breaking news
Sri Sathya Sai District News
-
మొహర్రం.. భక్తసంద్రం
బత్తలపల్లి: డప్పు దరువులు..యువత కేరింతలు.. వసంతోత్సవంతో ఉప్పొంగిన ఆనందం.. ఆడ, మగ భేదం లేకుండా అందరూ అలావ్ తొక్కుతూ మైమరచిన ఆధ్యాత్మిక ఆనందోత్సవ వేడుక శనివారం బత్తలపల్లిలో జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పేరుగాంచిన పెద్ద, చిన్న కాశీంస్వామి మొహర్రం వేడుకల్లో భాగంగా శనివారం బత్తలపల్లి నాలుగురోడ్ల కూడలిలో పీర్ల భేటీ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి జనం వేలాదిగా తరలిరావడంతో బత్తలపల్లి భక్తసాగరమైంది. చాలా మంది మిద్దెలు, మేడలు ఎక్కి పీర్ల భేటీని అబ్బురంగా చూశారు. పోట్లమర్రి, గంటాపురం, వేల్పుమడుగు, రాఘవంపల్లి, ఈదుల ముష్ఠూరు, మల్కాపురం గ్రామాల పీర్లు బత్తలపల్లి చిన్నకాశీం, పెద్ద కాశీం స్వాములతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు బెల్లపు ఉంటలను పీర్లపైకి విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. బేటీ అనంతరం ఆయా గ్రామాల పీర్లు తిరిగి వెళ్లగా.. బత్తలపల్లి పీర్లకు జలధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు ‘ఆల్ బిదాయో’ అంటూ విషాద గీతం ఆలపిస్తూ మకాన్కు చేరుకున్నారు. -
మాన్యం.. స్వాహాకు సన్నద్ధం
ఎన్పీకుంట: మండల పరిధిలోని బలిజపల్లి పంచాయతీ సారగుండ్లపల్లి సమీపంలో బోడికొండ్రాయుని ఆలయం ఉంది. 200 ఏళ్ల చరిత్ర గల ఆలయంలో వెంకటరమణస్వామి పూజలు అందుకునేవాడు. ఆలయానికి 70.07 ఎకరాల మాన్యం భూములుండగా.. అందులో 20 ఎకరాల్లో చింతచెట్లను నాటించారు. మరో మూడు ఎకరాలు పాపాగ్ని నది మునకలో పోయింది. ఇంకో మూడు ఎకరాలు రోడ్డు నిర్మాణానికి సేకరించారు. మిగిలిన 44.07 ఎకరాల భూమిని వేలంపాట ద్వారా రైతులకు కౌలుకు ఇచ్చేవారు. ఈ ఆలయానికి గతంలో అల్లుగుంటి చౌరెడ్డి ధర్మకర్తగా ఉండే వారు. అప్పట్లో రైతులు ఐదెకరాలకు రూ.1,200 చొప్పున కౌలు చెల్లించడంతో పాటు పండిన పంటలో సగం ధర్మకర్తకు ఇచ్చేవారు. చౌరెడ్డి తర్వాత వారి కుమారులు ఎ.సిద్దారెడ్డి, రామకృష్ణారెడ్డి ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. రామకృష్ణారెడ్డి ధర్మకర్తగా ఉన్న సమయంలో ఎన్నో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు పాపాగ్ని మునకలో వెళ్లిన బోడికొండ్రాయుని ఆలయ మాన్య భూములకు ఆయా శాఖల తరఫున పరిహారం అందగా..ఆలయ ధర్మకర్త రామకృష్ణారెడ్డి లెక్కలు చెప్పడం లేదని, అంతేకాకుండా ఆలయ అభివృద్ధి పేరుతో సేకరించిన విరాళాలు, చందాల సొమ్ము కూడా తినేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు.. బోడికొండ్రాయుని ఆలయ మాన్యం భూములు పరాధీనమవుతున్న నేపథ్యంలో గతంలో పలువురు గ్రామస్తులు ఆలయం అభివృద్ధికి నోచుకోనివైనం, నిధులు స్వాహా పర్వంపై మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. కమిషన్ నోటీస్తో స్పందించిన దేవదాయశాఖ ఆలయానికి కమిటీ అంటూ ఏమీ లేదని, ఓ అధికారిని నియమించి మాన్యం భూములను కౌలుకు ఇస్తామని అప్పట్లో కమిషన్కు తెలిపింది. కానీ గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై నోరు మెదపలేదు. ఆ తర్వాత తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మాన్యం భూముల్లో ఎవరూ పంటలు పండించలేదు. వేలంపాట ద్వారా కౌలుకు... 2020 సంవత్సరంలో దేవుని మాన్యంలోని పది ఎకరాల్లో ఉపాధిహామీ పథకం కింద చెట్లు పెంచడం కోసం అధికారులు చర్యలు చేపట్టగా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతులకు కౌలుకు ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు అదే ఏడాది మాన్యం భూములను వేలంపాట ద్వారా రైతులకు కౌలుకు ఇచ్చారు. ఆ తర్వాత 2022లోనూ మరోసారి వేలంపాట ద్వారా మూడేళ్ల కాలానికి ఒక్కో రైతు రూ.3,450 చెల్లించే విధంగా 10 మంది రైతులకు భూములను కౌలుకు ఇచ్చారు. ఇందులో దోస, కర్బూజ, కంది, ఉలవ, వేరుశనగ పంటలు సాగు చేశారు. 40 ఎకరాలు అర్చకులకు వెళ్లిందని సందేశం మూడేళ్ల కౌలు గడువు 2025తో తీరిపోయినా... అధికారులు వేలం పాట నిర్వహించలేదు. దీంతో రైతులు మాన్యం భూములను కౌలుకు ఇచ్చేందుకు వేలంపాట నిర్వహించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. దానికి జవాబుగా దేవస్థానానికి సంబంధించిన 40 ఎకరాల భూమి అర్చకులకు వెళ్లిందని, ప్రస్తుతం నాలుగు ఎకరాలు మాత్రమే మిగిలిందని మొబైళ్లకు అధికారులు సందేశం పంపినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం శిథిలమై పాతికేళ్లవుతోందని, అప్పటి నుంచి ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరగడం లేదంటున్నారు. ఇప్పుడు అర్చకులు ఎక్కడి నుంచి వచ్చారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అండతో గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఎండోమెంట్ అధికారి ఈశ్వర్రెడ్డితో లాలూచి పడి భూమిని కబ్జాచేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి మాన్యం భూమిని కాపాడి రైతులకు కౌలుకు ఇవ్వాలని కోరుతున్నారు. ఆక్రమణల్లో ఆరితేరిన ‘పచ్చ’ నేతలు... దేవుడికే శఠగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. బోడికొండ్రాయుని ఆలయ మాన్యాన్ని సొంతం చేసుకునేందుకు అధికారాన్ని ఉపయోగించారు. పాతికేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయానికి అర్చకులను తెరపైకి తెచ్చారు. 44 ఎకరాల మాన్యం భూమిలో 40 ఎకరాలకు ఎసరు పెట్టారు. దీంతో ఇన్నాళ్లు ఆలయ భూములను కౌలుకు తీసుకుని బతుకుతున్న రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోడికొండ్రాయుని ఆలయ భూములపై కన్ను అధికార అండతో 40 ఎకరాల కబ్జాకు యత్నం మాన్యం భూములు కాపాడాలని కౌలు రైతుల వేడుకోలు వేలంపాట నిర్వహించాలి ఆందోళన అవసరం లేదు బోడికొండ్రాయుని మాన్యం భూమిని మా తాతల కాలం నుంచి కౌలుకు చేసుకుంటున్నాం. గతంలో వేలంపాట ద్వారా భూమి పొంది వేరుశనగపంట సాగు చేశా. కౌలు కాలం తీరిపోయినా అధికారులు వేలంపాట నిర్వహించలేదు. ఇప్పుడు మాన్యం భూమి నాలుగు ఎకరాలే ఉందని సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. అధికారులు చొరవచూపి భూమిని కౌలుకు ఇవ్వాలి. – బి.కదిరప్ప, కౌలు రైతు, సారగుండ్లపల్లి అర్చకులకు వెళ్లిందని చెబుతున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో దేవుని మాన్యం కిందే ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్యను దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నివేదిక తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం. – లక్ష్మమ్మ, తహసీల్దార్, ఎన్పీ కుంట -
కందికుంటకు ‘సోలార్’ ముడుపులు
● సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ కదిరి: సోలార్ పవర్ ప్రాజెక్టు టీడీపీకి చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు కల్పతరువుగా మారిందని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోలార్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే బలవంతపు భూసేకరణను మాత్రం ఒప్పుకోబోమన్నారు. ఎన్పీ కుంట మండల పరిధిలో ఉన్న సోలార్ ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే కందికుంటకు నెలసరి మామూళ్లు అందుతున్నాయని ఆరోపించారు. రైతులు, రైతు కూలీలు, పాడి రైతుల పట్ల ఎమ్మెల్యే చులకన భావంగా మాట్లాడుతున్నారని, సరైన సమయంలో ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతులను, కమ్యూనిస్ట్ పార్టీలను కించపరిచే విధంగా మరోసారి కందికుంట మాట్లాడితే ఆయన అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టడం ఖాయమన్నారు. కమీషన్ల కోసమే బైపాస్ పనులకు బ్రేక్ కదిరి బైపాస్ రోడ్ పనుల్లో రెండు, మూడు విద్యుత్ టవర్లు మార్చాల్సి ఉండగా... ఎమ్మెల్యే కందికుంట 10కి పైగా టవర్లు మార్చాలని ఆ పనులు ఆపేశారన్నారు. ఎక్కువ టవర్లు మారిస్తే ఎమ్మెల్యేకు రూ.కోట్లలో కమీషన్లు అందుతాయన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం నేత కాటమయ్య, సీపీఐ నేత నల్లజోడు పవన్, ఏఐఎస్ఎఫ్ నేత శేషం మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ప్రశాంతి నిలయం: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వారు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.... గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 30 శాతం, మరణాలు 32 శాతం తగ్గాయన్నారు. హరిపురం జంక్షన్, పుట్టపర్తి క్రాస్, దామాజిపల్లి, దుద్దెబండ క్రాస్ సహా జిల్లాలో 26 ప్రమాద ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బత్తలపల్లిలో ఆర్డీటీ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం, తాడిపత్రి రోడ్డు తదితర చోట్ల స్పీడ్ బ్రేకర్లు , హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. లింక్రోడ్లకు అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయాలన్నారు. కోరేవాండ్లపల్లి, గోరంట్ల, రెడ్డి చెరువు కట్ట ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేయించాలన్నారు. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన విగ్రహాలను పరిశీలించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
‘సర్’లో సందేహాలన్నీ తీర్చండి
కదిరి: ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్’)పై కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘అన్నీ సందేహాలే ‘సర్’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఓటర్ల సందేహాలపై పత్రికల్లో వచ్చే కథనాలపై ఆయా డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు పత్రికా ముఖంగా నివృత్తి చేయాలని ఆదేశించారు. దీంతో కదిరి ఆర్డీఓ కళావతి శనివారం ఓ పత్రికా ప్రకటన ద్వారా పలు విషయాలు తెలియజేశారు. ● బీఎల్ఓలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు తగిన శిక్షణ ఇచ్చామని, ఓటర్లకు ఎలాంటి సందేహాలు తలెత్తినా బీఎల్ఓలు దగ్గరుండి తగిన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ● కొత్త ఓటరు నమోదుతో పాటు సవరణకు సంబంధించిన ఫారాలు బీఎల్ఓల దగ్గర అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన ఓటర్లు అడిగి తీసుకోవచ్చన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలో పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామని, బీఎల్ఓలు లేదా బీఎల్ఏల సహకారం కూడా తీసుకోవచ్చన్నారు. ● 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వివాహిత మహిళలు తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు అందులో పొందుపరిస్తే సరిపోతుందన్నారు. ‘సర్’పై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఎంట్రీలు మాత్రమే తొలగిస్తామన్నారు. ప్రతి ఫారాన్ని తహసీల్దార్ ధ్రువీకరించాలి ప్రశాంతి నిలయం: ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్)లో అందే ఎన్యూమరేషన్ ఫారాన్ని తహసీల్దార్లు ధ్రువీకరించి డిజిటలైజేషన్ చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్యతో కలిసి కలెక్టరేట్ నుంచి ‘సర్’ కార్యక్రమంపై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడారు. జిల్లాలో 1,576 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆయా పోలింగ్ బూత్ల పరిధిలో 14,23,839 మంది ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,06,751 మంది కాగా, మహిళా ఓటర్లు 7,17,023 మంది ఉన్నారన్నారు. ఇక థర్డ్ జండర్ ఓటర్లు 65 మంది ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికీ ఓ బీఎల్ఓను, వారిపై పర్యవేక్షణకు 156 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 93.07 శాతం పూర్తయ్యింన్నారు. డిజిటలైజేషన్లో 19.88 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. జూలై 14వ తేదీలోపు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. -
ఆలయ నిర్మాణానికి రూ.50.85 లక్షల మంజూరు
ధర్మవరం అర్బన్: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.50.85 లక్షలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద ప్రభుత్వం మంజూరు చేసిందని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలిప్రశాంతినిలయం: జిల్లాలో వివిధ రైల్వే బ్రిడ్జిలు, వంతెనలు, అండర్ బ్రిడ్జిల పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు ప్రతిపాదిత దశలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ అండర్ బ్రిడ్జిలు పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల సౌకర్యార్థం, భద్రత దృష్ట్య పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆర్అండ్బీ, పీఆర్, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు. 25 వేల హెక్టార్లకు డ్రిప్ అందించడమే లక్ష్యం బత్తలపల్లి: శ్రీసత్యసాయి జిల్లాలో 2026–27 సంవత్సరానికి 25 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందజేయడమే లక్ష్యమని ఏపీఎంఐపీ పీడీ ఆర్.దేవానంద్ తెలిపారు. శనివారం బత్తలపల్లి మండలంలో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, అందుకోసం డ్రిప్ విధానాన్ని అనుసరించాలన్నారు. రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో 14 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందించామని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 25 వేల హెక్టార్లకు అందించడమే లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు పది ఎకరాల్లోపు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు.ఎంఐఏఓ శివశంకర్, పలు డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం నిలువ
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారం బస్తాలను ప్రశాంతిగ్రామం అంగన్వాడీ కేంద్రంలో నిల్వ చేశారు. దీంతో సెంటర్కు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. పుట్టపర్తి ప్రాజెక్టు పరిధిలోని సుమారు 203 కేంద్రాలకు సంబంధించిన బాలామృతం బస్తాలను ప్రశాంతి గ్రామం సెంటర్లో నిల్వ చేశారు. దీంతో కేంద్రం నిండిపోవడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి బాలామృతం బస్తాలు రాగానే వాటిని గోడౌన్లో భద్రపరిచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే వాటిని అక్కడ ఎందుకు ఉంచారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ వీటిని గోడౌన్కు చేర్చకుండా బిల్లులు చేసుకుంటున్నారా..? లేక మరేదైన కారణం ఉందా..అని సందేహాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. దీనిపై సీడీపీఓ జయంతిని అడగ్గా, గోడౌన్ లేనందున అంగన్వాడీ కేంద్రంలో నిల్వ చేశామని ,గోడౌన్ అద్దెకు దొరకగానే వాటిని తీయించి వేస్తామని బదులిచ్చారు. ఇబ్బంది పడుతున్న చిన్నారులు గోడౌన్కు తరలించకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు ! -
వృద్ధుడి అనుమానాస్పద మృతి
తాడిపత్రి రూరల్ : పట్టణ సమీపంలోని గన్నేవారిపల్లికాలనీకి చెందిన నారాయణరెడ్డి (70) అనుమానాస్పదంగా మృతి చెందాడు. శనివారం స్థానిక స్టేషన్లో అప్గ్రేడ్ ఎస్ఐ దయాకర్రెడ్డి తెలిపిన మేరకు.. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం మండలం ఏటూరుకు చెందిన నారాయణరెడ్డి రెండేళ్ల నుంచి గన్నేవారిపల్లి కాలనీలో నివాసం ఉంటున్న చిన్న భార్య కుమార్తె సుచిత్ర వద్ద ఉంటున్నాడు. చిన్న అల్లుడు అల్లం సత్యనారాయణ అనంతపురంలో బిర్యానీ సెంటర్ నడిపేవాడు. హోటల్లో నష్టాలొచ్చి ముదిగుబ్బలో కొంత పొలం కౌలుకు తీసుకున్నాడు. అప్పుడప్పుడు తాడిపత్రి సమీపంలోని ఇంటికొచ్చి వెళ్తుండేవాడు. ముదిగుబ్బలో వ్యవసాయ కూలీగా పరిచయమైన ఘని చిన్న అల్లుడితో పాటు ఉంటున్నాడు. తాడిపత్రికి చిన్న అల్లుడితో పాటు ఘనీ వచ్చాడు. మామ నారాయణరెడ్డితో ఘనికి గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం ఇంటికొచ్చిన నారాయణరెడ్డి మృతిచెందాడు. మృతుడు నారాయణరెడ్డి పెద్ద కుమారై సవిత ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి తలుపుల: మండలంలోని బి.కొత్తపల్లికి సమీపంలో పాత ఘాట్ రోడ్డులో కారు, ద్విచక్రవాహనం ఢీకొని మేడా భరత్ నరసింహ (25) శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన ఓబయ్య కుమారుడు బెంగళూరులో బ్యాంకులో పనిచేస్తూ, బంధువుల ఇంట జరిగే పెళ్లి కోసం స్వగ్రామానికి వచ్చాడు. తన అమ్మమ్మగారి ఊరు మైదుకూరుకు వెళ్తుండగా, గ్రామ సమీపంలో కారు ఢీకొనడంతో మృతి చెందాడు. తండ్రి ఓబయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. -
నేడే పల్స్ పోలియో
కారు డ్రైవింగ్, సీసీటీవీ ఇన్స్టాలేషన్పై ఉచిత శిక్షణ పుట్టపర్తి టౌన్: కెనరా బ్యాంక్ రీసెట్ ఐ వారి సౌజన్యంతో కారు డ్రైవింగ్, సీసీ టీవీ ఇన్స్టాలేషన్పై 14 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద కెనరాబ్యాంకు రీసెట్ఐ సంస్థ కార్యాలయంలో జూలై 21 తేది నుంచి శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9705091727, 9391486269లో సంప్రదించాలన్నారు. పాత కక్షలు... కత్తులతో దాడి కదిరి టౌన్: పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న ఘటన కదిరి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు..కుటాగుళ్ల రైల్వేగేట్ సమీపంలోని భవాని హోటల్ వద్ద పని చేస్తున్న రాజీవ్గాంధీనగర్కు చెందిన గాలివీడు నవీన్కుమార్పై అదేవీధికి చెందిన గాలివీడు రాజశేఖర్, అతని బంధువు వంశీ గొడవపడి కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడిన నవీన్కుమార్ను మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. బాధితురాలు ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు రాజశేఖర్, వంశీపై కేసు నమోదు చేశారు. పరిషత్ కార్యాలయాల్లో ‘సర్’ హెల్ప్ డెస్క్లు అనంతపురం న్యూటౌన్: ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై జిల్లా పరిషత్ సహా అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు. సర్పై సందేహాలను హెల్ప్ డెస్క్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చునన్నారు. బస్సులో 12 తులాల బంగారు నగలు చోరీ గోరంట్ల: మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో శింగిరెడ్డిపల్లికి చెందిన ప్రయాణికురాలు బ్యాగ్లో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు పోగొట్టుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..శింగిరెడ్డిపల్లికి చెందిన సుస్మిత అనే ప్రయాణికురాలు హిందూపురంలోని బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లేందుకు గోరంట్ల బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు కదిలిన తర్వాత బ్యాగ్ పరిశీలించగా బంగారం కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే బస్సు దిగి గోరంట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోరంట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పుట్టపర్తి అర్బన్: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే పల్స్ పోలియో ఆదివారం జరగనుంది. ఈనెల 28న పల్స్ పోలియో కేంద్రంలో పోలియో చుక్కలు వేయనున్నారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం 29, 30 తేదీల్లో గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ క్రమంలో శనివారమే వ్యాక్సిన్ క్యారియర్ వాహనాలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పంపారు. ఆయా వాహనాలను ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ చెన్నారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులు 1,71,315 మంది ఉన్నారని, వీరి కోసం 1,011 బూత్లు ఏర్పాటు చేశామన్నారు. చుక్కల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 210 మంది సూపర్ వైజర్లను, పోలియో చుక్కలు వేసేందుకు 4,926 మందిని నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం జిల్లాలో 1,71,315 మందికి చుక్కల మందు వేసేలా ప్రణాళిక -
రోడ్డు ప్రమాదంలో మెకానిక్ దుర్మరణం
హిందూపురం: రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ దుర్మరణం పాలైన ఘటన స్థానిక పోలీస్ పెట్రోల్ బంకు సమీపంలోని మలుపు వద్ద జరిగింది. వివరాలు.. హిందూపురంలోని రహమత్పూర్కు చెందిన మెకానిక్ రిజ్వాన్ బాషా (32) గురువారం రాత్రి బైపాస్ రోడ్డులోని పోలీస్ పెట్రోల్ బంకు సమీపంలో ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఆటో ఢీకొంది. తలకు బలమైన గాయాలైన అతన్ని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సల కోసం అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడు రిజ్వాన్బాషకు భార్యతో పాటు రెండెళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదరహో భరత్ అనంతపురం కల్చరల్: ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాతి భరత్ మరోసారి అంతర్జాతీయ వేదికపై జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటారు. అజర్బైజాన్ దేశ రాజధాని బాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 9వ సీఐసీఏ (కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్, కాన్ఫిడెన్సు బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఆసియా) కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. దేశం తరఫున ముగ్గురు ఎంపిక కాగా అందులో భరత్ ఒకరు కావడం గమనార్హం. యువత సాధికారత, నాయకత్వ వికాసం, జాతి నిర్మాణంలో విశేష కృషి చేస్తున్నందుకు భరత్ను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. భరత్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, తన వంతుగా దేశ ఔన్నత్యాన్ని చాటడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పట్టణ రవాణా, పర్యావరణ పరిరక్షణ, ప్రజాభద్రత, స్మార్ట్ సిటీ అభివృద్ధి తదితర అంశాలపై సీఐసీఏలో చర్చిస్తారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖామాత్యులు మన్సుఖ్ మాండవీయ సహకారమందిస్తు న్నారని వెల్లడించారు. భరత్కు ‘మై భారత్ ప్రోగ్రాం’ అధికారి గోవర్దన శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయమారుతి, సుంకర రమేష్ అభినందనలు తెలిపారు. లారీ దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం ఉరవకొండ: లారీ దగ్ధమై అందులోని డ్రైవర్ సజీవ దహనమైన ఘటన అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారి కొట్టాలపల్లి వద్ద జరిగింది. బళ్లారి నుంచి అనంతపురం మీదుగా నెల్లూరుకు గ్రానెట్ లోడుతో శుక్రవారం తెల్లవారుజామున లారీ బయలుదేరింది. కొట్టాలపల్లి సమీపంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం కనుమపల్లికు చెందిన డ్రైవర్ ఓబుల్రెడ్డి మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యాడు. క్లీనర్ పుల్లయ్య లారీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ను కాపాడేందుకు క్లీనర్ రోడ్డుపై కేకలు వేస్తూ ఆ మార్గంలో వెళుతున్న వాహనదారుల సాయం కోసం ప్రయత్నించినా ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. -
ఐడీసీఏ టీ20 టోర్నీ చాంపియన్గా కర్ణాటక
అనంతపురం: ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసీఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఐడీసీఐ–19 టీ–20 చాంపియన్ షిప్ టోర్నీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్లూ ఉత్కంఠ భరితంగా సాగాయి. హర్యానా, ఒడిశా జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఒడిశా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు సాధించింది. 128 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన హర్యానా జట్టు కూడా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో తలపడాల్సి వచ్చింది. ఈ దశలో హర్యానా జట్టు వికెట్ నష్టపోకుండా 9 పరుగులు సాధించగా, ఒడిశా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 6 పరుగులకే పరిమితమైంది. దీంతో హర్యానా జట్టును విజేతగా ప్రకటించారు. ● రెండో సెమీఫైనల్లో ఢిల్లీ జట్టుపై తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు సాధించింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగుల వద్ద చతికిలబడింది. 47 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సనిత్ శెట్టి అద్భుతమైన నాటౌట్ ఇన్నింగ్స్ (87 పరుగులు)తో కర్ణాటకను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో రాణించిన కర్ణాటక బౌలర్లు.. ఫైనల్ మ్యాచ్లో కర్ణాటక బౌలర్లు రాణించారు. హర్యానా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 15.5 ఓవర్ల వద్ద 74 పరుగులకే పరిమితం చేశారు. కర్ణాటక బౌలర్ సాగర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 5 వికెట్లు పడగొట్టి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు 13.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 78 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్)గా ఎం.యు.సాగర్ (కర్ణాటక) ఉత్తమ బౌలర్గా సాగర్ (కర్ణాటక), ఉత్తమ బ్యాటర్గా సతీష్ శెట్టి (కర్ణాటక), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా సతీష్ శెట్టి (కర్ణాటక) నిలిచారు. ● ముగింపు వేడుకలో డీఆర్వో మలోల ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందిస్తూ ట్రోఫీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రోహిత్ సైని, ఆంధ్రప్రదేశ్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘు, అధికారులు, కోచ్లు, ఆటగాళ్లు పాల్గొన్నారు. -
జనసంద్రమైన గూగూడు
నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాల్లో కీలకమైన పెద్ద సరిగెత్తు శుక్రవారం కనులపండువగా జరిగింది. అన్ని దారులూ గూగూడు సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో గూగూడు జనసంద్రంగా మారింది. మొదట స్వామివారికి తలనీలాలు సమర్పించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చదివించారు. అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండంలోకి కొబ్బెర, చక్కెర, మొద్దులు వేసి మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత భక్తిశ్రద్ధలతో స్వామివారికి పానకాలు సమర్పించారు. ఫక్కీర్లు, భక్తులు అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొర్లుదండాలు పెట్టారు. శనివారం పీర్ల అగ్నిగుండ ప్రవేశం, సాయంత్రం జలధి ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు డ్రోన్ పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
పీఏల పాలనలో మితిమీరిన కబ్జాలు
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల పాలనలో భూకబ్జాలు మితిమీరిపోయాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్య నేత వేణురెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేణురెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయానికి కప్పం కడితే చాలు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు ఏమి చేసుకున్నా తమకు పట్లదన్నట్లుగా పీఏలు వ్యవహరిస్తున్నారని, ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిలమత్తూరు మండలంలోని చాగలేరు పంచాయతీ మోతుకపల్లిలో 23 ఎకరాల్లో అన్ రిజిస్టర్డ్ వీలునామాతో టీడీపీ నేతలు 10 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో కబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా ఉందన్నారు. టీడీపీ నేతలకు తహసీల్దార్ వెంకటేష్, సబ్ రిజిస్ట్రార్లు సహకరించారని ఆరోపించారు. కొట్నూరు పొలంలో చెరువు పక్కన మాజీ కౌన్సిలర్ మల్లికార్జున 2 ఎకరాల భూమిని కబ్జా చేసి కంచె వేసుకున్నాడని, అదే విధంగా తిరుమలనాయుడు అనే వ్యక్తి 15 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశాడని విమర్శించారు. కబ్జాలన్నీ ఎమ్మెల్యే పీఏల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. హిందూపురంలో గుజిరీ వ్యాపారం చేసుకుంటున్న వారి నుంచి కూడా కప్పం కట్టించుకునేందుకు జనసేన, బీజేపీ, టీడీపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు సిద్ధమయ్యారన్నారు. కప్పం కట్టలేదంటే షాపులను సీజ్ చేయిస్తామని బెదిరించడం, చివరకు పోలీసులను రంగంలోకి దింపి స్టేషన్కు వాహనాలను తరలించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల కడుపు కొట్టే ఇలాంటి వారిని ఏమనాలో కూడా తెలియడం లేదని దుయ్యబట్టారు. ఇది ఎంత కాలమో సాగదని, తగిన రీతిలో బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు. గుజరీ వ్యాపారులనూ కూటమి నేతలు దోచుకుతింటున్నారు వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి ధ్వజం -
దళితులకు అన్యాయం చేస్తే సహించం
హిందూపురం: దళితులకు అన్యాయం చేస్తే సహించబోమని ఏఐసీఎఫ్ ప్రతినిధులు హెచ్చరించారు. పట్టణంలోని సీఅండ్ఐజీ చర్చ్ మిషన్ కాంపౌండ్లో శుక్రవారం ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏఐసీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు పాస్టర్లు మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను కాలరాశారన్నారు. ఎస్సీలు ఇతర మతాలను స్వేకరిస్తే వారికి జన్మతః వచ్చిన ఎస్సీ హోదా కోల్పోతారంటూ అన్యాయంగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. 1956లో దళిత సిక్కులకు, 1990లో దళిత బౌద్ధులకు మినహాయింపు ఇచ్చారని 75 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా దళితులకు మత స్వేచ్ఛ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ, బీసీ, ఎస్టీలకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే పెట్టారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ కల్పించిందని, ఇది దళితులకు వర్తించదా అని ప్రశ్నించారు. మతం మారితే కులం మారదని, దళితులు మతం మారినా ఇంకా వివక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణన్ కమిషన్ రిపోర్టు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తే మాత్రం సహించేది లేదని, దేశవ్యాప్తంగా మహా ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, పాస్టర్ డేవిడ్ రవికిరణ్, హిందూపురం పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.డేవిడ్, సెక్రటరీ జయరాజ్, యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, సెక్రటరీ పాల్ తిమోతి, చర్చ్ బోర్డ్ సభ్యులు సాల్మన్ రాజ్, దేవరాజ్, ఆంజనేయులు ఆడిటర్లు జాన్ ప్రసాద్, డేవిడ్, రెవరెండ్ దేవరాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులు ఓటు హక్కు కోల్పోకూడదు
పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, అలాంటి ఓటు హక్కును అర్హులు కోల్పోకుండా చూడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కార్యకర్తలకు సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓటరుకూ ఎన్యుమరేషన్ ఫాం అందేలా చూడటంతో పాటు దాన్ని పూర్తిగా నింపి తిరిగి బీఎల్ఓలకు అందించేలా పార్టీ బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని బ్రాహ్మణపల్లి, ఈదులబలాపురం, జూలకుంట, మండ్లి పంచాయతీల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ‘సర్’ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. అర్హుల ఓటు తొలగిపోకుండా కార్యకర్తలు జాగ్రత్త వహించాలన్నారు. సర్ సర్వేలో ఎలాంటి సందేహాలున్నా, ఎప్పటికప్పడు సంబంధిత అధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా, అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, గోవిందం శ్రీనివాసులు, మాజీ సర్పంచులు జిలాన్ ఖాన్, కిష్టప్ప, రామాంజనేయులు, నరసింహ మూర్తి, సోము, ఎంపీటీసీ రామాంజి, నాయకులు రఫీక్, ఆదినారాయణ రెడ్డి, గట్టా మంజునాథ్, రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి కార్యకర్తలకు ఉషశ్రీ చరణ్ దిశానిర్దేశం -
ఇంటిగుట్టు.. పన్నుపోటు!
