Sri Sathya Sai District News
-
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
● ఈమె పేరు లక్ష్మీనరసమ్మ. రొద్దం మండలం కలిపి గ్రామం. సర్వే నంబరు 261–1లో ఎకరా, సర్వే నంబరు–491లో 1.04 ఎకరాలు, సర్వే నంబరు 50లో 60 సెంట్లు భూమి ఉంది. అన్ని చోట్ల ఆమె కుటుంబ సభ్యులే సాగులో ఉన్నారు. అయితే ఆ భూమి మొత్తాన్ని ఆమెకు తెలియకుండా వేరే వాళ్లు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవస్థలు పడుతున్నట్లు లక్ష్మీనరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి.. తిరిగి.. అలసిపోయి.. చివరకు కలెక్టరేట్ మెట్లు ఎక్కినట్లు వాపోయారు. ● ఇక్కడ కనిపిస్తోన్న రైతు పేరు వెంకటరెడ్డి. కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామం. ఈయనకు సర్వే నంబరు–127లో 31 సెంట్లు, సర్వే నంబరు–137లో 3 సెంట్లు, సర్వే నంబరు–208లో 45 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కూటమి నేతలు కొందరు ఆ భూమిని ఆక్రమించారు. దీంతో బాధిత రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. అయితే ఇంతలోనే కూటమి నేతలు ఆ స్థలంలో రోడ్లు వేశారు. దీంతో వెంకటరెడ్డి నాలుగు నెలల వ్యవధిలోనే 11 సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని వాపోయారు. ● ఈ చిత్రంలో కలెక్టర్కు అర్జీ ఇస్తున్న రైతు పేరు చిమిరాల జగన్నాథ్. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గ్రామం. పుట్టపర్తి రెవెన్యూ పొలం సర్వే నంబర్ 295–1లోని 32 సెంట్లలో 11 సెంట్లు, సర్వే నంబర్ 296–3లోని 34 సెంట్లలో 12 సెంట్లు, సర్వే నంబర్ 296–7లోని 30 సెంట్లుపైకి 10 సెంట్ల భూమి ఉంది. మూడు సర్వే నంబర్లలో కలిపి మొత్తం 33 సెంట్లకు సంబంధించి రిజిష్టర్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఆ పొలం ఇతరులు ఆక్రమించారు. అధికారులకు విన్నవించినా.. న్యాయం జరగలేదు. భూమిని సర్వే చేయించి తనకు పాసు పుస్తకం మంజూరు చేయాలని సోమవారం కలెక్టర్ను కోరాడు.సాక్షి, పుట్టపర్తి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ జిల్లాలో ప్రజా ప్రదక్షిణల వేదికగా సాగుతోంది. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామ, మండల స్థాయిలో అర్జీలిచ్చి...అక్కడ పరిష్కారం కాక ఎంతో ఆశతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘పరిష్కార వేదిక’కు వస్తున్నారు. అయితే ఇక్కడా సరైన పరిష్కారం దొరకడం లేదు. దీంతో ప్రజలు ఒకే సమస్యపై పదేపదే అర్జీలివ్వడం...అధికారులు వాటిని తీసుకుని బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతి సోమవారం అర్జీల సంఖ్య 400 దాటిపోతోంది. అధికారులు మాత్రం సమస్యలన్నీ పరిష్కరించినట్లు చెబుతున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. పలు విషయాలు వెలుగు చూశాయి. రెవెన్యూ సమస్యలే అధికం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరాక రెవెన్యూ సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా భూ సమస్యలు పెరిగిపోయాయి. ఇక తమ భూమి కబ్జా చేశారని అందే వినతులు వందల్లోనే ఉంటున్నాయి. కబ్జా రాయుళ్లు కూటమి పార్టీల నేతలు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. దశాబ్దాల కాలంగా సాగులో ఉన్నోళ్లను కాదని.. వన్–బీలలో పేర్లు మారుస్తున్నారు. వాటన్నింటినీ సరిదిద్దుకునేందుకు నిజమైన అర్హులు అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. ఒక్కో సమస్యపై పదిసార్లకుపైగా వినతులు ఇచ్చినట్లు సోమవారం కలెక్టరేట్కు వచ్చిన పది మంది పైగా చెప్పడం గమనార్హం. తూతూ మంత్రంగా పరిష్కారం ‘అర్జీలు పునరావృతం కారాదు’ అని కలెక్టర్ చేతన్ ప్రతి వారం ఆదేశిస్తున్నా.. సిబ్బంది పాటించడం లేదు. ప్రజల నుంచి అర్జీలు అందిన వెంటనే పరిష్కరించినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నారు. దీంతో సమస్య తీరక.... ప్రజలు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్కు వచ్చి ఏకంగా కలెక్టర్కే అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా నమ్మకం పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20,070 ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన అర్జీలు4,713 సర్వే సమస్యలపై అందిన అర్జీలు 7,608 పెండింగ్లో ఉన్న అర్జీలు(గణాంకాలు 2024 జూన్ 19 నుంచి 2025 మార్చి 17 వరకు) పదుల సార్లు విన్నవించినా పరిష్కారం కాని సమస్యలు ఒకే సమస్యపై పదే పదే వస్తోన్న ఫిర్యాదులు కూటమి హయాంలో పెరిగిన భూ సమస్యలు అధికారుల అలసత్వంతో పెరిగిన భూకబ్జాలు టీడీపీ నేతలు విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు మొక్కుబడిగా పరిష్కారం చూపిస్తున్నారని బాధితుల ఆవేదన పరిష్కార మార్గం చూపిస్తున్నాం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో నమోదయ్యో ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపుతున్నాం. అర్జీలు పునరావృతం కాకూడదన్నదే ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూస్తున్నాం. రెవెన్యూలో అవకతవకలు జరగకుండా చూసుకుంటాం. కబ్జాల విషయంలో విచారణ చేయించి.. బాధితులకు న్యాయం చేస్తున్నాం. – టీఎస్ చేతన్, కలెక్టర్, శ్రీసత్యసాయి జిల్లా పరిహారం అందలేదు నాకు గ్రామంలో సర్వే నంబరు 27–4లో రెండు ఎకరాలుండగా... హౌసింగ్ కోసం అధికారులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. పోనీ సాగుచేసుకుందామని పొలంలోకి వెళ్తే అధికారులు అడ్డు పడుతున్నారు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన మెటీరియల్ అక్కడ దింపారు. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. – బోయ నరసింహప్ప, మణేసముద్రం, హిందూపురం -
నిలకడగా చింత పండు ధరలు
హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1991.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 30 వేలు, కనిష్టంగా రూ.8,200, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ. 4,500, సగటు రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. బేస్బాల్ పోటీల్లో నల్లమాడ విద్యార్థుల సత్తా ● జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఇద్దరి ఎంపిక నల్లమాడ: బేస్బాల్ పోటీల్లో నల్లమాడ విద్యార్థులు సత్తా చాటారు. అండర్–14 జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికయ్యారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కుసుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో స్థానిక ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కె. భాస్కర్ నాయక్ (9వ తరగతి), ఎం. లిఖిత్ నాయక్ (8వ తరగతి) జిల్లా జట్టు తరఫున ఆడి సత్తా చాటారు. దీంతో నిర్వాహకులు వారిని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అండర్–14 రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు పాఠశాల హెచ్ఎం సతీష్, వసతి గృహ సంక్షేమాధికారి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిద్దరూ పంజాబ్లోని సంగ్రూర్లో ఈనెల 27 నుంచి 31 వరకు జరిగే జాతీయ టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికై న విద్యార్థులను హెచ్ఎం, హెచ్డబ్ల్యూఓతో పాటు పీడీ ధరణి, పాఠశాల సిబ్బంది అభినందించారు. సూపర్ స్పెషాలిటీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీకి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని మార్చడం జరిగిందన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ, మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చిన్నారుల్లో హెర్నియా, మూత్రనాళం, మలనాళం, అపెండీసైటీస్ తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఐసీడీఎస్ పీడీ పుట్టపర్తి అర్బన్: సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా (పీడీ)గా తోట శ్రీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని డైరెక్టరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఆమెను, ఉన్నతాధికారులు ఇటీవలే జిల్లా ఇన్చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చేతన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఇప్పటిదాకా ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా పనిచేసిన సుధావరలక్ష్మి తిరిగి ఓడీసీ సీడీపీఓగా పూర్వ స్థానానికి వెళ్లారు. -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
పుట్టపర్తి/ పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు జిల్లాలో తొలిరోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణప్ప తెలిపారు. ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలో 104 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 210 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు. 21393 మంది విద్యార్థులకు గాను, 21,183 మంది హాజరయ్యారని వెల్లడించారు. కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పరిశీలించారు. పుట్టపర్తి మన్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని వారు వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు తదితర మౌలిక సదుపాయలపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్నీ పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించకూడదన్నారు. పుట్టపర్తిలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చేతన్ -
● మోహినీ రూపం.. భక్త పారవశ్యం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వయ్యారాలు ఒలకబోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో కనిపించిన శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ధగధగ మెరిసే పట్టు చీర ధరించి, గుభాళించే కదిరి మల్లెల అలంకరణలో కనిపించిన ఖాద్రీశుని వైభవాన్ని చూస్తే తప్ప చెప్పటం సాధ్యంకాదు. శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడగా, అమృతాన్ని పంచడానికి శ్రీమహావిష్ణువే మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలకృష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తుల వద్దకే వసంతవల్లభుడు తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలో విహరించారు. ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి బ్రహ్మ రథోత్సవం ఈ నెల 20న జరగనుంది. ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైభవంగా ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు -
భూ సేకరణ విరమించుకోవాలి
మడకశిర రూరల్: ‘‘పరిశ్రమల కోసం ఇప్పటికే 15 ఏళ్ల క్రితం గౌడనహళ్లి పంచాయతీ పరిధిలో 800 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పరిశ్రమల పేరు చెప్పి గౌడనహళ్లి, తురుకువాండ్ల పల్లి, జమ్మానిపల్లి గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాలు సేకరిస్తామంటున్నారు. పరిశ్రమలు కావాల్సిందే... కానీ అందుకు మా కడుపు కొట్టొద్దు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని వాళ్లం. మా భూములు తీసుకుంటే మేమెట్టా బతికేది. ఇప్పటికై నా భూసేకరణను విరమించుకోవాలి. లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం’’ అంటూ మండల పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గౌడనహళ్లి, తురుకువాండ్ల పల్లి, జమ్మానిపల్లి గ్రామాల పరిధిలో ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం 2 వేల ఎకరాల భూసేకరణను సిద్ధమైంది. దీంతో రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అప్పులు చేసి బోర్లు వేసి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ భూములను తీసుకుంటే మూడు గ్రామాల్లోని చిన్న, సన్న కారు రైతులు దాదాపు 400 మంది వరకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు అన్యాయం చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయంపై 22 నుంచి సదస్సు
ప్రశాంతి నిలయం: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అనంతపురంలో జరిగే సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అంశంతో ముద్రించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 22న పకృతి వ్యవసాయంపై, 23న పంటలు, వంటలు, ఆరోగ్యంపై, 24న మారుతున్న వాతావరణ పరిస్థితులు– వ్యవసాయంపై సదస్సులు ఉంటాయన్నారు. రోజూ వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరై ప్రకృతి వ్యవసాయంపై కొత్త విషయాలను వివరిస్తారని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలసి నిర్వహిస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జేడీఏ సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, జనజాగృత స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు డీపీ బలరాం, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సీడీసీ శంకర్, టింబక్ట్ శ్రీకాంత్, సుస్థిర వ్యవసాయ వేదిక ప్రతినిధులు ఆదినారాయణ, ఉత్తప్ప తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తరాదు: వేసవి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఎక్కడేగాని తాగునీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. తాగునీరు, వడగాలులు, పీ–4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు మూడు నెలలు ఎంతో కీలకమని, పీ–4 అమలుపై ప్రజాభిప్రాయ సేకరణను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ అభిషేక్కుమార్, అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్ -
మహిళల భద్రతకు పెద్దపీట
● జిల్లాలో ఆరు ‘శక్తి’ టీంలు ఏర్పాటు ● జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: మహిళల భద్రత కోసం జిల్లాలో ఆరు ‘శక్తి’ టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. సోమవారం ఆమె శక్తి టీంల కోసం ‘మీ రక్షణ– మా కర్తవ్యం’ అనే నినాదాలతో రూపొందించిన వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..పోలీస్ సబ్డివిజన్కు ఒక టీం చొప్పున జిల్లాలో ఆరు శక్తి టీంలు ఏర్పాటు చేశామన్నారు. టీంలో నోడల్ అధికారిగా మహిళా డీఎస్పీ, ఎస్ఐ, ఏఎస్ఐ నేతృత్వంలో ఇద్దరు మహిళా సిబ్బంది, నలుగురు కానిస్టేబుళ్లు మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారన్నారు. శక్తి టీంలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలపై జరుగున్న దాడులు, ఆకతాయిలు వేధింపులు నియంత్రించడంతో పాటు మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘శక్తి యాప్’ను రూపొందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు 112 లేదా 100 నంబర్కు కాల్చేస్తే సంఘటనా స్థలానికి వెళ్లి తక్షణ సాయం అందిస్తాయన్నారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్ఐ ప్రదీప్కుమార్, ఆర్ఐ మహేష్, మహిళా పోలీస్టేషన్ సీఐ గోపీనాథ్రెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐలు వెంకటేశ్వర్లు, ప్రదీప్సింగ్తోపాటు శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.తాగునీటి కోసం మహిళల ధర్నా అగళి: మండలంలోని ముక్కడమపల్లి గ్రామంలో తాగునీటి కోసం ఎస్సీ కాలనీ మహిళలు రోడ్డెక్కారు. రత్నగిరికి వెళ్లే మార్గంపై బైఠాయించి నిరసన తెలపడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ నరసింహమూర్తికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీటి కోసం సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
టీడీపీ నేతల బరి తెగింపు
గోరంట్ల: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత టీడీపీ నాయకులు బరితెగించారు. సంపద సృష్టి పేరుతో ఇష్టానుసారంగా ప్రకృతి వనరులను దోచేయడం మొదలు పెట్టారు. చివరకు ప్రభుత్వ చింత వనం నుంచి అక్రమంగా మట్టి తరలింపులు చేపట్టడం టీడీపీ నేతల బరితెగింపులకు పరాకాష్టగా నిలిచింది. వివరాలు.. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సర్వే నంబర్ 205లో 23 సంవత్సరాల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ చొరవతో చింత– నిశ్చింత కార్యక్రమం కింద ప్రభుత్వ చింత వనం అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చింత చెట్లు ఏపుగా పెరిగి ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్తో కలసి టీడీపీ నేతలు కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే చింత వనం నుంచి మట్టి తరలింపులు చేపట్టారు. ఇందు కోసం హిటాచీలను రంగంలో దించారు. రేయింబవళ్లూ మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా రియల్టర్ల భూములకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పెనుకొండ డివిజన్ నీటి పారుదల శాఖ డీఈ లక్ష్మీనారాయణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మట్టి తవ్వకాలు సాగిస్తున్న హిటాచీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై డీఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, టీడీపీ ముఖ్యనేత అండతో కొంత కాలంగా స్థానిక చోటా నాయకులు అక్రమంగా మట్టి తరలించి రూ. లక్షల్లో సొమ్ము చేసుకున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చింత వనం నుంచి అక్రమంగా మట్టి తరలింపు తవ్వకాలను అడ్డుకుని హిటాచీని పోలీసులకు అప్పగించిన ఇరిగేషన్ అధికారులు -
రెండో రోజూ శ్రీవారిని తాకిన సూర్యకిరణాలు
ధర్మవరం అర్బన్: స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలోని చెన్నకేశవస్వామి మూలవిరాట్ను సోమవారం ఉదయం రెండో రోజు కూడా సూర్యకిరణాలు తాకాయి. సూర్య పూజా మహోత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. మూడు రోజుల పాటు స్వామిని సూర్యకిరణాలు తాకుతాయని ఏటా ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు.రెడ్డెప్పశెట్టి ఎస్టేట్లో వలస కూలీ మృతిచిలమత్తూరు: మండలంలోని కొడికొండ సమీపంలో రియల్టర్ రెడ్డెప్పశెట్టికి చెందిన ఎస్టేట్లో పనిచేస్తున్న వలస కూలీ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కు చెందిన అర్జున్ (21) విష ద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికెళ్లి పరిశీలించామన్నారు. విషం ఎందుకు తాగాడనేది తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ విషయం బయట పడకుండా ఎస్టేట్ యాజమాన్యం తొక్కి పెట్టి గుట్టు చప్పుడు కాకుండా అర్జున్ మృతదేహాన్ని ఖననం చేయడం అనుమానాలకు తావిస్తోంది. కొడికొండ చెరువులో మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరిగి ఎస్టేట్ పరిసరాల్లోనే పాతిపెట్టారు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడమే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదంలో యువకుడి మృతి బెళుగుప్ప: మండలంలోని బి.రామసాగరం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్పకు చెందిన బోయ చంద్రన్న కుమారుడు సతీష్కుమార్ (19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవల ఇంటికి వచ్చాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుకున్న స్నేహితుడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామానికి చెందిన పవన్కుమార్తో కలసి సోమవారం ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఎర్రితాత రథోత్సవానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు బి.రామసాగరం క్రాస్ వద్దకుచేరుకోగానే అదుపు తప్పి కిందపడ్డారు. చీకటిలో అటుగా వచ్చిన కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలిసి, 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సతీష్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్కు చికిత్సలు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బడ్జెట్లో చేనేతలకు అన్యాయం
ధర్మవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగానికి అరకొర కేటాయింపులు జరిపి చేనేతలకు తీరని అన్యాయం చేసిందని, ప్రభుత్వ చర్యల కారణంగా చేనేత మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడగ వెంకటనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ నుంచి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడారు. ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి చేనేతలను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తారని భావించామన్నారు. ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సైతం ధర్మవరంలో నేతన్నలకు స్పష్టమైన భరోసానిచ్చారన్నారు. చేనేతలకు జీఎస్టీని ఎత్తివేస్తామని, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆప్కో ద్వారా సొసైటీలకు నిధులు ఇస్తామని హామీలు గుప్పించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకాన్ని ఆపేశారన్నారు. అంతేకాక రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి కేవలం రూ.138కోట్లు నిధులు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేశారన్నారు. ఈ నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయని, ఇక చేనేతలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేసి బడ్జెట్లో నిధులు సరిపడా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు, వెంకటస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, శ్రీధర్, రంగయ్య, కొండ, పెద్దకోట్ల గణేష్, కేశవ, రమణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం వినూత్న నిరసన -
ప్రహ్లాద సమేత నారసింహుడు ఇక్కడే...
కదిరి: నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి అర్చక పండితులు చెబుతున్నారు. సైన్స్కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన అనంతరం మూలవిరాట్ నుంచి స్వేద బిందువులు బయటకు వస్తుంటాయి. వస్త్రంతో ఆ స్వేదాన్ని తుడిచినా మళ్లీ వస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పడానికే ఇలా స్వేద బిందువులు వస్తుంటాయని భక్తుల నమ్మకం. -
పరిటాల పేరు చెప్పి రూ.లక్షలు దోచేశాడు
పుట్టపర్తి టౌన్: రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేరు చెప్పి రూ.లక్షలు దోచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్నకు బాధితుడు లాలూనాయక్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి తన ఫిర్యాదును అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘మాది ముదిగుబ్బ మండలం పూజారి తండా. నా పేరు రమావత్ లాలూనాయక్. చదువులు పూర్తి చేసుకున్న నా కుమారుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నాతో పరిచయమున్న ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకటనారాయణ ఓ రోజు నన్ను కలసి నా కుమారుడి ఉద్యోగం గురించి అడిగాడు. చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఏ ఒక్కటీ దొరకలేదని అన్నా. అయితే తనకు పరిటాల శ్రీరామ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, శ్రీరామ్కు చెప్పి అనంతపురంలోని కలెక్టరేట్లో నీ కుమారుడికి కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇప్పిస్తానని అన్నాడు. మొదట నేను నమ్మలేదు. అయితే తన మాట శ్రీరామ్ జవదాటడంటూ నమ్మబలికాడు. ఉద్యోగం కావాలంటే రూ.3.50 లక్షలు ఇవ్వాలన్నాడు. దీంతో అతని మాటలు నమ్మి గత ఏడాది ఆగస్టులో రూ.3.50 లక్షలు ఇచ్చాను. నెలలు గడుస్తున్నా ఉద్యోగం కల్పించే విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా ఇదిగో... అదిగో అంటూ చెబుతూ వచ్చాడు. రెండు రోజుల క్రితం గట్టిగా నిలదీశా. ఉద్యోగం లేదు.... గిద్యోగం లేదు. డబ్బు కూడా వెనక్కు ఇవ్వను. నీ దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకో. ఎక్కువ మాట్లాడితే అధికారంలో ఉన్నాం. పోలీసులకు చెప్పి నీ మీదే కేసు పెట్టిస్తా. కాదూకూడదంటావా శ్రీరామ్తో చెప్పి నిన్ను చంపిస్తా అంటూ బెదిరించాడు. అయ్యా.. నేను పేదోడిని నాకు న్యాయం చేయాలని ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నా. మేడమ్ స్పందించి న్యాయం చేస్తానని మాటిచ్చారు’ అంటూ వివరించాడు. 50 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 50 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, విజయ్కుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు ఉద్యోగ కల్పన పేరుతో ఘరానా మోసం ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి : ఎస్పీ -
వలంటీర్లను మోసగించిన బాబు
పరిగి: తాము అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగించడంతో పాటూ వారికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు... చివరకు అధికారం చేపట్టిన తర్వాత 2.50 లక్షల మంది వలంటీర్లను తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. పరిగి మండలం అక్కంపల్లిలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని సిద్ధింపజేశారన్నారు. మూడున్నర లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వలంటీర్ల ద్వారా సంక్షేమ ఫలాలను అత్యంత పారదర్శకంగా అందజేశారన్నారు. అలాంటి వ్యవస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేసి, కేవలం కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వలెంటీర్లు రోడ్డెక్కి ధర్నా చేసినప్పటికీ కూటమి సర్కార్లో చలనం లేకపోవడం మోసానికి ప్రతిరూపంగా నిలిచిందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్న చంద్రబాబు... నేడు తల్లులనూ దగా చేశారన్నారు. డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతీయువకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
అమరజీవి సేవలు చిరస్మరణీయం
ప్రశాంతి నిలయం: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జేసీ తొలుత పొట్టిశ్రీరాములు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు నేటి యువతకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏఓ వెంకటనారాయణ, పర్యాటక శాఖ మేనేజర్ ప్రతాప్రెడ్డి, కలెక్టరేట్లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం పుట్టపర్తి టౌన్: త్యాగమూర్తి, నిరాడంబరుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ మహేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులూ.. విజయీభవ!
