పీడీ (తెలుగు) 06, పీఎస్ (కన్నడ) 01, పీఎస్ (తెలుగు) 46, పీఎస్ (ఉర్దూ) 01, సోషల్ (కన్నడ) 02, సోషల్ (తెలుగు) 50, సోషల్ (ఉర్దూ) ఆరుగురికి పదోన్నతి కల్పించారు. వీరితో పాటు ఇటీవల తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలైన స్కూల్ అస్టెంట్లందరూ ఆదివారం వారి పాతపాఠశాలల్లో రిలీవ్ అయ్యారు. సోమవారం కొత్త స్కూళ్లల్లో రిపోర్ట్ చేసుకోనున్నారు.ఎస్జీటీలకు నేడు వెబ్ ఆప్షన్లుకాగా ఎస్జీ టీచర్ల బదిలీల్లో భాగంగా సోమవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఓవైపు మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని టీచర్లు, సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా....ప్రభుత్వం మాత్రం వెబ్ కౌన్సెలింగ్కే మొగ్గు చూపింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంతో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇబ్బంది అని భావించేవారి కోసం ప్రతి మండలంలోనూ ఎమ్మార్సీల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోకి వెళ్తే... సిబ్బంది వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రసాద్బాబు తెలిపారు.నేడు ప్రజా సమస్యలపరిష్కార వేదికప్రశాంతి నిలయం/ పుట్టపర్తి టౌన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.పోలీసు కార్యాలయంలో..జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా కలిసి ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు.అత్యాచారం దారుణం● వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్పమడకశిర: రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దారుణమని వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యాచారానిక పాల్పడిన వారందరూ టీడీపీకి చెందిన వారేనని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో హోం మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నారు. మహిళా ఎమ్మెల్యే, మహిళా ఎస్పీ ఉన్నా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం.. నిందితులపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం విచారకరమన్నారు. పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగానికి వత్తాసు పలుకుతుండడంతోనే అత్యాచారాలను అరికట్టలేకపోతున్నారని ఆరోపించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఏపీ ఈఏపీసెట్లో పలువురు ప్రతిభకదిరి అర్బన్/ నల్లచెరువు: ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. కదిరి మండలం మొటుకుపల్లికి చెందిన రాధమ్మ, శేఖర్రెడ్డి దంపతుల కుమారుడు ఆర్.హర్షిత్రెడ్డికి 159వ ర్యాంకు వచ్చింది. కదిరికి చెందిన సుబ్రహ్మణ్యంనాయుడు కుమారుడు కార్తికేయకు 501 ర్యాంకు సాధించాడు. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి, కె.రాజారెడ్డి దంపతుల కుమార్తె జశ్వితరెడ్డి 444వ ర్యాంకు సాధించింది. -
అరకొరలోనూ పచ్చనేతలకే ప్రాధాన్యం
సంప్రదాయ పంట వేరుశనగ సాగుకు సిద్ధమైన రైతులకు ప్రభుత్వం నుంచి తగినంత సబ్సిడీ విత్తనకాయలు అందేలా కనిపించడం లేదు. విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియే సక్రమంగా సాగడం లేదు. అవసరం మేరకు విత్తనకాయలు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. దీంతో రైతులు ప్రైవేట్గా అదనపు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో 1.51 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుకు సన్నాహాలు ● ఎకరాకు 120 కేజీల చొప్పున 63,918 క్వింటాళ్ల విత్తనం అవసరం ● జిల్లాకు వచ్చింది కేవలం 26,784 క్వింటాళ్ల విత్తనమే ● నేటికీ ప్రారంభంకాని విత్తన పంపిణీ.. ఆందోళనలో అన్నదాతలుహిందూపురం: ఖరీఫ్లో వేరుశనగ సాగుకు సిద్ధమైన రైతులకు రాయితీ విత్తనం అందడం అనుమానంగా మారింది. 40 శాతం రాయితీతో విత్తనం అందిస్తున్నామంటూ కూటమి సర్కార్ హడావుడి చేస్తున్నా... నేటికీ విత్తన పంపిణీ ప్రారంభించలేదు. పైగా అరకొరగా జిల్లాకు సరఫరా చేయడంతో విత్తనం అందే పరిస్థితి లేక సాగుకు ముందే రైతు చిత్తయిపోతున్నాడు. జిల్లాకు చేరింది 26 వేల క్వింటాళ్లే ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,69,152 హెక్టార్లు కాగా, ఇందులో ప్రధాన పంట వేరుశనగ 1,51,824 హెక్టార్లలో సాగులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరంకాగా, జిల్లాకు నేటి వరకూ 26,784 క్వింటాళ్లు విత్తనం మాత్రమే అధికారులు పంపారు. పైగా నేటికీ విత్తన పంపిణీ ప్రారంభించలేదు. ఇక ధర విషయానికొస్తే కేజీ వేరుశనగ విత్తనం పూర్తి ధర రూ.93 కాగా, ప్రభుత్వం ప్రకటించిన 40 శాతం సబ్సిడీ రూ.37.20 పోను రైతు కేజీకి రూ.55.80 మేర చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా 30 కేజీల బస్తాకు రైతు తన వాటాగా రూ.1,694 చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆలస్యం విత్తన వేరుశనగ పంపిణీ కోసం రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో 442 రైతు సేవా కేంద్రాలుండగా.. చాలా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు లేరు. దీంతో ఒక్కో అగ్రికల్చర్ అసిస్టెంట్కు రెండు రైతు సేవా కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ఆయా కేంద్రాల పరిధిలోని రైతులందరి రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత వారిదే. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియనే ఆలస్యంగా సాగుతోంది.ఎంత భూమి ఉన్నా 3 బస్తాలేఇప్పటికే జిల్లాకు చేరిన విత్తనకాయల్లోనూ పచ్చనేతలకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా అధికారులకు అనధికార ఆదేశాలు అందాయి. ఈనేపథ్యంలో ఈసారి ఖరీఫ్ వేరుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చాలా మంది రైతులు ఇప్పటికే ఇతర జిల్లాలు, మండలాల్లోని రైతుల నుంచి విత్తనం తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆమాత్రం స్థోమత లేని వారు ఈసారి భూములను బీళ్లుగా వదిలేసేందుకు సిద్ధమయ్యారు. విత్తన వేరుశనగ పంపిణీలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎకరం భూమి ఉన్న రైతుకు ఒక బస్తా (30కేజీలు).. రెండు ఎకరాలు ఉంటే 2 బస్తాలు, మూడు ఎకరాలకు 3 బస్తాల విత్తనమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 3 ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా 3 బస్తాలు మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న తోటల్లో ఎకరం వేరుశనగ సాగుకు 30 కేజీల బస్తాలు 4 సంచులు అవసరం అవుతాయి. అంటే 120 కేజీలు. ప్రభుత్వం గరిష్టంగా 3 బస్తాలు ఇస్తే ఎకరం కూడా పంటను సాగు చేయలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ప్రైవేట్గా ఎక్కువ డబ్బు పెట్టి విత్తనం సమకూర్చుకోవాల్సి వస్తోందంటున్నారు. -
డెడ్ స్టోరేజీకి ‘పీఏబీఆర్’ నీటి మట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం గణనీయంగా తగ్గుతోంది. రిజర్వాయర్కు ఇన్ఫ్లో లేదు. ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు, నీటి ఆవిరి, లీకేజీల కారణంగా రోజుకు 80 క్యూసెక్కుల వరకు నీరు బయటకెళుతోంది. దీంతో రోజురోజుకూ నీటి మట్టం తగ్గుతోంది. రిజర్వాయర్ వాస్తవ నీటిమట్టం 11.1 టీఎంసీలు కాగా.. ఆదివారం నాటికి 2.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కూటమిలో చేరికల యుద్ధం
ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య చేరికల తతంగం రణరంగాన్ని తలపిస్తోంది. అవకాశ వాదులు, ఆశావహులను, ఇతర పార్టీలలో ఉన్న వారికి గాలం వేసి మా పార్టీలో చేరాలంటే మాపార్టీలో చేరాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు పోటీ పడుతుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. గతంలో అనేక సంఘటనలు వీరి మధ్య అనైక్యతను బహిర్గతం చేశాయి. పైకి పొత్తు ధర్మం ప్రకారం అందరం నడుచుకోవాలని చెపుతూనే లోలోపల ఊసరవెల్లి రాజకీయాలు చేస్తుండటం చూసి ప్రజలు విస్మయానికి లోనవుతున్నారు.ధర్మవరం: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూదన్రెడ్డిలు నియోజకవర్గంలో పట్టు సాధించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ఆరంభంలో నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను, ఆశావహులకు గాలం వేసి, బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకోవాలని మూడు పార్టీల వారు ప్రయత్నం చేశారు. అయితే ఒక పార్టీ వారు చేర్చుకునే ప్రయత్నం చేస్తుండగానే మరొక పార్టీ వారు అడ్డు పడటం పరిపాటిగా మారడంతో చేరికల కార్యక్రమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే.. ● ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో ఉన్న కృష్ణాపురం జమీర్ అహ్మద్ను బీజేపీలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకులు గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే జమీర్ను బీజేపీలోకి చేర్చుకోవద్దంటూ టీడీపీ నుంచి బీజేపీ నాయకులకు ఒత్తిడి వచ్చింది. అయినప్పటికి బీజేపీ నాయకులు బేఖాతర్ చేస్తూ జమీర్అహ్మద్ను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో జమీర్ ఇంటికి వెళ్లి టీడీపీ నాయకులు గొడవపెట్టుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ● కుణుతూరు పంచాయతీ పరిధిలోని పోతుకుంటలో సర్పంచ్ అంగజాల నాగవేణి, ఆమె భర్త అంగజాల రాజును బీజేపీలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేయగా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. ఏకంగా టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వద్ద ఈ పంచాయితీ జరిగింది. దీంతో అంగజాల రాజు బీజేపీలోకి చేరికను కొంతకాలం వాయిదా వేసి.. తర్వాత మంత్రి సత్యకుమార్ సమక్షంలో చేర్చుకోవడంతో టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఇదే పంచాయతీ పరిధిలోని పోతుకుంటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని టీడీపీ నాయకులు అడ్డుపడినప్పటికీ జనసేన పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో ఆ పంచాయతీలోని టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నాయకులు వద్దని వారించినప్పటికీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తొండమాల ఉమాదేవి, ఆమెభర్త తొండమాలరవి, సరితాల ఆశాబీ, ఆమె భర్త సరితాల బాషా, మల్లెల రమణమ్మ, ఆమె భర్త తోపుదుర్తి వెంకటరాముడిని ఏకంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన ఇన్చార్జ్ మధుసూదన్రెడ్డి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. బీజేపీ, జనసేన పార్టీలు ఏమాత్రమూ ఖాతరు చేయకపోవడంతో టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. చేరికలను పోటాపోటీగా తీసుకుంటున్న నేతలు పొత్తు ధర్మం విస్మరిస్తుండటంతో కేడర్లో అసంతృప్తి టీడీపీ, బీజేపీ, జనసేన నేతల తీరుపై ప్రజల విస్మయం -
ఖాద్రీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
కదిరి టౌన్: శ్రీదేవి భూదేవి వసంతవల్లభుడు ఖాద్రీశుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓం నమో నారసింహా..అంటూ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించుకున్నారు. మహిళలు దీపాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేడు ఏడు గుర్రాలపల్లికి మహిళా కమిషన్ సభ్యురాలి రాక ప్రశాంతి నిలయం: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ షేక్ రోఖియా బేగం సోమవారం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ చేతన్ మీడియాకు వెల్లడించారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఏడుగుర్రాలపల్లికి చేరుకుంటారు. అక్కడ లైంగిక దాడికి గురైన దళిత బాలికను, ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వివరాలు తెలుసుకుంటారు. 11.15 గంటలకు బాధితురాలి ఇంటి నుంచి రామగిరి పోలీస్ష్టేషన్కు వెళ్లి అధికారులతో ఘటనపై ఆరా తీస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి చేరుకుంటారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిసి లైంగికదాడి ఘటనకు గల కారణాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐడీడీఎస్ పీడీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం బెంగళూరుకు బయల్దేరి వెళ్తారు. సత్యసాయి మార్గంలో నడవాలి ప్రశాంతి నిలయం: సత్యసాయి మార్గంలో నడిచి కుటుంబంతో పాటు చక్కటి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సమాజంలో ఆధ్యాత్మిక, మానవతా విలువలు పెంపొందిస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేసే అంశంపై చర్చించేందుకు ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ మహిళా సదస్సు ఆదివారం ముగిసింది. ఉదయం సత్యసాయి మహిళా విభాగం సభ్యులు యజుర్ మందిరం నుంచి సత్యసాయి మహాసమాధి వరకు ర్యాలీ నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల పతాకాన్ని, సత్యసాయి విలువను చూపే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళామణులు తమ సందేశాన్ని వినిపించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలల దుర్మరణం ● మరొకరికి తీవ్రగాయాలు గాండ్లపెంట: ఎన్పీకుంట మండలం ఎదురుదొన పంచాయతీ ముఖములవారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలలు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం మారెప్పగారిపల్లికి చెందిన స్నేహితులు మహమ్మద్ సుహైల్ (16), లతీఫ్ (15), తోసిఫ్ గాండ్లపెంట మండలంలోని తిమ్మమ్మ మర్రిమానును సందర్శించడానికి ఆదివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ముఖములవారిపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన క్వాలిస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న మహమ్మద్ సుహైల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లతీఫ్, తోసిఫ్లను స్థానికులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి తర్వాత లతీఫ్ మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే బాధిత తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. -
కామాంధులను కఠినంగా శిక్షించాలి
సాక్షి, టాస్క్ఫోర్స్: ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్, దళిత సంఘం నాయకులతో కలిసి ఆయన ఆదివారం రామగిరి మండలం పేరూరు నుంచి ఏడుగుర్రాలపల్లి వరకు మూడుకిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రపోగు సురేష్ మాట్లాడుతూ దళిత బాలికపై 14 మంది మృగాళ్లు ఆరు నెలలుగా అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఆ గ్రామంలో దళితులు, గ్రామస్తులను కలిసి పలు విషయాలు తెలుసుకున్నామని, గతంలో ఆ గ్రామంలో పెద్దమ్మతల్లి దేవస్థానం నిర్మాణానికి కూడా కొందరు నాయకులు అడ్డుపడ్డారని, పలువురు దళిత యువకులను గ్రామబహిష్కరణ చేశారని, ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా అనిత, జిల్లాలో మంత్రిగా సవితమ్మ, రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత, జిల్లా ఎస్పీగా రత్న ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత దళిత బాలిక కుటుంబానికి పక్కాగృహం, ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దబ్బల శ్రీరాములు, గంగాధర్, ప్రసాద్, రాచర్ల రామక్రిష్ణ, దబ్బల నరసింహులు, ముత్యాలప్ప, శేషప్ప, హరి, సి.ఎం.నరసిహులుతోపాటు రామ గిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం తదితరప్రాంతాల దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. దళిత బాలికకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ -
రైతులపై రాజకీయ కక్ష
ధర్మవరం: కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి సామాన్యులపై టీడీపీతో పాటు జనసేన నేతల వేధింపులూ అధికమయ్యాయి. అధికారం అండతో రైతులపైనా కక్ష సాధిస్తున్నారు. తాజాగా ధర్మవరంలో జనసేన నేత చిలకం మధుసూదన్రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు రైతులను టార్గెట్ చేసి ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరం మండల పరిధిలోని ముచ్చురామి గ్రామానికి చెందిన విశ్వనాథ్రెడ్డి, రవికుమార్ చీనీతోటలు సాగుచేస్తున్నారు. లోఓల్టేజీ సమస్య ఏర్పడి సాగునీరు అందక పోవడంతో 2023 జూన్లో కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం విశ్వనాథ్రెడ్డి రూ.38 వేలు, రవికుమార్ రూ.12,400 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేశారు. వారం రోజుల క్రితం విద్యుత్ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ స్తంభాలు నాటి లైన్ లాగుతుండగా... ధర్మవరం జనసేన పార్టీ ఇన్చార్జ్ చిలకం మధుసూదన్రెడ్డి విద్యుత్ అధికారులకు ఫోన్ చేశారు. వారిద్దరూ వైఎస్సార్సీపీ కార్యకర్తలనీ, వారికి కొత్త కనెక్షన్ ఇవ్వకూడదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పనులు చేస్తున్న వారు ఉన్నఫలంగా వెనుతిరిగారు. ఎందుకని బాధిత రైతులు ప్రశ్నిస్తే... ఒకసారి జనసేన ఇన్చార్జ్ను కలవమని అధికారులు చెప్పారు. వారంరోజులుగా విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో... ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. కేవలం తాము వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే కారణంతో జనసేన ఇన్చార్జ్ తమ పొలంలో ట్రాన్స్ఫార్మర్ బిగించకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. సాగునీరందక చీనీతోట ఎండిపోతున్నా... అధికారులు కూడా రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడం అన్యాయమని వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై జనసేన నాయకుడి దుర్మార్గపు చర్య విద్యుత్ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి పంటలు ఎండిపోతున్నాయని బాధిత రైతుల ఆవేదన -
దళిత ఎమ్మెల్యేల నోరు మూగబోయిందా?