సాక్షి, పుట్టపర్తి పుట్టపర్తి.. సత్యసాయి నడయాడిన ఆధ్యాత్మిక క్షేత్రం. అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రాంతం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు విదేశాలకు చెందిన బాబా భక్తులు ఎందరో ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదికి వారం, పదిరోజులు ప్రశాంతి నిలయంలో ఉండేవారు కూడా ఇక్కడ ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో పట్టణంలో జనాభా కంటే ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతి నిలయం చుట్టుపక్కల ఎలాంటి అనుమతులు లేని భవనాలు ఆకాశానికి తాకే ఎత్తులో ఉన్నాయి. అందులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తుంటారు. అయితే ఏ ఇంటికి ఎవరు యజమాని అనే విషయం తెలియదు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు వింత పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏ వీధిలో చూసినా ఎక్కువగా తాళం వేసిన ఇళ్లే దర్శనమిస్తాయి. ఒకవేళ ఎవరైనా నివాసం ఉన్నా.. ఇల్లు తమది కాదని పన్ను గురించి తెలియదని చెబుతారు. దీంతో ఆస్తి పన్ను వసూలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఒక్కో ఇంటిపై రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రెచ్చిపోతున్న అక్రమార్కులు.. సత్యసాయి బాబా నడియాడిన ప్రదేశంలో నివసించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వస్తుంటారు. అతిథులను సాదరంగా స్వాగతించేందుకు కొందరు సిండికేటుగా మారుతుంటారు. మాయ మాటలతో వారికి ఏదో ఒక ఇల్లు విక్రయిస్తారు. వాళ్లు వెళ్లిన తర్వాత ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. మరొకరికి అమ్మేస్తారు. దీంతో నిజమైన యజమాని కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. తాజాగా కొన్న వ్యక్తి తాను డబ్బులు చెల్లించానంటూ ఇంటిని అనుభవిస్తుంటారు. అధికారులు వస్తారని తెలిస్తే ఇంటికి తాళం వేసుకుని పత్తా లేకుండా పోతారు. పన్ను వసూళ్ల సమయంలో మరో ఇంటికి మకాం మార్చి అధికారులకు టోకరా వేస్తున్నారు. దీంతో పుట్టపర్తి మున్సిపాలిటీలో పన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. అధికారులు మారినా.. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా పరిస్థితి మారలేదు. డాక్యుమెంట్లతోనే సరిపెడుతూ.. పుట్టపర్తి పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం 12,670 ఇళ్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించేవి మరో 2 వేలు ఉంటాయి. వీటికి తోడు ఎలాంటి లెక్కలు లేకుండా.. యజమానులు లేని ఇంకో 2 వేల నివాసాలు ఉన్నాయి. చాలా నివాసాలకు రెండు జతలు చొప్పున డాక్యుమెంట్లు ఉంటాయి. దీంతో క్రయవిక్రయాలు పదే పదే చేస్తుంటారు. ఎవరైనా పుట్టపర్తిలో ఇల్లు కొని దూర ప్రాంతాలకు వెళ్తే.. వచ్చే లోపు కాజేస్తారు. పుట్టపర్తి పట్టణం అనధికారికంగా విస్తరిస్తున్నా.. అధికారిక గణాంకాల్లో మాత్రం పెద్దగా తేడా ఉండదు. మరోవైపు పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ కమిషనర్లుగా వచ్చేందుకు అధికారులు జంకుతున్నారు. రూ.8.63 కోట్లు ఏటా పన్ను బకాయి రూ.12 కోట్లు మున్సిపాలిటీ ఏటా ఇచ్చే డిమాండ్ నోటీస్ పుట్టపర్తి ఏరియల్ వ్యూపుట్టపర్తిలోని బాబా ఫర్నీచర్ షోరూం సమీపంలో ఓ ఇల్లు వివాదంలో పడింది. ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయంటూ ఇప్పటికే ఇద్దరు తెరపైకి వచ్చారు. అయితే ఆ ఇద్దరూ నకిలీ యజమానులేనని సమాచారం. ఇప్పుడు యజమానులుగా పోటీ పడుతున్న ఇరువురూ ఆ ఇంట్లో బాడుగకు ఉన్న సమయంలో అసలు యజమాని చనిపోతే.. ఎవరికి వారుగా డాక్యుమెంట్లు తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇల్లు ప్రస్తుతం ఒకరు స్వాధీనం చేసుకోగా, మరోవ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి నివాసాలు పుట్టపర్తిలో వేల సంఖ్యలో ఉన్నాయి. దీంతో సదరు ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు కూడా ఇబ్బందిగా మారుతోంది. పుట్టపర్తిలో 2 వేల ఇళ్లకు తాళం ఆ ఇళ్లకు యజమానులెవరో తెలీదు పుట్టగొడుగుల్లా నకిలీ డాక్యుమెంట్లు ఏడాదికి ఒకరు చొప్పున ఇంటి యజమాని అవతారం డాక్యుమెంట్లు పట్టుకుని కోర్టు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణ ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులిచ్చినా కట్టేవారు కరువు 12,670 పట్టణంలోని ఇళ్ల సంఖ్య 38,472 పుట్టపర్తి పట్టణ జనాభా -
కాచిగూడ–అశోకపురం మధ్య కొత్త రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–అశోకపురం మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. కాచిగూడ జంక్షన్ నుంచి ఆగస్టు 25న, అశోకపురం నుంచి 26 నుంచి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాచిగూడ నుంచి రోజూ ఈ రైలు (12785) సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10 గంటలకు అశోకపురం జంక్షన్కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (12786) అశోకపురం జంక్షన్లో మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ జంక్షన్కు చేరుతుందన్నారు. ఈ రైలు జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం. ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురం, యలహంక, బెంగళూరు ఈస్ట్, కేఎస్ఆర్ బెంగళూరు, కనిగేరి, రామనగరం, మండ్య, మైసూర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించారు. సరళకు జాతీయ పురస్కారం ధర్మవరం అర్బన్: పట్టణానికి చెందిన జానపద గాయని సోమిశెట్టి సరళ జాతీయ పురస్కారం అందుకున్నారు. సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ (డీడీఆర్) ప్రాజెక్టు ముగింపు వేడుకలు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధించిన స్వాతంత్య్ర పోరాటం, స్థానిక చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై అత్యధిక పరిశోధనాత్మక కథనాలను సమర్పించిన సోమిశెట్టి సరళను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీసీఆర్టీ చైర్మన్ వినోద్కుమార్ మెమొంటో, జాతీయ పురస్కారం అందించి సన్మానించారు. -
పుట్టెడు దుఃఖం..పెను భారం
సాక్షి, పుట్టపర్తి/ హిందూపురం టౌన్: హిందూపురంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోనే అతి పెద్దది. జిల్లా నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. రోజుకు సగటున 800 మంది ఓపీ విభాగంలో చికిత్స పొందుతుంటారు.100 పడకలు ఇన్పేషెంట్ల కోసం అందుబాటులో ఉంచారు. డయాలసిస్, ఎమర్జెన్సీ, టీబీ సెక్షన్, ఆర్థో, ఆప్తమాలజీ, గైనకాలజీ విభాగాలన్నీ రోగులతో రద్దీగా ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రమాదాలు, ఆత్మహత్య కేసులన్నీ హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికే వస్తాయి. ప్రమాదాలు, ఆత్మహత్యల కేసుల్లో ఆస్పత్రికి వచ్చిన వారిలో నెలకు సగటున 20 మంది మరణిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం మంది పేదలే. అయితే ఆస్పత్రిలో చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ‘మహా ప్రస్థానం’ వాహనం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాల డ్రైవర్లు దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుంటారు. పేరుకే పెద్దాసుపత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. అంతకుముందు మహాప్రస్థానం వాహనం ఉండేది. కొన్నాళ్లకు మరమ్మతులకు గురి కావడంతో మూలన పడేశారు. పట్టించుకునే దిక్కు లేకపోవడంతో ‘మహాప్రస్థానం’ వాహనం కరువైంది. జిల్లా ఆస్పత్రిలో ‘మహాప్రస్థానం’ వాహనం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పవచ్చు. ఆస్పత్రి కమిటీ సభ్యులు పట్టించుకోకపోవడం మరో కారణం. గతంలో మహాప్రస్థానం వాహనం మంజూరైనప్పటికీ నిర్వహణకు సాధ్యం కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపినప్పటికీ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారించలేదు. దాతలు ఇచ్చిన మహాప్రస్థానం వాహనం మూలన పడేశారు. ఎమ్మెల్యే ప్రగల్బాలు మాటలకే పరిమితం.. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలో కనీసం మహాప్రస్థానం వాహనాన్ని ఏర్పాటు చేయించలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో మృతి చెందిన వారిని తరలించాలంటే వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలను ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికైనా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. హిందూపురం ఆస్పత్రిలో నెలలో 20కు పైగా మరణాలు మృతదేహాలు తరలించడానికి ప్రైవేటు వాహనాలే దిక్కు దాతలు ఇచ్చిన ‘మహా ప్రస్థానం’ మూలన పడ్డ వైనం ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టి సారించాలని కోరుతున్న ప్రజానీకం రొద్దం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతన్ని అంబులెన్స్ ద్వారా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అరగంట పాటు పలు పరీక్షలు చేసి ఆ తర్వాత మరణించినట్లు వెల్లడించారు. అయితే కటిక పేదరికంలో ఉండే ఆ కుటుంబం మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడింది. తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాల్సి వచ్చింది. పరిగి మండలానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని హిందూపురం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మరుసటి రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బాధిత కుటుంబం తెలిసిన వారితో అప్పు తీసుకుని ప్రైవేటు వాహనంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది. -
17 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు
అనంతపురం క్రైం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్ల నమోదు ఫారాల డిజిటైజేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓల)కు మున్సిపల్ కమిషనర్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో బి. మల్లన్న, ఎం. నాగాంజలి, కె. ఫణి కృష్ణ, ఎస్. రేష్మా, ఎ. హేమసుందరి, జి. విద్య, అరికట్ల ఉదయశ్రీ , బుల్లి అనిల్ కుమార్, బి. గణేష్ రెడ్డి, యల్లమ్మ రాగే, జి.టి. శ్రావణి, సోంపల్లి చార్విత్, ఎన్. నవీన్ కుమార్, జి. హరిత, సి.కె. నరేష్, ఎం. చైతన్య, గురు కుమారి ఉన్నారు. పీఆర్ ఇంజినీర్లకు పదోన్నతులు అనంతపురం న్యూటౌన్: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న 18 మందికి పదోన్నతి లభించింది. ఏఈలుగా పని చేస్తున్న కే.లక్ష్మి నారాయణ, బి.గోపాల్ నాయక్, బీబీఎన్ ప్రసాద్, పి.పాండురంగా రెడ్డి, ఏ.లక్ష్మినారాయణ, వి.రామాంజనేయులు, ఎం.వెంకటేసులు, ఎం.ఓబుళ్దాస్, సి.ఓబుళ్దాస్, కే.వరప్రసాద్, సి.విశ్వనాథరెడ్డి, అరుణ్కుమార్, సీఆర్ మధులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. డీఈలుగా ఉన్న వై.శ్రీరాములు, నవీన్, చంద్రశేఖర్, రవికుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు పొందారు. జిల్లాలో ఈఈగా పనిచేస్తున్న జి. ప్రభాకర్ రెడ్డిని కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ సూపరిండెంటెంట్ (ఎస్ఈ)గా పదోన్నతిపై బదిలీ చేశారు. ఈ మేరకు వారంతా అనంతపురం పంచాయతీరాజ్ ఎస్ఈ బాలూ నాయక్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు అందుకున్నారు. వివాహిత ఆత్మహత్య ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన బాణాపురం కీర్తి (20) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని కరికూటిపల్లికి చెందిన అమ్రేష్, శాంతమ్మ దంపతుల కుమార్తె కీర్తికి ఆమిద్యాల గ్రామానికి చెందిన అనిల్తో 8 నెలల క్రితం వివాహమైంది. ఇటీవల గర్భం దాల్చిన కీర్తికి పిండాభివృద్ధి సరిగా జరగకపోవడంతో అబార్షన్ అయింది. అప్పటి నుంచి కడుపు నొప్పితో కీర్తి బాధపడుతుండేది. గురువారం రాత్రి నొప్పి తీవ్రం కావడంతో ఉరి వేసుకుంది. పొలం నుంచి వచ్చిన భర్త అనిల్ బంధువుల సాయంతో కీర్తిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన్నుకున్న ‘తమ్ముళ్లు’ శింగనమల: ఇసుకను అక్రమంగా తరలించే క్రమంలో ‘తెలుగు’ తమ్ముళ్లు తన్నుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలోని ఉల్లికల్లు సమీపంలోని పెన్నానది నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఒక్కొక్కరు రూ.లక్ష వరకు జేబుల్లోకి వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెరవలికి చెందిన ఓ టీడీపీ మండల నాయకుడు కూడా శుక్రవారం ఉల్లికల్లు పెన్నానది వద్దకు అనుచరులతో కలిసి వెళ్లాడు. ఇకపై తాను కూడా ఇసుక తరలిస్తానని చెప్పాడు. అయితే, ఈ విషయంపై ముగ్గురి నడుమ గొడవ జరిగింది. స్థానికులు కలగజేసుకోవడంతో అంతా సద్దుమణిగింది. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతోనే ఇంత దాకా వచ్చిందని, ఇప్పటికై నా ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
తాడిపత్రి ప్రాంతంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో పాటు జేసీ ప్రభాకర్రెడ్డి మార్గనిర్దేశనంలో ‘పచ్చ’ మూకలు తెగబడుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే విపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలతో భయభ్ర
అనంతపురం: టీడీపీ మూకల పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన శాంతియుత దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అరాచకాలు పేట్రేగిపోయాయని, తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసు భారీగా మోహరించి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, నాయకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నేతలను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించగా.. అనంత, విశ్వేశ్వరెడ్డి కోర్టు రోడ్డు వద్ద రెండు గంటలపాటు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తాడిపత్రిలో పరాకాష్టకు నిరంకుశ పాలన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో నిరంకుశ పాలన పరాకాష్టకు చేరిందని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టే సంస్కృతి తీసుకొచ్చారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తామంటే అనుమతులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు అధికార టీడీపీ కార్యకర్తలుగా పని చేసే దుస్థితికి వచ్చారని మండిపడ్డారు. 43 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత దిగజారిన పోలీసులను చూడలేదన్నారు. తాడిపత్రిలో మట్కా, గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. వాటిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని విమర్శించారు. దీన్ని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తే టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి గ్రామాల్లోకి దండయాత్రగా వెళ్లినా మిన్నకుండిపోయే పోలీసులు తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం ప్రశ్నిస్తే తమ ఇళ్ల వద్దకు వస్తామని బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి మాటలు ఎస్పీకి వినపడడం లేదా అని ప్రశ్నించారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని, జిల్లా అంతా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అప్రజాస్వామిక విధానాలపై పోరాడతాం పోలీసులు కట్టడి చేయాల్సింది తమనా.. లేక తాడిపత్రిలో దాడులు చేస్తున్న వారినా అని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ‘పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ముళ్ల కంచె వేశారు. బయటకు రాకూడదని అంటున్నారు. తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం ఉందా.. ప్రత్యేక ప్రతిపత్తి ఏమైనా కల్పించారా’ అంటూ నిలదీశారు. ఇతర పార్టీలను లేకుండా చేస్తామంటే కుదరదని, జేసీ ప్రభాకర్రెడ్డి ఇప్పటికై నా విజ్ఞతతో నడుచుకోవాలని సూచించారు. అప్రజాస్వామిక విధానాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేతల అడ్డగింత ‘చలో తాడిపత్రి’కి వెళ్లేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య, శ్రేణులను కళ్యాణదుర్గంలో పోలీసులు అడ్డుకున్నారు. వేకువజామునే హౌస్ అరెస్టు చేశారు. ఇక గుంతకల్లు నుంచి కార్యకర్తలతో కలిసి బయలుదేరిన నైరుతిరెడ్డిని కూడా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు గృహనిర్బంధాలు, అరెస్టులతో ఉద్రిక్తత తాడిపత్రిలో నిరంకుశ పాలనపై భగ్గుమన్న అనంత -
కొట్టినా.. తిట్టినా.. గప్చుప్
అనంతపురం సెంట్రల్: చంద్రబాబు పాలనలో ఖాకీపై ఖద్దరు స్వారీ చేస్తోంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి అన్నీ రాజకీయ పోస్టింగ్లు కావడంతో విలువలు దిగజారిపోతున్నాయి. మారుమూల పోలీసుస్టేషన్కు అయినా ఒక కానిస్టేబుల్ను పంపాలంటే సదరు ఎమ్మెల్యే అనుమతి ఉండాలి. ఇక ఎస్ఐలు, సీఐలైతే చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యే అనుమతి ఇస్తేనే పోస్టింగ్లు వేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులకు పోలీసు లంటే లెక్కలేకుండా పోతోంది. తమ దయాదాక్షిణ్యాలపై పనిచేసే వారుగా భావిస్తున్న ‘పచ్చ’ నేతలు ఖాకీలపై రెచ్చిపోతున్నారు. తాడిపత్రిలో మరీ దయనీయం.. తాడిపత్రి సబ్ డివిజన్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీగా ఉన్నా లా అండ్ ఆర్డర్ మాత్రం పోలీసుల ఆధీనంలో లేదు. జేసీ ప్రభాకర్రెడ్డి కనుసన్నల్లో నడుస్తోంది. రెండేళ్లుగా వైఎస్సార్సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా అదే రోజు టీడీపీ కార్యక్రమానికి పిలుపునిస్తుండడం.. శాంతిభద్రతల సాకుతో పోలీసులు వైఎస్సార్సీపీని మాత్రమే నిలువరిస్తుండడం రివాజుగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ తలపెట్టిన ర్యాలీని కూడా తాడిపత్రిలో జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నెల 24న పట్టణంలో ఏఎస్పీతో పాటు పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులపై ‘పచ్చ’ మూకలు దాడులు చేశాయి. దీన్నిబట్టి చూస్తే ఇక్కడి పోలీసులు తమను ఏమీ చేయలేరనే లెక్కలేనితనం టీడీపీ నేతల్లో కన్పిస్తోంది. తాడిపత్రిలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఏఎస్పీ రోహిత్తో పాటు ఎస్పీ జగదీష్ ఘోరంగా విఫలమయ్యారని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. మరీ ఇంత మెతక వైఖరా..? ఏ జిల్లాలోనైనా శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నా, పోలీసు శాఖ ప్రతిష్ట పెరగాలన్నా ఎస్పీల తీరుపై ఆధారపడి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడకుండా పనిచేసినప్పుడు పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. గతంలో స్టీఫెన్ రవీంద్ర లాంటి ఎస్పీ పనితీరును ఇప్పటికీ జిల్లావాసులు గుర్తు చేసుకుంటారంటే వారు ఎంత నిక్కచ్చిగా పనిచేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. పోలీసుల చెంపలు చెళ్లు మనిపిస్తున్నా.. కాలర్ పట్టుకొని నడిరోడ్లపై లాగుతున్నా చూసీచూడనట్లు పోతున్నారు. కనీసం ఎస్పీ సీరియస్ అన్న ప్రకటనలు కూడా విడుదల చేయకపోవడం చూసి మరీ ఇంత మెతక వైఖరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నా.. పోలీసు అధికారుల సంఘం కనీసం ఖండిస్తున్న పాపాన పోవడం లేదు. అధికారులతో సన్నిహితంగా మెలుగుతూ సంఘం ముసుగులో పది, పదిహేనేళ్లకు పైగా జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)ను అట్టిపెట్టుకొని ఉండటానికే పోలీసు అధికారుల సంఘ నాయకులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● ఈ నెల 23న ముదిగుబ్బ మండలంలోని గాండ్లవారిపల్లి పంచాయతీ పరిధిలోని బ్రహ్మదేవర మర్రిలో ఊరంతా చూస్తుండగానే మంత్రి సత్యకుమార్ అనుచరుడు చంద్రమోహన్ హెడ్ కానిస్టేబుల్ గణేష్ చెంప చెల్లుమనిపించాడు. చంద్రమోహన్పై ఫిర్యాదు రావడంతో విచారణ నిమిత్తం గ్రామానికి వెళ్లడమే హెడ్కానిస్టేబుల్ గణేష్ చేసిన తప్పయింది. ఈ క్రమంలో బాధిత హెడ్కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ● రాయదుర్గంలో ఈనెల 21న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనుచరుడు మారుతి రెచ్చిపోయాడు. కానిస్టేబుల్ రాజ్కుమార్ చొక్కా పట్టుకొని లం.. కొడకల్లారా అంటూ నానా బూతులు తిట్టాడు. కానిస్టేబుల్ చొక్కా చిరిగిపోయినా వదిలిపెట్టలేదు. దారికి అడ్డంగా పెట్టిన కారును పక్కకు పెట్టాలని సూచించడమే సదరు కానిస్టేబుల్ చేసిన నేరమైంది. పట్టపగలు అందరి కళ్లముందే ఒక పోలీసును అవమానపరచినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న పాపానపోలేదు. మారుతి వెనుక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఉండడమే ఇందుకు కారణమని తెలిసింది. ● తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల దయనీయ పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోలీసులంటే జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులకు ఇసుమంత కూడా లెక్కలేదు. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డిపై దాడి జరిగిన సమయంలో పోలీసులున్నా నిలువరించలేకపోవడాన్ని చూసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు చీదరించుకున్నారు. కానిస్టేబుళ్లను తోసుకుంటూ వెళ్లి మరీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’ మూక దాడులకు పాల్పడడం గమనార్హం. నాలుగో సింహం నవ్వులపాలు చంద్రబాబు ప్రభుత్వంలో ఖాకీలకే రక్షణ కరువు చొక్కాలు పట్టుకుంటున్నా, చెంపలు చెళ్లుమనిపిస్తున్నా చర్యల్లేవ్ రెచ్చిపోతోంది అధికారపార్టీ నాయకులు కావడంతోనే మౌనం చోద్యం చూస్తున్న పోలీసు బాస్ల తీరుపై సర్వత్రా విమర్శలు -
ప్రజలకు కలెక్టర్ మొహర్రం శుభాకాంక్షలు
ప్రశాంతి నిలయం: త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ త్యాగాలను స్మరించికుంటూ మొహర్రం జరుపుకుంటామని, సమాజంలో కరుణ, త్యాగ నిరతిని మొహర్రం చాటి చెబుతుందన్నారు. జిల్లాలో ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పోలీసుపై దాడి చేసిన వ్యక్తికి బెయిలు ముదిగుబ్బ: ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడంతో పాటు పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన బ్రహ్మదేవరమర్రి గ్రామానికి చెందిన నంద్యాల చంద్రమోహన్ను అరెస్ట్ చేసినట్లు సీఐ శివరాముడు తెలిపారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా... జడ్జి బెయిల్ మంజూరు చేశారన్నారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. చంద్రమోహన్ తన గ్రామంలోని పంచాయతీ తాగునీటి బోరును రాళ్లతో ధ్వంసం చేయడంతో పాటు విద్యుత్ సరఫరా చేసే వైర్లను పీకివేశాడు. ఈ విషయమై గ్రామస్తులు ప్రశ్నించగా.. వారిని దుర్భాషలాడి మరోసారి అడ్డుకుంటే చంపేస్తానన్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణ నిమిత్తం వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గణేష్కుమార్పై దాడి చేసి గాయపరిచాడు. ఆ రోజే చంద్రమోహన్పై కేసు నమోదు చేసిన పోలీసులు... గురువారం అతను దొరిగిల్లు గ్రామం వద్ద ఉన్న మూడు రోడ్ల కూడలిలో ఉన్నట్లు సమాచారం అందడంతో పెద్దమనుషుల సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో జడ్జి బెయిల్ ఇచ్చారని సీఐ తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా ఓ కేసు నమోదు అయినట్లు సీఐ వెల్లడించారు. అన్నీ సందేహాలే ‘సర్’ కదిరి: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)లో భాగంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలోని 1,576 మంది బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇస్తున్నారు. అయితే వాటిని పూర్తి చేసి గడువులోపు తిరిగి బీఎల్ఓల చేతికి అందజేయాలి. ఈ క్రమంలో చాలా మందికి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. వాటి గురించి అడిగితే బీఎల్ఓలు కూడా సమాధానం చెప్పకపోవడంతో ఎవరిని అడగాలో తెలియక ఓటర్లు తికమకపడుతున్నారు. ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలు కొన్ని ● ఎన్యుమరేషన్ పత్రం నింపాలంటే 2002 ఓటర్ల జాబితా చూసి, అందులోని నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నంబర్తో పాటు ఓటరు వరుస సంఖ్య వేయాల్సి ఉంటుంది. ఆ జాబితాను బీఎల్ఓలతో పాటు అంగన్వాడీ కార్యకర్తకు ఇచ్చారు. కానీ ఓటర్లు మాత్రం వీటికోసం ఇబ్బంది పడుతున్నారు. ● 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వివాహిత మహిళలు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన వివరాలు ఎన్యూమరేషన్ పత్రంలో నింపాల్సి ఉంటుంది. అయితే 2002 నాటికే తమ తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఎవరి వివరాలు ఇవ్వాలన్న ప్రశ్నకు బీఎల్ఓలు కూడా సమాధానం చెప్పడం లేదు. ● ఓటరు నమోదు, సవరణకు 6, 7, 8 ఫాంలను బీఎల్ఓలను అడిగితే తమ వద్ద లేదనే చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ● ఎన్యూమరేషన్ పత్రం నింపేటప్పుడు తప్పులు దొర్లినా, కొట్టివేతలు ఉన్నా.. ఇంకో పత్రం ఇవ్వడం లేదని జనం వాపోతున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని ఓటర్లకు వచ్చే సందేహాల నివృత్తికి కృషి చేయాలంటున్నారు. -
పెనుకొండలో స్మార్ట్ దోపిడీ
పెనుకొండ: మధ్య తరగతి వర్గాలు, చిరు వ్యాపారుల సొంతింటి కల నెరవేర్చేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టణంలోని షీఫారానికి చెందిన 27 ఎకరాల స్థలాన్ని సేకరించింది. జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో ఓ కాలనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లాటరీ ద్వారా 450 మందికి ప్లాట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీలో అధునాతన సౌకర్యాలు కల్పించాలనుకున్నా ఎన్నికలు రావడం..ప్రభుత్వం మారడంతో ఆ పనులకు బ్రేక్ పడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కొలువుదీరిన సవిత అందివచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే అనుచరుల ద్వారా సహజ వనరులన్నీ దోచేసినట్లు మంత్రిపై ఆరోపణలున్నాయి. తాజాగా ఆమె కన్ను స్మార్ట్ సిటీపై పడింది. అభివృద్ధి పనుల పేరుతో రూ.కోట్లు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జగనన్న స్మార్ట్ సిటీ పేరును ‘ఎన్టీఆర్ టౌన్ షిప్’గా మార్చారు. ఆ టౌన్షిప్లో అభివృద్ధి పనుల కోసమంటూ ప్రభుత్వంతో రూ. 16.66 కోట్లు మంజూరు చేయించారు. ఈ ఏడాది మార్చి 23న పనులకు శంకుస్థాపన కూడా చేశారు. దీంతో టౌన్షిప్లో ప్లాట్లు పొందిన వారంతా 27 ఎకరాల్లోని కొండలు, గుట్టలు, వంకలు. ఫారంఫాండ్లను చదును చేసి పూర్తి సౌకర్యాలు కల్పించి తమకు ప్లాట్లు ఇస్తారని భావించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ‘ఎన్టీఆర్ టౌన్ షిప్’లో అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ను తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టించిన మంత్రి సవిత తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. ప్లాట్లు చదును చేయకుండా కేవలం రోడ్లు, డ్రైనేజీలు వేయడానికి పనులు చేపట్టారు. అహుడా అధికారులు కూడా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. ప్రభుత్వం అక్కడ ఎలాంటి పనులు చేయాలని నిర్దేశించింది...ఏం పనులు చేస్తున్నారన్న విషయాలను పట్టించుకునే అధికారే లేకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ మంత్రి సూచన మేరకు పనులు మమ అనిపించేందుకు సిద్ధమైంది. దీంతో టౌన్ షిప్లో ప్లాట్లు పొందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసినా రూ.6 కోట్లు కూడా ఖర్చు కావని, ఈ లెక్కన కనీసం రూ.10 కోట్లు కొట్టేసేందుకు మంత్రి పన్నాగం పన్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో అక్రమాల పర్వం రూ.కోట్ల అవినీతికి పన్నాగం మంత్రి సవిత కనుసన్నల్లోనే వ్యవహారంఇప్రశ్నిస్తే కేసులే ది పెనుకొండ స్మార్ట్ సిటీ (ఎన్టీఆర్ టౌన్ షిప్)లో వేస్తున్న రహదారి. వందలాది మందికి ప్లాట్లు కేటాయించిన ఈ స్థలంలో అభివృద్ధి పనుల పేరుతో అధికార పార్టీ నేతలు రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడైనా లేవుట్ అభివృద్ధి చేయాలంటే ముందుగా భూమిని చదును చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం కొండలు, గుట్టలున్న ప్లాట్లను చదును చేయడం పక్కనపెట్టి తూతూ మంత్రంగా రోడ్లు వేస్తున్నారు. అరకొర పనులతో రూ.కోట్లు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ‘ఎన్టీఆర్ టౌన్ షిప్’లో జరుగుతున్న పనుల గురించి మాట్లాడేందుకు సామాన్యులు జంకుతున్నారు. ఎవరు ప్రశ్నించినా ఆ మరుసటిరోజే పోలీసులతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతారని భయపడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఆగ్రహానికి గురైన చాలా మంది జైలు పాలయ్యారని చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో దోపిడీ మంత్రి డైరెక్షన్లోనే పనులు -
పల్స్పోలియోకు సర్వం సిద్ధం
● జిల్లాలోని 1,71,315 మందికి చుక్కల మందు ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజాబేగం పుట్టపర్తి అర్బన్: పల్స్ పోలియోకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజాబేగం తెలిపారు. ఈనెల 28న (ఆదివారం) పల్స్పోలియో నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గణేష్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో 0– 5 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పిల్లలు 1,71,315 మంది ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 1,011 బూత్లు ఏర్పాటు చేయడంతోపాటు 4,926 మందిని నియమించామన్నారు. ఈనెల 28న కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తారని, ఆరోజు పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం 29, 30 తేదీల్లో వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది గృహ సందర్శన చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ చెన్నారెడ్డి, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, వైద్యాధికారి డాక్టర్ గాయత్రి, డాక్టర్ సునీల్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామలక్ష్మి, సీహెచ్ఓలు వన్నప్ప, శివరాం, సూపర్వైజర్లు చంద్రకళ, రమణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పీఎండీఎస్’తో మెరుగైన దిగుబడి
ఓడీచెరువు/బత్తలపల్లి: వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితుల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో సాగు చేయడం వల్ల మెరుగైన దిగుబడులు సాధ్యమవుతాయని రైతు సాధికార సంస్థ గౌరవ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ (విశ్రాంత ఐఏఎస్ ) పేర్కొన్నారు. గురువారం ఆయన రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నికల్ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మానాయక్తో కలిసి బత్తలపల్లి, నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మండలాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో చర్చించారు. బత్తలపల్లి మండలం గంటాపురంలో బోయపాటి పార్వతి తన పొలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలను పరిశీలించారు. అనంతరం ఓడీచెరువు మండలం ఇనగలూరు గ్రామంలో రైతులు వాసుదేవరెడ్డి, ఆనందరెడ్డి పీఎండీఎస్ పద్ధతిలో సాగుచేస్తున్న మామిడి మల్బరీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్నినో ప్రభావం వ్యవసాయం, పశుపోషణపై ఉంటుందన్నారు. వాటిని ఎదుర్కొని సాగును లాభదాయకంగా చేసేందుకు రైతులంతా తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్లు డాక్టర్ నరేంద్ర, డాక్టర్ నవీన్, దామోదర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నారాయణ నాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, ఏఈఓ శ్రీనివాసులు, వీహెచ్ఏ ఓబులమ్మ, మాస్టర్ ట్రైనర్ హరికుమార్, సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కును కాపాడుకుందాం
రొద్దం: ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతుల్లోని వజ్రాయుధమని, అందుకే కొందరు కుట్రలతో ఓటు తొలగించి ప్రజలను నిరాయుధులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆరోపించారు. ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. గురువారం ఆమె మండలంలోని కలిపి, నల్లూరు, పెద్దమంతూరు, చెరుకూరు, చోళేమర్రి గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ‘సర్’పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికార పార్టీ నేతలు కుట్రలు చేసి వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేయవచ్చన్నారు. పార్టీ నియమించిన బీఎల్ఏలు తప్పనిసరిగా బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ తిరగాలన్నారు. ఒక్క ఓటు కోల్పోయినా తిరిగి పొందడానికి సమస్యలుంటాయని వివరించారు. అందువల్ల అర్హుల ఓట్లు ఒక్కటి కూడా తొలగకుండా చూడాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎంపీపీ తిమ్మయ్య, నాయకులు ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నారేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి, కోగిర రవి, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా కాశీంస్వామి చిన్న సరిగెత్తు
బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాలకు పేరుగాంచిన బత్తలపల్లిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చిన్నకాశీంస్వామి, పెద్దకాశీంస్వామి మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం చిన్న సరిగెత్తు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు పీర్ల స్వాములకు పానకాలు చదివించారు. రాత్రి హిందువులు పక్కీరుబాబా దీక్ష చేపట్టారు. అనంతరం ముళ్లపొదలు, మొద్దులు తీసుకువచ్చి అగ్నిగుండాన్ని రగిలించి అలావ్ తొక్కారు. గురువారం ఉదయం గ్రామోత్సవం అనంతరం పీర్లు గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాల్లోని పీర్ల చావిడి వద్ద పూజలందుకుంటాయని ముజావర్లు టైలర్ రియాజ్, నజరుల్లా, మాబాషా, ఖాశీంవలి తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో బత్తలపల్లి పీర్లకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. మొహర్రం వేడుకల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకోవాలని ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ సూచించారు. -
అట్టహాసంగా విద్యావిహార్ గోల్డెన్జూబ్లీ వేడుకలు
ప్రశాంతి నిలయం: హైదరాబాద్లోని శ్రీసత్యసాయి విద్యా విహార్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో అట్టహాసంగా నిర్వహించారు. సత్యసాయిబాబా 1976 జూన్ 24న శ్రీసత్యసాయి విద్యా విహార్ పేరుతో హైదరాబాద్లో విద్యాసంస్థను ప్రారంభించారు. ఈ విద్యాసంస్థ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీసత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు ‘దేవుడు మలిచిన శిల్పాలు’ పేరుతో నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సత్యసాయి బోధనలను, సేవా స్ఫూర్తిని విద్యా వ్యవస్థ గొప్పతనాన్ని విద్యార్థులు నృత్య రూపకం ద్వారా చక్కగా వివరించారు. కడు పేదరికాన్ని అనుభవిస్తూ విద్యా విహార్ ద్వారా చక్కటి విద్యను పొంది ఆదర్శప్రాయులుగా మారిన విధానాన్ని కళ్లకు కట్టారు. చక్కటి నృత్య భంగిమలతో నిర్వహించిన నాటిక అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యా విహార్ ఉపాధ్యాయులను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి ఘనంగా సన్మానించారు. 50 ఏళ్లలో విద్యావిహార్ సాధించిన ప్రగతిని వివరించే పుస్తకాన్ని విడుదల చేశారు. పలువురు ఉపాధ్యాయులు తమ అనుభవాలను వివరిస్తూ ప్రసంగించారు. సత్యసాయి విద్యా విహార్కు చెందిన 750 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
సాగుభూముల్లో సోలార్ ప్లాంటా..?
ఎన్పీకుంట: వ్యవసాయ యోగ్యమైన సాగు భూముల్లో సోలార్ పవర్ప్లాంట్ నిర్మాణం చేపడితే రైతులు ఎలా బతకాలని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ ప్రశ్నించారు. మండల పరిధిలోని మరికొమ్మదిన్నె, గౌకనపల్లి, వెలిచలమల, వంకమద్ది, ధనియానిచెరువు పంచాయతీల్లో సుమారు 15 వేల ఎకరాలలో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, వివిధ కంపెనీలు రైతుల ప్రమేయం లేకుండానే వారి భూముల్లో డ్రోన్తో సర్వే చేపడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ రైతుల పక్షాన వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కొత్తరంగారెడ్డి, సీనియర్ నాయకులు బాలకృష్ణనాయుడు, జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్చాంద్ బాషా, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నళ్లజోడు పవన్ హాజరై రైతులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కూడలిలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కదిరి– రాయచోటి ప్రధాన రహదారిపై ౖబైఠాయించి నిరసన తెలిపారు. సమ్మతం లేకుండా భూములు ఎలా తీసుకుంటారు? వ్యవసాయ యోగ్యమైన భూముల్లో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడమే తప్పని, అలాంటిది రైతుల సమ్మతం కూడా లేకుండా వారి భూముల్లో డ్రోన్ ద్వారా సర్వేలు ఎలా చేపడతారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు...కమీషన్ల కక్కుర్తితో రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారన్నారు. వెంటనే బలవంతపు భూసేకరణ ఆపేయాలని, సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరఫున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి పూలశ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ... అధికార పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం రైతులను బలిచేసేందుకు సిద్ధమయ్యారన్నారు. దౌర్జన్యంగా రైతుల నుంచి ఒకరం భూమి తీసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. పంటలు పండని ఎడారి ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. జగన్ దృష్టికి తీసుకెళ్తాం మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా మాట్లాడుతూ... భూసేకరణ సమయంలో భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇచ్చి గ్రామసభల ద్వారా అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉన్నా...ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో భూములు కోల్పోయిన రైతులకే ఇంకా సరిగా పరిహారం అందలేదని, ఇప్పుడు మళ్లీ రైతులను మోసం చేస్తూ భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ లక్ష్మమ్మకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కేశవరెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.పుల్లారెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవిందునాయక్, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తిరుమలనాయుడు, అంజన్రెడ్డి, రామచంద్ర, ఆటోకిష్టా, ఆదెప్పనాయుడు, గంగాద్రి, రఘునాథ, బుల్లెట్బాబా, చెన్నక్రిష్ణారెడ్డి, దుద్దుకుంట వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆంజన్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రంగారెడ్డి, యాదళ్ల రాజేష్, సూర్యనారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, స్వామిరెడ్డి, సీపీఐ నాయులు హసన్ పాల్గొన్నారు. కమీషన్ల కక్కుర్తితో రైతుల పొట్ట కొట్టొద్దు హితవు పలికిన వైఎస్సార్ సీపీ నేతలు -
పారిశ్రామిక ప్రగతితోనే జిల్లా అభివృద్ధి
ప్రశాంతి నిలయం: పారిశ్రామిక ప్రగతిపైనే జిల్లా అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, అందువల్ల నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు వీలైనంత త్వరగా ఇవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల మేరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిర్దేశించిన కాలపరిమితి లోపే అన్ని అనుమతులూ మంజూరు చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ వీలైనంత త్వరగా పరిశ్రమలను ఉత్పత్తి దశకు తీసుకురావాలన్నారు. కొత్తగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) స్థాపించే వారికి కావలసిన వసతులను అధికారులు దగ్గరుండి కల్పించాలన్నారు. పీఎం విశ్వకర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వారితో కలిసి ఎంఎస్ఎంఈలలో డిజిటల్ సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం జూలై 6న నిర్వహించనున్న రీజనల్ వర్క్షాప్ గురించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలి భూరికార్డులను పక్కాగా నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, రెవెన్యూ దరఖాస్తులను గడువులోపు పరిష్కారించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రీ సర్వే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. అర్హులైన రైతులకు 100 శాతం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, ఫిర్యాదులను ఆర్డీఓలు, తహసీల్దార్లు పర్యవేక్షిస్తూ పరిష్కరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువులు, కుంటలు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ విజయకుమారి, సర్వే అధికారి విజయశాంతి పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయం ప్రారంభం పుట్టపర్తి: కొత్తచెరువులోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, డీఈఓ కిష్టప్ప తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల అనుమతులను వేగవంతం చేయండి అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
ఆపకుండా వెళ్లిపోతున్నారు
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెబుతున్నారు. కానీ ఆ బస్సులు బస్టాండుల్లో తప్ప ఎక్కడా ఆపడం లేదు. ఆటోల్లో బస్టాండు వరకూ వెళ్లినా సీటు కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఇక పల్లెల్లోకి ఒక బస్సు కూడా రావడం లేదు. సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తే ప్రైవేట్ ఆటోల్లో అధిక చార్జీలు చెల్లించాలి. నగరంలోని ఆస్పత్రులకు రావాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారు. వృద్ధులు, గర్భిణుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. –రజనీ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు, బత్తలపల్లి -
‘డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్లలో అన్యాయం’
ధర్మవరం: వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కలిసి వినతిపత్రం అందించారు. సచివాలయ వ్యవస్థలో ఒకే నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఉద్యోగులుగా చేరిన ఇతర కేడర్లతో పోలిస్తే తమ కేడర్కు ప్రమోషన్ల ఛానల్లో తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కంప్యూటర్ డిగ్రీ విద్యార్హత కలిగిన తమ సాంకేతిక హోదాను పూర్తిగా తొలగించి నాన్ టెక్నికల్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టును ప్రతిపాదించడంతో నష్టం జరుగుతోందన్నారు. ఇతర టెక్నికల్ కేడర్లకు వారి సొంత విభాగాల్లోనే ప్రమోషన్లు కల్పించినట్లుగానే తమకు కూడా విద్యాశాఖ లేదా ఇతర ప్రభుత్వ విభాగాలలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా పదోన్నతి కల్పించేలా జీఓ సవరించాలని మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారనిఉద్యోగులు తెలిపారు. ఎల్ఐసీ పాలసీ సొమ్మును మింగిన ఏజెంట్ ధర్మవరం అర్బన్: ఎల్ఐసీలో పాలసీ చేసిన సొమ్మును ఓ ఏజెంట్ తన కుమారుడి ఖాతాలోకి మళ్లించాడు. దీంతో బాధితులు పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కొత్తచెరువు మండలానికి చెందిన ప్రతాప్ రెడ్డి, శ్రీలత తెలిపిన మేరకు... గత 16 సంవత్సరాలపాటు వీరు ఎల్ఐసీలో క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించారు. పాలసీ పూర్తయినా డబ్బు అకౌంట్లోకి జమ కాలేదు. ఎల్ఐసీ ఆఫీస్కు వచ్చి విచారిస్తే ఏజెంట్ రాజారెడ్డి తన కుమారుడు అశోక్రెడ్డి ఖాతాలోకి డబ్బు బదిలీ చేసినట్లు తెలిసింది. ఎల్ఐసీ ఏజెంట్ రాజారెడ్డి వరుసకు బావ అవుతాడని ఏజెంట్, డెవలప్మెంట్ ఆఫీసర్ దస్తగిరి కుట్రపన్ని తమకు రావాల్సిన డబ్బు కాజేశారని బాధితులు వాపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని తిప్పేస్వామి (34) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు... ఒంటిమిద్దికి చెందిన తిప్పేస్వామి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన తిప్పేస్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తిప్పేస్వామికి భార్య శిల్పక్క, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
ఇన్సురెన్స్ డబ్బు కోసం తమ్ముణ్నే కడతేర్చాడు
తుమకూరు: శిరా తాలూకా పట్టనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసహళ్లి–బడేనహళ్లి గేట్ మధ్య రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏపీలోని మడకశిర తాలూకా నిద్రగట్ట గ్రామానికి చెందిన రమేష్(35) ఉదంతం మలుపు తిరిగింది. ఎల్ఐసీ డబ్బు కోసం ఇతన్ని స్వయానా అన్ననే కడతేర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈమేరకు బెంగళూరు మంజునాథ్ నగర వీడియోటోల్ వద్ద టీ హోటల్ నిర్వహిస్తున్న రమేష్ అన్న హనుమంతరాజు, బెంగళూరు చెన్ననాయకనపాళ్యకు చెందిన లక్ష్మికాంత, తుమకూరు తాలూకా మాచనహళ్లి నివాసి నవీన్ కుమార్, బెంగళూరు పార్లీజీ టోల్ వద్ద ఫుట్పాత్పై ఉన్న హోటల్లో పనిచేసే కోరటెగెరె తాలూకా దేరగానహళ్లి నివాసి ఎండీ జిలాన్ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కేవీ అశోక్ వివరాలు వెల్లడించారు. హతుడు రమేష్ ఆరేళ్ల నుంచి ఊరు విడిచి బెంగళూరులో కొబ్బరి బొండాల వ్యాపారం, మండ్యలో చెరుకు జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు. క్షుద్రవిద్యలు నేర్చుకున్న రమేశ్ తన సొంత అన్న హనుమంతరాజు సంసారంపైనే ప్రయోగించి ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. దీంతో రమేశ్ను చంపేయాలని హనుమంతరాజు స్కెచ్ వేశాడు. రమేశ్ పేరిట రూ. 15 లక్షల ఎల్ఐసీ బీమా చేసి తననే నామినీగా పెట్టుకున్నాడు. ఏటా 85వేలు బీమా కంతును చెల్లిస్తూ వచ్చాడు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి నామినీకి బీమా మొత్తం రెట్టింపు డబ్బు వస్తాయనే ఆశతో వాటిని చెల్లిస్తూ వచ్చాడు. ఈశ్రీక్రమంలో రమేష్ హోసహళ్లి–బడేనహళ్లి గేట్ మధ్య విగతజీవిగా పడి ఉండగా పోలీసులు వెళ్లి పరిశీలించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే మృతుని మరో సోదరుడు రంగనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసు విచారణకు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ సుమారు 25 మందితో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. రమేశ్ ఒంటిపై గాయాలను గమనించిన పట్టనాయకనహళ్లి ఎస్ఐ హరీష్ పోస్టుమార్టమ్ నివేదిక చూసి వెంటనే ఇది హత్య అని నిర్ధారణకు వచ్చారు. నిందితులను తొలుత అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా రమేష్ను అంతమొందించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. -
అతివేగానికి యువకుడి బలి
తలుపుల: అతివేగానికి యువకుడు బలయ్యాడు. మండలంలోని పులిగుండ్లపల్లి పంచాయతీలోని అగ్రహారంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని కొవ్వూరివాండ్లపల్లికి చెందిన చాకలి ఓబులేసు కుమారుడు విష్ణువర్దన్ (19) తిరుపతిలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం ఉదయం విష్ణువర్దన్ తన పెదనాన్న కుమారుడు ఓబులేసుతో కలిసి ద్విచక్రవాహనంలో వెలిచెలమల క్రాస్కు వెళ్లాడు. బట్టలు ఉతకడానికి అవసరమైన బ్లీచింగ్, సోడా తీసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అగ్రహారంపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి ఓబులేసు బహిర్భూమికి వెళ్లగా విష్ణువర్దన్ బైకు వద్దే నిల్చున్నాడు. ఈ క్రమంలోనే తలుపుల వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఆదినారాయణ బైకు వద్ద నిల్చున్న విష్ణువర్దన్ను ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలైన విష్ణువర్దన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ ఆదినారాయణ పరారయ్యాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. విష్ణుకుమార్ మృతదేహం వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులు రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టదా?
ఉరవకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి జపం తప్ప పేదల సంక్షేమం పట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. బుధవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతుల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమరావతి ముసుగులో వేల కోట్లు దోపిడీ చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రూపాయి విలువ పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్ర ప్రభుత్వం మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంత అభివృద్ధికే నిధులన్నీ ఖర్చు పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ ముఖ్య నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి దయనీయంగా ఉందని, ఎరువులు, మందులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. -
తడ‘బడి’న చదువులు
పాఠశాల వరండాలో చదువులుశిథిలావస్థకు చేరిన పాఠశాల అదనపు గది నల్లచెరువు: మండల పరిధిలోని రమణప్పగారిపల్లి ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ 28 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. హెచ్ఎం షేక్ బాబూ సాహెచ్, ఉపాధ్యాయురాలు పద్మావతి విధులు నిర్వర్తిస్తున్నారు. తరగతి గది మాత్రం ఒక్కటే ఉంది. పాఠశాల గదిలోకి వెలుతురు కూడా సరిగా పడక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయంతో చీకట్లు అలముకుంటున్నాయి. గత్యంతరం లేక 2,3,4వ తరగతులను పాఠశాల వరండాలో నిర్వహిస్తున్నారు. పాఠశాల ముందు రోడ్డు గుండా తరచూ ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్తుంటాయి. ఆ శబ్ధాలకు వరండాలోని పిల్లలు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పాఠశాల ఆవరణలో వంటగది కూడా లేకపోవడంతో గత్యంతరం లేక మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ ఇంట్లోనే వంట చేసుకొని వచ్చి పిల్లలకు పెడుతున్నారు. పాఠశాలలో తాగునీటి వసతి కూడా సరిగాలేదు. మరుగుదొడ్ల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు స్పందించి అదనపు గదులు, వంట గది నిర్మించి పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నాటుసారాను నిర్మూలించాలి
అనంతపురం సెంట్రల్: జిల్లాలో నాటుసారా నిర్మూలన వందశాతం జరగాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ రాష్ట్ర డైరెక్టర్ రాహుల్దేవ్శర్మ ఆదేశించారు. బుధవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ముద్దాయిలపై నిఘా ఉంచాలన్నారు. నవోదయం 2.0లో భాగంగా నాటు సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించిన గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని స్టేషన్ల పరిధిలో సుంకం చెల్లించని మద్యం సరఫరా చేస్తున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కల్తీ కల్లు నివారణకు తరచూ శాంపిల్స్ తీసి పంపాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ కేసులో చార్జిషీట్లు దాఖలు చేసిన ముద్దాయిలకు శిక్ష పడేలా చూడాలన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో నిబంధనల ఉల్లంఘనలను ఎకై ్సజ్ యాప్ ద్వారా కట్టడి చేయాలని ఆదేశించారు. ప్రతి మద్యం బాటిల్ను యాప్ ద్వారా తనిఖీ చేసి విక్రయించేలా చూడాలన్నారు. అంతకుముందు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మద్యం షాపులు, బార్ల లైసెన్స్దారులతో సమావేశం నిర్వహించారు. షాపులు, బార్ల పరిసర ప్రాంతాల్లో మద్యపానం అనుమతించరాదని, ఖాళీ బాటిళ్లు ఇష్టానుసారం పడేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్కేడీవీ ప్రసాద్, ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు రామమోహన్రెడ్డి, గోవిందనాయక్, ఎకై ్సజ్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ -
‘దివ్య’ సంకల్పం.. తలవంచిన వైకల్యం
అతని ‘దివ్య’ సంకల్పం ముందు వైకల్యం తలవంచింది. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా ఇతరులపై ఆధారపడే వారు ఎందరో నేటి సమాజంలో కనిపిస్తారు. అయితే, ఓ దివ్యాంగుడు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో ఉన్నతంగా జీవిస్తుండడమే కాకుండా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురంలోని మున్నా నగర్కు చెందిన షాషావలి ఐదేళ్ల వయసున్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. దీంతో ఒక కాలు అవిటిదైపోగా, షాషావలి చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యాడు. అయితే, అంతటితో కుంగిపోలేదు. స్వతహాగా కష్టపడే మనస్తత్వమున్న షాషావలి 8 ఏళ్ల క్రితం అప్పటి కలెక్టర్ వీరపాండియన్ ప్రోత్సాహంతో కలెక్టరేట్ ఎదురుగా వెల్డింగ్ షాపు నెలకొల్పాడు. సంకల్ప బలంతో ముందుకు సాగాడు. కచ్చితత్వంతో పనులు చేయడంతో ఆదరణ లభించింది. ప్రస్తుతం గ్రిల్స్, ఇనుప గేట్లు తదితర పనులను కూడా అవలీలగా చేసేస్తున్నాడు. తను ఉపాధి పొందడమే కాకుండా షాపులో మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాడు. దివ్యాంగుడైన షాషావలిని గతంలో కొందరు హేళన చేశారు. ‘చదువు లేదు.. పైగా దివ్యాంగుడు, ఎలా బతుకుతావురా’ అంటూ చుట్టుపక్కల వారు చులకనగా మాట్లాడారు. అయినా, కుంగిపోకుండా ముందుకు సాగి నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
మత్తెక్కితే ఇంతే..
ధర్మవరం అర్బన్: మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా మందుబాబులకు తెలియడం లేదు. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మై హోం రెస్టారెంట్ ముందు బుధవారం పూటుగా మద్యం సేవించిన వ్యక్తి నిలిపి ఉంచిన కారు వెనుక చక్రాల కింద పడిపోయాడు. స్థానికులు ఎంత పిలిచినా లేవలేదు. పొరపాటున కారు రివర్స్ చేస్తే మద్యం మత్తులోనే ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయి. విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహిస్తుండటంతోనే ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి ఇలా రోడ్లపై పడిపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. 11న జాతీయ లోక్ అదాలత్ అనంతపురం: జూలై 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లా కోర్టులో మేజిస్ట్రేట్లతో సమీక్ష నిర్వహించారు. లోక్ అదాలత్ దృష్టికి తీసుకరావాల్సిన కేసుల గురించి తగు సూచనలను చేశారు. ఈ సందర్భంగా మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసులపై, ఆర్థిక సంస్థల ద్వారా దాఖలు చేసిన పిటిషన్ల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకునే విధంగా తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు సత్యవాణి, ఎన్.సత్యశ్రీ, బబ్లునాయక్, సీఎన్ మూర్తి, టి.కేశవ తదితరులు పాల్గొన్నారు. -
కూటమికి ఉపాధి
ఉపాధి పథకం కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. పనులే చేయకుండా ఏకంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేసినట్లు చూపుతూ కొందరు నేతలు జేబులు నింపుకుంటున్నారు. రాత్రికి రాత్రే రైతుల పొలాల్లో జేసీబీలతో గుంతలు తీసి కూలీలతో పనులు చేయించి మరికొందరు బిల్లులు చేసుకుంటున్నారు. ఇలా.. ఎవరికి దోచిన విధంగా వారు అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అధికారులకు అన్నీ తెలిసినా చూిసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు బి.రాము. కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామం. సోమవారం రాత్రి కొందరు ఆయన పొలంలోకి వెళ్లి జేసీబీలతో గుంత తవ్వించారు. తనకు తెలియకుండా పొలంలో గుంత తీశారంటూ రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారంపాండ్ కింద బిల్లులు కాజేసేందుకు గుంత తీసినట్లు చెబుతున్నాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని గ్రామంలో కొందరు టీడీపీ నేతలు ఉపాధి పనుల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. పంట వేసుకోవాల్సిన పొలంలో తనకు తెలియకుండా గుంతలు తీయిస్తే.. ఎలా అని వాపోయారు. -
టీడీపీ నేతల పైశాచికం
రామగిరి: అధికారం అండతో ‘పచ్చ’ నేతలు బరితెగించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కోర్టు పరిధిలో ఉన్న భూమిని రెండురోజుల క్రితం దున్నేశారు. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం కొత్త గ్యాదికుంటలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితమే దుర్మార్గ చర్య రామగిరి మండలం కొత్త గ్యాదికుంటలో సర్వేనంబరు 488–3, 488–4, 488–5లోని 7.75 ఎకరాలను కొన్నేళ్లుగా దళితులైన పెద్దక్క, శివయ్య సాగుచేసుకుంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చీనీ తోటను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. తోటలోని 535 చినీచెట్లను నరికేయగా, అప్పట్లో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ టీడీపీ నేతలు ముత్యాలనాయుడు, రామలింగ, పోతన్న, తిప్పన్న రెండురోజుల క్రితం ఉద్దేశపూర్వకంగా చీనీ తోటలున్న భూమిని దున్నేశారు. ‘ఇప్పుడు పొలమే దున్నాం...అడ్డం వస్తే మనుషులనే గొయ్యితీసిపాతేస్తాం’’ అని హెచ్చరించడంతో బాధితులు కనీసం పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయలేని దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పరిటాల అండతో దళితుల పొలాన్నే దున్నేసిన వైనం గతంలోనే 535 చినీచెట్లను నరికిన టీడీపీ నేతలు కోర్టు ఆదేశాలను ధిక్కరించి దుర్మార్గంన్యాయ పోరాటం చేస్తాం మా సాగులో ఉన్న భూమి ప్రభుత్వానిది. కానీ 1996లో ఈ భూమి తనదేనని కొత్తగ్యాడికుంటకు చెందిన చెన్నప్ప చెప్పగా కొనుగోలు చేశాం. డి.పట్టా కావడంతో అప్పట్లో రిజిస్ట్రేషన్ కాలేదు. దీనిపై నిలదీసినా కొత్తగ్యాడికుంట చెన్నప్ప సమాధానం చెప్పలేదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగాం. మా పరిస్థితి చూసి సాగులో ఉన్నామని నిర్ధారించుకున్న తర్వాత అధికారులు మా పేరుతో డి.పట్టా ఇచ్చారు. గ్రామంలో మేం వైఎస్సార్సీపీ మద్దతుదారులుగా ఉండటంతో టీడీపీ నేతలు కక్షగట్టి ఇప్పుడు మా భూమి మా కాకుండా చేస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. – పెద్దక్క, శివయ్య, బాధిత రైతులు -
సజావుగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక
పుట్టపర్తి టౌన్: జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక పరేడ్ మైదానంలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 56 దరఖాస్తులు రాగా 12 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 34 మంది మాత్రం అర్హత సాధించారు. అర్హత సాధించిన వారికి ఎత్తు, బరువు, కొలతలతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాడింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెం, మెడిసిన్ ఫుట్బాల్, షటిల్ రన్ వంటి వివిధ మోటార్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపుతారు. అక్కడ ఉత్తమ ప్రదర్శన కనబరచిన వారిని స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక చేస్తామన్నారు. కోచ్లు హుస్సేన్, ఓంప్రకాశ్, ప్రతాప్, రెడ్డెప్ప, శబరి, రిజ్వాన ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదు
పుట్టపర్తి టౌన్: ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా జేఏసీ నాయకుడు షబ్బీర్ అధ్యక్షతన మంగళవారం పుట్టపర్తిలోని ఆర్డీసీ డిపో ఎదుట కార్మికులు గేట్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి జేఏసీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్నాయక్, శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్ విధానం తొలగించాలన్నారు. పీఆర్సీ కమిటీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల అరియర్స్ కార్యక్రమంలో జేఏసీ డిపో కన్వీనర్లు గంగులయ్య, ముత్యాలప్ప, కో కన్వీనర్లు శివశంకర్, సాదిక్పీరా, మహిళా నాయకురాలు తిరుపతమ్మ పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కులకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి పారిశ్రామిక పార్కులు ఎంతో కీలకమన్నారు. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర మండలాల్లో వివిధ గ్రామాల్లో ప్రతిపాదించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వెంటనే భూ సేకరణ పనులు ప్రారంభించాలన్నారు. పెండింగ్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు .. పుట్టపర్తి నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూ సేకరణ, సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. నియోజకవర్గంలో 195 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని తరలించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా ఈ చెరువులకు నీటిని అందిస్తారన్నారు. అధికారులు సమన్వయంతో సర్వే, పెగ్ మార్కెంగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఎస్డీ రికార్డులు, భూ గణన పత్రాలను వెంటనే సిద్ధంచేయాలన్నారు. విధుల్లో అలసత్వం సహించేది లేదు జిల్లాలో ఎవరైనా విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానం పక్కాగా అమలు చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విత్తన బాల్స్ తయారు చేసి కొండ ప్రాంతాల్లో చల్లాలన్నారు. స్వచ్ఛంధ్రా–స్వర్ణాంధ్రా కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. గృహ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ విజయ కుమారి, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, అటవీ అధికారి శ్రీనివాసులు, నీటి పారుదల ఈఈ గురుమూర్తి, తదితరులు ఉన్నారు. -
ఖాశీంస్వామికి నిత్యపూజ నివేదన
బత్తలపల్లి: మొహర్రం వేడుకల్లో భాగంగా బత్తలపల్లి ఖాశీంస్వామికి మంగళవారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. తెల్లవారుజామున ముజావర్లు టైలర్ రియాజ్, నజరుల్లా, మాభాషా, ఖాశీంవలి.. పీర్ల చావిడిలో ఫాతెహ చేశారు. అదేవిధంగా మండలంలోని గంటాపురం, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, సంజీవపురం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం, వెంకటగారిపల్లి, డి.చెర్లోపల్లి తదితర గ్రామాల్లోనూ పీర్ల మకాన్లలో పూజలు నిర్వహించారు. నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ అనంతపురం: ఏపీ పాలిసెట్–2026 కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుంచి సర్టిఫికెట్ పరిశీలన పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హెల్ప్లైన్ కేంద్రాలకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్లోడ్ ప్రక్రియ కొనసాగనుందన్నారు. ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందన్నారు. 4న ఆప్షన్లలో మార్పు, 6న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జూలై 7 నుంచి 10 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ముగిసిన ఎంటీఎస్ కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: తీవ్ర గందరగోళం మధ్య ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ మంగళవారం అనంతపురంలోని సైన్స్ సెంటర్లో ముగిసింది. 2008 డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 14 మందికి కౌన్సెలింగ్ లేకుండా వారు పని చేస్తున్న పాఠశాలల్లోనే స్థానాలను యథాతథంగా కేటాయించారు. మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలిపినా, అధికారులు పట్టించుకోలేదు. చాలా ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్కు హాజరు కాకపోయినా నిర్బంధంగా ప్రక్రియ పూర్తి చేశారు. కాగా గత ఏడాది జిల్లాలో దాదాపు 80 మంది క్లస్టర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ఇప్పుడు తమకు కేటాయించిన పాఠశాలలను కూడా ఖాళీల జాబితాలో చూపించలేదని పలువురు ఉపాధ్యాయులు వాపోయారు. ఖాళీల జాబితా తయారీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహణ వరకు పారదర్శకత లోపించిందని ఆరోపించారు. నమ్మించి.. ఉసూరుమనిపించిన ఎమ్మెల్సీ డీఎస్సీ–1998 ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ వ్యవహారం మంగళవారం గందరగోళానికి దారి తీసింది. ఖాళీలు బ్లాక్ చేశారని, అందుబాటులో ఉన్న పోస్టులను చూపడం లేదని ఆరోపిస్తూ ఎంటీఎస్ టీచర్లు సోమవారం జరగాల్సిన కౌన్సెలింగ్ను బహిష్కరించారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందిస్తూ ‘ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాను’ అంటూ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్సీ.. తాను విద్యాశాఖ కమిషనర్తో మాట్లాడతానని, అప్పటిదాకా కౌన్సెలింగ్ నిర్వహించవద్దని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్ను నిలిపివేశారు. సాయంత్రం దాకా రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ముందుగా ప్రకటించిన ఖాళీలతోనే విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
దళితునిపై దాడి చేసిన వారిని శిక్షించాలి
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి దళితులకు రక్షణ కరువైందని, ముఖ్యంగా పెనుకొండలో మంత్రి సవిత అనుచరులు రౌడీల్లా వ్యవహరిస్తూ దళితులపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండలో దళితుడైన శ్రీనివాసులు కుటుంబంపై దాడి చేసిన టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె బాధితునితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్కు విన్నవించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తాను ఇటీవల పెనుకొండ 17వ వార్డులో పర్యటిస్తూ దళితుడైన శ్రీనివాసులు ఇంటి వద్ద వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నానన్నారు. అనంతరం మంత్రి సవితకు ఈ సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించానన్నారు. దీంతో అదేరోజు సాయంత్రం మంత్రి అనుచరులు త్రివేంద్ర నాయుడు, వంశీ, షేక్షావలి, వెంకటేష్, చంద్ర తదితరులు శ్రీనివాసులు ఇంటికి వెళ్లి కులం పేరుతో దూషించారని, మహిళలను కూడా అసభ్యకర పదజాలంతో దూషించారన్నారు. దళిత కుటుంబంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరగా..ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి వైఎస్సార్ సీపీ తప్పక అండగా ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతోనే జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా, అడ్డంకులు సృష్టించిన వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. మంత్రి సవిత అరాచకాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి తీరుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్పీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్నా, చిన్న గంగాద్రి, ఎస్సీ నాయకులు సినిమా నారాయణ, ఈశ్వర్, కమ్మాలప్ప, నరసింహమూర్తి, రామాంజనేయులు, ఆనంద్కమార్, గజేంద్ర, చిన్న గంగన్న, కసముద్రం గంగన్న, శేషాద్రి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
దంచేసిన వాన
పుట్టపర్తి అర్బన్: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించగా సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం గంటలకుపైగా కురిసింది. ముఖ్యంగా గోరంట్ల, చిలమత్తూరు, ఓడీ చెరువు, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ధర్మవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి. ‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయండి పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ఈనెల 28న నిర్వహిస్తున్న ‘పల్స్ పోలియో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సున్న నుంచి ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. 28న పోలియో కేంద్రాల్లో చుక్కల పంపిణీ ఉంటుందని, ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారికోసం 29న సిబ్బంది ఇళ్లకే వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం గురించి 27వ తేదీన అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి చెన్నారెడ్డి, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, ఎస్ఓ కళాధర్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీపీఓ సమత పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ అతిసార పక్షోత్సవాల వాల్పోస్టర్ను కలెక్టర్ శ్యాం ప్రసాద్ విడుదల చేశారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు నేడు ఎంపికలు అనంతపురం న్యూటౌన్: డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ (కడప)లో 4, 5, 6వ తరగతుల్లో ప్రవేశాల కోసం మంగళవారం పుట్టపర్తిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి కిషోర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారిలో అర్హులైన వారందరికీ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. ఎంపికల్లో భాగంగా ఎత్తు, బరువు, పరుగులు, జంప్స్ తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు ఉదయం ఏడుగంటలకు హాజరుకావాలని కోరారు. -
సాయం చేసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది
నార్పల: సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యు వాత పడిన ఘటన మండల పరిధిలోని నాయనపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం తెల్లవారుజామున పుట్లూరు మండలంలోని కొండాపురంలో రేణప్పకు చెందిన ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. అనంతపురం వైపు తీసుకెళ్లాడు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన రేణప్ప వెంటనే ఆ మార్గంలోని వెంకటాంపల్లికి చెందిన తన బంధువు బాలరాజుకి ఫోన్ చేసి దొంగను అడ్డుకోవాలని సూచించాడు. అప్రమత్తమైన బాలరాజు (45) వెంటనే తన కుమారుడు ప్రవీణ్తో కలిసి నాయనపల్లికి చేరుకుని మెయిన్ రోడ్డుపై ట్రాక్టర్ను ఆపేందుకు యత్నించాడు. అయితే, ట్రాక్టర్ దొంగ ఆపకుండా ఢీకొనడంతో తీవ్ర గాయాలైన బాలరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దొంగిలించిన వ్యక్తి ట్రాక్టర్ను వదిలి పారిపోయాడు. -
బయట కొనుక్కోమంటారు
మాకు రెండు ఆవులున్నాయి. వాటికి ఎప్పుడు పశువుల ఆసుపత్రికి తీసుకుపోయినా మందులు బయట కొనుక్కోమని చీటీ రాసిస్తారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇదే తంతు. గట్టినా అడిగితే ప్రభుత్వం మందులు పంపడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడూ ఇట్ల లేదు. – పి.జయప్ప, పాడి రైతు, కాళసముద్రం, కదిరి మండలం కొరత లేకుండా చూస్తాం పశువైద్యశాల స్థాయిని బట్టి ప్రభుత్వం మందుల కొనుగోలుకు నిధులు ఇస్తుంది. మందుల కొరత తీవ్రంగా ఉండటంతో గత నెలలో నిధులు ఇచ్చాం. మళ్లీ ఆగస్టులో నిధులు మంజూరవుతాయి. కొన్ని చోట్ల ఈ నిధులు సరిపోకపోవచ్చు. అందుకే మందుల కొరత ఉంటోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – పూలతోట పెంచలయ్య, జేడీ, పశు సంవర్ధకశాఖ -
మనవడి చేతిలో అవ్వ హతం
పావగడ: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని గౌడేటి గ్రామం దుర్గమ్మ గుడి వద్ద నివసిస్తున్న గంగమ్మ (80)ను సొంత మనవడు నరసింహమూర్తి హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గంగమ్మను నరసింహమూర్తి మద్యం సేవించడానికి డబ్బు అడిగాడు. ఆమె నిరాకరించగా చంపేస్తానని బెదిరించాడు. అయినా భయపడకపోవడంతో కోపోద్రిక్తుడై చపాతి కర్రతో అవ్వ తలపై మోదాడు. చుట్టు పక్కల జనం సాయంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం మెరుగైన చికిత్స కోసం తుమకూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. నిందితుడు నరసింహమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక జేఎంఎఫ్పీ కోర్టులో హాజరు పరచి జడ్జి ఆదేశాల మేరకు 15 రోజుల రిమాండుకు తుమకూరు జైలుకు తరలించారు. -
కారులో మంటలు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కారులో మంటలు చెలరేగాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం సోమవారం కారులో ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రి వద్ద నిలిపిన కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి మదనపల్లె టౌన్: అతిగా మద్యం తాగి ఓ వ మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మదనపల్లెలో వెలుగుచూసింది. కదిరిలోని పిల్ల వంక కాలనీకి చెందిన నారాయణ అదే ప్రాంతంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. మృతుని భార్య భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజులుగా షాపునకు వెళ్లకుండా ఇంట్లోనే అతిగా మద్యం తాగుతూ ఉన్నాడు. ఆదివారం రాత్రి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని చికిత్స కోసం స్విమ్స్కు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టీబీ డ్యాంకు జీరో ఇన్ఫ్లో రాయదుర్గంటౌన్: తుంగభద్ర జలాశయానికి ఎగువ భాగంలో నుంచి ఇన్ఫ్లో ఆదివారం ఉదయం జీరో స్థాయికి పడిపోయింది. ఎల్–నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతువపనాలు ప్రవేశించి రోజులు గడుస్తున్నా ఎగువ భాగంలోని శృంగేరి, వరనాడు, అగుంబే, శివమొగ్గ, చిక్మంగళూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో టీబీ డ్యాంకు వరద రావడం లేదు. -
నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం
నాడు: అనంతపురం అగ్రికల్చర్: 2020 మార్చిలో కరోనావిజృంభించినా ఖరీఫ్లో రైతులు ఇబ్బంది పడకుండా ఏప్రిల్లోనే ముందస్తుగా విత్తనాలు, ఎరువుల సరఫరాకు అప్పటి జగన్ సర్కారు చర్యలు చేపట్టింది. ‘మన విత్తనం–మంచి విత్తనం’ నినాదంతో రబీలో రైతులు పండించిన వేరుశనగకు మద్ధతు ధర ఇచ్చి ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖ ద్వారా విత్తన సేకరణ చేయించారు. గ్రామ గ్రామాన తిరిగి రైతుల నుంచి నాణ్యమైన విత్తనం సేకరించి ప్రాసెసింగ్ ప్లాంట్లలో శుద్ధి చేసి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నిర్మించిన సచివాలయాలు, వాటికి అనుబంధంగా ఉన్న 867 ఆర్బీకేలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రూ.275 కోట్ల విలువ చేసే 3.44 లక్షల క్వింటాళ్ల మేర విత్తన వేరుశనగ, కందులు గ్రామాల్లోనే రైతుల ముంగిటకు చేర్చారు. మే 17న విత్తన పంపిణీ మొదలు పెట్టి జూన్ మొదటి వారంలోగా పూర్తి చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 120 కిలోలు అందించారు. 40 శాతం మేర రాయితీ రూపంలో రైతులకు రూ.110 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. చంద్రబాబు హయాంలో కష్టాలు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా రైతు సంక్షేమానికి చంద్రబాబు సర్కారు కంటితుడుపు చర్యలు మినహా పెద్దగా సాయం చేసింది లేదు. ఖరీఫ్, రబీలో రైతులకు విత్తనం కూడా ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు. 2025 ఖరీఫ్లో అరకొరగా రాయితీ వేరుశనగ ఇచ్చారు. 2025 రబీలో అయితే 2 వేల క్వింటాళ్లు మాత్రమే రాయితీ పప్పుశనగ అందించారు. ఈ ఖరీఫ్లో విత్తన వేరుశనగ, ఇతర విత్తనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనం కేటాయించినా, సరఫరా చేసింది మాత్రం 35 వేల క్వింటాళ్లు.. రైతులకు పంపిణీ చేసింది 15 వేల క్వింటాళ్లే కావడం గమనార్హం. గత ఖరీఫ్, రబీకి సంబంధించి సరఫరాదారులకు బకాయిలు చెల్లించకపోవడంతో విత్తన కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 50 వేల క్వింటాళ్లు కూడా పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ‘కరోనా’ విపత్తులోనూ విత్తుకోసం రూ.275 కోట్లు ఇచ్చిన జగన్ సర్కారు మన విత్తనం–మంచి విత్తనం పేరుతో ముందస్తుగా నాణ్యమైన విత్తనం సకాలంలో 3.44 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 6 వేల క్వింటాళ్ల కందులు నేడు 50 వేల క్వింటాళ్లు కూడా ఇవ్వకుండా చేతులెత్తేస్తున్న చంద్రబాబు కష్టమైనా నష్టమైనా రైతు కోసం వెన్నుచూపేది ఉండదని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019–2024 మధ్య కాలంలో అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేశారు. ‘కరోనా’ మహమ్మారి విలయతాండవం చేస్తున్న అత్యంత విపత్కర పరిస్థితుల్లోనూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి అసలుసిసలైన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం రెండేళ్లుగా సకాలంలో విత్తనం ఇవ్వకుండా, అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచకుండా కష్టనష్టాలకు గురిచేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. నేడు: 2026 ఉమ్మడి జిల్లాకు కేటాయించిన వేరుశనగ– 1.20 లక్షల క్వింటాళ్లు ఇప్పటి వరకు సేకరించి సరఫరా చేసింది– 35 వేల క్వింటాళ్లు అందులో ఇప్పటివరకు రైతులకు పంపిణీ చేసింది– 15 వేల క్వింటాళ్ల లోపు మొత్తమ్మీద ఈ ఏడాది పంపిణీ చేసే వేరుశనగ– 50 వేల క్వింటాళ్ల లోపు ఈ లెక్కన రైతులకు ఒనగూరే ప్రయోజనం– రూ.20 కోట్లు (అంచనా) విత్తనాలపై ప్రభుత్వం వెచ్చించే మొత్తం– రూ.50 కోట్లు (అంచనా) 2020లో రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగ– 3.44 లక్షల క్వింటాళ్లు రాయితీ రూపంలో రైతులకు చేకూరిన లబ్ధి– రూ.108 కోట్లు కందులు,పెసలు, చిరుధాన్యాల విత్తనాలు– 7,100 క్వింటాళ్లు వాటిపై రైతులకు వర్తింపజేసిన రాయితీ– రూ.2 కోట్ల పైచిలుకు మొత్తంగా విత్తనంపై రైతులకు కలిగిన లబ్ధి– రూ.110 కోట్లు పైచిలుకు విత్తనాలపై ప్రభుత్వం వెచ్చించిన మొత్తం– రూ.275 కోట్లు -
బాధితులకు న్యాయం చేయండి
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎస్పీ సతీష్కుమార్ వివిధ సమస్యలపై 80 వినతులు స్వీకరించారు. స్వయంగా వికలాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు విన్న అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకుని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, సీఐ బొజ్జప్ప, ఎీస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 వినతులు -
‘ఇది మా ప్రభుత్వం.. నీకు విత్తనమివ్వం’
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఇది మా ప్రభుత్వం.. నీకు విత్తనం ఇచ్చేది లేదు’ అంటూ వైఎస్సార్ సీపీ నాయకుడిపై మంత్రి సవిత అనుచరులు దౌర్జన్యం చేసిన ఘటన పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన రైతు, వైఎస్సార్ సీపీ నాయకుడు కల్యాణ్ సోమవారం విత్తన వేరుశనగ కోసం గ్రామంలోని కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఏఓ విజయభారతితో మాట్లాడుతున్న సమయంలో మంత్రి సవిత అనుచరులు సిద్దలింగప్ప, వెంకటేశు, కిష్టప్ప తదితరులు అక్కడికి చేరుకున్నారు. కల్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం నుంచి బయటకు తోసేశారు. విత్తనం ఇవ్వం, ఇది తమ ప్రభుత్వమంటూ దౌర్జన్యం చేశారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడిపై మంత్రి సవిత అనుచరుల దౌర్జన్యం -
ఇంటింటి ఓటు సర్వేకు మంగళం!