పుట్టపర్తి: విద్యార్థుల జీవితంలో తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాసే రోజు రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 104 పరీక్ష కేంద్రాల్లో 23,730 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలుంటాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో మౌలి వసతులు కల్పించారు. విద్యార్థులకు ఏచిన్న ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, ఫర్నీచరు, విద్యుత్ సదుపాయం అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా అధికారులు దృష్టి సారించారు. గంట ముందుగానే చేరుకోవాలి.. తొలిరోజు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా వచ్చి హాల్టికెట్ నంబరు ఆధారంగా ఏ గది ఎక్కడుందో చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. హాల్టికెట్ చూపిస్తే చాలు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చే సమయం, వాటిని ఓపెన్ చూసి విద్యార్థులకు అందజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మీడియంను ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత ప్రశ్నపత్రం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం తారుమారైనా విద్యార్థులు నష్టపోతారనే విషయాన్ని ఇన్విజిలేటర్లు గుర్తు పెట్టువాలని చెబుతున్నారు. పేపర్ లీక్ చేస్తే అడ్డంగా బుక్ అవుతారని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల్లోకి సిబ్బంది కోసం టీ, కాఫీ బయట నుంచి తీసుకురాకూడదు. పొరబాటున ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా అందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారి, ఎంఈఓలను బాధ్యులను చేస్తారు. పటిష్ట బందోబస్తు పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, సెల్ఫోన్ షాపులు తెరిచి ఉంచరాదని ఎస్పీ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద గుంపులుగా ఉండరాదని, 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నేటి నుంచి పదో తరగతి పరీక్షలు పరీక్షలు రాయనున్న 23,730 మంది విద్యార్థులు సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు -
రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం
ముదిగుబ్బ: మహాకుంభ మేళా సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ప్యాసింజర్ రైళ్ల కోసం ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా గుంతకల్లు– తిరుపతి– గుంతకల్లు (రైలు నంబర్ 57403–57404), తిరుపతి –కదిరిదేవరపల్లి– తిరుపతి (57405–57406), తిరుపతి–హుబ్లీ– తిరుపతి (57401–57402) ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. మహాకుంభ మేళా సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను రెండు నెలలపాటు రద్దు చేసి.. ప్రయాగరాజ్ వైపు మళ్లించారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తేదీకి రైళ్లు నడపలేదు. ఏడో తేదీ నుంచి నడుస్తాయని చెప్పారు. అదీ వాయిదా పడింది. ప్యాసింజర్ రైళ్లు తిరిగి పట్టాలు ఎప్పుడు ఎక్కుతాయా అని ముదిగుబ్బ స్టేషన్ నుంచి ప్రయాణించే ఉద్యోగులు, సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రైలు టికెట్ ధర అతి తక్కువగా ఉంది. తిరుమలకు రోజూ ముదిగుబ్బ నుంచి వందలాది మంది భక్తులు వెళ్లే వారు. అనారోగ్యంతో ఉన్న వారు తిరుపతిలోని పలు ఆస్పత్రులకు చికిత్సల కోసం వెళ్తుంటారు. అంతే కాకుండా అనంతపురం, ధర్మవరం నుంచి వచ్చే ఉద్యోగులకు కూడా ఈ ప్యాసింజర్ రైళ్లు అనుకూలంగా ఉండేవి. టికెట్ ధర తక్కువగా ఉండడంతో బస్సుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు కాదు. ముదిగుబ్బ నుంచి తిరుపతికి వెళ్లాలంటే ప్యాసింజర్ రైళ్లలో టికెట్ ధర రూ.50 మాత్రమే. అదే బస్సులో ప్రయాణిస్తే రూ.300కు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. బస్సులో అయితే ప్రయాణం కూడా సౌకర్యంగా ఉండదు. మధ్య తరగతి ప్రజల కోసం ప్యాసింజర్ రైలులో రెండు స్లీపర్ బోగీలు ఉంటాయి. హుబ్లీ తిరుపతి ప్యాసింజర్ రైలులో ఒక స్లీపర్ బోగీ ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు చాలామంది వీటిలో రెండు నెలల ముందే బుక్ చేసుకొని వారు ప్రయాణాలు కొనసాగించేవారు. రెండు నెలలు దాటినా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి నడపపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ముదిగుబ్బ నుంచి తిరుపతికి ప్యాసింజర్లో వెళ్లే రైలు టిక్కెట్ ధరలు ఈ విధంగా వున్నాయి. జనరల్ టికెట్ ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.50 అదే విధంగా స్లీపర్ టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.120. గతంలో ఇదే రిజర్వేషన్ టికెట్ రూ.330 ఉండేది. అలాగే సిట్టింగ్ టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.65. ఇదే టికెట్ ధర గతంలో రూ.120 ఉండేది. ముదిగుబ్బలో నిలిచిన ప్యాసింజర్ రైలు (ఫైల్) మహాకుంభమేళా సమయంలో ఆరు ప్యాసింజర్ రైళ్లు రద్దు పునరుద్ధరణపై రైల్వే శాఖఅధికారుల తాత్సారం ప్రయాణికులకు తప్పని అవస్థలుభారీగా తగ్గిన రైలు చార్జీలు 30 నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రజల సౌకర్యార్థం రైల్వే శాఖ వారు ప్యాసింజర్ రైలు టికెట్ ధరలు భారీగా తగ్గించారు. మార్చి 30 నుంచి రద్దయిన ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. ముదిగుబ్బ నుంచి తిరుపతికి గతంలో రూ.330 ఉన్న స్లీపర్ టికెట్ ధర ప్రస్తుతం రూ.120కి తగ్గించారు. సిట్టింగ్ టికెట్ ధర గతంలో రూ.120 ఉండగా ఇప్పుడది రూ.65కు తగ్గింది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. నాగభూషణం రైల్వే స్టేషన్ మాస్టర్, ముదిగుబ్బ తక్కువ టికెట్ ధరతోనే సురక్షితంగా గమ్యస్థానం చేర్చే ప్యాసింజర్ రైళ్లు పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు తిరుపతి వరకు వెళ్లాలన్నా ఈ ప్యాసింజర్ రైళ్లు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. అలాంటి రైళ్లను మహాకుంభమేళా కోసం మళ్లించారు. మహాకుంభ మేళా ముగిసి మూడు వారాలవుతున్నా ఇంతవరకూ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.రైళ్ల రద్దు కారణంగా తిరుమలకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. బస్సులో వెళ్లాలంటే చార్జీలు ఎక్కువ. అదే రైలు టికెట్ ధర చాలా తక్కువగా ఉంది. మాలాంటి మధ్యతరగతి ప్రజల కోసం రైళ్లు పునరుద్ధరించాలని కోరుతున్నాం. – వెంకటరెడ్డి, ముదిగుబ్బ తక్కువ ధరకే సౌకర్యమైన ప్రయాణం -
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీవారు పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై విహరించారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగి ఉండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం మోహినీ ఉత్సవం నిర్వహించనున్నారు. నృసింహుని సన్నిధిలో కలెక్టర్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ చేతన్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కలెక్టర్కు ఈఓ శ్రీనివాసరెడ్డి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రథోత్సవానికి ఏర్పాట్లు ఈ నెల 20న నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రథానికి కప్పిన రేకులు తొలగించి అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో నీటితో శుభ్రం చేశారు. రథం లాగేందుకు మోకులు, తెడ్లు సిద్ధం చేస్తున్నారు. -
కొండవీడు బండి... కదలదండీ
● రైలు వేళల్లో మార్పులతో అవస్థలు సాక్షి, పుట్టపర్తి యశవంతపుర – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పుల కారణంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెనుకొండ నుంచి ధర్మవరం చేరేందుకు మధ్యలో పుట్టపర్తిలో మాత్రమే స్టాప్ ఉంటుంది. ఆ స్టేషన్ల మధ్య ప్రయాణం గంట కూడా పట్టదు. అయితే వేళల్లో మార్పులతో కొండవీడు ఎక్స్ప్రెస్ పెనుకొండ నుంచి ధర్మవరం చేరాలంటే మూడున్నర గంటలు పడుతోంది. కాగా ఆ సమయంలో రైలు బండి ఎక్కడ హాల్ట్ చేస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఒకరోజు పెనుకొండలో.. మరోసారి పుట్టపర్తిలో.. ఇంకోసారి బసంపల్లిలో గంటల తరబడి హాల్ట్ చేస్తున్నారు. దీంతో రైలు ఎక్కిన వాళ్లు.. ఇబ్బందులు పడినా.. ఎక్కాల్సిన వారు తికమక పడుతున్నారు. స్టేషన్కు ఎంతసేపటికి వస్తుందో.. అర్థం కాక ముందే వచ్చి.. వేచి చూసి విసిగి చెంది వెనక్కి వెళ్లి.. ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. మూడు రోజులూ.. ముచ్చెమటలు వారంలో మూడు (మంగళ, గురు, శనివారం) రోజుల పాటు యశవంతపుర – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్ప్రెస్ (17212) రైలు రెండు గంటల ముందే నడుస్తోంది. అయితే యశవంతపుర నుంచి ధర్మవరం వరకు మాత్రమే టైమింగ్ మారింది. ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు పాత టైం ప్రకారమే నడుస్తోంది. దీంతో యశవంతపురం నుంచి యలహంక, హిందూపురం, పెనుకొండ వరకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత నారాయణపురం, పుట్టపర్తి, బసంపల్లి వరకు రోజుకో చోట.. గంటల తరబడి హాల్ట్ చేస్తున్నారు. దీంతో పుట్టపర్తిలో ఎక్కాల్సిన వారు అవస్థలు పడుతున్నారు. చాలా ఇబ్బంది పడ్డాను కొండవీడు రైలు ఇంతకుముందు సరైన సమయానికే నడిచేది. ఉన్నఫలంగా టైమింగ్ మార్చారు. దీంతో రెండు రోజుల క్రితం పుట్టపర్తిలో గంటన్నర సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆన్లైన్లో చూస్తే పెనుకొండకు మూడు గంటలకే చేరింది. వెంటనే 3.20 గంటలకు పుట్టపర్తి రైల్వే స్టేషన్ చేరుకున్నా. అయితే రైలు మాత్రం 4.50 గంటలకు వచ్చింది. – బాబయ్య, ఉపాధ్యాయుడు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా విన్నవించుకోవాలని సూచించారు. నేడు ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. అమ్మూ... ఇక నేను బతకలేనమ్మా! ● బేకరీ షాపు నిర్వహకుడు ఆత్మహత్య బత్తలపల్లి: బేకరీ వ్యాపారం సరిగా జరగకపోవడంతో కుమార్తె వివాహం, కుమారుడి చదువుకు డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక షాపు నిర్వాహకుడు సతమతమయ్యాడు. రోజూ ఇదే ఆలోచనలు చేసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘అమ్మూ.. ఇక నేను బతకలేనమ్మా’ అంటూ చెప్పి ఉరివేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కేరళకు చెందిన పరంబత్ జయప్రకాష్ (55) 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి వలస వచ్చాడు. తొలుత ఓ బేకరీలో పనిచేసేవాడు. తర్వాత కదిరి రోడ్డులో సొంతంగా ‘మైసూర్ బేకరీ’ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీకళ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి జపాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కుమార్తె రిన్షా, బెంగళూరులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న కుమారుడు రోహన్ ఉన్నారు. అయితే కొంత కాలంగా వ్యాపారం సరిగా జరగడం లేదు. దీనికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణం తొలగిస్తారని ఆందోళనకు గురయ్యేవాడు. ఈ విషయమై భార్యతో అమ్మూ(రిన్షా) వివాహం ఎలా చేయాలి, అప్పూ (రోహన్) చదువులకు డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థం కాలేదని చెబుతూ మదనపడుతుండేవాడు. ఎప్పటికప్పుడు భార్య ధైర్యం చెప్తూ వస్తోంది. బెంగళూరులో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి భార్య లక్ష్మీకళ శనివారం వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న జయప్రకాష్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూతురుకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతానమ్మా.. ఇక బతకను’ చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే కూతురు బెంగళూరులో ఉన్న తల్లికి విషయం చెప్పింది. బత్తలపల్లిలోని ఇంటి సమీపంలో ఉన్న సాంబశివుడు(హోటల్ శివ)కు లక్ష్మీకళ ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. శివ వెళ్లి చూసేసరికి జయప్రకాష్ బేకరీ షెడ్లో ఉరికివేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. అనంతరం కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్ల వల● రూ.50 వేలు పోగొట్టుకున్న లైన్మెన్ ధర్మవరం అర్బన్: విద్యుత్ శాఖ లైన్మెన్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారి పేరు చెప్పి లైన్మెన్ నుంచి రూ.50 వేలు దండుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఏఈ నాగభూషణంకు శనివారం అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ ఆఫీస్లో సీనియర్ ఉద్యోగి పేరు చెప్పాలని అడిగితే లైన్మెన్ నాగరాజు పేరును ఏఈ చెప్పారు. వెంటనే లైన్మెన్ను కాన్ఫరెన్స్లోకి తీసుకున్నారు. ‘మీరు చాలా అక్రమాలకు పాల్పడ్డారని మాకు ఫిర్యాదు వచ్చింది. మీపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తాం’ అని లైన్మెన్కు చెప్పారు. ఇప్పుడు తాను ఏమి చేయాలి సార్ అని లైన్మెన్ అడిగితే ‘మాకు రూ.5 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తా’ అని అటువైపు వ్యక్తి లంచం అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని ఏఈ తెలపడంతో చివరకు రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వెంటనే ఫోన్పేలో రూ.50 వేలు వేయించుకున్నారు. ఎవరికీ చెప్పకుండా 2 గంటల వ్యవధిలోపు మిగిలిన డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని సదరు వ్యక్తి బెదిరించారు. ఇదేదో సైబర్ నేరగాళ్ల పని అని అనుమానం రావడంతో వెంటనే వన్టౌన్ పోలీసులను సంప్రదించి, ఫిర్యాదు చేశారు. -
కటకటాల్లోకి కీచక ప్రిన్సిపాల్
కదిరి టౌన్: హోలీ సందర్భంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటపతి కటకటాలపాలయ్యారు. అమ్మాయిల పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్న తీరును కళాశాల సమీపంలోని మహిళలు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. మహిళా కానిస్టేబుల్ గౌసియా ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 75 కింద ప్రిన్సిపాల్పై శనివారం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం ప్రిన్సిపాల్ వెంకటపతిని హిందూపురం రోడ్డు కోనేరు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితునికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతడిని సబ్జైలుకు తరలించినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. -
నియామకాల్లో నిర్లక్ష్యంపై కొరడా
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కొరడా ఝళిపించారు. ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇన్విజిలేషన్ డ్యూటీల కేటాయింపుల్లో గందరగోళం, అంధులు, పక్షవాత బాధితులు, దివ్యాంగ టీచర్లు, చివరకు రిటైర్డ్ అయిన వారినీ విధులకు కేటాయించిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ‘పది పరీక్షల నిర్వహణలో గందరగోళం’, ‘పదింతల నిర్లక్ష్యం’ కథనాలు విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. సామాజిక మాద్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. ప్రాథమిక విద్య కమిషనర్, కలెక్టర్ కూడా స్పందించారు. ఈ క్రమంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి, సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కారణంగా భావిస్తున్న కీలక అధికారిపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది. ‘టిస్’ ఉన్నా అలసత్వం.. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ద్వారా ఇటీవల ఉపాధ్యాయుల పూర్తి వివరాలు సేకరించారు. ఏ స్కూల్లో ఏ టీచరు పని చేస్తున్నాడు... పేరు, వయసు, పుట్టిన రోజు, పీహెచ్ కేటగిరీ తదితర వివరాలున్నాయి. ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయిన వారి వివరాలు కూడా ఇందులో అప్డేట్ అయ్యాయి. ఈ వివరాలన్నీ డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పక్క గదిలోనే లభిస్తాయి. అయినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే పరీక్షల నిర్వహణ విభాగం అదికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఎంఈఓలు, హెచ్ఎంలకు పంపి ఉంటే... 10–15 రోజుల ముందే ఎంఈఓల ద్వారా ప్రధానోపాధ్యాయులకు జాబితాలు పంపి రిమార్కులు అడిగి ఉంటే కూడా చాలా వరకు తప్పిదాలకు అవకాశం ఉండేదికాదు. అలా చేయకుండా కేవలం పరీక్షల విభాగం ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలు అనేకమంది టీచర్లను ఇక్కట్లు పాలు చేశాయి. ఈ క్రమంలోనే అంధులు, పక్షవాత బాధితులు, చంటిపిల్లల తల్లులు, బాలింతలు, దివ్యాంగ టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, మెడికల్ లీవ్లో ఉన్న వారినీ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఇలాంటి వారే 200 మంది దాకా ఉన్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల చీఫ్లకు అందజేసి చేతులు దులుపుకోవడం వల్ల సమాచార లోపించి ఆర్డర్లు జారీ చేసి రెండు రోజులు దాటినా 40 శాతానికి మందికి పైగా ఉత్తర్వులు అందజేలేదు. ఈ విషయంపైనా ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీల్లో అవకతవకలపై ఆర్జేడీ చర్యలు ఐదుగురికి షోకాజ్ నోటీసులు తీవ్ర చర్చనీయాంశమైన ‘సాక్షి’ వరుస కథనాలు -
అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిపై అనుమానాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వద్దతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ యోజితా సాహో (27) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీకేఎస్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్పూర్ జిల్లా దుర్గ్ గ్రామానికి చెందిన యోజిత సాహో బుక్కరాయసముద్రంలోని తాను నివాసముంటున్న అద్దె గృహంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాయ్పూర్ నుంచి ఆదివారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. అనంతరం ఆమె అద్దెకున్న ఇంటిని పరిశీలించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఈ సందర్భంగా వారు పోలీసులకు తెలిపారు. కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీకేఎస్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఐ ఫోన్, లాప్టాప్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో యోజితా మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలివెళ్లారు. అరటి తోట దగ్ధం బెళుగుప్ప: అగ్ని ప్రమాదంలో అరటి తోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన రైతు నరసింహులు తనకున్న ఆరు ఎకరాల్లో అరటి పంట సాగు చేపట్టాడు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. ఆదివారం ఉదయం తోట వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 2.5 ఎకరాల్లోని డ్రిప్ పరికరాలతో పాటు అరటి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. దాదాపు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్టినల్లు బాధిత రైతు వాపోయాడు. ప్రైవేట్ స్కూల్ టీచర్ దుర్మరణం ధర్మవరం: మండలంలోని చిగిచెర్ల వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచరు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... ధర్మవరంలోని మార్కెట్ వీధిలో నివాసముంటున్న బోయ నారాయణస్వామి (54) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు. వ్యక్తిగత పనిపై తన స్నేహితుడు సాంబశివుడుతో కలసి ధర్మవరం నుంచి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరిన ఆయన... మార్గమధ్యంలో చిగిచెర్ల దాటగానే ఓబిరెడ్డి తోట మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ను గమనించక వేగంగా దూసుకెళ్లారు. ఘటనలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. కల్వర్టు వద్ద లోతైన గుంతలో పడిన నారాయణస్వామి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంపై వెనుక కూర్చొన్న సాంబశివుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఖాళీ బిందెలతో నిరసన
సోమందేపల్లి: మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మాజీ సర్పంచ్ కంబాలప్ప ఆధ్వర్యంలో స్థానికులు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా ఎస్సీ, బీసీ కాలనీ వాసులకు తాగునీరు అందడం లేదన్నారు. విషయాన్ని అధికారులకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై న అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. సత్యసాయి సందేశం అనుసరణీయంప్రశాంతి నిలయం: ఆధ్యాత్మికత, సేవా మార్గం వైపు నడిపిస్తూ సత్యసాయి అందించిన సందేశం నేటి యువతకు అనుసరణీయమని సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అన్నారు. సత్యసాయి ఆధ్యాత్మిక, సేవా తత్వాలపై యువతను చైతన్యవంతులను చేసేందుకు సత్యసాయి సేవా సంస్ధల ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ సత్యసాయి వాహిని సుధామృత కోర్సును పూర్తి చేసిన వారికి ఆదివారం సర్టిపికెట్లను అందజేశారు. ఆన్లైన్ ద్వారా ఈ కోర్సును దేశీయంగా 750 మందికి పైగా అభ్యసించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆదివారం ఉదయం యజూర్ మందిరం నుంచి ర్యాలీగా సత్యసాయి సందేశాలను ప్రదర్శిస్తూ మహాసమాధి చెంతకు చేరుకున్నారు. ఆర్.జె రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి సేవా సంస్ధల ద్వారా యువతను చైతన్యవంతులను చేసేందుకు పలు కోర్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘రాజా’కు ఘన వీడ్కోలు గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్నగర్లోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● మంత్రి సవిత పెనుకొండ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ మార్కెట్యార్డ్లో ఆదివారం జిల్లా రచయితల సంఘం, త్రిపురా రిసార్ట్, ఎంక్యూయూఏ, ఘనగిరి లలిత కళాపరిషత్, బహుజన చైతన్య వేదిక తదితర సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సభా అధ్యక్షుడిగా జాబిలి చాంద్బాషా, సమన్వయకర్తగా ఉద్దండం చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రతి కుటుంబం అభ్యున్నతి వెనుక మహిళ పాత్ర ఎంతో కీలకమన్నారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. బాల్య వివాహాలు లేకుండా చూడాలని కోరారు. పెనుకొండలో షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎస్పీ రత్న, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు శిల్ప అనుపాటి తదితరులు మాట్లాడుతూ.. విద్యతోనే మహిళల జీవితం ఉన్నతంగా ఉంటుందన్నారు. అనంతరం మంత్రికి పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురికి మహిళా శిరోమణి పురస్కారాలను మంత్రి అందజేసి సత్కరించారు. సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రామ్మూర్తినాయుడు, శ్రీరాంయాదవ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, సంస్థల నాయకులు గోపీనాథ్, ఖలీముల్లా, టిప్పు సుల్తాన్ సంస్థ ఉమర్ఫారూక్ఖాన్, పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కామాంధుడి బారి నుంచి తనను తాను కాపాడుకునే క్రమంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా... అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు, జీవితంపై విరక్తితో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ● నార్పల: లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నార్పలలోని సుల్తాన్పేట కాలనీకి చెందిన కవిత(26), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్న వెంకటశివ శనివారం రాత్రి గ్రామ శివారులో విడిచిన గొర్రెల వద్దకు కాపలాకు వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన అదే కాలనీకి చెందిన యువకుడు బండి లక్ష్మీనారాయణ... ఇంట్లోకి చొరబడి కవితాపై అత్యాచార యత్నం చేశాడు. ఆ సమయంలో కేకలు వేస్తూ అతని బారి నుంచి బయటపడిన ఆమె... లోపలి గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అదే సమయంలో తలుపులు బద్ధలుగొట్టేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించడంతో దిక్కుతోచని స్థితిలో కవిత ఉరి వేసుకుంది. ఇంతలో శబ్ధాలకు చుట్టుపక్కల వారు.నిద్ర లేచి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి లక్ష్మీనారాయణ పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించిన స్థానికులు అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కవితను గమనించి సమాచారం ఇవ్వడంతో వెంకటశివ అక్కడకు చేరుకుని బోరున విలపించాడు. రెండేళ్లుగా కవితను బండి లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే కవితను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడంటూ తల్లి నాగసుబ్బమ్మ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ కౌలుట్లయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● పెద్దవడుగూరు: మండలంలోని గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన రైతు తలారి రాము(43) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న రాము... మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులకు వడ్డీల భారం పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతున్న రాము... ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ● కూడేరు: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం కలగళ్లకు చెందిన అమర్నాథ్(28) మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లోకి చేరుకుని తలుపులు వేసుకుని నిద్రించాడు. ఇంటి బయట నిద్రించిన తండ్రి కొండయ్య ఆదివారం ఉదయం లేచి తలుపులు తీయాలని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కంబాలరాయుడే కాటమరాయుడు
కదిరి: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహా విష్ణువు వివిధ రూపాల్లో సాక్షాత్కరించారు. ఇందులో ఒకటి నారసింహుడు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన హిరణ్య కశ్యపుడిని అంతమొందించేందుకు సగం మనిషి, సగం సింహ రూపంలో అవతరించిన నారసింహుడుని కంబాల రాయుడు అని కూడా భక్తులు పిలుస్తుంటారు. కంబం అంటే స్తంభం. స్తంభం నుంచి ఉగ్రరూపంతో భువిపైకి వచ్చిన నారసింహుడు.. హిరణ్య కశ్యపుడిని అంతమొందించిన తర్వాత గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై అవతరించారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఇందుకు అక్కడి కొండపై స్వామి పాదాలు వెలిసినట్లు పురాణాలు సైతం చెబుతున్నాయి. ఇదే కొండపై శ్వేద తీర్థం, శిద్దుల దొన ఉన్నాయి. ఎన్ని కరువు కాటకాలొచ్చినా నీరు ఇంకి పోకుండా ఉండడం ఈ దొనల ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. వారు తమ ఇలవేల్పుగా లక్ష్మీనరసింహస్వామి కొలిచేవారు. అందుకే వీరి కుటుంబీకులు కదిరి ప్రాంతంలో ఎంతోమంది కంబన్న, కంబాలమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు గొడ్డువెలగల నుంచి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తుంటారు. -
మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేలాది తాగునీటి సరఫరా పైపులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.68 కోట్లతో మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని ఏఐఐబీ (ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ స్కీం) కింద తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం ట్యాంకుల నుంచి పైప్లైన్లు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన వేలాది ప్లాస్టిక్ పైపులు, ఇతర సామగ్రిని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఓ రేకుల షెడ్లో నిల్వ ఉంచారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా మార్కెట్ యార్డులో మంటలు చెలరేగాయి. మార్కెట్ యార్డులోని రేకుల షెడ్లో నిల్వ ఉంచిన పైపులకు కూడా మంటలు వ్యాపించాయి. మార్కెట్ యార్డును పూర్తిగా పొగకమ్మేసింది. విషయం తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ ఉదయపావని, మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, తహసీల్దార్ కరుణాకర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు. అగ్నిమాపక శాఖ అధికారులు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మార్కెట్ యార్డులో తాగునీటి పైపుల దగ్ధం రూ.కోట్లలో ఆస్తినష్టం -
కరువు, రైతు ఆత్మహత్యలకు కారకులెవరు?
హిందూపురం: రాయలసీమలో నిత్య కరువులు, వలసలు, రైతు ఆత్మహత్యలకు కారకులెవరని జలసాధన సమితి సభ్యులు ప్రశ్నించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ లైనింగ్ పనులు రద్దుచేసి కాలువ వెడల్పు చేయాలని కోరుతూ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం హిందూపురంలోని ఇందిరా పార్కు కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద జలసాధన సమితి నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ చేతన్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జలసాధన సమితి గౌరవాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదన్నారు. కొన్ని చెరువులు మాత్రమే నీరు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. వాస్తవంగా విడుదల అవుతున్న 27 టీఎంసీలు నీటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 24 టీఎంసీలు వచ్చాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 2,500 చెరువులు ఉండగా.. 89 చెరువులకు మాత్రమే నీరు ఇస్తున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి వంద టీఎంసీలను ఎత్తిపోతలతో కొత్త ఆయకట్టుకు నీరు ఇస్తే ఉమ్మడి జిల్లాలకు విస్తృత ప్రయోజనాలు ఉంటాయన్నారు. అలాకాకుండా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్ చేయటం వల్ల ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి, జలసాధన సమితి నాయకులు ఫరూక్, జమీల్, అమానుల్లా, దాసరి హరి, సీఐటీయూ నాయకులు రాము, పర్యావరణవేత్త భాస్కర్రెడ్డి, ఎస్యూసీఐ నాయకులు గిరీష్, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ కాటు.. చేటు!
ధర్మవరం: ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వాలు నిషేధించాయి. కానీ జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రి విక్రయాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. ఇందులో ధర్మవరం మున్సిపాలిటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. దీంతో రోడ్డు ప్రక్కన, డ్రైనేజీలలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణానికి చెందన కొందరు వ్యాపారులు జిల్లాలోని పలు ప్రాంతాలకూ ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనలు బేఖాతర్ 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్లాస్టిక్ కవర్లు గానీ, వస్తువులు గానీ ఎక్కడా కూడా విక్రయించ కూడదు. కానీ మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించకపోవడంతో పట్టణంలోని వ్యాపారులు, చిరు వ్యాపారులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఎగుమతులకు అడ్డాగా ధర్మవరం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కంపెనీల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని నిషేధిక ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రిని భారీగా నిల్వ చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని పీఆర్టీ సర్కిల్, అంజుమన్ సర్కిల్, కాలేజ్ సర్కిల్లో ముగ్గురు వ్యాపారులు నిషేధిక ప్లాస్టిక్ కవర్లను కదిరి, హిందూపురం, పెనుగొండ, మడకశిర, రాప్తాడులకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను కిలో రూ.130 చొప్పున అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ముడుపులు ప్లాస్టిక్ హోల్సేల్ వ్యాపారులు మున్సిపాలిటిలోని కొందరు అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టజెపుతూ ప్లాస్టిక్ విక్రయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అందువల్లే అధికారులు కూడా సదరు వ్యాపారుల గోడౌన్లు, దుకాణాల వైపు చూడటం లేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే హడావుడి చేస్తారు. తోపుడు బండ్ల వ్యాపారులు, కిరాణా షాపు యజమానులకు జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. దీంతో ప్రజారోగ్యం, పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో వాటిని తిని మూగ జీవాలు మృతి చెందుతున్నాయి. పూలు, పండ్లతో పాటు ఏ చిన్నపాటి వస్తువు కొన్నా ప్లాస్టిక్ కవర్లలో చుట్టివ్వడం సాధారణమైంది. దీనికి తోడు ఇప్పుడు ఇడ్లీ వేసేందుకూ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. వేడీ వేడి సాంబార్ను, టీని సైతం ప్లాస్టిక్ కవర్లో పార్శిల్ చేస్తున్నారు. ఇలా విచ్చల విడిగా ప్లాస్టిక్ వాడటం వల్ల అటు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అందువల్లే ప్రభుత్వాలు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించాయి. కానీ ధర్మవరంలో మాత్రం ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గలేదు. పైగా ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రి ఎగుమతి అవుతోంది. ప్లాస్టిక్ కూపంగా ధర్మవరం యథేచ్ఛగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం కీలకంగా మారిన ముగ్గురు వ్యాపారులు ఇతర ప్రాంతాలకూ ‘ప్లాస్టిక్’ సరఫరా కట్టడి చేయడంలో వ ుున్సిపల్ అధికారులు విఫలం దెబ్బతింటున్న పర్యావరణం, ప్రజారోగ్యం -
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్లాస్టిక్ను విక్రయించే బడా వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా ప్లాస్టిక్ నివారణ సాధ్యమవుతుంది. అలాకాకుండా చిరు వ్యాపారులకు జరిమానా విధించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మున్సిపాలిటిలో విపరీతంగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. –చందమూరి నారాయణరెడ్డి, 37వ వార్డు కౌన్సిలర్, ధర్మవరం చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్ కట్టడి కోసం కృషి చేస్తున్నాం. ప్రజల్లోనూ అవగాహన పెంపొందిస్తున్నాం. ప్లాస్టిక్ను విక్రయించే వ్యాపారులు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు చేపడతాం. –ప్రమోద్కుమార్, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం -
చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్
● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి: ‘‘నేనూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నా. చదువుకుంటేనే పది మంది మనల్ని గౌరవిస్తారు. మంచి భవిష్యత్ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం వీడకండి. ఏదైనా కష్టం వస్తే తెలపండి. పరిష్కారానికి చర్యలు తీసుకుంటా’’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విద్యార్థులకు సూచించారు. అహర్నిశలు శ్రమిస్తూ లక్ష్యం దిశగా అడుగులేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థినుల సౌకర్యార్థం రూ.2 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ బాలికల వసతి గృహాన్ని నిర్మించారు. శనివారం మంత్రి సత్యకుమార్ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వసతి గృహంలోని గదులు, సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థినుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ నరసింహనాయుడు, జెడ్పీటీసీ సుధ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ప్రారంభం ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమల క్రాస్ యనుములవారిపల్లి దగ్గర శనివారం హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివివధ సమస్యలపై ప్రజల మంత్రికి అర్జీల సమర్పించారు. వాటిని స్వీకరించిన మంత్రి... వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరావు, ఎంపీపీ ఆదినారాయణ, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. కదిరి: ఖాద్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. భక్తుల గోవింద నామస్మరణతో ఖాద్రీ క్షేత్రం మార్మోగిపోతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా శేష వాహనంపై తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. వైకుంఠంలో స్వామి నిత్యం పవళించి ఉండే శేషతల్పం ఆ స్వామితో పాటే భువికి దిగి వచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవాల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిస్తున్నారని వారి నమ్మకం. ‘శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి’ అని అర్చక పండితులు పేర్కొన్నారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే సర్పదోషం పోతుందని భక్తుల నమ్మకం. ఉత్సవ ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే భక్తుల కోసం ఆలయంలో ఉదయం నుంచి రాత్రి 11 వరకూ నిత్యన్నదానం కొనసాగుతోంది. నేడు సూర్య, చంద్రప్రభ వాహనాల్లో విహారం పుట్టడం, జీవించడం, మరణించడం అనే మూడు ప్రక్రియలు కాలాఽధీనాలు. కాల స్వరూపుడిని తానేనంటూ భక్తులకు చాటి చెప్పేందుకు శ్రీవారు ఆదివారం పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్న కదిరి -
నీరు తరగని పాలబావి
కదిరి: ముత్యాలచెరువుకు సమీపంలో పాలబావి ఉంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తురాలైన కర్ణాటకకు చెందిన సాసవుల చిన్నమ్మ దీన్ని రాత్రికి రాత్రి తవ్వించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ బావిని కొంత లోతు తవ్విన తర్వాత కింద నుంచి కోడికూతతో పాటు రోకలితో ధాన్యం దంచుతున్న శభ్దం వినబడింది. ఈ విషయాన్ని వారు సాసవుల చిన్నమ్మకు చెప్పడంతో కింద మరో లోకం ఉందని భావించి తవ్వడం ఆపేశారు. తర్వాత వచ్చే వేసవికి ఆ బావి పొంగి ప్రవహించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఆ నీరు పాలవలె ఉండటం మరింత నివ్వెర పరిచింది. అప్పుడు ఈ ప్రాంత వాసులు సాసవుల చిన్నమ్మ భక్తిని మరింత మెచ్చుకున్నారు. ఎంతటి కరువు కాటకాలొచ్చినా ఈ పాలబావిలో మాత్రం నీళ్లు తగ్గవు. ఈ నీటిని నరసింహస్వామి భక్తులు పవిత్ర తీర్థంగా భావిస్తారు. శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ దక్షిణ గోపురాన్ని కూడా సాసవుల చిన్నమ్మే నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కర్ణాటకకు చెందిన భక్తులందరూ ఈ పాలబావిని చూసి వెళతారు. కాగా క్షీర కేతుడనే రాజు పుత్ర సంతానం కోసం ఈ పాలబావిలో స్నానమాచరించి తర్వాత నారసింహుని దర్శించుకున్నారని, అందుకే క్షీరతీర్థమని పిలుస్తున్నారని మరో కథనం. పులగం వండిన గ్రామమే పులగంపల్లి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తురాలు సాసవుల చిన్నమ్మ తమ పరివారంతో కర్ణాటక నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తుండేది. దారి మధ్యలో మధ్యాహ్న సమయంలో తమ వెంట వచ్చిన వారి ఆకలి తీర్చేందుకు సాసవుల చిన్నమ్మ కదిరి–బెంగళూరు రహదారి పక్కన పులగం వండి వడ్డించడం మొదలెట్టింది. తమ వెంట వచ్చిన వారితో పాటు దారి వెంబడి వెళ్లే వారందరికీ వడ్డించినా ఆ పాత్రలోని పులగం తరగలేదు. సాసవుల చిన్నమ్మ పులగం వండిన ప్రాంతాన్ని పులగంపల్లిగా నామకరణం చేశారు. ఇప్పటికీ పులగంపల్లిగా పిలుస్తున్నారు. రాత్రికి రాత్రే తవ్వించిన సాసవుల చిన్నమ్మ -
కాళేశ్వర్ ఆశయ సాధనకు కృషి
పెనుకొండ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శివసాయి మందిరం వ్యవస్థాపకుడు, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ అధినేత సాయి కాలేశ్వర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ట్రస్ట్ నిర్వాహకురాలు శిల్ప తెలిపారు. శనివారం పెనుకొండలోని శివసాయి మందిరంలో సాయి కాళేశ్వర్ 13వ వర్ధంతి నిర్వహించారు. ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శిల్ప నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకురాలు శిల్ప సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోలీసు శాఖకు రూ.28 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. సయికాళేశ్వర్ బాటలోనే గతంలో మాదిరిగా విద్య, వైద్యం, తాగునీరు తదితర సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం కంటి ఆపరేషన్లు చేయించుకున్న వృద్ధులకు, రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెనుకొండలో నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు అవసరమని ట్రస్ట్ నిర్వాహకురాలి దృష్టికి తీసుకురాగా.. ఆమె వెంటనే స్పందించి ఆర్థికసాయం అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్, మదన్మోహన్రెడ్డి, ప్రగతి శ్రీనివాసులు, జాన్ప్రియనాథ్, నాగిరెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు ఇతర ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్: జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు శనివారం కెమిస్ట్రీ/కామర్స్/సోషియాలజీ, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ విద్యార్థులు 9,057 మందికి గాను 8,877 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 785 మందికి గాను 745 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. మొత్తంగా 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులకు ఈనెల 18, 20వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇంటర్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. శనివారం ఆమె స్థానిక మంగళకర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ వెంట రూరల్ ఎస్ఐ లింగన్న ఉన్నారు. రేపటి నుంచి ‘పది’ పరీక్షలు ● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు●● హాజరు కానున్న 2,23,730 మంది విద్యార్థులు ● జిల్లాలో 104 కేంద్రాల ఏర్పాటు పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 17వ తేదీ (సోమవారం) ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి 2,23,730 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, 104 కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈఓ కృష్ణప్ప శనివారం విలేకరులకు తెలిపారు. 17వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న గణితం, 26న ఫిజిక్స్, 28న బయాలజీ, 29న ఒకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో నీటి వసతి, ఫర్నీచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. మాస్ కాపీయింగ్, కాపీయింగ్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు. 1,400 మంది ఇన్విజిలేటర్ల నియామకం జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా...1,400 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈఓ కృష్ణప్ప వెల్లడించారు. అలాగే 104 మంది ఛీప్ సూపరింటెండెంట్లు,104 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 13 మంది అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. -
నాణ్యమైన వైద్యం అందించాలి
హిందూపురం టౌన్: నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్యులకు సూచించారు. శనివారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని సమావేశ మందిరంలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ తిపేంద్ర నాయక్, హిందూపురం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగన్న, హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్ఎంఓ డేవిడ్ రాజ్, ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.ప్రతి వైద్యుడూ సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో ఉండాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు, స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఇంకా మెరుగ్గా రోగులకు అందించాలని, వచ్చిన నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం వినియోగించుకోవాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి, మాతా శిశు మరణాలు తగ్గించడంతో పాటు ఓపీ, ఐపీ సేవలు మెరుగుపరచాలన్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలేనన్న విషయాన్ని గుర్తుంచుకుని వీలైనంత వరకూ కేసులను ఇతర ప్రాంతాలకు సిఫారసు చేయకుండా ఇక్కడే వైద్యం అందించే అందించాలని సూచించారు. అలాగే క్రిటికల్ కేర్ బ్లాకు సివిల్ వర్స్స్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, నూతన భవనాన్ని సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సమీపంలోని అన్న క్యాంటీన్ను కలెక్టర్ పరిశీలించారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి మాతా, శిశు మరణాల తగ్గింపునకు చర్యలు చేపట్టాలి ఆస్పత్రి కమిటీ సమావేశంలో కలెక్టర్ టీఎస్ చేతన్ -
అన్ని చెరువులూ నింపాల్సిందే
హంద్రీ–నీవా నీటితో హిందూపురం నియోజకవర్గంలోని 39 చెరువులనూ పూర్తిగా నింపాల్సిందే. అరకొర నీళ్లిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే ఊరుకోబోం. 10 రోజల నుంచి నీళ్లొస్తున్నాయని చెబుతున్నారు. మరి ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నింపారో ఎమ్మెల్యే బాలకృష్ణ, అధికారులు సమాదానం చెప్పాలి. ఎమ్మెల్యేకు నియోజకవర్గ రైతులపై ప్రేమ ఉంటే ఈపాటికి అన్ని చెరువులకూ నీళ్లందేలా చూసేవారు. చెరువులకు పూర్తిస్థాయిలో నీరు ఎప్పుడు వదులుతారో అధికారులు స్పష్టత ఇవ్వాలి. – టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం -
చెరువులు నిండితేనే పంటలు
చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీలో కొర్లకుంట, దేమకేతేపల్లి చెరువులకు హంద్రీ–నీవా నీరు వదులుతారు. ప్రస్తుతం కొండూరు చెరువుకు నీళ్లు వదిలారని, అయితే అవి సరిగా రావడం లేదని అంటున్నారు. అదే నిండకపోతే ఇక మా చెరువులకు నీళ్లు ఎలా వస్తాయి? బోరుబావుల్లో నీరు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. చెరువులు నిండితేనే పెట్టిన పంటలు చేతికొస్తాయి. నీళ్లు త్వరగా వదలాలి. అధికారులు, పాలకులు స్పందించాలి. – చంద్రశేఖర్రెడ్డి, రైతు, డి.గొల్లపల్లి -
లైనింగ్ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు
సోమందేపల్లి: హంద్రీ–నీవా పనులు రద్దు చేసి కాలువ వెడల్పు చేయకపోతే ఉద్యమాలు తప్పవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ తెలిపారు. శనివారం ఆయన సోమందేపల్లిలోని సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొంతమంది స్వార్ధం కోసం లైనింగ్ పనులపై ప్రభుత్వం మక్కువ చూపుతూ రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తోందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీల కన్నా అదనంగా నీరు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులకు సాగునీటిని విడుదల చేయాలన్నారు. లైనింగ్ వల్ల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల రైతులు త్రీవంగా నష్టపోతారని, ప్రభుత్వ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేష్ రాజ్గోపాల్, రంగప్ప, హనుమయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీటెక్ విద్యార్థి అదృశ్యం నల్లమాడ: ఎద్దులవాండ్లపల్లికి చెందిన లక్ష్మీకాంత్రెడ్డి అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రామ్మోహన్రెడ్డికి ఇద్దరు సంతానం. వీరు కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్రెడ్డి అనంతపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఏడో తేదీన లక్ష్మీకాంత్రెడ్డి బెంగళూరుకు వస్తున్నానని తండ్రికి ఫోన్లె చెప్పి స్వగ్రామం ఎద్దులవాండ్లపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చి అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో గాలించినా కుమారుడి ఆచూకీ కన్పించలేదు. దీంతో రామ్మోహన్రెడ్డి శనివారం నల్లమాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. త్వరలో హెచ్చెల్సీలో అత్యవసర పనులు● హెచ్చెల్సీ కాలువను పరిశీలించిన ఎస్ఈ రాజశేఖర్ బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలవ (హెచ్చెల్సీ)కి త్వరలోనే అత్యవసర పనులు ప్రారంభిస్తున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలో హెచ్చెల్సీ కాలువను పరిశీలించారు. బొమ్మనహాళ్, కృష్ణాపురం, ఉంతకల్లు, మైలాపురం, ఉద్దేహాళ్ గ్రామాల సమీపంలోని 126,105,109వ కిలోమీటర్ల వద్ద కాలువ వంతెనలను పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డంగా లేకుండా కాలువలో ఉన్న వ్యర్థాలను తొలగించాలని స్థానిక అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. అనంతరం విలేకరులతో ఎస్ఈ మాట్లాడుతూ హెచ్చెల్సీ అత్యవసర పనుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. 165 కిలోమీటర్ నుంచి 189 కిలోమీటర్ వరకు రూ.34.95 కోట్లతో పనులు జరుగుతాయని తెలిపారు. జూలై నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బొమ్మనహాళ్ మండలంలో రూ.16 కోట్లతో వంతెన, లైనింగ్ పనులు జరుగుతాయని తెలిపారు. ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేఈఈ అల్తాఫ్, హెచ్చెల్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
సెల్ఫోన్ చూడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి పరార్
● రైల్వే స్టేషన్లో గుర్తించిన పోలీసులు పెనుకొండ: పరీక్షల వేళ సెల్ఫోన్ చూడవద్దని తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఇంటినుంచి పరారయ్యాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నారాయణమ్మ కాలనీ సమీపాన నివాసముంటున్నా లికిరెడ్డి వాయునందన్రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. అయితే శుక్రవారం రాత్రి సెల్ఫోన్ చూస్తుండడంతో తండ్రి నాగార్జునరెడ్డి గమనించి గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వాయునందన్రెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. కుమారుడు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెదికిన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 11 గంటల తర్వాత ఎస్ఐ వెంకటేశ్వర్లును కలసి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ వెంటనే పోలీసు సిబ్బందితో బస్టాండ్, రైల్వేస్టేషన్, జాతీయ రహదారి, పలు హోటళ్ల వద్ద గాలింపు చేపట్టారు. చివరకు రైల్వేస్టేషన్లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, విద్యార్థిని మందలించి చక్కగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. చికిత్స పొందుతు చిన్నారి మృతిరొళ్ల: మడకశిర సమీపాన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడగార్లగుట్లకు చెందిన సన్నలింగప్ప కుమార్తె ప్రార్థన (3) శనివారం మృతి చెందింది. ఇదే ప్రమాదంలో సన్నలింగప్ప కుమారుడు గోకుల్ గాయపడి ఆస్పత్రిలో కోలుకుంటున్న విషయం విదితమే. కాగా ప్రార్థన అంత్యక్రియలు సాయంత్రం స్వగ్రామంలో పూర్తి చేశారు. గుప్తనిధి తవ్వకాల కేసులో ఐదుగురి అరెస్ట్ నల్లమాడ: గుప్త నిధి కోసం తవ్వకాలు చేపట్టిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నరేంద్రరెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో హుటాహుటిన వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. గోరంట్లకు చెందిన మారుతీకుమార్, శ్రీరాములు, నరసింహులు, హారీఫుల్లా, గోపీ అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరి నుంచి కారు, తవ్వకాలకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేశామన్నారు. చెట్టుపై నుంచి పడి కూలీ మృత్యువాతపావగడ: కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లికి చెందిన వ్యవసాయ కూలీ కెంచయ్య (42) శనివారం చింతచెట్టుపైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కెంచయ్య రోజువారీ కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం చింతకాయలు కోయడానికి సమీపంలోని పుట్రాళ్లపల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ చింతకాయలు కోసే క్రమంలో కాలుజారి చెట్టుపైనుంచి కింద పడ్డాడు. తలకు, మర్మావయవాలకు తీవ్రగాయాలవడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కెంచయ్యకు భార్య నేత్ర, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టంపై అవగాహన అవసరం..