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రామగిరి మండలంలోని గ్రామంలో దళిత మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తోంటే ఇది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమా... లేక రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్న దుర్మార్గపు ప్రపంచమా అనేది తెలియడం లేదు. ఇంత జరుగుతున్నా జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలు, నాయకులు ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదు. వారి నోరు మూగబోయిందా.. మాట గొంతుదాటి బయటకు రావడం లేదా’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగిరి మండలం పరిటాల కుటుంబం కబంధహస్తాల్లో ఉందన్నారు. బాలికపై అఘాయిత్యం జరిగిన రామగిరి మండలంలోని గ్రామం పరిటాల పెత్తనంతో 40 ఏళ్లుగా ప్రజాస్వామ్యం చూడలేదన్నారు. ‘అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం. చేసిందే శాసనం. అదే చట్టం’ అన్నారు. అక్కడ పరిటాల రాజ్యాంగం అమలవుతోందన్నారు. ఆ గ్రామంలో సూడో నక్సలైట్లు, కిరాయి హత్యలు చేసేవారు, రౌడీషీటర్లంతా పరిటాల సైన్యమన్నారు. ఇలాంటి గ్రామంలో ఒక దుర్మార్గుడు మైనర్ బాలికను బెదిరించి లొంగదీసుకుని వీడియో తీసి... ఆ వీడియోను బయటకు పెడతానంటూ బెదిరించి బలత్కారం చేశాడన్నారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసి 14 మంది ఆ బాలికపై అత్యాచారం చేశారన్నారు. చివరకు వీడియో తీసిన వాడి తండ్రి కూడా బాలికపై కన్నేసి బలాత్కరించాడని తెలిపారు. ఏడాదికాలంగా ఆ అమ్మాయిని చిత్రవధకు గురి చేశారన్నారు. ఆ బాలిక గర్భం దాల్చిన ఆర్నెల్ల తర్వాత ఆనోట, ఈనోట పడి ‘సాక్షి’ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసిందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం, ఒక మహిళ ఎస్పీగా ఉన్న జిల్లాలో మైనర్ బాలికపై అత్యంత దారుణంగా నెలల తరబడి అత్యాచారం జరిగితే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చీమ చిటుక్కుమన్నా పరిటాల కుటుంబానికి సమాచారం చేరవేసే గ్రామస్తులు ఇంతటి దారుణ ఘటన గురించి చెప్పకుండా ఉంటారా అనే అనుమానం వ్యక్తం చేశారు. కీచకుల మెడల్లో చెప్పుల హారాలు వేయించి ఊరేగించేలా చూడాలని కోరారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు ఈ ఘటన తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. మరి ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, పెన్నోబులేసు, ఆలమూరు ఓబులేసు, మీనుగ నాగరాజు, సాకే వెంకటేష్, విశ్వనాథరెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు. సభ్యసమాజం సిగ్గుపడేలా దళిత మైనర్ బాలికపై అత్యాచారం ఇంత జరిగినా దళిత ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడం అన్యాయం ఎస్పీ గారూ.. నిష్పక్షపాతంగా విచారించండి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
అప్పులోళ్ల అమానుషం
హిందూపురం: అప్పు కట్టాలంటూ ఇంటికి తాళం వేశారు. కుటుంబ సభ్యులను బయటకు గెంటేశారు. అప్పు తిరిగి చెల్లించే దాకా ఇంటి తాళం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈ అమానుష ఘటన హిందూపురం మండలం గోళాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు... గ్రామానికి చెందిన గంగమ్మ భర్త అనారోగ్యంతో ఐదేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి కూలి పనులకు వెళుతూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. అయితే..నీ భర్త తమతో అప్పు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బంధువులు గంగమ్మపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అంజక్క కుమారుడు సుధాకర్ వేళాపాళా లేకుండా ఇంటి వద్దకు వచ్చి బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె గతంలో హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పట్లో మందలించడంతో సుధాకర్ కొన్ని రోజులు మిన్నకుండిపోయాడు. మళ్లీ ఇప్పుడు వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే శనివారం గంగమ్మ ఇంటికి తాళం వేశాడు. అప్పు తిరిగి చెల్లించే వరకు తాళం ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో గంగమ్మ, పిల్లలు నిస్సహాయస్థితిలో చాలాసేపు ఇంటి బయటే కూర్చుండిపోయారు. తన భర్తకు అప్పు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని, అయినా ఇబ్బంది పెడుతున్నారని గంగమ్మ వాపోయారు. చివరకు అధికారులకు, పోలీసులకు విషయం తెలియడంతో సుధాకర్ను మందలించి తాళం చెవి ఇప్పించారు. అప్పు చెల్లించాలని ఇంటికి తాళాలు ఆరుబయటే బాధితులు -
2,59,895 జిల్లాలోని జాబ్ కార్డులు
ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు చెందిన వెంకటరమణ కుటుంబం ఉపాధి హామీ పథకం ద్వారానే జీవనం సాగిస్తోంది. కూలి డబ్బుతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు. ఈ నెల 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయితే వీరికి ఏప్రిల్ నుంచి ఉపాధి కూలి డబ్బులు చెల్లించక పోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది. ఇక పిల్లల చదువు ఎట్లా..? అని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. ..జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది ఉపాధి కూలీల పరిస్థితి ఇదే. మూడు నెలల కూలి డబ్బులు బకాయిగా ఉండటంతో అప్పులు చేసి పూట గడుపుకుంటున్నారు. చాలా మంది బెంగళూరుకు వలస వెళ్లి ‘ఉపాధి’ పొందుతున్నారు.బిల్లులు రావడం లేదు రోజంతా కష్టపడితే రూ.250 కూలి వస్తుంది. ఆ డబ్బులు కూడా 3 నెలల నుంచి ఇవ్వడం లేదు. ఆ డబ్బుతోనే పూట గడిచేది. అవి కూడా ఇవ్వకపోతే ఎలా? నెలల తరబడి డబ్బులివ్వకపోతే మేం ఏం తినాలి..ఎట్లా బతకాలి?. అదిగో.. ఇదిగో అనడమే గానీ.. ఇంత వరకూ డబ్బులు జమ చేసింది లేదు. –శంకరమ్మ, బయగారిపల్లి, తలుపుల మండలం అప్పు చేసి పూట గడుపుకుంటున్నాం ఎండలు మండుతున్నా కరువు పనులకు వెళ్తున్నాం. ఇంతకు ముందు వారానికి ఒకసారి మస్టర్లు చూసి కూలి డబ్బులు ఇచ్చే వాళ్లు. ఇప్పుడు మూడు నెలలు అవుతున్నా.. అతీగతీ లేదు. ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాం. ఉపాధి డబ్బులొస్తాయన్న ధైర్యంతో అప్పుచేసి పూట గడుపుకుంటున్నాం. –జె.రామన్న, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం పెండింగ్ వాస్తవమే ఉపాధి హామీ కూలీలకు ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి దాకా కూలి డబ్బులు చెల్లించాల్సిన మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా రూ.58.80 కోట్ల కూలి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయి. ప్రియారిటీ ప్రకారం వారం రోజుల్లో కూలీల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –కె.విజయ ప్రసాద్, పీడీ, డ్వామా ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)కదిరి: వలసలను నివారించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాడి తప్పింది. గతంలో నిరుపేదలకు ఆదరవుగా ఉన్న ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంరాగానే అస్తవ్యస్తంగా మారింది. చేసిన పనులకు 3 నెలలుగా వేతనాలు అందక ఉపాధి కూలీలు పస్తులతో అలమటిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారం రోజుల్లో ఉపాధి కూలి డబ్బులు చెల్లించాలి. గరిష్టంగా 15 రోజుల్లోపే వారి పనికి సంబంధించిన మొత్తం నేరుగా ఖాతాలో జమ చేయాల్సి ఉన్నా..ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. మరోవైపు ఉపాధి హామీ సిబ్బందికీ వేతనాలు మూడు నెలలుగా పెండింగ్లో ఉండటంతో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకుపోయిన బకాయి జిల్లాలోని 2,59,895 కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్ కార్డులుండగా... 4,76,217 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రసుత్తం 2.13 లక్షల కార్డులు యాక్టివ్లో ఉండగా..3.90 లక్షల మంది క్రమం తప్పకుండా ఉపాధి కూలి పనులకు వెళ్తున్నారు. వీరికి 3 నెలలుగా కూలి డబ్బులు అందడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి దాకా రూ.58.80 కోట్ల కూలి డబ్బులు బకాయి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మెటీరియల్ కేటగిరీలో గ్రామాల్లో సిమెంటు రోడ్లు తదితర పనులు చేసిన వారికి కూడా బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్(ఎంసీసీ)లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు నిత్యం కూలీలతో పాటు ఉంటూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా 3 నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో వీరి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. మితిమీరిన రాజకీయ జోక్యం గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ అమలులో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లలను ఏకపక్షంగా తొలగించారు. వారి స్థానంలో కూటమి పార్టీల సానుభూతి పరులను నియమించారు. గ్రామాల్లో పేదలకు పనులు అప్పగించే విషయంలోనూ పార్టీలు చూస్తున్నారు. అధికార పార్టీకి సహకరించిన వారికి మాత్రమే పనులు అప్పగించాలని అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. దీంతో చాలా మంది స్థానికంగా పనులు దొరక్క..దొరికినా కూలీలు సకాలంలో అందక... గ్రామాలు విడిచి బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో ‘ఉపాధి’ దుస్థితి 3 నెలలుగా కూలీలకు అందని వేతనాలు రూ.58.80 కోట్ల కూలి డబ్బులు బకాయి ఒక్కో కూలీకి సగటున రూ.20 వేలు పెండింగ్ ఉపాధి సిబ్బందికీ 3 నెలలుగా మంజూరుకాని జీతాలు4,76,217 ఉపాధి కూలీల సంఖ్యరూ.58.80 కోట్లు కూలీలకు బకాయిగా ఉన్న మొత్తం -
ఇదేనా మీ సంస్కారం మంత్రి గారూ..?
● అధికారులను గౌరవించడం నేర్చుకోండి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: ‘‘ప్రజల బాగోగులు ఎలాగూ పట్టించుకోవడం లేదు. కనీసం మీ కోసం పనిచేసే అధికారులనైనా మనుషులుగా చూడండి. ఎవరైనా నమస్కారం పెడితేనే ప్రతి నమస్కారం చేస్తాం. అలాంటిది ఒక మండల మెజిస్ట్రేట్ గౌరవంతో పూలబొకే తీసుకువస్తే విసిరిపడేస్తారా...ఇదేనా మీ ప్రభుత్వం అధికారులకు ఇచ్చే విలువ..? ఇప్పటికై నా కాస్త సంస్కారం నేర్చుకోండి’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మంత్రి సవితకు హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఆదివారం పెనుకొండలోని ఓ ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీలో పాల్గొన్న మంత్రి సవిత... పౌరసరఫరాల శాఖ అధికారి ప్రభావతి, తహసీల్దార్ శ్రీధర్లను తీవ్రంగా అవమానించారన్నారు. వారిద్దరూ గౌరవంతో పూలబొకేలు ఇచ్చి ఆహ్వానిస్తుంటే. కలెక్టర్ సమక్షంలోనే మంత్రి ఆ బొకేలను వెనక్కు విసరడం ఎంత వరకు న్యాయమన్నారు. అధికారులకు మంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా...? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అధికారులకు విలువ తగ్గిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన మంత్రి వీడియో చూస్తే తెలుస్తుందన్నారు. మంత్రి సవిత ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. సభ్యత, విలువలను నేర్చుకోవాలని హితవు పలికారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు 9వ స్థానం పుట్టపర్తి టౌన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఽశనివారం విడుదలయ్యాయి. జిల్లా నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,188 మంది పరీక్షలు రాయగా, 1,902 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,199 మంది పరీక్ష రాయగా, 1,437 మంది (65 శాతం) ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. సెమీస్కు జూనియర్ మహిళల హాకీ జట్టు ధర్మవరం: పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్కు చేరిందని హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హసేన్ తెలిపారు. జిల్లా మహిళల జట్టు శనివారం నెల్లూరు జిల్లా జట్టుపై 11–0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. జట్టులో నసీమా మూడు గోల్స్, నవ్యశ్రీ మూడు గోల్స్, మాధురి బాయి రెండు గోల్స్, పవిత్ర, వైష్ణవి, వర్ష ఒక్కొక్క గోల్ చేసి రెండో విజయాన్ని నమోదు చేశారు. మధ్యాహ్నం మూడో లీగ్ మ్యాచ్లో తిరుపతి జట్టుతో 3–1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్కు చేరుకున్నారు. ఆదివారం జరిగే సెమీ ఫైనల్స్లో అనంతపురం జిల్లా జట్టుతో తలపడనుంది. క్రీడాకారుల వెంట మేనేజర్ అరవింద్గౌడ్, కోచ్ మారుతికుమార్ ఉన్నారు. రైళ్లలో పోలీసుల తనిఖీలు హిందూపురం: రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. హిందూపురం రైల్వేస్టేషన్ గుండా వచ్చివెళ్లే రైళ్లలోని ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. అలాగే ప్లాట్ఫారంలో అనుమానాస్పదంగా ఉన్న వారిని విచారించారు. పార్సిల్ కార్యాలయంలోని వస్తువులనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గంజాయి, తదితర వాటిని నియంత్రించేందుకే తనిఖీలు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సజ్జప్ప తెలిపారు. -
నెత్తురోడిన రహదారి
గార్లదిన్నె: తిమ్మంపేట సమీపంలో జాతీయరహదారి నెత్తురోడింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని లారీ వెనుకనుంచి ఢీకొంది. ఈ ఘటనలో మహిళా కూలీ దుర్మరణం చెందింది. మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలిలో రోడ్డుపై ఎగిరిపడ్డ కూలీలు రక్తగాయాలతో ఆర్తనాదాలు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం ఎగువపల్లి, కొండకింద కొట్టాల, కల్లూరుకు చెందిన దాదాపు 35 మంది కూలీలు చీనీకాయలు తొలగించే పనికి శనివారం ఉదయం కల్లూరు నుంచి బొలెరో వాహనంలో ఆత్మకూరు మండలం సిద్దరాంపురం వెళ్లారు. సాయంత్రం పని ముగించుకొని కూలీలందరూ తిరిగి బొలెరో వాహనంలో కల్లూరుకు బయల్దేరారు. తిమ్మంపేట సమీపంలోని 44వ జాతీయరహదారిపైకి వచ్చేసరికి రాత్రి అయ్యింది. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న కొండకింద కొట్టాలకు చెందిన మహిళా కూలీ మంగమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మంది కూలీలు ఎగిరి రోడ్డుపై పడ్డారు. రక్షించండంటూ ఆర్తనాదాలు చేస్తుండడంతో స్థానికులు గమనించి 108,పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాయపడిన ఎగువపల్లికి చెందిన నాగలక్ష్మి, పద్మావతి, శివమ్మ, లక్ష్మీదేవి, యశ్వంత్, పార్వతమ్మ, దేవమ్మ, ఇందిర, లక్ష్మమ్మ, గుడ్డాలపల్లికి చెందిన ఈరమ్మ, కల్లూరుకు చెందిన వరలక్ష్మి, సావిత్రి, రామలక్ష్మి, భార్గవి, భావన, సావిత్రమ్మని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నాగలక్ష్మి, ఈరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిక్కిరిసిన సర్వజనాస్పత్రి అనంతపురం మెడికల్ : తిమ్మం పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో సర్వజనాస్పత్రి కిక్కిరిసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు ఎమర్జెన్సీ వార్డులో పెద్దఎత్తున వినిపించాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు సంబంధిత వైద్యులను ఆదేశించారు. బొలెరోను ఢీకొన్న లారీ మహిళా కూలీ దుర్మరణం మరో 16 మందికి గాయాలు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం -
బాలికపై అత్యాచారం అమానుషం
అనంతపురం అర్బన్: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శనివారం అనంతపురంలోని గణేనాయక్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనకు కారణమైన వారు ఏ పార్టీకి చెందినవారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును అవకాశంగా తీసుకుని దళిత బాలికపై ఆరు నెలలుగా 14 మంది అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజానికే సిగ్గుచేటన్నారు. నిస్సహాయ బాధిత బాలికకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం నిందితులకే తోడ్పుతుందనే విషయం గుర్తించాలన్నారు. ఈ దుర్మార్గ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎద్దుల బండిని ఢీకొన్న ఐచర్ వాహనం ● రైతుకు తీవ్ర గాయాలుబత్తలపల్లి: వేల్పుమడుగు క్రాస్ సమీపంలో ఎద్దులబండిని ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే ఘటనలో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన రైతు వీరనారప్ప శనివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండితో బత్తలపల్లి మండలం వేల్పమడుగు గ్రామానికి బయల్దేరాడు. వేల్పుమడుగు క్రాస్ సమీపంలోకి రాగానే ధర్మవరం నుంచి బత్తలపల్లి వైపు వేగంగా వస్తున్న ఐచర్ వాహనం ఎద్దుల బండిని వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు వీరనారప్ప ఎద్దుల బండిలో నుంచి ఎగిరి అల్లంత దూరంలో పడిపోవడంతో నడుములు విరిగాయి. ఎద్దులు సైతం గాయపడ్డాయి. ఎద్దుల బండి ధ్వంసమైంది. ఇటుకల బట్టీ వద్దనున్న కూలీలు అప్రమత్తమై వాహనాన్ని కొంత దూరం వెంబడించినట్లు తెలిసింది. అయితే వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. రైతును బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్శన టికెట్లపై అర్చకుల అభ్యంతరం గుత్తి: తొండపాడు బొలికొండ రంగనాఽథస్వామి దర్శనానికి టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయం వద్ద శనివారం అర్చకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, భక్తులు అధికంగా దైవ దర్శనానికి వస్తారన్నారు. కరువుకు నిలయమైన ఇలాంటి ప్రాంతంలో దైవ దర్శనానికి టికెట్ల విధానం అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదీగాక అధికారులు ఏకపక్షంగా టికెట్ల విధానం అమలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. కనీసం అర్చకులు, గ్రామ పెద్దలను కూడా సంప్రదించలేదన్నారు. వెంటనే టికెట్ల విధానం యోచనను విరమించుకోవాలన్నారు. -
అలకబూని.. ఇంటినుంచి వెళ్లిపోయిన విద్యార్థి
● పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ధర్మవరం అర్బన్: ఎంసెట్ మార్కుల విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని వెతికి పట్టుకొచ్చి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన నారాయణస్వామి కుమారుడు రాజు ఇటీవల ఎంసెట్ రాశాడు. పరీక్ష కీ ఆధారంగా 35 మార్కులు వచ్చాయి. సరిగా చదవలేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో అలిగిన రాజు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తెలిసిన చోట్లల్లా వెదికినా ఎక్కడా కనపడలేదు. శనివారం ఉదయం టూటౌన్ సీఐ రెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఆయన తన సిబ్బందితో గాలింపు చేపట్టి విద్యార్థి తన స్నేహితుడు ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని, పట్టుకొచ్చి తండ్రి నారాయణస్వామికి విద్యార్థిని అప్పగించారు. ఘర్షణలో యువకుడి మృతి గార్లదిన్నె: ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనకచెర్ల గ్రామానికి చెందిన దివాకర్, యశ్వంత్ శనివారం ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన దివాకర్ కట్టెతో దాడి చేయడంతో యశ్వంత్ (18) స్పృహతప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యశ్వంత్ను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి యశ్వంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘర్షణకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
30 పడకల ఆస్పత్రి
మండల కేంద్రం ముదిగుబ్బలో 30 పడకల ఆస్పత్రి కలగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే సత్య కుమార్ యాదవ్ 30 పడకల ఆస్పత్రిగా మారుస్తానని, ముదిగుబ్బకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన గెలిచి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతోంది. అయినా ఏ ఒక్క హామీనీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు.ముదిగుబ్బ: రాష్ట్రంలోనే అతి పెద్ద మండలం ముదిగుబ్బ. 1964లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఏర్పాటు చేశారు. ఆరు పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రస్తుత మండల జనాభా 80వేల దాకా ఉంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు ముదిగుబ్బ పీహెచ్సీని సందర్శించినపుడు 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయినా 30 పడకల సామర్థ్యం గల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతారేమోనని ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్ఎన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో నలుగురు డాక్టర్లు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న ఇద్దరిలో ఒకరు 104 వైద్య సేవలకు వెళ్లాల్సి ఉంటుంది. స్టాఫ్నర్స్లు పేరుకు ముగ్గురు ఉన్నప్పటికీ.. డిప్యుటేషన్పై వేరే చోట పనిచేస్తున్నారు. రోజూ 300 మంది ఓపీ సేవల కోసం వస్తుంటారు. అందుబాటులో ఒక డాక్టరే ఉండడం వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం నైపుణ్యత కలిగిన డాక్టర్లు లేకపోవడంతో ఆపరేషన్లు చేయడం లేదు. దీంతో ఎవరైనా ఆపరేషన్లు చేయించుకోవాలనే వారు అటు కదిరి గానీ ఇటు అనంతపురం గానీ వెళ్తున్నారు. రోడ్డు ప్రమాద కేసులు ఎక్కువే.. 205 జాతీయ రహదారి ముదిగుబ్బ మీదుగా పోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ మెరుగైన వైద్య సేవలు లేక ప్రమాదాలు జరిగిన వారికి ప్రఽథమ చికిత్స చేసిన వెంటనే బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి గానీ అనంతపురం ఆస్పత్రికి గానీ రెఫర్ చేస్తుంటారు. కొన్ని సమయాల్లో అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. దీంతో పాటు మలకవేమల క్రాస్లో మరొక పీహెచ్సీ కూడా ఉంది. అయితే ఆ పీహెచ్సీలో 5 సచివాలయాల పరిధిలోని వారికి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి. మిగిలిన 17 సచివాలయాలు ముదిగుబ్బ పీహెచ్సీ పరిధి కిందే ఉన్నాయి. మండల వ్యాప్తంగా 13 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. అందులో కొడవండ్లపల్లి, మల్లేపల్లి, సంకేపల్లి ఉప కేంద్రాలలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల ఆసుపత్రి వస్తే ముదిగుబ్బలో 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఐదారుగురు వైద్యులు వస్తారు. దంత, కంటి, గైనకాలజీ తదితర విభాగాల సేవలు అందుబాటులోకి వస్తాయి. తగినన్ని మందులు నిల్వ ఉంచుతారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ఇక్కడే చికిత్స చేయవచ్చు. తక్షణమే వైద్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉండదు. ముదిగుబ్బలో మెరుగైన వైద్యం మిథ్యే 80 వేల జనాభాకు ఆరు పడకల ఆస్పత్రే దిక్కు అప్గ్రేడ్ చేస్తామన్న మంత్రి సత్యకుమార్ హామీ ఏడాది గడిచినా అమలుకు నోచుకోని వైనంకల సాకారమయ్యేనా..? ముదిగుబ్బలో 30 పడకల ఆస్పత్రి చాలా అవసరం. రాష్ట్రంలో అతి పెద్ద మండలంగా పేరున్న ముదిగుబ్బలో అందుకు తగినట్టుగా ఆస్పత్రిని తీర్చిదిద్దుతామని మంత్రి సత్యకుమార్యాదవ్ హామీ ఇచ్చారు. ఇప్పటికి ఏడాది అయ్యింది. హామీ మేరకు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేసి.. మెరుగైన వైద్య సేవలందిస్తే బాగుంటుంది. – మల్లికార్జున, ఎంపీటీసీ, ముదిగుబ్బ వైద్య సేవలు మెరుగుపడాలి ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఒకరు 104 వాహనానికి వెళ్తుతున్నారు. ఉన్న ఒక్క డాక్టర్తో పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. పీహెచ్సీలో మందుల కొరత కూడా ఉంది. తగినంతమంది డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – మీ సేవ చంద్ర, ముదిగుబ్బ -