ధర్మవరం: ఓటరు జాబితాలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహిస్తున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో బీఎల్ఓలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ధర్మవరంలో బీఎల్ఓ (బూత్లెవల్ ఆఫీసర్)లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంటింటి సర్వేకు పూర్తిగా మంగళం పాడారు. అలాగే డోర్ నంబర్లు క్యాన్సిల్ అయిన ఇళ్ల అడ్రెస్లతో ఓట్లు ఎక్కించే విధంగా వ్యవహరిస్తున్నారు. అందరినీఒకే చోటకు పిలిచి.. 17వ వార్డులోని 8వ సచివాలయ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేయాల్సిన బీఎల్ఓ లీలావతి... ఓటర్లను స్థానిక బీఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణకు రమ్మని చెబుతున్నారు. అక్కడే ఓటరు గణన ఫారాలు అందజేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓటరు గణన దరఖాస్తులను అక్కడే పూర్తి చేస్తుండటంతో ప్రజలు నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా అయితే బీఎల్ఓ ఇంటింటికీ వెళ్లి ఓటర్లుకు దరఖాస్తులను అందించి... వారు నింపిన తర్వాత మళ్లీ వారి ఇంటి వద్దకే వెళ్లి స్వీకరించాల్సి ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం వారికి టీఏ, డీఏలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తోంది. కానీ పట్టణంలో ఇష్టానుసారం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కూల్చివేసిన ఇళ్ల అడ్రెస్లతో ఓట్లు ఎక్కించేందుకు ప్రణాళిక ఇటీవల 17వ వార్డు పరిధిలో కదిరిగేట్ శివానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో దాదాపుగా 80కిపైగా ఇళ్లను కూల్చి వేశారు. ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించడంతో ఇళ్లను పూర్తిగా తొలగించి డోర్నంబర్లను కూడా క్యాన్సిల్ చేసింది. ఇక్కడ నివాసం ఉంటున్న దాదాపుగా 200మందికిపైగా ఓటర్లు పోతులనాగేపల్లి వద్ద ఉన్న జగనన్న లేఅవుట్, ఎల్సీకే పురం, మార్కెట్యార్డులతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాల పరిధిలోని సచివాలయాల్లోనే వారు మ్యాపింగ్ కూడా చేసుకున్నారు. వాస్తవానికి వారి ఓట్లర్ల జాబితా వెరిఫికేషన్ అక్కడే జరగాలి. కానీ సదరు బీఎల్ఓ వారికి ఫోన్లు చేసి క్యాన్సిల్ చేసిన డోర్నంబర్లకే ఓటరు జాబితాలోకి ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై కొంతమంది బీఎల్ఏలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆమె ఖాతరు చేయలేదని వారు చెబుతున్నారు. ఇది ఎన్నికల సంఘం విడుదల చేసిన నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వెంకటరమణను వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. ధర్మవరంలో బీఎల్ఓ నిబంధనల ఉల్లంఘన అందరినీ ఒకేచోటకు రప్పించి ఓటరు జాబితా పరిశీలన 8వ వార్డు సచివాలయ పరిధిలో ఘటన కూల్చేసిన ఇళ్ల అడ్రెస్లతో ఓట్లు చేర్చేందుకు ప్రణాళిక -
సమస్యలు పరిష్కరించండి సారూ
ప్రశాంతి నిలయం: ‘‘ఎన్నిసార్లు అధికారులకు అర్జీలిచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా మాపై దయచూపి మా సమస్యలు పరిష్కరించండి సార్’’ అంటూ ప్రజలు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. వివిధ సమస్యలపై మొత్తంగా 387 అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, ఎస్డీసీ విజయకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమావేశమయ్యారు. పరిష్కార వేదికలో అందిన అర్జీలన్నీ గడువులోపు పరిష్కరించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. దివ్యాంగ బాలికకు పింఛన్, పట్టా కొత్తచెరువుకు చెందిన ఓ దివ్యాంగ బాలికకు కలెక్టర్ శ్యాంప్రసాద్ అండగా నిలిచారు. కొత్తచెరువుకు చెందిన సాయిలీల, మంజునాథ్ దంపతుల కుమార్తె శిరీష దివ్యాంగురాలు. గత వారం తనకు పింఛన్, ఇంటి పట్టా మంజూరు చేయాలని శిరీష ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ శ్యాంప్రసాద్కు అర్జీ ఇచ్చింది. కుటుంబ పరిస్థితిని గమనించిన కలెక్టర్... సోమవారం ఇంటి పట్టాతో పాటు పింఛన్ మంజూరు చేసి సంబంధిత పత్రాలు అందజేశారు. దీంతో జిల్లా యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సదరంలో ‘జీరో’ వేశారు ‘‘2004లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా రెండు కాళ్లు విరిగాయి. వెన్నెముక కూడా దెబ్బ తినింది. రెండుసార్లు శస్త్ర చికిత్సలు చేశారు. అయినా నడవలేను. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బంది మారింది. పింఛన్ అయినా వస్తుందన్న ఆశతో సదరం శిబిరానికి వెళితే జీరో పర్సెంటేజీ వేశారు. ఆస్పత్రిలో డబ్బులిచ్చిన వారికే సదరం సర్టిఫికెట్లో పర్సెంటేజీ పెంచి వేస్తారంట.. మీరైనా న్యాయం చేయండి’’ అని పుట్టపర్తి మండలం రాచువారిపల్లికి చెందిన చంద్ర ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్ శ్యాంప్రసాద్ను వేడుకున్నారు. అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 387 అర్జీలు -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
హిందూపురం: హిందూపురం రైల్వేస్టేషన్లో కోయంబత్తూరుకు చెందిన వృద్ధురాలు నాగలక్ష్మి మెడలోని 2.50 తులాల బంగారు గొలుసును దొంగ లాక్కుపోయాడు. కోయంబత్తూర్ నుంచి హిందూపురం తూమకుంట వద్ద పెళ్లికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి నాగలక్ష్మి కుటుంబసభ్యులు వచ్చారు. రైలు దిగి మిగిలిన వారు కాస్త ముందు వైపు నడుస్తుండగా వృద్ధురాలు నిదానంగా వెళ్తోంది. గమనించిన దొంగ ఆమె మెడలోని గొలుసును లాక్కుని రైలెక్కి పరారయ్యాడు. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారని రైల్వేస్టేషన్ ఎస్హెచ్ఓ ఎర్రిస్వామి తెలిపారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతిహిందూపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన హిందూపురం మండలం వినాయక నగర్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పళనీనగర్కు చెందిన మణికంఠ (40) హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య వలియమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి వినాయక నగర్ సమీపంలో ఐటీఐ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మణికంఠను వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీతాలు వెంటనే చెల్లించాలి అనంతపురం న్యూటౌన్: తమకు రావాల్సిన నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులు బోర్డు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు కార్మికులకు చెల్లించాల్సిన రూ. 2.5 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోర్డ్ అకౌంట్లో నిధులు ఉన్నా కార్మికులకు జీతాలు చెల్లించకుండా బోర్డు మెంబర్ సెక్రటరీ, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సమర్థనీయం కాదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే జూలై 6న బోర్డు ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్, సెక్రటరీ శ్రీరాములు, ట్రెజరర్ వన్నూరప్ప, వీరాంజనేయులు, వెంకటేశులు, చిన్న బాబయ్య, రవీంద్ర చారి, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతిడి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘ టన డి.హీరేహాళ్ మండలంలోని తిమ్మలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన గంగప్ప, వండ్రమ్మ దంపతులకు మల్లికార్జున (27) కుమారుడు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం క్రితం కర్ణాటక రాష్ట్రం తిమ్మలాపురం గ్రామానికి చెందిన అనుషతో మల్లికార్జునకు వివాహం కాగా, ఐదు రోజుల క్రితం వీరికి మగబిడ్డ పుట్టాడు. కొడుకును హాస్పిటల్లో చూసి ఇంటికి వచ్చిన మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి వండ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి తెలిపారు. జంతలూరులో మరో యువకుడు.. బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జంతలూరు గ్రామంలో విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జంతలూరు గ్రామంలో కిష్టయ్య, ఓబులమ్మ కుమారుడు సాయి (26) ట్రాక్టర్లో కట్టెలు వేసుకుని వస్తుండగా స్కూల్ వద్ద కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో షాక్కు గురైన సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దివ్యాంగుల జాతీయ క్రికెట్ చాంపియన్షిప్ ప్రారంభం
అనంతపురం: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో సోమవారం దివ్యాంగుల జాతీయ క్రికెట్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రోహిత్ సైనీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రధాన కార్యదర్శి రఘు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, తెలంగాణ, కర్ణాటక జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ –హర్యానా, తెలంగాణ–ఢిల్లీ, గుజరాత్– కర్ణాటక, ఉత్తరప్రదేశ్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్లు జరిగినట్లు నిర్వాహణ కమిటీ కార్యదర్శి ఎస్. నాగరాజు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం● మరో ఇద్దరికి గాయలు కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. తగరకుంట గ్రామానికి చెందిన నాగన్న, ఉమాక్క దంపతుల కుమారుడు బిల్లే మహేష్ (21), అతని మామ పెన్నప్ప, అత్త శ్రావణిలు చెన్నేకొత్తపల్లిలోని వారి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లి వస్తుండగా, రాత్రి వేళ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి 108 ద్వారా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లుండగా, మహేష్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. గాయపడ్డ పెన్నప్ప, శ్రావణిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు నాగన్న, ఉమాక్క, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది బైండోవర్ కదిరి టౌన్: కదిరి పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, నేర స్వభావం కలిగిన 9 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. కదిరికి చెందిన కలైకం మహమ్మద్ జుబేర్, ఎం.నవీద్, ఎస్.భరద్వాజ్, సాకే పవన్కుమార్, ఈ.శ్రీకాంత్, పవన్కుమార్, వి.బాలు, ఎం.చరన్ తేజ్, షేక్ అప్నాన్పై సోమవారం బైండోవర్ కేసులు నమోదు చేసి కదిరి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల విలువైన బాండ్లు తీసుకున్నట్లు వివరించారు. కోర్టుకు హాజరు కాకుంటే జైలుకేకదిరి టౌన్: కేసుల్లో నిందితులుగా ఉన్న వారు కోర్టుకు హాజరు కాకుంటే జైలుకు పంపుతామని కదిరి సీఐ వి.నారాయణరెడ్డి హెచ్చరించారు. కదిరి టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 50 మంది కొంత కాలంగా కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా ఉన్నారన్నారు. వారంతా రెండు, మూడు రోజుల్లో కోర్టులో హాజరుకాని పక్షంలో అరెస్టు చేసి జైలుకు తరలిస్తామన్నారు. సోమవారం రాయచోటి పట్టణానికి చెందిన పూలంగిరి హసినా, షేక్ గులాబ్ జామ్లను అరెస్టు చేసి అనంతపురం జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణంగుత్తి రూరల్: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుత్తి మండలం యంగన్నపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా సారా గ్రామానికి చెందిన మున్నా కుమారుడు అమన్ (20) అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. సదరు యువతి ప్రేమకు నిరాకరించడంతో ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. కుమారుడిని మార్చాలని భావించిన తల్లిదండ్రులు గుత్తి మండలంలోని బేతాపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న సోలార్ ప్లాంటులో ఓ కాంట్రాక్టర్ వద్దకు కూలీ పనులకు పంపారు. అమన్తో పాటు ఇతర కూలీలు నివాసం ఉండేందుకు కాంట్రాక్టర్ చెట్నేపల్లిలో ఓ ఇల్లు చూపించాడు. అమన్ కూలీ పనులకు వెళ్లినా అక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే ఉండేవాడు. తాను చనిపోతానని రోజూ తోటి కూలీలతో చెప్పేవాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి యంగన్నపల్లి శివారులోని బాలరాజు మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
బాలకృష్ణ పీఏలు దోచేస్తున్నారు
చిలమత్తూరు: ‘‘మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని బాలకృష్ణ పూర్తిగా విస్మరించారు. పాలన అంతా పీఏలకు వదిలిపెట్టారు. వారు అవినీతి, అక్రమాలకు తెగబడుతూ హిందూపురాన్ని దోచేస్తున్నారు’’ అని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సినిమాలకే పరిమితమైన ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని పీఏ చేతుల్లో పెట్టారన్నారు. వారు నియోజకవర్గంలోని సహజ వనరులన్నీ దోచేశారన్నారు. ఇప్పుడు సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఆరాచక శక్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో పోలీసులకు పట్టుబడిన దొంగనోట్ల ముఠా వెనుక టీడీపీ ముఖ్యనేత ఉన్నారని, అతన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే పీఏలు రూ. 40 లక్షలు తీసుకొని కేసును తప్పుదోవ పట్టించారన్నారు. తమ హయాంలో హిందూపురం పట్టణంలో రూ.92 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు... వైఎస్సార్సీపీ హయాంలోనే రూ.60 కోట్లు మంజూరైన విషయం గుర్తించాలన్నారు. పట్టణంలోని 80 అడుగులు ఉన్న రైల్వే రోడ్డును 70 అడుగులకు తగ్గించారన్నారు. ఎవరైనా అభివృద్ధి కోసం రోడ్లు వెడల్పు చేస్తారని, వీళ్లు ఉన్న రోడ్లను తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రోడ్ల పనుల్లోనూ ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారని, కనీసం క్యూరింగ్ కూడా సరిగా చేయకుండా జేబులను నింపుకుంటున్నారన్నారు. ఎవరైనా తొలుత డ్రైన్లు వేసి ఆ తర్వాత రోడ్లు వేస్తారని, హిందూపురంలో మాత్రం రోడ్లు వేసి మళ్లీ డ్రైన్లు వేస్తున్నారన్నారు. ఆ పనులను కూడా స్థానికేతరులకు అప్పగించారన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని కోతలు కోసే ఎమ్మెల్యే బాలకృష్ణ...ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారో..ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా ఆయన తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం వారంలో కనీసం మూడు రోజులు హిందూపురంలోనే ఉండి అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు. హిందూపురాన్ని అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారారు అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి ధ్వజం -
జూద స్థావరంపై పోలీసుల మెరుపుదాడి
తనకల్లు: మండల పరిధిలోని కొర్తికోట గ్రామ శివారు ప్రాంతాల్లో జూద కేంద్రంపై పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేశారు. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, తనకల్లు, నల్లచెరువు ఎస్ఐలు దిలీప్కుమార్, మక్బూల్ బాషా సిబ్బందితో జూద స్థావరంపై దాడి చేసి, పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,06,400 నగదు, 13 ద్విచక్ర వాహనాలు, 21 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పాముకాటుతో మహిళ మృతినల్లచెరువు: మండలంలోని పి. కొత్తపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడీయా యాక్టివిస్టు యుగంధర్రెడ్డి తల్లి పార్వతమ్మ (53) ఆదివారం మృతి చెందింది. వివరాలు.. పార్వతమ్మ శనివారం సాయంత్రం పొలం వద్ద పనులు చేస్తుండగా రెండు కాళ్లకు పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పార్వతమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతిచెందింది. పూల శ్రీనివాసరెడ్డి నివాళి..: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూలశ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులతో కలిసి పి.కొత్తపల్లి గ్రామానికి వెళ్లి పార్వతమ్మ మృతదేహం వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు. యుగంధర్రెడ్డి, కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పెనుకొండ: సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామ శివారులో మల్లికార్జున (42) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలు.. రొద్దం మండలం రొద్దకంపల్లికి చెందిన బోయ మల్లికార్జున సుద్దకుంటపల్లి సమీపంలో కంది సాగుకు పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం భూమిని దుక్కి చేస్తుండగా, కిందనే వేలాడుతున్న విద్యుత్ వైరు ట్రాక్టర్కు తగిలింది. దీంతో ట్రాక్టర్ తోలుతున్న మల్లికార్జున షాక్కు గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి కుంభాభిషేకంధర్మవరం: పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి 24 వరకు కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పీఏబీఆర్ జలాశయంలో తగ్గిన నీటి మట్టం కూడేరు: మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2.1 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు ఆదివారం తెలిపారు. డ్యాంలోకి ఇన్ప్లో లేదు. పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి, అనంత, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి, లీకేజీ రూపంలో మరో 75 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. అవుట్ ఫ్లో మాత్రమే ఉండడంతో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గిపోతోంది. నీటి మట్టం తక్కువున్నా తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని డ్యాం ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పెద్దాస్పత్రిలో భద్రతేదీ?
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రత కరువైంది. ఇక్కడ కొంతకాలంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులే కాకుండా డాక్టర్లు సైతం భయపడుతున్నారు. ప్రత్యేకంగా పోలీసు ఔట్ పోస్టు కార్యాలయం ఏర్పాటు చేసి.. ఎస్ఐను నియమించినా ఫలితం మాత్రం కానరావడం లేదు. ఔట్పోస్టులో ఇష్టారాజ్యం పెద్దాస్పత్రి పోలీసు ఔట్పోస్టు కొందరికి విడిది కేంద్రంగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలతో పాటు ఘర్షణలతో వచ్చే వారి ఫిర్యాదులను ఔట్పోస్టులోనే నమోదు చేసి.. తర్వాత ఆయా పోలీసుస్టేషన్లకు బదిలీ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడ నమోదు చేయకుండా ఫోన్ ద్వారా ఆయా స్టేషన్లకు సమాచారం ఇస్తున్నారు. ఆయా స్టేషన్ల అధికారులే వచ్చి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. మరికొంత మంది బాధితులనే స్టేషన్లకు రప్పించుకుంటున్నారు. ఆ మాత్రం విధులకు ఔట్పోస్టులో ఒక ఎస్ఐ, ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఎస్ఐను ఎందుకు నియమించారో అర్థం కావడం లేదు. సాధారణంగా ఎక్కడైనా రోజుకు 8 గంటలు కాని.. 12 గంటలు కాని విధులు నిర్వర్తిస్తారు. కానీ ఔట్పోస్టులో మాత్రం రోజుకొకరు చొప్పున విధుల్లో ఉంటున్నారు. ఈ లెక్కన ఎన్ని రోజులకొకసారి విధులకు వస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ శాతం సుమారు పదేళ్లుగా తిష్ట వేయడం గమనార్హం. రాత్రి గస్తీ శూన్యం పెద్దాస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల భద్రత కోసం పోలీసు ఔట్పోస్టు అధికారులతో పాటు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. ఔట్పోస్టు సిబ్బంది అయితే ఆస్పత్రిలో జరిగే పరిణామాలతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో నిత్యం ఘర్షణలు, దొంగతనాలు, నేరాలు జరుగుతున్నాయి. ఆస్పత్రి బయటే కాదు.. లోపల కూడా దాడులు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలతో డాక్టర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. విడిది కేంద్రంగా పోలీసు ఔట్పోస్టు నిత్యం ఘర్షణలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరు చీకటి పడితే చాలు దొంగల బెడద ఎస్ఐను నియమించినా ప్రయోజనం శూన్యం ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఆస్పత్రి ప్రాంగణంలో చెప్పులతో దాడి చేసుకున్నారు. దాదాపు గంట పాటు రణరంగాన్ని సృష్టించినా.. ఔట్పోస్టు సిబ్బంది దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. 14 రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఎమర్జెన్సీ వార్డు సిబ్బందిని నానా దుర్భాషలాడినా.. అడ్డుకునే వారు లేరు. రోజూ చీకటి పడితే చాలు దొంగలకు అడ్డాగా మారిపోతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు సెల్ఫోన్లు మాయం అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఎఫ్ఆర్ఎస్ విభాగంలో పనిచేస్తున్న శంకర్ అనే ఉద్యోగికి చెందిన ద్విచక్ర వాహనాన్ని పట్టపగలే అపహరించారు. ఇటీవల పీజీ డాక్టర్కు సంబంధించిన రూ.50 వేలకు పైగా విలువజేసే వాచ్ను పట్టపగలే చోరీ చేశారు. డాక్టర్ విధులు నిర్వర్తించే సమయంలో చేతికి ఉన్న వాచ్ను బ్యాగులో వేసుకోవడాన్ని పసిగట్టిన దొంగ చాకచక్యంగా కొట్టేశాడు. ఆత్మకూరు మండలం సింగంపల్లికి చెందిన ఓ మహిళ పిల్లలతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. మతిస్థిమితం లేని వ్యక్తి పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐదారు నెలల్లోనే అనేక ఘటనలు, ఘర్షణలు, దొంగతనాలు జరిగాయి. ఔట్పోస్టు సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు అంటున్నారు. త్వరలో ప్రక్షాళన చేస్తాం నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వాస్పత్రిని, ఔట్పోస్టు పోలీసుస్టేషన్ను తనిఖీ చేశాను. పోలీసు సిబ్బందితో పాటు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందితోనూ మాట్లాడాను. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశాను. త్వరలోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. నేరాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. – పుల్లయ్య, సీఐ, అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్ -
వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకు పోరాటం
కదిరి టౌన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకు పోరాటం చేస్తామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కదిరి మున్సిపల్ పరిధిలోని మాదవ గురుకులం పాఠశాల ఆవరణలో వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వాల్మీకి సంఘం నాయకుడు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకుడు బూదిలి సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశనికి ముఖ్య అతిథిగా పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం సీనియర్ నాయకులు కొట్టాల శ్రీరాములు, కర్ణాటక రాష్ట్ర వాల్మీకి సంఘం మహిళా అధ్యక్షురాలు మంజుల హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని వాల్మీకులను ఎస్టీలుగాను, మన రాష్ట్రంలో వాల్మీకులను బీసీలుగా గుర్తించడంతో వాల్మీకులు అన్ని రకాలుగా వెనుకబడ్డారన్నారు. వాల్మీకి సంఘం నాయకులు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతి వారం తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు నారాయణస్వామి, సోమశేఖర్, గోరంట్ల ఆదినారాయణ, అనిత, వాల్మీకి సంఘం నాయకులు గంగరాజు, ప్రసాద్, నాగరాజు, బొట్టుచంద్ర, మహేష్, కాళసముద్రం హరికృష్ణ, సురేష్, నరసింహులు, లోకేష్, జయసంహ, గోపాల్, మహిళా నాయకురాలు నాగేశ్వరి, సునంద వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి వీడాలి
హిందూపురం టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజ్జల ప్రసాద్రెడ్డి, గోపాల్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక అజీజియా ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కడియా మురళి, రాష్ట్ర బాధ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తున్న ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ రాయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. సీపీఎస్ జీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సీపీఎస్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ సుధాకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, జాఫర్ హుస్సేన్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఆనంద్, ఉదయ్ కుమార్, ముద్దు కృష్ణ, రాము, రాజగోపాల్, వసీం, శంకర్ నాయక్, రవి నాయక్, మనోహర్, కుమార్, హరి, తిరుపతయ్య, భీమప్ప తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని , ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. గతంలో ఇచ్చి, పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. కలెక్టరేట్కు రాకుండా www. meekosam. ap. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ కార్యాలయంలోనూ... పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో ఫిర్యాదు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్పుట్టపర్తి: రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్(మినిమం టైం స్కేల్) టీచర్లకు స్కూళ్ల కేటాయింపు కోసం సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం జేఎన్టీయూ రోడ్డులోని జిల్లా సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో అనధికారికంగా గైర్హాజరైనవారు, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభరోజు స్కూళ్లలో జాయిన్ కాని ఎంటీఎస్ టీచర్లకు రెన్యూవల్ చేయబోమన్నారు. ఎలుగుబంటి హల్చల్మడకశిర రూరల్: మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సింగేపల్లిలోని బీసీ కాలనీ వద్ద ఎలుగు బంటి హల్ చల్ చేసింది. ఆదివారం ఉదయం బీసీ కాలనీ వద్దకు వచ్చిన ఎలుగు బంటిని గమనించిన కుక్కలు మొరగడంతో కాలనీ వాసులు చూసి కేకలు వేశారు. దీంతో ఎలుగు పొలాల వైపు పరుగులు తీసింది. రాత్రి సమయంలో బయటికి వెళ్లేందుకు భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని గ్రామం వైపు ఎలుగు బంటి రాకుండా చూడాలన్నారు. రోడ్డుపై వరినాట్లు పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి దళిత కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ , స్థానికులు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాహ్మణపల్లిలో స్థానికులతో కలసి రహదారిపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పుట్టపర్తి మున్సిపాలిటీలో పలు దళిత కాలనీల్లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. తాగునీటి పైన్ లైన్ల కోసం జేసీబీలతో గుంతలు తవ్వి వదిలేశారన్నారు. సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కాలనీల్లో మౌలిక సదుపాయలు కల్పించడంలోనూ ఎమ్మెల్యే సింధూరారెడ్డి విఫలమయ్యారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ రోడ్లతో పాటు వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాద్రి, పార్వతి, నరసమ్మ, లక్ష్మీనరసమ్మ, గంగరత్న తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
పుట్టపర్తి టౌన్: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పుట్టపర్తి పట్టణంలో విద్యాగిరి ఆర్చ్ వద్ద జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్యభరధ్వాజ్, ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానాతో పాటు జిల్లాస్థాయి అధికారులు, సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా చేయడానికి స్థలం, ఖరీదైన పరికరాలు అవపరం లేదని ఇంట్లోలోనే సాధన చేసుకోవచ్చన్నారు. యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. అనంతరం 76 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుగ్గా యువకులకు స్ఫూర్తి ఇచ్చేలా యోగాసానాలు వేసిన నారాయణరెడ్డితో పాటు రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డీఆర్డీఓ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
ధర్మవరం అర్బన్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీఓ హోంలో ఏపీటీఎఫ్ జోనల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు బోధనానుభవం ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుదిబండగా మారిందన్నారు. దీంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్నారు. టెట్ మినహాయింపు వచ్చేలోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించి అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బీకే ముత్యాలప్ప, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సానే రవీంద్రరెడ్డి, బలరాముడు, శ్రీనివాసులు మాట్లాడారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వాసుకుమార్, నాయకులు శంకరనారాయణ, జగదీష్, దుర్గాప్రసాద్, రామకృష్ణ, చంద్రశేఖర్, బాలకదిరప్ప, బాలయ్య, నాగప్ప, శివయ్య, శ్రీనివాసులు, రవికుమార్, తిప్పన్న, చెన్నుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సవితా... మీ అభివృద్ధి ఇదేనా?
పెనుకొండ రూరల్: పెనుకొండ నగర పంచాయతీలో మురుగు రోడ్లపై పేరుకుపోయి కంపుగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఇదేనా మీ అభివృద్ధి అని మంత్రి సవితను ప్రశ్నించారు. 17వ వార్డు నారాయణమ్మకాలనీలో ఆదివారం ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ’ కార్యక్రమంలో ఉషశ్రీచరణ్ పాల్గొన్నారు. ప్రతి గడప తిరుగుతూ ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసున్నారు. పలువురు కాలనీ వాసులు రహదారిపై పేరుకు పోయిన మురుగు నీటి సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలు పడుతుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, సాయంత్రం పూట బయట కూర్చోలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. అనంతరం కాలనీలో రోడ్లపై నిలిచిపోయిన మురుగు నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. రోడ్లపై మురుగు నీరు ఎక్కడ పడితే అక్కడ నిలబడి పోయిందన్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతమంతా కంపు కొడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా నగర పంచాయతీలోని సమస్యలను మంత్రి సవిత పట్టించుకున్న పాపానపోలేదన్నారు. నగర పంచాయతీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని డప్పు కొడుతున్నారని, క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయని విమర్శించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేశారా? ఎన్నికల ప్రచారం కోసమే సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాడుకున్నారని ఉషశ్రీచరణ్ విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని తప్పుడు ప్రచారం చేశారని, రెండేళ్లలో ఎంత మందిని వెతికి తీసుకువచ్చారో చెప్పాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో గాదే సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేదాకా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్రెడ్డి, మాజీ మండల కన్వీనర్ నాగళూరు బాబు, నాయకులు టెంపో శీనా, మహ్మద్, ఎంసీ నారాయణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎంఎన్ మూర్తి. సద్దాం బాబు, యాసిన్, శేషాద్రి, బోయ రాము, కొండల రాయుడు, విజయ్ కుమార్ రెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. మురుగు నీటిలో వరినాట్లు వేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
వైఎస్సార్సీపీ నాయకుడి కార్యాలయంపై దాడి
తాడిపత్రిటౌన్: పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి కార్యాలయంపై టీడీపీకి చెందిన మౌలాలి, షఫీతోపాటు మరో ముగ్గురు ఆదివారం దాడి చేశారు. ఇనుప రాడ్లతో కార్యాలయ తాళాలు ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించారు. అందులోని టీవీ, రెండు ఏసీలతో పాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూటమి నేతల బాహాబాిహీ సాక్షి టాస్క్ఫోర్స్: రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్ పెట్రోల్ బంకు వద్ద కూటమి నేతలు ఇద్దరు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. ఆదివారం సాయంత్రం పెట్రోల్ వద్ద టీడీపీ నాయకుడు బుడేపల్లి సుభాన్కు బీజేపీనాయకుడు నాగిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదలు జరిగి, ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ గొడవ పడినట్లు తెలిసింది. గొడవ కారణంగా పెద్ద ఎత్తున జనం గూమిగూడారు. ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువురినీ స్టేషన్కు తీసుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. రోడ్డుపైనే టీడీపీ, బీజేపీ నాయకులు భౌతిక దాడులకు దిగడంతో వారి మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోట ఊరువాకిలిలో పీర్ల ప్రతిష్టపై వివాదం రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ఊరువాలికిలో ఆదివారం పీర్ల ప్రతిష్టపై ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఊరువాకిలి స్థలంలో పీర్లను ప్రతిష్టిస్తూ వస్తున్నారు. మొహర్రం సందర్భంగా నిర్వాహకులు పీర్లను కొలువు దీర్చుతుండగా, వీహెచ్పీ, హెరిటేజ్ అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకొని అభ్యంతరం తెలిపారు. రూ.80 లక్షలతో కోట ముఖద్వారం ఊరువాకిలి జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్న ప్రదేశమని, ఇకపై ఇక్కడ పీర్ల పండుగ జరుపరాదని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశః ఉండడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. -
కవులు, రచయితలకు ప్రోత్సాహం అభినందనీయం
హిందూపురం టౌన్: కవులు, రచయితలను ప్రోత్సహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టీచర్స్కాలనీలోని తపన సాహిత్య వేదిక కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించి తపన సాహిత్య వేదిక, అరసం ఆధ్వర్యంలో కవి, రచయిత సడ్లపల్లె చిదంబరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సడ్లపల్లె కథా పురస్కారం, తపన సాహిత్య వేదిక సేవా పురస్కారం ప్రదానం చేశారు. రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, ప్రముఖ కవి కథకుడు శాంతి నారాయణ, రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, కవులు తూముచెర్ల రాజారాం, అడవాల శేషగిరి రాయుడు, పులివెందల వెంకట కొండారెడ్డి, యాములపల్లి నర్సిరెడ్డి, దక్షిణ భారత హిందీ ప్రచార సభాధ్యక్షులు పోలిశెట్టి ఓబయ్య పాల్గొన్నారు. సడ్లపల్లె కథా పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెందిన పర్కపెల్లి యాదగిరి ‘పొలిమేర దాటే వేళ‘ అనే కథా సంపుటికి, తపన సాహిత్య వేదిక అందించే ‘మట్టి మనిషి‘ సేవా పురస్కారాన్ని కర్నూలు జిల్లా, కోయిలకుంట్లకు చెందిన వ్యవసాయదారుడు, రైతు గంగిరెడ్డి సుధాకర్ రెడ్డికి అందజేశారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.5వేల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో కవి సడ్లపల్లె చిదంబరరెడ్డి , అరసం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, ఏటిగడ్డ అశ్వర్ధ నారాయణ, యువ కవి గంగాధర్, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నిరసనలు
ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టడానికి సమాయత్తమయ్యారు. ఆర్టీసీ యూనియన్లన్నీ ఏకమై మంగళవారం నుంచి పోరాటం చేయనున్నాయి. ఈ ఉద్యమాన్ని నడపించేందుకు వివిధ యూనియన్ల నాయకులు జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. మడకశిర: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో మడకశిర, హిందూపురం,ఽ ధర్మవరం, కదిరి, పెనుకొండ, పుట్టపర్తిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో వేలాది మంది ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసేలా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడానికి అడుగులు వస్తోంది. దీన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ బస్సులను ప్రభుత్వం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపకుండా ప్రైవేట్ వారికి అప్పగించింది. ఈ చర్యను ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలోనే విద్యుత్ బస్సులను నడపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బస్సులను సాకుగా చూపుతూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలోని పలు డిపోలను ప్రైవేట్ వారికి అప్పగించింది. దాదాపు 11 డిపోలను ప్రైవేట్ వారికి అప్పగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పీఆర్సీని కూడా అమలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సీ్త్రశక్తి పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న సాకులు చూపి ఆర్టీసీ కార్మికులకు పనిష్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు అనేక డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్న కార్మికులు విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్వారికి అప్పజెప్పకూడదని డిమాండ్ రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనలుజిల్లా వ్యాప్తంగా ఈనెల 23, 24న ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలోనే నిరసనలు చేయనున్నారు. తొలి దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల ఎదుట నిరసనలు తెలుపనున్నారు. ఎర్ర బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతారు. అంతే కాకుండా గేట్ మీటింగ్లు నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించనున్నారు. ఆ తర్వాత జేఏసీ నాయకులు రెండో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని స్థానిక జేఏసీ నాయకులు చెబుతున్నారు. -
కళ్యాణదుర్గంలో రెండిళ్లలో చోరీలు
కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో శనివారం రాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. స్థానిక జయనగర్ కాలనీలోని సుధాకర్ ఇంటి తాళం ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించి బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే ఇంట్లో మరో గదిలో ఉన్న లాకర్ తెరిచేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. అదే కాలనీల్లో మరో ఇంట్లో దొపిడీకి యత్నించారు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంట్లో ఎలాంటి నగదు దొరక్క వెళ్లిపోయారు. ఉదయం ఇంటి యజమానులు ఇంటితాళాలు తెరిచి ఉండటతో దొంగతనం జరిగినట్లు భావించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో పశువుల దొంగలు ఉరవకొండ: ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగలు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని వై.రాంపురం గ్రామానికి చెందిన కొందరు రాత్రి సమయాల్లో గ్రామాల్లో పశువులను ఎత్తుకెళ్లి, వాటిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దొంగలను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమో,బస్సు ఢీకొని ఒకరి మృతి లేపాక్షి: మండలంలోని పులమతి వద్ద ఆదివారం సు మో, ప్రైవేట్ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో హీరేబిదనూరుకు చెందిన సరోజమ్మ (50) మృతి చెందింది. వివరాలు.. కర్ణాటకలోని హీరేబిదనూరుకు చెందిన సరోజమ్మ సుమోలో వెళ్తుండగా, అదే సమయంలో హిందూపురం వైపు నుంచి పులమతి వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొనింది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న సరోజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సుమో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిరుత కలకలం కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని రాయదుర్గం రోడ్డు సమీపంలో ఆదివారం చిరుత స్థానికులకు తారస పడింది. దీంతో చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో చిరుత పక్కనే ఉన్న కొండల్లోకి పరుగుతీసింది. కళ్యాణదుర్గం కొండ ప్రాంతాల్లో చిరుత కనిపిస్తోందని అనేకసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన చెందారు. -
మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి తప్పిన ప్రమాదం
పుట్టపర్తి: మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలో ఆయన కాన్వాయ్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి శ్రీధర్రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. గన్మెన్, డ్రైవర్తో సహా నలుగురు వైఎస్సార్సీపీ నాయకులు గాయపడ్డారు. వివరాలు.. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, అపర్ణారెడ్డి దంపతులతో పాటు మరికొందరు ముదిగుబ్బ సమీపంలో జరుగుతున్న ఓ శుభ కార్యానికి పుట్టపర్తి నుంచి ఆదివారం ఉదయం మూడు వాహనాల్లో బయలు దేరారు. మొదటి వాహనంలో శ్రీధర్రెడ్డి దంపతులు, మిగిలిన రెండు వాహనాల్లో వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్నారు. అయితే బుక్కపట్నం మండల పరిధిలోని బుచ్చయయ్యగారిపల్లి సమీపంలో 342 జాతీయ రహదారిపై హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులకు ఉపయోగిస్తున్న టిప్పర్ ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఒక్కసారి కుడివైపు తిరిగింది. దీంతో వెనుకనే వస్తున్న స్కార్పియో వాహనాన్ని టిప్పర్ ఢీ కొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నారాయణరెడ్డి, తిరుపాల్రెడ్డి, గన్మెన్ రామమోహన్రెడ్డి, భాస్కర్, డ్రైవర్ హర్ష, సుధాకర్లకు గాయాలయ్యాయి. అయితే శ్రీధర్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం 50 మీటర్లకు పైగా ముందుగా వెళ్తుండటంతో ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను హుటాహుటిన పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి క్షతగాత్రులకు చికిత్స చేయించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. చికిత్స పొందుతున్న వారిని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. కాన్వాయ్ని ఢీకొన్న టిప్పర్ సురక్షితంగా బయట పడిన శ్రీధర్రెడ్డి దంపతులు డ్రైవర్, గన్మెన్తో సహా ఆరుగురికి గాయాలు -
కాశీంస్వామికి నిత్య పూజ నివేదన
బత్తలపల్లి:మొహర్రంలో భాగంగా బత్తలపల్లిలో కాశీంస్వామికి శనివారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. ఉదయం ముజావర్లు టైలర్ రియాజ్, నూరుల్లా, మాభాషా, కాశీంవలిలు కాశీంస్వామి చావిడిలో ఫాతెహ చేశారు. మండలంలోని గంటాపురం, ముష్ఠూరు, మాల్యవంతం, సంజీవపురం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం తదితర గ్రామాల్లో వేడుకలకు అంకురార్పణ చేశారు. ఎస్ఐ సోమశేఖర్ వివిధ గ్రామాల పెద్దలు, ముజావర్లతో పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి చర్చించారు. పోలీసుల అనుమతి లేకుండా ఉత్సవాలు నిర్వహించరాదన్నారు. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్, ఎస్ఐ తెలిపారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి పుట్టపర్తి టౌన్: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. శనివారం పెనుకొండ పట్టణంలోని ఎన్ గార్డెన్ కన్వెన్షన్ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి కేసులోనూ పక్కాగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సమాజానికి హానికరంగా మారిన వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. రౌడీషీటర్లకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు.ఆర్టీసీ బస్టాండుల్లో చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నైట్ విజన్ డ్రోన్లతో నిఘా పెంచాలన్నారు. ఆలయాలు, వీధుల్లో, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు పునారావృతం కాకుండా చూసుకోవాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. అవార్డులు పొందిన వారిలో గోరంట్ల సీఐ శేఖర్, కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి, ధర్మవరం వన్టౌన్ సీఐ రెడ్డెప్ప, కదిరి రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, హిందూపురం సీఐ రాజగోపాల్నాయుడు, సీకేపల్లి సీఐ సత్యనారాయణ ఉన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు అంకిత సురానా, కేవీ మహేష్, డీఎస్పీలు నర్సింగప్ప, శివనారాయస్వామి, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐలు నరేంద్రరెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరంలో యువకుడికి మలేరియా పాజిటివ్ ధర్మవరం అర్బన్: పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో లోకేష్ అనే యువకుడికి శనివారం మలేరియా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. విషయం తెలుసుకున్న అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు జయంతికుమార్, మలేరియా సబ్ యూనిట్ నివారణ అధికారి జయరామ్నాయక్ ప్రభుత్వ ఆసుపత్రిలో లోకేష్ను చేర్పించి వైద్యమందించారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది కాలనీలోని ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేశారు. 200 మందికి రక్తపరీక్షలు చేయించారు. దోమలు ప్రబలకుండా స్ప్రే చేశారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఓడీచెరువు: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే సమాజం శుభ్రంగా ఉన్నట్లేనని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఓడీచెరువులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్తరహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. అనంతరం చెరువు మరువ ప్రాంతంలో చెత్తాచెదారం, ముళ్ల కంపలను తొలగించారు. స్వచ్ఛభారత్ కార్మికులను సన్మానించారు. విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ను తనిఖీ చేవారు. ఐసీడీఎస్ కార్యాలయంలో గర్భిణులకు సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సమత, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శివరాంప్రసాద్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజనప్ప, హెచ్ఎం శిరీషా, ఎంఈఓలు సురేష్, రమణ పాల్గొన్నారు. ‘సర్’కు సహకరించండి ప్రశాంతినిలయం: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అనర్హుల పేర్లు తొలగించేలా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
చాలు.. ఇక ఆపండి బాబూ
కదిరి: ఎన్నికలకు మునుపు ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను నిలువునా మోసగించి, ఇప్పుడు విజయోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ‘రైతులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, ఉద్యోగులు, నిరుద్యోగులు..ఇలా అన్ని వర్గాలను మోసగించి ఈ సంబరాలేంటి?’ అని జనం మండిపడుతూ ‘నవ్విపోదురుగాక.. మాకేటి సిగ్గు’ అనే సామెతను గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారంటీ’ పేరుతో డిజిటల్ సంతకాలు పెట్టి మరీ గ్యారంటీ పత్రాలను అందించారనీ, అయితే ‘భవిష్యత్ గ్యారంటీ కాదు..మోసం గ్యారంటీ’ అని చెప్పినట్లయితే బాగుండేది..’ అంటూ మండిపడుతున్నారు. ఆడబిడ్డలకు అన్యాయం.. 18 ఏళ్లు నిండి 60 ఏళ్లు లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ నయాపైసా ఇవ్వలేదు. ఒక్కో మహిళకు చంద్రబాబు రూ. 36 వేలు బాకీ అని మహిళలు గుర్తు చేస్తున్నారు. ఆపండి ‘గ్యాస్’ కబుర్లు.. ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ‘ముందు మీరు డబ్బు పెట్టి గ్యాస్ కొంటే తర్వాత మీ అకౌంట్లోకి ఆ డబ్బు జమ చేస్తాము’ అని చెప్పారు. క్షేత్ర స్థాయిలో చూస్తే గ్రామానికి ఐదారు గురికి తప్పా మిగిలిన ఎవరికీ ఆ డబ్బు జమ కాలేదు. ఉద్యోగం లేదు..భృతి లేదు.. ఇంటికో ఉద్యోగం..లేదంటే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఊదరగొట్టారు. ఇంత వరకూ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అసలే లేదు. ఆ ఇచ్చిన టీచర్ ఉద్యోగాలు సైతం తమకు కావాల్సిన వారికి అమ్ముకున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఏదీ? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇంత వరకూ ఆ ఊసే లేదు. అలాగే ఉన్న పింఛన్లలోనే కోత విధించారు. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు ఖరీదైన ఉచిత వైద్యం ఇప్పుడు అందడం లేదు. ఎంతోమంది పేద, మధ్య తరగతి వారు డబ్బుపెట్టి వైద్యం చేయించుకోక తప్పలేదు. వ్యవ‘సాయం’ ఏదీ? రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామన్న డబ్బు మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే డబ్బుతో సంబందం లేకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, చంద్రబాబు సర్కారు రైతులను మోసం చేసింది. అలాగే ఉచిత పంటల బీమాకు చంద్రబాబు పూర్తిగా మంగళం పాడారు. ప్రీమియం చెల్లించిన రైతులకు కూడా బీమా సొమ్ము ఇవ్వలేదు. వలంటీర్లకు రూ.10 వేలు ఎక్కడ? వలంటీర్లకు జగన్ ప్రభుత్వం రూ.5 వేలు మాత్రమే జీతం ఇస్తోందని,తాము అధికారంలోకి రాగానే వారికి నెలకు రూ. 10 వేలు ఇస్తామని బాబుతో పాటు పవన్ ప్రగల్బాలు పలికారు.అధికారంలోకి రాగానే జీతం పెంపు సంగతి దేవుడెరుగు ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. హామీలను విస్మరించి కూటమి నేతల సంబరాలు మండిపడుతున్న జనం నిరుద్యోగ భృతి ఏదీ అంటున్న నిరుద్యోగులు ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తావంటూ మహిళల నిలదీత -
నీట్ పునఃపరీక్షకు సర్వం సిద్ధం
అనంతపురం సెంట్రల్/ అనంతపురం అర్బన్: నీట్–2026 పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం నగరంలోని శ్రీ సాయిబాబా నేషనల్ (ఎస్ఎస్బీఎన్) డిగ్రీ కళాశాలలోని నీట్ సెంటర్లో ఏర్పాట్లను ఎస్పీ జగదీష్, కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ శాంతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నీట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్షా కేంద్రంలో ఉండాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు తప్ప బయటవారిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరాదన్నారు. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా బయోమెట్రిక్ పరిశీలన చేయాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, నెట్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని, సీసీటీవీలు సజావుగా పనిచే సేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు సజావుగా నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. హాజరుకానున్న 3,959 మంది విద్యార్థులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. 3,959 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాల, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల, ఎస్కేయూ, ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, గుత్తిలో కేంద్రీయ విద్యాలయం, గుత్తి జెడ్పీగర్ల్స్ హైస్కూల్లో నీట్ జరుగుతుందన్నారు. ● డీఆర్వో మలోల నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని, కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్తులు ఈ– అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపుకార్డుతో పరీక్షకు హాజరుకావాలన్నారు. ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేపర్ లీక్ను అరికట్టేందుకు కేంద్ర బలగాల ఎస్కార్ట్, జిల్లా పోలీసు బందోబస్తు మద్య ప్రశ్నపత్రం, జవాబు పత్రాలు తరలిస్తామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆద్వర్యంలో నిర్వహించే ఈ పరీక్ష అత్యంత కీలకమైందని, సజావుగా నిర్వహించేలా అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలు -
50 ఏళ్లకే పింఛన్ ఏదీ?