సాక్షి, నెట్వర్క్: కొనే ప్రతి వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. అయితే ప్రస్తుతం మోసాలు ఎక్కువైపోయాయి. తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత ఉండటం లేదు. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. బ్రాండ్ పేరుతో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నా.. అధికారులు మౌనం వహిస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన రోజు తూతూ మంత్రంగా తనిఖీ చేసి జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శుక్రవారం ‘సాక్షి’ విజిట్లో పలు మోసాలు బయటపడ్డాయి. ‘మామూళ్ల మత్తు’లో వ్యవస్థలు.. కల్తీ, నాణ్యత, తూకాలు, గడువు మీరిన వస్తువులు. నకిలీ సరుకు, బ్రాండ్ పేరుతో దోపిడీ.. ఇలా ఇన్ని జరుగుతున్నా.. లీగల్ మెట్రాలజీ అధికారులు, డ్రగ్స్ కంట్రోలర్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వినియోగదారులు ఫిర్యాదులు ఇస్తే.. కానీ తనిఖీలు చేయడం లేదు. చేసినా నివేదిక ఏం తెలుస్తారో బయటికి చెప్పరు. నెలవారీ మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా ఫిర్యాదు చేద్దాం.. వినియోగదారులు నష్టపోయామని భావిస్తే జిల్లాలో అయితే డీసీఐసీ, మండలాల్లో అయితే ఎంీసీఐసీ ద్వారా కేవలం తెల్లకాగితంపై రాసి ఇస్తే సరిపోతుంది. అయితే కచ్చితంగా రసీదు ఉండాలి. విక్రయించే ప్రతి వస్తువుపైనా ఎంఆర్పీ తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ డేట్, వినియోగదారుల హెల్ప్లైన్కు చెందిన నంబరు విధిగా ముద్రించి ఉండాలి. అలా లేకపోతే వస్తువుల విక్రయ దుకాణాలపై ప్రభుత్వం జరిమానా విధించాలి. అనుమతి లేకుండా సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో తేడాలున్నా, సేవల్లో లోపాలను పసిగట్టినా ఫిర్యాదు చేయొచ్చు. నష్టపరిహారం కోరవచ్చు నాణ్యత లేని ఉత్పత్తులపై (ప్రాడక్ట్ లైబులిటీ) తయారీదారులు, విక్రయదారులు, సేవాదారులు అందరూ బాధ్యత వహించాలి. వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. రెండు సంవత్సరాల కాల పరిమితికి లోబడి కమిషన్ ఎదుట ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి. అప్పుడే వినియోగదారుల రక్షణ చట్టం లక్ష్యం నెరవేరుతుంది. – ఎం.శ్రీలత, జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ప్రజల్లో అవగాహన రావాలి వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తుండటంతో ప్రజలు నిత్యం మోసానికి గురి కావాల్సి వస్తోంది. ఎంఆర్పీకి మించి అమ్ముతున్నా.. పట్టించుకునే వారు లేకపోవడం దారుణం. జిల్లా కేంద్రంలో ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని చాలాసార్లు విన్నవించాం. – సురేశ్బాబు, వినియోగదారుల సంఘం సభ్యుడు, పుట్టపర్తి వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నాణ్యత లేని ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనలు, అధిక ధరలు, సరైన సేవలు అందకపోవడం వంటి సమస్యల నుంచి పరిహారం కోసం వినియోగదారులకు రక్షణ చట్టం అమల్లో ఉంది. మారుతున్న కాలానికి, సాంకేతిక సౌలభ్యానికి అనుగుణంగా ఈ–కామర్స్, ఆన్లైన్ షాపింగ్పై నియంత్రణ ఈ చట్టంలో ఉంది. జిల్లా కమిషన్ ఎదుట కోటి రూపాయల లోపు రూ. కోటి నుంచి రూ.10 కోట్ల మధ్య రాష్ట్ర కమిషన్ ఎదుట రూ.10 కోట్ల పైబడిన కేసులు జాతీయ కమిషన్ ఎదుట దాఖలు చేయవచ్చు వినియోగదారులు ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. -
గరుడ వాహనంపై దేవ దేవుడు
కదిరి: అశేష భక్త జన గోవింద నామస్మరణ మధ్య ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి శుక్రవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహుడికి వాహనంగా పంపుతారని, అందుకే ఈ ఉత్సవాన్ని బ్రహ్మ గరుడ సేవ అంటారని అర్చక పండితులు అంజన్ కుమార్ ఆచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సమస్త వాహనాల్లో సర్వ శ్రేష్ఠమైన గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, బాధల నుంచి విముక్తి కల్గుతుందని భక్తుల నమ్మకం. నారసింహుని బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి ఈ వాహన సేవకు ప్రాధాన్యత ఉంది. రాజగోపుర దర్శనానికి పోటీ.. తమ ఇష్టదైవం ఖాద్రీశుడు తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మ గరుడ సేవలో తూర్పు రాజగోపురం వద్ద స్వామి వారిని దర్శించుకుంటే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తమ ఇలవేల్పు అయిన నృసింహుడిని అక్కడ దర్శించుకోవడానికి పోటీ పడ్డారు. విద్యుత్ దీపాలంకరణ, కదిరి మల్లెలతో శ్రీవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా కుటాగుళ్లకు చెందిన బేరి వర్తకులు బీపీ నారాయణప్ప శెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు శేష వాహనం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం (నేడు) లక్ష్మీ నారసింహుడు శేషవాహనంపై తన భక్తులకు తిరువీధుల్లో దర్శనం ఇవ్వనున్నారు. భక్తులతో పోటెత్తిన నృసింహాలయం గోవింద నామస్మరణతో మార్మోగిన కదిరి -
రైలు కిందపడి వలస కార్మికుడి మృతి
హిందూపురం అర్బన్: హిందూపురం–మలుగూరు రైల్వేస్టేషన్ మధ్య శుక్రవారం ఓ వ్యక్తి రైలుకింద పడి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇస్రార్(35) హిందూపురం టీచర్స్ కాలనీలో ఓ బ్యూటీపార్లర్లో పని చేసేవాడు. సొంతూరుకు వెళ్లే క్రమంలో రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బ్యూటీపార్లర్ నిర్వాహకుడు సుధాకర్నాయుడు సహకారంతో మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. క్షుద్ర పూజలు చేశారంటూ వేధింపులు.. మహిళ ఆత్మహత్య మడకశిరరూరల్: క్షుద్ర పూజలు చేశారంటూ వేధింపులకు గురిచేయడంతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పత్తికుంట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప భార్య రత్నమ్మ అనారోగ్యంతో బాధపడుతుండేది. వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. అదే గ్రామానికి చెందిన నాగమణి(39) క్షుద్ర పూజ చేయించడంతోనే తన భార్యకు నయం కాలేదని అనుమానంతో హనుమంతరాయప్ప, కుటుంబ సభ్యులు నాగమణిని వేధించేవారు. ఈక్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె శుక్రవారం గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యక్తిపై హత్యాయత్నం తనకల్లు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులో వలి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు..నల్లచెరువు మండలం మల్లిరెడ్డిపల్లికి చెందిన వలి బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వలి మూడు రోజులుగా తనకల్లులో ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి రైల్వేస్టేషన్ రోడ్డులోని మోరీ వద్ద ఉన్న వలిపై బైక్పై వచ్చి అగంతకులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు. ఎస్ఐ గోపి హుటాహుటినా బాధితుడిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
అవసరమైతేనే సిజేరియన్ చేయండికదిరి టౌన్: పట్టణంలోని మూర్తిపల్లి, నిజాంవలీ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డాక్టర్ ఫైరోజ్ బేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రనాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. కదిరి ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ , లేబర్ వార్డును తనీఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీలో భాగంగా శిల్పా నర్సింగ్ హామ్ను తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్ను విజిట్ చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. చేనేత వ్యాపారుల భూమి కబ్జాకు ‘తమ్ముళ్ల’ యత్నం● కంచె ధ్వంసం చేసి బెదిరించారన్న వ్యాపారులు ధర్మవరం అర్బన్: తమ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చేనేత వ్యాపారులు వాపోయారు. పట్టణంలోని తారకరామాపురంలోనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న సదరు భూమిలో శుక్రవారం వారు సమావేశం నిర్వహించారు. వ్యాపారులు పోలా వెంకటనారాయణ, పోలా ప్రభాకర్ మాట్లాడుతూ 2005లో 3.15 ఎకరాలు కొనుగోలు చేసి మగ్గాలు పెట్టామన్నారు. 2014లో కోర్టు కమిషనర్ ద్వారా సర్వే చేయించి కంచె వేయించామన్నారు. ఈనెల 5న టీడీపీ నేత కొత్తపేట ఆది, అతని అనుచరులు పది మంది వచ్చి జేసీబీతో భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించి దౌర్జన్యం చేశారన్నారు. బీరుసీసాలతో వచ్చి పొడిస్తే మీకు దిక్కు ఎవరంటూ బెదిరించారని తెలిపారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లామని, తమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారన్నారు. భవిష్యత్తులో చేనేతల జోలికి ఎవరొచ్చినా తిరగబడతామని హెచ్చరించారు. పట్టుచీరల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గిర్రాజు రవి, మహిళా నేత జయశ్రీ, తొగటవీరక్షత్రీయ సంఘం అధ్యక్షుడు రాము, చేనేత ప్రముఖులు గడ్డం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎక్కడా నిర్భందాలు చేయలేదు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీ వారిని పిలిపించి అక్రమ కేసులు బనాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రౌడీ రాజ్యం నడుస్తోంద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో కురుబ బాలన్న అనే యువకుడిని టీడీపీ వారు కట్టెలతో దాడి చేస్తే పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. సిద్ధరాంపురం ఏమైనా పాకిస్తాన్లో ఉందా? అందుకు ప్రత్యేక వీసాలు కావాలా? అని ప్రశ్నించారు. రామగిరి మండలం పోలేపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి వెళ్తుంటే దాదులూరు వద్ద డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు వచ్చి అడ్డుకుని బందోబస్తు ఇవ్వలేమని పర్యటన వాయిదా వేసుకోవాలంటూ చెప్పారన్నారు. పోలీసులు ప్రజల కోసమా.. సునీత కోసమా? పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ కోసం పని చేస్తున్నారా? లేదంటే టీడీపీని బలపరిచేందుకు పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేపల్లికి వస్తే పెద్దపెద్ద గొడవలు అవుతాయని రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ చెబుతున్నారని, ఆయన టీడీపీ ఏజెంటుగా పని చేస్తున్నారా? అని నిలదీశారు. ఊరిలో లేని సమస్యను సృష్టిస్తూ పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఆ గ్రామంలో టీడీపీ వాళ్లకు లేని ఉద్దేశాలను ఎస్ఐ కల్పిస్తూ ఎస్పీ, డీఎస్పీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు స్టేషన్కు వెళ్తే అగౌరవంగా మాట్లాడటడంతోపాటు కింద కూర్చోమని చెబుతారని ఎస్ఐ సుధాకర్యాద్పై మండిపడ్డారు. సీఐ, ఎస్ఐలు పద్ధతులు మార్చుకోవాలి.. అనంతపురం రూరల్ మండలంలోని తమ పార్టీ నేతలను పోలీస్స్టేషన్కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. పుట్టపర్తిలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాహనాల్లో వెళ్లడంతో వారికి కళ్లు ఎర్రబడ్డాయన్నారు. జనాలను బాగా పిలుచుకెళ్లిన లీడర్లను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని టీడీపీ చుట్టంగా మార్చొద్దని పోలీసులకు హితవు పలికారు. తాను గుండీలు ఇప్పుతా రా కొట్లాడదామని రాప్తాడు సీఐ పిలుస్తారని, ఆయన సీఐనా రౌడీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో లాఅండ్ ఆర్డర్ సమస్యంతా ఇటుకలపల్లి సీఐతోనే ఉత్పన్నమవుతోందన్నారు. తోపుదుర్తిలో 30 మంది ఇంట్లోకి దూరి మహిళపై దాడి చేస్తే..బాధితులపైనే కేసు కడతాడన్నారు. వారి ఆగడాలు చూస్తూ ఊరుకున్నారంటే తాము సంయమనం పాటించమని చెప్పడమే కారణమనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికై నా ఇటుకులపల్లి, రాప్తాడు సీఐలు, రామగిరి ఎస్ఐ పద్ధతులు మార్చుకోవాలని హితవుపలికారు. చట్టాన్ని టీడీపీ చుట్టంగా మార్చుతున్న పోలీసులు ఏకపక్షంగా వె ళ్తామంటే చూస్తూ ఊరుకోం రైతుల సమస్యలపై రాజీ పడను.. జైలుకు వెళ్లేందుకూ సిద్ధం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చంద్రబాబు, సునీత చరిత్రహీనులుగా నిలిచిపోతారు.. లైనింగ్పనులు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని, దీనిపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రకాష్రెడ్డి అన్నారు. ఈ పనులు జరిగితే చంద్రబాబు, పరిటాల సునీత చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారు. నియోజకవర్గ రైతుల సమస్యలపై రాజీ పడననని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. సిద్ధరాంపురం గ్రామానికి చెందిన బాధితుడు కురుబ బాలన్నను పరామర్శించడానికి వెళ్లనీయకపోవడంతో ఇక్కడికే బాధితుడిని పిలిపించి మీడియాకు చూపించారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, ఆత్మకూరు ఎంపీపీ హేమలత, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనరు బాలపోతన్న, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, రామగిరి కన్వీనర్ మీనుగ నాగరాజు పాల్గొన్నారు. -
కదిలింది.. కణివె నృసింహుడి బ్రహ్మరథం
పావగడ: స్థానిక కణివె లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎండోమెంట్ అధికారి, స్థానిక తహసీల్దార్ వరద రాజు సమక్షంలో ఆలయం నుంచి లక్ష్మీదేవి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులను వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య అందంగా అలంకరించిన బ్రహ్మరథంలో ప్రతిష్టించారు. అనంతరం 12.45 గంటల సమయంలో ఎండోమెంట్ అధికారి వరదరాజు తదితర ప్రముఖులు లాంఛన ప్రాయంగా లాగి బ్రహ్మ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి పాదాల గోవిందా గోవింద... అనే నామ స్మరణ మార్మోగింది. అనంతరం ఆలయం బయట నిలిపిన బ్రహ్మ రథానికి భక్తులు టెంకాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులకు భక్త మండలి పదాధికారులు అన్నదానం చేపట్టారు. సీఐ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
ఈ భవనాసిని తీర్థమే ఒకప్పటి కోనేరు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య మూలలో ఉన్న ఈ భవనాసిని తీర్థంలోనే భక్తులు గతంలో స్నానమాచరించే వారు. భక్తులు తమ ఇలవేల్పు దేవుడు నారసింహుడికి తలనీలాలు సమర్పించిన మీదట ఇందులో స్నానం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకునేవారు. అయితే లోతైన బావి తరహాలో ఉండటంతో చిన్న పిల్లలు, మహిళా భక్తులు ఇందులోకి దిగి స్నానం చేయడం కష్టంగా ఉండేది. అందుచేత ఆలయ అధికారులు కొన్నేళ్లుగా ఇందులో స్నానం చేయడానికి భక్తులను అనుమతించడం లేదు. కాగా ఇందులో ఏర్పాటు చేసిన ఆంజనేయుడి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొట్టుకుపోయిన కోనేరు.. ఆలయానికి పడమటి వైపున అర్జున నదీ(మద్దిలేరు)తీరం ఉంది. అక్కడ భృగు మహర్షి తపస్సు చేసి స్వామి వారిని స్మరణం చేసుకున్నారు. ఆయన కోరిక మేరకు శ్రీవారు ప్రత్యక్షమై శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను స్వయంగా అందించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వాటినే ఏటా బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో ఊరేగిస్తున్నారు. వసంత రుతువులో శ్రీవారు అనుగ్రహించడంతో ఉత్సవ మూర్తులకు వసంత వల్లభులని పేరొచ్చింది. భృగు మహర్షి తపస్సు ఫలితంగా కోనేరును భృగుతీర్థం అని పిలుస్తున్నారు. అయితే 2022లో కురిసిన భారీ వర్షాలకు కోనేరు మొత్తం కొట్టుకు పోయింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మరిన్ని తీర్థాలు.. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా భృగుతీర్థం, భవనాసిని తీర్థాలతో పాటు మొత్తం 13 పవిత్ర తీర్థాలు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. 1 గజేంద్ర తీర్థం, 2 ఆళ్వారుల తీర్థం, 3 అచ్యుత తీర్థం, 4 భృగుతీర్థం, 5 అర్జున తీర్థం, 6 శ్వేత పుష్కరిణి తీర్థం, 7 భవనాసిని తీర్థం, 8 గరుడ తీర్థం, 9 నాగుల తీర్థం, 10 కూర్మతీర్థం, 11 స్వర్ణతీర్థం, 12 శ్రీ తీర్థం, 13 క్షీర తీర్థం..ప్రస్తుతం దీన్ని పాలబావిగా పిలుస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
● నిందితులు టీడీపీ కార్యకర్తలు చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండలం జంగాలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాకర్తలపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. గురువారం రాత్రి బాలంపల్లి వైపు నుంచి వస్తున్న అశ్వర్థ, దేవేగౌడలపై మార్గ మధ్యంలో కాపుకాచిన టీడీపీ కార్యకర్తలు సాయికుమార్, శ్రీనివాసులు, గోవిందప్ప మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి శుక్రవారం హిందూపురం జిల్లా సర్వజనాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు. అనంతరం వేణురెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ నేతల అరాచాకాలను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత కక్షలే దాడులకు కారణమని, ఇరుపక్షాలపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ఆంజనేయులు ప్రకటించారు. -
వైభవంగా రొళ్ల లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం
రొళ్ల: మండల కేంద్రంలో శుక్రవారం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా సాగింది. ఉదయాన్నే స్వామి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణ ముందు భాగాన ఉన్న రథాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. రథం ముందు భాగాన వేదపండితులు శాంతి, నవగ్రహ హోమం, యోగీశ్వరారాధన, గణపతి పూజ, బలిహరణ తదితర పూజలు చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలతో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు, బొరుగులు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామ స్మరణతో రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. భక్తులకు దాతల సహకారంతో మూడు చోట్ల అన్నదానం చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మడకశిర సీఐ రాజ్కుమార్ ఎస్ఐ వీరాంజనేయులు, అమరాపురం ఎస్ఐ ఇషాక్బాషాతో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు రొళ్లకొండ పై దివ్యజ్యోతి దర్శనం.. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రొళ్లకొండ పై భాగాన వెలసిన ఉగ్రనరసింహస్వామి ఆలయంలో దివ్యజ్యోతి దర్శనం, వసంతోత్సవం, భక్తులతో ధాన్యం సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. -
తాగునీళ్లివ్వాలని మహిళల ధర్నా
గుడిబండ: జిల్లాలో తాగునీటి సమస్యలపై రోజుకో ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మండల పరిధిలోని సీసీ గిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలోనీ మహిళలు రోడ్డెక్కారు. పీసీ గిరి పంచాయతీ సీసీ గిరి గ్రామం దళితకాలనీలోనీ ప్రజలకు వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామస్తులు ఖాళీ బిందెలతో కర్ణాటక రాష్ట్రం శిరాకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నమించినా స్పందన కరువైందని మహిళలు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ డీఎల్ యంజారేగౌడు, ఈఓఆర్డీ నాగరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామ ప్రజలు, మహిళలతో మాట్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు. -
మము కరుణించు సాయీ ..
ప్రశాంతి నిలయం: హోలీ పర్వదిన వేడుకల్లో భాగంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల భక్తులు నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సత్యసాయి భక్తులను అలరించాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన ఇరు రాష్ట్రాల భక్తులు గురువారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ‘భరత్ మిలాప్’ పేరుతో రామాయణంలో రాముడి వనవాస సమయంలో రాముడిపై భక్తిభావన, వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ వనవాసం వెళ్లకూడదు అని భరతుడు వేడుకున్న అంశం ఇతివృత్తంగా ప్రదర్శించిన నాటిక ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
ఖాద్రీశుడి దర్శనం.. భక్త పారవశ్యం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం ఖాద్రీశుడు హనుమద్వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖాద్రీ లక్ష్మీనారసింహుడు శుక్రవారం (నేడు) గరుడ వాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమివ్వనున్నారు. నృసింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే భక్తులంతా బ్రహ్మగరుడు సేవ రోజునే ‘కదిరి పున్నమి’ పేరుతో పండుగ జరుపుకుంటారు. హనుమద్వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు భక్తులతో కిటకిట లాడిన ఆలయం -
కోడింగ్లో పొరబాట్లకు తావివ్వొద్దు
● పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబు పత్రాల కోడింగ్లో ఏ చిన్న పొరబాటుకు తావివ్వొద్దని పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ సూచించారు. గురువారం అనంతపురంలోని సైన్స్ కేంద్రంలో రాయలసీమ జిల్లాల్లోని కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ శామ్యూల్ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందన్నారు. ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్నారు. చదివేవాడికి, చదవలేనివాడికి ఒకే విధంగా మార్కులు వచ్చే పొరబాట్లు చేయొద్దన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు కీలకం అన్నారు. రెగ్యులర్ పరీక్షలతో పాటు ఓపెన్ పరీక్షలకు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, కడప డీఈఓలు, 8 జిల్లాల నుంచి ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, 130 మంది కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ అధికారులు హాజరయ్యారు. 476 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు 476 మంది గైర్హాజరయ్యారు. ఆర్జేడీ రవీంద్ర ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డితో కలిసి హిందూపురంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 11,766 మంది జనరల్ విద్యార్థులకు గాను 11,388 మంది విద్యార్థులు హాజరైనట్లు రఘునాథరెడ్డి తెలిపారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1156 మంది విద్యార్థులకుగాను 1068 మంది హాజరైనట్లు చెప్పారు. జిల్లా స్పెషలాఫీసర్ చెన్నకేశవప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వరప్రసాద్ తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు. ‘పది’ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) మదుసూధన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ జరగనున్న పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఒరిజినల్ హాల్ టికెట్ కండెక్టర్కు చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారన్నారు. ఈ అవకాశం అన్ని పల్లె వెలుగుల (ఆర్డినరీ) బస్సుల్లో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకోండి పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఇతరులకు ఇబ్బందులు కలగకుండా హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న ప్రజలకు సూచించారు. గురువారం ఆమె జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ నేపథ్యంలో జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రదేశాలు, కాలనీల్లో రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతర వ్యక్తులకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదన్నారు. ప్రధానంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లరాదని సూచించారు. వేడుకల్లో పర్యావరణ హితమైన రంగులను వాడాలని కోరారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ కదిరి అర్బన్: మండల పరిధిలోని దిగువపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఓబులేసును గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కృష్టప్ప సస్పెండ్ చేశారు. మనబడి – మన భవిష్యత్తుకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల విద్యాశాఖ అధికారులతో పరీక్షలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. జిల్లాలో 23,730 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అందులో 22,295 మంది రెగ్యూలర్, 1435 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 104 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులు 780 మంది 11 సెంటర్లలో పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఒక్కో విడతలో 1186 మంది చొప్పున రెండు విడతలకు 2,372 మంది ఇన్విజిలేటర్లును నియమిస్తున్నట్లు వివరించారు. 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, డీఈఓ కృష్టప్ప తదితరులు పాల్గొన్నారు. మొల్ల మాంబ జీవితం ఆదర్శం తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల మాంబ జయంతిని గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా కలెక్టర్ టీఎస్ చేతన్ మొల్ల మాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొల్ల మాంబ జీవితం ఆదర్శనీయమన్నారు. 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల మాంబ రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రిగా గుర్తించబడ్డారన్నారు. జాతికి మొల్ల మాంబ చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమె జయంతిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
రైతుల గోడు పట్టదా?