పోస్టులున్నా.. ఆసక్తి సున్నా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు పదోన్నతులు తీసుకునేందుకు ఎస్జీటీలు ఆసక్తి చూపలేదు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచినా...చాలా సబ్జెక్టులకు ఒక్కరూ కూడా హాజరుకాకపోవడం విశేషం. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి శుక్రవారం సాయంత్రం మొదలైన పదోన్నతుల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 10 గంటల వరకు సాగింది. ఇందులో జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించిన సోషల్ సబ్జెక్టులో 44 ఖాళీలుంటే కేవలం నలుగురు మాత్రమే పదోన్నతి తీసుకున్నారు. అలాగే పీఎస్హెచ్ఎం పోస్టులకు సంబంధించి కూడా 45 ఉంటే కేవలం ఐదుగురు మాత్రమే విల్లింగ్ ఇచ్చారు. చాలా పోస్టులు మిగిలిపోవడంతో ఆర్జేడీ శామ్యూల్ రాష్ట్ర అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నారు. ఆసక్తి ఉంటే వీరితర్వాత వారిని కూడా పిలిచేలా అనుమతులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయా సబ్జెక్టులకు అర్హులైన ఎస్జీటీలకు ఎంఈఓల ద్వారా సమాచారం అందించి సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం 5.30 గంటలకు ఆ రెండు కేడర్ పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించగా...సోషల్లో ఎస్సీ కోటాలో కొన్ని తప్ప తక్కిన అన్ని పోస్టులు భర్తీ అయ్యాయి. పీఎస్హెచ్ఎం పోస్టులకు రాత్రి 11 గంటల సమయానికి 16 మంది (ఇందులొ ఉదయమే 5 గురు తీసుకున్నారు) ఆప్ట్ చేశారు. బదిలీ అయిన ఎస్ఏల వివరాలు లేవట స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలు పూర్తయ్యాయి. ఉత్తర్వులు కూడా జనరేట్ అయ్యాయి. ఇవన్నీ శుక్రవారం తెల్లవారుజామునే పూర్తయ్యాయి. అయితే జిల్లాలో ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే సమాచారం శనివారం రాత్రి వరకు విద్యాశాఖ అధికారులు చెప్పకపోవడం విశేషం. ఈ వివరాలు ఇంకా తమకు రాలేదంటూ డీఈఓ చెప్పారు. కాగా స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లందరూ శనివారం రిలీవ్ అయి ఆదివారం కొత్తస్థానాల్లో చేరాలనే ఆదేశాల్లో మార్పు చేశారు. పాతస్థానాల్లో ఆదివారం (నేడు) రిలీవ్ అయి సోమవారం కొత్త స్కూళ్లల్లో చేరాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేడు ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లు ఎస్జీ టీచర్ల బదిలీలకు ఆదివారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోనున్నారు. మ్యానువల్గా కాకుండా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఎంఈఓల కార్యాలయాల్లో 10 కంప్యూటర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆయా మండలాల పరిధిలోని టీచర్లందరికీ అక్కడే వెబ్ ఆప్షన్లు పెట్టుకునే సదుపాయాలు కల్పించనున్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో సరైన వసతి లేకపోతే సమీపంలోని స్కూల్లో ఏర్పాటు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో ఎంఈఓలందరూ అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ వెబ్ద్వారా కాకుండా మ్యానువల్గా నిర్వహించాలంటూ ఆదివారం ఐక్య ఉపాధ్యాయ సంఘాల వేదిక డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. పదోన్నతులు తీసుకునేందుకు ఆసక్తి చూపని ఎస్జీటీలు 44 ‘సోషల్’ పోస్టులకు నలుగురే ఆసక్తి పీఎస్హెచ్ఎం పోస్టుల్లోనూ అదే తీరు -
స్థల వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
పుట్టపర్తి టౌన్: స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ శనివారం కొత్తచెరువులో కలకలం రేపింది. పోలీసు స్టేషన్ ఎదుటే బాహాబాహీకి దిగగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... కొత్తచెరువుకు చెందిన దాల్మిల్ సూరి భార్య మహలక్ష్మి కొత్తచెరువులోని తన 7.5 సెంట్ల భూమిని రిజిస్టర్ ఆయకం పెట్టి బుక్కరాయసముద్రానికి చెందిన సూర్యనారాయణరెడ్డి భార్య సుశీలమ్మతో ఐదేళ్ల క్రితం రూ. 50 లక్షలు అప్పుగా తీసుకుంది. క్రమం తప్పకుండా వడ్డీతో పాటు అసలు కొంత చెల్లిస్తూ ఇప్పటికే రూ.40 లక్షలు దాకా చెల్లించారు. మిగతా మొత్తం చెల్లిస్తామని తమ భూమిని తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని మహలక్ష్మి కోరింది. అయితే రుణదాత సుశీలమ్మ భూమిని రిజిస్టర్ చేయించకుండా కాలయాపన చేసింది. దీంతో మహలక్ష్మి కోర్టును ఆశ్రయించగా... ఈ కేసు పెండింగ్లో ఉంది. అయినప్పటికీ శనివారం సుశీలమ్మ కుమారుడు సాగర్రెడ్డి రెండు వాహనాలలో కిరాయి గుండాలను తీసుకుని వచ్చి కొత్తచెరువులోని స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న మహలక్ష్మి వర్గీయులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసం కాగా... 8 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేసేందుకు కొత్తచెరువు పోలీస్టేషన్కు వెళ్లారు. స్టేషన్ ముందు మరోసారి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు అందరికీ సర్దిచెప్పారు. అనంతరం ఇరువర్గాల నుంచి ఫిర్యాదు తీసుకుని క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు వాహనాలు ధ్వంసం.. 8 మందికి గాయాలు -
బడిబస్సూ పాస్ కావాల్సిందే!
చిలమత్తూరు: వేసవి సెలవులు ముగిసి మరో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆలోపే పాఠశాల బస్సులకు ఫిట్నెస్ (ఎఫ్సీ) పరీక్షలు చేయించుకోవాలని రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్సీ చేయించుకోని బస్సులను ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్డుపైకి ఎక్కనివ్వబోమని తేల్చిచెప్పారు. విద్యార్థులను తరలించే వాహనాలకు అన్నీ పక్కాగా ఉండాలని చెబుతున్నారు. కానీ జిల్లాలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించలేదు. జిల్లా వ్యాప్తంగా 512 స్కూల్ బస్సులు.. జిల్లా వ్యాప్తంగా 512 ప్రైవేటు స్కూల్ బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 436 బస్సులకు మాత్రమే ఆయా యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాయి. మిగిలిన 76 బస్సులు ఇంకా ఫిట్నెస్ టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ వరకే గడువు ఉన్నా... ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ దిశశగా అడుగులు వేయడం లేదు. ఫిట్నెస్ ఉంటే తప్ప ఆ బస్సులు రోడ్డెక్కకూడదు. 15వ తేదీ తర్వాత ఫిట్నెస్ సామర్థ్యం లేని వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల భద్రత ప్రామాణికంగా విద్యాసంస్థలు వ్యవహరించాలంటున్నారు. 12 నుంచి బుక్కపట్నం కేంద్రంగా ఎఫ్సీ పరీక్షలు.. ఆర్టీఓ కార్యాలయాల్లో నిర్వహించే ఫిట్నెస్ పరీక్షలు ఈనెల 12వ తేదీ నుంచి జిల్లా కేంద్రం సమీపంలోని బుక్కపట్నంలో నిర్వహించనున్నారు. ప్రభుత్వం టెండరు ప్రక్రియ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రం (ఏటీసీ) నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ తర్వాత బుక్కపట్నంలోని ఏటీసీలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాలల బస్సులకూ ఇక్కడే ఎఫ్సీ చేయనున్నారు. ● బస్సు జీవిత కాలం తప్పనిసరిగా 15 ఏళ్ల లోపు ఉండాలి. బస్సుకు తప్పనిసరిగా పసుపు రంగు వేయించడంతో పాటు నాలుగు వైపులా పాఠశాల పేరు, ఫోన్ నంబర్ అందరికీ కనిపించేలా రాయించాలి. ● డ్రైవర్ వయస్సు 60 ఏళ్లు మించకూడదు. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండి హెవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. మూడునెలలకు ఒకసారి డ్రైవర్కు బీపీ, షుగర్తో పాటు కంటిచూపు పరీక్షలు చేయించాలి. అటెండర్నూ తప్పక నియమించాలి . ● బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సు ఏర్పాటు చేయాలి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి. ● అగ్నిప్రమాద సమయంలో మంటలు ఆర్పేందుకు అవసరమైన ఫైర్ ఎగ్జిస్టర్స్ ఉంచాలి. ● బస్సు ఎక్కేందుకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఫుట్బోర్డు ఏర్పాటు చేయాలి. కిటికీలకు బయటవైపు తప్పనిసరిగా గ్రిల్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సవ్యంగా ఉంటేనే ఎఫ్సీ చేస్తారు. స్కూల్ బస్సులకు ‘ఫిట్నెస్ సర్టిఫికెట్’ తప్పనిసరి పాఠశాలల పునఃప్రారంభంలోపు ఎఫ్సీ చేయించుకోవాల్సిందే 15వ తేదీ వరకు గడువు విధించిన రవాణాశాఖ నేటికీ రవాణా శాఖ కార్యాలయానికి రాని 76 స్కూల్ బస్సులు 12 నుంచి బుక్కపట్నం ‘ఏటీసీ’లో ఎఫ్సీ పరీక్షలు 16 నుంచి స్పెషల్ డ్రైవ్ నిబంధనలు ఇవీ... బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. అన్ని పాఠశాలల యాజమాన్యాలకూ ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఎక్కడైనా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సు కనిపిస్తే సీజ్ చేస్తాం. బడి బస్సులన్నింటికీ ఈ నెల 15వ తేదీలోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. విద్యార్థుల భద్రతే మాకు ముఖ్యం. 12వ తేదీ తర్వాత ఫిట్నెస్ పరీక్షలు బుక్కపట్నంలో చేయించుకోవాల్సి ఉంటుంది. – కరుణాసాగర్రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
● బాలికపై అత్యాచార ఘటన కలచి వేసింది ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటన తనను కలిసి వేసిందన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులతో మహిళలు బయట తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. రాత్రి వేళల్లోనే కాదు పగలు కూడా బాలికలు, మహిళలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగుర్రాలపల్లికి చెందిన దళిత బాలికపై జరిగిన కీచకపర్వం క్షమించరానిదన్నారు. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి తక్షణం రక్షణ కల్పించాలని ఉషశ్రీచరణ్ కోరారు. పోలీసులు కూడా ఈ ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. బక్రీద్ను ఆనందంగా జరుపుకోండి ● ఎస్పీ రత్న పిలుపు పుట్టపర్తి టౌన్: బక్రీద్ పండుగను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. జిల్లాలోని ముస్లింలందరికీ ఆమె బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గోవధ చేయరాదని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సజావుగా పోలీసుల బదిలీలు ● 60 మందికి పోస్టింగ్ పుట్టపర్తి టౌన్: ఒకే స్టేషన్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసకున్న ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు బదిలీల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ హాలులో ఎస్పీ రత్న ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. 12 మంది ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చారు. ఐదేళ్ల పూర్తి చేసుకున్న వారి జాబితా సిద్ధం చేసి సీనియార్టీ ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ రత్న తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ సుజాత, సూపరింటెండెంట్ మల్లికార్జున, స్పెషల్బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు తేలికపాటి వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 11 తేదీ వరకు 0.2 మి.మీ నుంచి 12.9 మి.మీ మేర వర్షసూచన ఉందన్నారు. అందులో ఈనెల 10న 12.9 మి.మీ సగటు నమోదు కావొచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీలు, కనిష్టం 24.6 డిగ్రీల నుంచి 26.2 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 12 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తాయని వెల్లడించారు. -
‘సాయి మిషన్’లో మహిళలదే కీలక పాత్ర
ప్రశాంతి నిలయం: అమ్మలా ప్రేమ పంచి ఆధ్యాత్మిక, సేవా పరిమళాలు వెదజల్లిన సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తూ సత్యసాయి మిషన్ను ముందుకు నడపడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ అనన్యా బంధోపాధ్యాయ పిలుపునిచ్చారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభమైంది. ‘శ్రీ సత్యసాయి మహిళా విభాగ్–ది విజనరీస్ ఆఫ్ ది సాయి మిషన్’ అన్న థీమ్తో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సుకు 18 దేశాలకు చెందిన వేలాది మంది మహిళలు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజల అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు సతీమణి హిమవాహిని, సత్యసాయి బాలవికాస్ జాతీయ కోఆర్డినేటర్ కమలా పాండ్య, సత్యసాయి సేవా సంస్థల జాతీయ కోఆర్డినేటర్ శశిబాలతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్ ప్రారంభించారు. మహిళలపై సత్యసాయికి అపార నమ్మకం.. అనంతరం కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ అనన్యా బంధోపాధ్యాయ మాట్లాడుతూ, సత్యసాయికి మహిళలపై అపార నమ్మకం ఉందన్నారు. అందువల్లే ఆయన తన మిషన్ రూపకల్పనలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారని, తద్వారా మహిళల పట్ల ఉన్న నమ్మకం, వారి అభ్యున్నతి పట్ల ఆయనుకున్న చిత్తశుద్ధిని చాటారన్నారు. మనవాళి శ్రేయస్సు కోసం ప్రారంభించిన మిషన్లో మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన మిషన్ను ముందుకు నడపడం భక్తులుగా మన బాధ్యత అన్నారు. అనంతరం హిమాచల్ప్రదేశ్కు చెందిన అడిషనల్ డీజీపీ సత్వాంత్ అత్వాల్ ప్రసంగించారు. సత్యసాయి సేవా సంస్థలలో మహిళలు చురుకై న పాత్ర పోషించాలన్నారు. సత్యసాయి మహిళా లోకానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన మహిళలు ప్రసంగించారు. తొలిరోజు కార్యక్రమం చివర్లో సత్యసాయి సేవా సంస్థలలో ప్రముఖ పాత్ర పోషంచిన మహిళలను ఘనంగా సన్మానించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ అనన్యా బంధోపాధ్యాయ ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైన గ్లోబల్ మహిళా సదస్సు మూడురోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్కు హాజరైన 18 దేశాల మహిళలు -
అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్లకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన కౌన్సెలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని 686 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ సాగింది. మున్సిపల్ పాఠశాలల్లో 304 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్లో 52 పోస్టులు, ప్రభుత్వ పాఠశాలల్లో 26, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 304 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లలో పోస్టులకు 1:2, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పోస్టులకు 1:3 రేషియో ప్రకారం టీచర్లను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పదోన్నతులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సౌకర్యవంతమైన ఖాళీలు లేకపోవడంతో చాలామంది పదోన్నతులు తీసుకోలేదు. మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. కౌన్సెలింగ్ హాజరైన టీచర్లతో ఆప్షన్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. వారందరికీ శనివారం పదోన్నతుల ఉత్తర్వులు జనరేట్ కానున్నాయి. వీరితో పాటు బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎంలు (స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లు) అందరూ శుక్రవారం వారి పాత స్కూళ్లలో రిలీవై.. శనివారం ఉదయం కొత్త స్కూళ్లల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఉత్తర్వులు జనరేట్ అయ్యాయి. ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే వివరాలను రాత్రి 12 గంటలు దాటినా విద్యాశాఖ అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. కాగా, కార్పొరేషన్ పరిధిలోని స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో అధికారులు రోస్టర్ పాటించడం లేదంటూ రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు వాదనకు దిగారు. కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఆర్జేడీ... ఈ విషయంపై జేడీ సర్వీసెస్తో ఫోన్లో మాట్లాడి స్పష్టత ఇచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నిబంధనలకు పాతర అనువైన స్థానాల కోసం కొందరు టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బదిలీల చట్టం జీఏ 22 ప్రకారం మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అన్మ్యారెడ్ ఉమెన్’ (అవివాహిత) కేటగిరీ కింద 5 స్పెషల్ పాయింట్లు పొందేందుకు అర్హులు. ఈలెక్కన 1985 మే 31కి ముందు జన్మించి ఉండాలి. అయితే 1987 నుంచి 1999 మధ్య జన్మించిన వారు దాదాపు 30 మంది మహిళా టీచర్లు ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద పాయింట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బ్రహ్మసముద్రం, రొళ్ల, డి.హీరేహాల్, గుమ్మఘట్ట, మడకశిర, రాయదుర్గం, అమడగూరు, కంబదూరు, అగళి, గుడిబండ, కుందుర్పి మండలాల్లో పని చేస్తున్న మహిళా టీచర్లు ఎక్కువగా అక్రమంగా పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాను పరిశీలించిన పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనర్హుల జాబితాను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత బాబురెడ్డి ఆకస్మిక మృతి
చిలమత్తూరు: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పెనుకొండ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చల్లాపల్లి బాబురెడ్డి (46) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. మూడు రోజుల క్రితం గుండెలో నొప్పిగా ఉండడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. కోలుకుంటున్నారనుకుంటుండగానే శుక్రవారం మరోసారి గుండె పోటుకు గురై తుది శ్వాస విడిచారు. కాగా, బెంగళూరులో నివాసం ఉంటూ పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. 2011–2014 మధ్య పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ఎంతో మంది పార్టీ నేతలు, కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆయన మృతి విషయం తెలియగానే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, నియోజకవర్గ నేత వేణురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి యలహంకలోని బాబురెడ్డి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. -
పది మూల్యాంకనంలో కూటమి వైఫల్యం
ఇసుక అక్రమ రవాణాపై తనిఖీలు ముదిగుబ్బ: మండలంలోని కొడవండ్లపల్లి సమీపంలో మద్దిలేరు పరీవాహక ప్రాంతం నుంచి సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం ఆర్డీఓ మహేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు హిటాచీలు, ఓ టిప్పర్ను సీజ్ చేశారు. పట్టుబడిన వాహనదారులకు జరిమానా విఽధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలలో మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సీపీఆర్తో ప్రాణం నిలిపారు! కదిరి టౌన్: కరెంటు షాక్కు గురైన విద్యార్థి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటాయి. అంతలోనే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ దేవేంద్ర సీపీఆర్ చేసి విద్యార్థి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన కదిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఆంజనేయులు అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. అతని కుమారుడు నరసింహులు శుక్రవారం ఇంటిపైకి ఎక్కాడు. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైనును ప్రమాదవశాత్తు తాకడంతో షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ దేవేంద్ర వెంటనే అక్కడికి చేరుకుని బాలుడికి సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత బాలుణ్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. విద్యార్థి నరసింహులు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పుట్టపర్తి: పదో తరగతి మూల్యాంకనం మొత్తం తప్పుల తడకగా సాగిందని, విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అమరనాథరెడ్డి, రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. మూల్యాంకనంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ డీఈఓ కార్యాలయ సిబ్బందికి శుక్రవారం వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రెల్ 23న పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయని, ఇందులో చాలా మంది విద్యార్థులు పరీక్ష తప్పటంతో పాటు మార్కులు సైతం తక్కువగా వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 వేల మంది పై చిలుకు విద్యార్థులు రీ వాల్యూషన్కు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మంది విద్యార్థులు పాస్ అయ్యారని, మార్కులు కూడా బాగా పెరిగాయని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఫలితాలు రికార్డు స్థాయిలో తొందరగా విడుదల చేయాలనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయం కారణంగా మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. అన్ని సబ్జెక్టులలో 90 శాతం మార్కుల సాధించిన విద్యార్థిని సైతం ఫెయిల్గా పేర్కొనడం రేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం చేత కానితనం వల్ల అనేక మంది విద్యార్థులు ట్రిపల్ ఐటీ, ఇతర కోర్సులలో సీట్లు కోల్పోయారన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా నష్టపోయిన ప్రతి విద్యార్థికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు నరేష్రెడ్డి, బాబ్జాన్, భానుప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అమరనాథరెడ్డి, రాజేంద్రప్రసాద్ -
సడలుతున్న పట్టు
మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గంలో పట్టు గూళ్ల పెంపకం అత్యధికంగా ఉంటోంది. ఓ కుటీర పరిశ్రమలా విస్తరించాయి. దాదాపు 14వేల ఎకరాల్లో మల్బరీ తోటలు విస్తరించి ఉన్నాయి. నియోజకవర్గంలోని మడకశిర, అగళి, రొళ్ల, గుడిబండ, అమరాపురం మండలాల్లో దాదాపు 10వేల మంది రైతులు పట్టు పురుగుల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా బైవోల్టిన్, క్రాస్ బ్రీడ్ (సీబీ) రకాల పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. తగ్గిన సీబీ పట్టుగూళ్ల ఉత్పత్తి.. కొన్నేళ్ల క్రితం రైతులు సీబీ రకం పట్టుగూళ్ల ఉత్పత్తికి పోటీ పడే వారు. దాదాపు 95 శాతం మంది రైతులు సీబీ రకం పట్టు సాగుకే మొగ్గు చూపేవారు. తర్వాత పట్టు పరిశ్రమ శాఖలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ప్రభుత్వం విదేశీ రకమైన బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తికి విశేషంగా ప్రోత్సాహకాలను అందజేస్తూ వచ్చింది. దీంతో రైతులు సీబీ రకాన్ని వదిలి బైవోల్టిన్ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 5 శాతం మంది రైతులు మాత్రమే సీబీ రకం పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలోనే పట్టుగూళ్ల అమ్మకాలకు కేంద్ర బిందువుగా మారిన హిందూపురం మార్కెట్లో రోజు వారీ అమ్మకాలను పరిశీలిస్తే సీబీ రకం పట్టు గూళ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఈ ఏడాది మే 30 నుంచి ఇప్పటి వరకూ హిందూపురం మార్కెట్లో లావాదేవీలను పరిశీలిస్తే సీబీ రకం పట్టుగూళ్లు కేవలం 44 కిలోలు మాత్రమే అమ్మకానికి రాగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్లు 26,884 కిలోలు వచ్చాయి. తక్కువ ఖర్చుతో బైవోల్టిన్ పట్టు గూళ్ల ఉత్పత్తి.. సీబీ రకం పట్టుగూళ్ల సాగుతో పోల్చుకుంటే బైవోల్టిన్ సాగుకు ఖర్చు తక్కువగా ఉంటోంది. బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తికి కూలీల అవసరం చాలా తక్కువ, అంతేకాక బైవోల్టిన్ పట్టు గూళ్ల ఉత్పత్తిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అధికంగా ఇస్తున్నాయి. కిలో బైవోల్టిన్ పట్టుగూళ్లను ప్రభుత్వ మార్కెట్లో విక్రయిస్తే అదనంగా రూ.50 అందుతుంది. సీబీ రకం పట్టుగూళ్లు కిలో పై కేవలం రూ.10 మాత్రమే వస్తుంది. మార్కెట్లో సీబీ రకం కంటే బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర కూడా అధికంగా ఉంటోంది. కిలోపై రూ.150 నుంచి రూ.200 వరకు ధరలో తేడా ఉంటోంది. సీబీ రకం పట్టుగూళ్లు కిలో గరిష్టంగా రూ.400 పలికితే... బైవోల్టిన్ ధర గరిష్టంగా రూ.600 వరకు ఉంటోంది. కూటమి ప్రభుత్వంలో తప్పని కష్టాలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిలో పట్టు రైతులకు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు. ప్రధానంగా బైవోల్టిన్ రైతులకు కిలోపై అదనంగా ఇచ్చే రూ.50 ప్రోత్సాహకం అందజేతలో అంతులేని జాప్యం కనబరుస్తోంది. దీంతో రూ.కోట్లల్లో ప్రోత్సాహక బకాయిలు పేరుకుపోయాయి. ప్రోత్సాహక ధనాన్ని మంజూరు చేయాలని కోరుతూ పట్టు రైతుల సంఘం నాయకులు పలుమార్లు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిపై ప్రోత్సాహకాలు అధికం సీబీ రకం పట్టుగూళ్లపై అంతంత మాత్రమే కూటమి ప్రభుత్వంలో ఏడాదిగా అందని ప్రోత్సాహకాలు పట్టు రైతులకు తప్పని కష్టాలు పట్టు రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. పట్టు దారం, పట్టు గూళ్ల ధరలు నిలకడగా ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సర్వాత సరైన ప్రోత్సాహకాలు అందకపోవడం రైతులను కలవరపరుస్తోంది. దీంతో పట్టు సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
మొక్కల పెంపకంతో ఎడారి నివారణ
● ‘నాసిన్’లో మొక్కలు నాటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోరంట్ల: మొక్కలు విరివిగా నాటడం వల్ల ఎడారి నివారణ సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాజస్థాన్లోని జైసల్మీర్లోనూ ఎడారి ఛాయలు ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆమె వివరించారు. అందువల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ విరివిగా మొక్కలు నాటడం వల్ల జిల్లాను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. శుక్రవారం ఆమె పాలసముద్రం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎకై ్సజ్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) సంస్థలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలసీతారామన్ విద్యార్థులు, రైతులతో కలసి నాసిన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ తరచూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వాటి అధిగమించడానికి చెట్లను విరివిగా పెంచాలని సూచించారు. ఈ క్రమంలోనే నాసిన్ సంస్థలో జపాన్ టెక్నాలజీతో మొక్కలు నాటి పర్యావరణ, పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావులకేశవ్, నాసిన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 9న ‘షైనింగ్ స్టార్స్’ పురస్కారాలు ● జిల్లా వ్యాప్తంగా 225 మంది విద్యార్థుల ఎంపిక ● ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున నగదు పురస్కారం పుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్స్’ పురస్కారాలతో సత్కరిస్తోంది. ఇందుకోసం 225 మందిని అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో 32 మండలాలకు సంబంధించి 186 మంది పదో తరగతి విద్యార్థులు, మరో 39 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 20 వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నారు. ఈనెల 9వ తేదీన కొత్తచెరువు సమీపంలోని వెంకటేశ్వర కళ్యాణమండపంలో పురస్కారాల ప్రదానోత్సవం ఏర్పాటు చేసినట్లు డీఈఓ కృష్ణప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం పంపామన్నారు. ఐటీఐల్లో ప్రవేశాలకు 9న కౌన్సెలింగ్ హిందూపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో (2025–26 విద్యా సంవత్సరం) జూన్ 9న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు హిందూపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రాయపురెడ్డి తెలిపారు. శ్రీకంఠపురం ఝూన్సీ లక్ష్మీ బాయ్ పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. 9వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1–30 ర్యాంకుల వారికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 31 – 60 ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. వివరాలకు 9440258629, 9490445744 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కామాంధులను కఠినంగా శిక్షించాలి
● ఎస్పీ రత్నకు విన్నవించిన ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ ధర్మవరం: దళిత బాలికపై అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన బాలిక బంధువులతో కలసి ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్నను ఆయన కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లికి చెందిన దళిత మైనర్ బాలిక పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టడం దారుణమన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి హోం మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఎస్పీని కలిసిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ సాకే వినయ్కుమార్, సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు సుగమంచి శ్రీనివాసులు, ప్రొగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మంజుల నరేంద్ర, జేఏసీ నాయకులు రామకృష్ణ, గోపాల్, రాకెట్ల సూర్యనారాయణ, ముత్యాలప్ప తదితరులు ఉన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
అనంతపురం సిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులను నష్ట పరిహారం అందించి అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జెడ్పీటీసీ సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు స్పందిస్తూ.. పూత, పిందే దశలో ఉన్న వాటికి పరిహారం వర్తించదని, చెట్లు పూర్తిగా నేలమట్టమైతేనే పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో సభ్యులు ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ జిల్లా స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7 సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో శుక్రవారం జరిగింది. సీఈఓ వెంకటసుబ్బయ్య, జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు మహేష్, ఉరవకొండ జెడ్పీటీసీ సభ్యురాలు పార్వతమ్మ వేదికపై ఆశీనులయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా మామిడి, అరటి రైతులను ఆదుకోవాలనే అంశంపై గోరంట్ల, ఓబుళదేవరచెరువు జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాం నాయక్, దామోదర్రెడ్డి మాట్లాడారు. భారీ వర్షాలతో నష్టపోయిన ఉద్యాన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో తెలపాలని పట్టుబట్టారు. జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుంటూ ఎన్ని హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి, ఎన్ని చెట్లు కూలిపోయాయ్, ఎంత మంది రైతులు నష్టపోయారో వివరాలు వెల్లడించాలని సూచించారు. అయితే ఉద్యాన శాఖ అధికారి వద్ద కనీస సమాచారం లేకపోగా, పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు మండిపడ్డారు. చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడంతో .. అంతెందుకు రైతులు చస్తేనే పరిహారం ఇస్తామని ప్రకటించండంటూ ఆవేశంతో ఊగిపోయారు. రైతులకు నాణ్యమైన కందులు సరఫరా చేయాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ మహేష్, ఓడీచెరువు జెడ్పీటీసీ దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. ఏయే పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని నల్లమాడ జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి కోరారు. రైతు భరోసా కేంద్రాలను ఎందుకు నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోషణ్ పక్వాడా నిధుల స్వాహాపై చర్యలేవీ? పోషణ్ పక్వాడా నిర్వహణకు సంబంధించి ఒక్కో జిల్లాకు రూ.5 లక్షలు చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.10 లక్షలు మంజూరయ్యాయని, వీటిని సీడీపీఓలు నొక్కేసి తూతూ మంత్రంగా ముగించారని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ, గోరంట్ల జెడ్పీటీసీ జయరాం నాయక్ ఆరోపించారు. ఆ భారమంతా సూపర్వైజర్ల మీద పడిందన్నారు. సీడీపీఓలపై చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సూపర్వైజర్లకు పంచాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పీడీ నాగమణి స్పందిస్తూ.. వచ్చిన డబ్బును సీడీపీఓల ఖాతాల్లో జమ చేశామని ఆధారాలు చూపారు. అయితే వాళ్లు దిగమింగిన సంగతి తనకు తెలియదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీజీహెచ్ సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోండి స్థాయీ సంఘ సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు చర్యలు తీసుకోవాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు. ఓబుళదేవరచెరువు పీహెచ్సీ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, అయినా అదే పాడుబడిన భవనంలో వైద్య సేవలు అందిస్తుండడంపై జెడ్పీటీసీ దాము ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జెడ్పీ చైర్పర్సన్ కల్పించుకుంటూ.. పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి, కొత్త భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. పేద విద్యార్థులకు న్యాయం చేయండి.. జిల్లాలోని అంబేడ్కర్, ఇతర గురుకుల పాఠశాలల్లో గతంలో సీట్లు అమ్ముకున్నారని, ఈసారి ఆ పరిస్థితి లేకుండా పేద విద్యార్థులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ నాగరత్నమ్మ కోరారు. హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడేలా చూడాలన్నారు. సీట్లు కావాలని ఓట్లేసిన ప్రజలు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారని, అలాంటప్పుడు వారు సిఫారసు చేస్తే కచ్చితంగా కొన్ని సీట్లు ఇచ్చేలా చూడాలని జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుల డిమాండ్ అరటి, మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సూచన చెట్లు కూలిపోతేనే పరిహారం చెల్లిస్తామని అధికారి వివరణ -
ఆర్ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన
మృతదేహం గుర్తింపు ఉరవకొండ: ఓ ఆర్ఎంపీ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం సిద్దారాంపురం గ్రామానికి చెందిన ఆవుల గోపాలరెడ్డి, సువర్ణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు మంజునాథ్రెడ్డి ఉన్నారు. కుమారుడు గ్రామంలోనే ఆర్ఎంపీగా గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారం మంజునాథరెడ్డి (30)పై పడింది. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడికి పెళ్లి చేయాలని తల్లి సంబంధాలు చూస్తోంది. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక జీవితంపై విరక్తి పెంచుకున్న మంజునాథ్ ఈ నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 5న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉరవకొండ మండలం పెన్నహోబిలం గుట్టల్లో కాలిపోయిన ఓ మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో సీఐ మహనంది, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పెన్నహోబిలంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడిని మంజునాథ్గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి కాలేదన్న కారణంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడగా... తాగుడు మానలేక మరో యువకుడు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. ● పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లిలో ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన గంగాధరప్ప, సుజాతమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులు(20) ఆత్మహత్య చేసుకున్నాడు. తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తుండేవాడు. తన అక్క లావణ్య భర్త కృష్ణ మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. చిన్న వయసులోనే అక్క భర్తను కోల్పోవడంతో మనోవేదనకు లోనై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులందరూ గురువారం సమీప బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాసులు ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ రంగడు యాదవ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి అన్న అభి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● పెనుకొండ రూరల్: మండలంలోని గోనిపేటకు చెందిన బోయ శివకుమార్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. శివకుమార్కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఏ ఒక్కటీ కుదరకపోవడంతో మనస్తాపానికి గురైన అతను బుధవారం రాత్రి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న శివకుమార్ను గుర్తించిన స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● లేపాక్షి: మండలంలోని చోళసముద్రం పంచాయతీ నాగానపల్లికి చెందిన ఆదినారాయణప్ప భార్య సవిత(35) ఆత్మహత్య చేసుకుంది. వివాహమై పదేళ్లు కావస్తున్నా... సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. భర్తలో మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సవిత... బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పైకప్పునకు తాడుతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
బుళ్లసముద్రంలో చోరీ
మడకశిర రూరల్: మండలంలోని బుళ్లసముద్రం గ్రామంలో నివాసముంటున్న వైస్ ఎంపీపీ శ్రీరామరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులు గ్రామంలో తమకు తెలిసిన వారికి ఇంటి తాళం ఇచ్చి విజయవాడ వెళ్లారు. బుధవారం రాత్రి దుండగులు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని అపహరించుకెళ్లారు. చోరీ విషయాన్ని గురువారం ఉదయం గమనించిన స్థానికులు ఫోన్ ద్వారా శ్రీరామరెడ్డికి సమాచారం అందించారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న సీఐ నగేష్బాబు వెంటనే గ్రామంలోని శ్రీరామరెడ్డి ఇంటికి చేరుకుని పరిశీలించారు. బంగారు ఆభణాలు, నగదుతో పాటు మొత్తం రూ.3 లక్షల వరకు చోరీ జరిగినట్లు గుర్తించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రలను సేకరించారు. యువకుడి దుర్మరణం నల్లమాడ: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి చెందిన యనమల సోమశేఖరనాయుడు (30), సాయిలీల దంపతులకు మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. బుధవారం భార్య, కుమారుడితో కలసి పుట్టపర్తి మండలం కంబాలపర్తిలోని అత్తారింటికి సోమశేఖర నాయుడు వెళ్లాడు. గురువారం ఉదయం కుటుంబంతో కలసి తన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన నల్లమాడకు చేరుకోగానే తనకు పని ఉందంటూ భార్య, కుమారుడిని ఆటోలో ఎక్కించి పంపాడు. నల్లమాడలో పనిముగించుకున్న తర్వాత ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతున్న ఆయన.. ఎద్దులవాండ్లపల్లి తండా వద్దకు చేరుకోగానే చిల్లగోర్లపల్లికి వెళ్లే కాలిబాట వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనం రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్ల్లింది. సోమశేఖర నాయుడు గాలిలో ఎగిరి కొన్ని అడుగుల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య అక్కడకు చేరుకుని బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుని తండ్రి నారాయణస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 11వ రోజుకు చేరిన రైతుల నిరసన ముదిగుబ్బ: స్థానిక 342వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన భూసేకరణకు ఇచ్చే పరిహారంపై రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం 11వ రోజుకు చేరుకుంది. న్యాయమైన పరిహారం ఇచ్చే వరకూ పనులు అడ్డుకుంటామని రైతులు తెలిపారు. పని ప్రాంతంలో యంత్రాలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో రైతులు సోమల ప్రకాష్నాయుడు, రాజేంద్రనాయుడు, హనుమంతు, ప్రసాద్, శంకర్, రమణ, సనత్కుమార్, ప్రభాకర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు పెనుకొండ రూరల్: బాల్య వివాహాన్ని కియా పోలీసులు అడ్డుకున్నారు. పెనుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికతో చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం కోన కణ్వాశ్రమంలో పెళ్లి తంతు జరుగుతుండగా సమాచారం అందుకున్న కియా ఎస్ఐ రాజేష్... సిబ్బందితో అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. బాలికతో పాటు తల్లిదండ్రులను స్టేషన్కు పిలుచుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. మోతాదుకు మించి పురుగు మందులు వాడొద్దు ముదిగుబ్బ: మోతాదుకు మించి పురుగు మందుల వాడకం వల్ల నష్టాలు అధికంగా ఉంటాయని రైతులకు రేకులకుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ కిషోర్రెడ్డి సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు. నూతన సాంకేతికత, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాలు, వంగడాలు, డ్రోన్ స్ప్రేయింగ్ తదితర అంశాలను వివరించారు. పంటల సాగులో అనువైన విత్తనాలు, వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మీనరసింహులు, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల అధ్యాపకుడు డాక్టర్ దీపక్, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం
చిలమత్తూరు: హిందూపురం పట్టణంలోని రేషన్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా కార్డుదారులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా రేషన్ అందుకోవడం గగనంగా మారిందని 13వ వార్డు పరిధిలోని ఎస్.సడ్లపల్లి కార్డుదారులు వాపోయారు. ముందుగా తమ అనునూయులు, టీడీపీ వాళ్లకు తొలి ప్రాధాన్యతనిస్తూ వారికి రేషన్ అందించిన తర్వాతనే ఇతరుల కార్డులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాక చక్కెరపై అదనంగా రూ.3 వసూలు చేస్తున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కురుబ శ్రీనాథ్, సభ్యుడు హరిగోపాలరెడ్డి అక్కడకు చేరుకుని ప్రజలతో కలసి డీలర్ను నిలదీశారు. సడ్లపల్లిలోనే కాకుండా ముక్కిడిపేటలోని మూడు దుకాణాల్లోనూ ఇదే తంతు నడుస్తోందని మండిపడ్డారు. రేషన్ పంపిణీలో అవతవకలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి ● ఏడీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి ప్రశాంతి నిలయం: జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా ఆదేశించాలని కలెక్టర్ టీఎస్ చేతన్కు ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు విన్నవించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని చాంబర్లో కలెక్టర్ను కలసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్... డీఈఓ కిష్టప్ప ఫోన్ చేసి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
పుట్టపర్తి టౌన్: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది బక్రీద్. ఇబ్రహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం త్యాగస్మరణకు గుర్తుగా శనివారం ఉదయం 8 గంటలకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద ‘ఈద్ – ఉల్ – అదాహ్’ను వేలాదిమంది ముస్లింలు ఆచరించనున్నారు. ఇందుకోసం మసీదులు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగలో ‘ఖుర్బానీ’ చేసేందుకు జిల్లా ముస్లింలు సిద్ధమయ్యారు. నమాజు అనంతరం తమ శక్తికి తగినట్లుగా పొట్టేళ్లు, మేకపోతులను ఖుర్బానీ చేసి ఆ మాంసాన్ని పంచిపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బక్రీద్ విశిష్టత.. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖుర్బానీ అంటే సమర్పణ, త్యాగం, బలి అని అర్థం. సుమారు 4వేల ఏళ్ల క్రితం ఇరాక్ దేశంలో పండిత కుటుంబంలో జన్మించిన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీంకు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకరోజున కల వచ్చింది. ఆ స్వప్నంలో తన 86 ఏళ్ల వృద్ధాప్యంలో జన్మించిన ఏకై క కుమారుడు ఇస్మాయిల్ను ఖుర్బానీ చేయాలని అల్లాహ్ కలలో ఇబ్రాహీంను ఆదేశించినట్లు కల సారాంశం. అల్లాహ్ ఆదేశానుసారం తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఇబ్రహీం సిద్ధం కాగా అల్లాహ్ దానిని స్వీకరించి ఇస్మాయిల్కు బదులు స్వర్గం నుంచి ఓ పొట్టేలును పంపి ఖుర్బానీ జరిగేలా చేశారు. రేపు ‘ఈద్ – ఉల్ – అదాహ్’ జిల్లా వ్యాప్తంగా ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు త్యాగ నిరతిని కలిగి ఉండాలి బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక. ఖుర్బానీ అంటే జంతుబలి కాదు, మానవుడు దైవమార్గంలో తన సర్వస్వాన్ని త్యజిస్తానని చేసే ప్రకటన మాత్రమే. దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒకటేనని నమ్మాలి. చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాలలో సహనం వహిస్తూ, త్యాగ నిరతిని చూపించాలన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉంది. – జాకీర్ ముక్తా సాహెబ్, ముతవల్లి, పుట్టపర్తి -
● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!
బక్రీద్ సీజన్లో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా మాంసం కోసం పెంచే పొట్టేళ్లను.. వాటి బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కానీ బక్రీద్ పండుగ నేపథ్యంలో విక్రయించే జీవాలకు బరువుతో పని లేదు. కేవలం రూపం, వాటి ఆరోగ్యాన్ని మాత్రమే చూస్తారు. దీంతో సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లు అమ్ముడు పోతున్నాయి. మాములు రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వేలు పలికే పొట్టేళ్ల ధర.. బక్రీద్ డిమాండ్ కారణంగా రూ.30 నుంచి రూ.50 వేలకు పెరిగింది. వాడైన చూపులు.. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న పొట్టేళ్లు, మేకపోతుల ధర మరింత ఎక్కువగా ఉంటోంది. దిమ్మతిరిగేలా పెరిగిన ధరలతో పండుగ ఎలా చేసుకోవాలని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – ఆత్మకూరు: రూ.52 వేలకు అమ్ముడుపోయిన పొట్టేలు -
అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలి: ఆర్ఐఓ
కదిరి అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అధ్యాపకులంతా కృషి చేయాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్ఐఓ) సయ్యద్ మౌల సూచించారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో ఆయన సమావేశం నిర్వహించారు. కళాశాలలో ఇప్పటికే ఉన్న విద్యార్థుల సంఖ్య... జూనియర్ ఇంటర్ ప్రవేశాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర ప్రసాద్, అధ్యాపకులు ఎంఎస్ ప్రశాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
బ్రెయిన్ డెడ్ బాలుడి అవయవ దానం
కళ్యాణదుర్గం రూరల్: బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. మృతిచెందిన తర్వాత తమ కుమారుడు మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతాడనే భావంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి మరీ అవయవదానానికి అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి... కళ్యాణదుర్గం మండలం గరుడాపురం – కొత్తూరు గ్రామాల మధ్య మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయమై అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీహరి (18) బ్రెయిన్ డెడ్ అయినట్లు గురువారం వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు అనసూయమ్మ, ఈరన్న, సోదరి సింధూజ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జీవన్ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులు... శ్రీహరి అవయవాలను దానం చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయవచ్చని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించడంతో అంతటి దుఃఖంలోనూ వారు అంగీకారం తెలిపారు. దీంతో శ్రీహరి గుండె, కళ్లు, కిడ్నీలను జీవన్దాన్ ప్రతినిధులు సేకరించి అత్యవసరమైన రోగుల కోసం మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఇంటర్ వరకూ చదువుకున్న శ్రీహరి... కొత్తూరు గ్రామంలోనే తల్లిదండ్రులకు వ్యవసాయ వనుల్లో చేదోడుగా ఉండేవాడు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన శ్రీహరి తల్లిదండ్రులను వైద్య సిబ్బంది అభినందించారు. -
సామూహిక ఉపనయన మహోత్సవం
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో బ్రాహ్మణ వేద విద్యార్థులకు సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులు ఉపనయన ఘట్టాన్ని నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి ఉపనయనంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
● జిల్లా పరిశీలకులుగా జేడీ సుబ్బారావు అనంతపురం ఎడ్యుకేషన్: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాలు, బెంగళూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ రెండు విడతలుగా ఈనెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. డీఈఓ పరిధిలోని కేంద్రాలకు పరిశీలకులుగా జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును నియమించారు. పరీక్షలయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటూ పరీక్ష కేంద్రాలను పరిశీలించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాలకు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. పరీక్ష కేంద్రం పరిశీలనపుట్టపర్తిటౌన్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జరిగే డీఎస్సీ పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం బీడుపల్లి వద్ద ఉన్న సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ రత్న , డీఎస్పీ విజయకుమార్, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందన్నారు. డీఎస్పీ, 12 మంది సీఐలు, ఎస్ఐలతో పాటు 130 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనాల్లో శుక్రవారం నిర్వహించనున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన సమావేశ భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన ప్రారంభమవుతాయని వివరించారు. గత సమావేశాల్లో ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సంబంధించిన వివరాలపై సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలని సూచించారు. ● స్థాయీ సంఘ సమావేశాల్లో ఐసీడీఎస్లో పోషణ్ పక్వాడా నిర్వహణకు మంజూరైన నిధులు రూ.5 లక్షలు ఖర్చు పెట్టకుండా సీడీపీఓలు వాడుకోవడం, ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కార్పొరేట్ హంగులతో కార్యాలయాలు ఉండాలన్న కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆశయం మేరకు ఐసీడీఎస్లో రూ.5 కోట్లతో ఆధునికీకరించిన వాటిని ఆర్నెల్లకే పీకి పడేయడంపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. ముంగారు సేద్యాలు మొదలైన కారణంగా ఎరువుల ఊసే లేకపోవడం, పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల మంజూరు అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించే పరిస్థితి ఉంది. కరోనా మళ్లీ కోరలు చాస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ పెట్టకపోవడంపైనా నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. -
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది. జిల్లా పరిధిలో తరచూ ఇలాంటి ఘటనలు తరచూ వెల
● ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన ఓ వివాహితకు రొద్దం మండలానికి చెందిన పురుషుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనుమానం వచ్చిన భర్త మంజునాథ్ నిత్యం వేధించసాగాడు. మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. మద్యం మత్తులో ఉన్న భర్తను కిరాయి ఇచ్చి హత్య చేయించింది. గతేడాది జరిగిన ఈ ఘటనకు కారణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడాది తర్వాత మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ● నల్లమాడ మండలం కుటాలపల్లిలో గతేడాది ఎన్నికల సమయంలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే దీనికి కారణంగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో శ్రీనివాసరెడ్డి మరికొందరితో కలిసి అమర్నాథ్రెడ్డిని హతమార్చాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సాక్షి, పుట్టపర్తి రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతో పాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నం అవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువుగా పెరిగి.. సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. అలాంటి సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అడ్డు తొలగించుకునే క్రమంలో భర్తలను, ప్రియులను చంపేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. హత్య చేసి పరారీ అవుతుండటంతో చిన్నారులు ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక బాల్యంలోనే కార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు. అఘాయిత్యాలకు దారి తీస్తూ.. వివాహేతర సంబంధాలతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడంతో పరిస్థితులు నిమిషాల్లో మారిపోతున్నాయి. క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి దంపతుల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నెలకొంది. కారణాలు ఎన్నెన్నో.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో అనర్థాలు చిచ్చు రేపుతోన్న సోషల్ మీడియా పరిచయాలు ఇద్దరి మధ్యకు మూడో వ్యక్తి రావడంతో హత్యలకు దారి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న పిల్లలు పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ.. పదే పదే చర్చించి.. తల్లిదండ్రుల వరకూ వెళ్లడం.. ఆ తర్వాత పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినలేదంటూ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి తప్పి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. స్మార్ట్ఫోన్లను అతిగా వినియోగించి సోషల్ మీడియా పరిచయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం. మద్యానికి బానిసై ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని .. కుటుంబ పోషణ గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం కూడా కారణమవుతోంది. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే క్షణికావేశాలకు వెళ్లకుండా.. సామరస్యంగా ఇద్దరూ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహం జరిగిన కొత్తలో మనస్ఫర్థలు వచ్చినా.. వెంటనే సరిదిద్దుకోవాలి. అయితే ఇరవై ఏళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా సమస్యలు వెలుగు చూస్తుండటం అవగాహన లోపమే. దంపతులిద్దరూ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రావు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుంది. అంతేకాకుండా చిన్నారులు అనాథలుగా మారాల్సి వస్తోంది. – వి.రత్న, ఎస్పీ -
ఎస్ఏ పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురంం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల టీచర్లు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 1:2 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని విద్యాశాఖ అధికారులు చెప్పినా...మొత్తం 382 పోస్టులు ఖాళీలుంటే, 372 మంది ఎస్జీటీలు రావడం విశేషం. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదురుచూశారు. మొత్తం 4,589 మంది దరఖాస్తు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,589 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 2,456 మంది తప్పనిసరి, 2,133 మంది టీచర్లు రెక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే..,. బయలాజికల్ సైన్స్ 631 మంది, ఇంగ్లిష్ 656 మంది, హిందీ 383 మంది, కన్నడ ముగ్గురు, గణితం 847 మంది, పీడీలు 262 మంది, ఫిజికల్ సైన్స్ 616 మంది, సంస్కృతం ఏడుగురు, సోషల్ 544 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ 37 మంది, తెలుగు 584 మంది, ఉర్దూ 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పుట్టపర్తి టౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. అనంతరం పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ అందరి సహకారంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని నివాసం, కార్యాలయ ఆవరణలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరి ఉందన్నారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు మరొకరికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఆర్ఐలు వలి, మహేష్, డీసీఆర్బి సీఐ శ్రీనివాసులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పుట్టపర్తి అర్బన్: పర్యావరణానికి హాని కలిగిస్తే ఆరోగ్యానికి ముప్పు తప్పదని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం పుట్టపర్తిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామం వరకూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ ప్రతికూలతలు , ప్లాస్టిక్ వాడకం, విష రసాయానాల విడుదల తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. విస్తారంగా మొక్కలు పెంచాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో నేల క్షీణిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సమత, వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలకు కృతజ్ఞతలు
పెనుకొండ రూరల్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ప్రజల మద్దతుతో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగిందన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్నింటిలో ఘోరంగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను వంచించడంతో ఏడాది కాలంలోనే ప్రజలు ఉద్యమబాట పట్టారన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా ధర్మవరం: విద్యుత్ అంతరాయాన్ని నివారించి సక్రమంగా విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ సీజీఎం వరకుమార్ తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్లోని సబ్స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాలి, వర్షం వచ్చే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లను పదిరోజుల్లో పరిష్కరించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. పాత ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతు చేయించడం, కొత్త ట్రాన్స్ఫార్మర్లను వెంటనే ఏర్పాటు చేయడం తదితర వాటిని సత్వరమే చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై ప్రత్యేక దృష్టిని సారించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే 1912కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. భూసేకరణ వేగవంతం చేయండి ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: జిల్లాలో ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన ప్రాజెక్ట్ భూసేకరణ సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కొన్ని వేల మెగావాట్ల పునరుత్పాదన ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులు వారి పరిధిలోని మండలాల్లో అందుబాటులో ఎంత భూమి ఉంది అన్న వివరాలను వెంటనే సేకరించి నివేదించాలన్నారు. ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూమిని ఇచ్చే రైతులకు ఎకరా భూమికి ఏడాదికి రూ.31 వేలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళల హాకీ జట్టు ఎంపిక ధర్మవరం: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ భీమవరంలో జరగనున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా మహిళల హాకీ జట్టును ఎంపిక చేసినట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బంధనాథం సూర్యప్రకాష్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మహిళల హాకీ జట్టు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాకీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, సభ్యులు జెన్నే చంద్రశేఖర్, ఉడుముల కిరణ్, సత్యసాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జట్టు సభ్యులు: సింధు (కెప్టెన్),పవిత్ర, మధురిమబాయ్, వైష్ణవి, హేమ, దివ్య, నసీమా, వర్ష, హర్షిత, నవ్యశ్రీ, దుర్గ, శివగంగా, శ్రీలేఖ, మోక్షిత, గుణశ్రీ, వరలక్ష్మి, ఉషశ్రీ, హర్షితలు. కోచ్: మారుతీకుమార్, మేనేజర్ అరవింద్గౌడ్ -
యోగాతో రుగ్మతలు దూరం
● కలెక్టర్ టీఎస్ చేతన్ కదిరి: యోగా సాధనతో శారీరక, మానసిక రుగ్మతలు దూరమవుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. బుధవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వీధిలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు శ్వాసకోశ వ్యాధులు వంటి వాటిని అదుపు చేయడంలో యోగా ఎంతో సాయపడుతుందన్నారు. ఇందుకోసం ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటే మంచిదన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ... మనసు, శ్వాస, వ్యాయామమే యోగా అన్నారు. రోజూ యోగా సాధన చేస్తే అనేక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, మున్సిపల్ చైర్ పర్సన్ దిల్షాదున్నీసా, వైస్ చైర్మన్లు రాజశేఖరాచారి, సుధారాణి, ఆర్డీఓ శర్మ, టూరిజం అధికారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సీమ’ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి
హిందూపురం టౌన్: గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పటం అనాలోచితమైన చర్య అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. అంతకంటే ముందు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో జలసాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం రూపొందించిన పథకం తప్ప ప్రజా ప్రయోజనాలను అది నెరవేర్చలేదన్నారు. రూ.80 వేల కోట్లు ఖర్చా...? హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగంగ తదితర రాయలసీమ ప్రాజెక్టులు ప్రారంభించి 37 ఏళ్లు దాటినా నేటికీ రిజర్వాయర్లు, కాలువ పనులు పూర్తి కాలేదని బొజ్జ దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.40 వేల కోట్లు కావాలని, వాటికే దిక్కులేని పరిస్థితుల్లో రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి జలాలను బనకచర్లకు తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటంలో అర్థం లేదన్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు కూడా కోస్తా ప్రయోజనాలు కాపాడడం కోసమే గానీ, రాయలసీమ ప్రయోజనాల కోసం కాదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అటు కృష్ణా జలాల్లోనూ కోత పడే ప్రమాదం ఉందన్నారు. హంద్రీ–నీవాకు లైనింగ్ రద్దు చేయాల్సిందే.. రాయలసీమలో 90 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా సీఎం చంద్రబాబు ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని చెబుతున్నారని, ఎలా ఇస్తారో చెప్పాలని బొజ్జ దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి తన దగ్గర బ్లూ ప్రింట్ ఉందంటున్న సీఎం.. దాన్ని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ–నీవా మెయిన్ కాలువ లైనింగ్ రద్దుచేయడంతో పాటు పదివేల క్యూసెక్కులకు వెడల్పు చేసి పిల్ల కాలువల ద్వారా రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరుఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి,తెలుగు గంగ తదితర రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన రూ.50 వేల కోట్లను విడుదల చేయించి యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, జల సాధన సమితి నాయకులు సడ్లపల్లె చిదంబరెడ్డి, రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, జమీల్, అమానుల్లా, ఆదినారాయణ, రాజశేఖర్ రెడ్డి, తూముకుంట పారిశ్రామిక వాడ కార్మిక నాయకులు రవి, రమణ, హరి, తిప్పే స్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి – బనకచెర్ల వల్ల రాయలసీమకు ఒరిగేదేమీలేదు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి -
జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి
● ఎన్హెచ్ –544జీ పనులను పరిశీలించిన కలెక్టర్ చేతన్ చిలమత్తూరు: జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ చేతన్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన కోడూరు థామస్ మన్రోతోపు నుంచి విజయవాడ వరకూ ఆరు లేన్లతో నిర్మిస్తోన్న గ్రీన్ఫీల్డ్ హైవే (ఎన్హెచ్– 544జీ) పనులను పరిశీలించారు. అదే విధంగా కోడూరు తోపు నుంచి నిర్మిస్తోన్న మరో రహదారి (ఎన్హెచ్–716జీ) నిర్మాణ పనులనూ పరిశీలించారు. 24.3 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న ఈ రహదారి కోసం రూ.595 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరి 2026 నాటికి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఎన్హెచ్ఏఐ పీఐయూ కడప ఇన్ సైట్ ఇంజినీర్ రామకృష్ణ, ఎంఎస్ ధ్రువ్ కన్సల్టెన్సీ ప్రతినిధి జగన్మోహన్రెడ్డి, రెసిడెంట్ ఇంజినీర్ ఈశ్వరరావు, సర్వే ఇంజినీర్ ప్రభాకరన్, డీబీఎల్ కాంట్రాక్టర్ మనీష్చంద్ర దీక్షిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్... దీక్షిత్
● ఐఎఫ్ఎస్కు ఎంపికకావడంపై తెలంగాణ గవర్నర్ అభినందన అమరాపురం: గ్రామీణ ప్రాంతంలో పుట్టినా..అఖిల భారత సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై న దీక్షిత్ను తెలంగాణ గవర్నర్ విష్టుదేవ్ వర్మ అభినందించారు. అమరాపురం గ్రామానికి చెందిన పద్మ, ఈశ్వర్ప కుమారుడు దీక్షిత్ ఇటీవలే ఐఎఫ్ఎస్కు ఎంపికై న విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో అఖిల భారత సర్వీసులకు ఎంపికై న వారిని ఆ రాష్ట్ర గవర్నర్ విష్టుదేవ్ వర్మ సన్మానించారు. ఈ క్రమంలో ఐఎఫ్ఎస్కు ఎంపికై న దీక్షిత్కు మెమొంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 30వ ర్యాంకు సాధించడం గర్వ కారణమన్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రజలకు, రాష్ట్రానికి సేవ చేయాలని గవర్నర్ సూచించారని దీక్షిత్ తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శి ధనకిశోర్, సహాయ కార్యదర్శి భవాని శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
పంచనపై ప్రజాగర్జన
చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. సీఎం డౌన్..డౌన్ నినాదం హోరెత్తింది. కూటమి సర్కార్ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఊరూవాడా ఏకమైంది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ప్రజాగర్జన వినిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరాగా.. పట్టణాలన్నీ జనసాగరాలను తలపించాయి. పార్టీ శ్రేణులు కదం తొక్కగా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది.సాక్షి, పుట్టపర్తి: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి...ఏడాదిగా ఉలుకూపలుకూ లేకుండా ఉన్న చంద్రబాబు సర్కార్ను మేల్కొలిపేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో ర్యాలీలు నిర్వహించి.. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. చంద్రబాబు మోసంపై దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.పుట్టపర్తిలో జనం కవాతు..వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి శంకర్నారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో వేలాది మంది జనం భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.పెనుకొండలో జన ప్రభంజనం..మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఏఓ గిరిధర్నాయక్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.నినాదాలతో దద్దరిల్లిన ధర్మవరం..మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేతిరెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ కాలేజీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, పీఆర్టీ సర్కిల్ మీదుగా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. ర్యాలీలో జనం ‘సీఎం డౌన్డౌన్’.. హామీల బాబు..అమలు ఎక్కడంటూ నినాదాలతో హోరెత్తించగా.. ధర్మవరం దద్దరిల్లింది. అనంతరం ఎన్నికల హామీలు అమలు చేయాలని ఆర్డీఓ మహేశ్కు వినతిపత్రం అందజేశారు.హిందూపురం.. జనసాగరం..నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సీఎం.. డౌన్ డౌన్... పాలన చేతగాని చంద్రబాబు దిగిపోవాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ వెంకటేశ్కు వినతిపత్రం అందజేశారు.మడకశిరలో పెల్లుబికిన ప్రజాగ్రహం..వైఎస్సార్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైఎస్సార్ సీపీ జెండాలతో వేలాది మంది జనం చంద్రబాబు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేదంటే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్కు అందజేశారు.కదిరిలో కదం తొక్కిన జనం..వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో భారీగా జనం పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం ఇన్చార్జ్ తహసీల్దార్ ఈశ్వర్కు వినతిపత్రం అందజేశారు.రాప్తాడుకు క దిలివచ్చిన జనంఅబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ప్రజలకు చేసిందేమీ లేదుఅనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం దాదాపుగా రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసినా...ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. పైగా ప్రశ్నించిన వారిపై కేసు బనాయించి భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. -
సర్వే పక్కాగా చేపట్టాలి
పుట్టపర్తి టౌన్: జనాభా పెరుగుదలకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై చేపట్టిన సర్వే జిల్లాలో పక్కాగా సాగాలని కలెక్టర్ చేతన్ అఽధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ‘జనాభా నిర్వహణ విధానం’పై ప్రభుత్వం రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జనాభా సమతుల్యతే లక్ష్యంగా చేపట్టిన సర్వేను సచివాలయ సిబ్బంది ఈనెల 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య సేవలో మెరుగుదల, పిల్లలు, మహిళలు, వృద్ధులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది ప్రశ్నలు సర్వేలో అడుగుతుందని, ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఓ విజయకుమార్ తోపాటు అధికారులు పాల్గొన్నారు. యోగాంధ్ర నిర్వహణకు స్థల పరిశీలన లేపాక్షి: ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం లేపాక్షిలో జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ స్థల పరిశీలన చేపట్టారు. వీరభద్రస్వామి ఆలయం ఆవరణతో పాటు ఆలయం ఎదుట ఉన్న పార్కులు, నంది విగ్రహం ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్తో చర్చించిన అనంతరం వీటిలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి, డీటీ కుమారస్వామిరెడ్డి, వీఆర్వో రమేష్, ఏఎస్ఐ షర్ఫుద్దీన్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను సహించం ● ‘చిత్రావతి’ సమీప ప్రాంతాల్లో ఆర్డీఓ తనిఖీలు ● 9 టిప్పర్లు, 3 ట్రాక్టర్లపై జరిమానా ధర్మవరం అర్బన్: ఇసుక అక్రమ రవాణాను సహించబోనని ఆర్డీఓ మహేష్ అన్నారు. బుధవారం ఆయన చిత్రావతి నది పరివాహక ప్రాంతాలైన ఉప్పలపాడు, పీసీరేవు, సీసీరేవు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని ప్రాంతంలో ఇసుకను తవ్వి తరలిస్తున్న 9 టిప్పర్లు, 3 ట్రాక్టర్లకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... చిత్రావతి నది ఒడ్డున ఇసుకను అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే వాహనాలను జప్తు చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో మైనింగ్, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13వ తేదీన జరుగుతుందన్నారు. దరఖాస్తులు వెబ్సైట్ www.navodaya.gov.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాలన్నారు. -
అనంతపురం–బెంగళూరు రైలు ప్రారంభం
అనంతపురం సిటీ: అనంతపురం–బెంగళూరు మధ్య ప్యాసింజర్ రైలును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎమ్మెల్యే సునీత, డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, అహుడా చైర్మన్ టీసీ వరుణ్తో కలసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనంతపురం నుంచి బెంగళూరుకు రూ.50కే చేరుకోవచ్చన్నారు. 12 బోగీలుంటాయన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో వాటరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని డీఆర్ఎంకు సూచించారు. మెమూ రైలు సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరేలా చూడాలని ఎమ్మెల్యే సునీత కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గుత్తా కేశవ నాయుడు, సౌత్ సెంట్రల్ రైల్వే డీజీఎం ఉదయ్నాథ్, రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఓ శ్రవణ్ కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్రెడ్డి, ఏడీఆర్ఎం సుధాకర్, అనంతపురం రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రిక్వెస్ట్ కాస్త కంపల్సరీ అయింది
● తాడిపత్రిలోని ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న బయాలజీ సైన్స్ టీచరు మరో 8 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. నాలుగేళ్లుగా ఆమె ఈ స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపురంలో ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతపురం స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పని చేస్తున్న స్కూల్ కనబరిచి సబ్మిట్ చేయబోతే సిస్టం అంగీకరించలేదు. తప్పనిసరి బదిలీల టీచర్లు లాగానే జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది. ● కంబదూరు మండలం తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న సోషల్ టీచరు, బొమ్మనహాల్ మండలం డి.హొన్నూరు జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న హిందీ టీచరు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా తప్పనిసరి బదిలీ కింద ఉన్నారని... జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న ఖాళీలన్నింటికీ దరఖాస్తు చేసుకోవాలంటూ చూపించింది. వీరే కాదు పదుల సంఖ్యల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఈ సమస్య ఎదురైంది. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం కొందరు టీచర్లు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా టెక్నికల్ సమస్య కారణంగా కంపల్సరీ బదిలీగానే చూపిస్తోంది. బాధితులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. సమస్య పరిష్కారమవుతుంది. – ఎం.ప్రసాద్బాబు డీఈఓ అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీలకు సంబంధించి అందుబాటులోకి తీసుకువచ్చిన సాప్ట్వేర్ ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. ఒకే స్కూల్లో 8 ఏళ్లు సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. కనీసం రెండేళ్లు సర్వీస్ పూర్తయిన వారు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు వారు పని చేసిన స్కూల్ కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఖాళీలన్నీ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్ ఇచ్చుకోవాలి. రిక్వెస్ట్ బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే వారు.. వారు పని చేస్తున్న స్కూల్ కంటే కూడా ఇంకాస్త సౌకర్యంగా ఉన్న స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి...చివరగా తాను పని చేస్తున్న స్కూల్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఆప్షన్లు ఇచ్చుకున్న స్కూళ్లు రాకపోతే... చివరకు పని చేస్తున్న స్కూల్నే నిర్ధారిస్తారు. అయితే రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా తప్పనిసరి బదిలీ కింద చూపుతుండడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. సాఫ్ట్వేర్ రూపకల్పనలో లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పలువురు నగరంలోని శారదా స్కూల్కు పరుగులు తీసి డీఈఓ ప్రసాద్బాబు వద్ద తమగోడు వెల్లబోసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఆప్షన్లు.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా వెబ్ఆప్షన్లు ఇచ్చుకునేందుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసింది. అప్పటికి వీరి సమస్య పరిష్కారం కాలేదు. తప్పనిసరి బదిలీ టీచర్లు లాగా ఎక్కడిపడితే అక్కడికి బదిలీ అవుతామనే ఆందోళన రిక్వెస్ట్ బదిలీ ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే ‘కంపల్సరీ’గా చూపిస్తున్న వైనం సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో టీచర్లలో గుబులు -
రైతులపై సోలార్ పిడుగు
అగళి: ‘మీ భూములు.. మా వ్యాపారం’ అంటూ రైతులపై కూటమి సర్కార్ సోలార్ పిడుగులు కురిపిస్తోంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పేరుతో వేలకు వేల ఎకరాల భూ సేకరణకు సిద్ధమైంది. ఈ క్రమంలో పంటల సాగుకు అనువుగా ఉండే భూములను సైతం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. రెండు నియోజకవర్గాల్లో 20 వేల ఎకరాలు మడకశిర, హిందూపురం నియోజకవర్గాల పరిధిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దాదాపు 20 వేల ఎకరాల భూ సేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో అగళి మండలంలో పి బ్యాడగేర 66 ఎకరాలు, హెచ్ డీ హళ్లి రెవెన్యూ పరిధిలో 2440 ఎకరాలు, ఇనగలూరులో వెయ్యి ఎకరాలు, రావుడి పంచాయతీలో 1,500 ఎకరాల భూములను సేకరించేందుకు పరిశీలించారు. హిందుపురం మండలంలో మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి ప్రాంతాల్లో 2,500 ఎకరాలు, లేపాక్షి మండలం కొండూరు, లేపాక్షి ప్రాంతాల్లో 2 వేల ఎకరాలు, మడకశిర మండలం హరేసముద్రం, బుల్లసముద్రం, క్యాంపురం, రాయపురం, ఉప్పిడిపల్లి, మనూర ప్రాంతాల్లో 5వేల ఎకరాలు, రొళ్ల మండలంలో 2,500 ఎకరాలు, గుడిబండ మండలంలో 2వేల ఎకరాల స్వాధీనం లక్ష్యంగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. సాగు భూములే లక్ష్యంగా.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రధానంగా బీడు భూములను ఎంపిక చేయాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా సారవంతమైన సాగు భూములను అధికారులు గుర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు భూములను వదిలి వేయాలంంటూ ఇప్పటికే ఎక్కడికక్కడ రైతులు ఆందోళలను చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వంలో కనికరం లేకుండా పోయింది. రైతులకు తెలియకుండానే వారి భూముల్లో అధికారులు సర్వే ప్రక్రియ చేపట్టారు. బీడు భూములను మాత్రమే గుర్తిస్తున్నట్లుగా నమ్మబలుకుతూ.. వాటికి సమీపంలో ఉన్న రైతుల పంట పొలాలనూ సర్వే చేసి గుర్తిస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కాగానే రైతుల నుంచి ఆ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫలితంగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వందలాది కుటుంబాలు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లక తప్పదని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీజులో తిరకాసులెన్నో.. సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో రైతుల భూములను లీజు పేరుతో కంపెనీ చేతుల్లో పెట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రక్రియతో ఆయా భూములపై తమకు తెలియకుండానే హక్కును రైతులు కోల్పోనున్నారు. లీజు తర్వాత ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లలేని పరిస్థితి. లీజుకు తీసుకున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కంపెనీ యాజమాన్యం రుణాలు పొందే వెసులుబాటు ఉంది. కంపెనీ తీసుకున్న రుణాలు చెల్లించకపోతే ఆ భారం రైతులపై పడుతుంది. లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్ సామగ్రిని ఎవరు తొలగించాలి. ఎక్కడ పడేయాలి. వీటికి అయ్యే ఖర్చును ఎవరు భరించాలి అనే విషయాలేవీ ఎంఓయూలో ఉండవు. వీటిపై రైతులకు అవగాహన కూడా ఉండదు. ఆఖరుకు లీజు ముగిసిన తర్వాత పొలం విక్రయించుకోవాలన్నా కుదరదు. కంపెనీ లీజు పొడించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే. ఈ లెక్కన రైతుకు 20 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది. మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో జోరుగా సర్వేలు రైతులకు తెలియకుండానే వారి భూముల్లో వివరాల సేకరణ భూములు ఇచ్చేది లేదంటూ అన్నదాతల ఆందోళనలు -
వైకల్య పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు
బత్తలపల్లి: వంద శాతం వైకల్యమున్న వారు సైతం తిరిగి పరీక్షలకు హాజరు కావాలంటూ దివ్యాంగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విడతల వారీగా 50 మందికి పరీక్షలకు హాజరు కావాలని మండల వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న పలువురు దివ్యాంగులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి బుధవారం చేరుకున్నారు. పరీక్షల పేరుతో దివ్యాంగ పింఛన్ల లబ్ధిదారులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఈ సందర్భంగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు ఎక్కబోతు కిందపడి వృద్ధురాలి మృతి ముదిగుబ్బ: మండలంలోని మలకవేమల రైల్వేస్టేషన్లో మంగళవారం రాత్రి ఓ వృద్ధురాలు స్యాసింజర్ రైలు ఎక్కబోతూ అదుపు తప్పి కింద పడి మృతి చెందింది. మృతురాలిని ధర్మవరంలోని యర్రగుంటకు చెందిన నారాయణమ్మ (80)గా గుర్తించినట్లు జీఆర్పీ ఎస్ఐ రహీం తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత బత్తలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను బుధవారం బత్తలపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గరిశలపల్లి పరిసర ప్రాంతంలోని చిత్రావతి నది నుంచి రామాపురం గ్రామానికి చెందిన వీరనారప్ప ఇసుకను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ట్రాక్టర్ను సీజ్ చేసి, స్టేషన్కు తరలించారు. -
పేదోడి ఆకలి తీరాలంటే జగన్ సీఎం కావాలి
● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సుధాకర్బాబు తాడిపత్రి టౌన్: పేదోడి ఆకలి తీరాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సుధాకర్బాబు అన్నారు. వైఎస్ జగన్ను సీఎంగా చేసేందుక ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో బుధవారం జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సీఎం చంద్రబాబు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ వెన్నుపోటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. తాడిపత్రిలో అప్రజాసామ్యం రాజ్యమేలుతోందన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదన్నారు. ప్రజాస్వామ్యం అనేది కంటికి కూడా కనిపించదన్నారు. వింత పోకడలు, విచిత్ర పోకడలతో ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్రమంగా నిర్బందిస్తున్నారన్నారు. నిర్బంధాలను ఛేదించుకుని ఏదో ఒక రోజు పెద్దారెడ్డి బయటకు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, యువ నేత కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్బాషా తదితరులు పాల్గొన్నారు. -
నేడు వెన్నుపోటు దినం..
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల డప్పు కొట్టి.. అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేదల పొట్టకొట్టిన కూటమి సర్కారు వెన్నుపోటుకు నేటితో ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 జూన్ 4వ తేదీన ‘కూటమి’కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘మా హామీలు మీ జీవితాలనే మార్చేస్తాయం’టూ ఎన్నికల ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో లేని ఆశలు కల్పించిన చంద్రబాబు, ఆయన పార్టీ పరివారం.. గద్దెనెక్కాక మాత్రం ముఖం చాటేశారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మోసగించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నేడు ఆ విషయమే పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉచిత బస్సుకు ముహూర్తమే ఖరారు కాలేదు. ‘ఇంటింటికీ ఉద్యోగమిస్తాం.. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.3 వేలు భృతి’ అన్నా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని ఇప్పటివరకూ పైసా ఇవ్వలేదు. సామాన్యుల బెంబేలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోగా ఎమ్మెల్యేలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు, సామాన్యులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లకు అంతులేకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టుషాపులు, పర్మిట్ రూములతో ఉమ్మడి అనంత జిల్లాను మత్తులో జోగేలా చేశారు. ● హిందూపురంలో బాలకృష్ణ పీఏల అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ● ఫ్యాక్షన్ హత్యలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. రామగిరి మండలంలో కురుబ లింగమయ్యను పచ్చ మూకలు కొట్టి చంపాయి. రాప్తాడులో నారాయణరెడ్డి, ముత్యాలమ్మను టీడీపీ నేతలు నరికి చంపారు. ● ఉమ్మడి జిల్లాలో కొండలు, గుట్టల్ని ‘తమ్ముళ్లు’ పిండిచేసి సహజ వనరులను లూటీ చేస్తున్నారు. ● చిత్రావతి, పెన్నా, వేదవతి హగరి నదుల్లో అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. ● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ● అనంతపురం అర్బన్లో ఎవరైనా ఇళ్లు కట్టాలంటే ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. ● మట్కా, గంజాయికి తాడిపత్రి నియోజకవర్గం అడ్డాగా మారిపోయింది. ● గుత్తిలో ఓ వ్యక్తిని టీడీపీ నేతలు రైలు పట్టాలపై పడుకోబెట్టి డబ్బు దండుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ● రాప్తాడులో వెంచర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే డబ్బు ముట్టజెప్పాలని చెబుతుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అటువైపు చూడటమే మానేశారు. నమ్మించి మోసం చేశారు వెన్నుపోటుకు ఏడాది గమనిక: చంద్రబాబు ప్రభుత్వంలో వీరిలో ఒక్కరికీ రూపాయి లబ్ధి చేకూరలేదు.. అలవిగాని హామీలతో లక్షలాది మందికి కుచ్చుటోపీ ఎన్నికల ముందు ఊరూరా ‘సూపర్సిక్స్’ ప్రచారం అధికారంలోకి వచ్చాక ఒక్క పథకమూ అమలు చేయని వైనం పైగా కబ్జాలు, ఆక్రమణలు, మోసాలు, దోపిడీలతో భయభ్రాంతులు ‘కూటమి’ పాలనను ఎండగడుతూ నేడు వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి సర్కారు తీరుకు నిరసనగా ‘వెన్నుపోటు దినం’ పేరుతో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి నేతలు ర్యాలీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తుందని ఆశపడ్డాం. కానీ ఏడాది పాలన పూర్తయినా ‘సూపర్ సిక్స్’లో పేర్కొన్న ఏ ఒక్క పథకమూ అమలు చేయలేదు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంట్లో ఆడబిడ్డలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి లాంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోసం చేసింది. – శ్రీచందన, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం -
ఏడాదంతా ‘ఎర్రబుక్కు’ పాలనే
సాక్షి, పుట్టపర్తి కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి.. నారా లోకేశ్ రచించిన ‘రెడ్బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసి అడ్డగోలుగా కేసులు పెట్టి వేధిస్తోంది. వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు ఎప్పుడో సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేశ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే సాకుతో చాలామంది అమాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయించింది. అక్రమ కేసులు..అకృత్యాలు పోలీసులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న టీడీపీ నేతలు.. మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, హిందూపురం సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించారు. గతేడాది జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన పచ్చ నేతల ఆకృత్యాలు... ఏడాది పొడవునా కొనసాగుతూనే వచ్చాయి. ఓట్ల లెక్కింపు రోజునుంచే గతేడాది జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజున పుట్టపర్తి గోపురం మెయిన్ రోడ్డులోని గోపాల్రెడ్డి క్లినిక్పై టీడీపీ అల్లరిమూకలు రాళ్ల దాడి చేశాయి. అదేరోజు తలుపుల మండలం గెరికపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చెన్నక్రిష్ణారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ● గతేడాది ఆగస్టు 3న హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన సతీశ్ అనే వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు చితకబాదగా..అతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదు. ● ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టారనే కారణంతో కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన అమర్నాథ్రెడ్డి, రొద్దం మండలంలో నగరూరు బాలాజీరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.అరెస్టు పేరుతో తీవ్రంగా వేధించారు. ● ఇక టీడీపీ నేతల బెదిరింపులతో చిలమత్తూరు మండలం ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రామగిరి మండలం కొత్తపల్లికి చెందిన ముత్యాల్నాయక్ను ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇక ఆర్థికంగా దెబ్బతీసేందుకు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన చీనిచెట్లను, బొప్పాయి చెట్లను, మామిడిచెట్లను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కూటమి సర్కారులో ‘రెడ్బుక్’ అమలు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పలువురు అక్రమ అరెస్టు.. రిమాండ్కు తరలింపు అక్కడక్కడా దాడులు, గొడవలు, హత్యలు, దోపిడీలురామగిరి ఎంపీపీ ఎన్నికలో గెలవలేక... రామగిరి ఎంపీపీ ఎన్నికలో గెలవలేని టీడీపీ దుర్మార్గాలకు ఒడిగట్టింది. ఎంపీపీ ఉప ఎన్నికల కోసం అనెక్సర్ 1,2 ఇచ్చేందుకు మార్చి 26న రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు ఓబుగారి హరినాథ్రెడ్డి, బోయ రామాంజినేయులు, కురుబ నాగిరెడ్డిపై సుమారు 500 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కానీ పోలీసులు బాధితులపైనే కేసు నమోదు చేశారు. ఎంపీపీ ఎన్నికలో పాల్గొనేందుకు మార్చి 27 బెంగళూరు నుంచి వస్తున్న పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని పెనుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు బలవంతంగా కిడ్నాప్ చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవలు వద్దని చెప్పిన పాపానికి ఉగాది పర్వదినం రోజైన మార్చి 30న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యపై టీడీపీ రౌడీలు ఇంట్లో దూరి దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కురుబ లింగమయ్య అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి చేరుకోగా.. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టలేదు. ఫలితంగా హెలిప్యాడ్ వద్ద తోపులాట జరిగింది. అయితే పోలీసులు తమ వైఫల్యాలను పక్కనబెట్టి.. టీడీపీ నేతలు ఆదేశాల మేరకు విడతల వారీగా ఇప్పటి వరకు సుమారు 200 మందిపై కేసులు నమోదు చేశారు. -