మాది బెస్త సామాజిక వర్గం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. రెండేళ్లయినా ఇంత వరకూ అతీగతీ లేదు. నాకు 58 ఏళ్లు. పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాను. అధికారులను అడిగితే చంద్రబాబునే అడుగు..అని అంటున్నారు. – జి.గోవిందు, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం ఏం సాధించారని సంబరాలు టీడీపీ నేతలు ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు?. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టినందుకా?. నిరుద్యోగ భృతి ఇవ్వనందుకా?. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మోసం చేసినందుకా?. ఉచిత పంటల బీమాకు మంగళం పాడినందుకా? లేదంటే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినందుకా?. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ -
ఘనంగా రెవెన్యూ దినోత్సవం
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో శనివారం జిల్లా స్థాయి రెవెన్యూ దినోత్సవాన్ని జేసీ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల నిరంతర సేవలో మమేకమైన పురాతన శాఖ రెవెన్యూ అని కొనియాడారు. ప్రజా సంక్షేమానికి వారధిలా పని చేస్తుందన్నారు. రైతాంగానికి మరింత మెరుగైన, వేగవంత మైన సేవలు అందించేందుకు ప్రతి రెవెన్యూ ఉద్యోగి సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. సుదీర్ఘంగా సేవలు అందించిన విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, గోపాలక్రిష్ణ, తహసీల్దార్ చలపతి, డీటీలు గుప్తా, నాగార్జునశెట్టి, నారాయణస్వామి, జూనియర్ సహాయకులు బాబా, వీఆర్ఓ లక్ష్మీనారా యణరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ భారతి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజులూ ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీ 3.2 మి.మీ, 22న 3.8 మి.మీ, 23న 2.2 మి.మీ, 24న 1.7 మి.మీ సగటువర్షపాతం నమోదు కావొచ్చన్నారు. అక్కడ క్కడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీస్తుందన్నారు. కనీసం 20 మి.మీ వర్షపాతం నమోదైతే పంటలు విత్తుకునేందుకు అనుకూలమని పేర్కొన్నారు. -
పేదలపై కార్పొరేట్ పంజా
ధర్మవరం: సిల్క్సిటీగా పేరుగాంచిన ధర్మవరంలో డీమార్ట్, లెన్స్కార్ట్లతో పాటు పలు కార్పొరేట్ కంపెనీలు షాపింగ్మాల్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాయి. స్థానిక పోతుకుంట రోడ్డులో డీమార్ట్ ఏర్పాటుకు నిర్వాహకులు స్థలం కొనుగోలు చేయడంతో పాటు లెన్స్కార్ట్ వారు (కంటి అద్దాల షాపు) షోరూం ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో చిరు వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. ఇకపై తమ పరిస్థితి ఏమిటంటూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇటీవల మంత్రి సత్యకుమార్ను కలిసి కార్పొరేట్లకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అయితే, సీఎంతో చర్చిస్తానని మంత్రి సెలవివ్వవడంతో ఒక్కసారిగా వారిపై పిడుగు పడినట్లయింది. గతంలో నానాయాగీ.. ఎన్నికలకు ముందు ధర్మవరంలో ఓ షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తుంటే ‘కూటమి’ పార్టీల నాయకులు నానాయాగీ చేశారు. చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందంటూ మొసలికన్నీరు కార్చారు. అలాంటి వారు నేడు మౌనవత్రం పాటించడం విమర్శలకు తావిస్తోంది. పైగా షాపింగ్మాల్ వారు నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ అండ్ సేఫ్టీ లేకుండా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నా కనీసం ప్రశ్నించే పాపాన పోవడం లేదు. ముడుపుల రూపంలో కోట్లాది రూపాయలు ముట్టడంతోనే మౌన వత్రం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో కార్పొరేట్ శక్తులు సామాన్య వ్యాపారులపై పంజా విసురుతున్నాయి. పేద, మధ్య తరగతి జీవనోపాధిని దెబ్బకొట్టి జీవితాలు అంధకారంలోకి నెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ విషయంపై చిరు వ్యాపారులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. సిల్క్ సిటీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కార్పొరేట్ సంస్థలు కిరాణా వ్యాపారం నుంచి ఫుట్వేర్ల దాకా అన్నింట్లోనూ పాగా గతంలో ఓ మాల్ ఏర్పాటుపై ‘కూటమి’ నాయకుల రాద్ధాంతం అధికారంలోకి వచ్చాక మౌనవ్రతం నాడు అలా.. నేడు ఇలా..రూ.కోట్లు వెచ్చించే ‘కార్పొరేట్ల’ను సామాన్యులు ప్రశ్నించే పరిస్థితి ఉండదు.అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా మౌలిక వసతులు కల్పించని కార్పొరేట్ స్కూళ్లపై అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రంగా స్పందించడమే ఇందుకు నిదర్శనం. పాఠశాలలకు వెళ్లి ఆధార సహితంగా నిలదీయడంతో దిక్కుతోచని నిర్వాహకులు తట్టాబుట్టా సర్దుకున్నారు. దీంతో స్థానిక పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి.చంద్రబాబు హయాంలో మాత్రం కార్పొరేట్లు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారింది. -
దొంగల ముఠా అరెస్టు
ధర్మవరం అర్బన్: తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర గజదొంగతో పాటు మరో ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దొంగల అరెస్టు చూపించారు. అనంతరం వన్టౌన్ సీఐ రెడ్డెప్ప, రూరల్ సీఐ ప్రభాకర్లతో కలిసి ఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన మల్లెల వీరాంజనేయులు అలియాస్ వడ్డె రామంజినేయులు గత 25 ఏళ్లుగా చోరీలు చేస్తూ జీవిస్తున్నాడన్నారు. అదే కాలనీకి చెందిన సాకే నరసింహులు, దేవరకొండ విజయ్, గుజ్జల నారాయణమ్మ ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకునేవారని చెప్పారు. ద్విచక్ర వాహనంలో రెక్కి నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకునేవారని పేర్కొన్నారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదుగా మార్చుకునేవారన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యేక నిఘాతో దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆటో, రూ.14.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన రూ.17 లక్షల విలువైన 13 తులాల బంగారు నగల రసీదులు, దొంగతనానికి ఉపయోగించిన ఆయుధాలు, నాలుగు సెల్ఫోన్లు, రూ.22 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు అంతఃరాష్ట్ర దొంగ.. ప్రధాన నిందితుడు మల్లెల వీరాంజనేయులుపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వన్టౌన్ పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీట్ నం.749 కొనసాగుతోంది. 25 ఏళ్లుగా పాత నేరస్తులతో సంబంధాలు కొనసాగిస్తూ వన్టౌన్, టూటౌన్, రూరల్, కదిరి, ములకలచెరువు, ఎన్పీ కుంట, అనంతపురం వన్ టౌన్, టూ టౌన్, అనంతపురం రూరల్, కడప, పులివెందుల, రాయచోటి, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు, కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 30 నుంచి 40 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. సాకే నరసింహులుపై రౌడీషీట్ ఉందన్నారు. త్వరలో వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. దొంగలను అరెస్టు చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన రూరల్ సీఐ ప్రభాకర్, వన్టౌన్ సీఐ రెడ్డెప్ప, ఎస్ఐలు రాజశేఖర్, ఉమాదేవి, వీరేష్ తదితరులను ఎస్పీ అభినందించారు. 16 కేసుల్లో రూ.14.50 లక్షలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ధర్మవరం అర్బన్: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయమని కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్లు తెలిపారు. శుక్రవారం వారు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో ‘‘ఒక నెల– ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇన్చార్జ్ ఆర్డీఓ సువర్ణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 72 అర్జీలు అందాయి. కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, తహసీల్దార్ దేవరాజ్, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ● బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామానికి చెందిన రైతులు పార్వతమ్మ, కృష్ణమూర్తి, తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు చెందిన భూములకు ఎన్ఓసీ మంజూరు కాగా, డీపట్టా పేరుతో ఉన్న ఆయా భూములను ‘పట్టా’గా సవరణ చేసి క్రయవిక్రయాలు జరుపుకునే వెసులుబాటు కల్పించారు. ● ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామానికి చెందిన అంబటి హరినాథ్గుప్తాతోపాటు మరో 124 మంది సర్వే నంబర్ 905–ఏలోని 3.28 ఎకరాల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోగా, ఆ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు. విద్యాసామగ్రి అందించాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యాసామగ్రి అందించాలని పీఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర కలెక్టర్ శ్యాంప్రసాద్కు విన్నవించారు. ఈ మేరకు ‘‘ఒక నెల– ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’’ కార్యక్రమంలో కలెక్టర్కు అర్జీ అందించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కలు, బూట్లతో కూడిన కిట్లు పూర్తిగా అందించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నీచర్, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
సంబరాలకు మేం రాలేం
‘‘రెండేళ్లలో ఏం చేశాం మనం...ఒక్క పింఛన్ ఇవ్వలేదు...ఒక్క రేషన్ కార్డు అందివ్వలేదు. పైగా ఉన్న పింఛన్లు పీకేశాం..ఆరోగ్యశ్రీకి మంగళం పాడాం...రైతు కోసం సరైంది ఒక్క పథకమూ అమలు చేయలేకపోయాం..రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయాం..ఇప్పుడు సంబరాలు చేసుకుంటే జనం తంతారు..నేనైతే రాను’’ .. రెండేళ్ల విజయోత్సవ సభకు రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధితో హిందూపురంలోని ఓ నాయకుడి చేసిన వ్యాఖ్యలివి. కూటమి నేతలంతా ఇలాగే భావించడంతో శుక్రవారం హిందూపురంలో నిర్వహించిన సభ జనం లేక వెలవెలబోయింది. చిలమత్తూరు: వెండితెరపై వేలాదిమందిని ఒంటిచేత్తే మట్టికరిపిస్తూ హిట్ కొట్టే బాలకృష్ణ...సొంత నియోజకవర్గంలో అట్టర్ఫ్లాప్ అయ్యారు. నమ్మి ఓటేసిన ప్రజల సంక్షేమాన్ని పీఏలకు వదిలి హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన బాలకృష్ణకు హిందూపురం నియోజకవర్గ వాసులు ఇప్పుడిప్పుడే షాకులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘రెండేళ్లు’ విజయోత్సవ సభ అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఈ క్రమంలో హిందూపురంలోనూ ఎమ్మెల్యే పీఏలు కార్యక్రమం తలపెట్టారు. భారీగా జన సమీకరణ చేసి తామేందో చూపాలనుకుని పట్టణం నడిబొడ్డున ప్రధాన రహదారిపై సభ ఏర్పాటు చేశారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సభకు నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలున్నా, ఎవరూ ఈ సభపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వేసిన కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో స్థానిక చోటా లీడర్లు దారివెంట వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో హడావుడిగా కార్యక్రమం ముగించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అట్టర్ఫ్లాప్ కావడంతో అధిష్టానానికి ఏం సమాధానం చెప్పాలా అని ఎమ్మెల్యే పీఏలు ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమే కారణమా..? సంక్షేమం, అభివృద్ధి అంటూ టీడీపీ నేతలు ప్రచారం హోరెత్తిస్తన్నా... వాస్తవం మరోలా ఉంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కడం ఒక ఎత్తయితే, అభివృద్ధి పేరిట నేతలు చేస్తున్న అవినీతి మరో ఎత్తు. ఎటు చూసినా వసూళ్ల్లకు పాల్పడుతూ సామాన్యులు, చిరు వ్యాపారులపై చేస్తున్న ఆకృత్యాలు ప్రజల్లో బలంగా వెళ్లడంతో విజయోత్సవాలపై కేడర్ ఆసక్తి చూపలేదనే చర్చ సాగుతోంది. ఇక టీడీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, కూటమి నేతలతోనూ సఖ్యత కొరవడటంతో విజయోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ‘రెండేళ్ల’ విజయోత్సవ సభలో పాల్గొనని కూటమి నేతలు జనానికి ఏమీ చేయకుండా సంబరమంటే తంతారని ఆవేదన హిందూపురంలో వెలవెలబోయిన సభ -
ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
గుత్తి: పట్టణంలోని కోట నేసే వీధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని అఫ్రీన్ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలమేరకు.. అఫ్రీన్ తల్లి ఖైరూన్బీతో కలిసి కోట నేసే వీధిలో నివస్తోంది. ఆమె తండ్రి హైదరాబాద్లో పనికోసమని ఆర్నెళ్ల క్రితం వెళ్లాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా.. మొదటి కుమార్తెకు వివాహమైంది. అఫ్రీన్ గుంతకల్లులోని ఓ డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఫ్రీన్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లి ఖైరూన్బీ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చూపరుల సైతం కంట తడి పెట్టారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ అమీర్ఖాన్ పరిశీలించారు. అయితే ఉరి వేసుకున్న ప్రాంతంలో అఫ్రీన్ కాళ్లు ఫ్లోర్కు ఉన్న బండలకు ఆనుకుని ఉన్నాయి. దీంతో ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల చేతిలో సూసైడ్ నోట్ పోలీసులకు అఫ్రీన్ రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తండ్రి సరిగా చూసుకోవడం లేదని, ఒంటరిగా ఉండాల్సి వస్తోందని, తల్లికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నానని నోట్ రాసింది. ఇక జీవించడం తనకు ఇష్టం లేదని, చనిపోతున్నానని రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సూసైడ్ నోట్ను పోలీసులు బయటకు పెట్టలేదు. -
మొహర్రం ప్రశాంతంగా జరుపుకోండి
కనగానపల్లి: మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని తూంచర్ల, భానుకోట గ్రామాల్లో పర్యటించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మొహర్రం వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే వేడుకలు నిర్వహించుకోవాలని, అందరూ సోదర భావంతో మెలగాలన్నారు. ఆమె వెంట రామగిరి సీఐ మహమ్మద్ అలీ ఉన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి పుట్టపర్తి అర్బన్: సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన అన్నారు. శుక్రవారం కొత్తచెరువులోని సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ఆపరేషన్ దండయాన్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎస్పీ మాట్లాడుతూ... విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన ఉండాలన్నారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలు వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఇవ్వకూడదన్నారు. ఎక్కడైనా వేధింపులకు గురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతిర్లత, సీఐ రాజశేఖర్, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ధర్మవరం అర్బన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం డివిజన్స్థాయి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే సూచనలు ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీల పరిధిలో ఆన్లైన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. చిన్నపిల్లలు, గర్భిణులకు కచ్చితంగా టీకాలు వేయించాలని, పెండింగ్లో ఉన్న ఆన్లైన్ వర్క్ అంతా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో జరిగే పల్స్పోలియో కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అనుపమ జేమ్స్, జిల్లా మలేరియా నివారణాధికారి చెన్నారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ భాగ్యలక్ష్మి, డివిజన్లోని వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం పెద్దపప్పూరు: అప్పుల వాళ్ల బెదిరింపులు తాళలేక పురుగుల మందుతాగి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన పెద్దపప్పూరు మండలంలోని పసలూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గురునాథ్, రాజేశ్వరి దంపతులు. గురువారం సాయంత్రం ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు గురునాథ్ పోలీసుస్టేషన్కు వెళ్లాడు. అయితే పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న రాజేశ్వరిని కొందరు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు చికిత్స నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల వాళ్లు బెదిరింపులకు దిగడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. -
సార్ లేరు.. ఈరోజు రారు!
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడటంతో కార్యాలయాలకు కూడా సరిగా రావడం లేదు. ఎప్పుడైనా వచ్చినా... ‘‘వచ్చామా.. వెళ్లామా’’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు తప్ప మిగతా ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే వారు అందుబాటులో ఉండరు. ఫోన్ కాల్స్కు స్పందించరు. ఎవరైనా నేరుగా కార్యాలయానికే వెళ్లి ‘సార్’ ఎక్కడ అని ప్రశ్నిస్తే... ఆఫీసర్ ఫీల్డ్కు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంది. వారాంతపు దినాల్లో ఒక రోజు ముందుగానే అంటే శుక్ర లేదా శనివారాల్లో మధ్యాహ్నం 3 గంటలకే చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సీట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. పౌర సరఫరా, మున్సిపల్, రెవెన్యూ, మత్స్యశాఖ, పుడా, మార్కెటింగ్, పంచాయతీ, ఆర్ అండ్ బీ, విద్యా శాఖలో ఉన్నతాధికారులు కార్యాలయాల్లో సరిగా ఉండటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా ట్రెజరీ, వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించలేదని జనమే చెబుతున్నారు. ఇక వైద్య, ఆరోగ్య శాఖలో ఎవరు ఏ విభాగంలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. చాలామంది అనంతపురం నుంచి వచ్చి వెళ్తుండటంతో అవసరాల ఆధారంగా ఫీల్డ్ పేరుతో డుమ్మా కొడుతున్నారు. అనంతపురం నుంచి వచ్చే అధికారులంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి రైలు కోసం వేచి చూస్తూ ఆఫీసు నుంచి ఆటో ఎక్కి టక్కున స్టేషన్కు వెళ్లిపోతున్నారు. మంగళ, గురు, శని వారాల్లో కొండవీడు రైలు ఉన్నందున మధ్యాహ్నం 3 గంటలకే సుమారు 100 మంది పైగా డ్యూటీ మధ్యలో వెళ్తున్నారు. పర్యవేక్షించే అధికారి అంతకంటే ముందే ఫీల్డ్కు వెళ్తున్న కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన ఇష్టారాజ్యంగా ఉంది. ‘ఫీల్డ్’ పేరుతో చాలా మంది అధికారులు కార్యాలయం నుంచి వెళుతూ..కింది స్థాయి వారికి బాధ్యతలు అప్పగించి వెళ్తున్నారు. అయితే ఇన్చార్జ్గా వ్యవహరించే అధికారి మాట ఎవరూ వినడం లేదు. వారం రోజుల క్రితం వైద్య, ఆరోగ్య శాఖలో అధికారి లేని సమయంలో సిబ్బంది తన్నుకున్నారు. సివిల్ సప్లై విభాగంలో అధికారులు ఆఫీసులో వారానికి ఓసారి కూడా కనిపించడం కష్టంగా మారింది. పుట్టపర్తి మండల రెవెన్యూ అధికారులు భూ సేకరణ పనులతో నిత్యం ఫీల్డ్లో ఉన్నామనే చెబుతున్నారు. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ పేరుతో మున్సిపల్ సిబ్బంది ఇంటికెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులతో మీటింగులు ఉన్న రోజుల్లో మాత్రమే ఆఫీసుల్లో కనిపిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడంతో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. కొందరు దళారీ అవతారమెత్తి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరికీ డబ్బు ఇవ్వకుంటే పనులు ముందుకు కదలవు. ట్రెజరీ, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో దళారీల రాజ్యం నడుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచే రాకపోకలు మీటింగు ఉంటేనే ఆఫీసుకు.. లేదంటే ఎగనామం గట్టిగా నిలదీస్తే..ఆఫీసర్ ఫీల్డ్కు వెళ్లారని సిబ్బంది కవరింగ్ ఇన్చార్జిలకు అప్పజెబుతూ.. దళారులదే రాజ్యం.. మూడు గంటలకే ప్యాకప్.. -
నమ్మితే నట్టేట మునిగినట్టే!
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ప్రాథమిక అంశాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఫేక్ వీడియో చూసిన పలువురు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వీరి సంఖ్య రోజూ వందల్లో ఉండడం బాధాకరం. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే రూ. లక్షలు ఎలా అవుతాయో ముందుగా తెలుసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అసత్య ప్రచారాలను నమ్మొద్దు. నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. – అక్కిరెడ్డి, సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్, అనంతపురం ప్రచార హోరు... మోసాల జోరు గ్లోబల్ షేర్ మార్కెట్ పేరుతో వల తక్కువ సమయంలోనే రూ.లక్షల్లో లాభం అంటూ ప్రచారం ప్రముఖుల ఫేక్ వీడియోలతో నయవంచన -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఓడీచెరువు: మండల పరిధిలోని టి.కుంట్లపల్లి పంచాయతీ బసప్పగారిపల్లి సమీపంలోని కరకమానుతోపు వద్ద శుక్రవారం బండకిందపల్లెకు చెందిన శ్రీనివాస్ (26) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తుల వివరాలమేరకు.. బండకిందపల్లె గ్రామంలోని నాగప్ప, మల్లమ్మ దంపతుల కుమారుడైన శ్రీనివాస్ మోటార్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితమే పైళ్లెనా మనస్పర్థల కారణంగా భార్య ఆయనతో కలిసిలేదు. విద్యుత్ లైన్ కింద ఉన్న కేబుళ్లు రిపేరీ చేస్తు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే శుక్రవారం కరకమానుతోపు వద్ద మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందడంతో వెనుతిరిగి వచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోనా మసూరి పేరుతో స్టోర్ బియ్యం పెనుకొండ రూరల్: తక్కువ ధరకే సోనా మసూరి బియ్యం పేరుతో రైతును వ్యాపారి మోసం చేిసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని రాంపురం పంచాయతీలోని కొండంపల్లికి చెందిన రైతు తులసీ ప్రసాద్ ఇంటి వద్దకు గురువారం వచ్చిన ఓ.. వ్యాపారి, సోనామసూరి బియ్యం 50 కేజీల బియ్యం బస్తా ధర రూ. 2,200కు అమ్ముతున్నట్లు నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన రైతు రూ.4,400 ఇచ్చి రెండు బస్తాలు కొనుగోలు చేశాడు. వ్యాపారి వెళ్లిన అనంతరం బస్తా విప్పి చూడగానే అందులో స్టోర్ బియ్యం ఉన్నట్లు గుర్తించాడు. జరిగిన ఘటనపై శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. కారు దగ్ధం పెనుకొండ రూరల్: ప్రమాదవశాత్తూ కారులో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. వెంకటగిరిపాళ్యం గ్రామానికి చెందిన మధు శుక్రవారం సాయంత్రం తన కారులో మునిమడుగు గ్రామానికి బయలు దేరారు. అయితే మార్గమధ్యలో గ్రామ సమీపంలో కారు ఇంజన్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన చోదకుడు కారు దిగిపోయాడు. ఒక్కసారిగా మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఘటనా స్థలంలోనే కారు పూర్తిగా కాలిపోయింది. ఐచర్ ఢీకొని యువకుడి మృతి రాప్తాడు రూరల్: మండల పరిధిలోని రామినేపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కనగానపల్లికి చెందిన పూజరి ఉజ్జినప్ప కుమారుడు రంజిత్ (25) బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. వ్యవసాయ పంట పొలాలకు అవసరమైన మందుల కోసం స్నేహితుడు ప్రసాద్తో కలిసి అనంతపురం వచ్చారు. అనంతరం ఇద్దరూ బైకుపై స్వగ్రామానికి బయలుదేరారు. రామినేపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డుకు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడగా, ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విత్తన బాల్స్పై శిక్షణపుట్టపర్తి: ఎల్నినోను ఎదుర్కొనే విధంగా పీఎండీఎస్ పద్ధతిలో విత్తన బాల్స్ తయారీపై రైతులకు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం బుక్కపట్నం మండలం గూనిపల్లిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో విత్తన బాల్స్ తయారీ, పొలంలో చల్లడంపై శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి నారాయణనాయక్ మాట్లాడుతూ పీఎండీఎస్ పద్ధతిలో సాగు చాలా లాభదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఓ సతీష్బాబు, ఆర్ఎస్కే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన కాశీంస్వామి
బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాలకు బత్తలపల్లి సిద్ధమైంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కాశీంస్వామిని గురువారం అర్ధరాత్రి కొలువుదీరారు. శుక్రవారం ముజావర్లు టైలర్ రియాజ్, మాబాషా, నూరుల్లా, ఖాశీంవలి కాశీంస్వామి చావిడిలో ఫాతెహ చేశారు. అనంతరం నిత్యపూజ నివేదన నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని గంటాపురం, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, సంజీవపురం, అనంతసాగరం తదితర గ్రామాల్లోనూ మొహర్రం వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొహర్రం వేడుకలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ సూచించారు. -
హోంమంత్రి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో దమనకాండ
పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వంలో హోంమంత్రి అనిత నిర్లక్ష్యం, డీజీపీ మౌనం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఉండడంతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుట్టపర్తిలో ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతగాని తనంతోనే మాదిగ క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ సీఐ నాగరాజును శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి హోంమంత్రి అనిత బాధ్యతారాహిత్యమే కారణమన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయి ఉండి దళిత మహిళలకు రక్షణ కల్పించలేకుండా పోతున్నారన్నారు. దాడులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు భాస్కర్, నియోజకవర్గ అధ్యక్షుడు ఓబులేసు, నారాయణస్వామి తదితరులు ఉన్నారు. యువ రైతుపై దాడి బత్తలపల్లి: భూ సమస్యపై ధర్మవరం విచ్చేసిన కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఓ యువరైతుపై మరో రైతు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అడ్డువచ్చిన రైతు తల్లిని పక్కకు లాగేశారు. ఈ సంఘటన మండలంలోని తంబాపురం క్రాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత రైతు మాదినేని మహేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ... మండలంలోని రామాపురానికి చెందిన మాదినేని మహేంద్ర, మరో రైతు రామానాయుడు మధ్య భూ సమస్య ఉంది. ఈ సమస్యపై మహేంద్ర తన తల్లి అరుణతో కలిసి ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్లో కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు చేయడానికి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. గమనించిన అదే గ్రామానికి చెందిన మరో రైతు రామానాయుడు వారిని గమనించి వెంబడించి తంబాపురం క్రాస్ ఆంజనేయస్వామి గుడి వద్దకు రాగానే అడ్డగించి దుర్భాషలాడాడు. ‘మా భూమి మేము చేయించుకుంటే నీకేమి’ అని సమాధానం ఇవ్వడంతో నాకే ఎదురు చెబుతావా అంటూ అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు తెలిపారు. అడ్డుకోబోయిన తల్లి అరుణను కూడా పక్కకు లాగేసి మరీ దాడి చేశాడన్నారు. తీవ్రంగా గాయపడిన మహేంద్రను బత్తలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తనను చంపడానికి ప్రయత్నించారంటూ రామానాయుడిపై పోలీసులకు మహేంద్ర ఫిర్యాదు చేశారు. కుక్కల దాడిలో జింకకు గాయాలునార్పల: మండల పరిధిలోని తుంపెర గ్రామ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి జింకపై కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో రైతు సంజీవరాయుడు అప్రమత్తమై కుక్కల బారి నుండి జింకను కాపాడి అటవీశాఖ అధికారులుకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను అటవీశాఖ అధికారులు ఉషారాణి, తేజేశ్వర్రెడ్డి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డాక్టర్ సాయి సుప్రజ పర్యవేక్షణలో రాజారెడ్డి , ధనమ్మ, గురుప్రసాద్ చికిత్స చేశారు. -
సాయి సూక్తి... సత్య దీప్తి
ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి ప్రవచించిన సూక్తులు ఆధునిక యువత భవితకు సత్య దీప్తులు’ అన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన భక్తులను తన్మయ భరితులను చేసింది. పర్తి యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సత్యసాయి గ్లోబల కౌన్సిల్ జోన్–5 ఇండోనేషియా భక్తులు శుక్రవారం పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ‘వన్ వరల్డ్ వన్ సాయి’ అన్న పేరుతో సత్యసాయి వైభవాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని, సేవా గుణాన్ని వివరిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. సాయినామంతో సాయి కుల్వంత సభా మందిరం ప్రతిధ్వనించగా.... భక్తులు పరవశించిపోయారు. అనంతరం సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ బాలి కోఆర్డినేటర్ జినీ ఆగష్ ఇండోనేషియాలో కొనసాగిస్తున్న సత్యసాయి సేవా కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం ఇండోనేషియా దేశానికి చెందిన బాలవికాస్ చిన్నారులు నేటి కంప్యూటర్ యుగంలో యువత సత్యసాయి మార్గాన్ని ఆచరించాలని, ఆయన బోధనలను పాటిస్తూ చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాలని ‘సాయి ఆల్వేస్ క్లిక్స్ ’ నాటికను ప్రదర్శించారు. చక్కటి భక్తి గీతాలతో కనువిందు చేసే నృత్య భంగిమలతో ఆహూతులను అలరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
నాణ్యమైన బియ్యం సరఫరా చేయండి
ధర్మవరం: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సివిల్ సప్లయీస్ గోడౌన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లోని భౌతిక స్టాక్కు, రికార్డుల్లో ఉన్న నిల్వకు తేడా ఏమైనా ఉందా? అని పరిశీలించారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నాణ్యతను తనిఖీ చేశారు. గోడౌన్లో సరుకులు పాడవకుండా ఉండేందుకు తగిన గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు సరుకులను తరలించే వాహనాల వివరాలను, సమయ పాలనను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సరుకులు పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలన్నారు. అనంతరం తమకు రావాల్సిన కూలి, లోడింగ్, అన్లోడింగ్, చార్జీల చెల్లింపులు, గోడౌన్లో కనీస సౌకర్యాల కల్పన తదితర సమస్యలను హమాలీలు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. హమాలీల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. తహసీల్దార్ దేవరాజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం
ప్రశాంతి నిలయం: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్...అనంతరం జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైనా వ్యాధులు ప్రబలినా వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టి నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు కొంతమేర బలహీన పడే అవకాశం ఉందన్నారు. అనావృష్టి పరిస్థితులు ఏర్పడినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘నీట్’ అభ్యర్థులకు ఉచిత ప్రయాణం పుట్టపర్తి అర్బన్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ తదితర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కవ్ు ఎంట్రెన్స్ టెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రం వరకూ ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని డీపీటీఓ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష రాసిన తర్వాత కూడా ఉచితంగానే స్వగ్రామాలు చేరుకోవచ్చన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్కు చూపించి ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపోల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు డీపీటీఓ చెప్పారు. నేడు నేమకల్లు అంజన్న ప్రతిష్టాపన బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో బాలాలయంలో శనివారం స్వామివారి ప్రతిష్టాపన జరగనుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ప్రధాన అర్చకులు అనిల్కుమార్ చార్యులు, ధర్మకర్త శ్రీనాథ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో శనివారం ఉదయం 7.37 గంటల నుంచి 11.17 గంటలకు బాలాలయాన్ని ఏర్పాటు చేసి, స్వామివారి మూలవిరాట్ను ప్రతిష్టిస్తున్నట్లు వారు వెల్లడించారు. అక్కడే నిత్య పూజలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నుట్లు వెల్లడించారు. ఆలయ జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. -
రిజిస్ట్రేషన్లన్నీ పక్కాగా ఉండాలి
పుట్టపర్తి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్లన్నీ పక్కాగా చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆమె బుక్కపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయ గదులు, ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇలాగేనా ఉండేది.. అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తప్పిదాలను సహించబోనన్నారు. కార్యాలయంలో మౌలిక వసతులు, సిబ్బంది కొరత గురించి విలేకరులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఐజీ వెంట జిల్లా రిజిస్ట్రార్ కృష్ణకుమారి, సిబ్బంది ఉన్నారు. ‘సర్’ పర్యవేక్షక అధికారుల నియామకం అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. అన్ని జిల్లాలకూ పర్యవేక్షక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం జారీ చేశారు. అనంతపురం జిల్లా పర్యవేక్షక అధికారిగా మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ, గోదావరి కెనాళ్ల మేనేజింగ్ డైరెక్టర్ జి.క్రిస్ట్ కిషోర్కుమార్ను నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా పర్యవేక్షక అధికారిగా హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్ కె.శ్రీనివాసులును నియమించారు. -
సచివాలయాల్లో సర్వే జాబితా ప్రదర్శన
ప్రశాంతి నిలయం: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలను ప్రదర్శనకు ఉంచినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 19వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తామని, ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే దరఖాస్తు రూపంలో అందివ్వాలని సూచించారు. 19 నుంచి 24వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. కుల ధ్రువీకరణకు సంబంధించినవి తప్ప... తక్కినవన్నీ ఈనెల 26వ తేదీలోపు సవరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కుల ధ్రువీకరణ పత్రంలో సవరణ కోసం అందిన దరఖాస్తులను సంబంధిత అధికారి ద్వారా మాత్రమే మార్పులు చేస్తారన్నారు. ప్రజలందరూ తమ కుటుంబ వివరాలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలో సరిచూసుకోవాలన్నారు. జూలై 26న సత్యసాయి రన్ అండ్ రైడ్ ప్రశాంతి నిలయం: సత్యసాయి స్ఫూర్తితో యువత సేవాగుణం అలవర్చుకునేలా జూలై 26న సత్యసాయి రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 5కే రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శారీరక దృఢత్వం, ఐక్యత, నిస్వార్థ సేవ, సత్యసాయి బోధించిన మానవతా విలువలను యువతలో పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 5 కిలోమీటర్ల పరుగు, సైకిల్ రైడింగ్ ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 19వ తేదీలోపు https://sssunityrun.ssssoindia.org వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి సర్టిఫికెట్తో పాటు టీషర్ట్, మెడల్స్ ప్రధానం చేస్తామన్నారు. -
మా కష్టాలు ఎవరికీ పట్టవు
మడకశిర మండల పరిధిలోని గౌడనహళ్లి న్యూ ఎస్సీ కాలనీకి తాగునీరు సరఫరా కాక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వేసిన బోరు నీరు లేక ఒట్టిపోయింది. మరోబోరు వేసినా అరకొర నీరే పడ్డాయి. నూతన బోరుకు ఏర్పాటు చేసిన మోటరు ఇటీవల చెడిపోయింది. దీంతో తాగునీటికోసం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా మా కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. – నరసింహ , గౌడనహళ్లి, మడకశిర మండలం నెలరోజులైనా మరమ్మతు చేయలేదు మా గ్రామంలో 1,350 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకం కింద గ్రామంలో రెండు బోరుబావులు తవ్వించింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మరో బోరుబావి వినియోగంలో లేక నెల రోజులు కావొస్తున్నా.. అధికారులు మరమ్మతు చేయించలేదు. అర్జీలిస్తే తీసుకుని చెత్తబుట్టలో పడేస్తున్నారు. – ఎం.నాగరాజు, టీడీపల్లి గ్రామం, రొళ్ల మండలం -
మాటల ప్రభుత్వాన్ని నమ్మొద్దు
గోరంట్ల: కళ్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్.. నమ్మి ఓట్లేసిన జనాన్ని నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. మాటల ప్రభుత్వాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. గురువారం ఆమె పార్టీ మండల కన్వీనర్ వెంకటేశుతో కలిసి మండల పరిధిలోని బెల్లాలచెరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు పాలనలో ఎలాంటి లబ్ధి కలిగిందంటూ ఆరా తీశారు. రెండేళ్లలో తమకు ఎలాంటి సంక్షేమ పథకం అందలేదని, గ్రామంలోనూ అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు వాపోయారు. ఏదైనా సమస్య తలెత్తితే పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ ప్రజలతో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో కుల,మత రాజకీయలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు విత్తనాలు, యూరియా సైతం అందించలేని దుస్థితిలో ఉందన్నారు. అనంతరం సమగ్ర ఓటరు ప్రత్యేక సర్వే (సర్)పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బీఎల్ఏలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఓటు జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలన్నారు. ‘సర్’పై అందరూ అప్రమత్తంగా ఉండాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
విద్యార్థుల ఆకలి కేకలు
గుడిబండ: పేదరికం కారణంగా చిన్నారులు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం లేదని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. గుడిబండ మండల వ్యాప్తంగా 70 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఫళారం గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో 44 మంది విద్యార్థులున్నారు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సమస్యల కారణంగా అమలు చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న నిత్యావసరాలు, వంట గ్యాస్ ధరలతో ప్రభుత్వ నిర్దేశిత బడ్జెట్తో నాణ్యమైన భోజనం అందించలేక పోతున్నామని ఏజెన్సీ నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటిౖకైనా అధికారులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు -
తీసుకోవడమే కాదు.. తిరిగి ఇవ్వాలి
కదిరి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనడుస్తోంది. ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభం కాగా, బూత్ స్థాయి ఎన్నికల అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాంలు అందజేసి, వివరాలను లాగిన్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ పత్రాల్లో ప్రతి ఓటరు తమ వివరాలను నింపి, తిరిగి వారికి అందజేయాలి. ఇందుకు గడువు జూలై 14 వరకూ ఉంది. కానీ చాలా మంది ఎన్యూమరేషన్ ఫాంను ఏదో కాగితం అనుకుని పడేస్తున్నారు. అలాంటి వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల బీఎల్ఓ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫాం పూర్తి వివరాలతో నింపి తిరిగి అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే అధికారులు ఆబ్సెంట్, షిఫ్టెడ్ లేదంటే డెత్ అని జాబితాలో పొందుపరుస్తారు. తర్వాత ‘‘మేమున్నాము బాబు’’ అని నిరూపించుకోవడానికి అవసరమైన ఫారాలు జతచేసి, నిరీక్షించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) ఒక్కొక్కరు గరిష్టంగా 50 వరకు ఫాంలను బీఎల్ఓలకు అందజేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధానించిన ఫోన్ నంబర్ను విధిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఫోటోలు తప్పనిసరి.. బీఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఓటర్లు తమ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోను ఎన్యూమరేషన్ ఫాంపై అతికించి వారికి అందజేయాలి. వారు వాటిని అప్లోడ్ చేస్తారు. ఒకవేళ ఆ ఫొటోలో తేడా వస్తే తిరస్కరణకు గురవుతుంది. అలాగే బీఎల్ఓ ఇచ్చే రసీదు భద్రంగా దాచుకోవాలి. కుటుంబీకులెవరైనా ఇవ్వొచ్చు తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను ఆ ఇంట్లో ఉన్న వారెవరైనా ఇవ్వొచ్చు. వారే ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫాంలను నింపి, వారే సంతకం చేసి బీఎల్ఓలకు ఇవ్వొచ్చు. ఓటరే ఉండాలనే నిబంధనేమీ లేదు. ఈ విషయంలో బీఎల్ఓలు సహకరించకపోతే వారిపై కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. నోటీసు ఇచ్చాకే తొలగించాలి.. బీఎల్ఓలు ఇంటింటి సర్వేకు వెళ్లకుండా ఎవరో చెప్పిన దాని ప్రకారం ఓటు తొలగిస్తే ఎన్నికల కమిషన్ వారిపై చర్యలు తీసుకుంటుంది. ఓటరు అందుబాటులో లేరని ముందుగా పోలింగ్ కేంద్రంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించడానికి వీల్లేదు. ఈఆర్ఓ నిర్ణయంపై అభ్యంతరముంటే 15 రోజుల్లోపు కలెక్టర్కు, 30 రోజుల్లోపు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ)కు అప్పీలు చేసుకోవచ్చు. ‘సర్’ సర్వేపై అధికారుల సూచనలు ఎన్యూమరేషన్ ఫాం నింపి బీఎల్ఓలకు తిరిగి అందజేయాలి లేకపోతే ఓటు గల్లంతవడం ఖాయం జిల్లాలో జూలై 14 వరకూ ఇంటింటి సర్వే ఆన్లైన్లోనూ నమోదు చేయొచ్చు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న జిల్లా ఓటర్లు ఆన్లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేయవచ్చు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కోసం బీఎల్ఓ ప్రతి ఇంటికీ మూడు సార్లు వెళ్లాలి. ఓటర్లు వివరాలను నింపి, కలర్ ఫొటో అతికించిన ఎన్యూమరేషన్ ఫాంను కచ్చితంగా తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. వాటిని బీఎల్ఓలు డిజిటలైజ్ చేస్తారు. – శ్యాంప్రసాద్, కలెక్టర్ -
సోలార్ కోసం మా కడుపులు కొట్టొద్దు
ఎన్పీకుంట: అభివృద్ధి పేరుతో వ్యవసాయ యోగ్యమైన భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టి తమ కడుపులు కొట్టవద్దని మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు తహసీల్దార్ లక్ష్మమ్మను వేడుకున్నారు. తమ గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్ కోసం చేపట్టిన పనులు నిలిపి వేసి దశాబ్దాలుగా సాగులో ఉన్న తమ భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు రైతులంతా గురువారం మండల కేంద్రానికి చేరుకుని తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలో 100 మెగావాట్ల గ్రీన్ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం డిజిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే పనులు ప్రారంభించారన్నారు. రైతులు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. తమ తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములను సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకోవడం దారుణమన్నారు. గతంలో తమ సాగుభూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవడానికి, పట్టాలు పొందడానికి సర్వే పేరుతో రూ.లక్షల్లో ముట్టజెప్పామని, అయినా రెవెన్యూ అధికారులు రేపు, మాపు అంటూ కాలయాపనచేసి తమకు పట్టాలు మంజూరు చేయలేదని వాపోయారు. పంచాయతీ పరిధిలో సుమారు 100 నుంచి 120 కుటుంబాలు పాడిపశువులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, 10 వేల నుంచి 15 వేల వరకు మూగజీవాలు ఉన్నాయన్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మూగజీవాలకు మేత ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. రైతుల బతుకులను ప్రశ్నార్థం చేసే సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులు పునరాలోచించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మమ్మ మాట్లాడుతూ.. సోలార్ ఏర్పాటు వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడతామని, అందరూ ఒప్పుకుంటేనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తిమ్మారెడ్డి, రైతులు తిరుమలనాయుడు, బుల్లెట్ బాబా, యాదళ్ల రాజేష్, రమణ, వెంకటనారాయణ, ఖాదర్వలి, మస్తాన్వలి, ఇమాంసా, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ ఎదుట కన్నీటిపర్యంతమైన రైతులు సాగుభూములకు పట్టాలు ఇవ్వాలని వేడుకోలు -
పల్లెలకు ఎక్కిళ్లు!