మడకశిర: నియోజకవర్గంలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో దాదాపు 42 వేల మంది రైతులకు చింత చెట్లు ఉన్నాయి. 2 లక్షల వరకు చింత చెట్లు విస్తరించాయి. ఏడాది కొకసారి వచ్చే చింత ఫలసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఊరట చెందేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రూ.6 కోట్ల నుంచి రూ.2 కోట్లకు.. నియోజకవర్గంలో గరిష్టంగా రూ.6 కోట్ల విలువ చేసే చింతపండు ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే ఈ ఉత్పత్తి విలువ ప్రతి ఏడాది క్రమేణా తగ్గిపోతోంది. గత ఏడాది కూడా చింతపండు ఉత్పత్తి విలువ మడకశిర నియోజకవర్గంలో రూ.3 కోట్లకు చేరుకోలేదు. ఈ ఏడాది కూడా చింతపండు ఉత్పత్తి భారీగా పడిపోయింది. చింతపండు దిగుబడి నామమాత్రంగానే ఉంది. రూ.2 కోట్లు కూడా ఉత్పత్తి విలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది. ధర బాగున్నా... ఈఏడాది చింతపండు ధర ఆశాజనకంగానే ఉంది. ప్రారంభం నుంచి చింతపండు ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి రకం (కరిపుళి) చింతపండు గరిష్ట ధర క్వింటాలు రూ.40 వేల వరకూ పలికింది. అలాగే కనిష్ట ధర రూ.8 వేల వరకూ పలికింది. రెండో రకం (ఫ్లవర్) చింతపండు ధర గరిష్టంగా రూ.14 వేల వరకూ పలికింది. కనిష్ట ధర రూ.5 వేలకు దాకా పలికింది. అయినా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. ధర ఆశాజనకంగా ఉన్నా కూడా చింతపండు దిగుబడి 50 శాతం తగ్గడంతో రైతులకు నిరాశే మిగిలింది. పెరిగిన ఉత్పత్తి వ్యయం.. చింతపండు ఉత్పత్తి వ్యయం కూడా పెరగడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. చింతకాయలను చెట్టు నుంచి కోయడానికి గతంలో ఒక మగ కూలీకి రోజుకు రూ.300 కూలీ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ కూలీ రూ.800కు పెరిగింది. అదే విధంగా చెట్టు నుంచి కోసిన చింత కాయలు నేలపై పడతాయి. ఆ కాయలను ఏరడానికి గతంలో ఒక ఆడ కూలీకి రోజుకు రూ.100 చెల్లించే వారు. ప్రస్తుతం అది రూ.400 అయింది. చింతకాయల నుంచి చింతపండును శుద్ధి చేయడానికి రోజుకు ఓ ఆడ కూలీకి గతంలో రూ.150 చెల్లించే వారు ప్రస్తుతం రూ.400 పెరిగింది. గతానికి భిన్నంగా కూలీలకు భోజన సౌకర్యం కూడా కల్పించాల్సి వస్తోంది. కూలీల ఖర్చు పెరగడం కూడా చింతపండు రైతులకు భారంగా మారింది. మార్కెట్ సౌకర్యం కరువు.. జిల్లాలో మడకశిర నియోజకవర్గంలోనే 90 శాతం చింతపండును రైతులు పండిస్తున్నారు. మడకశిరకు ఆనుకుని ఉన్న సరిహద్దులోని కర్ణాటకకు చెందిన పావగడ, శిర, హిరియూర్, మధుగిరి, చళ్లకెర నియోజకవర్గాల్లో కూడా చింతపండు ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అయినా మడకశిరలో చింతపండు మార్కెట్ లేదు. మడకశిర ప్రాంతం రైతులు చింతపండును హిందూపురం, శిర మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. మడకశిరలో చింతపండు మార్కెట్ ఏర్పాటు చేయకపోవడం కూడా రైతులకు ఇబ్బందికరంగా మారింది. చింతపండు ఉత్పత్తిపై రైతులకు ఆసక్తి తగ్గేందుకు ఇది కూడా ఓ కారణంగా మారింది. చింతచెట్లను తొలగిస్తున్న రైతులు.. నియోజకవర్గంలో కొందరు రైతులు చింతచెట్లను ఇప్పటికే తొలగించారు. ఆశించిన స్థాయిలో రైతులకు ఆదాయం రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చింతకట్టెలను ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో చింత కట్టెలకు అధిక డిమాండ్ ఉంది. చింతచెట్లను తొలగించడానికి ఆదాయం తగ్గడం ఒక కారణమైతే....చింతచెట్లు ఉన్న భూమి వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాదు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఉన్న చింతచెట్లను తొలగించి వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమరాపురం, గుడిబండ, మడకశిర తదితర మండలాల్లో చింతచెట్లను తొలగించారు. ఇటుక బట్టీల నిర్వాహకులు చింతచెట్లను గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. చింతపండు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మడకశిరలోనే మార్కెట్ సౌకర్యం కల్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్థానికంగానే మార్కెట్ సౌకర్యం కల్పించడానికి చొరవ తీసుకోవాలి. చింతపండు రైతులు నష్టపోతే నష్టరరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. – హనుమంతరాయప్ప, అగళి -
రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: అనారోగ్యంతో రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో జరిగింది. హిందూపురం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాలు.. పట్టణంలోని కేతిరెడ్డికాలనీలో నివసిస్తున్న అబ్దుల్ ఖాదర్వలి కుమారుడు షెక్షావలి(24) లారీ క్లీనర్గా పనిచేసేవాడు. నాలుగేళ్లుగా అల్సర్తోపాటు గడ్డలు ఉండటంతో తీవ్రనొప్పితో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో వారం రోజులుగా తాను రైలు కింద పడి చనిపోతానంటూ తల్లిదండ్రులతో చెబుతున్నాడు. ఈక్రమంలో గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేడ్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సమాచారం మేరకు హిందూపురం జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య పరిగి: శాసనకోటలో కేశవయ్య(30) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలు.. సోమందేపల్లి మండలం నడింపల్లికి చెందిన కేశవయ్యకు శాసనకోట గ్రామానికి చెందిన స్నుతితో 2021లో వివాహమైంది. వీరికి విక్రాంత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వృత్తి రీత్యా కేశవయ్య బెంగళూరులో ఉంటున్నాడు. అయితే భార్య స్నుతి, ఆమె తల్లి పాపులమ్మ, బావమరిది సురేష్ తరచూ కేశవయ్యతో గొడవ పడేవారు. శాసనకోటలో కాపురముండాలని, సంపాదించినదంతా తమకే ఇవ్వాలని వేధించేవారు. ఈక్రమంలో గత బుధవారం అతడు శాసనకోటకు వచ్చాడు. కుటుంబ సభ్యులంతా లేపాక్షి మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్నుతి, పాపులమ్మ, సురేష్పై కేసు నమోదు చేసనట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బేల్దారి బలవన్మరణం పెనుకొండ: పెనుకొండ నగర పంచాయతీలోని తిమ్మాపురంలో బేల్దారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు అందించిన సమాచారం.. గ్రామానికి చెందిన నంజుండ (33) బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన భార్య సీపీఎం నేత రమేష్తో సన్నిహితంగా ఉంటోందని మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు నాగమణితోపాటు రమేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నాడు. పట్టపగలే ఇంట్లో చోరీ తాడిపత్రి: సజ్జలదిన్నె గ్రామంలో చాంద్బాషా అనే వ్యక్తి ఇంటిలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చాంద్బాషా, బీబీ దంపతులు సజ్జలదిన్నె పారిశ్రామిక వాడలోని ఓ బండల పాలిష్ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారు. ఉదయం వారు పనులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, జత వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినూత్నంగా వివాహ వేడుక ● అతిథులకు మొక్కల పంపిణీ పావగడ: తాలూకాలోని భీమనకుంటె గ్రామం సముదాయ భవనంలో తాండ్ర కల్పన, వి గోకుల్ వివాహ వేడుక వినూత్నంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు వివాహానికి వచ్చిన సుమారు 500 మంది అతిథులకు జామ, దానిమ్మ, నేరేడు, శ్రీగంధం తదితర మొక్కలను అందించి ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ వేడుకల్లో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయ మూర్తి హెచ్ఎల్ దత్తు, భార్య గాయత్రి, విశ్రాంత విశేష జిల్లా కలెక్టర్ దొడ్డహళ్లి రామాంజనేయులు, భార్య శారద తదితర ప్రముఖులు మొక్కలను పంపిణీ చేసిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొక్కలపై వారికి ఉన్న ఎనలేని మక్కువను ప్రశంసించారు. -
రూ.46 లక్షల విత్తనాలకు స్టాప్సేల్స్
అనంతపురం అగ్రికల్చర్: నాసిరకం కలింగర విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని బుధవారం స్థానిక శ్రావణి సీడ్స్ దుకాణం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైతు మురళీ ఆరోగ్యం నిలకడగా ఉంది. గురువారం వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏవో జే.శశికళ స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం, పంట పెట్టుబడికి రూ.6.90 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రైతు తెలిపారన్నారు. అందుకు సంబంధించి బిల్లులు సేకరించామన్నారు. బీఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన కళింగర విత్తనాలకు సంబంధించి వివిధ దుకాణాల్లో సోదాలు నిర్వహించి రూ.20 లక్షల విలువ చేసే విత్తనాలకు అమ్మకాల నిలిపివేత (స్టాప్సేల్స్) ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అలాగే సాంయత్రం శ్రావణి సీడ్స్ దుకాణంను తెరపించి తనిఖీ చేశామన్నారు. స్టాకు, సేల్స్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. బీఏఎస్ఎఫ్తో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన రూ.26 లక్షలు విలువ చేసే కళింగర, కర్భూజా విత్తనాలకు స్టాప్ సేల్స్ ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. మొత్తంగా రూ.46 లక్షల విలువ చేసే విత్తనాల అమ్మకాలు నిలిపివేశామన్నారు. కమిషనరేట్, జేడీఏ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ, నాసిరకకం, నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై నిఘా మరింత పెంచుతామని తెలిపారు. కళింగర పంట పరిశీలన బత్తలపల్లి: నకిలీ విత్తనాలతో మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన గుజ్జల మురళి సాగు చేసిన కళింగర పంటను హార్టిక్చలర్ అధికారిణి అమరేశ్వరి, ఏఓ ఓబిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు డి.చెర్లోపల్లిలో పంట సాగు, పెట్టుబడి వివరాలను సర్పంచు గుజ్జల రమాదేవి, ఇతర రైతులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మురళి 3.74 ఎకరాల్లో కళింగర పంట ‘మాక్స్’ రకంను నవంబర్ 27న నాటారన్నారు. పంట కాల పరిమితి 70–75 రోజులు దాటినా కాయ లోపల తెలుపు రంగులో ఉండడంతో వ్యాపారస్తులు ఎవ్వరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. నకిలీ విత్తనాలు అంటగట్టడం వల్లనే ఇలా జరిగిందని, తద్వారా పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏఓ జే.శశికళ ఆత్మహత్యకు యత్నించిన రైతుకు పరామర్శ -
కదిరి కొండపై శ్రీవారి పాద చిహ్నాలు
కదిరి: స్వామి వారి పాదాలు తాకితే ఈ జన్మకు ఇక చాలని ఏ భక్తుడైనా కోరుకుంటాడు. ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు తాకాలంటే కదిరి కొండకు వెళ్లాల్సిందే. శ్రీవారి పాద చిహ్నాలను తాకిన వారు పాప విముక్తులవుతారని భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తాదులు కదిరి కొండపై ఉన్న నృసింహుని పాద ముద్రికలను దర్శించుకుంటున్నారు. నిర్మలమైన మనస్సుతో స్వామివారి పాదాలను తాకి, మనసులో ఆరాధిస్తే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. చెరిగిపోని పాదముద్రలు.. హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు శ్రీ మహా విష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో అంటే నరసింహావతారమెత్తారు. ఉగ్రరూపంతో స్తంభం నుంచి ఆవిర్భవించారు. హిరణ్య కశ్యపుడి సంహారం అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని ఆ రూపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రహ్లాదుడు, దేవ దేవతలతో పాటు శ్రీదేవి, భూదేవిలు కదిరి కొండపై నుంచి ప్రార్థించారు. నృసింహుని మెప్పించేందుకు అక్కడి నుంచి వారంతా స్తోత్రం చేయడంతో స్వామి వారు అక్కడ దర్శనమిచ్చారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అందుకే ఆ పర్వతానికి ‘స్తోత్రాద్రి’ అనే పేరు వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో స్వామి వారు అక్కడ మోపిన పాదాల గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు తీవ్రగాయాలు
మడకశిర: పట్టణ సమీపాన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. రొళ్ల మండలం కొడగార్లగుట్ట గ్రామానికి చెందిన సన్నలింగప్ప తన కుమార్తె ప్రార్థన, కుమారుడు గోకుల్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బైక్పై మడకశిరకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన చెరుకు రసం తాగడానికి బైక్ను రోడ్డు పక్కన ఆపి ఇద్దరినీ అందులోనే కూర్చోబెట్టి చెరుకు రసం తేవడానికి వెళ్లాడు. ఈ సందర్భంలో మధుగిరి నుంచి పావగడ వైపు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్ను ఢీకొంది. ఘటనలో ప్రార్థన కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. గోకుల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హిందూపురం తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి గోరంట్ల: మండలంలోని కరావులపల్లి తండాలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన తిప్పిబాయి (49) గురువారం ఉదయం ఇంటి వద్ద తాగునీటి సంపునకు అమర్చిన విద్యుత్ మోటార్ను ఆన్ చేసేందుకు యత్నించింది. విద్యుత్ షార్ట్సర్కూట్తో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీరాములు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పట్టణ ప్రాంతాలు, పల్లెలు అన్న తేడా లేని యువత సెల్ఫోన్ల ద్వారా బెట్టింగులకు పాల్పడటం ఎక్కువైంది. ప్రధానంగా కళాశాలలకు వెళ్లే వారిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. – బాలాజీ, హిందూపురం ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండాలి ఆన్లైన్ గేమ్ల బారిన పడి ఎంతోమంది యువత తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. సరదాలకు పోయి తర్వాత వ్యసనంగా మారుతోంది. యువత చేజేతులారా తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలో నెట్టుకుంటున్నారు. – కెవి. మహేష్, డీఎస్పీ, హిందూపురం -
స్వచ్ఛ మార్గంలో పయనిద్దాం
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రభుత్వ అశయాల మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా మార్గంలో పయనిద్దామని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. మూడో శనివారం నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలన్నారు. అయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. డీపీఓ సమత, డీఆర్డీఏ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలి స్వర్ణాంధ్ర సాధనలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీపీఓ విజయ్కుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, డీపీఓ సమత, పలు కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆదిశక్తికి ప్రతిరూపమే మహిళ
● ఎస్పీ రత్న హిందూపురం: ఆదిశక్తికి ప్రతిరూపమే మహిళ అని ఎస్పీ రత్న పేర్కొన్నారు. హిందూపురం డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో తూమకుంట సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్పీతోపాటు హిందూపురం జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి, మెప్మా పీడీ విజయలక్ష్మి, సీడీపీఓ శాంతి హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో శక్తి టీఎం ఏర్పాటు చేయబోతోందన్నారు. శక్తి యాప్ కూడా ఏర్పాటు చేశామని ఆన్లైన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏ ఆపద వచ్చినా సెల్ఫోన్ మూడుసార్లు ఊపినా లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే రెస్క్యూ టీం ఘటనస్థలికి చేరుకుని రక్షిస్తుందన్నారు. హిందూపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లలను దేన్నయినా ధైర్యంగా ఎదుర్కొనేలా పెంచాలన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. డాక్టర్లు జీవన, షమ్మిలా, సీఐలు జనార్దన్, ఆంజనేయులు, కరీం, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
బత్తలపల్లి: ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహిద్దామని సెర్ప్ ఏసీ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్రాజు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోనూ, రాఘవంపల్లిలోనూ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామన్నారు. అంతకు ముందు బత్తలపల్లిలో కాశప్ప పొలంలో ఏటీఎం మోడల్ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులతో వేయించారు. ఈ విధానంలో రోజూ ఆదాయం పొందుతున్న పార్వతి, గంగమ్మ, నారాయణమ్మ ద్వారా తెలుసుకున్నారు. రాఘవంపల్లిలో శివప్రసాద్ చీనీ పీఎండీఎస్లో ఆరు రకాల ప్రధాన పంటలు ఆముదం, కంది, సజ్జ, అనుములు, అలసంద, గోరుచిక్కుడు, 23 రకాల జీవ వైవిధ్య పంటల విత్తనాలు, బీజామృతంతో విత్తనశుద్ధి చేసి, ఘన జీవామృతం పైడర్తో పాటు కలిపి విత్తినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్పీఓ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మండల సమాఖ్య లీడర్లు, సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
ప్రశాంతి నిలయం: అభాగ్యులకు సేవలు అందించడమే సత్యసాయి సేవా సంస్దల లక్ష్యమని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అన్నారు. బుధవారం ప్రశాంతి నిలయంలోని నార్త్ బిల్డింగ్స్ వద్ద సత్యసాయి దివ్యాంగ్జన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలున్న 113 మందికి కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి దివ్యాంగ్జన్ ప్రాజెక్ట్ను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్వశక్తితో జీవిస్తున్న దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. -
ప్రజాహితమే వైఎస్సార్సీపీ ధ్యేయం
పుట్టపర్తి/పెనుకొండ రూరల్: ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ● పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాలుగా జగన్కు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహులు, సుధాకరరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ సునీల్, వైశాలి జయశంకర్రెడ్డి, మాజీ కన్వీనర్ నాగలూరు బాబు, కౌన్సిలర్లు శేషాద్రి, యాసిన్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. ● పుట్టపర్తిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● ధర్మవరంలోమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆవిష్కరించారు. ● మడకశిరలో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావం దినోత్సం ఘనంగా జరిగింది. అంతకు ముందు ఆయన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ● కదిరిలో పార్టీ సమన్వయర్త మగ్బుల్ అహమ్మద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, వజ్ర భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● హిందూపురంలో పార్టీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బలరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ధర్మవరం రూరల్: మండలంలోని సీతారాంపల్లి వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా బెంగళూరు వైపు తరలిస్తున్న 76 బస్తాల (ఒక్కొక్కటి 50 కిలోలు) రేషన్ బియ్యాన్ని బుధవారం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు. పోలీసులను చూడగానే వాహనాన్ని ఆపి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వెంబండించి అదుపులోకి తీసుకునానమన్నారు. పట్టుబడిన వారిని సోమందేపల్లికి చెందిన షేక్ బాబా, వడ్డె అజయ్గా గుర్తించామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. -
ఈ రస్తాలో తిరిగితే అంతు చూస్తా..
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఇది నా దారి. ఈ దారి గుండా ఎవరు వెళ్లినా వారి అంతు చూస్తా’ అంటూ కొంత కాలంగా గ్రామస్తులను ఓ కూటమి నేత బెంబేలెత్తిస్తున్నాడు. రహదారికి ఏకంగా మొద్దులు అడ్డుగా వేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. వివరాలు... ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో శింగంశెట్టి వంశస్తులకు చెందిన 50 కుటుంబాల వారు ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాలనీకి సమీపంలో ఓ ఆలయాన్ని నిర్మించాలని అప్పట్లో గ్రామ పెద్దలు తీర్మానించారు. అయితే స్థల వివాదం తలెత్తడంతో ఆలయ నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారు. ఈ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మరికొన్ని రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో గ్రామానికి చెందిన కూటమి నాయకులు వర్గ కక్షలకు ఆజ్యం పోశారు. ఏళ్ల తరబడి ఆ కాలనీ నుంచి ప్రధాన రహదారికి ఉన్న రస్తా వెంట కాలనీ వాసులు తిరుగుతుండేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గ్రామానికి చెందిన కూటమి నేత ఆధిపత్యం కోసం రస్తా విషయాన్ని తెరపైకి తెచ్చాడు. ఈ రస్తా స్థలం తనకు సంబంధించిందని, తన పట్టా భూమిలో ఉందని, ఆ రస్తా వెంట ఎవరూ వెళ్లకూడదంటూ వారం రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఉన్నఫలంగా బుధవారం రస్తాకు మొద్దులు అడ్డుగా పెట్టి అక్కడే కుర్చీలు వేసుకుని తన వర్గీయులతో కలసి కూర్చొన్నాడు. తన మాట బేఖాతరు చేసి రస్తాలో అడుగుపెడితే అంతు చూస్తానంటూ రెచ్చిపోయాడు. దీంతో కాలనీ వాసులు విషయాన్ని రెవెన్యూ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సాయంత్రం అధికారులు వచ్చి రస్తాకు అడ్డుగా వేసిన మొద్దులను తొలగించారు. గ్రామస్తులను బెదిరించిన కూటమి నేత రహదారికి మొద్దులు అడ్డుగా వేసిన వైనం -
అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఫీజులు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయం అందక ఎంతోమంది రైతులు కాడెద్దులను.. భార్య తాళిబొట్టును.. అమ్ముకోవాల్సిన దయనీయ స్థితి నెలకొంది. చంద్రబాబు పాలన తీరు చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలు పందెం గుర్రాన్ని అమ్ముకుని... ముసలి గాడిదను తెచ్చుకున్నట్లుగా ఉంది. విద్య, వైద్య రంగాలు బాగుండాలంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
ఈ–క్రాప్ నమోదు పరిశీలన
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్దరాంపురం సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం పరిశీలించారు. వేరుశనగ దిగుబడిపై రైతు కేశవతో ఆరా తీశారు. నిర్ణీత గడువులోపు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావుకు సూచించారు. అనంతరం సమీపంలోని మునగ పంటను పరిశీలించారు. చింత పండు ధర తగ్గుముఖం హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం 1573.50 క్వింటాళ్ల చింత పండు విక్రయానికి రాగా... మీడియం ప్లవర్ రకం క్వింటా గరిష్టం రూ. 13వేలు, కనిష్టం రూ.4,300 చొప్పున సగటున రూ.6వేలతో అమ్ముడుపోయింది. అలాగే కరిపులి (ఫైన్) క్వింటా గరిష్టం రూ.33వేలు, కనిష్టం రూ.8వేలు, సగటు రూ.15వేలు చొప్పున ధర పలికింది. గత సోమవారం క్వింటా కరిపులి గరిష్ట ధర రూ.40వేలు కాగా, బుధవారం రూ.33వేలకు చేరుకోవడం గమనార్హం. క్రయవిక్రయాలను మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి పర్యవేక్షించారు. ‘పీఎంఏవై’లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు లబ్ధి ప్రశాంతి నిలయం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక లబ్ధిని ప్రభుత్వం చేకూరుస్తోందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఎంఏవై 1.0 కింద జిల్లాకు 71,969 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25,203 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన 40,024 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.80 లక్షలుగా నిర్దేశించినట్లు తెలిపారు. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలు ఆర్థిక లబ్ధి ఉంటుందన్నారు. ఇందులో నిబంధనలు వర్తిస్తాయన్నారు. తద్వారా జిల్లాలో 9.009 మంది బీసీలు, 1,548 మంది ఎస్సీలు, 548 మంది ఎస్టీలకు అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీవరకు లబ్ధిదారుల ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెళ్లి అదనపు లబ్ధి గురించి వివరించి, వారి ఇంటిని ఫొటో తీసుకుంటారన్నారు. -
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల గ్రామానికి చెందిన సురేంద్ర (34) డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సురేంద్ర చెన్నేకొత్తపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే జ్వరం తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమిస్తుండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక మంగళవారం రాత్రి ఆయన మృతి చెందాడు. కాగా, డెంగీ లక్షణాలతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలలపై లైంగిక వేధింపులు నివారించాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం పుట్టపర్తి అర్బన్: జిల్లాలో బాలలపై లైంగిక వేధింపులను పూర్తిగా నివారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నివేదిత అన్నారు. బాలల లైంగిక వేధింపుల నివారణ అంశంపై బుధవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో వారు మాట్లాడారు. లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ అత్యవసర సహాయ టోల్ ఫ్రీ నెంబర్లను గుర్తుంచుకోవాలన్నారు. వేధింపులు జరిగినప్పుడు వెంటనే 1098, 181, 100కి కాల్ చేసి సాయం పొందేలా చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే చెప్పుకునే సేచ్ఛను ఇవ్వాలన్నారు. అనంతరం డీఈఐసీ చైల్డ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ సిరిగిరి సుందరరావు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, విద్యాశాఖ, జువైనల్ శాఖ, ఒకేషనల్ విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ నేతల దాష్టీకం ● వైఎస్సార్సీపీ కార్యకర్తపై కర్రలతో దాడి ఆత్మకూరు: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన కురుబ చిక్కాల బాలన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు... బుధవారం సాయంత్రం తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వెళుతున్న బాలన్నపై కాపు కాచిన టీడీపీ నేతలు కర్రలతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కురుబలపై దాడి చేయడం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ కుట్రకు తెరలేపినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి అనంతరం కురుబ చిక్కాల బాలన్న ఆత్మకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నారాయణస్వామి, రమేష్, భరత్పై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏపీఆర్ఎస్ ప్రవేశ పోస్టర్ల విడుదల పరిగి: ఆంధ్రప్రదేశ్ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు మిగిలిన తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పోస్టర్లను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప విడుదల చేశారు.బుధవారం ఆయన పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ జేసీ కాలేజ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిష్టప్ప మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతిలో చేరే విద్యార్థులకు ఈనెల 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు. అదేవిదంగా 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను నోటిపికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. -
ప్రజలు తిరగబడే రోజులొచ్చాయి
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అంటూ ఆశపెట్టిన చంద్రబాబు... ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి నారా లోకేశ్ అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదం. పథకాలు అమలు చేయకుండా.. అబద్ధాలు చెబుతూ పబ్బం గడిపితే ప్రజలే తిరగబడతారు. బెల్టు షాపుల ద్వారా దొడ్డిదారిన ఉపాధి పొందేందుకు టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తుండటం బాధాకరం. – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
‘దుర్గం’లో దోపిడీ దొంగల బీభత్సం
కళ్యాణదుర్గం: పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. కత్తులు చేత పట్టుకుని హల్చల్ చేశారు. ఏకంగా రెండిళ్లలో చోరీలకు పాల్పడి, మరో ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.... కళ్యాణదుర్గంలోని పార్వతీ నగర్ మొదటి కాలనీలో నివాసముంటున్న దీప, అనిల్ దంపతులు మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని ఇంటికి తాళం వేసి పైకెళ్లి నిద్రించారు. విషయాన్ని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాను ధ్వంసం చేసి, నాలుగు తులాల బంగారు నగలు, రూ.1.60 లక్షల నగదు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న శిల్ప అనే మహిళ ఇంట్లో చొరబడి బ్రాస్లైట్ను అపహరించారు. అక్కడి నుంచి ముదిగల్లు బైపాస్ సమీపానికి చేరుకుని శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన నాలుగు గొర్రెలను ఎత్తుకెళ్లారు. ముసుగులు ధరించి.. కత్తులు చేతపట్టి పార్వతీనగర్ శివారు ప్రాంతంలోని అక్కమాంబ కొండ సమీపంలో నివాసముంటున్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు బాబు ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి 2.10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, కత్తులు చేతపట్టుకుని హల్చల్ చేశారు. రెండు, మూడు నిమిషాల పాటు అటుఇటు కలియతిరిగి, ఒకరు కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో అప్రమత్తమైన దుండగులు కాంపౌండ్లో నుంచి బయటపడి పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటన స్థలాలను పరిశీలించిన డీఎస్పీ రవిబాబు పార్వతీనగర్లో వరుస దోపిడీల సమాచారం అందుకున్న డీఎస్పీ రవిబాబు, అర్బన్ సీఐ యువరాజు, సిబ్బంది బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల ఆధారాలు సేకరించారు. కాగా, దుండగులు కత్తులు పట్టుకుని సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన వారు దొంగలా లేక పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. రెండిళ్లలో వరుస చోరీలు ముదిగల్లు బైపాస్లో నాలుగు గొర్రెల అపహరణ అర్ధరాత్రి కత్తులతో హల్చల్ చేసిన దుండగులు -
ఖాద్రీ ఉత్సవాలకు 30 ప్రత్యేక బస్సులు
పుట్టపర్తి టౌన్: కదిరిలో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు సాధారణ చార్జీలతోనే 30 ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం మధుసూదన్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ పర్సన్లు, అకౌంట్స్ విభాగం సూపర్వైజర్లతో సమావేశమై మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్ స్టేషన్లలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కదిరి బ్రహ్మోత్సవాలకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ సాధారణ చార్జీలతో అన్ని డిపోల నుంచి 30 ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసి సర్వీసులు తిప్పాలన్నారు. -
ప్రజల పక్షాన పోరాడతాం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎందరికో మేలు చేశారు. నేడు చంద్రబాబు.. సర్కారు..ఆ రెండు రంగాలను నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. చివరకు ఆరోగ్యశ్రీకి కూడా ఆంక్షలు విధించడం బాధాకరం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. పాలక పక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే -
సీఎంగా ఉండే అర్హత లేదు
సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అందులో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మనిషి ఎదుగుదలకు అవసరమయ్యే విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేయడం బాధాకరం. కేవలం వారి కార్యకర్తల బాగోగులు మాత్రమే చూసే చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండటానికి ఏ మాత్రమూ అర్హుడు కాదు. ఓటేసిన ప్రజలే చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టారు. బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకోవడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారు. – ఈరలక్కప్ప, మడకశిర సమన్వయకర్త -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నుంచి కలెక్టర్లు, జేసీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, పీ–4 మోడల్ సర్వే, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. మార్చి 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లలో లోపాలు ఉండకూడదన్నారు. పీ–4 సర్వే పక్కాగా చేసి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. మార్చి 15న చేపట్టే స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 232 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఫిజిక్స్/ ఎకనామిక్స్ పేపర్–2 పరీక్షలకు జిల్లాలో 232 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,329 మందికి గాను 9,134 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,147 మందికి గాను 1,110 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రఘునాథరెడ్డి, జిల్లా స్పెషలాఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, కమిటీ సభ్యులు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. -