‘ఉద్యాన’ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మడకశిర రూరల్: డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు (2025–26 విద్యాసంవత్సరం) నోటిఫికేషన్ విడుదల చేసినట్లు స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీధర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. https://drysrhu.ap.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు సర్టిఫికెట్లను జత చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కార్యాలయం చిరునామాకు పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు 7382633687, 7702705721 నంబర్లలో సంప్రదించాలన్నారు. స్కూళ్లు తెరిచేలోపే పుస్తకాలు పంపిణీ నల్లమాడ: పాఠశాలల పునఃప్రారంభమయ్యేలోపు విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మార్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మండలానికి ఇప్పటికే 90 శాతం పాఠ్య పుస్తకాలు సరఫరా చేశామని, పాఠశాలలు తెరిచేలోపు తక్కిన 10 శాతం పుస్తకాలను కూడా సరఫరా చేస్తామన్నారు. అలాగే యూనిఫాం సైతం విద్యార్థులకు సకాలంలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. డీఈఓ వెంట ఉపాధ్యాయుడు బ్రహ్మానందరెడ్డి, ఎమ్మార్సీ సిబ్బంది ఉన్నారు. -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
గోరంట్ల: ‘వెన్నుపాటు’ అనే మాట వినిపిస్తేనే చంద్రబాబు గుర్తుకు వస్తారని, వెన్నుపోటుకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ పగడాల వెంకటేశు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...చందబ్రాబు అసమర్థ పాలనను వివరించడంతో పాటు అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించేందుకే బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబు ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో చదువుకొనే ప్రతి బిడ్డకూ ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు... అధికారం చేపట్టి ఏడాదవుతున్నా ఇప్పటికి ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఉషశ్రీచరణ్ దుయ్యబట్టారు. అలాగే అడపడుచుకు నెలకు రూ.1,500 ఇస్తానని మోసం చేశారన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు...నేడు వాటి గురించే మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి అలవాటు పడ్డారన్నారు. గతంలో బిడ్డనిచ్చిన సొంతమామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడచి అధికారం చేపట్టారని, ఆ తర్వాత ప్రతి ఎన్నికలోనూ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి రాగానే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదలను వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేపడుతున్న యుద్ధంలో ప్రతి కార్యకర్త ముందుండాలని ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఆమె పార్టీ శ్రేణులతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, పార్టీ పట్టణ కన్వీనర్ మేదర శంకర, పార్టీ నాయకులు చరణ్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, ట్రెజరర్ బాలన్నగారిపల్లి రామకృష్ణారెడ్డి, మండలంలోని పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హామీలిచ్చి మోసం చేయడం ఆయన నైజం బాబు నయవంచనను ప్రజలకు వివరించేందుకే ‘వెన్నుపోటు దినం’ పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
తనకల్లు: మండలంలోని గంగసానివారిపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లి నుంచి కదిరికి ప్రయాణికులతో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న కదిరికి చెందిన కుమార్, లక్ష్మీనారాయణ, మొలకలచెరువు నివాసి ఉత్తన్న, వేపలపల్లికి చెందిన రామాంజులు, పాలెంవాండ్లపల్లి వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్లో క్షతగాత్రులను చికిత్స కోసం తనకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న రామాంజులు, కుమార్ను కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.శతాధిక వృద్ధురాలి మృతిపుట్టపర్తి: బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన గండ్లూరి సాలమ్మ(106) సోమవారం రాత్రి మృతి చెందారు. ఆమెకు ముగ్గురు సంతానం కాగా, ఒకరైన అమరదీప్ అశ్వత్థరెడ్డి ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీలో గుర్తింపు పొందిన నేతగా ఉన్నారు. మరణించే అరగంట ముందు వరకూ ఆమె ఎంతో ఉత్సాహంగా కుటుంబసభ్యులతో గడిపారు. సాలమ్మ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత కొత్తకోట సోమశేఖరరెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రాచంరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు జానకంపల్లికి చేరుకుని ఆమె భౌతికకాయనికి నివాళులర్పించారు.రైతు అనుమానాస్పద మృతిపావగడ: తాలూకా పరిధిలోని చెన్నమరెడ్డిహళ్లికి చెందిన రైతు కురుబ లక్కప్ప(65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామం నుంచి గుమ్మఘట్టకు వెళ్లే మార్గంలోని నిర్జన ప్రదేశంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న లక్కప్పను గుర్తించిన స్థానికుల సమాచారంతో పావగడ పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినా... మృతుడి ముఖంపై గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వర్షాలతో ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదు
● అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ చేతన్ పుట్టపర్తి టౌన్: ఈసారి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వర్షాల వల్ల ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చూడాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేయించాలన్నారు. వ్యాధులు విజృభించకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. మెరుపులు, పిడుగుల సమాచారం ముందస్తు అందించాలన్నారు. మాన్యం భూములను పరిరక్షించాలి జిల్లాలోని వివిధ దేవాలయాల మాన్యం భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని కలెక్టర్ చేతన్ దేవదాయశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్నతో కలిసి దేవదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాన్యం భూములపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ధర్మవరం డివిజన్లోనే మాన్యం భూములు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడాలన్నారు. -
డీజిల్ అక్రమ డంప్ స్వాధీనం
చెన్నేకొత్తపల్లి: డీజిల్ చోరీ దళారులకు కాసుల పంట పండిస్తోంది. ధాబాల వద్ద, రోడ్డు పక్కన నిలిపిన లారీల నుంచి చోరీ చేసిన డీజిల్ అక్రమంగా ఓ ప్రాంతంలో డంప్ చేసి గ్రామీణులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వైనం వెలుగు చూసింది. జిల్లాలో అక్రమంగా సాగుతున్న ఈ దందాలో ఇద్దరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో వెలుగులోకి సోమవారం రాత్రి ప్రయాణిస్తున్న ఓ లారీ డ్రైవర్ నిద్ర ముంచుకు రావడంతో చెన్నేకొత్తపల్లి శివారున 44వ జాతీయ రహదారి పక్కన తన లారీని ఆపి నిద్రపోయాడు. మంగళవారం ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం లారీని శుభ్రం చేస్తుండగా డీజిల్ ట్యాంక్ వేసిన తాళం బద్ధలుగొట్టి ఉండడం గమనించాడు. ట్యాంక్లోని డీజిల్ మొత్తం అపహరించినట్లుగా గుర్తించి, విషయాన్ని వెంటనే చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలసి ఉదయం 44వ జాతీయ రహదారిపై దామాజిపల్లి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చెన్నేకొత్తపల్లి వైపుగా వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారును ఆపి పరిశీలించగా... అందులోని క్యాన్లలో 90 లీటర్ల డీజిల్ను గుర్తించి డ్రైవర్ బసవరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బయటపడిన వాస్తవం తమ అదుపులో ఉన్న డ్రైవర్ బసవరాజును పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. హంద్రీ–నీవా కాలువ వద్ద పనులు చేపట్టిన వాహనాల నుంచి సోమవారం రాత్రి డీజిల్ అపహరించుకుని వస్తున్నట్లుగా పోలీసుల ఎదుట బసవరాజు అంగీకరించాడు. దొంగిలించిన డీజిల్ను రామగిరి మండలం పెనుబోలు వద్ద ఉన్న రాము అనే వ్యక్తికి అప్పగించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే పెనుబోలుకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. రామును అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. స్థానికుడైన అంకిత్తో కలసి డీజిల్ దందా సాగిస్తున్నట్లుగా రాము అంగీకరించడంతో అంకిత్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాము ఇంటి వెనుక ఉన్న పొలంలో డ్రముల్లో నిల్వ చేసిన 1,500 లీటర్లను గుర్తించి, రామగిరి సీఐ శ్రీధర్కు తెలపడంతో ఆయన అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ అనంతరం నిల్వ చేసిన డీజిల్ డ్రమ్ములను పీఎస్కు తరలించారు. రాము, అంకిత్తో పాటు డ్రైవర్ బసవరాజుపై కేసు నమోదు చేసి, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, ఈ అక్రమ దందాలో నిందితులు రూ.కోట్లు వెనకేసున్నట్లుగా ఆరోపణలున్నాయి. లారీల నుంచి యథేచ్ఛగా డీజిల్ అపహరణ దందాతో రూ.కోట్లలో అక్రమార్జన -
ఏదీ సమాచారం?.. ఇదేం ఘోరం!
● బదిలీలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ బయటకు వెల్లడించని విద్యాశాఖ ● ఆందోళనలో ఉపాధ్యాయులు ● నేడు స్కూల్ అసిసెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ● ఖాళీలు చూపించలేదంటున్న టీచర్లు అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సంబంధించి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పూర్తి గోప్యత పాటిస్తుండడంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ 3–4 సార్లు రాష్ట్ర అధికారులు వెబెక్స్లు పెట్టుకుంటూ వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవేవీ క్షేత్రస్థాయిలో ఉండే టీచర్లకు చేరడం లేదు. కనీసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్న గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పోనీ మీడియా ద్వారానైనా ఉపాధ్యాయులకు తెలియజేసే ప్రయత్నాలు చేయకపోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాలకు సంబంధించి రోజూ స్వయంగా డీఈఓల పేరుతోనే వివిధ మెసేజ్లు టీచర్ల గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి తప్ప మన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలు, ఖాళీల విషయం ఏమాత్రం బయటకు చెప్పడం లేదు. రెండు రోజుల కిందట పీఎస్హెచ్ఎంల బదిలీలయ్యాయి. ఆయా సబ్జెక్టుల్లో మిగులుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు పీఎస్హెచ్ఎంలుగా మంగళవారం బదిలీలు చేశారు. అయితే ఎంతమంది పీఎస్హెచ్ఎంలుగా వెళ్లారు...ఏయే సబ్జెక్టుల వారు వెళ్లారు...వీరిలో తప్పనిసరి బదిలీలయ్యేవారు, రెక్వెస్ట్ బదిలీలయ్యారు? అనే సమాచారం రాత్రి 10 గంటలు దాటినా బయటకు చెప్పలేదు. ఖాళీలు చూపించకుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలట! స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఖాళీలు ప్రదర్శించకుండానే బుధవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెబుతున్నారంటూ టీచర్లు వాపోతున్నారు. సీనియార్టీ జాబితా, ఖాళీలు ప్రకటించిన తర్వాత అభ్యంతరాలకు గడువు ఇవ్వడం లేదంటున్నారు. బత్తలపల్లి బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచరు జనవరిలో రిటైర్డ్ అయ్యారు. ఆమె పోస్టు ఖాళీ చూపించలేదు. ఇక్కడ హిందీ ఒక పోస్టు ఖాళీగా ఉంటే రెండు పోస్టులున్నట్లు చూపించారు. ఉన్న ఖాళీలను చూపించకుండా స్కూళ్లు కోరుకుంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ టీచర్లు వాపోతున్నారు. క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ పుట్టపర్తి టౌన్: కడపలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి చేపట్టిన అడ్మిషన్లకు ఈ నెల 19తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలి. బాలికలకు 40, బాలురుకు 40 సీట్లు ఉన్నాయి. 8 నుంచి పదేళ్ల వయస్సు కలిగిన బాలబాలికలు అర్హులు. పూర్తి వివరాలకు https://apsportsschool.ap.gov.in వెబ్సైట్ను పరిశీలించవచ్చు. కూటమిలో విభేదాలు బహిర్గతం● అనంతలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ప్రెస్మీట్ను అడ్డుకున్న పోలీసులు ● పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు ● పోలీసుల అండతో అడ్డుకున్న పల్లె అనుచరులు అనంతపురం: ఉమ్మడి జిల్లాలో కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తానని బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మంగళవారం అనంతపురం నగరంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అలాగే రుద్రంపేట సర్కిల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలను పల్లె వంచిస్తున్న తీరుపై చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ వద్దకు ఆయన చేరుకోగానే పెద్ద సంఖ్యలో పల్లె అనుచరులు అక్కడకు చేరుకుని భయభ్రాంతులకు గురి చేశారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. నడిరోడ్డుపైనే తోపులాట చోటు చేసుకుంది. ప్రెస్మీట్, రౌండ్టేబుల్ సమావేశం విరమించుకుని వెళ్లకపోతే దారుణమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందని పల్లె అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతలోనే పల్లె రఘునాథరెడ్డికి మద్దతుగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టడానికి వీల్లేదంటూ ఆదినారాయణయాదవ్ను అడ్డుకున్నారు. అనంతరం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి భూమిని కబ్జా చేశారని ఆదినారాయణ యాదవ్ ఆరోపించారు. అల్లరిమూకలను రెచ్చగొట్టి పదేపదే బీసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సోలార్ ప్రాజెక్ట్ కోసమని 100 ఎకరాల గిరిజనుల భూమిని ఆదినారాయణ యాదవ్ లాక్కొన్నారని పల్లె అనుచరులు ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమిలోని విభేదాలను బయటపెట్టారు. -
టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కొన్ని రోజులుగా డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మూడు రోజులుగా వరద చేరిక పెరిగింది. మే మొదటి వారంలో ఇన్ఫ్లో జీరోగా ఉండగా.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది. -
‘జేఈఈ అడ్వాన్స్డ్’లో జిల్లా విద్యార్థుల సత్తా
కదిరి టౌన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో కదిరికి చెందిన ఉపాధ్యాయుడు ఓబులపతి కుమారుడు ఓంకిరణ్ ఆల్ ఇండియా జనరల్ కేటగిరిలో 1,355 ర్యాంకు సాధించాడు. ఓబీసీ కోటాలో ఓంకిరణ్కు 223 ర్యాంకు దక్కింది. అదే విధంగా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన కేవీ రమణారెడ్డి కుమారుడు కుడుము అనీష్రెడ్డికి ఆల్ ఇండియాలో 1,783 ర్యాంకు సాధించాడు. తమ తల్లితండ్రులు ప్రోత్సాహంతోనే మెరుగైన ఫలితాలు సాధించినట్లు ర్యాంకర్లు ఓంకిరణ్, అనీష్రెడ్డి తెలిపారు. -
పొలాలకు దారి చూపించండి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారి–342 నిర్మాణం వల్ల తమ పొలాలకు దారి లేకుండా పోతోందని పుట్టపర్తి నగర పంచాయతీ కర్ణాటక నాగేపల్లి రైతులు కలెక్టర్ టీఎస్ చేతన్కు మొరపెట్టుకున్నారు. ఈమేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందించారు. కర్ణాటక నాగేపల్లి వెనుకభాగంగా ప్రభుత్వం నూతనంగా నాలుగే లేన్లతో ఎన్హెచ్– 342 నిర్మిస్తోందన్నారు. రహదారి తూర్పు భాగాన సుమారు 150 మంది రైతులకు చెందిన 300 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయని, జాతీయ రహదారి నిర్మాణం వల్ల పొలాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా పోతోందని తెలిపారు. తమ పొలాలకు దారి చూపకపోతే తరతరాలు బాధ పడాల్సి వస్తుందన్నారు. అందువల్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలోపు తమ పొలాలకు దారి చూపాలని కోరారు. స్పందించిన కలెక్టర్, సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు, నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ను కలిసిన వానిలో పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ చెరువు భాస్కర్రెడ్డి, నాగశంకర్రెడ్డి, కేశవ, ఎరికల అంజనేయులు, ఈరప్ప, వడ్డి సత్యం, రాఘవేంద్ర, కె.సత్యంతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలకు గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు నుంచి 226 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలతోపాటు, రీ సర్వే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. బుక్కపట్నం ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు వంద శాతం అమలయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎఫ్ఓ చక్రపాణి, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డీపీఓ సమత, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి సహదేవ, ఆర్అండ్బీ ఎస్ఈ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన వినతుల్లో కొన్ని ఇలా.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో వారం రోజులుగా లోవోల్టేజీ సమస్య నెలకొందని, దీంతో టీవీలు, ఫ్రిజ్లు పలు ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోతున్నాయని గ్రామస్తులు కలెక్టర్కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న విద్యుత్ అధికారులను ఆదేశించారు. ● ఓడీసీ బీసీ కాలనీలోని షిరిడీ సాయి గ్రామ సమైక్య సంఘం వీఓఏగా ఏళ్లుగా ఉన్న తనను అకారణంగా తొలగించారని, దివ్యాంగుడనైన తనకు న్యాయం చేయాలని మల్లిరెడ్డి పలువురు పొదుపు సంఘం మహిళలతో కలసి వచ్చి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ విచారించి న్యాయం చేయాలని అక్కడే ఉన్న డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ టీఎస్ చేతన్కు కర్ణాటకనాగేపల్లి రైతుల మొర ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 226 అర్జీలు -
అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు
పుట్టపర్తి టౌన్: ఏడాది క్రితం చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్పెరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ వెల్లడించారు. ధర్మవరంమండలం పోతుకుంట గ్రామానికి చెందిన మంజునాథకు రామగిరి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన యమునతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకు తెరువు కోసం పెనుకొండలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో పెనుకొండకు చెందిన సిద్దప్పతో యమునతో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న మంజునాథ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో మంజునాథ్ తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న యమున... ఆ మేరకు సిద్దప్పను ప్రభావితం చేసింది. పథకం ప్రకారం హత్య.. యమునతో కలసి మంజునాథ్ హత్యకు కుట్ర పన్నిన సిద్ధప్ప 2024, ఏప్రెల్ 22న తన స్నేహితులు నూర్ మహమ్మద్, మదన్మోహన్, మోహన్తో ధర్మవరం మండలం నాగలూరు వద్ద ఉన్న పెద్ద వంకలో మద్యం పార్టీ ఏర్పాటు చేసుకుందామని మంజునాథ్ను పిలుచుకెళ్లాడు. అక్కడ మంజునాథ్కు అతిగా మద్యం తాగించి పథకం ప్రకారం టవాలును మెడకు బిగించి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన ధర్మవరం రూరల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పసిగట్టారు. ఆదివారం సాయంత్రం పోతుకుంట గ్రామశివారులో తచ్చాడుతున్న ప్రధాన నిందితుడు సిద్దప్ప, నూర్ మహమ్మద్, మదన్మోహన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని వారు అంగీకరించారు. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మోహన్, యమున పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన డీఎస్పీ హేమంత్కుమార్, రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు. ఏడాది క్రితం వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించిన భార్య -
చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం
పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు. కర్ణాటక వాసి దుర్మరణం పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు
ఆత్మకూరు: సీఎం చంద్రబాబు తీరుతో జిల్లాలో మళ్లీ ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో లైనింగ్ పనులను రైతులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్ట్ను చేపట్టారని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలను రద్దు చేస్తూ జీఓ 22 ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులతో పాటు 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 63 టీఎంసీల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం డ్యాం మల్యాల నుంచి కాలువను వెడల్పు చేసేలా జీఓ ఇచ్చి, పనులు మొదలు పెట్టారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చాలని, డోన్ ప్రాంతంలో 63 చెరువులకు2 టీఎంసీలు, శింగనమల, శింగనమల రూరల్ చెరువులకు 2.3 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ ఇచ్చారన్నారు. అలాగే జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్ట్కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి 114 చెరువులకు నీరు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారన్నారు. పేరూరు డ్యాంకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇస్తూ సోమరాండ్లపల్లి , పుట్టకనుమ, తోపుదుర్తి, ముట్టాల చెరువులకూ 4.3 టీఎంసీలు కేటాయించారన్నారు. పుట్టపర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 193 చెరువులకు, కియో ఫ్యాక్టరీకి నీరు ఇచ్చే బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లన్నీ రద్దు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపిందన్నారు. గతంలో అమిలినేని సురేంద్రబాబు కాలువ మీద 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అమ్ముకున్నారన్నారు. ప్యాకేజ్ 2లో రూ.9 కోట్ల పనులను రూ.95 కోట్లకు బిల్లులు చేసుకున్నారని తెలిపారు. ఫ్యాకేజి 3లో రూ.40 కోట్ల పనులకు సంబంధించి రూ.105 కోట్ల బిల్లులు చేసుకున్నారని వివరించారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్పనులతో రైతులకు తీరని నష్టమన్నారు. కాలువను 63 టీఎంసీలతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయాలని, జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు, కడప జిల్లాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్ల కాలువల నిర్మాణం చేపట్టి 6 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే ఏర్పాటు చేసిన తరువాతనే లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. గండికోట నుంచి గాలేరు నగరికి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో హంద్రీ నీవా పుంగనూరు బ్రాంచ్కెనాల్కు లిప్ట్ ఇరిగేషన్ కొనసాగించాలని దీనిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, సభలు పెట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 9న తోపుదుర్తి గ్రామంలో తన నివాసం వద్దనే వేల మంది రైతులతో నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే లైనింగ్ పనులతో రైతులకు నష్టం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
పేరుకే 40 శాతం సబ్సిడీ
ఖరీఫ్లో విత్తన వేరుశనగపై ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సబ్సిడీతో తమకు ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెబుతున్నా.. 10 శాతానికి మించి సబ్సిడీ అందే పరిస్థితి లేదని అంటున్నారు. మడకశిర: ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తన పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్వింటాకు రూ.9,300 ధర నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ క్వింటా వేరుశనగ ధర రూ.9,300 లేదు. అయితే రాష్ట్రంలో మాత్రం వేరుశనగ విత్తనానికి అధిక ధరను నిర్ణయించి రైతులకు 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు గొప్పలకు పోతోంది. 40 శాతం సబ్సిడీ పోను రైతులు క్వింటా వేరుశనగ విత్తనానికి రూ.5,580 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన విత్తన వేరుశనగ క్వింటా ధర రూ.6,200 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన వేరుశనగకు ఉన్న ధరతో పోల్చుకుంటే రైతులకు నామమాత్రంగానే సబ్సిడీ అందే పరిస్థితి కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లోని ధర ప్రకారం క్వింటాపై రైతులకు రూ.620 చొప్పున మాత్రమే సబ్సిడీ అందుతోంది. అయితే ప్రభుత్వ క్వింటాకు రూ.3,720 చొప్పున సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో కొనుగోలుకే మొగ్గు.. జిల్లాకు ఈ ఖరీఫ్ సీజన్లో 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్వేశించుకోగా... ధర గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు బహిరంగ మార్కెట్లో విత్తన వేరుశనగ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా వేరుశనగ విత్తనంపై అందించే సబ్సిడీ రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. సబ్సిడీ పోను ప్రభుత్వం అందించే ధరకే ఇంచుమించు బహిరంగ మార్కెట్లోనే నాణ్యమైన విత్తనం లభ్యమవుతోంది. దీంతో ఇప్పటికే చాలా మంది రైతులు రైతులు బహిరంగ మార్కెట్లోనే విత్తన కాయలను కొనుగోలు చేసి శుద్ధి చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించే విత్తనం కన్నా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనంలో 78 శాతం నాణ్యత ఉందని అంటున్నారు. విత్తన వేరుశనగ క్వింటా ధర రూ.9,300గా నిర్ణయించిన ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో రైతుకు రూ.5,580కు బహిరంగ మార్కెట్లో నాణ్యమైన విత్తనం క్వింటా రూ.6,200కే ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతల అసంతృప్తి -
టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: క్షయ(టీబీ)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ తరఫున సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీబీ నిర్మూలనకు 100 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, పంచాయతీ రాజ్ సంస్థలు, స్వయం సహాయక బృందాలు, అంగన్ వాడీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. టీబీపై అవగాహన పెంచి దాన్ని ఎదుర్కొనే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డీఎల్టీఓ డాక్టర్ తిప్పయ్య, డీసీహెచ్ఎస్ మధుసూదన్, మలేరియా అధికారి లక్ష్మానాయక్, మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్ రమణ, గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసరాలు సక్రమంగా అందించాలి ● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ నల్లమాడ: అవినీతి, అక్రమాలకు తావులేకుండా చౌకదుకాణాల ద్వారా నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డీలర్లను ఆదేశించారు. సోమవారం ఆయన నల్లమాడ –1 చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరుకుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ణీత సమయాల్లో డీలర్లు అందుబాటులో ఉంటూ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దనే సరుకులు అందజేయాలని సూచించారు. అనంతరం క్యూ ఆర్ కోడ్ గురించి డీలర్లకు అవగాహన కల్పించారు. జేసీ వెంట తహసీల్దార్ రంగనాయకులు ఉన్నారు. సరిహద్దులో గెలిచినా.. ఊళ్లో ఓడిపోతున్నా ● కబ్జాకు గురైన తన భూమిని పరిరక్షించాలి ● వీడియో ద్వారా కోరిన బీఎస్ఎఫ్ జవాన్ అమరాపురం: సరిహద్దులో ఉంటూ దేశ రక్షణలో విజయం సాధిస్తున్న తాను స్వగ్రామంలో ఆస్తులను కాపాడుకోలేక ఓడిపోతున్నానంటూ ఓ జవాన్ ఆవేదనతో విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమరాపురం మండల పరిధిలోని ఉదుగూరుకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి కె.శివరం గ్రామంలో వివాహం చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా మరో ప్రాంతంలో ఉన్న ఆయన ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. తనకు చెందిన 2.09 ఎకరాల భూమిని కె.శివరం గ్రామానికి చెందిన నాగరాజు కబ్జా చేశాడని ఆరోపించారు. తనకు హక్కుగా రావాల్సిన భూమిని సాగు చేయడానికి వెళితే నాగరాజు దాడులు చేస్తున్నాడని, రాళ్లు, కొడవలితో భయపెడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. జవాన్ వీడియో వైరల్ కావడంతో తహసీల్దార్ లక్ష్మీనరసింహ సోమవారం మధ్యాహ్నం కె.శివరం గ్రామానికి వెళ్లి సంబంధిత భూమిని పరిశీలించారు. డాక్యుమెంట్లను తీసుకురావాలని జవాన్ మామకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అలాగే వారికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
●పోలీసు బండి.. జగమొండి
కళ్యాణదుర్గం: కొన్నేళ్ల క్రితం కళ్యాణదుర్గం అర్బన్ పీఎస్కు ఓ బొలెరో వాహనాన్ని అధికారులు కేటాయించారు. స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎస్ఐ పోస్టు లేకపోవడంతో సీఐ స్థాయి అధికారికి ఆ వాహనాన్ని కట్టబెట్టారు. అయితే తరచూ సాంకేతిక సమస్యలతో వాహనం కాస్త మొరాయించడం మొదలు పెట్టింది. దీంతో సోమవారం పెట్రోలింగ్కు వెళ్లేందుకు వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు తోయించి స్టార్ట్ చేయించాల్సి వచ్చింది. పోలీసుల అవస్థలను చూసిన ప్రజలు.. చిన్నపాటి మరమ్మతులు సైతం చేయించుకోలేని పోలీసుల తీరుపై ‘ఎంతైనా సావాస దోషం’ అంటూ చలోక్తులు విసిరారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
కూడేరు: తాగునీటి కోసం కూడేరు వాసులు సోమవారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని బోయ, కమ్మ, దళిత, కటిక వీధులు, శ్రీసత్యసాయి కాలనీల్లో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీ వాసులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణమూర్తి మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు అక్కడికు ఆందోళన కారులతో చర్చించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే అధికారులే వచ్చి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కుళ్లాయిస్వామి అక్కడకు చేరుకుని వారం రోజుల్లోపు కొత్తగా బోర్లు వేయించి, నీరు సరఫరా అయ్యేలా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేద్దాం
పుట్టపర్తి: రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4న నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రెడ్డప్పగారి రమేష్రెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వారు పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం రమేష్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన, హామీలు విస్మరించిన వైనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పసుపు–కుంకుమ, రైతు రుణ మాఫీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, పీఠంపై కూర్చోగానే మహిళలకు, రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’ హామీలతో పాటు వందల హామీలిచ్చి చంద్రబాబు పొత్తులతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడూ హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మోసం, వంచన, వెన్నుపోటు చంద్రబాబు నైజమన్నారు. 1996లోనే బిడ్డినిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అక్రమంగా పదవి పొందారని, 2024లో అధికారంలోకి వస్తూనే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 4వ తేదీ పుట్టపర్తి దద్దరిల్లిల్లేలా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలన్నారు. మోసం చేయటమై చంద్రబాబు లక్ష్యం.. హామీలివ్వడం.. మోసం చేయడం చంద్రబాబు నైజమని వెన్నపూస రవీంద్రరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4వ తేదీన ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, పుట్టపర్తి రూరల్ మండల ఎంపీపీ రమణారెడ్డి, జిల్లా అగ్రీ అడ్వయిజరీ మాజీ అధ్యక్షుడు ఆవుటాల రమణారెడ్డి, పుట్టపర్తి వైస్ చైర్మన్ తిప్పన్న, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షులు కన్యా కుమారి, కవితారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగిశెట్టి, పుట్టపర్తి నియోజకవర్గం డాక్టర్ల విభాగం అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సాయి, రామాంజనేయులు, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బడా నాగార్జునరెడ్డి, కొత్తచెరువు ఐటీ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్రెడ్డి హామీలు తుంగలో తొక్కడం చంద్రబాబు నైజం: వెన్నపూస రవీంద్రారెడ్డి -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించారు. బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతిని అటుగా వెళుతున్న వారు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు. -
రైతు ద్రోహి ప్రభుత్వమిది
ఈ చిత్రంలోని రైతు పేరు మేకల లక్ష్మీనరసింహులు. తాడిమర్రి మండలం. మరవపల్లి గ్రామం. తనకున్న మూడెకరాల పొలంలో ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగుచేస్తున్నాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయంతో పాటు రాయితీ విత్తన వేరుశనగ అందించడంతో పంటలు సాఫీగా సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం నేటికీ రైతులకు పెట్టుబడి సాయం, రాయితీ విత్తనం అందించలేదు. దీంతో పెట్టుబడులకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియక లక్ష్మీనరసింహులు సతమతమవుతున్నాడు. ఈ సారి పంట సాగుకు పెట్టుబడి ఎలా అని ఆందోళన చెందుతున్నాడు. ఈ రైతు పేరు ఎస్.హరినాథరెడ్డి. కదిరి మండలం ముత్యాలచెరువు. ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగు చేసేవాడు. గత ఐదేళ్లూ ‘రైతు భరోసా’ కింద వైఎస్ జగన్ సర్కార్ పెట్టుబడి సాయం సకాలంలో అందించడంతో ఉత్సాహంగా పంటలు సాగుచేసేవాడు. కానీ కూటమి సర్కార్ ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ఇస్తామన్న రూ.20 వేలు నేటికీ ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాచాల్సి వస్తోందని వాపోతున్నాడు. కదిరి: రైతులకు కష్టం కలగకుండా చూసుకుంటానంటూ ఎన్నికల వేళ హామీలిచ్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఏడాది పాలన సంబరాలకు సిద్ధమవుతున్న ఆయనకు..ఈ ఏడాది కాలంలో ఏనాడూ అన్నదాతలు గుర్తుకు రాలేదు. అందుకే రైతన్నలకు నయాపైసా సాయం చేసిన పాపాన పోలేదు. ఫలితంగా సాయం అందక...సాగుకు సన్నద్ధం కాలేక రైతన్న సతమతమవుతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. రూ.560 కోట్లు ఎగనామం.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా..దానిపై ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు సకాలంలో ఆర్థిక చేయూత ఇస్తున్నా.. చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అదిగో..ఇదిగో అని చెప్పడమే కానీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది లేదు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సైతం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ రైతుల పక్షాన మాట్లాడ లేదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున సుమారు రూ.560 కోట్లు చంద్రన్న సర్కారు ఎగ్గొట్టింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడు విడతల్లో నిధులు జమ.. వైఎస్ జగన్ సర్కార్ ఖరీఫ్ సాగుకు ముందే ఏటా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద తొలివిడత రూ.7,500 ఇచ్చింది. తర్వాత అక్టోబర్ నెలలో పంట కోతతో పాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు, జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు... ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు మొత్తం రూ.13,500 చొప్పున నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే ‘సున్నావడ్డీ–పంటరుణాలు’ పథకం ద్వారా 1,71,275 మంది రైతులకు రూ.67.65 కోట్లు, ‘డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ ద్వారా 2,96,541 మంది రైతులకు రూ.718.57 కోట్లు, అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రూ.16.21 కోట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు గత ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరింది. ఈ ప్రభుత్వం మాత్రం ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్నా రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. అన్నదాత దుఃఖీభవ..! ‘అన్నదాత సుఖీభవ’కు పడని అడుగులు రైతులకు రూ.560 కోట్లు చంద్రబాబు ఎగనామం పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురు చూపు ఖరీఫ్ సాగుకు ‘ప్రైవేటు’ అప్పులు చేస్తున్న వైనం ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గతంలో వైఎస్ జగన్ సర్కారు సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా వచ్చే రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలోని 2,79,556 మంది రైతులకు గత ఐదేళ్లలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.1,767.09 కోట్ల లబ్ధి చేకూర్చింది. జగన్ హయాంలో అన్నదాతకు ఆర్థిక భరోసా.. చంద్రబాబుకు రైతులంటే గిట్టదు. అందుకే ఆయన వ్యవసాయమే దండగ అని గతంలోనే చెప్పారు. ఎన్నికల వేళమాత్రం రైతులకు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఏడాది కాలంలో రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు. పెట్టుబడి సాయం కూడా అందించలేదు. రైతు ద్రోహి ప్రభుత్వమిది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకివ్వాల్సిన నగదు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. లేకపోతే రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటానికి సిద్ధమవుతుంది. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ -
పింఛన్ డబ్బుతో ఆన్లైన్ బెట్టింగ్!
●వెల్ఫేర్ అసిస్టెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ గుడిబండ: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛన్ డబ్బును వాడేసుకున్నాడు. ఫలితంగా తన పరిధిలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. గుడిబండ మండలం గుణేమోరుబాగల్ పంచాయతీలో ఈ సంఘటన వెలుగు చూసింది. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున సామాజిక భద్రత పింఛన్ పంపిణీకి సంబంధించి మే 30న బ్యాంకు నుంచి రూ.1.82 లక్షల నగదు డ్రా చేశాడు. ఒకటో తేదీ ఆదివారం సెలవురోజు కావడంతో మే 31 శనివారం నుంచే పింఛన్ను పంపిణీ ప్రారంభమైంది. అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ తన పరిధిలోని లబ్ధిదారుల్లో ముగ్గురికి మాత్రమే పింఛన్ పంపిణీ చేశాడు. అనంతరం సర్వర్ పనిచేయలేదని, రేపు పంపిణీ చేస్తామని చెప్పాడు. అయితే ఆదివారం పింఛన్ పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు కార్యాలయానికి వస్తే అతడు అందుబాటులో లేడు. తమకు పింఛన్ ఇవ్వలేదని పలువురు మండలస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛన్ డబ్బును సొంతానికి వాడుకున్నట్లు.. ఆ మొత్తాన్ని ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నట్టు తేలింది. ఈ మేరకు ఎంపీడీఓ కేశవరెడ్డి వెల్ఫేర్ అసిస్టెంట్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున ఆన్లైన్ బెట్టింగ్ మోజులో పడి పింఛన్ డబ్బులు పోగొట్టినట్లు సమాచారం. క్రమశిక్షణా చర్యల కింద శెట్టూరు నుంచి గుణేమోరుబాగల్కు బదిలీ చేసినట్లు తెలిసింది. -
బోగస్పై కలెక్టర్ దృష్టి
అనంతపురం ఎడ్యుకేషన్: బోగస్ సర్టిఫికెట్లతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పొందాలని చూస్తున్న కొందరి టీచర్ల వ్యవహారంపై కలెక్టర్ వినోద్కుమార్ దృష్టి సారించారు. కొందరు టీచర్లు బోగస్ సర్టిఫికెట్లతో పాయింట్లు పొందతున్న వైనంపై ‘సాక్షి’లో వరుసగా ‘పాయింట్లపై ఫిర్యాదల వెల్లువ’ ‘స్టేషన్ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం’ శీర్షికలతో ప్రచురించిన కథనాలకు కలెక్టర్ స్పందించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబుతో మాట్లాడారు. స్పౌజ్, పీహెచ్, లీగలీ సపరేటెడ్ తదితర అంశాల్లో అర్హత లేకున్నా బోగస్ సర్టిఫికెట్లతో ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చేరారనే విషయాలపై డీఈఓను ఆరా తీశారు. అలాగే మరికొందరు టీచర్లు స్టేషన్ పాయింట్లు నమోదులోనూ ఇష్టానుసారంగా వేసుకున్నారనే అంశంపైనా ఆరా తీశారు. మెడికల్ సర్టిఫికెట్లతో పాటు స్టేషన్ పాయింట్ల వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ పేరుతో జారీ చేసిన సర్కులర్ విద్యాశాఖ, ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. లేని రోగాలను సృష్టించుకుని... అనువైన స్థానాల్లో చేరేందుకు అడ్డదారులు ఎన్నుకున్నారు. లేని రోగాలను సృష్టించుకుని, తక్కువ శాతం ఉన్న వైకల్యాలను ఎక్కువ శాతం చూపిస్తూ, అన్ని అవయవాలూ సక్రమంగా పని చేస్తున్నా పైరవీలు చేసి తెచ్చుకున్న బోగస్ వైద్య ఽద్రువీకరణపత్రాలతో ‘ప్రిపరెన్షియల్’ కేటగిరి, ‘స్పెషల్’ పాయింట్లు పొందేందుకు పన్నాగం రచించారు. ఈ క్రమంలో గత కౌన్సెలింగ్ల్లో జనరల్ కేటగిరీల్లో ఉన్న చాలామంది ఈసారి ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ప్రత్యేక పాయింట్ల జాబితాల్లో చేరారు. ఉద్యోగంలో చేరినప్పుడు వైకల్యం ఉన్నవారితో పాటు నిజంగా ప్రమాదవశాత్తూ, మరేదైనా కారణాలతో మధ్యలో వైకల్యం పొందిన వారినీ ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వయసు రీత్యా కాస్త వినకపోవడం, కంటిచూపు తగ్గడం సహజం. ప్రమాదవశాత్తూ కిందకు పడినప్పుడు చిన్నచిన్న సర్జరీలు చేసుకోవడం కూడా సహజమే. అయితే వీటినే పెద్ద బూచీగా చూపిస్తూ అడ్డుగోలుగా పాయింట్లు పొందుతున్నారు. వీరి వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఎంఈఓలతో సమావేశమైన డీఈఓ ఇదిలాఉండగా ఆదివారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఈఓలతో డీఈఓ ప్రసాద్బాబు సమావేశం ఏర్పాటు చేశారు. పాతస్టేషన్ పాయింట్ల నమోదులు ఎక్కువగా ఎస్జీటీలే వాడుకున్నారని ఇందుకు ఎంఈఓలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. గరిష్టంగా 24కు మించి అర పాయింటు కూడా ఎక్కువ ఉండకూడదన్నారు. స్టేషన్పాయింట్లు, రీఆపోర్స్మెంట్కు గురైన టీచర్లు పాయింట్లు ఇష్టానుసారంగా వేసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి టీచరును పిలిపించి విచారించి పాయింట్ల నమోదులో తేడా ఉంటే సరి చేయాలన్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్ల నమోదును జాగ్రత్తగా ఒకటిరెండు సార్లు పరిశీలించాలన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. పూర్తయిన తర్వాత కూడా ఎవరికై నా నిబంధనలకు విరుద్ధంగా పాయింట్లు ఉన్నట్లయితే సదరు టీచరుతో పాటు ఎంఈఓలపైనా చర్యలుంటాయని డీఈఓ స్పష్టం చేశారు. టీచర్ల ప్రిఫరెన్షియల్ కేటగిరీ విచారణకు ఆదేశం స్టేషన్ పాయింట్లు ఎక్కువ వేసుకోవడంపైనా ఆరా -
అవ్వకు అష్టకష్టాలు
ఈ వృద్ధురాలు భీమరాయునిపేట గ్రామానికి చెందిన బ్యాల్ల నీలమ్మ. రేషన్కార్డులో ఈమెతో పాటు భర్త ఉన్నారు. వీరు రేషన్ బియ్యం కోసం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లానారాయణపల్లికి వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామానికి వెళ్లడానికి బస్సు, ఆటో సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే బయల్దేరింది. 65 ఏళ్ల వయసు మీద పడిన నీలమ్మ రేషన్ కోసం అష్టకష్టాలు పడి నడిచి వెళితే అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. ‘గతంలో ఇంటి వద్దే సరుకులు తీసుకునేవాళ్లం. ఈ వయసులో మాకు ఈ అగచాట్లు ఏమిటో అర్థం కావడం లేదు’ అని నీలమ్మ వాపోయారు. – తాడిమర్రి