సాక్షి, పుట్టపర్తి రెండేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఉరుములు, మెరుపులతో దట్టమైన మేఘాలు కమ్ముకున్నా సరైన వర్షం కురవడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు లోపలికి వెళ్లడంతో బోరుబావులు ఎండిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటి కష్టాలు జఠిలమయ్యాయి. ఏ గ్రామంలో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ‘నీళ్లో రామచంద్రా.. నీళ్లివ్వండి ప్రభో.. దాహం దాహం..’ అంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అప్పటికప్పుడు అధికారులు తాత్కాలికంగా సమస్య పరిష్కరిస్తుండటంతో వారం రోజులు తిరగకుండా సమస్య పునరావృతం అవుతోంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో ఉన్నఫలంగా సమస్య ఉత్పన్నం అవుతోంది. దీంతో మడకశిర, రొళ్ల, అగళి, ముదిగుబ్బ, ఓడీ చెరువు, లేపాక్షి, హిందూపురం తదితర ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. మహిళలు రోడ్డెక్కిన రోజు రెండు వాటర్ ట్యాంకర్లు పంపించి మమ అనిపిస్తున్నారు. మంత్రి ఇలాకాలోనూ ఇక్కట్లే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేయలేకపోయారు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల వారు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. అదేవిధంగా మరో మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి, రొద్దం మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. జనం తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ఎవరూ వారి తాగునీటి కష్టాలను తీర్చడం లేదు. మడకశిరలో రోజూ నిరసనలే.. కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. ఏ గ్రామంలో చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు చాలా గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. పాలకులు గ్రామాలకు నీళ్లు ఇవ్వక.. ప్రజలు బోర్లు వేసుకోలేక.. నానా అవస్థలు పడుతున్నారు. మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తూ.. ప్రజల సమస్యలను గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి. వర్షాకాలంలోనూ పల్లె గొంతు తడారుతోంది. ముందస్తు చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాలపై పాలకులు దృష్టి సారించక పోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయినా స్పందించేవారే లేకపోవడంతో కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నారు. వానాకాలంలోనూ తాగునీటి తిప్పలు చాలా చోట్ల ఎండిపోయిన బోరుబావులు 18 మీటర్ల లోతుకు చేరిన భూగర్భ జలాలు ‘వాల్టా చట్టం’ పరిధిలో ఉన్న 51 గ్రామాలు కనీస చర్యలు తీసుకోని అధికారులు, పాలకులు నెలల తరబడి నీరురాక రోడ్డెక్కుతున్న ప్రజలు మడకశిర నియోజకవర్గంలో పరిస్థితి తీవ్రం వీరంతా అగళి మండలం కురసాంగనపల్లి గ్రామస్తులు. తాగునీటి కోసం ఇటీవల ఖాళీ బిందెలతో ఇలా రోడ్డుపై నిరసన తెలిపారు. రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన బోరులో నీటిమట్టం తగ్గిపోయి నీళ్లు తక్కువగా వచ్చేవి. దీంతో ఎక్కువ సమయం మోటరు వేయడం వల్ల ఇటీవల కేబుల్ కాలిపోయింది. రోజుల తరబడి అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఏడాదిలో ఆరు మీటర్ల లోతుకు.. గతేడాది మే నెలలో 12 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం.. ఆ తర్వాత కురిసిన వర్షాలతో నవంబరులో 10 మీటర్ల పైకి వచ్చింది. అయితే ఈ ఏడాది వేసవిలో మరింత లోతుకు చేరింది. గత మే నెలలో భూగర్భ జల శాఖ గణాంకాల ప్రకారం 18.28 మీటర్ల లోతుకు చేరింది. దీంతో నీటి సమస్య తీవ్రమైంది. -
‘యాప్’రే.. ఇన్ని ప్రయోజనాలా!
కదిరి: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)తో జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. బస్సులో వెళ్తున్నా..టీ కొట్టుకో కూర్చున్నా.. రచ్చబండ దగ్గరకు వెళ్లినా..ఎక్కడ నలుగురు గుమికూడినా, ఏ నోట విన్నా ఇప్పుడు ‘సర్’ అనే మాటే వినబడుతోంది. వారి మాటల్లో ప్రధానంగా విన్పిస్తున్నదేంటంటే ‘ఓటరు లిస్ట్లో నా పేరు ఉందో? లేదో..?. నా ఓటరు ఐడీ నెంబర్ ఎంతో తెలీదు..నా ఓటరు కార్డు పోయింది.. మా ఇంట్లో వాళ్ల ఓట్లు ఉన్నాయో..లేదో! కొత్తగా ఓట్లు ఎలా ఎక్కించు కోవాలి?. మా బీఎల్ఓ ఎవరో తెలీదు..మా పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత?..ఓటరు ఐడీ కార్డు ఎవరు ఇస్తారు? ఓటుకు సంబందించి ఎవరిని కలవాలి?’ అనే ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ ‘ఈసీఐనెట్’ అనే మొబైల్ యాప్లో సమాధానాలు దొరుకుతాయి. ఎవరినీ సంప్రదించకుండానే ఎన్నికల సమాచారం మొత్తం అరచేతిలోనే ఉంది. బహుళ ప్రయోజనాలు... ఓటరు హెల్ప్ లైన్ యాప్, సీ–విజిల్, ఓటర్ టర్నవుట్ యాప్, నో యువర్ క్యాండిడెట్, ఈసీఐ స్వీప్, ఈసీఐ వెబ్సైట్, సీ విజిల్ పోర్టల్, సర్వీస్ ఓటర్ పోర్టల్ తదితర 40 రకాల యాప్లు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పని చేసేవి. వాటి పనితీరు సరిగా లేనందున వీటికి సరైన ప్రజాదరణ లభించలేదు. అధికారుల కోసం రూపొందించిన ఈఆర్ఓనెట్, బీఎల్ఓ యాప్, అబ్జర్వర్ యాప్, సువిధవంటి మొబైల్ యాప్లు కూడా అంతగా సత్పలితాలు ఇవ్వలేదు. అందుకే వాటన్నింటికీ చెల్లుచీటీ పలుకుతూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది మే నెలలో ప్రయోగాత్మకంగా 40 యాప్లను అనుసంధానం చేస్తూ ‘ఈసీఐనెట్’ అనే కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా ప్రజలకు అధికారిక సమాచారం అందింది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఈ యాప్ను ఈ యేడాది జనవరిలో అధికారికంగా ఆవిష్కరించింది. ఇందులో ఓటర్ల జాబితాలో పేరు, ఓటరు గుర్తింపు కార్డును శోధించవచ్చు. ఓటరు నమోదు, గుర్తింపు కార్డుల రద్దు, సవరణ, బదిలీ, వంటి దరఖాస్తులు కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ఓటరు కార్డులను కూడా డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గతంలో అంటే 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఆ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో,లేదో కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారానే బీఎల్ఓ ఫోన్ నెంబర్ తెలుసుకొని సమస్యను చెప్పవచ్చు. లేదంటే మెసేజ్ రూపంలో తెలియజేయవచ్చు. నాటి నుంచి సమాచారం.. 1951–52 నుంచి జరిగిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ల నుంచి ఇటీవలి ఎన్నికల వరకూ రాష్ట్రాల వారీగా ఎన్నికల వివరాలన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం తెలుసుకోవాలంటే మరుసటి దినం వరకూ వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ‘ఈసీఐనెట్’ యాప్ ద్వారా పోలింగ్ వివరాలతో పాటు కౌంటింగ్ వివరాలను సైతం ఎప్పటి కప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా రిగ్గింగ్ వంటి అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ఈ యాప్ ద్వారానే ఎన్నికల కమిషన్కు వెంటనే ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..వెంటనే మొబైల్లో ప్లేస్టోర్ లోకి వెళ్లి ‘ఈసీఐనెట్’ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ సేవలను పొందండి. అన్ని వివరాలకు ‘ఈసీఐనెట్’ మొబైల్ యాప్ సులువుగా ఓటరు దరఖాస్తులు, కార్డుల డౌన్లోడ్ నిమిషాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు వివరాలు -
కూటమి నేతల బరితెగింపు
సాక్షి, టాస్క్ఫోర్స్: హిందూపురంలో అధికార కూటమి నాయకులు అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సహజ వనరులన్నీ దోచేసిన నేతలు...సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. చివరకు గుజిరీ వ్యాపారులను వదలడం లేదు. ఇంటింటికీ తిరిగి గుజిరీ సేకరించి వారి వద్ద సామగ్రి కొని విక్రయించే వారిని మామూళ్లకోసం వేధిస్తున్నారు. నెలవారీగా తమకు రూ. 50 వేలు ఇవ్వాలని గుజరీ వ్యాపారులకు జనసేన, బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతలు అల్టిమేటం జారీ చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఇటీవల పెరిగిన వేధింపులు హిందూపురంలో చాలా మంది నిరుపేదలు పాత ఇనుము, ప్లాస్టిక్, కాగితం వంటి వస్తువులను సేకరించి స్థానికంగా స్క్రాప్ వ్యాపారులకు విక్రయించి పొట్టపోసుకుంటున్నారు. సదరు వ్యాపారులు తాము సేకరించిన గుజిరీని బెంగళూరు లాంటి నగరాలకు తరలిస్తుంటారు. వీరిపై కన్నేసిన జనసేన, బీజేపీ నాయకులు మామూళ్ల కోసం వ్యాపారులపై వేధింపులకు దిగారు. తాము అడిగినంత ఇవ్వకపోతే వ్యాపారాలు చేసుకోనివ్వబోమంటూ భయపెడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే కొందరు వ్యాపారులపై పోలీసులను ప్రయోగించగా...మిగతా వ్యాపారులంతా దుకాణాలకు తాళం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గుజిరీ సేకరించే నిరుపేదలు తాము సేకరించిన సామగ్రిని కొనేవారు లేక పస్తులుంటున్నారు. 15 రోజుల నుండి పెరిగిన ఒత్తిళ్లు..? గత రెండు వారాలుగా గుజిరీ వ్యాపార కార్యకలాపాల మీద కూటమి నేతలు నిఘా పెట్టి వ్యాపారుల వద్ద బేరసారాలు జరిపినట్టుగా తెలుస్తోంది. మాట వినకపోతే వ్యాపారమే చేసుకోనివ్వబోమంటూ బెదిరించినట్టుగా బాధితులు చెబుతున్నారు. గుజిరీ వ్యాపారంలో ఎక్కువగా మైనార్టీ వర్గానికి చెందిన వారే ఉండగా, వారిని లక్ష్యంగా చేసుకున్న జనసేన , బీజేపీ నియోజకవర్గస్థాయి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ వసూళ్ల దందా వెనుక ఎమ్మెల్యే పీఏలు ఉన్నారా..? లేక బీజేపీ, జనసేన నేతలే ఉన్నారా... అన్నది తెలియడం లేదు. సీటీఓతో ఒత్తిడి తెచ్చేందుకు విఫలయత్నం కూటమి నేతల డిమాండ్కు వ్యాపారులు ఒప్పుకోకపోవడంతో సదరు నేతలు సీటీఓ ద్వారా గుజరీ దుకాణాలపై దాడులు చేయించాలని ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. కానీ సీటీఓ అందుకు అంగీకరించకపోవడంతో నేరుగా బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమ జేబులు నింపుకునేందుకు చిరు వ్యాపారులనూ వదలకుండా మామూళ్ల వసూళ్లకు పాల్పడటంపై ఓ వర్గం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మామూళ్ల కోసం గుజిరీ వ్యాపారులకు వేధింపులు ‘పురం’లో పెచ్చుమీరిన జనసేన, బీజేపీ నేతల అకృత్యాలు -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామానికి చెందిన ఆశ (25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి కర్ణాటకలోని చిన్న ఓబనహళ్లి గ్రామానికి చెందిన ఆశతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వన్నూరుస్వామి మంగవారం రాత్రి మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. రోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆశ ఇంట్లో ఉరివేసుకుంది. ఇంటి బయట నిద్రించిన వన్నూరుస్వామి బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించిన భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రేపు మెగా జాబ్మేళా
ప్రశాంతినిలయం: పుట్టపర్తిలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. 10 బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఉదయం 9 గంటలకు జాబ్మేళా ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జీతం ఉంటుందన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకొని హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 7981541994ను సంప్రదించాలన్నారు. కాలు జారి కింద పడి మహిళ మృతి కదిరి టౌన్: కాలు జారి కింద పడడంతో తీవ్ర గాయాలైన మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక సైదాపురంలోని నల్లాపురం గుడి సమీపంలో నివాసముండే పసుపులేటి నాగమణి (45) బుధవారం తన కుమారుడు మోహన్ క్రిష్ణ నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లింది. ఇంటిపైకి బకెట్లో నీరు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయమైన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించేలోపే పరిస్థితి విషమించి నాగమణి మృతి చెందింది. మోహన్ క్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. కుళ్లాయిస్వామి గోవిందా.. ● గూగూడులో ప్రారంభమైన మొహర్రం ఉత్సవాలు నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారి ప్రథమ దర్శనంతో భక్తజనం పులకించింది. తొలుత ప్రధాన అర్చకులు ఉస్సేనప్ప ఆధ్వర్యంలో కుళ్లాయి స్వామి పీర్ల చావిడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. అనంతరం పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు. స్వామి వారి ప్రథమ దర్శనం కోసం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రథమ దర్శనంతో భక్తులు గోవిందా.. గోవింద అంటూ నామస్మరణ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శోభారాణి, ఎస్ఐ సాగర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
పుట్టపర్తి టౌన్: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ముందుండి పరిష్కారానికి కృషి చేస్తుందని ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు తెలిపారు. బుధవారం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా రంగప్ప, అధ్యక్షుడిగా చలపతి, ప్రధాన కార్యదర్శిగా టీసీ గంగాధర్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా బసప్ప, వెంకటేష్, కల్లూరి ప్రసాద్, కోశాధికారిగా శ్రీరాములు, కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, గంగాధర్ అనార్, మోహన్నాయుడు, నారాయణస్వామిని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ విభాగం అధ్యక్షుడిగా సాయికుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కేశప్ప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్ట్లకు అండగా ఉంటామన్నారు. వారి పిల్లలకు ఉచిత విద్య అందించే విధంగా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించామన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్ట్ సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షఫీవుల్లా, నాయకులు అనిల్కుమార్రెడ్డి, ఆర్.కె సూర్య, సంతోష్రెడ్డి, దివిటి రాజేష్, శివరామకృష్ణ, చక్రపాణి, బాబ్జాన్, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు -
ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ
పెనుకొండ: సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్ఓ ఎస్. ఫైరోజబేగం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించి తగిన సూచనలు సలహాలు అందించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పలు కార్యక్రమాల ప్రగతి నివేదికలను వైద్యాధికారి ఓంకార్ను అడిగి తెలుసుకున్నారు. అన్నింటా వంద శాతం లక్ష్యాలను సాధించాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం డీపీఓ నాగరాజు, ఎంపీహెచ్ఈఓ గఫుర్ పాల్గొన్నారు. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ పరలోకాలకు● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం తాడిపత్రి రూరల్: మండలంలోని పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గంగాదేవిపల్లికి చెందిన సతీష్ (25), నాగేంద్ర ద్విచక్రవాహనంలో మంగళవారం రాత్రి తాడిపత్రిలో నిర్వహించిన తమ స్నేహితుడు సతీష్ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్కు ఆస్పత్రిలో చికిత్సలందించారు. ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మృతుడు సతీష్కు భార్య పుష్పతో పాటు రెండు నెలల చిన్నారి ఉన్నట్లు తెలిసింది. డబ్బుల కోసం యూట్యూబర్ వేధింపులు ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ గుంతకల్లు: డబ్బుల కోసం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న యూట్యూబర్ మంజునాథనాయుడుపై బుధవారం గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ షామీర్బాషా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. మంజునాథనాయుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించి బ్లాక్మెయిల్ చేయడంతోపాటు విధులకు అడ్డు తగులుతున్నాడని షామీర్బాషా పేర్కొన్నారు. అడిగినంత ఇవ్వని పక్షంలో లేనిపోని ఆరోపణలతో వీడియోలు చేసి సోషియల్ మీడియా ద్వారా వైరల్ చేస్తానని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. 2023లో కూడా ఇదే విధంగా బెదిరించగా, జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మంజునాథనాయుడుపై కేసు నమోదు చేయాలని కోరారు. -
‘సర్’ సర్వేపై అప్రమత్తంగా ఉండాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ రొద్దం (పెనుకొండ రూరల్): ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే (సర్)పై అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ బీఎల్ఏలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ సూచించారు. బుధవారం ఆమె మండలంలోని తాడంగిపల్లి, ఎం. కొత్తపల్లి, నారనాగేపల్లి, బూచర్ల, లోచర్ల పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ..బీఎల్ఓలు సర్వే చేసే సమయంలో తప్పకుండా వారి వెంట ఉండాలన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. ఎన్యూమరేషన్ ఫాం పూరించడంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలు సంబంధిత అధికారులకు అందచేసే వరకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, మండల లెవెల్ బూత్ కో–ఆర్డినేటర్ చిలకల రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలకు విద్యార్థులు పుట్టపర్తి అర్బన్: రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలకు జిల్లా నుంచి 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి పంపినట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విద్యార్థులను అటెండర్లతో కలిిపి ప్రత్యేక బస్సులో పంపినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. స్థానిక డీఆర్డీఏ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కిశోర్, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, ఆయుష్ నోడలాఫీసర్ అర్చన, టూరిజం అధికారి ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు. ఉద్యానశాఖ ఏడీ దేవానందకుమార్ బదిలీఅనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీహెచ్) ఆర్.దేవానందకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ అయ్యారు. అక్కడ ఏపీఎంఐపీ పీడీగా ఉన్న సుదర్శన్ గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో డిప్యుటేషన్ కింద దేవానంద్కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 రోజులుగా సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ పీడీగా ఏపీఎంఐపీ ఏపీడీ బీసీ ధనుంజయ పనిచేస్తున్నారు. -
ఎద్దు దాడిలో వృద్ధురాలి మృతి
బొమ్మనహాళ్: మండలంలోని తారకాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి రథోత్సవంలో ఎద్దు బెదిరి కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు మృతి చెందింది. ఏఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన మేరకు... తారకాపురం గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి (90) అమ్మవారి రథోత్సవం చూడటానికి ఆలయం వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఎద్దు బెదిరి లక్ష్మీదేవి ముక్కుతో పాటు చేతిపై తన్నింది. కుటుంబ సభ్యులు ఆమెను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతురాలి కుమారై ఎర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైతుల బతుకుల్లో సోలార్ మంట
ఎన్పీకుంట: సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో ఎన్పీకుంట మండలంలో సాగుభూమి కరువైంది. ఇప్పటికే వేలాది ఎకరాలు సేకరించిన సర్కార్...తాజాగా మరికొమ్మదిన్ని పంచాయతీ జౌకల గ్రామాల్లో మరో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. బుధవారం ‘రామ్తరంగ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ నిర్వాహకులు జౌకల గ్రామంలో ఏకంగా పనులు ప్రారంభానికి భూమిపూజ చేసేందుకు సిద్ధం కాగా, తమ పొలంలో తమకు తెలియకుండా పూజలు ఎలా చేస్తారంటూ రైతులు, గ్రామస్తులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జీవితాలను నాశనం చేయొద్దు.. ఎవరికో వెలుగులు పంచేందుకు తమ జీవితాలను అంధకారం చేయవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపూజ అడ్డుకున్న అనంతరం పలువురు రైతులు విలేకరులతో మాట్లాడారు. సాగు భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పంటలు ఎలా పండించాలని, పాడి పశువులకు, జీవాలకు మేత ఎలా సమకూర్చాలని ప్రశ్నించారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. మండలం చుట్టూ సోలార్ ప్లాంట్లు ఏర్పాటైతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులకు, గ్రామస్తులకు తెలియకుండా 20 రోజుల నుంచి మరికొమ్మదిన్ని పంచాయతీ జౌకల గ్రామంలో పలు కంపెనీల వారు డ్రోన్లతో సర్వే నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఏకంగా పనులు ప్రారంభించడం గమనిస్తే రైతులకు తీవ్ర అన్యాయం జరుగబోతోందని తెలుస్తోందన్నారు. రైతులకు జీవనాధారమైన సాగు భూముల విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు మానవీయ దృక్పథంతో వ్యవహరించి రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో రైతుల బతుకులను బలిచేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. తమకు తెలియకుండానే తమ భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు, సర్కార్ తీరుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు పలువురు రైతులు తెలిపారు. రైతు సమ్మతితోనే భూసేకరణ మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలో 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో భాగంగా డిజిటెక్ కంపెనీ వారు డ్రోన్ సర్వే పనులను బుధవారం ప్రారంభించారు. రైతులతో గ్రామసభలు ఏర్పాటు చేసి వారి సమ్మతితోనే భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభిస్తాం. – లక్ష్మమ్మ, తహసీల్దార్, ఎన్పీకుంట ఎన్పీకుంట మండలంలో కొత్తగా సోలార్ పవర్ప్లాంట్ ఇప్పటికే జౌకల గ్రామంలో డ్రోన్ సర్వే తాజాగా పనుల ప్రారంభానికి రైతుల భూముల్లో పూజలు అడ్డుకున్న రైతులు.. జీవనాధారం కోల్పోతామని ఆందోళన -
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
పుట్టపర్తి టౌన్: నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సతీష్కుమార్ ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. బుధవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ నిర్వహణకు అవసరమయ్యే ఉపకరణాలను ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గించి ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పీక్ అవర్స్తో పాటు పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, ఆర్ఐ వలి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ సూచన -
తొలి దర్శనం.. పులకించిన భక్తజనం
బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి బత్తలపల్లిలోని ఖాశీంస్వామి ప్రథమ దర్శనం ఇచ్చారు. కులమతాలకు అతీతంగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని తరించారు. అంతకుముందు పీర్లను భద్రపరిచిన పెట్టెను గ్రామ పెద్దల సమక్షంలో కిందకు దించారు. ముజావర్లు ఫాతెహా నిర్వహించారు. అనంతరం ముజావర్లు కాశీంస్వామి ప్రథమ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారిని కొలువుదీర్చనున్నారు. 21వ తేదీ వరకు నిత్యపూజ నివేదన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ముజావర్లు తెలిపారు. బత్తలపల్లి సీఐ ప్రభాకర్గౌడు, ఎస్ఐ సోమశేఖర్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. -
ఆశల దీపం.. అయ్యో పాపం
తాడిపత్రిటౌన్: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయని, రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయ్యింది. అంత డబ్బులేక, కళ్ల ముందే అచేతనంగా పడుకున్న బిడ్డను చూస్తూ వారు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లికి చెందిన నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం నెలలోనే ఆవిరవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఊయల్లో పడుకొని కాళ్లు ఆడించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా వైద్యులకు చూపించారు. హైదరాబాద్కు వెళ్లమని చెప్పడంతో అక్కడి రెయిన్బో ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు ఎస్ఎమ్ఏ టైప్–1 జబ్బు సోకినట్లు చెప్పారు. మొదట కాళ్లు, చేతులకు తర్వాత శరీఙరంలోని వివిధ అవయవాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని చెప్పడంతో నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆశల దీపాన్ని ఎలా రక్షించు కోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. చిరుజీవులలైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల ఆపన్నహస్తం కోసం దీనంగా అర్థిస్తున్నారు. రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు చచ్చుబడిన కాళ్లు, చేతులు ఆలస్యం చేస్తే శరీరమంతటికీ సోకుతుందని డాక్టర్ల హెచ్చరికలు రూ. 17 కోట్ల ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని సూచన ఆపన్నహస్తం కోసం బాధిత తల్లిదండ్రుల ఎదురుచూపు చిన్నారి చికిత్స కోసం సాయం చేయదలిస్తే .. అకౌంట్ నంబర్ 30830783425 ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 001125కు డబ్బు పంపవచ్చు -
ఉద్దరకొస్తుందని అద్దెకారు!
సాక్షి, పుట్టపర్తి ఇంధన కొరత కారణంగా ప్రత్యేక వాహనాల వాడకం తగ్గించి.. వీలైనంత వరకు ప్రజా రవాణా వినియోగించాలని పాలకులు చెబుతున్నారు. పొదుపు పేరుతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా వారంలో ఒక రోజు కార్లను పక్కన పెడుతున్నారు. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలోని అధికారులు మాత్రం కార్లను వదలడం లేదు. జిల్లా కార్యాలయంలో పని చేసేవారిలో ఏడుగురు అద్దె వాహనాల్లో తిరుగుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరే బైక్పై వెళ్తుంటే...వీళ్లు మాత్రం కారు దర్జా చూపుతున్నారు. వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే కీలక అధికారులెవరూ స్థానికంగా ఉండటం లేదు. హిందూపురం నుంచి ఒకరు.. అనంతపురం నుంచి ఇంకొకరు.. రోజూ వచ్చిపోతుంటారు. వీరంతా అద్దెకార్లలోనే తిరుగుతున్నారు. ఇక ఇంటి వద్ద నుంచి కార్యాలయం తిరిగేందుకు మరికొందరు కార్లు వాడుతున్నారు. డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఎన్హెచ్ఎం, మలేరియా, ఆరోగ్యశ్రీ, 104, డీఐఓ, డీఎల్ఏటీ తదితర అనుబంధ విభాగాలకు కలిపి మొత్తంగా ఏడు అద్దె వాహనాలు తీసుకున్నారు. కొందరు సొంత వాహనాలకే ఎల్లో ప్లేట్ అమర్చి.. అద్దె తీసుకుంటున్నట్లు తెలిసింది. మరో అధికారి మినీ వాహనం (ఐదు సీట్లు) వినియోగిస్తూ.. పెద్ద వాహనం (ఏడు సీట్లు) వాడుతున్నట్లుగా అధిక మొత్తంలో అద్దె డ్రా చేస్తున్నట్లు సమాచారం. ఒకే శాఖలో ఏడుగురు అధికారులకు ప్రభుత్వం అద్దె చెల్లించడం ఏమిటని మిగతా విభాగాల సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. చిన్న కారుకు నెలకు రూ.35 వేలు, పెద్ద వాహనం అయితే రూ.45 వేలు అద్దె వసూలు చేస్తారు. ప్రతి నెలా వైద్య, ఆరోగ్య శాఖకే అద్దె కార్ల రూపంలో ఖజానా నుంచి రూ.లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల కళ్లు కప్పి అద్దె కార్ల దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హిందూపురం నుంచి రోజూ వచ్చి వెళ్లే ఓ అధికారి చిన్న వాహనం వాడుతున్నారు. అయితే పెద్ద వాహనం వినియోగిస్తున్నట్లు బిల్లులు డ్రా చేసినట్లు తెలిసింది. అదేవిధంగా మరో అధికారిణి తన సొంత వాహనం వినియోగిస్తూ.. అద్దె వాహనం వాడుతున్నట్లు ప్రతి నెలా రూ.35 వేలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఏ ప్రభుత్వ శాఖలో ఇన్ని అద్దె కార్లు లేవు. వైద్య,ఆరోగ్యశాఖ అధి‘కారు’ల దందా ఒక్క కార్యాలయంలోనే ఏడుగురికి అద్దె కార్లు కలెక్టర్, జేసీ మాత్రం ఇంధన పొదుపు మంత్రం ఈ–బైక్లో కార్యాలయాలకు వస్తున్న వైనం డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది మాత్రం కార్లలోనే షికారు నిబంధనలకు నీళ్లు.. ఈ చిత్రంలో ఈ–బైక్పై హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న వ్యక్తి మన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం ఇలా క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు బైక్పై వస్తున్నారు. ఆరోజు ఎక్కడికి వెళ్లినా బైక్పైనే వెళ్తున్నారు. జేసీ మౌర్య భరద్వాజ్ కూడా ఆర్టీసీ బస్సులో కలెక్టరేట్కు వస్తున్నారు. కానీ వైద్యఆరోగ్యశాఖలోని కొందరు ‘సార్లు’ మాత్రం ‘కార్లు’ లేనిది కాలు బయటపెట్టడం లేదు. ఉద్దరకొస్తోందని అద్దెకార్లలో షికార్లు చేస్తున్నారు. అధికారులకే బురిడీ.. సార్లు.. స్థానికంగా ఉండరు.. -
నీటి కోసం నిరసనాగ్రహం
మడకశిర: మూడు నెలలుగా తాగునీటి కోసం ముప్పుతిప్పలు పడుతున్నా పట్టించుకోని పాలకులు, అధికారుల తీరుపై మహిళలు మండిపడ్డారు. ఏకంగా ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో పాటు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్నా... మడకశిర మున్సిపాలిటీ 8వ వార్డులోని టైలర్స్ కాలనీకి మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచి పోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికేతరుడైన ప్రజాప్రతినిధి పత్తాలేకుండా పోయారు. దీంతో బుధవారం కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రోడ్డుపై బైఠాయించి ముళ్ల కంపలు రోడ్డుకు అడ్డంగా వేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. మూడు నెలలుగా కాలనీకి తాగునీరు సరఫరా చేయకపోవడంతో సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాల కోసం నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సమస్య గురించి పలుసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి టైలర్స్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు డిమాండ్ చేశారు. మడకశిరలో మహిళల ఆందోళన ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు మున్సిపల్ కార్యాలయం ముట్టడి -
బీమాకు మంగళం.. రైతుకు ద్రోహం
కదిరి: అన్నదాతలపై పైసా భారం పడకుండా గత ప్రభుత్వం ఐదేళ్లూ విజయవంతంగా అమలు చేసిన ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’కు చంద్రబాబు అధికారంలోకి రాగానే మంగళం పాడారు. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత బీమాను తీసుకొచ్చారు. ఫసల్ బీమా కింద కంది, జొన్న, వరి తదితర పంటలున్నాయి. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వేరుశనగ, అరటి వంటి పంటలున్నాయి. వరి పంటను గ్రామం యూనిట్గా, వేరుశనగను మండలం యూనిట్గా, కంది, జొన్న పంటలను జిల్లా యూనిట్గా పరిగణించారు. జగన్ హయాంలో బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తే ఈ ప్రభుత్వం ఆ భారం రైతుపై మోపింది. రెండేళ్లలో రూ.360 కోట్ల నష్టం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రెండు ఖరీఫ్, రెండు రబీ సీజన్లు పూర్తయ్యాయి. ఈ జూన్ నుంచి మళ్లీ ఖరీఫ్ ప్రారంభమైంది. ఈ రెండేళ్లలో ఒక్క రైతు కూడా బీమా ద్వారా లబ్ధి పొందలేదు. జిల్లాలో 2.96 లక్షల మంది రైతులున్నారు. వీరు ఏటా సరాసరిన రూ. 180 కోట్లు చొప్పున రెండేళ్లలో రూ.360 కోట్ల వరకు నష్టపోయారు. తప్పెవరిది? కేంద్రం తన వంతు ప్రీమియం వాటాను విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా పెండింగ్లో ఉన్నందున రైతులు బీమా సొమ్ము నష్టపోతున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధుల మాట అందుకు భిన్నంగా ఉంది. పంట నష్టం అంచనా వేయడంలోను, అలాగే క్షేత్ర స్థాయిలో పంటకోత ప్రయోగాల ఆధారంగా తుది జాబితా ప్రకటించడంలో అధికారులు చేసిన తప్పిదమేనని వారంటున్నారు. అంతిమంగా నష్టపోయింది మాత్రం అన్నదాతలే. అప్పుడు రూ.718 కోటు లబ్ధి జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాతో జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరింది. కదిరి నియోజకవర్గంలో 55,755 మంది రైతులకు రూ107.53 కోట్లు, ధర్మవరంలో 47,870 మంది రైతులకు రూ. 191.48 కోట్లు, పుట్టపర్తిలో 67,045 మందికి రూ. 78.8 కోట్లు, హిందూపురంలో 17,415 మంది రైతులకు రూ. 36.22 కోట్లు, మడకశిరలో 38,198 మంది రైతులకు రూ. 79.29 కోట్లు, పెనుకొండలో 24,276 మంది రైతులకు రూ. 99.29 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో జిల్లా పరిధిలో ఉన్న మూడు మండలాలకు చెందిన 60,118 మంది రైతులకు రూ125.96 కోట్ల లబ్ధి చేకూరింది. ఉచిత పంటల బీమాను పక్కన పెట్టిన బాబు సర్కారు ఫసల్బీమా పేరుతో ప్రీమియం కట్టించుకున్న ప్రభుత్వం రెండేళ్లుగా రైతుల ఖాతాల్లో జమకాని బీమా సొమ్ము గత ప్రభుత్వంలో విజయవంతంగా ఉచిత బీమా పథకం అమలు ప్రీమియం చెల్లించిన రైతులకే బీమా వాతావరణ బీమా ఏదైనా సరే.. ప్రీమియం చెల్లించిన వారికే వర్తిస్తుంది. అలాగే ప్రీమియం చెల్లించినప్పటికీ ఈ–క్రాప్ నమోదు చేయకపోతే బీమా రాదు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజనకు కూడా ఈ–క్రాప్ తప్పనిసరి. బీమా నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. –నారాయణ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ముదిగుబ్బ మండలం మర్తాడుకు చెందిన నారాయణరెడ్డి గత ఏడాది ఖరీఫ్లో 12 ఎకరాల్లో వేరుశనగ వేశాడు. వర్షాభావంతో పంట పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడులు కూడా చేతికందలేదు. మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో క్రాప్లోన్ ఉన్నందున బ్యాంకర్లు ఫసల్బీమా పేరుతో ప్రీమియం డబ్బు కట్టించుకున్నారు.కానీ ఆయనకు ఇంత వరకూ బీమా సొమ్ము అందలేదు. ఈ సమస్య ఈ ఒక్క రైతుదే కాదు. జిల్లాలోని రైతులందరిదీ ఇదే సమస్య. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రైతుకు కూడా పంటల బీమా అందలేదు. -
మహిళ ఆత్మహత్య
గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామానికి చెందిన మునగాల ప్రవల్లిక (27) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునగాల ఆదిశంకర్ భార్య మునగాల ప్రవల్లిక కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. గుత్తితో పాటు పలు ఆసుపత్రులతో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలను బయటకు పంపి తలుపులు మూసుకుని ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుంది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ప్రవల్లికను కిందకు దింపిన అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవల్లిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం● దంపతులకు గాయాలు ● కణేకల్లు సమీపంలో ఘటన కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంప తులు శోభ, తిప్పేస్వామి గాయపడ్డారు. హైదరాబాద్లో నివాసముంటున్న తిప్పేస్వామి వచ్చే నెలలో జరగనున్న తన కుమార్తె చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కారులో మండలంలోని మాల్యం గ్రామానికి వచ్చాడు. పెళ్లి పత్రి కలు పంచి కారులో బళ్లారికి వెళ్తూ మార్గమధ్యంలోని ఆలూరు వద్ద పైప్లైన్ పనులు చేస్తున్న హైడ్రాలిక్ క్రేన్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. శోభ, తిప్పేస్వామికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కటకటాల్లోకి గంజాయిబ్యాచ్ తాడిపత్రిటౌన్: రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి బ్యాచ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన కరీమ్, ప్రకాష్నాయుడు, అస్రాబ్, మరో ఇద్దరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు గాయపడిన శోభ, తిప్పేస్వామి -
పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేక బలవన్మరణం
యాడికి: పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి ఆసుపత్రి కాలనీలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న నేత కార్మికులు శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు కుమారుడు జగదీష్, కుమార్తె పల్లవి ఉన్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తాండా సమీపంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో పల్లవి 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 12 నుంచి పాఠశాలకు విద్యార్థులందరూ వెళ్తున్న నేపథ్యంలో నీవెప్పుడు వెళ్తావని పల్లవిని మంగళవారం తల్లి లక్ష్మి అడిగింది. ఆశ్రమ గిరిజన పాఠశాలలో చదవడం తనకు ఇష్టం లేదని పల్లవి చెప్పడంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శ్రీనివాసులు, లక్ష్మిలు తమ ఇంటి సమీపంలోని షెడ్డులో మగ్గం నేసేందుకు వెళ్లగా, పల్లవి ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చెట్టుకు వేలాడుతున్న పల్లవిని కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ధర్మవరం వాసికి కేంద్ర ప్రభుత్వ అవార్డు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణానికి చెందిన జానపద గాయని సోమిశెట్టి సరళ కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించిన డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ (డీడీఆర్) ప్రాజెక్టు ముగింపు వేడుకల్లో భాగంగా ప్రాజెక్ట్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్, చారిత్రక పరిశోధకురాలు, గాయని సోమిశెట్టి సరళకు కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం, అవార్డు అందించేందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 25న న్యూఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల చేతులమీదుగా సరళ అవార్డు అందుకోనున్నారు. ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర’ను జయప్రదం చేయండి ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 20 నుంచి నిర్వహించే ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ను నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదట పారిశుధ్యం, గృహ నిర్మాణం, తాగునీరు, హరితాంధ్ర, వాట్సాప్ గవర్నెన్స్ తదితర 9 అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవలపై వచ్చే ప్రతి కూల వార్తలపై వెంటనే స్పందించాలన్నారు. వాస్తవలను పరిశీలించి వివరణ ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా పనులు సాగాలన్నారు. అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో మొక్కలు విరివిగా నాటాలని, అవి వంద శాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ఎద్దడి, సూర్యఘర్, గృహ నిర్మాణం, జలధార పనులను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, కమిషనర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఏఎస్ పోస్టుల భర్తీకి చర్యలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) చైర్మన్, కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 16, సీఏఎస్ జనరల్ పోస్టులు 10 చొప్పున మొత్తం 26 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ఆసక్తి, తగిన అర్హత ఉన్న వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http:// ananthapuramu. ap. gov. in వెబ్సైట్ను పరిశీలించవచ్చు. సీబీఆర్ నుంచి 200 క్యూ సెక్కుల నీరు విడుదలతాడిమర్రి: మండల సరిహద్దులోని పార్నపల్లి వద్ద నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి మంగళవారం సీబీఆర్ అధికారులు దిగువకు (చిత్రావతి నది) 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీబీఆర్ డీఈ చంద్ర సురేష్ జలాశయం 7 గేట్లలో ఒక దానిని 8 సెంటీమీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ సీబీఆర్ దిగువన ఉన్న చిత్రావతి నది, నదీ పరివాహక గ్రామాల్లో వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఏడాది 1.50 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేశామన్నారు. రోజూ 200 క్యూసెక్కుల ప్రకారం 30 రోజుల పాటు విడుదల చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సీబీఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు ‘శిక్ష’ణ
పుట్టపర్తి అర్బన్: ‘నవచేతన’ యాప్పై శిక్షణ పేరుతో తమకు శిక్ష వేశారని పలువురు అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ రోజు భోజనాలు, టీ, స్నాక్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన డబ్బును అధికారులు తమ ఖాతాలకు వేసుకున్నారంటున్నారు. రూ.50 వేలు మంజూరైనా... ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నవచేతన యాప్పై శిక్షణ ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మండలంలోని ఏదో ఒక కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ఒక్కో కార్యకర్తకు రూ.250 మంజూరు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే పుట్టపర్తి ప్రాజెక్టులోని పుట్టపర్తి రూరల్, మున్సిపాలిటీ, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు ఉన్నాయి. ఇందులో 203 మంది కార్యకర్తలు ఉన్నారు. వీరంతా ఈనెల 5, 6, 8 తేదీల్లో శిక్షణకు హాజరయ్యారు. అయితే శిక్షణ రోజు ప్రతి కార్యకర్తకూ, వైద్య సిబ్బందికి భోజనం అందించాల్సి ఉంది, శిక్షణ కేంద్రాలకు వచ్చిన సందర్భంగా వారికి చార్జీలు కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే ఇవేవీ లేకుండానే సంబంధిత సీడీపీఓ శిక్షణ ముగించారు. భోజనం అడిగిన కార్యకర్తలను విజిట్ పేరుతో ఇబ్బంది పెట్టినట్లు బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల కార్యకర్తలు ప్రాజెక్టు డైరెక్టర్కు, సంఘ నాయకులకు పిర్యాదు చేశారు. కొత్తచెరువు ,బుక్కపట్నం మండలాలకు చెందిన వర్కర్లకు సుదూర ప్రాంతాల్లో కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి కనీసం భోజనాలు, టీ, స్నాక్స్ అందించకుండా కడుపు మార్చారని కొందరు అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. రూ.50 వేలకు పైగా బిల్లు మంజూరైనా అంతా సీడీపీఓ ఖాతాలో వేసుకున్నారంటున్నారు. శిక్షణ సమయంలోనే బిల్లులు చెల్లించినట్లు, భోజనం, టీ, స్నాక్స్ ఇచ్చినట్లు సంతకాలు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి తమను ఆకలితో మాడ్చిన సీడీపీఓపై చర్యలు తసుకోవాలని బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల కార్యకర్తలు కోరుతున్నారు. ఆకలితో అలమటించిన అంగన్వాడీ కార్యకర్తలు డైరెక్టర్ ఆదేశాలు పాటించని సీడీపీఓ -
నేటి నుంచి గూగూడు ఉత్సవాలు
నార్పల : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ రాష్ట్రంలోనే పేరుగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి వార్షిక ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 13 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు ఈ నెల 29వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో (పీర్ల పండుగలో) భాగంగా ఈ నెల 17న గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం ఉంటుంది. 18న స్వామికి నిత్యపూజ నివేదన, 19న అగ్నిగుండం ఏర్పాటు, 20న పీర్లను కొలువుదీర్చడం, 21న నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదవ సరిగెత్తు, 23న నిత్యపూజ నివేదన, 24న ఏడవ సరిగెత్తు, రాత్రికి మెరవణి, 25న నిత్యపూజ నివేదన, విడిదినం, 26న గ్రామోత్సవం, పెద్దపరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. 27న సాయత్రం 4 గంటలకు జలధికి పోవుట, 29న స్వామివారి చివరి దర్శనం ఉంటుంది. అరకొరగానే సదుపాయాలు : గూగూడు కుళ్లాయిస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏటా గణనీయమైన ఆదాయం వస్తున్నా సౌకర్యల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఉత్సవాలకు వచ్చే మహిళలు, వృద్ధులు చిన్నారుల కోసం సరిపడ మరుగుదొడ్లు లేకపోవడం, స్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం తీవ్రమైన లోపంగా మారింది. తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, వసతి గదులు లేకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాథమిక అంశాలపైనా దృష్టి సారించలేదు. మందుబాబులతో జాగ్రత్త! ఉత్సవాల వేళ జూదం, అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో మందుబాబు చేష్టల వల్ల మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కక్ష కట్టి.. కష్టాల్లోకి నెట్టి
పుట్టపర్తి అర్బన్: వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ‘తాత్కాలిక’ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. సిబ్బందిని తొలగించే కుట్ర పన్నుతోంది. ఇటీవల సహకార సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారిని ఉంచుకోవడం ఇష్టం లేని ప్రభుత్వం జూన్ నుంచి వేతనాలను ఆపింది. దీంతో చిరుజీవులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక సొసైటీల్లో చేరి కంప్యూటర్ పని, రుణాల వసూళ్లు, రికార్డు వర్క్ చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న తమపై ఇంత చిన్నచూపా అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద మందిపై వేటు! 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకూ పనిచేసిన సిబ్బందిని తొలగించి టీడీపీ కార్యకర్తలు, వారి సంబంధీకులను చేర్చుకున్నారు. సహకార సంఘాల్లో అధ్యక్షులను మార్పు చేసిన వెంటనే తాత్కాలిక సిబ్బందిలో భారీ మార్పులు చేశారు. 2019లో వచ్చిన వారంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ ఉన్నపళంగా తొలగించారు. వారి స్థానంలో ఒక్కో వ్యక్తి నుంచి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేసుకున్న నాయకులు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారంతా ఉద్యోగంలో చేరి ఏడాది కూడా పూర్తి కాకుండానే తొలగించే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. సాధారణంగా సొసైటీలో ఒక సీఈఓ, ఒక క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ ఉంటారు. అయితే టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ఒక్కో సొసైటీలో ఇద్దరు నుంచి నలుగురిని చేర్చారు. ప్రస్తుతం వారందరికీ జూన్ నెల వేతనాలు ఆపారు. సిబ్బంది సంఖ్య అధికం కావడంతో సొసైటీ నష్టాల బాటపడుతోందని,వారిని తొలగిస్తే లాభాల్లోకి రావొచ్చని జిల్లా నాయకులు నిర్ణయించినట్లు తెలిసింది. ‘సహకార’ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు 2019 తర్వాత సొసైటీల్లో చేరిన వారిని తొలగించే కుట్ర జీతాలు నిలిపేయడంతో లబోదిబోమంటున్న సిబ్బంది త్వరలో నిరసనలు జిల్లాలో 54 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో ఇటీవల 100 మందికి పైగా ఉద్యోగాల్లో చేరారు. వారందరికీ నెలకు రూ.15 వేల వరకూ వేతనాలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడాది పాటు నెలనెలా వేతనాలు అందుకున్నారు. ఇక వేతనాలు రావని తెలిసి ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం పుట్టపర్తిలోని సీపీఎం కార్యాలయంలో సీపీఎం నాయకులను కలిసి సమస్యను తెలియజేశారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటించి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. -
పారదర్శకమైన, సమగ్రమైన ఓటరు జాబితాలు రూపొందించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–‘సర్’) ప్రక్రియ ఈ నెల 15న మొదలైంది. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా.. లేదా.. విచారించ
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘సర్’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ‘సర్’ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ‘ఎస్ఐఆర్ (సర్)’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు ఉన్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయినవారు, వలసలు, డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లూ తిరిగి వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తే.. వాటిని పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్ చేయాలి. సెప్టెంబర్ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14వ తేదీకే అనంతపురం జిల్లాలో 77.55 శాతం మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బీఎల్ఓలు ఏంటికి వెళ్లారు.. ఎవరిని విచారించారు.. అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకూ తెలీదు. మీడియాకు సమాచారమూ లేదు. అలాంటప్పుడు జూన్ 15 కంటే ముందుగానే మ్యాపింగ్ను బీఎల్ఓలు ఎలా చేశారు.. అందులో పారదర్శకత ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడితోనే హడావుడి మ్యాపింగ్ ఓ జిల్లా అధికారి ఒత్తిడితోనే ఓటరు మ్యాపింగ్ను హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే స్వయంగా చెబుతున్నారు. ‘ఏం చే స్తాం సార్. మాపై అలాగే ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్ చేశాం’ అని చెబుతున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 77.55 శాతం పూర్తయింది. అంటే మిగిలింది 22.45 శాతం మాత్రమే. రాయదుర్గంలో 82.73, ఉరవకొండలో 73.18, తాడిపత్రిలో 76.94, శింగనమల 79.80, కళ్యాణదుర్గం 78.11, రాప్తాడు (అనంతపురం జిల్లాలోని పరిధి) 73.29 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మ్యాపింగ్లో కుట్రకోణం మ్యాపింగ్ ముందుగా చేయడంలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. మొదట ఓట్లు మ్యాపింగ్ చేస్తే ఆపై రాజకీయపార్టీల పరిధిలోని బీఎల్ఏలు అభ్యంతరాలు ఉంటే లేవనెత్తుతారు. అప్పుడు ఓట్లు తొలగిద్దామనే ఆలోచనను అధికారులు చేసినట్లు తెలిసింది. ఈ లెక్కన అధికారపార్టీ బీఎల్ఏలు ఇచ్చిన జాబితా ప్రకారం ఓట్లు తొలగిస్తే.. విపక్షపార్టీల ఓట్లు మాత్రమే గల్లంతయ్యే అవకాశం ఉంది. పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం అనంతపురం నియోజకవర్గంలో 2002లో ఉన్న ఓట్లు 1,86,925. ఈ ఓట్లు 2025కు 2,82,463కు పెరిగాయి. ప్రస్తుతం మ్యాపింగ్ చేసిన ఓట్లు 1,86,214. ఇక మ్యాపింగ్ చేయాల్సింది 96 వేలపై చిలుకు ఓట్లు. ఇక్కడ 65.93 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. 2002లో రాప్తాడు.. అనంతపురం నియోజకవర్గంలోనే ఉండేది. అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా పెరిగింది. కొత్త ఓటర్లు భారీగా చేరారు. రాప్తాడు పూర్తిగా దూరమైంది. ఉద్యోగులు, బదిలీలతో పాతవారు వెళ్లడం, కొత్తవారు చేరడం ఇక్కడ అధికం. అయినప్పటికీ దాదాపు 66 శాతం మ్యాపింగ్ చేశారు. ఇది నమ్మశక్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. ‘సర్’ సర్వేపై రాజకీయపార్టీల్లో సందేహాలు ఈ నెల 15 నుంచి ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్ఓలు, బీఎల్ఏలు 14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 77.55 శాతం పూర్తి చేసిన అధికారులు రాష్ట్రంలో మరే జిల్లాలో కూడా ఈ స్థాయిలో మ్యాపింగ్ కాని వైనం ఓ జిల్లా అధికారి ఒత్తిడితో ఓటరు జాబితాలు పెట్టుకుని ఇంటిపేరు పోలితే చాలు మ్యాపింగ్ ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరు మరో బూత్ పరిధిలోకి ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్ చేయాలి. చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి. జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరాబాద్, బెంగళూరులో కూడా ఉన్నాయి. అంతర్రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్ చేసి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా గుర్తిస్తారు. డబుల్ ఓట్లు తేలితే అప్పుడు ఫాం–ఏ, బీ ఇచ్చి.. ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి. -
‘పల్లె’ వద్ద తహసీల్దార్ పంచాయితీ
సాక్షి, పుట్టపర్తి: ‘సార్.. మనకు పాత ఎమ్మార్వో గారే మేలు. చెప్పిన ప్రతి పని చేసే వారు. అలాంటి వ్యక్తికే మరోసారి బాధ్యతలు ఇప్పించండి. కొత్తగా వచ్చిన మేడం మనకు అనుకూలంగా పని చేసే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి డీటీగా ఉన్న స్వామికే మళ్లీ బాధ్యతలు ఇప్పించండి. మనకు అన్ని విధాలుగా పనులు జరుగుతాయి’ అని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వద్ద ‘తెలుగు తమ్ముళ్లు’ పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. అయితే తనకు సంబంధం లేదని.. ఉన్నతాధికారుల నిర్ణయమే ఫైనల్ అని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. డీటీగా ఉన్న వారితోనే నచ్చిన పని చెప్పి చేయించుకుంటే సరిపోతుందని సర్దిజెప్పినట్లు సమాధానం. మరోవైపు కొత్త తహసీల్దార్ వద్దని.. పంపించేయాలని కొందరు పట్టుబట్టగా.. మాజీ మంత్రి పట్టించుకోలేదని తెలిసింది. మాజీ మంత్రి ఫిర్యాదుతోనే.. బాధ్యతల నుంచి తప్పించారని మరోవైపు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొత్తగా వచ్చిన అధికారి ఉంటారా? లేక పాత వాళ్లని తెస్తారా? ఇద్దరినీ తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పజెబుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక కుట్రలెన్నో.. కొత్తగా వచ్చిన అధికారిణి ఉన్నఫలంగా పుట్టపర్తికి నియమితులయ్యారు. అంతకుముందు కొత్తచెరువుకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఇచ్చి.. గంటల వ్యవధిలోనే పుట్టపర్తికి మార్చారు. ఈ నియామకాన్ని కూటమి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త అధికారి వచ్చిన రోజు నుంచి షాడో ఎమ్మెల్యేగా పేరుగాంచిన నాయకుడు మాజీ మంత్రి వద్ద పంచాయితీ పెట్టారట. ఎలాగైనా పంపించేయాలని కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ప్రొటోకాల్ కష్టం అవుతుందని.. తమకు అనుకూల పనులు చేయరని.. ఏవేవో ఫిర్యాదులు చేస్తున్నారు. పుట్టపర్తిలో ఇటీవల ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్టు ఎయిర్ క్రాఫ్ట్) ఏర్పాటుకు భూమిపూజ చేశారు. భూ సేకరణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అంతకుముందు ఉన్న అధికారితో కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఉన్నఫలంగా అధికారి మారడంతో దిక్కు తోచని స్థితిలో కొందరు టీడీపీ కార్యకర్తలు మహిళా అధికారిపై కుట్ర చేస్తున్నారని సమాచారం. లెక్క లేనన్ని ఫిర్యాదులు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పుట్టపర్తి మండలం పెడపల్లిలో భూ తగాదాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు సిండికేటుగా మారి భూమి కబ్జా చేసి పెద్ద భవనాలు కూడా నిర్మించారు. ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అప్పటి అధికారి కొట్టిపారేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అధికార పార్టీ అండతో డ్వామా నర్సరీ ఆక్రమించాడు. కంచె వేసుకుని మామిడి, కొబ్బరి చెట్లు కూడా నాటించాడు. పెడపల్లిలో రస్తా పొరంబోకులో ఇల్లు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. అయితే కొత్తగా వచ్చిన అధికారి ఇలాంటి తప్పిదాలే చేస్తారా? లేక తమదైన శైలిలో విధులు నిర్వర్తిస్తారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించి పుట్టపర్తి మండలంలో భూ సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. సంబంధిత అధికారి పట్టించుకునే వారు కాదు. సోమవారం రోజున కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తే.. అక్కడి నుంచి అడిగే ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చేవారని తెలిసింది. ఉన్నతాధికారులనే సైడ్ ట్రాక్ చేసి తప్పుడు ఫిర్యాదులని చెబుతూ పబ్బం గడిపినట్లు సమాచారం. పంపించేందుకే పట్టుబట్టిన తమ్ముళ్లు చెప్పిన పని చేసే అధికారిని మళ్లీ తెచ్చుకుందామని ఒత్తిళ్లు ససేమిరా అంటున్న మాజీ మంత్రి -
స్కార్పియో బోల్తా.. ఐదుగురికి గాయాలు
కదిరి టౌన్: స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో 5 మందికి గాయాలైన సంఘటన కదిరి మండలం సున్నపుగుట్ట తాండా సమీపంలోని కొత్త బైపాస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లు మండలం చీకటిమాను పల్లి నుంచి టీడీపీ నాయకులు స్కార్పియోలో బయలుదేరి వస్తుండగా కదిరి మండలం కొత్త బైపాస్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వాహనం బోల్తా పడింది. దీంతో టీడీపీ నాయకులు వెంకటప్ప, యోగేంద్ర, శివన్న, పూజారి క్రిష్టప్ప, రాముకు గాయాలయ్యాయి. స్థానికలు గమనించి కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటప్ప, క్రిష్టప్పకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. -
గురికానివారిపల్లిలో దాహం కేకలు
ఎన్పీకుంట: మండల పరిధిలోని గురికానివారిపల్లి గ్రామంలో గత నెలన్నర రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీ బోరు మోటరు మరమ్మతులకు గురయ్యిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు పైగా ఉన్నారని, దాహార్తి తీర్చుకోవడం కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించి, బిందెలతో నీరు మోసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అధికారులు స్పందించి బోరు మోటరుకు మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. ధర్మవరం వన్ టౌన్, టూటౌన్కు కొత్త సీఐలుధర్మవరం అర్బన్: ధర్మవరం వన్ టౌన్ సీఐగా రెడ్డెప్ప, టూ టౌన్ సీఐగా జయానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వన్ టౌన్ సీఐగా ఉన్న నాగేంద్రప్రసాద్ గుంతకల్లు రైల్వే సీఐగా బదిలీపై వెళ్లడంతో టూ టౌన్ సీఐగా ఉన్న రెడ్డెప్పను వన్టౌన్ సీఐగా బదిలీ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఐగా ఉన్న జయానాయక్ను టూ టౌన్ సీఐగా నియమించారు. కాలువ పూడ్చివేత పనులు అడ్డగింతచిలమత్తూరు: పెన్నానది నుంచి మండల పరిధిలోని చౌళూరు చెరువు వరకూ ఉన్న ఉప కాలువను కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు పూడ్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా చౌళూరు గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనాదిగా ఉన్న కాలువను పూడ్చి వేసి చౌళూరు చెరువుకు వస్తున్న నీటిని అడ్డుకునేందుకు యత్నించడం దుర్మార్గమన్నారు. అధికారులు కాలువను పూడ్చివేయకుండా తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ సర్పంచ్లు లోకేష్రెడ్డి, నంజప్ప, రాజు, శివ, సురేష్, చంద్రప్ప, ప్రకాష్, వాసు తదితరులు పాల్గొన్నారు. గంజాయి, నకిలీ నోట్ల పట్టివేత ● ఇద్దరి అరెస్టు గుత్తి: గంజాయితో పాటు నకిలీ నోట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్ తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామా నికి చెందిన సి.గోపాల్, దిమ్మగుడికి చెందిన బద్రి బైక్లో గంజాయి, నకిలీ నోట్లు తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలోనే గుత్తి అనంత పురం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్లు వారిని పట్టుకున్నారు. బైక్లో ఉన్న 20 గ్రాముల గంజాయి, 47 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుత్తికి చెందిన రమేష్కు గంజాయి, నకిలీ నోట్లు ఇచ్చి కేసులో ఇరికించాలని నిందితులు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వారిని జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. ఇంట్లో బంగారు నగల అపహరణ ● 6 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు అనంతపురం సెంట్రల్: ఇంట్లో బంగారు నగ లను అపహరించిన ఘటన నగరంలోని కోవూరునగర్లో జరిగింది. 6 నెలల తర్వాత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నాల్గో పట్టణ ఎస్ఐ కె.గోపి తెలిపిన మేరకు.. గతేడాది డిసెంబర్లో కోవూరునగర్లో నివాసముంటున్న మహబూబ్బాషా నివాసంలో దొంగతనం జరిగింది. బీరువాలో ఉంచిన 13.5 తులాల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని బాధితులు మంగళవారం నాల్గవ పట్టణ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. -
రైల్లో దోపిడీ షోలాపూర్ గ్యాంగ్ పనేనా?
గుత్తి రూరల్: గుత్తి శివారులో రైలులో దోపిడీకి పాల్పడింది షోలాపూర్ గ్యాంగ్ పనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బాపట్ల వద్ద, గుత్తి శివారులో ఒకే రోజు ఒకే సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారి బంగారు, విలువైన వస్తువులు, సెల్ఫోన్లను అపహరించారు. గుత్తి శివారులో 2025 ఏప్రిల్లో ఇదే తరహాలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిలిపి ఉంచిన రైళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి నుంచి గుత్తి శివారులోని పెద్ద బ్రిడ్జి వద్ద ప్రతి రోజూ ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను గస్తీకి ఉంచేవారు. ఇటీవల ఎక్కడా గస్తీ లేకపోవడం పసిగట్టిన దొంగలు కార్యాచరణ అమలు చేశారు. ప్రయాణికుల ముసుగులో చేరతారు.. ముఠాలోని ఇద్దరు సభ్యులు రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణిస్తూ బందోబస్తు పోలీసులు లేని కోచ్లలోకి ప్రవేశించి, ఎంతమంది మహిళలు బంగారు ధరించారు అనే విషయాలను ముఠా సభ్యులకు చేరవేసి దోపిడీలకు పాల్పడటం వారి నైజం. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ పోలీసులు గస్తీకి వెళ్లి ఉంటే దోపిడీ జరిగేది కాదని పలువురు చెబుతున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో బందోబస్తు ఉన్న పోలీసులు ఏసీ బోగీలోకి వెళ్లి పడుకుంటారని, దీంతో దొంగలకు దోపిడీ సులువవుతోందంటున్నారు. గుత్తి శివారులో రైల్వే ట్రాక్లకు సమాంతరంగా జాతీయ రహదారులు ఉండటంతో సులువుగా ఉడాయిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుని గుత్తి శివారులో పెద్ద బ్రిడ్జి, తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, గుత్తి–జక్కలచెరువు మధ్యలో రోజూ రాత్రి సమయాలలో గస్తీ పెంచి దోపిడీలను అరికట్టాలని కోరుతున్నారు. -
అటవీ సంపద హాంఫట్!
ఎన్పీకుంట: మండలంలో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కళ్లముందే కలప, సండ్ర కట్టెల లోడుతో ట్రాక్టర్లు, లారీలు దూసుకుపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. వాస్తవానికి నిబంధనల మేరకు చెట్లు కొట్టాలంటే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. అటవీ సంపదను కొల్లగొట్టి దర్జాగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలోని సోమరాజుకుంట, తాటిమానుగుంత, పడమరనడిమిపల్లి, గౌకనపల్లి, మరికొమ్మదిన్ని పరిధిలో అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సండ్ర చెట్లు పెరిగాయి. ఈ చెట్లను నరికి డంప్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు గడుస్తున్నారు. యథేచ్ఛగా సండ్ర చెట్లను నరికి తరలిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడు సండ్ర కట్టెల లోడును మండల సరిహద్దును దాటించేందుకు టన్నుల ప్రకారం రేటు కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మమ్మ, డీటీ దేవేంద్రనాయక్ వివరణ కోరగా అటవీ, రెవెన్యూ భూములలో ఉన్న సండ్ర చెట్లను నరికివేయడం చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. -
రైలు ఢీకొని తెగిన చేయి
● మద్యం సేవించి పట్టాలు దాటుతుండగా ప్రమాదం ధర్మవరం: మద్యం సేవించి పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి చేయి తెగి పడిన సంఘటన ధర్మవరంలో జరిగింది. హిందూపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాల మేరకు... ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా మస్తీపుట్ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ కుమారుడు పొదుమ్ ధర్మవరం పట్టణం లక్ష్మీచెన్నకేశవపురం కాలనీకి వలస వచ్చాడు. సిమెంట్ కాంక్రీట్ పనులకు వెళుతూ జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి బయటకు వెళ్లి మద్యం సేవించాడు. అనంతరం లక్ష్మీచెన్నకేశవపురంలోని నివాసానికి వెళుతూ మార్గమధ్యంలోని పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొంది. ప్రమాదంలో అతని ఎడమ చేయి తెగిపోయింది. అయినా నివాసానికి వచ్చిన అతడిని తోటి కూలీలు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, మిల్లర్లో చేయి పెట్టడం వల్ల పొదుమ్ చేయి కట్ అయిందని ఆసుపత్రిలో రికార్డుల్లో రాయించడం గమనార్హం. రైలు పట్టాల వద్ద తెగిపడిన చేయిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారణ చేయగా, అసలు విషయం వెలుగుచూసింది. ఈ క్రమంలో పొదుమ్ చిన్నాన్న గోవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యబత్తలపల్లి/ముదిగుబ్బ: మండల పరిధిలోని చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ షణ్ముఖరెడ్డి, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ పుల్లయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నేకుంటపల్లి వద్ద రైల్వే బ్రిడ్జికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (30 నుంచి 40 సంవత్సరాలు) సెవెన్హిల్స్ రైలు కింద పడి మృతి చెందినట్లు లోకో పైలట్ ద్వారా సమాచారం అందింది. ముఖం గుర్తు పట్టేందుకు కూడా వీల్లేనంతగా మారింది. వంగపూత రంగు లుంగీ ధరించాడని, శరీరం బలిష్టంగా ఉందని, సున్తీ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఎరుపు, నలుపు రంగుల చెప్పులు సంఘటనాస్థలంలో లభించాయి. వివరాలు తెలిస్తే 9440557054, 9951325345 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. -
తాత అంత్యక్రియలను అడ్డుకున్న మనవడు
● భూమి తన పేరుతో రాయాలని డిమాండ్ కదిరి అర్బన్: సమాజంలో రోజురోజుకూ నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. ఆస్తి కోసం ఎంతకై నా తెగిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తన, పర అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కదిరి పరిధిలో జరిగిన ఓ ఘటన ఈ కోవలోకి వస్తుంది. వివరాలు... కదిరి మండల పరిధిలోని యాకాల చెరువుపల్లికి చెందిన రామచంద్ర (75) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు సరస్వతి, అరుణమ్మ, రమణమ్మతో పాటు కుమారుడు శేఖర్ ఉన్నారు. ఐదేళ్ల క్రితమే శేఖర్ చనిపోయాడు. అయితే రామచంద్ర ... తన రెండో కుమార్తె అరుణమ్మకు తనకున్న 70 సెంట్ల పొలాన్ని రిజిస్టర్ చేశాడు. ఈ నేపథ్యంలో రామచంద్ర చనిపోయాడు. తన తాత భూమిని తన పేరుతో రాయాలంటూ శేఖర్ కుమారుడు చెన్నకేశవ... రామచంద్ర అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడు. దీంతో గ్రామ పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. భూమి రాయిస్తామని చెన్నకేశవకు నచ్చజెప్పి అంత్యక్రియలను జరిపించారు. పెన్షన్ కోసం 14 ఏళ్లుగా ఎదురుచూపు● పట్టించుకోని ఆర్టీసీ అధికారులు కదిరి అర్బన్: తన భర్త చనిపోయి 14 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు తనకు వితంతువు పెన్షన్ మంజూరు చేయలేదని షాకిరున్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి వివరాలమేరకు... కదిరి ఆర్టీసీ డిపోలో జాకీర్ హుస్సేన్ డ్రైవర్గా పనిచేసేవారు. అయితే 2012లో కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి చెరువులో పడి మృతిచెందారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పెన్షన్ కోసం జాకీర్ హుస్సేన్ భార్య షాకిరున్ ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా నేటికీ మంజూరు కాలేదు. భర్తను కోల్పోవడంతో పాటు నలుగురు పిల్లలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితురాలు షాకిరున్ వాపోతున్నారు. బీడీలు చుట్టేందుకు వెళ్తున్నాని, వచ్చే అరకొర సంపదన తినడానికి కూడా సరిపోవడంతో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ అధికారులు , ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను విన్నవించినా ఫలితం లేదన్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు స్పందించి పెన్షన్, తన పిల్లలకు ఆర్ఫాన్ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని విన్నవించారు. వ్యక్తిపై పోక్సో కేసు గుత్తి రూరల్: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మంగళవారం గుత్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు వ్యక్తిని గతంలోనే తీవ్రస్థాయిలో మందలించారు. అయితే వారం రోజుల నుంచి తిరిగి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం శ్రీనివాసులుపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. -
‘జననేత జగనన్న ప్రజాసంకల్ప పాదయాత్ర’ పుస్తకావిష్కరణ
అనంతపురం: వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా రచించిన ‘జననేత జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర’ పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆవిష్కరించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రతో పాటు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాల గురించి పుస్తకంలో వివరించినట్లు రచయిత కట్టుబడి తానీషా పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ సాకే శైలజానాథ్, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి, డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ టీచర్ పొలమడ రమేష్ బాబు, రవి తదితరులు పాల్గొన్నారు. -
‘కూటమి’ చేసింది గోరంత.. ప్రచారం కొండంత
పుట్టపర్తి టౌన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో ప్రజలకు గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడానికి విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ విమర్శించారు. మంగళవారం పుట్టపర్తిలో సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారన్నారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు ఇవ్వలేదన్నారు. కార్పొరేట్ సంస్థల ద్వారా కమీషన్లు పొందడంపై చూపిస్తున్న శ్రద్ధ పేద ప్రజల సంక్షేమం చూపడం లేదన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయబద్ధంగా పరిహారం అందించాలని, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చిలమత్తూరులో సర్వే నంబర్ 805లో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు భూ సేకరణ చేపట్టగా, అనివార్య కారణాలతో పట్టాల పంపిణీ ఆగిపోయిందన్నారు. అప్పట్లో టీడీపీ నాయకులు అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేడు రెండేళ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 వంటి పథకాలు అమలు చేయలేదన్నారు. ప్రజలను మరోసారి మోసం చేయడానికే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కమిటీ నాయకులు లక్ష్మినారాయణ, ఫిరంగి ప్రవీణ్, జీఎల్ నరశింహులు, దిల్షాద్, హరి, జెంగాలపల్లి పెద్దన్న, జెడ్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత.. నగుబాటు
● ధర ఎక్కువ... విత్తనాలు తక్కువ ● విత్తన వేరుశనగపై ఆసక్తి చూపని రైతులు కనగానపల్లి: రైతు సంక్షేమాన్ని విస్మరించి చంద్రబాబు సర్కార్...చివరకు సబ్సిడీ విత్తనం పేరుతో రైతును నిండా ముంచుతోంది. ఖరీఫ్లో వేరుశనగ సాగుచేసే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయల పంపిణీని జిల్లాలో హడావుడిగా ప్రారంభించింది. అయితే విత్తనం నాసిరకంగా ఉండటంతో చాలా మంది రైతులు కొనుగోలు చేయడం లేదు. ఈ క్రమంలోనే నాలుగురోజుల క్రితం మండల కేంద్రమైన కనగానపల్లిలో విత్తన కాయల పంపిణీ ప్రారంభించగా...కొనేందుకు రైతులెవరూ రాలేదు. సాధారణంగా ప్రతి ఖరీఫ్ సీజన్లో మండలంలో 5 వేల క్వింటాళ్ల వరకు విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేస్తారు. ఈ సంవత్సరం కూడా తొలి విడతలో 2,500 క్వింటాళ్ల విత్తనం కావాలని మండల వ్యవసాయాధికారి మాధురి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో 5 రోజుల క్రితం కనగానపల్లిలో వ్యవసాయ గోదాముకు ఒక లారీ విత్తన వేరుశనగను సరఫరా చేశారు. అయితే విత్తన కాయలను గ్రేడింగ్ చేయకపోవటంతో పాటు కల్తీ కాయలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు కొనుగోలుకు ముందుకు రాలేదు. అయితే అదనులోనే విత్తనం వేయాలనుకున్న కొందరు రైతులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విత్తనాలే తీసుకువెళ్లారు. గ్రేడింగ్ చేయలేదు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలను గ్రేడింగ్ చేయలేదు. కాయల్లో పుల్లలు, రాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకే రకం కాయలు కాకుండా అన్ని రకాల కాయలు కలిపి పంపిణీ చేస్తున్నారు. కాయలు వలిస్తే విత్తనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే తీసుకుపోతున్నాం. – సి. రవి, రైతు, కనగానపల్లి -
రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
ధర్మవరం అర్బన్: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ ఆదేశించారు. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం వైద్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ.68 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు రూ.98 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు ఆసుపత్రికి అందించామన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రిలో ఎక్కడా పరిశుభ్రత లోపం ఉండకూడదని తెలిపారు. రోగులకు అవసరమైన తాగునీరు, బాత్రూంలు, వీల్చైర్లు, స్ట్రెచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నరసింహులు, సోనియా, హరి శ్రీనివాసులు, సుబ్బారావు, గుండా పుల్లయ్య, నజీర్, ముక్తియార్ అహ్మద్, నితిన్, రాముడు, నివేదిత, చంద్రిక, రమాదేవి, పూర్ణచంద్ర, వైద్య,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాల అందజేత పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను మంత్రి సత్యకుమార్యాదవ్ చేతులమీదుగా పంపిణీ చేశారు. మంత్రి సత్యకుమార్ -
పుట్టపర్తిలో ధ్వంస రచన
పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు పాలన ‘‘కట్టేది తక్కువ...కూల్చేది ఎక్కువ’’ అన్నట్లుగా సాగుతోంది. అభివృద్ధిని విస్మరించిన అధికారపార్టీ నేతలు.. గతంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ రౌడీ పాలన ఎలా ఉంటుందో చూపుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర వాటిపై ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేశారు. తాజాగా...వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ పచ్చని పల్లెల్లో అలజడి సృష్టిస్తున్నారు. జనం చీవాట్లు వినలేక.. పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి 193 చెరువులు నింపాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఒప్పించి అనుమతులు తెచ్చారు. అంతేకాకుండా రూ.864.18 కోట్ల నిధులు తెచ్చి 2024 జనవరి 27న పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అప్పట్లోనే రూ.కోట్ల విలువైన భారీ పైపులను చెర్లోపల్లి వద్దకు చేర్చారు. ఐరన్ పైపులకు సిమెంట్ పూత సైతం పూర్తయ్యింది. ఇక ప్రతి చెరువుకూ పైప్లైను వేసి నీళ్లు పారించడమే తరువాయి...సరిగ్గా అదే సమయంలో ఎన్నికలు రావడం...ప్రభుత్వం మారడంతో 193 చెరువులకు కృష్ణాజలాలు నింపే కార్యక్రమం ఆగిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హామీ ఇచ్చినా... ఇప్పటి వరకూ చెరువులు నింపే కార్యక్రమంలో ఒక అడుగుకూడా ముందుకు పడలేదు. దీంతో పుట్టపర్తి–నల్లమాడ ప్రధాన రహదారిలో ఉన్న భారీ శిలాఫలకం చూస్తున్న జనం ‘‘శ్రీధర్రెడ్డి ఉంటే ఈ పాటికి అన్ని చెరువులకూ నీళ్లు వచ్చేవి...వీళ్లు పట్టించుకునేలా లేరు..వీళ్లకు దోచుకోవడం తప్ప..ప్రజలకు మంచి చేసే ఆలోచనే లేదు’’ అంటూ చీవాట్లు పెడుతున్నారు. దీన్ని సహించలేని కొందరు ఆదివారం రాత్రి 193 చెరువులకు కృష్ణా జలాలు మళ్లించే పథకానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయలేని వారే ఇలా చేసి ఉంటారని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. విధ్వంసమే వారి పాలన ఆది నుంచీ టీడీపీది విధ్వంస పాలనే. ఇప్పుడు శిలాఫలకాలను ధ్వంసం చేసినంత మాత్రాన చరిత్రను చెరిపి వేయలేరు. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు. శంకుస్థాపన శిలాఫలకాలు ధ్వంసం చేయడం రాజకీయ కక్షే. వారి కక్షసాధింపు ధోరణి ఈ ఘటనతో బయటపడింది. ఇది పిరికి పందల చర్య. ఇది అభివృద్ధిపై చేసిన దాడి మాత్రమే కాదు, రైతుల ఆశయాలపై చేసిన దాడి. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచి చేయలేక.. చేసింది చూడలేక 193 చెరువులకు నీరు నింపే పథకం శిలాఫలకం ధ్వంసం -
కాసులిస్తేనే ఖాద్రీశుని దర్శనం!
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 13వ శతాబ్దం నుంచి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఏటా ఆలయంలో నృసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్ల, వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్ల, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్ల, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా చేస్తారు. స్వామివారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తుంటారు. కానీ ఇక్కడి సిబ్బంది భక్తులు ఆలయంలోనికి వెళ్లకముందే నిలువుదోపిడీ చేస్తున్నారు. డబ్బులున్నవారికి ఒక దర్శనం... పేదలకు ఒక రకమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయంలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుకు చేయి తడిపితే చాలు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరుగుతుందని భక్తులు చెబుతున్నారు. లడ్డూలోనూ దోపిడీ.. ఖాద్రీశుని లడ్డూలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దర్శనం అనంతరం లడ్డూలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి బంధువులు, మిత్రులకు ప్రసాదంగా పంచిపెడతారు. అయితే లడ్డూల పేరుతోనూ ఆలయం సిబ్బంది భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి స్వామివారి లడ్డులో ద్రాక్ష, గోడంబి, నెయ్యి, యాలకలు, జాజికాయ, కలకండ వాడుతారు. అందుకే స్వామివారి లడ్డూ చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇటీవల ఎలాంటి అదనపు దినుసులు లేకుండానే స్వామివారి లడ్డూలు తయారు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ తయారీ ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని కూటమి పార్టీల నాయకులే రెండు రోజుల క్రితం ఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దేవదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా ఆలయ నిర్వాహకుల్లో మార్పు కనిపించలేదు. వాస్తవానికి స్వామివారి చిన్న లడ్డూ రూ.15, పెద్దలడ్డూ రూ. 75 ప్రకారం భక్తులకు విక్రయించాలి. కానీ ఆలయ అధికారులు చిన్న లడ్డూ రూ.50, పెద్ద లడ్డూ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అభిషేకం నీళ్ల పేరుతో వ్యాపారం.. శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభునికి రోజూ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 వరకు ఆలయంలో అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం నీళ్లతోనూ కొందరు వ్యాపారం చేస్తున్నారు. కేసరికి కలిపే పౌడరును నీటిలో కలిపి వాటిని ప్యాకెట్ రూ.50 నుంచి రూ.100 దాకా విక్రయిస్తూ భక్తులను దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. డబ్బులిస్తే దొడ్డి దారిలో దర్శనం.. ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది కొంత మంది కర్ణాటక భక్తులు వస్తే వారిని దర్శనం పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బులు ఇస్తే తొందరగా దర్శనం చేయిస్తారని ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఆలయ పాలక మండలి, స్థానిక ప్రజాప్రతినిధి, దేవదాయ శాఖ అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. ఆలయ సిబ్బంది వ్యవహారంపై ఈఓ వి.శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా... విచారించి చర్యలు తీసుకుంటామని, భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. కదిరిలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామిని భక్తులంతా ప్రేమతో ఖాద్రీశునిగా కొలుస్తారు. మహిమాన్వితుడైన స్వామి దర్శనం కోసం ఉమ్మడి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ఆలయ సిబ్బంది.. భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న కొందరు సిబ్బంది దర్శనం మొదలు అర్చన దాకా అన్నింటికీ డబ్బే చివరకు స్వామివారి లడ్డూలూ అధిక ధరకు విక్రయం అభిషేకం నీళ్లంటూ ప్యాకెట్కు రూ.100 చొప్పున వసూలు సిబ్బంది తీరుపై మండిపడుతున్న భక్తులు -
కనీస సౌకర్యాలు కరువు
మాది అనంతపురం రెండురోజుల క్రితం కుటుంబంతో కలిసి స్వామి దర్శనం కోసం వచ్చాను. ఇక్కడి సిబ్బంది తీరుతో పడరానిపాట్లు పడ్డాను. ఆలయంలో సరైన వసతులు లేవు. చివరకు మహిళలు స్నానం చేసేందుకు కూడా సరైన వసతి లేదు. గుడి ముందే మురుగు నీరు నిలిచి ఉంది. సెక్యూరిటీ సిబ్బందికి డబ్బులిస్తే వెంటనే దర్శనం చేయిస్తున్నారు. లడ్డూలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. – సాయికృష్ణ, అనంతపురం అభిషేకం నీళ్ల ప్యాకెట్ రూ.100 సామాన్య భక్తులకు ఖాద్రీశుని దర్శనం గగనంగా మారుతోంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో గంటలకు గంటల సమయం పడుతోంది. సెక్యూరిటీ మాత్రం వారికి రూ.500 ఇచ్చిన వారిని అడ్డదారిలో తీసుకువెళ్లి దర్శనం చేయిస్తున్నారు. స్వామివారి అభిషేకం నీళ్ల ప్యాకెట్ రూ.100 దాకా అమ్ముతున్నారు. వీటిపై ఆలయ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – హరిత, తవలంమర్రి, నల్లచెరువు మండలం -
16 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 16 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 34.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక హిందూపురం మండలంలో 32.4 మి.మీ, లేపాక్షి 24.0, గుడిబండ 21.2, పరిగి 18.6, గోరంట్ల 18.4, సోమందేపల్లి 9.2, అమరాపురం 7.4, అగళి 5.6, రొళ్ల 5.4, కొత్తచెరువు 5.2, చిలమత్తూరు 4.4, బుక్కపట్నం 4.0, నల్లచెరువు 2.8, సీకేపల్లి 2.2, పుట్టపర్తి మండలంలో 2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హతమారుస్తామంటూ బెదిరించారు – బీజేపీ నేత విష్ణు అనంతపురం సిటీ: తనను హతమారుస్తామంటూ ఐదు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని బీజేపీ నేత ఎస్.విష్ణువర్దన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తనకు కాల్ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడారని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ వారు పట్టించుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆరోపణలు సరికాదు.. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీతో పాటు ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదని విష్ణు అన్నారు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు శ్మశానం లేకుండా చేశారయ్యా ● కలెక్టర్కు మొరపెట్టుకున్న బత్తలపల్లి గ్రామ దళితులు ప్రశాంతి నిలయం: ‘‘మా తాత ముత్తాతల కాలం నుంచి గ్రామ సమీపంలోని ఓ స్థలాన్ని మేమంతా శ్మశానంగా వాడుకుంటున్నాం. మా తాతలు, తండ్రులను అక్కడే పూడ్చి వారికి గుర్తుగా సమాధులు కూడా కట్టుకున్నాం. కానీ వారం రోజుల క్రితం జగరాజుపల్లికి చెందిన మురళీధర్రెడ్డి జేసీబీతో 50 సమాధులను ధ్వంసం చేశారు. ఇది తన భూమి అని..దౌర్జన్యం చేశాడు. మాకు శ్మశానం లేకుండా చేశాడు’’ అని పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి అర్జీ అందించారు. ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి: కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని పారదర్శకంగా విచారించి పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జేసీతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 308 అర్జీలు అందగా...వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అంతకుముందు కలెక్టర్..కార్యాలయం బయటే ఉన్న వృద్ధుల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరించి..సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. పనిచేయని పీజీఆర్ఎస్ వెబ్సైట్ పుట్టపర్తి అర్బన్: ‘‘ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం... సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు చేరుకోలేని వారు అర్జీలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే చాలు సమస్య పరిష్కరిస్తాం’’ అంటూ ప్రభుత్వం డప్పులు కొడుతోంది. కానీ వాస్తవంలో మాత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వెబ్సైట్ పని చేయడం లేదు. వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే...ఓటీపీ వస్తోందని, ఆ నంబర్ ఎంటర్ చేసి ఫిర్యాదు రిజిష్టర్ చేయడానికి వెళితే సైట్ ఓపెన్ కావడం లేదని పలువురు చెబుతన్నారు. సైట్ తిరిగి బ్యాక్కు వచ్చేస్తోందంటున్నారు. 1100కు కాల్ చేసినా ఉపయోగం లేదంటున్నారు. -
హాకీలో ‘కడప’కు అన్యాయం
ధర్మవరం/ధర్మవరం అర్బన్: తమకు అన్యాయం జరిగిందంటూ హాకీ క్రీడాకారులు హాహాకారాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్కు అర్హత సాధించిన జట్టును తప్పించి తమకు ఇష్టమొచ్చిన జట్లకు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకపక్షంగా విజేతలను ప్రకటించారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి క్రీడాకారులకు అన్యాయం చేశారు. కడపను ఓడించే కుట్ర.. ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జట్టు నంద్యాల, ప్రకాశం, కాకినాడ జట్లతో తలపడి మూడు మ్యాచ్ల్లోనూ జయకేతనం ఎగురవేసి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. అయితే క్వార్టర్ ఫైనల్స్లో తిరుపతి జిల్లా జట్టు తలపడాల్సి ఉండగా... తిరుపతి, గూడూరు క్రీడాకారులను కలిపి ఆడిస్తామని నిర్వాహకులు చెప్పడంతో కడప జిల్లా క్రీడాకారులు, కోచ్ అభ్యంతరం తెలిపారు. దీంతో హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణుక్యరాజు, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ తదితరులు వైఎస్సార్ కడప జిల్లా జట్టును మిగతా మ్యాచ్లు ఆడనివ్వకుండా పక్కనపెట్టారు. సోమవారం సెమీస్, ఫైనల్స్ జరగాల్సి ఉండగా... కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్లా నిర్వహించి అనకాపల్లి, అన్నమయ్య జిల్లా జట్లను జాయింట్ విన్నర్స్గా ప్రకటించారు. దీనిపై కడప జిల్లా హాకీ జట్టు కెప్టెన్ యాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ఇలా క్రీడాకారులకు తీరని అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టోర్నీ నిర్వాహకుల గురించి ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కు విన్నవించి వినతిపత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించినా ఆడించని వైనం ఏకపక్షంగా విజేతల ప్రకటన -
ఇసుకను తన్నుకుపోతున్న ‘పచ్చ’ గద్దలు
శింగనమల: సంపాదన కోసం అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు శింగనమల మండలం ఉల్లికల్లు వద్ద పెన్నానదీ పరివాహక ప్రాంతంలోని వంకలో పది రోజులుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని ఓ ప్రదేశంలోకి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి తాడిపత్రి, అనంతపురం ప్రాంతాలకు చెందిన టిప్పర్ల వారికి టిప్పర్ ఇసుక రూ.5వేల చొప్పున విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన టిప్పర్ నిర్వాహకులు రూ.12 వేల దాకా అమ్ముకుంటున్నారు. రోజుకు 20 నుంచి 30 టిప్పర్ల వరకు ఇసుకను బయటకు పంపుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎవ్వరూ క్షేత్రస్థాయిలో విచారణ చేయడానికి ముందుకు రాలేదు. టీడీపీ నేతలతో అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని.. వారి అక్రమాలకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉల్లికల్లు వద్ద అక్రమ తవ్వకాలు గ్రామస్తుల ఫిర్యాదులు బుట్టదాఖలు పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు -
వ్యభిచార గృహం నిర్వాహకుల అరెస్ట్
తాడిపత్రి టౌన్: పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముగ్గరు మహిళలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అలివేలమ్మ అనే మహిళ పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో గత కొద్ది నెలలుగా అద్దెకు ఇళ్లు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆదివారం స్థానికులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అలివేలమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి డబ్బుల్లేక వ్యక్తి ఆత్మహత్య మడకశిర రూరల్: మండల పరిధిలోని ఆర్.అనంతపురం గ్రామానికి చెందిన శాంతప్ప (45) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. శాంతప్పకు మద్యం అలవాటు ఉండేది. తాగుడు మానుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు తరచుగా బుద్ధి చెప్పినా శాంతప్ప వినేవాడుకాదు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. మద్యం సేవించడానికి డబ్బులు లేక పోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంతో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదువుతో దేన్నైనా సాధించవచ్చుపుట్టపర్తి టౌన్: ‘చదువుతోనే దేనిన్నైనా సాధించవచ్చు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదుకోవాలి’ అని కాపునాడు జిల్లా అధ్యక్షుడు మహేష్ పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో కాపునాడు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 450 పైగా మార్కులు సాధించిన బలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమానికి మీనాక్షమ్మ సమ్మలిత వికాస కేంద్రం చైర్మన్ రవికాంత్ రమణ, కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పాండురంగయ్య, మార్కెట్యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్, జనసేన పార్టీ నాయకుడు తోట్ల గంగాధర్ హాజరై విద్యార్థులను శాలువలతో సత్కరించి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు నరేంద్ర రాయల్, గువ్వల శ్రీనివాసులు, రమేష్బాబు, నాగభూషణ, శంకర, ప్రవీణ్, సరేష్, కార్తీక్, మహేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో గంజాయి సరఫరాదారులు గుత్తి: గుత్తి పోలీసులు ఆదివారం రాత్రి ఇద్దరు గంజాయి సరఫరాదారులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పట్టణంలోని ఓ షాపులో గంజాయి, నకిలీ నోట్లు దొరికాయి. షాపు నిర్వాహకుడిని విచారించగా.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ వాటిని ఇక్కడ ఉంచినట్లు చెప్పాడు. దీంతో గోపాల్తో పాటు దిమ్మగుడికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ లోతుగా విచారణ చేస్తున్నారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
ధర్మవరం అర్బన్: ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1)లో సవరణ చేసే ప్రయత్నం చేయాలన్నారు. అప్పటిలోగా ప్రభుత్వ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడానికి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక టెట్ నిర్వహిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు వినతిపత్రాలిస్తామని, 30న మండల కేంద్రాల్లో నిరసన దీక్ష, జులై 2న జిల్లాస్థారయిలో ఒకరోజు నిరాహార దీక్ష, జులై 15న రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు తక్షణం స్పందించి ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, గౌరవాధ్యక్షుడు భూతన్న, కోశాధికారి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లు తాహిర్వలి, మేరివరకుమారి, నాయకులు సుధాకర్, అమర్నారాయణరెడ్డి, నరసింహప్ప, బాబు, నాగేంద్రమ్మ, సునిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మార్గం సుగమమయ్యేదెన్నడో?
కదిరి: కదిరి పట్టణానికి రింగ్ రోడ్డు తరహాలో నిర్మిస్తున్న కదిరి బైపాస్ పనులు పూర్తయ్యే మార్గం కనిపించడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పనులు 80 శాతం పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పనులు ‘మూడడుగులు ముందుకు..ఆరడుగులు వెనక్కు’ అన్న చందంగా సా..గుతున్నాయి. స్థానిక టీడీపీ ముఖ్యనేత స్వలాభం కోసం రాజకీయం చేస్తూ పట్టణ ప్రజలతో పాటు అక్కడ భూములు కోల్పోతున్న రైతులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికార పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కదిరి పట్టణానికి చుట్టూ 12 కి.మీ మేర కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎకరాకు రూ.17 లక్షల నుంచి రూ.30 లక్షల మేర ఇచ్చింది. రోడ్డు నిర్మాణ పనులు కూడా 80 శాతం పూర్తయ్యాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు విద్యుత్ హైటెన్షన్ టవర్లు మార్చేలోపు 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎప్పుడో రహదారి పనులు పూర్తి కావాల్సిన ఉండగా.. స్థానిక టీడీపీ ముఖ్య నేత జోక్యంతో ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఆ పార్టీకి సానుభూతిపరులైన కొందరు రైతుల భూముల్లో విద్యుత్ హైటెన్షన్ టవర్లు వేసి, భవిష్యత్లో ఆ పొలాల్లో వారు వ్యవసాయం చేయకుండా, లేదంటే ఆ భూములు అమ్ముడు పోకుండా చేయాలనేది ఆయన కుట్ర. దీన్ని పసిగట్టిన బాధిత రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కదిరిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘కదిరి నియోజకవర్గ ప్రజలు ఇక్కడ టీడీపీని ఓడించారు. అయినా సరే.. మీకు రింగ్రోడ్డు మంజూరు చేస్తున్నాను’ అని హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో స్థానిక టీడీపీ నాయకులు ‘కదిరికి బైపాస్ రోడ్డు మంజూరైందోచ్..’ అంటూ కేవలం అలైన్మెంట్ కాపీలను చూపి అప్పట్లో హడావుడి చేశారు. తర్వాత అధికారంలోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరికి బైపాస్రోడ్డు మంజూరు చేయడంతో పాటు కేంద్రం నుంచి రూ.234 కోట్ల నిధులు తెచ్చింది. ఆ డబ్బుతోనే ఇప్పటికీ బైపాస్ పనులు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ టీడీపీ నాయకులు బైపాస్ ఘనత తమదే.. అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే పనిలోనే ఉన్నారు. కేవలం రెండు విద్యుత్ హైటెన్షన్ టవర్లు మార్చాల్సిన చోట 10 టవర్లు మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వీటి కోసమే మరో రూ.16 కోట్లు తెచ్చారని, అందులో ఆయన వాటాగా 30 శాతం (రూ.4.80 కోట్లు) తీసుకున్నారని కూటమి నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. కొనసా..గుతున్న కదిరి బైపాస్ పనులు గత ప్రభుత్వంలోనే 80 శాతం పనులు పూర్తి హైటెన్షన్ విద్యుత్ టవర్ల మార్పు పేరుతో జాప్యం కమీషన్ల కోసం రెండుకు బదులు 10 టవర్లు మార్చే యత్నంరైతుల జోలికొస్తే మీకు కష్టాలే మీ స్వార్థం కోసం రైతులను ఇబ్బంది పెట్టి, మీకు ఇష్టం వచ్చిన చోట టవర్లు వేస్తామంటే ఒప్పుకోము. అందుకే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం అర్థిస్తున్నాం. – ఎ.మనోహర్, రైతు, కుటాగుళ్ల -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
మడకశిర రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన మడకశిర మండలంలోని తడకలపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన గంగరాజు కుమారుడు మహేంద్ర (24), అతని బావ, రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన ఆదినారాయణ (28)తో పాటు మరో యువకుడు ఆదివారం కారు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలో తడకలపల్లి వద్ద 544–ఈ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్ర, ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలైన మరో యువకుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆదినారాయణకు భార్య మమత, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నట్లు తెలిసింది. మడకశిర మండల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బావ, బావమరిది మృతితో క్యాంపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. కచ్చితంగా ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు. ‘సర్’ను సద్వినియోగం చేసుకోండిప్రశాంతినిలయం: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నిర్వహిస్తున్న ‘సర్’ కార్యక్రమాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. సోమవారం (నేడు) నుంచి బీఎల్ఓలు జూలై 14 వరకూ ఇంటింటినీ సందర్శిస్తారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల న్నారు. నకిలీ, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. 27 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ జిల్లాలోని 27 మండలాల్లో 480.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా బత్తలపల్లి మండలంలో 70.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, ధర్మవరం మండలంలో 54.2 మి.మీ, కనగానపల్లి 48.4, కొత్తచెరువు 33.4, బుక్కపట్నం 25.4, హిందూపురం 23.4, పుట్టపర్తి 22.6, నల్లమాడ 21.6, తాడిమర్రి 21.4, ముదిగుబ్బ 18.6, చిలమత్తూరు 18.4, పరిగి 15.4, గోరంట్ల 14.4, సీకేపల్లి 13.2, సోమందేపల్లి 11.4, లేపాక్షి 10.8, రొద్దం 9.6, పెనుకొండ 9.4, ఎన్పీ కుంట 7.2, రామగిరి 6.2, అమడగూరు 5.6, ఓడీచెరువు 5.2, మడకశిర 3.6, అమరాపురం 3.2, అగళి 2.6, నల్లచెరువు 2.2, గాండ్లపెంట మండలంలో 2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. టీబీ డ్యాంకు 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఆదివారం 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. టీబీ డ్యాంలో మొత్తం 9,910 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువన ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో తొలిసారిగా ఆదివారం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 6,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి, జలాశయంలో 26.140 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జలాశయంలో 1,588.61 అడుగల వద్ద 9.910 టీఎంసీల నీరు నిల్వతో 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 180 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1603.33 అడుగుల నీటి మట్టంతో 26.410 టీఎంసీల నీరు నిల్వ ఉండి, 6,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 128 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేందని బోర్డు అధికారులు తెలిపారు. -
లైంగిక వేధింపులు భరించలేకే యువకుడి హత్య
● బసవనగౌడ హత్య కేసును ఛేదించిన పోలీసులు ● ముగ్గురి అరెస్ట్ సాక్షి, బళ్లారి: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద ఈనెల 7న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డకు చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. 8న మోకా పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు హత్య కేసు మిస్టరీని ఛేదించారు. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ధరాఘాతం
సామాన్యులకు‘ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు.. నాగులో నాగన్న’ అన్న పాట వాస్తవ రూపం దాలుస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితం దుర్భరంగా మారింది. అన్ని విధాలా అండగా ఉంటామన్న చంద్రబాబు ప్రభుత్వం కూడా పేదల కష్టాలను పట్టించుకోకపోవడంతో వారి బతుకులు దిన దిన గండంగా మారాయి.ధర్మవరం రూరల్: పెట్రోలు మొదలు నిత్యావసరాల దాకా... టీ మొదలు భోజనం దాకా ప్రతి దానిపై రేట్లు రెట్టింపయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. ఒకటి రెండు హామీలతోనే సూపర్–6 విజయవంతమైనట్లు ప్రచారం చేసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. సంక్షేమ పథకాల లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పడిపోయింది. నెలల వ్యవధిలోనే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ధరల నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ప్రతి నెలా అప్పులతోనే... ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. చిరుద్యోగుల వేతనాలు రూ.15 వేల లోపే ఉండటం, ధరలు అడ్డగోలుగా పెరుగుతుండడంతో ఖర్చులను తట్టుకోలేక అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఓ సామాన్య కుటుంబం బతకాలంటే నెల ఖర్చు సుమారు రూ. 25 వేల నుంచి రూ.30 వేల దాకా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అండగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసింది. ప్రతి కుటుంబానికి సగటున మూడు, నాలుగు పథకాల కింద రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా ప్రయోజనం దక్కింది. దీంతో అప్పట్లో కొనుగోలు సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను విడుదల చేసి వాటి ప్రకారం పథకాలను అమలు చేయడంతో కిరాణా వ్యాపారాలు కూడా బాగా జరిగేవి. ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల చేతిలో చిల్లిగవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రయ విక్రయాలు లేక చిన్న కిరాణా దుకాణాలను మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అబద్ధాలు చెప్పి... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్నాయంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమంతో ఎన్నో ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే నిత్యావసర సరుకులు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చినా ధరలు తగ్గించకపోగా బాదుడే.. బాదుడంటూ అన్ని రేట్లను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. -
కష్టకాలంలో స్నేహ హస్తం
రాప్తాడు రూరల్: కష్టకాలంలో స్నేహితుడికి స్నేహ హస్తం అందించారు. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అయ్యాడు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జయకృష్ణ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సపర్యలు చేసేందుకు భార్య తోడు తప్పనిసరి అయింది. కూలి పనులు మానేసి ఆమెకూడా ఇంటివద్దే ఉంటోంది. ఇటీవల ఆమె కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. వారికి 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్న కుమారులున్నారు. ఆ కుటుంబ దుస్థితిపై ఇటీవల ‘సాక్షి’లో ‘కష్టాల సుడిగుండం...కన్నీటి ప్రయాణం’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మానవతావాదులు స్పందించారు. ఇప్పటికే గ్రామస్తులు, ఇతరులు సుమారు రూ. 1.20 లక్షల దాకా ఆర్థిక చేయూత అందించారు. ఆదివారం జయకృష్ణ చిన్ననాటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకుంటూ రూ.31 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామానికి చేరుకుని జయకృష్ణను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. కట్టకిందపల్లి బుర్రా జయకృష్ణకు రూ.31 వేలు సాయమందించిన స్నేహితులు -
ఉత్కంఠగా హాకీ పోటీలు
ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న 16వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్ షిప్ టోర్నీలో మూడోరోజైన ఆదివారం పోటీలు ఉత్కంఠగా సాగాయి. మొదటి క్వార్టర్ ఫైనల్స్లో శ్రీ సత్యసాయి జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు 1–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో ఎన్టీఆర్ జిల్లా జట్టుపై అనకాపల్లి జట్టు 2–0 గోల్స్ తేడాతో, మూడో క్వార్టర్ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టుపై అన్నమయ్య జిల్లా జట్టు 3–0 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేశాయి. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణుక్యరాజు, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, గౌరిప్రసాద్, ఉడుముల రామచంద్ర, ట్రెజరర్ అంజన్న, జిల్లా హాకీ కోచ్ హస్సేన్, సహాయ కార్యదర్శి అరవింద్ గౌడ్, చంద్రశేఖర్, మారుతి, అమునుద్దిన్, కిరణ్లు హాకీ పోటీలను పర్యవేక్షించారు. -
మళ్లీ తెరుచుకున్న అక్రమాల ‘కాటా’
కళ్యాణదుర్గం రూరల్: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ రైతులను మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తి .. నెల తిరక్కుండానే మళ్లీ దుకాణం తెరిచేశాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వ్యాపారి రామ్మూర్తి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అక్కమ్మగార్ల దేవాలయం ఎదుట మొక్కజొన్న వ్యాపారంతో పాటు వేబ్రిడ్జి (కాటా)ను నిర్వహిస్తున్నాడు. 20 రోజుల క్రితం సమీప గూబనపల్లికి చెందిన రైతుల చీనీ పంటను కాటాకు తరలించగా తూకాల్లో తేడారావడంతో వేబ్రిడ్జి నిర్వాహకుడిని నిలదీసి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిర్వాహకుడిపై నామమాత్రపు కేసు నమోదు చేసి నిమిషాల వ్యవధిలో స్టేషన్ నుంచి బయటకు పంపారు. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీగా ముడుపులు ముట్టాయన్న విమర్శలున్నాయి. వ్యాపారిపై అనేక ఆరోపణలు... ● మూడు నెలల క్రితం చాపిరి గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటను అమ్మేందుకు కాటాకు వచ్చాడు. అయితే తూకాల్లో తేడా రావడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది నిముషాల్లో నామమాత్రం కేసుతో రామ్మూర్తి బయట పడ్డాడు. ● రెండు నెలల క్రితం మల్లికార్జునపల్లికి చెందిన రైతు వేరుశనగ పంటను అమ్మడం కోసం వ్యాపారి వద్దకు వచ్చాడు. తూకాల్లో తేడా రావడంతో ఆగ్రహించిన రైతు వ్యాపారిని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ● మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్టకు చెందిన రైతు మొక్కజొన్న పంట అమ్మకం విషయంలో తూకాల్లో మోసం జరగడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులే దగ్గరుండి పంచాయితీ చేశారన్న ఆరోపణలున్నాయి. చక్రం తిప్పిన వ్యాపారి రామ్మూర్తి పోలీసులకు మామూళ్లిచ్చి వ్యాపారం ?! సామాన్య ప్రజలకు ఏదైనా సమస్య వస్తే గంటైనా ఘటనా స్థలానికి రాని పోలీసులు.. మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తికి చిన్నపాటి సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కరిస్తారన్న విమర్శలున్నాయి. ఎంతోమంది రామ్మూర్తిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వివాదం జరిగి నెలగడవకనే రామ్మూర్తి మళ్లీ కాటాను తెరవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తూకాల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఏ ఒక్కరూ నష్టపోకుండా వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాటా తెరవడంపై పట్టణ సీఐ హరినాథ్ని ‘సాక్షి’ వివరణకోరగా ఆయన స్పందించలేదు. పోలీసుల అండ