మోసం... చంద్రబాబు నైజం
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కళ్లబొల్లి కథలు చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. చంద్రబాబు పాలన తీరును గమనిస్తే ప్రజలను మోసగించడమే ఆయన నైజమని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనాభావి తరం భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. ‘యువత పోరు’ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
వైద్య రంగాన్ని కాపాడుకుందాం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో వేల సంఖ్యలో జబ్బులను చేర్చి.. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి.. వ్యాపారం చేయాలని భావిస్తోంది. ప్రజలందరూ మేల్కొనాలి. వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. – టీఎన్ దీపిక, హిందూపురం సమన్వయకర్త -
●సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి నాల్గవ రోజైన బుధవారం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. స్వామివారికి ప్రీతి పాత్రమైన ఈ సింహ రూపంలోనే నర–సింహ అవతారమెత్తి హిరణ్య కశిపుడిని సంహరించారు. స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతుంటే ఎప్పటి లాగానే తమిళనాడుకు చెందిన నాదస్వరం, డోలు విద్వాంసులు శ్రీవారి వాహనం ముందు భక్తితో పాటు తమ కళను చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ప్రజలే బుద్ధి చెబుతారు
గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఏ ఒక్క పథకం ఇప్పుడు అమలులో లేదు. వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకుని.. సంక్షేమ పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో 2.67 లక్షల మంది వలంటీర్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం పెంచుతామని హామీ ఇచ్చి.. ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టింది. కూటమి సర్కారు వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఇంకెన్నో రోజులు ఈ ప్రభుత్వం నిలవదు. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే -
సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్ఫోన్ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్ఫోన్లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్ఫోన్ను అపహరించారు. అయితే తన సెల్ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్ఫోన్ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
సాంకేతికత నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశం
బత్తలపల్లి: మహిళా రైతులకు విలువ ఆధారిత సాంకేతికతను నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశమని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కేఎన్.నరసయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో గ్రాంట్ థార్న్టన్ ఆధ్వర్యంలో జీవాగ్రో ప్రాజెక్టులో భాగంగా సామూహిక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఆర్డీఏ పీడీతో పాటు జీవాగ్రో ప్రాజెక్టు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కుళ్లాయప్ప, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, డాట్ టీసీ నుంచి డాక్టర్ రామసుబ్బయ్య, సీఎస్ఏ ఆదినారాయణ, గ్రాంట్ థార్న్టన్ రామాంజులు, రాధ, హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదిన్నరగా అనంతపురం రూరల్, ముదిగుబ్బ, బత్తలపల్లి ప్రాంతాల్లో గ్రాంట్ థార్న్టన్ అమలులో ఉందని, పండ్ల తోటల పెంపకంపై మహిళా రైతులు దృష్టి సారించేలా చేయడం, వారికి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, మార్కెటింగ్ పరంగా వారికి సహాయపడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్రాజు, హరిప్రసాద్, శోభా, సీసీలు, బత్తలపల్లి ఎఫ్పీఓ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు నిలకడగా ఎండుమిర్చి ధర హిందూపురం అర్బన్: ఎండమిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 120.05 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.13,500 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పాక్షికంగా రద్దు గుంతకల్లు: డివిజన్ పరిధిలోని ధర్మవరం రైల్వే జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం (17215) ఎక్స్ప్రెస్ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్ప్రెస్ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్లా రైతులను ఇబ్బంది పెట్టేందుకే హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు ●రైతు సదస్సులో విశ్వేశ్వరరెడ్డి
కూడేరు: ఉమ్మడి అనంత జిల్లా రైతులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గ్రావిటీ ద్వారా కుప్పం ప్రాంతానికి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశమున్నా... కాదనీ జిల్లా రైతాంగం సంక్షేమాన్ని కూటమి సర్కార్ కాలరాస్తోందన్నారు. మంగళవారం కూడేరులోని శివరావు కల్యాణమంటపం వేదికగా హంద్రీ–నీవా కాలువ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుడు, ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన ‘రైతు సదస్సు’ జరిగింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్వార్థానికి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వంలో గాలేరు–నగరి ద్వారా కుప్పం ప్రాంతానికి నీరందించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుని 75 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులకు టెండర్లు పిలిచారన్నారు. సుమారు రూ.736 కోట్లతో పూర్తయ్యే లైనింగ్ పనులకు రూ.200 కోట్లు అధికంగా పెంచి టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా కాలువ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. లైనింగ్ పనులతో కాలువ గుండా ప్రవహిస్తున్న నీరు భూమిలోకి ఇంకదన్నారు. పక్కలకు ఊట రాదన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గి పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. భూములు బీళ్లుగా మారుతాయన్నారు. భవిష్యత్లో కాలువ వెడల్పు చేయడానికి అవకాశముండదన్నారు. లైనింగ్ పనులు ఆపాలని రైతులే వేడుకుంటున్నా... ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారానే నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే ముందుగా కాలువను వెడల్పు చేస్తే ఉమ్మడి అనంత జిల్లా రైతులు స్వాగతిస్తారన్నారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై న లైనింగ్ పనులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వైఎస్సార్సీపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధార్థ, మండల అఽధ్యక్షుడు సిద్ధారెడ్డి, ఏపీ రైతు సంఘం మండల నేతలు నారాయణరెడ్డి, వీరప్ప, వెఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నేతలు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ పనులు పూర్తయితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని రైతులు, రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సదస్సులో జయపురం, ఎంఎంహళ్లి, చోళసముద్రం, పి.నారాయణపురం, తిమ్మాపురం, కరుట్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హంద్రీ నీవా కాలువ పరిధిలో రూ.లక్షల్లో పెట్టుబడితో వివిధ రకాల పంటలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నామన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులో నీటి మట్టం తగ్గి పంటలు సాగు చేసుకోలేక నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేయకపోయిన పర్వాలేదని, నష్టం కల్గించే చర్యలు చేపట్టకుండా ఉంటే చాలన్నారు. హంద్రీ–నీవా కాలువ పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. -
‘మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’
అనంతపురం అగ్రికల్చర్: మామిడి తోటలు పిందె దశలో ఉన్నందున మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లా అధికారులు జి.చంద్రశేఖర్, బీఎంవీ నరసింహారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పిందె రాలడం, బంక కారడం, నల్లతామర, రసంపీల్చు పురుగులు, తేనె మంచు పురుగు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారం లేదా ఐదు రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలన్నారు. రసంపీల్చుపురుగు జాతికి చెందిన నల్లతామరను సకాలంలో నివారించుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. నివారణలో భాగంగా తోటలో కలుపు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎకరాకు 40 నుంచి 50 నీలి లేదా తెలుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పూత ప్రారంభ దశ నుంచి మొదట వేప సంబంధిత మందులు పిచికారీ చేయాలన్నారు. అందులో 2 మి.లీ అజాడిరక్టిన్ ( పది వేల పీపీఎం) లేదంటే 3 మి.లీ 1,500 పీపీఎం లేదా 3 వేల పీపీఎం ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే 7.5 గ్రాములు పొంగానియా లేదా నీమ్ సోప్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే 5 గ్రాములు బవేరియా బాసియానా లేదా లేకానిసిల్లియం లేకాని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. వీటన్నింటికీ నల్లతామర అదుపులోకి రాకపోతే చివరగా 2 మి.లీ పిప్రొనిల్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు థయామిథాక్సామ్ లేదా 1 మి.లీ స్పైరోటేట్రామెట్ లేదా 1 మి.లీ స్పైనోటోరం లేదా 1 మి.లీ ఫ్లూక్సా మెటామైడ్ మందులు మార్చి మార్చి రెండు మూడు దఫాలుగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం: ఆలయ నిర్మాణానికి పోగు చేసిన మొత్తాన్ని దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో సీతారామాంజినేయులు ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాల రూపంలో పోగు చేసిన రూ.12 లక్షలను గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి వద్ద భద్రపరిచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై ఈ నెల 4న కణేకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పాములు పట్టుకుంటూ .. తమిళనాడుకు చెందిన గురునాథం రాజు.. బాతులు మేపుతో జీవనం సాగించేవాడు. గురునాథానికి వరుసకు మేనమామ అయిన జానయ్య ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. వీరి తల్లిదండ్రులు ఊరారా తిరుగుతూ గ్రామాల్లో పాములు ఆడిస్తూ జీవనం సాగించేవారు. తమిళనాడు బాతులు మేపుతున్న సమయంలోనే అక్కడే వీరికి కార్తీక్ అనే యువకుడు పరిచయమై, మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో వలస వచ్చిన ముగ్గురూ గత 20 రోజులుగా కణేకల్లు మండలంలో మోటార్ సైకిల్పై గ్రామాల్లో సంచరిస్తూ ఊరు చివర గుడారాలు వేసుకుని రెండు, మూడు రోజులు అక్కడే ఉంటూ పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో హుండీలను అపహరించి, అందులోని భక్తుల కానుకలనూ అపహరించేవారు. దారిన పోతూ చోరీ ఈ నెల 2న కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన గురునాథం రాజు, జానయ్య, కార్తీక్... రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో సొల్లాపురం వద్దకు చేరుకున్న వారికి గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో పథకం వేసి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుపరాడ్తో తలుపు తాళాలు మెండి లోపలకు ప్రవేశించారు. స్క్రూడ్రైవర్ సాయంతో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.12 లక్షల నగదు అపహరించారు. చోరీ అనంతరం జీడిపల్లి డ్యామ్ చేరుకుని రూ.50 వేలను జానయ్య తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడి కర్ణాటకలోని సిరిగుప్పకు మకాం మార్చేందుకు మంగళవారం జీడిపల్లి డ్యామ్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు గుర్తించి కణేకల్లు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గురునాథం రాజుపై వైఎస్సారఱ్ జిల్లా యర్రగుంట్ల, కర్నూలు జిల్లా హాలహర్వి పీఎస్ల పరిధిల్లో చోరీ కేసులు ఉన్నాయి. తమిళనాడులోని పోలూరు, శ్రీపెరంబూరు పీఎస్ల పరిధిల్లోనూ ద్విచక్రవాహనాల అపహరణ కేసులు, కర్ణాటకలోని బొమ్మనహళ్లి, ఏపీలోని వి.కోట పీఎస్ పరిధిలోనూ మోటార్ సైకిళ్ల చోరీ కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు, డి.హీరేహళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డిను ఏఎస్పీ అభినందించారు. రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం -
సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్ఫోన్ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్ఫోన్లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్ఫోన్ను అపహరించారు. అయితే తన సెల్ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్ఫోన్ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
● అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు ధర్మవరం అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ధర్మవరం వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని నేసేపేటకు చెందిన లక్ష్మీపతి భార్య నీరుగంటి అఖిల(21) ఓ పైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం వివాహమైన వీరి సంసారం కొంత కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని అఖిల ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. అల్లుడు లక్ష్మీపతి, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులే తమ కుమార్తె మృతికి కారణమంటూ మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విద్యార్ధిని బలవన్మరణం సోమందేపల్లి: స్థానిక పాతూరులో నివాసముంటున్న ఈడిగ సురేష్ కుమార్తె పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న పూజిత... తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నోట్ రాసి మంగళవారం సాయంత్రం ఇంట్లోనే పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ‘క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలి’ పుట్టపర్తి రూరల్: పదో తరగతి, ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయని, చాలామంది టీచర్లు ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల విధుల్లో ఉన్నారన్నారు. ఈ పరిస్థితులో ఈ నెల జరగాల్సిన పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయడం ఉత్తమమన్నారు. ఈ అంశంలో ఒంటెద్దు పోకడలకు పోకూడదని ప్రభుత్వానికి సూచించారు. ఆకట్టుకున్న కర్రసాము పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. -
హంస వాహనంపై వీణాపాణి
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు మంగళవారం రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని భక్తజనం తన్మయత్వం చెందారు. నారసింహుడు హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెబుతారని అర్చకులు వెల్లడించారు. ఉభయదారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా,బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాటమరాయుడు బుధవారం మాడవీధుల్లో సింహవాహనంపై దర్శనమివ్వనున్నారు. -
బుల్లెట్ షెల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల సమీపంలో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ షెల్ (తుపాకులలో ఉపయోగించే) ఫ్యాక్టరీని జిల్లా ఎస్పీ రత్న మంగళవారం పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారంటూ యాజమాన్య ప్రతినిధులతో ఆరా తీశారు. కంపెనీ వివరాలు, చేపట్టిన పనులు ఎంత వరకూ పూర్తి అయింది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ, కంపెనీ సిబ్బంది ఉన్నారు. నేరాల నియంత్రణకు చొరవ తీసుకోండి పెనుకొండ రూరల్: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ రత్న ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కియా పీఎస్ను ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామ ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎస్పీ చెన్నేకొత్తపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. సీకేపల్లిలోని టింబక్టు కలెక్టివ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరయ్యారు. అంతకు ముందు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్పీతో పాటు టింబక్టు కలెక్టివ్ సంస్థ వ్యవస్థాపకురాలు మేరి మాట్లాడారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్, సీఐ శ్రీధర్, ఎస్ఐ సత్యనారాయణ, సంస్థ ఏడీ సుకన్య, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులను ప్రభుత్వం దగా చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు మండిపడ్డారు. కార్మికులకు 10 నెలల వేతనం, 35 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన, పీఎఫ్ బకాయిల మంజూరుతో పాటు లీటర్ బేస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఓబుళు మాట్లాడుతూ... శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 600 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వేతనాల కోసం ఏడాదిలో మూడు దఫాలు సమ్మెలు చేయాల్సి వస్తోందన్నారు. సరైన బడ్జెట్ కేటాయించి కార్మికులకు వేతనం, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన లీటర్ బేస్ విధానం కారణంగా నీటి సరఫరాలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయితే వీటికి కార్మికులను బాధ్యులను చేస్తూ ఒక్కొక్క కార్మికుడికి రూ.2,500 చొప్పున వేతనంలో కోత విధించడం సబబు కాదన్నారు. సరైన వసతులు కల్పించని కారణంగా తలెత్తుతున్న ఈ వైఫల్యానికి తొలుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆ తరువాత చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, డీఈఈ వరకు అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. పంపు హౌస్లో ఆపరేటర్లు, హెల్పర్లకు మూడు షిఫ్ట్లు ఉంటే... కార్మికులను తగ్గించి రెండు షిఫ్ట్గా పనిచేయించాలని టెండర్లలో పెట్టినట్లు తెలుస్తోందన్నారు. దీంతో వందల గ్రామాలకు నీరందిస్తున్న ఈ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. పథకాన్ని కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తామని, ప్రజలు కూడా ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు హొన్నూరు స్వామి, ప్రభాకర్, సోము, చిక్కన్న, హనుమంతరాయ, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం ఏడాదిలో మూడు సార్లు ధర్నాలు చేయాలా? సరైన బడ్జెట్ కేటాయించి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు -
వైఎస్ జగన్ గొప్ప మనసు..
2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించి చేయూతనిచ్చింది. అలాగే నాలుగేళ్లలో జిల్లాలో 44,082 మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక్క విద్యా దీవెన కిందే రూ.314 కోట్లు అందించింది. వసతి దీవెన కింద జిల్లాలోని 43,301 మంది విద్యార్థులకు జగన్ సర్కార్ రూ.162.38 కోట్ల అందించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వసతి దీవెనకు కూడా రూపాయి కూడా విడుదల చేయలేదు. ● హిందూపురానికి చెందిన రమేష్కు అనంతపురంలోని కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఏడాదికి రూ.9 లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. అయితే, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ కోరగా.. రమేష్ కళాశాలలో సంప్రదించాడు. ప్రభుత్వం ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని, సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో రమేష్ అప్పు చేసి ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. ● నిరుపేద కుటుంబానికి చెందిన ధర్మవరానికి చెందిన మహిత అనంతపురం జిల్లాలోని ఓ కళాశాలలో ఎంసీఏ పూర్తి చేసింది. హైదరాబాద్లోని ఓ పేరొందిన కంపెనీలో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అయితే సర్టిఫికెట్లు సమర్పించాల్సి రావడంతో కళాశాలను వెళ్లగా...ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందిస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో మహిత తండ్రి వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఫీజు చెల్లించారు. ..ఇలా జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోగా..చాలా మంది ఉద్యోగం సంపాదించినా అందులో చేరలేకపోయారు.పుట్టపర్తి: విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. అలాగే వసతి దీవెనకు కూడా పూర్తిగా మంగళవారం పాడింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఊసే లేకుండా 9 నెలలుగా పాలన సాగిస్తోంది. నిధులు నిలిపిన కూటమి వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన గత జూన్ నెలలో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, అధికారంలోకి వచ్చిన ‘కూటమి’ నిధులు చెల్లించకుండా నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 100 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ‘వసతి దీవెన’ పథకానికి కూడా చంద్రబాబు సర్కారు పూర్తిగా మంగళం పాడటం గమనార్హం. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 5 త్రైమాసికాలుగా అన్ని రకాలు ఫీజులు పెండింగ్లో ఉంచి పేద విద్యార్థుల భవిష్యత్ను అంధకారం చేస్తోంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా విద్యార్థులను ఆదుకుంటామని ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు.. అధికారం చేపట్టాక వాటన్నింటినీ తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతుండటంతో బాధిత తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. పరిశ్రమల స్థాపన ఊసే లేదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేసింది. దీంతో పరిపాలన సౌలభ్యం ఏర్పడింది. అలాగే హిందూపురం పారిశ్రామిక వాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన ఏ ప్రాంతంలోను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక్క పరిశ్రమ స్థాపించలేదు. నోటిఫికేషన్ లేదు... భృతి అందదు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని 2024 ఎన్నికలప్పుడు కూటమి నేతలు నమ్మ బలికారు. ఉద్యోగల భర్తీకి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.3 వేల చొప్పున ఇప్పటికి 10 నెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల కింద రూ.600 కోట్లు చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులకు బకాయి ఉంది. మెడికల్ కళాశాలకు మొండి చేయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో ఏకై క ప్రభుత్వ మెడికల్ కళాశాలను పెనుకొండలో ఏర్పాటు చేసింది. ఈ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు ఎక్కడికక్కడ నిలిపివేసింది. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా.. మెడికల్ కళాశాల పనులు ముందుకు సాగకపోవడం దురదృష్టకరమని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. పెనుకొండలో ‘యువత పోరు’ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉషశ్రీచరణ్10 నెలల భృతి ఇవ్వాల్సిందే గత జగన్ సర్కార్ తొలి రెండేళ్లలోనే ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రస్తుత కూటమి సర్కార్ అధికారం చేపట్టి 9 నెలలు పూర్తవుతున్నా... ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ అయినా విడుదల చేయాలి. లేకపోతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 10 నెలల కాలానికి రూ.30 వేలు ఇవ్వాలి. – అనిల్, నిరుద్యోగి, బుక్కపట్నందీవెన అందలేదు గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా పడేది. గతంలో బకాయిలు ఉన్నా ..వైఎస్ జగన్ చెల్లించారు. పేదింటి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. నేను బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము బకాయి ఉంది. వసతి దీవెన సొమ్ము రూ.20 వేలు జమ కాలేదు. వస్తుందో...రాదో తెలియని అయోమయం నెలకొంది. అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలుస్తోంది. విద్యార్థులను రాజకీయాల్లోకి లాగకుండా దన్నుగా నిలవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. – విశ్వనాథ్, బీటెక్ విద్యార్థి, పుట్టపర్తి పుట్టపర్తి/పెనుకొండ రూరల్: విద్యార్థులు, యువతను దగా చేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగులకు భృతి మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుందని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు మంగళవారం ఉషశ్రీచరణ్ పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు, యువకుల భవిష్యత్ కోసమే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైందన్నారు. -
ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలు సైతం ఏపీలో గల్లంతయ్యాయి. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ‘‘పార్టీ అంటే ప్రజలు.. పాలకులంటే ప్రజలే’’ అంటూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి పోరాడిన పార్టీగా వైఎస్సార్ సీపీ ముద్ర వేసుకుంది. కష్టాలొచ్చినా ఎదురొడ్డి.. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ‘అనంత’ రైతుల ఆక్రందనలపై 2014–19 కాలంలో అసెంబ్లీలో గళమెత్తారు. రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తరఫున నిలబడ్డారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పాలన అంటే ఇలా ఉండాలని.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. సాధారణంగా ఎన్నికలముందు హామీలివ్వడం, ఆ తర్వాత తుంగలో తొక్కడం చూసి ఉంటాం. కానీ పాలన చేపట్టిన రోజు నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ అమలు చేశారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు చెప్పిన తేదీకే ‘రైతు భరోసా’ అందించారు. డ్వాక్రా మహిళలకు ఆసరా, ‘సున్నా వడ్డీ’తో అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఆదుకున్నారు. ప్రాథమిక ఆరోగ్యానికి పునరుజ్జీవం పోశారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పెనుకొండకు మెడికల్ కాలేజీ, అనంతపురంలో ఎంసీహెచ్ బ్లాకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్దే. అయితే, ప్రజలను మభ్యపెట్టి 9 నెలల క్రితం గద్దెనెక్కిన చంద్రబాబు.. వచ్చీ రాగానే విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ‘యువత పోరు’కు శ్రీకారం చుడుతున్నారు. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ‘వైఎస్సార్ సీపీ’ ఉమ్మడి అనంత జిల్లాలో రైతులు, మహిళల పక్షాన ఎనలేని పోరాటాలు 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి.. సీఎంగా పాలన అంటే ఇలా ఉండాలని చూపించిన జగన్ నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
భూసేకరణ పనులన్నీ పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాలులో ఎన్హెచ్ 342, ఎన్హెచ్–716జీ, జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూముల రైతులకు ఇచ్చిన పరిహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే భూసేకరణ పెండింగ్ పనులపై ఆరా తీశారు. ప్రమాదాలు జరిగేందుకు అస్కారం ఉన్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ లైన్లు మార్పు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బుక్కపట్నం మండలం సిద్దరాంపురం పంచాయతీ భవనం, చిన్నరాయునిపల్లి ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ సమస్య, బుక్కపట్నం గ్రామ గోశాల సమస్య, పుట్టపర్తి, పెడబల్లి, బూదిలి భూసేకరణకు సంబంధిత అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎన్హెచ్ ఏఐ పీడీ బి.అశోక్ కుమార్, ముత్యాలరావు, నాగరాజు, ఎల్. సుజాత, తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి, మారుతి, సురేష్ బాబు పాల్గొన్నారు. ‘పురం’ మున్సిపల్ కమిషనర్ నియామకంపై రిట్ చిలమత్తూరు: హిందూపురం మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు నియామకంపై హైకోర్టులో ఎస్.శ్రీధర్ అనే వ్యక్తి మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషనర్ అయ్యేందుకు సంగం శ్రీనివాసులును కనీస విద్యార్హత లేదన్నారు. కానీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో హిందూపురం కమిషనర్గా నియమిస్తూ జీఓ ఇచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే ఆ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ శాఖ డైరెక్టర్, ‘పురం’మున్సిపల్ కమిషనర్ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఇష్టారాజ్యంగా బిల్లులు మంజూరు చేయించుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు సంగం శ్రీనివాసులును పురం మున్సిపల్ కమిషనర్గా నియమించాలని సిఫారసు చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన నియామకాన్నే సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా పని చేయాలి ● సిబ్బందికి డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం పిలుపు పుట్టపర్తి అర్బన్: మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పని చేయాలని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్ఓ తన కార్యాలయంలో మాతాశిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో రెడ్డిపల్లి, సోమందేపల్లి, శివనగర్, చిలమత్తూరు, కొక్కంటి, దర్శినమల, పెద్ద మంతూరు పీహెచ్సీల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 7 శిశు మరణాలు సంభవించాయన్నారు. తల్లీబిడ్డలను సంరక్షించుకునేందుకు వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించడం ద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రతి నెలా 9వ తేదీన జరిగే శిక్షణలో గర్భిణులకు అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ మంజువాణి, డాక్టర్ సెల్వియా సాల్మన్, డాక్టర్ నాగేంద్రనాయక్, డాక్టర్ సునీల్, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత, పీడీయాట్రీషియన్ డాక్టర్ జోయెల్ వెస్లీ, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, 108 ఈఓ అబ్దుల్ హుస్సేన్, పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తంగా 218 అర్జీలు అందించారు. కలెక్టర్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి’ అన్న నినాదంతో ఈనెల 15వ తేదీన స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పీ–4 సర్వేను మండలాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, సీపీఓ విజయ్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు. ఉగాది నుంచి జిల్లాలో పీ–4 సర్వే ‘స్వర్ణాంధ్ర–2047’లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఉగాది నుంచి పీ–4 సర్వేకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పీ–4 కార్యాచరణకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పేదరికం లేని సమాజం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్షిప్ (పీ–4) సర్వే చేస్తోందన్నారు. కార్యక్రమం అమలుపై ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ఈనెల 25వ తేదీలోపు అభిప్రాయాలు తెలియజేసే వారికి ప్రశంసా పత్రం అందిస్తామన్నారు. వర్మీకంపోస్టుపై అవగాహన కల్పించాలి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో గోరంట్ల గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ స్టాల్ను ఆయన సందర్శించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
పతాక స్థాయికి నిరుద్యోగం
● గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ఉన్నా ఫలితం శూన్యం ● ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కాక చిన్న ఉద్యోగాలకూ దిక్కులేని వైనం ● 20 లక్షల ఉద్యోగాలిస్తామని ముఖం చాటేసిన చంద్రబాబు ● భృతి ఇస్తామని చెప్పి రిక్తహస్తం చూపడంపై నిరుద్యోగుల మండిపాటు అనంతపురం నగరంలోని ఓ హోటల్లో రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ సేల్స్మెన్ ఉద్యోగాలకు నిర్వహించిన వాక్ఇన్ ఇంటర్వ్యూలకు పోటెత్తిన నిరుద్యోగులు వీరు. ఇంజినీరింగ్ మొదలు ఎంబీఏ పట్టభద్రుల వరకు వందల మంది హాజరయ్యారు. దీంతో హోటల్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. చిన్న సేల్స్మెన్ ఉద్యోగం కోసం వచ్చిన వీరిని చూస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో అంచనా వేయొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ● గార్లదిన్నెకు చెందిన రాజశేఖర్ ఇటీవల బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసినా రాలేదు. దీంతో ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మరో ఉద్యోగంలో చేరదామని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోందని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ● రాప్తాడుకు చెందిన శీనయ్య అనంతపురంలో బీకాం పూర్తి చేశాడు. తన అర్హతకు తగిన జాబు కోసం కొన్ని నెలలుగా ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఇటీవల ఓ పెట్రోలు బంకు యజమాని వద్ద నిర్వహణ మేనేజర్గా చేరాడు. రేయింబవళ్లు పనిచేస్తే రూ.12 వేలు వేతనం. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులది ఇదే పరిస్థితి. -
భూ ఆక్రమణలను అరికట్టండి
బత్తలపల్లి మండలం సంజీవపురం సర్వే నంబర్ 97లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ ముల్లుగూరు సంజీవరాయుడు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓ విజయసారథికి విన్నవించారు. సర్వే నంబర్ 97లో గ్రామసచివాలయం, ఆర్ఎస్కే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించారని, మిగిలిన స్థలంలో ‘చింత–నిశ్చింత’ కార్యక్రమం క్రింద చింత చెట్లు నాటారన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు చింత చెట్లను నరికేసి అక్రమంగా ఇంటి పునాదులు తవ్వుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘చింత’కు రికార్డు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర అమాంతం పెరిగింది. సోమవారం క్వింటా రూ.40 వేలు పలికి ఈ ఏడాది గరిష్ట రికార్డును తాకింది. స్థానిక వ్యవసాయ మార్కెట్కు 2146.80 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా చింతపండు గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12,400, కనిష్టంగా రూ.4,200, సరాసరిన రూ.6 వేల ప్రకారం క్రయ విక్రయాలు సాగాయి. ఈసారి చింతపండు దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడంతో మార్కెట్లో మంచి ధర దక్కుతోంది. 140 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థులకు మ్యాథమ్యాటిక్స్–2బీ/జూవాలజీ–2/ హిస్టరీ పేపర్– 2 పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులు 6,339 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 6,236 మంది హాజరయ్యారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,144 మందికిగానూ 1,107 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 140 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. పరారీలో రెడ్డెప్పశెట్టి !● ఇప్పటికే రెండు కేసులు.. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి..? సాక్షిక్షి టాస్క్ఫోర్స్: చిలమత్తూరు మండలం కోడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో చిత్రావతి నదీ పరివాహక భూములను ఆక్రమించిన రియల్టర్ రెడ్డప్ప శెట్టి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంతో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెడ్డప్పశెట్టిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా తన పొలానికి వెళ్లే దారిని రెడ్డెప్పశెట్టి మూసివేయడంతో పాటు ప్రశ్నించిన తనను బెదిరించాడని స్థానిక రైతు నరసింహులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు రెడ్డెప్పశెట్టిపై 341 సెక్షన్ కింద మరో కేసు నమోదు చేశారు. కంచె వ్యవహారంలో మరో కేసు రైతుల పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా కంచె వేయడం, నదిని తన ఆధీనంలో ఉంచుకోవడం వంటివి రెడ్డెప్పశెట్టి మెడకు చుట్టుకుంటున్నాయి. రెవెన్యూ అధికారుల విచారణలో రెడ్డప్పశెట్టి అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని తేలడంతో ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రెడ్డెప్ప శెట్టి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. రెవెన్యూ అధికారులు మరో నోటీసు ఇవ్వాల్సి ఉండగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. -
యువత పోరుతో బాబుకు బుద్ధి చెబుదాం
పరిగి: ‘చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు... చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. కనీసం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అయినా ఇస్తారంటే..అందుకూ చంద్రబాబుకు మనసు రావడం లేదు.. అలవిగాని హామీలతో నమ్మించి యువతను మోసం చేసిన సీఎం చంద్రబాబుకు ‘యువత పోరు’తో బుద్ధి చెబుదాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె పరిగిలో ఈనెల 12న వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కేవలం పింఛన్లు చూపుతూ ఆర్భాటం చేయడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నయవంచన ప్రభుత్వ మెడలు వంచుదాం ఫీజు రీయంబర్స్మెంట్ పథకం కింద రూ.4,500 కోట్లు బకాయిలున్నాయని, వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు... మాట తప్పారన్నారు. అందరూ సంఘటితమై ఈ ప్రభుత్వ మెడలు వంచుదామని ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ‘యువత పోరు’లో భాగంగా పుట్టపర్తిలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూ.4500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలి 12న ‘యువత పోరు’కు అన్ని వర్గాలు కలిసివచ్చి విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపు -
చంద్రబాబు మోసం చేశారు
పెనుకొండ రూరల్: డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి సీఐటీయూ నేతృత్వం వహించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడచిన అంగన్వాడీ కార్యకర్తల సమస్యలకు పరిష్కారం దొరకలేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు రూ.26 వేలు కనీస వేతనం చెల్లించాలన్నారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవులను కనీసం 3 నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఫ్రీ స్కూల్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇవ్వాలని కోరుతూ కార్యాలయ ఏఓ గిరిధర్ నాయక్కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాబావలి, రంజిత్ కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు జయమ్మ, జయతుంబి, లక్ష్మీదేవి, పార్వతి, శాంతిబాయి, సరస్వతి తదితురులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా -
పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్య
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నరసింహులు (34) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం నొప్పి తీవ్రత తాళలేక కొండాపురం సమీపంలో పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి బలవన్మరణం హిందూపురం అర్బన్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. హిందూపురంలోని ఆటోనగర్కు చెందిన లక్ష్మీకాంత్ (21)కు భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న లక్ష్మీకాంత్ కొంత కాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తన అవసరాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బు సమకూరక ఇబ్బంది పడిన లక్ష్మీకాంత్ సోమవారం వేకువజామున ఆటోనగర్ వద్ద పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి దుర్మరణం ఉరవకొండ: స్ధానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండలోని ఇంద్రా నగర్కు చెందిన కార్తీక్ (18), నందకుమార్ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక డివైడర్ను ఢీకొన్నారు. ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందకుమార్ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ మహనంది కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పక్కా గృహాల కూల్చివేత
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన మైనార్టీ కాలనీలోని పలు పక్కా గృహాలు, ఇంటి పునాదులను అధికారులు తొలగించారు. గుట్టుచప్పుడు కాకుండా, లబ్దిదారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ ప్రక్రియను సెలవు రోజైన ఆదివారం చేపట్టడం విమర్శలకు దారి తీసింది. సోమవారం కూడా తొలగింపు ప్రక్రియను అధికారులు కొనసాగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మడకశిరలోని మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేశారు. ఇందు కోసం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద అప్పట్లో భూసేకరణ చేసి మైనార్టీ కాలనీని ఏర్పాటు చేశారు. దాదాపు 180 మందికి కాలనీలో పక్కా గృహాలు మంజూరు కాగా, ఆర్థికంగా స్థోమత ఉన్న వారు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు పునాదులు వేసుకున్నారు. కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మడకశిర మీదుగా రాయదుర్గం– తుమకూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టాయి. ప్రస్తుతం ఈ పనులు మడకశిర సమీపంలో జరుగుతున్నాయి. ఈ కాలనీ గుండానే రైల్వేలైన్ పోతోంది. దీంతో కాలనీలోని దాదాపు 73 పక్కా గృహాలు రైల్వే లైన్ పనులకు అడ్డంకిగా మారాయి. వీటిని తొలగించాలని సంబంధిత అధికారులు కొన్నేళ్లుగా లబ్దిదారులకు సూచిస్తూ వచ్చారు. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపించి ఇళ్లు, ఇంటి పునాదులు తొలగించుకోవాలని స్థానికులు కోరుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం అధికారులు భారీ యంత్రాలతో అక్కడకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియను జేసీ అభిషేక్కుమార్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జేసీ అభిషేక్కుమార్ కల్పించుకుని బాధితులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. మడకశిరలో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగింపు -
ప్రభుత్వ డాక్టర్ అత్యాశ
కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యురాలి ధన దాహానికి పేదలు బలవుతున్నారు. రూ. లక్షల్లో జీతం తీసుకుంటూనే కమీషన్ కోసం కక్కుర్తి పడి స్కానింగ్లన్నీ ప్రైవేట్ ల్యాబ్కు సిఫారసు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి స్కానింగ్కు రూ. వేలల్లో గర్భిణులు నష్టపోతున్నారు. స్కానింగ్ యంత్రాలున్నా.. రోజూ 2 వేల ఓపీ ఉన్న కదిరి ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి పనితీరు సక్రమంగానే ఉంది. అయినా ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలు మాత్రం వీటి సేవలను ఏ మాత్రం వినియోగించుకోవడం లేదు. ప్రతి సారీ స్కానింగ్కు ప్రైవేట్ ల్యాబ్కు సిఫారసు చేయడం ద్వారా రూ.వేలల్లో ఆమెకు కమీషన్ దక్కుతున్నట్లు సమాచారం. కమీషన్ల కక్కుర్తిలో పడిన ఆమె దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. అక్కడ కూడా ‘ఆమె’నే ఈ నెల 7న కదిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో కాన్పు కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యురాలు.. గర్భంలో సమస్య ఉందని నాలుగు స్కానింగ్లను ఆస్పత్రి పక్కనే ఉన్న ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకుని రావాలని రాసిచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేయరా? అని ఆమె బంధువులు అడిగితే ఇక్కడ అలాంటి సౌకర్యం లేదని బుకాయించినట్లు సమాచారం. దీంతో గర్భిణిని పిలుచుకుని డాక్టర్ చెప్పిన స్కానింగ్ సెంటర్కు బంధువులు వెళ్లారు. కాసేపటి తర్వాత స్కానింగ్ గదిలోకి గర్భిణిని తీసుకెళితే అక్కడ సదరు డాక్టరే ప్రత్యక్షమై స్కానింగ్ చేసి, రిపోర్టులు తీశారు. ఈ మొత్తం ప్రక్రియకు రూ.4,500 ఫీజును చెల్లించుకోవాల్సి వచ్చిందని, స్కానింగ్లో ఎలాంటి అనుమానాస్పద రిపోర్టులూ రాలేదని బాధితులు వివరించారు. ఇదే తరహాలో రోజూ పదుల సంఖ్యలో గర్భిణులను ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపుతూ నిర్వాహకుల నుంచి కమీషన్లను ప్రభుత్వ గైనకాలజిస్ట్ దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. స్కానింగ్లన్నీ ప్రైవేట్ ల్యాబ్కు ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యమున్నా కమీషన్ కోసం కక్కుర్తి గర్భిణులకు రూ.వేలల్లో ఖర్చు ఈ విషయం తెలుసు ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రూ.45 లక్షలు విలువ చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా డాక్టర్ బయటకు రాసిస్తున్నారు. ఈ విషయం తెలుసు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు కూడా అందాయి. తీరు మార్చుకోవాలని ఆమెకు చెప్పినా పట్టించుకోవడం లేదు. బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ హుస్సేన్, సూపరింటెండెంట్, కదిరి ఏరియా ఆస్పత్రి -
పెట్టుబడి కూడా అందలేదు
కక్కలపల్లి టమాట మండీలో కొనసాగుతున్న క్రయవిక్రయాలుఅనంతపురం అగ్రికల్చర్: టమాటను నమ్ముకున్న రైతులు ఈ సారి కూడా భారీగా నష్టాలు మూటకట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో ఏకంగా ఖరీఫ్, రబీలో ఈ ఏడాది 45 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగులోకి వచ్చింది. ఈ సారి 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడిని రైతులు సాధించారు. టన్ను సరాసరి కనిష్టంగా రూ.15 వేలు ప్రకారం అమ్ముడుబోయినా ఈ సారి రూ.1,200 కోట్ల మేర టర్నోవర్ ఉండేదని అంచనా. కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా 80 శాతం మంది రైతులు భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రారష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాల టమాట సాగులో మొదటి స్థానంలో ఉండగా... 22 వేల ఎకరాలతో శ్రీసత్యసాయి జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి. నాలుగు నెలలుగా పతనావస్థలో.. సీజన్ ఆరంభమైన జూలై నుంచి అనంతపురం సమీపంలో ఉన్న కక్కలపల్లి మండీలో టమాట అమ్మకాలు మొదలయ్యాయి. మొదట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు టమాట సాగుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఫలితంగా సెప్టెంబర్ నుంచి పంట దిగుబడులు, మార్కెట్కు సరుకు రావడం పెరిగింది. ధర కొంచెం బాగున్నప్పుడు మధ్య మధ్యలో వర్షాలు రావడంతో పంట తడిసిందని, మచ్చ ఉందంటూ మండీ నిర్వాహకులు, వ్యాపారులు ‘నో సేల్’ పెట్టడంతో చాలా మంది రైతులకు అసలుకే మోసపోయారు. ఇలా డిసెంబర్ వరకు టమాట అమ్ముడుపోక కొందరు రైతులు తల్లడిల్లిపోయారు. ఇక డిసెంబర్ నుంచి మార్కెట్ పూర్తిగా పతనమైంది. గరిష్ట ధర రూ.10, కనిష్టం రూ.5, సరాసరి రూ.7 చొప్పున గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు కొనసాగుతుండటంతో టమాట రైతులు పూర్తిగా చిత్తయ్యారు. నాలుగైదు లాట్ల గరిష్ట ధర రూ.10 ప్రకారం అమ్ముడుబోగా మిగతాదంతా రూ.5 నుంచి రూ.7 కి మించి ధర పలకలేదు. దీంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాదని గ్రహించి పంటను పొలాల్లోనే వదిలేశారు. ‘కూటమి’ మోసం.. జిల్లాలోని 31 మండలాల్లో ఖరీఫ్లో 42 వేల ఎకరాలు, రబీలో 3 వేల ఎకరాల్లో టమాట సాగు చేసినట్లు ఉద్యానశాఖ నివేదికలు చెబుతున్నాయి. టమాట రైతులు ఇబ్బంది పడకుండా కిలో రూ.8 చొప్పున టన్ను రూ.8 వేలతో కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆచరణకు వచ్చేసరికి మార్కెటింగ్శాఖ ద్వారా ఇటీవల కేవలం 60 టన్నులు అంటే రూ.4.80 లక్షల విలువ చేసే టమాట మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. అనంతపురం మండీకి ప్రస్తుతం కొంత తగ్గినా డిసెంబర్ నుంచి పరిగణనలోకి తీసుకుంటే రోజుకు సగటున 500 టన్నుల వరకు సరుకు వస్తోంది. కనీసం రోజుకు 100 టన్నులైనా కొనుగోలు చేస్తే కొంత వరకు రైతులకు వెసులుబాటు ఉంటుంది. కానీ సీజన్ అంతా కొన్నది కేవలం 60 టన్నులు మాత్రమే అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా గిట్టుబాటు ధర లేక భారీగా నష్టాలు కిలో రూ.8 చొప్పున కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 60 టన్నులతో చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలోనే అత్యధికంగా 45 వేల ఎకరాల్లో టమాట పంట ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేశా. పంట దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోయాను. ఇటీవల మండీలో 15 కిలోల బాక్సు రూ.70కు మించి పలకలేదు. అంటే కిలో రూ.5 చొప్పున కూడా కొనుగోలు చేయడం లేదు. మొదటి నాలుగైదు కోతల్లో నాణ్యమైన కాయ ఉన్నా కొనలేదు. పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికి అందలేదు. ఇలా అయితే రైతులు ఎలా బతకాలి. – సుధాకర్, టమాట రైతు, దయ్యాలకుంటపల్లి, బీకేఎస్ మండలం -
ఎస్సీ, ఎస్టీ కేసులంటూ వేధిస్తున్నారు
ప్రశాంతి నిలయం: విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుల పేరుతో బెదిరిస్తున్నారని, తమను రక్షణ కల్పించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. గత శుక్రవారం సాయంత్రం పెడపల్లి సచివాలయానికి రంగప్ప, తిప్పన్న అనే వ్యక్తులు వచ్చి రూ.1.5 లక్షలకు ఇంటి పన్ను మదింపు సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని అడిగారన్నారు. వారిచ్చిన ఆధారాల మేరకు అంత మొత్తానికి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలియజేస్తే సదరు వ్యక్తులు ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి ప్రయత్నించారన్నారు. మీరెలా విధులు నిర్వహిస్తారో చూస్తామంటూ బెదిరించారని, అంతటితో ఆగకుండా నలుగురు సచివాలయ ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గోపాల్రెడ్డి, ప్రభాకర్, సురేంద్ర, గణేష్, ఓం ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించాలని జేసీకి ఉద్యోగుల వేడుకోలు -
‘పోలీసు స్పందన’కు 55 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (స్పందన)కు వివిధ సమస్యలపై 55 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించారు. సమస్య తీవ్రత అడిగి తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. పల్లె అక్రమాలపై ఈడీ విచారణ చేయించాలి ● కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసిన ఎంపీపీ ఆదినారాయణయాదవ్ సాక్షి, పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్, విద్యాసంస్థల పేరుతో ఫీజుల దోపిడీ ద్వారా రూ.వేల కోట్లు సంపాదించారని, వీటన్నింటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణ చేయించాలని ముదిగుబ్బ ఎంపీపీ, బీజేపీ నాయకుడు ఆదినారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక పల్లె రఘునాథరెడ్డితో పాటు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి, ఇంకొందరు కలసి తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం సంకేపల్లి వద్ద వాహనంపై రాళ్లతో దాడి చేశారని, ఇప్పుడు పుట్టపర్తికి వస్తుండగా దారి పొడవునా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. కియా వద్ద ఉన్న తన భూమిని కాజేసే ప్రయత్నంలో భాగంగా పల్లె రఘునాథరెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దొంగ పత్రాలు, నకిలీ అగ్రిమెంట్లతో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ భూ వివాదాలతో మంత్రి సత్యకుమార్కు సంబంధం లేకున్నా.. తరచూ వీటిలోకి లాగుతున్నారన్నారు. -
నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే ఈ అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక.. సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు ప్రతి రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం తంతు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం పట్టణ నలుమూలల ఆలయ అధికారులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. జిల్లా హాకీ జట్టు ప్రతిభ ధర్మవరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ హాకీ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు రజత పతకం సాధించిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, జిల్లా హాకీ కోచ్ హసేన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు శనివారం అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జిల్లా జట్టుపై 3 గోల్స్, సెమీ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టుపై 3–1 గోల్స్ తేడాతో గెలుపొందిందన్నారు. ఫైనల్లో తిరుపతి జిల్లా జట్టుపై 6–2 గోల్స్తో ఓటమి చెందిందన్నారు. -
ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది విధుల బహిష్కరణ రేపు
కదిరి టౌన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విధులను బహిష్కరించనున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్బాబ్జాన్, పవన్కుమార్, అమరేంద్ర హరికృష్ణ తెలిపారు. ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విధుల బహిష్కరణపై ఇప్పటికే జిల్లా కోఆర్డినేటర్కు వినతిపత్రం అందించామని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17, 24 తేదీల్లో కూడా విధులను బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కల్లు దుకాణం పై దాడి మడకశిర: పట్టణంలోని చీపులేటిలో శనివారం రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు కల్లు దుకాణం పై దాడి చేశారు. ఈసందర్భంగా కల్తీకల్లు, కల్తీ చేయడానికి వినియోగించే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కల్లు దుకాణాన్ని లైసెన్స్దారుడు కాకుండా వేరే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ ఫార్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు సమాచారం. స్థానిక ఎకై ్సజ్ అధికారులు కూడా ఈ ఘటనపై వివరాలను అందించలేదు. మామిడి, చింతచెట్లు దగ్ధం గుడిబండ: మందలపల్లి సమీపంలోని కొండకు నిప్పుపెట్టడంతో దగ్గరలోని మామిడి, చింతచెట్లు దగ్ధమయ్యాయి. బాధిత రైతుల వివరాల మేరకు.. రైతు చిక్కన్న, సన్నమారప్ప 30 ఏళ్లుగా మామిడి, చింత, కొబ్బరి చెట్లను అభివృద్ధి చేశారు. శనివారం మధ్యాహ్నం ఆకతాయిలు ఎండుగడ్డికి నిప్పుపెట్టడంతో చిక్కన్న, సన్నమారప్ప తోటలకు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే దాదాపు 400 మామిడి చెట్లు, 100 చింత చెట్లు కాలి బూడిదయ్యాయి. ఘటనలో దాదాపు రూ.20 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
చిలమత్తూరు: వైఎస్ జగన్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్త హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ చేసి లక్షలాది మంది మహిళలకు మేలు చేకూర్చిన ఏకై క సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతి కుటుంబంలోనూ మహిళకు ప్రాధాన్యత లభించేలా ఆనాడు చేసి చూపించారన్నారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ రంగంలోనూ మంత్రి పదవులు, 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో కనిపించకుండా పోయారని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారని వదిలేశారని మండిపడ్డారు. మహిళలకు మళ్లీ పాత రోజులు రావాలంటే, సంక్షేమం జరగాలంటే ఈ ముంచే కూటమి ప్రభుత్వం పోవాలని, ఆ దిశగా మహిళాశక్తి పోరాడాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చరా..? ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అంటూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణ పరిధి జిల్లా వరకు మాత్రమే అంటూ కొర్రీ వేయడం.. అది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకపోవడం మహిళలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. మహిళల సంక్షేమం, భద్రత ఒక్క జగన్ హయాంలోనే ఉందని, నేడు మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మి, రాధమ్మ, సర్పంచ్లు లలితమ్మ, వైఎన్ భాగ్యమ్మ, కో ఆప్షన్ సభ్యురాలు కాంతమ్మ, సాహెరాబాను, కవితారెడ్డి, హరితారెడ్డి, సిద్దగంగమ్మ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డల మిస్సింగ్పై నోరు మెదపని పవన్ కూటమి పాలనలో మహిళలకు భద్రత కరువు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం -
5,847 కేసుల పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘జాతీయ మెగా లోక్ అదాలత్’లో 5,847 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్లు నిర్వహించారు. బాధితులు రాజీకి సమ్మతించడంతో 886 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు 80, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు 48, ప్రీ లిటిగేషన్ కేసులు 388 పరిష్కారమయ్యాయి. ప్రమాద కేసుల్లో బాధితులకు రూ. 3.83 కోట్లు పరిహారంగా అందించారు. సివిల్ కేసుల్లో రూ.2.82 కోట్లు, ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.68 లక్షలు రాజీ ప్రకారం బాధితులకు ఇప్పించారు. లోక్అదాలత్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో కక్షిదారులకు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఇంటర్ పరీక్షకు 319 మంది గైర్హాజరు పుట్టపర్తి టౌన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం సెట్–3 ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులు 8,198 మందికి గాను 7979 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,641 మందికి గాను 1,541 మంది హాజరయ్యారు. మొత్తం 319 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ధర్మవరంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్బాబు, రామరాజు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరప్రసాద్ పర్యవేక్షించారన్నారు. కిరికెర సర్పంచ్కు ఉత్తమ పురస్కారం హిందూపురం: పంచాయతీ స్వశక్తి అధినేత్రి ఉత్తమ పురస్కారాన్ని హిందూపురం మండలం కిరికెర పంచాయతీ సర్పంచ్ వైఎన్ భాగ్యమ్మ అందుకున్నారు. ఢిల్లీలో 5, 6 తేదీల్లో ముందస్తుగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కిరికెర సర్పంచ్ భాగ్యమ్మ ఉన్నారు. కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత, ఫ్రెండ్లీ ఉమెన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి క్లుప్తంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో సర్పంచ్ భాగ్యమ్మకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ వినోద్కుమార్ చేతుల మీదుగా ‘పంచాయతీ స్వశక్తి అధినేత్రి పురస్కారం’తో జాతీయ ఉత్తమ ప్రశంసాపత్రం షీల్డ్ అందించి అభినందించారు. ఈ సందర్భంగా భాగ్యమ్మకు ఉమ్మడి జిల్లా మహిళా సర్పంచులు, స్థానిక పంచాయతీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. అలరించిన సంగీత కచేరీ ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. శనివారం సాయంత్రం ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి విద్యాసంస్థల ఫర్మార్మింగ్ ఆర్ట్స్ విభాగం విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. గంటపాటు నిర్వహించిన సంగీత కచేరీతో సభా మందిరం మార్మోగింది. -
నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే ఈ అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక.. సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు ప్రతి రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం తంతు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం పట్టణ నలుమూలల ఆలయ అధికారులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. జిల్లా హాకీ జట్టు ప్రతిభ ధర్మవరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ హాకీ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు రజత పతకం సాధించిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, జిల్లా హాకీ కోచ్ హసేన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు శనివారం అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జిల్లా జట్టుపై 3 గోల్స్, సెమీ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టుపై 3–1 గోల్స్ తేడాతో గెలుపొందిందన్నారు. ఫైనల్లో తిరుపతి జిల్లా జట్టుపై 6–2 గోల్స్తో ఓటమి చెందిందన్నారు. -
ఘనంగా ఏపీఆర్ఎస్ వార్షికోత్సవం
పరిగి: కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో శనివారం వార్షికోత్సవంతో పాటూ ఫేర్వెల్ డేను ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్బాబు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ భావోద్వేగాలకు గురయ్యారు. కార్యక్రమంలో ఎంఈఓ శేషాచలం, పూర్వ విద్యార్థులు వెంకటకృష్ణ( బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈడీ, న్యూజెర్సీ, యూఎస్ఏ), కృష్ణవేణి(మేనేజర్, పీవీహెచ్ కార్పొరేషన్, న్యూజెర్సీ), పాఠశాల చైర్పర్సన్ కుమారి, వైస్ చైర్మన్ రామాంజనేయులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డి గ్రామంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును శనివారం గుర్తు తెలియని దొంగ అపహరించాడు. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవి వేకువజామున ఇంటి బయట పనిలో నిమగ్నమైంది. ఇంతలో ముసుగు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె ఒక్కసారిగా దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తాడు. మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు దొంగను వెంబడించారు. అయితే దొంగ వారికి దొరకకుండా పారిపోయాడు. దొంగ మహిళ మెడలోని గొలుసును లాగిన సమయంలో సగం తెగిపోయి అక్కడే పడిపోగా సగం గొలుసును ఎత్తుకెళ్లాడు. పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళాభ్యున్నతే లక్ష్యం
పుట్టపర్తి అర్బన్: మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం బ్రాహ్మణపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ రత్న, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, డీపీఓ సమత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఆర్డీఏ పీడీ నరసయ్య, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పలు శాఖలకు చెందిన మహిళా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకొని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఈ విషయంలో ప్రతి మహిళా ప్రభుత్వానికి తోడ్పాటునందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులు, సామాజిక ఆర్థిక సహకారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాయన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక తల్లి, చెల్లి, అక్క, కూతురూ ఇలా ఎవరో ఒకరు ఉంటారన్నారు. ప్రతి విజయం వెనుక మాతృమూర్తి దీవెన ఉందని, అందుకే లోకంలో తల్లిని మించిన దైవం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, పోక్సో శక్తి యాప్ తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పలువురి మహిళలను మెమొంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం డీఆర్డీఏ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ కింద 4,380 మందికి రూ.74 కోట్లు, సీ్త్రనిధి ద్వారా 2,979 మందికి రూ.29.79 కోట్లు, మెప్మా ద్వారా 4,205 మందికి రూ.21.34 కోట్లు, ఎంఎస్ఎంఈ ద్వారా ఐదుగురికి రూ.60 లక్షలు, పరిశ్రమల ద్వారా ముద్ర స్టాండప్ పథకాల ద్వారా 59 మందికి రూ.4 కోట్లు, పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 160 మందికి రూ.1.15 కోట్ల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరికిరణ్, మెప్మా ప్రతినిధులు, డీఆర్డీఏ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలి మహిళా దినోత్సవంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న -
అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలివే..
● లింగనిర్ధారణ నిరోధక చట్టం సరిగా అమలు కాకపోవడం. ● డయాగ్నస్టిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ సరిగా చేయకపోవడం. ● ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. ● కేసులు నమోదవుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం. ● జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణ లేకపోవడం. ● లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుకు నిధులు ఇవ్వకపోవడం. ● ఇచ్చిన నిధులు కూడా సరిగా వినియోగించకపోవడం. -
రైలులో తమిళనాడు వాసి మృతి
ధర్మవరం: అనారోగ్యంతో రైలులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మవరంలో శనివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూరు తాలూకాకి చెందిన శ్రీనివాసం దురైస్వామి(46)కి మూడునెలల క్రితం స్వగ్రామంలో కుక్క కరిచింది. వైద్యం చేయించుకోకుండా బోర్వెల్ పనిచేసేందుకు మహారాష్ట్రలోని ఒక గ్రామానికి వెళ్లాడు. కుక్క కరిచిన చోట ఇన్ఫెక్షన్ అయి అనారోగ్యానికి గురికావడంతో మహారాష్ట్ర నుంచి స్వగ్రామానికి రైలులో బయలుదేరాడు. రైలు ధర్మవరం రైల్వేస్టేషన్లోకి చేరుకునే సమయానికి దురైస్వామి మృతి చెందాడు. రైలులో ఉన్న ప్రయాణికులు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ప్రసన్న, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆధిపత్యం.. ఉపాధి ఖతం
ముదిగుబ్బ: ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. తొమ్మిది నెలలుగా పనులు కల్పించకపోవడంతో కూలీలకు కడుపు కోత మిగిలింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో కూటమిలోని టీడీపీ–బీజేపీ–జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. పదవులు, పోస్టులు.. ఆదాయ వనరులను హస్తగతం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమ స్వలాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. కూటమి కొలువు దీరిన తర్వాత ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి ఒకటి, మేజర్ పంచాయతీల్లో ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు అవసరం ఉంటుంది. ఆయా పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునే విషయంలో టీడీపీ– బీజేపీ నాయకుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా ఉపాధి పనులపై ఆధార పడి జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అదనపు పని దినాలు లేనట్లే! గత ఏడాదిలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ముదిగుబ్బ, తాడిమర్రి, తలుపుల, కనగానపల్లి, ధర్మవరం, ఎన్పీ కుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, పరిగి, రాప్తాడును కరువు మండలాలుగా ప్రకటించారు. దీంతో ఆయా మండలాల్లో 50 అదనపు పని దినాలు మంజూరు చేశారు. ముదిగుబ్బ మండలం మినహా అన్ని మండలాల్లో ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఉపాధి పనులు కల్పించారు. ఏడాదిలో 5 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం ఉండగా.. జూన్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరే నాటికి 2,72,406 పని దినాలు కల్పించారు. ● ఒక ఏడాదిలో కల్పించిన పనిదినాల ఆధారంగా ఆయా మండలాల అభివృద్ధికి 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కేటాయిస్తారు. అయితే ఇంతవరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం పూర్తికానందున 2.28 లక్షల పనిదినాలను కూలీలు కోల్పోయారు. దీంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ● ఈ విషయంపై ఎంపీడీఓ దివాకర్ను వివరణ కోరగా ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం చేపట్టి మార్చి 31 నాటికి వీలైనన్ని పని దినాలు కల్పిస్తామని చెప్పారు. కూలీలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస పోకుండా ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు. ఏడాదిలో వంద రోజులు పనులు కల్పించాల్సి ఉంది. కూలీల నుంచి పని దినాల సంఖ్య పెంచాలని అంతటా డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక 23 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ పని దినాల సంఖ్య లక్ష్యంలో 50 శాతానికి మించలేదు. ఇది ఎక్కడో కాదు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనే. కూటమి పాలనలో పనులు కరువు నిలిచిన ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు ‘ఉపాధి’ చరిత్రలో చీకటి రోజులు ఇదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలో దుస్థితి -
మాటకు కట్టుబడి ఉన్నా
రాప్తాడురూరల్: ‘ఈ ఈవీఎంలతోనో, మరేదో కారణంగానో గెలిచారు. నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేయాలనే దురాలోచనతో రాష్ట్రంలోని 50 వేలమంది మహిళల సొంతింటి కలను పరిటాల సునీత చిదిమేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో 7,500 ఇళ్లను 7 నెలల్లో పూర్తి చేస్తా. ఇది నా ఛాలెంజ్’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే...పరిటాల సునీతకు భయపడుతున్నారో లేదంటే ఇళ్ల నిర్మాణం బాధ్యతను వదులుకున్నారో తెలీదన్నారు. జన్మలో ఆమె కానీ, ఆమె భర్త కాని సొంత డబ్బు ఖర్చు చేసి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చారా?, పేదలకు రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేశారా? అని పరిటాల సునీతను ప్రశ్నించారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానం.. పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రొద్దం మండలంలోని పెన్నానది మీదుగా నీళ్లు తీసుకురావొచ్చని తాము చెప్పినా వినలేదన్నారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానంతోనే పరిటాల సునీత 2018లో జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు కాలువ నిర్మాణానికి టెండర్లు పిలిపించి 2019లో పనులు ప్రారంభించారన్నారు. ముందుగానే కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారన్నారు. ఒక రూపాయి కూడా నిధులు తేలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి సంబంధించిన కాంట్రాక్టర్కు రూ.170 కోట్ల నిధులు ఇప్పించి పనులు వేగవంతం చేయించామన్నారు. పూర్తిస్థాయిలో పనులు అవ్వాలంటే పదేళ్లు పడుతుందని భావించి అప్పటిదాకా ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం సరికాదని, అప్పటి సీఎం జగనన్నతో మాట్లాడి ప్రత్యేకంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేందుకు జీఓ తెచ్చామన్నారు. తర్వాత దాతలు, రైతుల సహకారంతో 45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిటాల సునీత తత్వం రైతులకు బోధపడింది.. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీళ్లున్నాయని, చంద్రబాబుతో పరిటాల కుటుంబం సన్నిహితంగా ఉంటోందని, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలున్నా పరిటాల సునీత ఏరోజూ చంద్రబాబుతోగాని, లోకేష్తో గాని మాట్లాడలేదన్నారు. తీరా మడకశిర బ్రాంచ్ కెనాల్కు నీళ్లు వదిలే సమయంలో రిపేరీల పేరుతో డ్యాంకు ఉన్న గేట్లు తీయించారన్నారు. వచ్చే ఏడాది నీళ్లిస్తామంటూ కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత తనకు లాభం లేనిదే ఏపనీ చేయదనే తత్వం రైతులకు బోధపడిందన్నారు. ఇక కమీషన్ల కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల కోసం కక్కుర్తి పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పేరూరు డ్యాం, చెరువులను ఎండబెట్టి మీ జేబులను మాత్రం కమీషన్లతో నింపుకుంటారా?అని ప్రశ్నించారు. ఫీజు పోరును జయప్రదం చేయండి.. ఈనెల 12న పుట్టపర్తిలో నిర్వహించే ఫీజు ఫోరు, యువత పోరును జయప్రదం చేయాలని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు న్యాయవాది కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ బాలపోతన్న, పార్టీ నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, వీరాంజి పాల్గొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7 నెలల్లో 7,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం 50 వేల మంది మహిళల సొంతింటి కలను చిదిమేసిన పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం కౌంటరు దాఖలు చేయని దద్దమ్మ ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణాల నిలుపుదలపై రాక్రీట్ సంస్థ కోర్టుకు వెళ్తే...మీ చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం కౌంటర్ వేయలేదని ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే విజిలెన్స్ విచారణ ఏంటని, రాక్రీట్ సంస్థకు ఎందుకు బిల్లులు ఆపారని జడ్జిగారు ప్రశ్నిస్తే.... తమకు, ఆ సంస్థకు సంబంధం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారని గుర్తు చేశారు. ఈ కేసు నుంచి ఏమీ సాధించలేమని భావించి కౌంటరు వేయకుండా నిలిపేశారన్నారు. 9 నెలలుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజిలెన్స్ విచారణలన్నీ పూర్తి చేశారన్నారు. మళ్లీ ఈరోజు సునీత అసెంబ్లీలో రాక్రీట్ సంస్థ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఖర్చులు నిల్.. లాభాలు ఫుల్
మడకశిరరూరల్: నియోజకవర్గంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు గిట్టుబాటు ధర లభిస్తోంది. దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తుండడంతో ప్రకృతి వ్యవసాయం కింద పంటల సాగు పెరిగింది. వ్యవసాయశాఖ ద్వారా 2016లో మడకశిర మండలంలో 15 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఈ పద్ధతి లాభదాయకంగా ఉండటంతో మిగతా రైతులు దాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని మండలాల్లో 137 గ్రామాల్లో 25,500 మంది రైతులు ప్రకృతి పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వేరుశనగ, కంది, పూలతోటలు, మొక్కుజొన్న, మిరప, రాగి, కూరగాయలు, అరటి, వక్క, మామిడి పంటలతో పాటు అంతర పంటలను డ్రిప్ సౌకర్యంతో సాగు చేసి అధిక దిగుబడులు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. పంటల సాగు ఇలా.. బీడ భూముల్లో నవధాన్యాల విత్తనాలు అలసంద, సజ్జ, అనుములు, అముదంతో పాటు 24 రకాల జీవ వైవిధ్య పంటల విత్తన గుళికలు సాగు చేయిస్తున్నారు. దీంతో నవధాన్యాలు పండడంతో పాటు భూమి సారవంతమై ఖరీఫ్లో సాగు చేసే పంటలు మంచి దిగుబడి పొందడానికి ఆవకాశం లభిస్తోంది. పొలంలో సూర్య మండల మోడల్ ఆకారం ఏర్పాటు చేసి బహుళ పంటలు, బహుళ–స్థాయి సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించి పంటలు సాగు చేయిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 15 దేశాలకు చెందిన 30 మంది విదేశీ సభ్యుల బృందం అధ్యయనం చేసింది. లాభదాయకంగా ప్రకృతి వ్యవసాయం తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు మడకశిర నియోజకవర్గంలో 137 గ్రామాల్లో పంటల సాగు -
అయినా.. అట్టడుగునే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా రాణిస్తున్నా.. జననాల పరంగా మాత్రం అమ్మాయిలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 30 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు దశాబ్దాల్లో ఒక్కసారైనా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరగలేదు. తాజా సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం అమ్మాయిల సంఖ్యా పరంగా ఇప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా అట్టడుగున ఉన్నట్లు వెల్లడైంది. యథేచ్ఛగా లింగనిర్ధారణ.. ఉమ్మడి జిల్లాలో పలు రేడియోడయాగ్నస్టిక్స్ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగు తోంది. ఈ దురవస్థ వ్యాపారంగా సాగుతోంది. కొంతమంది గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్లు అత్యంత గోప్యంగా ఏజెంట్ల ద్వారా అబార్షన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లు, సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వారసుల కోసం ఆరాటం.. ఆస్తిపాస్తులు లేకపోయినా చాలా కుటుంబాల్లో ‘మగపిల్లాడు ఉండాలి.. వారసుడు అంటే మగపిల్లవాడే’ అన్న మూఢ విశ్వాసంతో ఉన్నారు. మహిళ గర్భం దాల్చిందని తెలియగానే ముందుగా ఆడపిల్లా, మగపిల్లాడా అని తెలుసుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిన వారు రెండో కాన్పులోనైనా మగ పిల్లవాడి కోసం ఇలా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి నమ్మకాల వల్ల కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిలు లేక అబ్బాయిలకు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మాయిల సంఖ్యలో చివరి స్థానంలో ‘ఉమ్మడి అనంత’ ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 977 మందే అమ్మాయిలు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి -
శ్రీవారి హుండీల లెక్కింపు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం ఆలయ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులు లెక్కించారు. 47 రోజులకు గాను రూ.62,73,741 నగదు, 20 గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి, 55 అమెరిక డాలర్లు సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువగా వచ్చిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షాణాధికారి ఎన్.ప్రసాద్, కెనరా బ్యాంక్ మేనేజర్ అనంతబాబు, బ్యాంక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై శిక్షణ పుట్టపర్తి: ఆసక్తి ఉన్న యువతకు సీసీ కెమెరా (సీసీ టీవీ)ల ఏర్పాటుపై బుక్కపట్నంలోని శ్రీసత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పాస్ లేదా ఫైయిల్ అయిన వారితో పాటు ఆపై చదువులు అభ్యసించిన వారూ అర్హులు. ఆధార్ లింక్ ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలి. మూడు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు పూర్తి వివరాల కోసం స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ (79815 41994)ను సంప్రదించవచ్చు. ఫారం పాండ్ పనుల పరిశీలనఅగళి: మండలంలోని అగళి, పి.బ్యాడగెర, హెచ్,డి.హళ్లి గ్రామాల్లో ఉపాధి హమీ పథకం కింద చేపట్టిన ఫారం పాండ్ పనులను శుక్రవారం ఇన్చార్జ్ ఏపీడీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. మండలంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు గాను 239 ఫారం పాండ్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు నీటి నిల్వ ఉంటూ అవసరమైన సమయంలో పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. కంపోస్టు ఫిట్ల నిర్మాణం కూడా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. రోజుకు సగటున రూ.300 వేతనం పడేలా కూలీలకు పనులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ శివన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
గంగమ్మ.. నీకు సాటిలేరమ్మా
పొలంలో పనిచేసుకుంటున్న ఈమె పేరు గంగమ్మ. పాతికేళ్ల క్రితం మద్దనకుంట గ్రామానికి చెందిన హనుమంతరాయప్పతో వివాహమైంది. ఏడాది తిరిగే సరికి పండంటి బిడ్డ (బాలచంద్ర)కు జన్మనిచ్చింది. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఉన్నంతలో హాయిగా సాగుతున్న ఆమె జీవితంలోకి చీకటి తొంగిచూసింది. బిడ్డ పుట్టిన మరుసటి ఏడాదే భర్త హనుమంతరాయప్ప మృతితో అంధకారం అలముకుంది. గుండెల్లో అలజడి.. ఒడిలో రెండేళ్ల బిడ్డ..గంగమ్మ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. బిడ్డకోసం ధైర్యం కూడదీసుకుని పొలం బాట పట్టింది. పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. బిడ్డను డిగ్రీ వరకూ చదివించింది. అయితే గంగమ్మపై విధి మరోసారి కక్షగట్టింది. పోలియో రూపంలో కుమారుడు బాలచంద్రను ఇంటికే పరిమితం చేసింది. అయినా గంగమ్మ వెనకడుగు వేయలేదు. తనరెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలిచింది. తనకున్న 4 ఎకరాల్లో బోరు వేయించి అందులో రెండు ఎకరాల్లో వక్కతోట, మరో రెండెకరాల్లో అరటి తోట సాగు చేసింది. ప్రస్తుతం అందులో అంతర పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంది. నీరు కట్టడం, కలుపు తీయడం, మొక్కలు నాటడం తదితర వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటుంది. భర్త దూరమైనా..చెట్టంత కుమారుడు ఇంటికే పరిమితమైనా వెరవని ధీశాలి గంగమ్మను చూసి జనమంతా...నీకు సాటిలేరమ్మా అంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె జీవిత ప్రస్థానాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. – అమరాపురం: -
‘కరుణ’జ్యోతి
ఇక్కడ ఓ వృద్ధురాలికి తల దువ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు అరుణజ్యోతి. స్వగ్రామం మండల కేంద్రమైన అమడగూరు. 16 ఏళ్ల వయసున్నపుడే వరుసకు మేనమామకు ఇచ్చి వివాహం జరిపించారు తల్లిదండ్రులు. పెళ్లయిన పదేళ్లకే భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే బుద్ధిమాంద్యంతో పుట్టిన కుమారుడికి అన్నీ తానైంది అరుణజ్యోతి. కుమారుడిని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో బుద్ధిమాంద్యులు, అనాథలు పడే ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయింది. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తలంపుతో అనాథ వృద్ధులకు అండగా నిలవాలని నిశ్చయించుకుంది. నాలుగేళ్ల కిత్రం తనకున్న బంగారు నగలను విక్రయించి వచ్చిన సొమ్ముతో అమడగూరు మండలం, గాజులపల్లి సమీపంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. తనకు, బుద్ధిమాంద్యుడైన కుమారుడికి ఇచ్చే పింఛను డబ్బుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 20 మంది వృద్ధులతో పాటుగా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఎక్కడైనా వృద్ధులు ఆలనాపాలనా లేక రోడ్డుమీద ఉంటున్నారని తెలిస్తే చాలు అరుణజ్యోతి చలించిపోయింది. ఎంతదూరమైనా వెళ్లి వారిని ఆశ్రమానికి తీసుకువస్తుంది. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో ఒడి, దుడికులను ఎదుర్కొన్నా... కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి అనాథ వృద్ధులకు సేవ చేసుకుంటూ పలువురి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. -
బాబు ‘ష్యూరిటీ’.. ‘మోసం’ గ్యారంటీ
కదిరి: పింఛన్లు మినహా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను సీఎం చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం మోసగించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తాను ష్యూరిటీ అంటూ ప్రజలను నమ్మించిన చంద్రబాబు... అధికారం చేపట్టిన తర్వాత మోసం గ్యారంటీ అనేది మరోసారి రుజువు చేశారన్నారు. శుక్రవారం తన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివద్ది, సంక్షేమం పూర్తిగా పక్కనబెట్టి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని మండిపడ్డారు. రైతులకు ఏటా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఆ ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు తల్లులను మోసగించారన్నారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసంపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఇప్పటికై నా రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడక పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి -
హామీల అమలులో ‘కూటమి’ విఫలం
సోమందేపల్లి: హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఊరికో హామీ ఇచ్చిన చంద్రబాబు... ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక డబ్బులు లేవంటూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థ పాలనను ప్రశ్నిస్తారన్న భయంతోనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నారు. సీట్ల గురించి మాట్లాడుతున్న కూటమి పార్టీల నేతలు..రాష్ట్రంలో 40 శాతం మంది వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 60 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ప్రజలు తప్పక బుద్ధి చెబుతారు.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రస్తుత కూటమి సర్కార్ మాత్రం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దౌర్భాగ్యపాలనకు నిదర్శనమన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ప్రతి ఒక్కరినీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి పార్టీలను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థుల కోసం ఉద్యమబాట.. ఫీజురీయింబర్స్ నిధులు విడుదల చేయకుండా నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. అందుకే వైఎస్సార్ సీపీ విద్యార్థుల తరఫున ఉద్యబాట పట్టిందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన ‘ఫీజు పోరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్లు కిష్టప్ప, జిలాన్ ఖాన్, పరంధామ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబు విద్యార్థుల కోసం 12న వైఎస్సార్సీపీ ‘ఫీజు పోరు’ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
జనరిక్ మందులపై ప్రచారం చేయండి
పెనుకొండ: జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన పెంచి వాటిని ప్రజలు వినియోగించేలా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి జన ఔషది దివస్ను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని సీమాంక్ సెంటర్లో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందితో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనరిక్లో మందులు అందుబాటులో ఉన్నా.. ప్రజలు బ్రాండెడ్ పేరుతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామగ్రామానా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు వివరించి జనరిక్ ఔషధాలను వినియోగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డీసీహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమంతు, డిప్యూటి డీఎంహెచ్ఓ మంజువాణి, వైద్యాధికారి మోహన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ -
ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం దాసరి లక్ష్మీదేవి
రెండు కాళ్లు చచ్చుబడినా... ఆమె జీవితంలో నిలబడింది. స్వశక్తితో జీవనం సాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తిదాత పేరు దాసరి లక్ష్మీదేవి. తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన దాసరి యంగన్న, నారాయణమ్మ దంపతులకు రెండో సంతానం దాసరి లక్ష్మీదేవి. ఆరు నెలల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. అయినా ఆమె తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆమె వయస్సు 45 ఏళ్లు. లక్ష్మీదేవి పెద్దగా చదువుకోకపోయినా...ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని భావించేది. ఈక్రమంలోనే ఆదాయ మార్గాలను అన్వేషించింది. 2002లో ఆర్డీటీ సహకారంతో రూ.1,500 మొత్తంతో గ్రామం నడిబొడ్డున చిన్నపాటి బంకు ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో ట్రైసైకిల్పై ఆమె కూర్చుంటే వాళ్ల నాన్న బండిని తోసుకుంటూ అంగడి వరకూ వచ్చేవాడు. తిరిగి సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకుని వెళ్లే వాడు. కష్టపడటం ఒక్కటే తెలిసిన లక్ష్మీదేవి చిన్నపాటి వ్యాపారంతోనే తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచింది. అయితే 2006 లక్ష్మీదేవి తల్లి నారాయణమ్మ అకాలం మరణం ఆమెను కుంగదీసింది. అయినా జీవితంపై ఎంతో ఆశ ఉన్న లక్ష్మీదేవి ధైర్యంతో ముందుకు సాగి తిరిగి వ్యాపారం ప్రారంభించింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలోనే...తండ్రి యంగన్న వయస్సు మీదపడి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో లక్ష్మీదేవి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కనీసం అంగడి వరకూ తీసుకెళ్లే తోడులేక తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే రూ.40 వేలు వెచ్చించి ట్రైసైకిల్ను కొనులోగు చేసింది. దాన్ని రిక్షాలా మార్చి మోటర్ ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి ఎవరి సాయం లేకుండా ఆమె సొంతంగా ట్రైసైకిల్పైనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ రూ.400 నుంచి రూ.500 వరకూ వ్యాపారం చేసుకుంటూ ఒకరికి భారం కాకుండా స్వశక్తితో జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన కాళ్లు మాత్రమే చచ్చుబడ్డాయని, సంకల్పం కాదని చెబుతున్న దాసరి లక్ష్మీదేవి కళ్లలో జీవితం పట్ల ప్రేమ కనిపిస్తుంది. – తాడిమర్రి: -
10న ఖాద్రీశుడికి పట్టు వస్తాల సమర్పణ
సాక్షి, అమరావతి: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 10న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి నారా లోకేష్ సమర్పించనున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్షకు 245 మంది గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన మ్యాథమ్యాటిక్స్–2ఏ/బాటనీ/సివిక్స్ పేపర్ –2 పరీక్షలకు 245 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,410 మందికి గాను 9,202 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఒకే షనల్ కోర్సులకు సంబంధించి 1,151 మందికిగానూ 1,114 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 245 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ హిందూపురం: స్థానిక ఎంజీఎం, అజిజీయా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా సాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 250 మంది ఈ కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని రెండు కేంద్రాల్లోనూ మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. గేట్లకు తాళాలు వేసి గదుల కిటికీలు మూసి పుస్తకాలు, చీటీలు అందజేసి పరీక్షలు రాయిస్తున్నారు. నాణ్యతలేని గుడ్ల సరఫరాపై ఫిర్యాదు పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యతలేని, గోలీ సైజు గోడి గుడ్లు సరఫరా చేస్తున్నారని, సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జైభీంరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు కోరారు. శుక్రవారం ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ సుధావరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు గోలీ సైజు కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుని నాణ్యమైన గుడ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
No Headline
అన్నింటా ఆమెఆమె శాంతం... ఆమె సహనం... ఆమె రౌద్రం... ఆమె లౌక్యం... అన్నింటా ఆమె... అన్నీ ఆమే! జీవన పోరాటంలో ఎన్ని గాయాలైనా లెక్కచేయదు. నేటి మహిళలు అడుగు మోపని రంగమంటూ లేదు. నైపుణ్యమున్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటికే పరిమితమైన గ్రామీణ మహిళలు సైతం తర్వాతి క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారతే లక్ష్యంగా సాగుతున్నారు. ‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
మామిడి చెట్లు దగ్ధం
రొళ్ల: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి మామిడి తోటలో కాపు కాసిన 150 చెట్లు కాలి పోయాయి. రొళ్ల మండలం మల్లసముద్రం గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా రైతు గంగమ్మ తనకున్న పొలంలో ఆరేళ్ల క్రితం 200 మొక్కలతో మామిడి తోటను అభివృద్ధి చేశారు. గత రెండేళ్లుగా ఏటా పంట కోతలతో ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం పంట బిందె నుంచి కాయ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఉదయం తోటకు సమీపంలోని బయలు భూమిలో ఎండుగడ్డికి ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. ప్రమాదాన్ని గుర్తించి బిందెలతో నీటిని పోసి మంటలు ఆర్పారు ఈ లోపు 150 మామిడి చెట్లు కాలిపోయాయి. అధికారులు పరిశీలించి, తనకు పరిహారం అందించాలని బాధిత మహిళా రైతు కోరారు. వ్యక్తి బలవన్మరణం అగళి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం హళ్లికెర గ్రామానికి చెందిన బసవరాజు (55)కు 27 సంవత్సరాల క్రితం జయమ్మతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమారైలకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. కుమారుడు బెంగళూరులో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జయమ్మ కూడా బెంగళూరులోనే కుమారుడితో కలసి ఉంటోంది. బసవరాజు అప్పుడప్పుడు కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఇటీవల స్వగ్రామానికి తిరిగి రావాలని పలుమార్లు భార్యకు సూచించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన బసవరాజు... జీవితంపై విరక్తి పెంచుకుని శుక్రవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మెడికల్ రెప్ ఆత్మహత్య ధర్మవరం రూరల్: మండలంలోని ఓబుళనాయనపల్లి గ్రామానికి చెందిన బాలగాని నరసింహుడు కుమారుడు చక్రవర్తి(32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆరేళ్ల క్రితం బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన చంద్రకళతో బాలగాని చక్రవర్తికి వివాహమైంది. భార్యతో కలసి బెంగళూరులో నివాసముంటూ మెడికల్ ఏజెన్సీలో రెప్రజెంటిటివ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన చక్రవర్తి కడుపునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తితో శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన కుటుంబసభ్యులు ఉరికి విగతజీవిగా వేలాడుతున్న చక్రవర్తిని గమనించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తల దాడి సోమందేపల్లి: ఈదుళబలాపురంలో టీడీపీ కార్యకర్తలు హనుమంతరాయుడు, నరేష్ తదితరులు తమ ఇంటిలోకి చొరబడి దాడి చేశారని జగదీష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి వద్ద ఉంచిన గడ్డిని హనుమంతరాయుడు గొర్రెలు తినడంతో తాము ప్రశ్నించామని, దీంతో వారు తమపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాడు. అంతటితో ఆగక అదేరోజు రాత్రి ఉద్దేశపూర్వకంగా తమ ఇంటిలోకి చొరబడి హనుమంతరాయుడు వర్గీయులు దాడి చేయడంతో లక్ష్మీదేవి, నాగార్జునకు గాయాలయ్యాయని శుక్రవారం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో జగదీష్ పేర్కొన్నాడు. చోరీ కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు పుట్టపర్తి రూరల్: చోరీ కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పుట్టపర్తి జేఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి రాకేష్ తీర్పు వెలువరించారు. వివరాలు... ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లి గ్రామానికి చెందిన భీమినేని అమర్నాథ్నాయుడు బుక్కపట్నం పీఎం పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. అతనిపై 2020లో రెండు కేసులు నమోదయ్యాయి. సమగ్ర విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి అమర్నాథ్నాయుడుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాకేష్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ రాజేంద్రనాథ్ వినిపించారు. ప్రమాదంలో చిన్నారి మృతి పుట్టపర్తి టౌన్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన వినోద్కుమార్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం ఉదయం తమ కుమార్తె రిషిక (9)ను పిలుచుకుని పెనుకొండకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు బండ్లపల్లి క్రాస్ వద్ద దిగారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలబడిన రిషికను ఢీకొని వెళ్లిపోయింది. ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
అవార్డుల కండక్టరమ్మ
కదిరి డిపోలో కండక్టర్గా పని చేస్తున్న లక్ష్మీనరసమ్మ కష్టేఫలి సూత్రాన్ని నమ్ముకున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఆర్టీసీ కండక్టరుగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం కదిరి డిపోలో పనిచేస్తున్న లక్ష్మీనరసమ్మ.. మదనపల్లి, హిందూపురం పల్లెవెలుగు సర్వీసుల్లో డ్యూటీ చేస్తున్నారు. అందరికంటే మిన్నగా కలెక్షన్ను రాబట్టి సంస్థ అభివృద్ధికి దోహదపడుతున్నారు. వృత్తిపట్ల ఆమె అంకితభావం...సంస్థ పురోభివృద్ధిలో ఆమె భాగస్వామ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఉత్తమ కండక్టర్గా రాష్ట్రస్థాయి అవార్డు అందించారు. అలాగే 2023, 2024 సంవత్సరాల్లో కదిరి డిపోలోనూ పలుసార్లు ఉత్తమ కండక్టర్గా నగదు అవార్డులు అందించారు. అటు కుటుంబాన్ని, ఇటు వృత్తి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్న లక్ష్మీనరసమ్మ ఎందరో మహిళా ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – కదిరి అర్బన్: -
కూలి బిడ్డ డిప్యూటీ కలెక్టర్
కూలికి వెళితే తప్ప పూట గడవని కుటుంబంలో పుట్టింది స్వాతి. స్వగ్రామం పరిగి మండలం మోదా పంచాయతీ పరిధిలోని గొరవనహళ్లి గ్రామం. తల్లిదండ్రులు రత్నమ్మ, నాగరాజు. దంపతులిద్దరూ కూలిలుగా పని చేసేవారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, స్వాతి పెద్దకూతురు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగిన స్వాతి... పేదరికాన్ని విద్యతోనే జయించాలని భావించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు. ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకుంది. ఆ తర్వాత పట్టుదలతో చదివి 2016లో ఎస్ఐగా ఎంపికై ంది. రెండేళ్ల కఠోర శిక్షణ తర్వాత 2018లో విధుల్లో చేరింది. అయినా ఎక్కడో అంసతృప్తి. తనలాంటి పేదలకు ఏదైనా చేయాలంటే ఇంకా ఉన్నతస్థానంలో ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే గ్రూప్స్కు ప్రిపరేషన్ కొనసాగించింది. 2023లో గ్రూప్–1లో సత్తాచాటి ఏకంగా 8వ ర్యాంకు దక్కించుకుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. సంకల్పబలం ముందు కష్టాలన్నీ కరిగిపోగా.. స్వాతి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. – పరిగి: -
విధి నిర్వహణలో నైపుణ్యం మెరుగు పర్చుకోవాలి
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో నైపుణ్యత మెరుగు పరుచుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని హోం గార్డులకు రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్చార్జ్ కమాండెంట్ మహేష్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేసి, మాట్లాడారు. హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం పోలీస్ దర్బార్ ఏర్పాటు చేసి హోం గార్డుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు మహేష్, వలి, ఆర్ఎస్ఐలు వీరన్న, ప్రదీప్సింగ్ పాల్గొన్నారు. -
ధైర్యమే ఊపిరిగా ముందుకు సాగాలి
పుట్టపర్తి టౌన్: ఇంటాబయట ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ధైర్యమే ఊపరిగా ముందుకు సాగాలని మహిళలకు ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి పోలీస్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి, ఆయుధాల వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సవాళ్లనుఽ అధిగమించాలంటే ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలన్నారు. సెల్ఫోన్ వినియోగం వల్ల ఒనగూరే లాభాలు, అనర్థాలపై షార్ట్ ఫిలిం ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఏఓ సుజాత, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కార్యాలయంలో ముందస్తుగా శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. డీపీఓ మహిళా సిబ్బందితో కలసి ఎస్పీ రత్న కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం.. పొలాలు ఆక్రమించడం పరిపాటిగా మారింది. తాజాగా కనగానపల్లి మండలం వేపకుంటలో రైతు అశ్వత్థప్పకు చెందిన తోటలో నాలుగు ఎకరాల పంటకు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముత్యాలన్న శుక్రవారం ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకిలా చేశావంటూ అడగడంతో.. సరదా కోసమని వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకున్నాడు. అంతేకాక వాళ్లతో (బాధిత రైతుతో) ఏం అవుతుందిలే అంటూ రుబాబు చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత రైతు అశ్వత్థప్ప గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేయగా.. తనకు సంబంధం లేదని బుకాయిస్తూనే ‘నన్నేమీ చేయలేరు. కేసు పెడితే అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. రూ.లక్ష వరకు నష్టం.. రైతు అశ్వత్థప్ప తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ఇటీవల ఆముద పంట సాగుచేశారు. ఇంకా పంట సగంలో ఉన్నందున డ్రిప్ పరికరాలు తీయలేదు. ఈ క్రమంలో శుక్రవారం పట్ట పగలే ముత్యాలు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. చాలా సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న అతడిని గ్రామస్తులు నిలదీశారు. ‘ఏం కాదులే.. అవసరమైతే రోజూ నిప్పు పెడుతా. ఎవరేమీ చేసుకోలేరు’ అంటూ మాట్లాడటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మంటలు పొలమంతా వ్యాపించడంతో 15 కట్టల డ్రిప్పు లాడర్, 30 పీవీసీ పైపులు, నాలుగు గేట్వాల్వ్లు, మూడు ఫిల్టర్లు కాలిపోయాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. పొలంలో చెత్తకు నిప్పు పెట్టి అగ్ని ప్రమాదానికి కారణమైన ముత్యాలుతో పాటు మరో గొర్రెల కాపరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశారు. నిందితుడి బెదిరింపులు.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో పొలాల్లో పంట పెట్టుకోలేరని, అవసరమైతే రోజూ నిప్పు పెడుతూ ఉంటానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బాధితు రైతు కుటుంబ సభ్యులకు ముత్యాలు ఫోన్ చేసి బెదిరించాడు. ఎవరు నిప్పు పెట్టారో తనకు తెలుసంటూ ఓ పదేళ్ల బాలుడి గురించి ప్రస్తావించాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు మరో ముగ్గురు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ముత్యాలు వైఖరితో గ్రామస్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధ్వంసాలను తాము చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో వ్యవసాయ పనిముట్లకు నిప్పు దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ రుబాబు రూ.లక్షకు పైగా నష్టపోయిన రైతు -
కష్టాలను దాటి.. ఖాకీ తొడిగి
ఈమె పేరు కె. ఉదయ పావని. శిక్షణలో ఉన్న డీఎస్పీ. ప్రస్తుతం మడకశిర సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఉదయపావని పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి నారాయణప్ప అప్పలనాయుడు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి భారతి అంగన్వాడీ కార్యకర్త. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా ఉదయపావని కృషి, పట్టుదలతో చదువుకున్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. తన కలల ‘ఖాకీ’ కొలువుకోసం కంటిమీద నిద్రలేకుండా చదివారు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెరవక ముందుకు సాగారు. చివరకు గ్రూప్స్లో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికయ్యారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఫలితం ఉంటుందని చెప్పడానికి ఉదయ పావని ఉదాహారణగా నిలిచారు. – మడకశిర రూరల్: -
క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందువల్ల ఆర్డీఓలంతా ఆయా ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కోర్ట్ చాంబర్లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో నియోజకవర్గాల విజన్ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా నియోజకవర్గానికి సంబంధించిన విజన్ ప్రణాళికలో రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇందుకు ప్రతికూల, సానుకూల అంశాలను ప్రస్తావిస్తూ సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు. ఆయా నియోజకవర్గ పరిశ్రమలు స్థాపించేందుకు స్థల సేకరణ వేగవంతం చేయాలని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే జిల్లాలో గిరిజన కాలనీలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా పనులు చేపట్టాలని ఇందుకు మండలాలు, గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలన్నారు. అనంతరం జిల్లాలో సోలార్, వ్యవసాయ, అనుబంధ రంగాలకు, పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితి, పర్యాటక సర్కూట్ ఏర్పాటుకు సంబంధించిన పీపీటీని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు మహేష్, శర్మ, ఆనంద్కుమార్, మడకశిర నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, డీఈఓ కృష్ణప్ప, సీపీఓ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ‘షీ బాక్స్’ ఏర్పాటుకు చర్యలు.. జిల్లాలోని మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. శుక్రవారం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో పలువురు మహిళా ఉద్యోగులు కలెక్టర్ను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్కు తెలిపారు. కలెక్టరేట్లో ‘షీ బాక్స్’ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్.. కలెక్టరేట్లోని ఏఓ కార్యాలయం వద్ద ‘షీ బాక్స్’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జేఏసీ జిల్లా చైర్మన్ మైనుద్దీన్ మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పేపర్పై రాసి ‘షీ బాక్స్’లో వేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ‘షీ బాక్స్’ను కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ విజయభారతి, జనరల్ సెక్రెటరీ మధునాయక్, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు గీతాంజలి, సెక్రెటరీ సుభాషిణి, డివిజనల్ సెక్రెటరీ రమాదేవి, ప్రభావతి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓలతో కలెక్టర్ టీఎస్ చేతన్ -
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆది యందు ‘ఆమె’ ఉండెను అప్పటి నుంచీ అన్నీ ‘ఆమె’ అయెను... బడిలో, గుడిలో, నారుమడిలో.. ఆమెలేని చోటులేదు.. ఆమెకు సాటి లేదు.. కలం పట్టినా... హలం దున్నినా.. అధికారం చూపినా.. అక్కున చేర్చుకున్నా.. అంతా ఆమె... అన్నింటా ఆమె.. సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం.. ‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతిరూపాలమే.. ఆమె ఒక ధైర్యం.. ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం.. ఆమెను దలిస్తే అన్నీ దర్శించినట్టే.. అందుకే ఆమె కోసం ఓ రోజు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బతుకుపాఠంలో చెరగని ముద్ర వేసిన మహిళామణుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ●వివిధ రంగాల్లో మహిళల ప్రతిభ ●పురుషులతో దీటుగా రాణిస్తున్న వైనం బొమ్మలకే అమ్మ.. శివమ్మ ఆమె చేతిలోని బొమ్మ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. తోలుతో చేసిన ఆ బొమ్మకు ప్రాణం పోసి అమ్మ శివమ్మ. ధర్మవరం మండలం నిమ్మల కుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారిణి శివమ్మ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఏడు పదుల వయస్సులోనూ కళపై ఆమెకున్న మమకారం అచంచలం. అందుకే ఆదరణ కోల్పోయిన తోలుబొమ్మలతో నూతన అడుగులు వేస్తోంది. ఎంతో అందమైన చిత్రాలను తయారు చేస్తూ అబ్బుర పరుస్తోంది. విశ్వరూప హనుమాన్, రామాయణ, సుందరకాండ ఘట్టాలు, శ్రీకృష్ణలీలలు తదితర చిత్రాలను వినూత్నమైన డిజైన్లలో తోలుబొమ్మలను తయారు చేస్తోంది. అంతేకాక ల్యాంప్ సెట్లు, డోర్ హ్యాంగర్స్, తోలుబొమ్మలను మన దేశంలోని వివిధ దేశాలకూ ఎగుమతి చేస్తోంది. శివమ్మ ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు, గత ఏడాది ‘శిల్పగురు’ జాతీయ అవార్డుతో సత్కరించింది. ఈ ఏడాది పరంపరాగత్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. కృషి, పట్టుదల ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది శివమ్మ. – ధర్మవరం: -
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ జీఏ విజయలత సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుత్తి బాలికల గురుకుల పాఠశాల, నూతిమడుగు బాలుర గురుకుల పాఠశాల, గార్లదిన్నె మైనార్టీ బాలుర పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐదో తరగతిలో 80 సీట్లు (ఇంగ్లిష్ మీడియం), 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలకు ఈ నెల 31లోపు https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అర్హులేనని కన్వీనర్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తు గడుపు పెంపు రొళ్ల: మండల పరిధిలోని దొమ్మరహట్టి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో (2025–26 విద్యా సంవత్సరం) 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడవును పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మైలారప్ప తెలిపారు. వాస్తవానికి మార్చి 6వ తేదీ వరకే గడువు ఉండగా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. పాఠశాలలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాల పెంపు అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాలు ఉండగా.. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదనంగా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. కొత్త పరీక్ష కేంద్రాలు శనివారం నుంచి ఆన్లైన్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. అదనంగా పెంచిన కేంద్రాలివే.. ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, కళ్యాణదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, శింగనమల (అనంతపురం రామ్నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, నార్పల (అనంతపురంలోని కొత్తూరు బాలుర జూనియర్ కళాశాల) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, నార్పల (అనంతపురం హౌసింగ్బోర్డు మెయిన్ రోడ్డు ఎస్వీఆర్ కేఫ్ పక్కన) ● ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం, రాయదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక, అరవిందనగర్) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, మోడల్ స్కూల్ దగ్గర ధర్మవరం. 15లోపు సప్లి ఫీజు చెల్లించాలి అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2016–17 నుంచి 2018–19 విద్యాసంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 15లోగా చెల్లించాలని సూచించారు. అపరాధ రుసుముతో పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. ఎండుమిర్చికి ధరాఘాతం హిందూపురం అర్బన్: ఎండుమిర్చికి మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతోంది. ఫలితంగా ధర రోజురోజుకూ పడిపోతోంది. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్కు 84.80 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.7,200 మేర ధర పలికింది. గత వారంతో పోలిస్తే క్వింటా గరిష్ట ధరపై ఏకంగా రూ.2,500 తగ్గింది. మార్కెట్కు నాణ్యమైన మిర్చి రాకపోవడంతో ధర తగ్గినట్లు కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. -
చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
ప్రశాంతి నిలయం: చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్ లో చిత్తడి భుముల పరిరక్షణ, నిర్వహణ అన్న అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చిత్తడి నేలల డేటాను సేకరించి నివేదిక ఇవ్వాలని డీఎఫ్ఓను ఆదేశించారు. మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులుగా తహసీల్దార్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నీటిపారుదలశాఖ ఇంజనీర్, ఈఓఆర్డీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అభిషేక్ కుమార్, జిల్లా అటవీ అధికారి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి తాడిమర్రి: ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వచ్చే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం వైద్యాధికారులకు ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాన్పుల గది, ల్యాబ్, మందుల గది, ఓపీ తదితర గదులను పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. ఏడాది వయసులోపు చిన్నారులు, బాలింతల మరణాల గురించి ఆరాతీశారు. అలాగే గర్భిణీలు ప్రసవం కోసం 108 వాహనాన్ని వినియోగించుకుంటున్నారా, ప్రసవానికి ప్రభుత్వా ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని విచారించారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారు చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారని, వారిని ప్రేమతో పలకరించి వైద్య సేవలు అందిస్తే సంతోషిస్తారన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హరిత, గోవర్ధన్నాయుడు, హెల్త్ సూపర్వైజర్ రాంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
లేగ దూడ దవడకు శస్త్రచికిత్స
అనంతపురం అగ్రికల్చర్: మూగజీవాలకు పశు సంవర్ధకశాఖ ఏడీలు, డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా విరిగిపోయిన లేగదూడ దవడకు శస్త్రచికిత్స చేశారు. వివరాలు.. గార్లదిన్నె మండలం తలకాసులపల్లి గ్రామం వడ్డే నరేష్కు చెందిన పాడి ఆవు మూడు రోజుల కింద కోడేదూడను ఈనింది. దూడ ఆరోగ్యంగా ఉన్నా కింది దవడ ఎముక విరిగిపోవడంతో వేలాడసాగింది. దవడ నొప్పి వల్ల పాలు తాగలేక రోజురోజుకూ నీరసిస్తున్న దూడను గమనించి స్థానిక పశువైద్యాధికారి శింగనమల పశువైద్యశాల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి రెఫర్ చేశారు. దీంతో ఆటోలో అనంతపురంలోని సాయినగర్లో ఉన్న పశువైద్యశాలకు దూడను తీసుకువచ్చి తన బృందంతో డాక్టర్ పద్మనాభం శస్త్రచికిత్స చేశారు. దవడ ఎముకకు రెండు వైపులా 2.5 మి.మీ స్టెయిన్లెస్ స్టీల్ పిన్నులను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత దూడ దవడ సాధారణ స్థితికి చేరుకోవడం, పాలు తాగడం మొదలు పెట్టింది. దూడకు అవసరమైన ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, అనాల్జిసిక్స్ లాంటి మందులు కూడా అందించినట్లు పద్మనాభం వెలిపారు. శస్త్రచికిత్సలో 1962 అంబులెన్స్ డాక్టర్ సునీత, ట్రైనీ డాక్టర్ నేహ, కమలాకార్, గీత తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
బెణికల్లులో ‘బెల్టు’ చిచ్చు
సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ‘బెల్టు షాపు’ చిచ్చును టీడీపీ నేతలు రాజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ‘వీధికోటి... సందుకోటి’ చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. తమ అనునూయులకు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా కూటమి నేతలు గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ‘బెల్టు షాపు’ నిర్వహణ అంశంలో స్థానిక టీడీపీ నేత తీసుకెళ్లిన ఒత్తిడి ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితుడు కణేకల్లు మండలం బెణికల్లులో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి తమ పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం బెల్టుషాపు పెట్టించాడు. గత పది రోజులుగా బెల్టు షాపు ద్వారా ఆశించిన మేర వ్యాపారం జరగలేదు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త ఎర్రిస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి చెందిన వన్నూరుస్వామి ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్) అమ్మడం వల్లే బెల్టు షాపులో అమ్మకాలు తగ్గాయని, వెంటనే వన్నూరు స్వామిని అరెస్ట్ చేయాలంటూ ఎకై ్సజ్ సీఐ ఉమాబాయిపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో తన సిబ్బందితో కలసి ఎకై ్సజ్ సీఐ ఉమాబాయి బుధవారం సాయంత్రం వన్నూరుస్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి మద్యం దొరకలేదు. ఇదే విషయాన్ని సదరు టీడీపీ నేతకు ఆమె ఫోన్ చేసి తెలిపారు. అయితే ఎలాగైనా వన్నూరుస్వామిపై కేసు బనాయించి గ్రామంలో బెల్టుషాపు సజావుగా జరిగేలా చూడాల్సిందేనంటూ ఆయన హుకుం జారీ చేయడంతో రాత్రికి రాత్రి వన్నూరు స్వామిని స్టేషన్కు తరలించి చితకబాది తాను కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ఒప్పించేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చిందో కాసేపటి తర్వాత వన్నూరుస్వామి కుటుంబసభ్యులకు ఓ అధికారి తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి గ్రామానికి చేరుకున్న వన్పూరుస్వామి కుటుంబసభ్యులు నేరుగా ఇంటికెళ్లి తప్పుడు కేసు ఎందుకు పెట్టించావంటూ నిలదీశారు. ఆ సమయంలో ఎర్రిస్వామి రెచ్చిపోవడమే కాక తన వర్గీయులతో దాడులకు తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనపై వన్నూరుస్వామి, ఆయన తండ్రి మల్లికార్జున, తల్లి లింగమ్మ, కుటుంబసభ్యులు అనిత, భూలక్ష్మి, చిన్న వండ్రయ్య దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చావుదెబ్బలు తిన్న తల్లి లింగమ్మ ఫిర్యాదను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఘటనపై వన్నూరు స్వామి మాట్లాడుతూ... తనను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు నమోదు చేశారని, అంతేకాక తన కుటుంబసభ్యులపై దాడి చేసి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయపోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఏకపక్ష దాడులతో ఉద్రిక్తత -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
పెనుకొండ: బెంగళూరుకు చెందిన శివకుమార్, కార్తీక్ బుధవారం రాత్రి చిక్కబళ్లాపురం వైపుగా కారులో వెళుతుండగా పులేకమ్మ గుడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వాహనం మొరాయించడంతో రోడ్డు పక్కన ఆపేశారు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులను ఆపి లిఫ్ట్ అడిగే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుండగా వాహనదారుడు నియంత్రణ కోల్పోయి శివకుమార్, కార్తీక్ను ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఆఖరున కూర్చొన్న యువకుడు కిందపడి డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని సోమందేపల్లికి చెందిన మనోజ్ (22)గా గుర్తించారు. తన స్నేహితులు ప్రేమ్, అర్షద్తో కలసి ద్విచక్ర వాహనంపై పెనుకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్, శివకుమార్, కార్తీక్, అర్షద్ను అటుగా వెళుతున్న వారు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ప్రేమ్ను కర్నూలుకు రెఫర్ చేశారు. ఘటనపై పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మనోజ్ పుట్టిన రోజే ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. ● పెనుకొండ రూరల్: కర్ణాటకలోని పావగడ తాలూకా కడుమలకుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (33), నాగేంద్ర దంపతులు గురువారం ఉదయం తమ కుమార్తె మహితతో కలసి ద్విచక్ర వాహనంపై కనగానపల్లి మండలం దాదులూరు వద్ద వెలసిన పోతలప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. పూజలు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు గుట్టూరు శివారులోకి చేరుకోగానే బెంగళూరుకు వెళుతున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఘటనలో నాగేంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలతో నాగేంద్ర బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు కర్ణాటక ప్రాంతానికి చెందిన మహిళ కాగా, మరొకరు సోమందేపల్లికి చెందిన యువకుడు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు... -
ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలి
ధర్మవరం రూరల్: ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే ఎరువులను, పురుగు మందులను విక్రయించాలని ఎరువుల దుకాణదారులకు జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు సూచించారు. గురువారం ధర్మవరం వ్యవసాయ సబ్ డివిజన్లోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లతో స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వైవీ సుబ్బారావు మాట్లాడుతూ నిర్ధేశించిన ధరలకే ఎరువులను విక్రయించి రైతులకు తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలన్నారు. స్టాక్ బోర్డు, ధరల పట్టికలు ప్రదర్శించాలన్నారు. అలాగే రైతులకు అవసరమైన మేరకు మాత్రమే పురుగు మందులను విక్రయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సనావుల్లా, సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య, ఏఓలు ముస్తఫా, ఉదయ్కుమార్, ఓబిరెడ్డి, రమాదేవి, కృష్ణకుమారి, కవిత, ఆత్మ బీటిఎం ప్రతిభా, సబ్ డివిజన్లోని పురుగుమందుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్యాయాలకు తావులేకుండా బదిలీల చట్టాన్ని రూపొందించాలి
ఎన్పీకుంట: ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ అన్యాయం జరగకుండా బదిలీల చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీ ముసాయిదా చట్టంపై స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధనకు ఆటంకం లేకుండా వేసవిలో మాత్రమే బదిలీలు నిర్వహించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం మంచి పరిణామమన్నారు. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు స్వీకరించి వాటికి అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఖాళీలను బ్లాక్ చేయకుండా బదిలీల సమయంలో అన్ని వెకెన్సీలను చూపాలన్నారు. సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా రీఅపోర్సన్ పాయింట్లు ఇవ్వాలన్నారు. రీ అపోర్సన్ అయ్యే స్కూల్ అసిస్టెంట్లకు అదనపు ప్రాధాన్యత ఉండేలా చూడాలన్నారు. ఏదైన పనిస్మెంట్కు గురైన వారికి పాయింట్స్ తగ్గింపు విషయాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, సందీప్, గోవర్ధన్, షఫీ, రమణయ్య, రామ్మోహన్ తదితరులు ఉన్నారు. బావిలో పడి యువకుడి మృతి గుడిబండ: ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుడిబండలోని రాజు కాలనీకి చెందిన పార్వతమ్మ, క్రిష్టప్ప దంపతుల కుమారుడు భోజరాజు (23) గురువారం ఉదయం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం వ్వవసాయ బావి వద్దకు వెళ్లిన క్రిష్టప్పకు అక్కడ బావి వద్ద భోజరాజు చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మోటార్ ద్వారా నీటిని తోడేసి భోజరాజు మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి -
ఏక పంట విధానంతో నష్టాలు
పుట్టపర్తి అర్బన్: ఏక పంట విధానంతో నష్టాలు వస్తాయని, పంట మార్పిడి ఎంతో అవసరమని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం జాన్సన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను తరచూ సందర్శించాలన్నారు. నూతన రకాల సాగు పద్దతులు, నూతన వంగడాల సాగు సమస్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మల్బరీ సబ్సిడీలపై సెరికల్చర్ అధికారి పద్మమ్మ వివరించారు. చేపల పెంపకంపై ముందుకు వచ్చే రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫిషరీస్ అధికారి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. -
క్వింటా చింతపండు రూ.31 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా కొనసాగుతోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్కు గురువారం 1,214.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.31 వేలు, కనిష్టంగా రూ.8,100, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఏపీఆర్ఎస్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర పాఠశాలలో (ఏపీఆర్ఎస్ఓఈ) ప్రవేశానికి 2025–26 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యా సంస్థల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎన్వీ మురళీధర్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గురువారం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఉన్న 80 సీట్లకుగాను రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటూ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలురు మాత్రమే ఇందుకు అర్హులన్నారు. ఏపీఆర్ఎస్ క్యాట్ (ఏపీఆర్ఎస్ సీఏటీ) అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు https://aprs.apcfss.in అనే వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకూ గడువు విధించామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 25న జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి మార్కుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 87126 25065 సెల్ నంబరును సంప్రదించాలన్నారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి ప్రశాంతి నిలయం: రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు అందజేసిన అర్జీలతో పాటు పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో అర్జీల పరిష్కారం, వెబ్ల్యాండ్ పెండింగ్ ఫైల్స్పై ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను మార్చి 15లోపు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పలువురు అధికారుల పాల్గొన్నారు. నీటితొట్టెలో పడి చిన్నారి మృతి ఓడీచెరువు: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేమారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు, రాధిక భార్యభర్తలు. వారికి బాలిక (5)తో పాటు బాలుడు ద్వారక (4) ఉన్నారు. దంపతులిద్దరూ పనుల నిమిత్తం పొరుగు గ్రామానికి వెళ్లారు. నానమ్మ, తాత వద్ద పిల్లలు ఉన్నారు. అయితే బాలుడు ఆడుకుంటూ ఇంటి వెనుక పశువుల పాకలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడిపోయాడు. చుట్టు పక్కలవారు గట్టిగా కేకలు వేయడంతో ఆ బాలుడిని తొట్టెనుంచి బయటకు తీశారు. వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ద్వారక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలి
రాప్తాడు రూరల్: శ్రీశైలంలో కృష్జజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేలా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. త్వరలో హంద్రీ–నీవా కాలువకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో 70 టీఎంసీల నీటి నిలువ ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు రోజూ అర టీఎంసీ చొప్పున నీటిని వినియోగిస్తున్నాయని, ఈ లెక్కన 140 రోజుల వరకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ఈలోపు పేరూరు డ్యాంకు నీళ్లు నింపేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను పరిటాల సునీత కలిసినా పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అడగక పోవడం బాధాకరమన్నారు. అప్పట్లో వరుసగా మూడేళ్లు నింపాం.. వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపినట్లు ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. డ్యాంలో నీళ్లు లేకపోతే రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గంలో వందలాది గ్రామాలు కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయన్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడం ద్వారా రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో భూగర్భజలాలు పెరిగి, 10 వేల ఎకరాల్లో పంటల సాగు అందుబాటులోకి వస్తుందన్నారు. రొద్దం మండలం తురలాపట్నం వంకలో నీళ్లు వదిలితే నేరుగా డ్యాంకు చేరుకుంటాయన్నారు. దీనికి కరెంటు ఖర్చు తప్ప ఇతర ఖర్చులేమీ ఉండవన్నారు. ఇంత చిన్న అంశాన్ని పరిటాల సునీత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. డిమాండ్ రాగానే గేట్లు తొలిగించారు.. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి మొదలవగానే మరమ్మతుల పేరుతో ఉన్న గేట్లను తొలిగించడం దారుణమన్నారు. రైతులపై కక్ష తీర్చుకునేలా డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పరిటాల సునీత వైఖరి కారణంగా దిగువకు వృధాగా పారాయన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 40 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువను తెచ్చారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచారని గుర్తు చేశారు. పీఏబీఆర్ నుంచి రూ. 90 కోట్లతో మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారన్నారు. జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగినేషన్ స్కీమ్కు రూ.170 కోట్ల నిధులిచ్చారన్నారు. అయితే టీడీపీ హయాంలో చేసిందేమీలేదని, రూపాయి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అంశాన్ని సైతం ఎమ్మెల్యే సునీత నిర్లక్ష్యం చేస్తుండడం గమనిస్తే నియోజకవర్గ రైతులు, ప్రజల సంక్షేమం పట్టలేదనేది అర్థమవుతోందన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
క్వాలిటీ కంట్రోల్.. వసూళ్లు ఫుల్!
పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘క్యాష్’ కొడితే గానీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ (ధ్రువీకరణ పత్రం) ఇవ్వడం లేదని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు ఒక శాతం, ఇతర లోపాలు ఏమైనా ఉంటే అదనంగా మరింత అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ● పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో వసూళ్ల పర్వం ● టార్గెట్లు విధించి మరీ లాగుతున్న ఓ డీఈ స్థాయి అధికారి ● గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరంగా నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి డివిజన్కు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ), ముగ్గురు లేదా నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ)లు ఉంటారు. వీరందరిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఉన్నారు. రోడ్డు గానీ, భవనాలు గానీ నిర్మించాక.. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించారా లేదా అని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తారు. నిర్దేశిత నిష్పత్తి మేరకు సిమెంట్, ఇసుక తదితరాలు వాడారా లేదా పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. రూ.30 లక్షల్లోపు బిల్లులు అయితే డీఈఈ స్థాయి, అంతకన్నా ఎక్కువైతే ఈఈ స్థాయిలో క్యూసీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఉంటుంది. యథేచ్ఛగా వసూళ్లు.. అయితే, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్)ల మంజూరు మాటున కొందరు అధికారులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్ లేదా రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తే.. అందుకు ఒక శాతం అంటే రూ.40 వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. దీంతో కొందరు కాంట్రాక్టర్లు రిపోర్ట్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘క్యూసీ’ సమర్పిస్తే ఎంత బిల్లు వస్తుందో అంతకంటే ఎక్కువ నష్టపోయినా పర్వాలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బరితెగించిన డీఈఈ.. కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీపై వచ్చిన ఓ డీఈఈ బరితెగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో పరిచయాలున్నాయని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్లు విధించి మరీ కమీషన్లు వసూలు చేసి ఇవ్వాలని తన కింది స్థాయి సహాయ ఇంజినీర్లకు పట్టుబడుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. మరి కొందరు ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులను చెక్ చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక.. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కొందరు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. పర్యవేక్షణ కరువవడంతోనే ఇలా తయారయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా నా దృష్టికి రాలేదు. కమీషన్ కోసం వేధించే అధికారుల గురించి బాధిత కాంట్రాక్టర్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా. – మల్లికార్జున మూర్తి, ఈఈ -
సవాళ్లు అధిగమిస్తేనే మహిళా సాధికారత
పుట్టపర్తి టౌన్: సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయి ఆరామంలో డీఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత –సవాళ్లు–పరిష్కారాలు’ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఎస్పీ రత్న ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఐదుగురు మహిళలను ఎస్పీ రత్న శాలువలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. అనంతరం 59 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ మహిళలు తమని తాము నిరూపించుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అప్పుడే అనేక ఆటంకాలు ఎదురవుతాయన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యవసర సమాయాల్లో సహాయం కోసం చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ 181, పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 100, 112, సైబర్ క్రైమ్కు 1930 కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, ఆర్టీడీ రీజనల్ డైరెక్టర్ ప్రమీలా కుమారి, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానూజ, సింగర్ సరళ, సీడీపీఓ గాయత్రి, సీఐలు సునీత, ఇందిర, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించే యత్నం జరుగుతూనే ఉంది. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేసి.. కళ్లజోడు అందజేసే ముఖ్యమంత్రి ఐ–కేర్ పథకానికి మంగళం పాడ
సాక్షి, పుట్టపర్తి: ప్రభుత్వ వైద్యసేవలపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పేదలకు మంచి చేసే కార్యక్రమాలకు గండి కొడుతోంది. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా సక్రమంగా లేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వైద్య సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ–ఐ కేర్ కేంద్రాలు ఎత్తేయడంతో పేదలు వైద్యసేవలకు దూరమయ్యారు. ‘ఈ–ఐ కేర్’ సేవలకు మంగళం.. జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, మడకశిర, చెన్నేకొత్తపల్లి, నల్లమాడలో కంటి పరీక్ష కేంద్రాలు ఉండేవి. 2018లో ఎన్నికల ముందు ప్రారంభించిన చంద్రబాబు.. మళ్లీ ఆయనే అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థను రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో రోజుకు సగటున 200 మందికి కంటి పరీక్షలు చేసేవారు. ఉద్యోగుల రోడ్డు పాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాల్లో జనాభా ఆధారంగా ఒక్కో ఈ–ఐ కేర్ కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున పని చేసేవారు. ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.18 వేలు చొప్పున వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు మూతపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. అదేవిధంగా లక్షల మంది ఉచిత కంటి పరీక్షలు దూరమయ్యారు. అదేవిధంగా ఎంపీహెచ్ఏలను ఉన్నఫలంగా తొలగించడంతో చాలా మంది కుటుంబ భారం మోయలేక ... ఉద్యోగం కోసం విజయవాడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన 58 మంది ఉన్నారు. పట్టించుకోని ఆరోగ్యశాఖామంత్రి.. ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేస్తామని ౖపైపెకి చెబుతున్నా కూటమి సర్కార్ చర్యలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఎంపీహెచ్ఏల తొలగింపు, ఆరోగ్యశ్రీపై సేవలు ఎత్తివేత దిశగా చర్యలు, ఈ–ఐ కేంద్రాల మూత నిర్ణయాలు దానికి బలాన్నిస్తున్నాయి. అయితే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే వైద్యశాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోయిందని , తామంతా రోడ్డున పడ్డామని ఎంపీహెచ్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ మండలిలో డిమాండ్ చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం నోరు విప్పలేదు. రద్దు చేయడం బాధాకరం ఐదేళ్ల పాటు ఉచిత సేవలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు రద్దు చేయడం బాధాకరం. పరీక్షలు చేయించుకోవడానికి వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను అందజేశారు. – వెంకటేష్, మడకశిర లక్షల మంది పేదలకు ఉపయోగపడే కంటి పరీక్ష కేంద్రాలను రద్దు చేయడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ఉపాధి కోల్పోవడంతో పాటు రోజూ సగటున సుమారు 50 వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించేవారు. అంతమంది పేదలు ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టాల్సిన దుస్థితి. చంద్రబాబు తీరు మార్చుకోవాలి. – గోపాల్, పెనుకొండ ఇప్పటికే ముఖ్యమంత్రి ఐ కేర్ ఎత్తివేత మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు ‘ఆరోగ్యశ్రీ’ పథకం అమలు అంతంత మాత్రమే ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు -
ఇంటర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
మడకశిరరూరల్: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025–2026 సంవత్సరానికి (ఇంగ్లిష్ మాధ్యమం) ప్రవేశ పరీక్షకు బాలురు, బాలికల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల పాఠశాల, కళాశాల కన్వీనర్ రమాదేవి తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ (ఇంగ్లిష్ మాధ్యమం) ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొన్నారు. బాలికలకు (టేకులోడు, గుండిబండ, బాలురకు లేపాక్షి, గుండుమల కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఆస్తకి గల అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
ముగ్ధ శారీస్ ఎండీపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: స్థానిక పట్టుచీరల వ్యాపారస్తుల వద్ద పట్టుచీరలు, పట్టు పావడాలు కొనుగోలు చేసి, ఇందుకు సంబంధించిర రూ.3.53 కోట్లను ఇవ్వకుండా మోసం చేసిన మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన వివరాలను వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ముగ్ధ పేరుతో రిటైల్ దుకాణాలు నిర్వహిస్తున్న వంగపల్లి శశి... ధర్మవరం పట్టణానికి చెందిన దాసరి నాగభూషణంతో రూ.1.73కోట్ల విలువ చేసే పట్టు పావడాలు, లక్ష్మి హన్షిక శిల్క్ శారీస్ యజమాని ముక్తాపురం బాలకృష్ణ వద్ద రూ.1.80కోట్లు విలువ చేసే పట్టుచీరలను కొనుగోలు చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన బాధితులు గురువారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ముగ్ధ శారీస్ మేనేజింగ్ డైరెక్టర్ వంగపల్లి శశిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి బలవన్మరణం ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ఎగ్గిడి లోకేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గేదెల పోషణతో జీవనం సాగించే లోకేష్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కడుపు నొప్పి తీవ్రత తాళలేక స్థానిక బైపాస్ సమీపంలోని ఓ రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
● పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలిరెండో రోజూ కొనసాగిన ఆర్డీఓ విచారణ పుట్టపర్తి టౌన్: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింతగా పెంచాలంటూ ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ రత్న సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ప్రొబేషనరీ ఎస్ఐలు గురువారం డీపీఓలోని చాంబర్లో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటే కేసుల దర్యాప్తులో మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. నాలుగు నెలల గ్రేహౌండ్స్ శిక్షణలో భాగంగా బేసిక్ పోలీసింగ్ విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే చోరీ రాయదుర్గం టౌన్: స్థానిక మారెమ్మ గుడి ప్రాంతంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మంజునాథ్ భార్య స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటికి తాళం వేసి ఆటో అద్దెల కోసం మంజునాథ్, ఆయన భార్య ప్రైవేట్ స్కూల్కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి చేరుకున్న మంజునాథ్.. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఓ క్యారియర్లో దాచి ఉంచిన రూ.80 వేలును అపహరించి, ఇంటి వెనుక ఉన్న మరో తలుపు నుంచి దుండగులు ఉడాయించినట్లుగా గుర్తించాడు. బీరువాకు వేసిన తాళం తీసేందుకు విఫలయత్నం చేశారని, బీరువా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో ఉంచిన బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. మట్కా నిర్వాహకుల అరెస్ట్ తాడిపత్రి టౌన్: స్థానిక పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ జిల్లా బాపనపల్లికి చెందిన కొండమనాయుడు, తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్ నివాసి నాగల మణికంఠ, భగత్సింగ్ నగర్కు చెందిన సుబ్బరాయుడు, చాకలి ఆదినారాయణ ఉన్నారు. వీరు గురువారం ఉదయం తాడిపత్రిలోని ఆర్టీసీ బస్డాండ్ వద్ద అరెస్ట్ చేసి రూ.30వేలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక మద్యం విక్రేతల అరెస్ట్ హిందూపురం అర్బన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బుధ, గురువారాల్లో చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న పలువురు పట్టుబడ్డారు. వీరి నుంచి 418 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్బుడిన వారిలో హిందూపురం మండలం కొల్లకుంటకు చెందిన వెంకటేష్, కొడిగెనహళ్లికి చెందిన గిరీష్కుమార్, గోళ్లాపురానికి చెందిన జయలక్ష్మి, మేళాపురానికి చెందిన లత, లక్ష్మి, సదాశివనగర్ నివాసి భూపతి ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐలు గురునాథరెడ్డి, లక్ష్మీదుర్గయ్య తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి రామగిరి: మండల కేంద్రానికి చెందిన తలారి రాజన్న (48) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలేపల్లి సరిహద్దులో ఉన్న రాజన్న పొలం పక్కనే మరొకరికి సంబంధించిన పొలం ఉంది. వీటి మధ్య ఉన్న వేప చెట్టు తమకు చెందుతుందంటే తమకు చెందుతుందని బుధవారం ఇరువురు రైతులు వాదించుకున్నారు. అనంతరం రాజన్న ఇంటికి చేరుకున్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య శ్యామల చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముదిగుబ్బ: మండలంలోని ఏబీపల్లి తండాలో గిరిజన, గిరిజనేతర భూములను ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆక్రమించిన అంశంపై ధర్మవరం ఆర్డీఓ మహేష్ గురువారం రెండవ రోజు గురువారం కూడా విచారణ చేపట్టారు. ఆరోపణలు ఉన్న సర్వే నంబర్ 1858, 1962, 1963, 1809లలో ఉన్న భూములను ఆర్డీఓ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఏబీపల్లికి చెందిన బాధిత రైతులు రవిశంకర్ నాయక్, గాయత్రి బాయి, నారాయణమ్మ, జయమ్మ, కుల్లాయప్ప నాయక్, బాలునాయక్తో మాట్లాడారు. తమ భూములను ఎంపీపీ ఆన్లైన్లో ఎక్కించుకున్నాడని, ఆ భూములపై బ్యాంకులలో రుణాలను కూడా తీసుకోవడం అన్యాయమని, తమ వద్ద భూములకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆర్డీఓ దృష్టికి వారు తీసుకెళ్లారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు పెట్టలేకపోయామని, గతంలో చాలా సార్లు పంటలు సాగు చేసి పెట్టుబడులు కూడా రాకపోవడంతో ప్రస్తుతం పంటలు సాగు చేయలేక బీళ్లుగా పెట్టుకున్నామన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ... అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన తలారి హనుమంతు, పార్వతి దంపతుల కుమారుడు లోకేష్ (35)కు ఏడేళ్ల క్రితం కల్లుహోళ గ్రామానికి చెందిన అంజలితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరిలోనే ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ బుధవారం వ్యక్తిగత పనిపై బొమ్మనహాళ్కు వచ్చాడు. పనిముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. నేమకల్లు చెక్పోస్టు దాటగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లోకేష్కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు తమిళనాడుకు చెందిన రాజుకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బళ్లారిలోని విమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజును కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. లోకేష్ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. కాగా, బాధిత కుటుంబసభ్యులను వైఎస్సార్సీపీ సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు.