breaking news
Sri Sathya Sai District News
-
ఇంటి గుట్టు.. రట్టు!
జగనన్న ఇచ్చిన ఇంటినే ప్రారంభించారు వైఎస్ జగన్ హయాంలో మాకు ఇల్లు మంజూరైంది. అప్పటి ప్రభుత్వం రూ.1.8 లక్షలు మంజూరు చేయగా నిర్మాణం పూర్తి చేశాం. అయితే మరుగుదొడ్డి, రంగులు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రూ.70 వేలు ఇవ్వడంతో ఆ పనులు పూర్తి చేశాం. దీంతో అధికారులు కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. గత దసరా రోజున కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు వచ్చి ఇంటిని ప్రారంభించారు. ఈ ఇల్లు తమ ప్రభుత్వం ఇచ్చిందేనని చెప్పమనడంతో ఆ సమావేశంలో చెప్పాం. మా కుటుంబానికి ఇంటి పట్టా సైతం గత ప్రభుత్వంలోనే మంజూరైంది. – కుమావత్ లక్ష్మీబాయి, లక్ష్మానాయక్ దంపతులు, పెడపల్లి తండా లబ్ధిదారులు ముందుకు రావడం లేదు జిల్లాలో 16 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి రానున్న ఉగాది రోజున ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. అయితే ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. పట్టణాల్లో ఇప్పటికే ఆవాస్ సర్వేలో 62 వేల ఇళ్లు కావాలని దరఖాస్తు చేశారు. గ్రామాల్లో దీని సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తాం. – వెంకటనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖపుట్టపర్తి అర్బన్: ఎన్నికల్లో నిరుపేదలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోతొక్కిన చంద్రబాబు.. తమది మంచి ప్రభుత్వమంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. తాను చేయని పనులనూ తన ఖాతాలో వేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టి సుమారు రెండేళ్లు కావొస్తుండగా... పేదలకు ఒక్క ఇంటి పట్టాగాని, ఒక్క ఇల్లు గానీ మంజూరు చేయలేదు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు జగనన్న ఇళ్లపై కన్నేశారు. వైఎస్ జగన్ హయాంలో మంజూరై చిన్నచిన్న పనులతో నిలిచిన వాటిని ఆగమేఘాల మీద పూర్తి చేయించారు. తమ హయాంలో నిరుపేదల ఇంటి కష్టాలు తీర్చామంటూ గొప్పలు చెబుతున్నారు. ఉగాదికి మరో 16 వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం ఇక రెండో విడతలో జిల్లాలో 16 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని చంద్రబాబు ప్రభుత్వం హౌసింగ్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికి రెండున్నర నెలలు గడిచినా 200 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. ఎంతగా ప్రయత్నించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు మందుకు రావడం లేదని హౌసింగ్ పీడీ వెంకటరమణ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల, బీసీలకు అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యంలో హౌసింగ్ అధికారులు ఆయా వర్గాలపై పడ్డారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఇది అధికారులకు తెలిసినా... లబ్ధిదారుల వద్ద బతిమలాడుతున్నారు. లక్ష్యాలను చేరుకోకుంటే ప్రభుత్వం వద్ద చెడ్డ పేరు వస్తుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 62 వేల దరఖాస్తులు.. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0’ కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 62 వేల మంది నిరుపేదలు ఇంటి నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. హౌసింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలించి అర్హులను గుర్తించి వారి వివరాలన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉంచారు. అయితే ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని, కనీసం పట్టా కూడా ఇవ్వలేదని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తుల ప్రక్రియనే ప్రారంభం కాలేదు. జగన్ హయాంలో అడిగిన వారందరికీ ఇళ్లు.. తిమ్మిని బమ్మి చేయడం... పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు. నిలువ నీడ లేని నిరుపేదలు ఇంటికోసం ఎన్ని దరఖాస్తులిచ్చినా పట్టించుకోని ఆయన..జగన్ హయాంలో మంజూరై అప్పట్లోనే గృహప్రవేశాలు కూడా పూర్తి చేసిన ఇళ్లకు రంగులు కొట్టించి వాటిని మళ్లీ ప్రారంభించారు. వాటి ముందు నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చి ప్రచారం హోరెత్తించారు. పచ్చ నేతలు ప్రచారం చూసి అప్పటికే ఇళ్లు పూర్తి చేసుకున్న నిరుపేదలు ‘‘గృహప్రవేశం.. చేయాలి మళ్లీ మళ్లీ’’ అంటూ నిట్టూరుస్తున్నారు. పచ్చ ప్రచారం.. ఇళ్లకు పేదలు దూరం రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని చంద్రబాబు వైఎస్ జగన్ హయాంలో మంజూరైన ఇళ్లనే ఖాతాలో వేసుకునే కుట్ర పాత ఇళ్లకే మరమ్మతులు చేయించి.. రంగులు కొట్టించి మళ్లీ ప్రారంభోత్సవాలు విస్తుపోతున్న లబ్ధిదారులు.. తమకెప్పుడు ఇళ్లిస్తారని ప్రశ్నిస్తున్న పేదలు వైఎస్ జగన్ తన హయాంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లాకు 66,415 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో జగనన్న లేఅవుట్లలో 30,147, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి 36,268 కలిపి మొత్తంగా 66,415 ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే 28 వేల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారు. ఇంకో 28 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 10,415 ఇళ్లు ఇంకా ప్రారంభంకాని (నాన్ స్టార్టెడ్) దశలో ఉన్నాయి. దీంతో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై చంద్రబాబు కన్ను పడింది. వాటిని ఎలాగైనా పూర్తి చేయించి తమ ఖాతాలో వేసుకోవాలని దురాలోచన చేశారు. అనుకున్న వెంటనే వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి నిర్మాణాలు పూర్తి చేయించారు. తొలి విడతగా 2025 నవంబర్లో దసరా సందర్భంగా 8,086 ఇళ్లు పూర్తి చేయించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. -
కొడికొండ చెక్పోస్టులో తనిఖీలు
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న కొడికొండ చెక్పోస్ట్లో గురువారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి వస్తున్న గూడ్సు వాహనాలను డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (డీసీటీఓ) శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన దాఖలాలు లేని పలు వాహనదారులకు జరిమానా విధించారు. బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలి : ఏపీఎస్టీఏ పెనుకొండ: అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీఎస్టీఏ (ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, కార్యదర్శి తమ్మినేని చందనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతం కాకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలన్నారు. ఈ సమావేశాల్లోనే పీఆర్సీ నియాకంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు, బకాయిలను విడుదల చేయాలని విన్నవించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. 17న జిల్లా స్థాయి క్రీడా పోటీలు పుట్టపర్తి టౌన్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి బి.కిషోర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు ధర్మవరంలోని కళాజ్యోతి క్రీడా ప్రాంగణంలో, ఈ నెల 24న ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సైక్లింగ్ పోటీలు ఉంటాయి. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న క్రీడాకారులు శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 98481 87636 లో సంప్రదించవచ్చు. నిధులు విడుదల చేయాలంటూ టీడీపీ సర్పంచ్ ధర్నా పెనుకొండ(గోరంట్ల): పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ గోరంట్ల మండలం మలసముద్రం పంచాయతీ టీడీపీ సర్పంచ్ సువర్ణ వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలసి గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఽబైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నిధులు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉప ముఖ్యమంత్రిని కలసి గోడు వెళ్లబోసుకుంటామన్నారు.అలాగే పంచాయతీలో తాగునీటి పథకం నిలిచిపోయిందన్నారు. నీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీడీఓ కమలాబాయి స్పందించి..త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
క్వింటా చింతపండు రూ.24 వేలు
హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్లో గురువారం 2,600 క్వింటాళ్ల చింతపండు రాగా, క్వింటా (కరిపులి రకం) గరిష్టంగా రూ.24 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ఫ్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి సరైన ధరలకు విక్రయించుకోవాలని ఆయన సూచించారు. సోమవారం మార్కెట్కు సెలవు.. శివరాత్రి పండుగ నేపథ్యంలో వ్యాపారుల అసోసియేషన్, హమాలీల అభ్యర్థన మేరకు ఈనెల 16వ తేదీ (సోమవారం) హిందూపురం మార్కెట్యార్డుకు సెలవు ప్రకటించినట్లు యార్డు కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. రైతులు ఈ విషయం గమనించాలన్నారు. ‘నకిలీ’ కేటుగాళ్ల అరెస్ట్ అనంతపురం సెంట్రల్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటి కబ్జాకు యత్నించిన కేటుగాళ్లను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని శారదానగర్లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మికి ఇల్లు ఉంది. వీరు 2024 నవంబర్లో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన పాములపాటి అమర్నాథ్, పుట్టపర్తికి చెందిన ఆవుల సుబ్రహ్మణ్యం ఇంటిని కొట్టేయాలని పథకం రచించారు. హిందూపురానికి చెందిన బి.శకుంతలకు సుసర్ల కనకదుర్గ తన ఇంటిని రాసి ఇచ్చినట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం పుట్టపర్తికి చెందిన శేఖర్కు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శకుంతల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అర్బన్ సబ్రిజిస్ట్రార్ రమణరావు కనుసన్నల్లో జరిగింది. తర్వాత సదరు జీపీఏ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలకసంస్థ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించారు. దీనిపై సుసర్ల కనకదుర్గ వారసుడైన సాయి మనోహర్ అనంతపురం వన్టౌన్ పోలీసులసు ఆశ్రయించాడు. ఎస్పీ జగదీష్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపారు. శకుంతల, శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, అమర్నాథ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకడైన పాములపాటి అమర్నాథ్పై ఇది వరకూ ఇలాంటివే నాలుగు కేసులు ఉన్నాయి. కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్ల పొడిగింపు గుంతకల్లు: గుంతకల్లు డివిజన్ మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్–అనకాపల్లి (01477) మధ్య ప్రతి శుక్రవారం నడిచే వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును మార్చి 06వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు (19 సర్వీసులు), అనకాపల్లి–షోలాపూర్ (01478) మధ్య ప్రతి శనివారం నడిచే వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును మార్చి 7 నుంచి జూలై 11 వరకు (19 సర్వీసులు) పొడిగిస్తున్నట్లు వివరించారు. ఈ రైళ్లు అకల్కోట్, గంగాపూర్, కలబురిగి, వాడి, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయ రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, పీలేరు, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, చీరాల, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడం, నిడివేలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించారు. ● కోయంబత్తూర్–జైపూర్ (06181) ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 26 నుంచి మార్చి 26 వరకు ప్రతి గురువారం (5 సర్వీసులు), జైపూర్– కోయంబత్తూర్ (06182) ఎక్స్ప్రెస్ను మార్చి 01 నుంచి మార్చి 29 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. తిరుపూరు, యశ్వంత్పూర్–కలబురిగి మధ్య ప్రత్యేక రైళ్లు.. హోలీ రద్దీని అధిగమించడానికి యశ్వంత్పూర్–కలబురిగి మధ్య 13, 14వ తేదీల్లో ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు 13వ తేదీ శుక్రవారం రాత్రి 10.40 గంటలకు కలబురిగి జంక్షన్ (06209) నుంచి బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం 9.15 గంటలకు యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే రోజు (శని, 14వ తేదీ) ఉదయం 10.15 గంటలకు బయలుదేరి రాత్రి 9.40 గంటలకు కలబురిగి జంక్షన్ చేరుతుందన్నారు. -
బాలింతకు అరుదైన చికిత్స
అనంతపురం మెడికల్: పొట్టకూటి కోసం బిహార్ నుంచి వలస వచ్చి హిందూపురంలో స్థిరపడిన సురభీబాయికి అరుదైన చికిత్సతో సర్వజనాస్పత్రి వైద్యులు ప్రాణాలు కాపాడారు. గురువారం జీజీహెచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, గైనకాలజీ విభాగం హెచ్ఓడీ షంసాద్బేగం,తో కలసి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. సురభీబాయి తొలిసారి గర్భం దాల్చినప్పుడు అబార్షన్ జరిగింది. రెండోసారి గర్భం (7 నెలలు) దాల్చిన ఆమె తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండగా భర్త సాహిన్ వెంటనే హిందూపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు గత నెల 12న సర్వజనాస్పత్రిలో చేర్పించాడు. హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం ఆదేశాలతో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీలేఖ, డాక్టర్ అరుణ, పీజీలు డాక్టర్ సుష్మిత, కావ్య, ఇందుశ్రీ ప్రత్యేక చొరవ తీసుకుని గర్భంలోనే శిశువు మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. అబ్రప్షన్ ప్లసంటా ప్రీవియా (మాయ దెబ్బతినడం)తో తీవ్ర రక్తస్రావం జరుగుతోందని, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా 4 గ్రాములకు పడి పోయినట్లుగా వైద్య పరీక్షల్లో గుర్తించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సురబీబాయిని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చేర్చి నెఫ్రాలజిస్టు డాక్టర్ హరీష్ పర్యవేక్షణలో 6 సార్లు డయాలసిస్ చేయించారు. ఐదు యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. అనంతరం జీజీహెచ్కు తరలించి ఖరీదైన మందులతో సాధారణ స్థితికి తీసుకువచ్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.8 లక్షల వరకూ ఖర్చు అవుతుందని, సర్వజనాస్పత్రిలో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్యులను తానెన్నటికీ మరిచి పోలేనంటూ భర్త సాహిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. కార్యక్రమంలో గైనకాలజిస్టులు డాక్టర్ సుచిత్ర, డాక్టర్ రేణుక, తదితరులు పాల్గొన్నారు. -
అందని సహకారం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకారశాఖలో తమకు సహకారం అందకుండా పోతోందని ఆ శాఖలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు పదోన్నతులు దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ఆరుగురు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార శాఖలో గత 30 ఏళ్లుగా వాచ్మెన్లుగా, అటెండర్లుగా పనిచేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ వీరు ఆ హోదాలోనే కొనసాగుతున్నారు. ఈ ఆరుగురికీ పదోన్నతులు దక్కాల్సి ఉన్నా... జాబితా తయారీలో ఉన్నతాధికారులు అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 31 లోపు పదోన్నతుల జాబితా సమర్పించాలని కలెక్టర్ జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలను సైతం సహకార శాఖ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడంతో నాల్గో తరగతి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పదోన్నతులకు అర్హత ఉన్నా తమను పట్టించుకోకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన 12 ఉమ్మడి జిల్లాల పరిధుల్లో పదోన్నతులు ఇప్పటికే పూర్తయినా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీస చలనం కూడా లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్కు అవగాహన లేకపోవడం, రోస్టర్ తయారీలో కాలయాపన చేయడంతో తమకు పదోన్నతులు పగటి కలగానే మిగిలిపోనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై కలెక్టర్, డీసీఓ తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని సదరు ఉద్యోగులు కోరుతున్నారు. సహకార శాఖలో ఏళ్లుగా పదోన్నతుల పెండింగ్ ఉన్నతాధికారులు సహకరించడం లేదంటున్న నాల్గో తరగతి ఉద్యోగులు -
మెరుగైన సేవలందించాలి
నల్లచెరువు: పౌరులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్లచెరువు సచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామసభలో పాల్గొన్నారు. మండలంలో మిగులు భూములుగా క్లెయిమ్ చేయని వాటిపై అధికారులతో చర్చించారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పలు కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్య ఉందని, అలాగే సీసీ రోడ్లు లేవని తెలిపారు. బస్టాండ్ వద్ద సరైన సౌకర్యాలు లేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్ పంచరత్నమ్మ కలెక్టరుకు తెలిపారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి, సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వైద్యాధికారి అలేఖ్యను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతుండటంతో వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ మౌర్యా భరద్వాజ్, కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ అశోక్ కుమార్రెడ్డి, ఏఓ అశోక్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీటీ వెంకటరెడ్డి, డాక్టర్ కల్పనరెడ్డి పాల్గొన్నారు. హక్కుదారులదరికీ న్యాయం చేస్తాం.. కదిరి టౌన్: రైల్వే ఓవర్ బ్రిడ్జి భూ సేకరణలో భాగంగా మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల వద్ద లేఅవుట్లో స్థలం కోల్పోతున్న హక్కుదారులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ హామీ ఇచ్చారు. కుటాగుళ్ల వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం భూమిని సేకరించినా తక్కువ ధర ప్రకటించారని, ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా పరిహారం పెంచాలని హక్కుదారులు గురువారం కలెక్టర్ను కలిసి కోరారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి ప్రశాంతి నిలయం: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పదో తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని వీసీహాలులో పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల మౌలికసదుపాయాలన్నీ కల్పించాలన్నారు. అనంతరం రేషన్ పంపిణీ, పాఠశాల విద్య, మధ్యాహ్న భోజన పథకం అమలు, కాలేజీ విద్య, కాలుష్య నియంత్రణ, గృహ నిర్మాణం తదితర శాఖలపై సమీక్షించారు. ఆయా శాఖలు అందించే సేవల్లో నాణ్యత, పారదర్శకత పెరగాలన్నారు. రెవెన్యూ గ్రామసభలో కలెక్టర్ శ్యాంప్రసాద్ -
అవిసె సాగు.. వక్క బాగు
పెనుకొండ (సోమందేపల్లి): సోమందేపల్లి మండలం జూలుకుంట గ్రామానికి చెందిన రైతు రఘునాథరెడ్డి నూతన ఆలోచన విధానం పలువురు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వక్క తోటలో అవిసెను అంతర పంటగా పెట్టడం ద్వారా తక్కువ విస్తీర్ణంలోనే రెండు విభిన్న సిరుల పంటలను ఏక కాలంలో సాగులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. హిందూపురం ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న పనిచేస్తున్న రఘునాథరెడ్డి కుటుంబం గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. సంప్రదాయ పంటల సాగులో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి కావడంతో ఉద్యోగానికి ఆటంకమవుతుందని భావించిన ఆయన పలు రకాల పంటల సాగుపై అధ్యయనం చేపట్టాడు. ఈ క్రమంలో భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఒక్కసారి నాటితే వందేళ్ల దిగుబడినిచ్చే వక్క సాగుపై దృస్టి సారించాడు. దీంతో ఏడాది క్రితం రొళ్ల మండలం నుంచి 1,200 వక్క మొక్కలను సేకరించుకున్ని తనకున్న పొలంలోని రెండు ఎకరాల్లో నాటాడు. డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసి సాగునీటిని అందిస్తున్నాడు. రక్షణగా అవిసె చెట్ల పెంపకం.. త్వరలో వేసవి సీజన్ ప్రారంభం కానుండడంతో వక్క మొక్కల సంరక్షణకు వాటి చుట్టూ అవిసె మొక్కల పెంపకాన్ని రఘునాథరెడ్డి చేపట్టాడు. దాదాపు నాలుగు వేల అవిసె మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. ప్రస్తుతం అవిసె మొక్కలు బలంగా ఎదిగాయి. వక్క మొక్కలను చుట్టేసి ఎండ తీవ్రత పడనీయకుండా కాపాడుతున్నాయి. అవిసె ఆకులను పచ్చిరొట్ట ఎరువుగా వినియోగిస్తున్నాడు. దీంతో నేలకు అవసరమచైన నత్రజని, పుష్కలంగా అందుతోంది. ఇది వక్క మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతోంది. తొలుత అవిసె మొక్కలను రక్షణ పంటగా వేసినా... అవి కాస్త ఏపుగా పెరగడంతో అంతర పంటగా రూపాంతరం చెందింది. అవిసె ఆకులు, గింజలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో ఈ పంట దిగుబడికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుందని రైతు రఘునాథరెడ్డి అంటున్నాడు. అంతే కాక రెండేళ్ల అనంతరం ఏపుగా పెరిగే అవిసె చెట్ల ఆకుల ద్వారా పొట్టేళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని భావించిన ఆయన ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో 2 ఎకరాల్లో వక్క సాగుకు ప్రణాళిక.. ఇప్పటికే రెండు ఎకరాల్లో వక్క మొక్కలు నాటిన రఘునాథరెడ్డి... ఆ పొలానికి ఆనుకుని ఉన్న మరో రెండు ఎకరాల్లోనూ వక్క సాగుకు సిద్ధమవుతున్నాడు. దీంతో ఆ భూమిని చదును చేయించి, మొక్కల నాటేందుకు అనువుగా గుంతలు తీయిస్తున్నాడు. త్వరలో మరో 1,200 వక్క, దాని చుట్టూ మరో 4 వేల అవిసె మొక్కలు నాటే కార్యాచరణతో ముందుకు సాగుతున్నాడు. పెరుగుతున్న వక్క సాగు.. రైతు రఘునాథరెడ్డి సాగు విధానాలను గమనించిన పలువురు రైతులు ఆ దిశగా తాము కూడా వక్క సాగుపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెనుకొండ నియోజకవర్గంలో వక్క సాగు విస్తీర్ణం క్రమేణ పెరుగుతోంది. ఇప్పటికే సోమందేపల్లి మండలం జూలుకుంట, ఈదుల బళాపురం, మండ్లి, చల్లాపల్లి, పరిగి మండలం పైడేటి, తుంగోడు, చలివెందుల, రాసిపల్లి, కొండూరు, ఇస్లాపురం తదితర గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున వక్క సాగు చేపట్టారు. వక్క తోటల్లో అవిసె పంటను అంతర పంటగా వేసి ఓ రైతు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. అవిసెతో పాటు వక్క మొక్కలూ ఏపుగా పెరుగుతున్నాయి. ప్రధానంగా నేల సారం పెరగడం, వక్క మొక్కలకు నీడను అందించడంతో పాటు అదనపు ఆదాయానికి అవిసె ఉపయోగపడుతుంది. కొద్ది పాటి భూమిలోనే సిరుల పంటల సాగు అవిసె చెట్ల పెంపకంతో వక్క మొక్కలకు సంరక్షణ ఫలించిన రైతు డబుల్ ధమాకా ప్రయోగం ఏపుగా పెరుగుతున్న మొక్కలు -
సస్యరక్షణతో కత్తెర పురుగు నివారణ
హిందూపురం: సకాలంలో సస్య రక్షణ చర్యలు చేపడితే మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు నివారణ సాధ్యమవుతుందని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎ.కృష్ణయ్య సూచించారు. హిందూపురం మండలం పోచనపల్లిలో రైతు శివలింగప్ప పొలంలో గురువారం చేపట్టిన మొక్కజొన్న, రాగిపంటల ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం మొక్కజొన్న పంటకు ఆశించిన కత్తెర పురుగు నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సురేంద్ర నాయక్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల పట్టివేత పరిగి: మండలంలోని పరిగి చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ఆయా వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కొమ్మ విరిగిపడి అంగన్వాడీ కార్యకర్తకు తీవ్ర గాయాలు రొళ్ల: స్థానిక మడకశిర ప్రధాన రహదారిలోని కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం సమీపంలో ఉన్న జువ్విచెట్టు కొమ్మ విరిగి మీద పడడంతో అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి తీవ్రంగా గాయపడింది. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నిరసన కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం మారుతీ నగర్లోని తన అంగన్వాడీ సెంటర్కు భర్తతో కలసి ద్విచక్రవాహనంపై జయలక్ష్మి బయలుదేరింది. కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం సమీపంలోకి చేరుకోగానే పురాతన జువ్వి చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి జయలక్ష్మి మీద పడడంతో తలకు బలమైన గాయమైంది. స్వల్ప గాయాలతో భర్తకు బయట పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న జయలక్ష్మిని స్థానికులు వెంటనే సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని తుమకూరుకు వైద్యులు రెఫర్ చేశారు. కార్మికుడి దుర్మరణం చిలమత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ గ్రానైట్ పరిశ్రమ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. కుటుంట సభ్యులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం కాగానిపల్లికి చెందిన రమేష్(28) చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని ముద్దప్పపల్లి సమీపంలో ఉన్న వేదా ఇంటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో గురువారం చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో తాను పనిచేస్తున్న పరిశ్రమ కూడా మూత పడి ఉంటుందని రమేష్ భావించాడు. అయితే యాజమాన్యం పనిలోకి రావాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, తమ సొంత ఆదాయం కోసం కార్మికుల జీవితాలతో వేదా ఇన్టెక్ యాజమాన్యం చెలగాటమాడుతోందని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్కుమార్ విమర్శించారు. వెంటనే రమేష్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని, లేకపోతే పరిశ్రమ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. బావిలో పడి యువకుడి మృతి మడకశిర: స్థానిక పట్టణ పరిధిలోని చౌటిపల్లిలో ఓ యువకుడు బావిలో పడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మంజునాథ్ (25) గురువారం ఉదయమే తన తోట వద్దకెళ్లాడు. నీటి కోసం బావిలో దిగుతుండగా అదుపు తప్పి నీటిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ లావణ్య అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్య కదిరి టౌన్: స్థానిక దేవళం వీధిలో నివాసముంటున్న వినయ్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహాది శుభకార్యాలకు డెకరేషన్ పనితో జీవనం సాగిస్తున్న ఆయకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో భార్య శ్రీశైలం వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం రాత్రి తన గోదాములో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కుమారుడు గమనించి నాన్నమ్మకు తెలపడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వినయ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హామీలు నెరవేర్చకపోతే ప్రతిఘటన తప్పదు
పుట్టపర్తి టౌన్: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి హెచ్చరించారు. యూటీఎఫ్ తలపెట్టిన రణభేరి 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం చేపట్టిన ప్రచారజాతను కలెక్టరేట్ ఎదుట ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర నాయకులు దేవేంద్రమ్మ, రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణనాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాబోవు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు, నూతన పీఆర్సీ నియాకంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఐఆర్ను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, ఉపాధ్యక్షుడు బాబు, కోశాఽధికారి లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు సుధాకర్, నారాయణస్వామి, నరసింహప్ప, సురేష్ కుమార్, అమరనారాయణరెడ్డి, మురళి, చెన్నకేశవులు, బాబు, సునీల్కుమార్, అజాం బాషా తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి -
తల్లిని దూషించాడని హత్య
హిందూపురం: స్థానిక నింకంపలి్ల్ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఈ నెల 7న కుళ్లిన స్థితిలో బయటపడిన యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం రెండో పట్టణ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐలు అబ్దుల్ కరీం, రాజగోపాల నాయుడు, జనార్ధన్ వెల్లడించారు. నింకంపల్లి సమీపంలోని పాడుబడిన బావి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో గత శనివారం సమీప ప్రాంతాల వారు వెళ్లి చూశారు. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పరిశీలించారు. గొంతు కోసి ఉండడంతో హత్యగా నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హతుడిని హస్నాబాద్కు చెందిన సుహేబ్(25)గా నిర్ధారించారు. ఎలక్ట్రీషియన్ పనితో జీవనం సాగించేవాడు. రెండు, మూడు రోజుల క్రితం కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడి సుహేబ్ను గొంతుకోసి హతమార్చి, మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు అనుమానితులైన యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హతుడు సుహేబ్, కల్లూరు మహమ్మద్ ముల్లాఖాన్ ఇరువురూ మంచి స్నేహితులుగా తేలింది. తరుచూ మద్యం సేవిస్తుండేవారు. ఓ రోజు మద్యం మత్తులో గొడవపడ్డారు. ఆ సమయంలో ముల్లాఖాన్ తల్లిని సుహేబ్ దూషించాడు. దీంతో కక్ష పెంచుకున్న ముల్లాఖాన్ పథకం ప్రకారం ఈ నెల 2న సుహేబ్ను నింకంపల్లి శ్మశాన వాటిక సమీపంలోని సత్రాల వద్దకు పిలుచుకెళ్లి అక్కడ మద్యం సేవించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ముల్లాఖాన్ కత్తితో పొడవడంతో సుహేబ్ గట్టిగా అరవబోయాడు. దీంతో వెంటనే గొంతు కోశాడు. అనంతరం ఓ మైనర్ బాలుడి సాయంతో సుహేబ్ మృతదేహాన్ని చెత్తాచెదారంతో చుట్టేసి అక్కడికి సమీపంలోని పాడుపడిన బావిలో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై హతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముల్లాఖాన్ను బుధవారం అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడికి సహకరించిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ ఈ నెల 2న హత్య.. 7న మృతదేహం లభ్యం ప్రధాన నిందితుడి అరెస్ట్ అజ్ఞాతంలోకి ‘మైనర్’ నిందితుడు -
బత్తలపల్లిలో ‘ఏసీబీ’ అలజడి
బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తిష్ట వేశారనే సమాచారం స్థానికంగా అలజడి రేపింది. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో దడ పుట్టించింది. బుధవారం ఏసీబీ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు బత్తలపల్లికి వచ్చారనే సమాచారంతో కార్యాలయంలోని ఉద్యోగులు భయాందోళన చెందారు. ఏసీబీ అధికారుల భయంతో ఉద్యోగులంతా మధ్యాహ్నానికే వెళ్లిపోయారు. దీంతో కార్యాలయం బోసిపోగా... వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి వారంతా అధికారుల తీరును తప్పుపట్టారు. 15 రోజులుగా ప్రచారం.. తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులపై ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏ సమయంలోనైనా దాడులు చేయవచ్చనే వార్తలు 15 రోజులుగా గుప్పుమంటున్నాయి. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయంపై నిఘా వేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బుధవారం కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోనే ఏసీబీ అధికారులు తిష్ట వేశారనే ప్రచారం సాగింది. అయితే దాడుల సమాచారం బయటకు పొక్కడం... రెవెన్యూ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో ఏసీబీ అధికారులు కూడా వెనక్కు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మఠం భూముల్లో అవకతవకల సమగ్ర సమాచారం కోసం విజిలెన్స్ అధికారులు కూడా బుధవారం బత్తలపల్లికి వచ్చి రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు పరిశీలించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు కార్యాలయానికి రావడంతో ఏసీబీ అధికారులేనని భావించి పలువురు అధికారులు కార్యాలయం నుంచి అప్పటికప్పుడు జారుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాడుల ప్రచారంతో జారుకున్న రెవెన్యూ అధికారులు బోసిపోయిన తహసీల్దార్ కార్యాలయం -
రైతుకు అండగా నిలుద్దాం
ప్రశాంతి నిలయం: రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర వాటిని సకాలంలో అందిస్తూ అండగా నిలుద్దామని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన జిల్లాలో పక్కాగా అమలు కావాలన్నారు. అర్హులకు పథకం అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇక మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో పంటలు సాగుచేసే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు ముందుగానే అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతూ సూక్ష్మ పోషకాలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ కృష్ణయ్య, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణకుమార్, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శోభారాణి, పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, సహకార శాఖ అధికారి కృష్ణానాయక్, మార్క్ఫెడ్ మేనేజర్ గీతమ్మ, నీటి పారుదల శాఖ అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలి పౌరసేవలను వేగవంతం చేయడంతో పాటు వివిధ సమస్యలపై అందే అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందిన ఫిర్యాదులు, ఇళ్ల నిర్మాణాలు, పీఎం సూర్యఘర్, ప్రజా సానుకూల అభిప్రాయం, స్వర్ణ పంచాయతీ, తాగునీటి సరఫరా, ఓపెన్ స్కూల్, అక్షర ఆంధ్రా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి పథకాన్నీ గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలన్నారు. వీసీలో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సీడీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయాధికారులకు కలెక్టర్ ఆదేశం పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై సమీక్ష -
‘పట్టు’ వీడని తెగుళ్లు
● గూళ్లకు సోకుతున్న సున్నపుకట్టు ఽవ్యాధి ● చలి తీవ్రత కారణంగా తగ్గుతున్న దిగుబడి ● ధరలు ఆశాజనకం హిందూపురం: పట్టు గూళ్ల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నా... తెగుళ్ల కారణంగా దిగుబడిపై ప్రభావం చూపడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. వాతావరణంలో పెరిగిన చలి తీవ్రత కారణంగా సున్నపు కట్టు వ్యాధి ప్రబలి దిగుబడి తగ్గుతోందని రైతులు వాపోతున్నారు. హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్కు గతంలో రోజూ 6 వేల క్వింటాళ్లకు పైగా పట్టు గూళ్లు విక్రయాలకు రైతులు తీసుకువచ్చేవారు. హిందూపురం, మడకశిర, గుడిబండ, సోమందేపల్లి, లేపాక్షితో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వందలాది రైతులు తమ పట్టు గూళ్ల ఉత్పత్తుల విక్రయానికి హిందూపురంలోని మార్కెట్పైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో దిగుబడి క్రమంగా తగ్గుతుండటంతో మార్కెట్కు రోజూ 3వేల క్వింటాళ్లలోపు గూళ్లు వస్తున్నాయి. నాణ్యతను బట్టి బైవోల్టిన్ పట్టు గూళ్లూ కిలో రూ.800 నుంచి రూ.870తో అమ్ముడు పోతోంది. పట్టుగూళ్ల దిగుబడి నాణ్యతకు చర్యలు ఇంత కాలం చలి కారణంగా షెడ్లలో వేడి తగ్గుముఖం పట్టింది. దీంతో 40 నుంచి 50 శాతం వరకూ పట్టు గూళ్లు సున్నపుకట్టు వ్యాధి బారిన పడి రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిళ్లు కనీసం 20 డిగ్రీల వేడి తగ్గకుండా చూసుకోవడం ఉత్తమమని పట్టు శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ వాతావరణంలో గుడ్డు అల్లే పురుగు నేత్రికలకు ఎక్కేందుకే 3 రోజులు పడుతుంది. స్పిన్నింగ్కు వచ్చినప్పటి నుంచి గదిలో రాత్రిళ్లు, తెల్లవారుజామున కనీసం 25 డిగ్రీలకుపైగా వేడి ఉండేలా చూసుకోవాంటున్నారు. ఇందుకు గాను షెడ్లలో బొగ్గుల కుంపటి లేదా హీటర్లు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని అంటున్నారు. పట్టు పురుగులు గూళ్లు అల్లేటప్పుడు షెడ్డులో వేడి పెంచకపోతే సున్నపుకట్టు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తేదీ కనిష్టం గరిష్టం సగటు 5 రూ.600 రూ.873 రూ.828 6 రూ.722 రూ.890 రూ.829 7 రూ.568 రూ.902 రూ.828 8 రూ.722 రూ.903 రూ.861 9 రూ.774 రూ.898 రూ.827 10 రూ.569 రూ.876 రూ.820 11 రూ.742 రూ.893 రూ.861 హిందూపురం మార్కెట్లో కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు ఇలా.. -
పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించం
● అంగన్వాడీలను హెచ్చరించిన కలెక్టర్ శ్యాం ప్రసాద్ పుట్టపర్తి టౌన్: అంగన్వాడీకి వచ్చే చిన్నారుల సంరక్షణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. బుధవారం ఆయన పుట్టపర్తి పరిధిలోని బ్రాహ్మణపల్లి అంగన్వాడీ –2 కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లల హాజరు, బరువు, ఎత్తును పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్డు రంగు పరిమాణాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యతను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వయసుకు తగ్గ ఎత్తు పెరగని పిల్లల ఎదుగుదలకు కార్యచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడీకి సూచించారు. పిల్లల హాజరు శాతం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదుపు తప్పిన కారు... ఎస్ఐకి గాయాలు చిలమత్తూరు: మండల పరిధిలోని 544–ఈ జాతీయ రహదారి తుమ్మలకుంట సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఎస్ఐ ఇషాక్ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హిందూపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఇషాక్ కోర్టు పని మీద బుధవారం ఉదయం కదిరికి వెళ్లాడు. కోర్టు పని ముగిశాక తిరిగి వస్తుండగా... తుమ్మలకుంట సమీపంలోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. వఈ ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ ఇషాక్ను స్థానికులు మరో వాహనంలో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనపై ఎస్ఐ మునీర్ అహ్మద్ ఆరా తీశారు. నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్ పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లి వద్ద జయమంగళి నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశామని ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. మడకశిర మండలంలోని కేతేపల్లి మీదుగా కర్ణాటక ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో బుధవారం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నల్లాయనపల్లికి చెందిన నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి వాటి యజమానులపై కేసు నమోదు చేశామన్నారు. -
లీప్ టీచర్ల క్రికెట్ టోర్నీలో జిల్లా జట్టు విజయం
ధర్మవరం రూరల్: లీప్ టీచర్ల టోర్నమెంట్లో భాగంగా గుంటూరు వేదికగా మంగళవారం జరిగిన క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో అనకాపల్లి జట్టుపై జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టు క్రీడాకారులు బుధవారం ధర్మవరానికి చేరుకోగా, వారిని ఎంఈఓలు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి, ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, ఆర్డీటీ ఉపాధ్యాయులు అభినందించారు. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి రాప్తాడు రూరల్: విద్యుత్ షాక్కు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి (64) అనంతపురంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలం సజ్జలకాలువలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో విద్యుద్దీకరణ పనుల్లో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతి చెందాడు. భార్య నాగేశ్వరి బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నేడు సార్వత్రిక సమ్మె అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. ఇందులో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, రైతులు పాల్గొననున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎస్సార్టీయూ, ఐఎఫ్టీయూ, ఏఐసీసీటీయూ, రైతు, కౌలు రైతు, పండ్లతోటల రైతుల, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ సంఘాలు సమ్మెలో పాల్గొననున్నాయి. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని, హైర్ అండ్ ఫెయిర్ విధానం రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధి భద్రత కల్పించాలని, ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, కనీస వేతనం పెంచాలని, పంటలకు మద్దతు ధర కల్పించాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, ప్రభుత్వరంగ పరిశ్రమలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. -
రైతులను ఆదుకోవాలి
●శనగలకు చంద్రబాబు సర్కార్ ‘మద్దతు’ ఇవ్వలేదు. అందుకే అగ్రి మిషన్ మాజీ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు అవినాష్రెడ్డి, గురుమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపాం. శనగలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోరాదని, రాష్ట్రంలో పండించిన శనగలకు రూ.1000 బోనస్ ప్రకటించాలని కోరాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా... అందులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రైతులకు న్యాయం చేయాలని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గుచేటు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజలు చేసిన పెద్ద తప్పిదం. – ఆవుటాల రమణారెడ్డి, మాజీ చైర్మన్, అగ్రి అడ్వయిజరీ బోర్డు -
ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం: ఎస్పీ
పరిగి: ఇసుక అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎస్పీ సతీష్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన పరిగి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం మండలంలోని పైడేటి, శాసనకోట నదీ పరివాహక ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న చిన్నపల్లి క్రాస్, ధనాపురం క్రాస్, హొన్నంపల్లిలను పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను పరిశీలించి ఇసుక అక్రమ రవాణా కట్టడి, ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఐ రాఘవన్, ఎస్ఐ రంగడుయాదవ్తో చర్చించారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ మీడియాతో మాట్లాడారు. పరిగి మండలంలోని పైడేటి, శ్రీరంగరాజుపల్లి, శాసనకోట తదితర నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తామన్నారు. ఇటీవల పరిగి మండలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు యువకులు వీలింగ్ చేసుకుంటూ హైస్పీడ్తో ద్విచక్రవాహనాలను నడుపుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబ తగాదాలను పరిష్కరించేందుకు ఐసీడీఎస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేసేలా కలెక్టర్తో చర్చిస్తామన్నారు. రౌడీలు, గుండాలను ఉపేక్షించేది లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తున్నామన్నారు. -
‘పది’ పరీక్షల నిర్వహణలో ‘ప్రైవేట్’ భాగస్వామ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఈసారి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు భాగస్వామ్యం కల్పించనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లుగా ప్రైవేట్ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు. పరీక్షల నిర్వహణలో నూతన ఒరవడికి విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల నుంచి 75 శాతం మందిని తీసుకుంటే, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల నుంచి 25 శాతం మందిని తీసుకోనున్నారు. అలాగే తొలిసారిగా అన్ని పరీక్ష కేంద్రాలకు సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల నియామకం ప్రక్రియ ఎస్ఎస్ఈ బోర్డు నుంచే చేపట్టనున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ఆధారంగా హెచ్ఎంలు, టీచర్ల జాబితా తయారు చేసి మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డీఈఓలకు పంపారు. వారు ఆ జాబితాలను పరిశీలించి ప్రతి టీచరుకూ సంబంధించి రిమార్కులు రాసి పంపాలి. నిబంధనల మేరకు అనర్హులైన వారిని తొలిగించి.. అర్హులైన వారిని విధుల్లో నియమిస్తారు. ఈ విషయాలను వెబెక్స్లో విద్యాశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు. 60 ఏళ్లు నిండిన వారికి, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మినహాయింపు ఇస్తారు. అయితే వీరు సంబంధిత మెడికల్ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అందజేయాల్సి ఉంటుంది. వారు సిఫార్సు చేస్తే డీఈఓ ద్వారా బోర్డుకు వెళ్తాయి. అక్కడి నుంచి మినహాయింపు ఇస్తారు. చార్జెస్ ఫ్రేమ్ అయిన వారు, ఇతర క్రమశిక్షణ చర్యలకు పాల్పడిన వారిని పరీక్షల నిర్వహణ విధులకు తీసుకోరు. ఉన్నతాధికారులు వెబెక్స్లో తెలియజేశారని పూర్తిస్థాయి విధివిధానాలు రెండుమూడు రోజుల్లో రానున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వ పాఠశాలల నుంచి 75 శాతం, ప్రైవేట్ నుంచి 25 శాతం రాష్ట్రస్థాయిలోనే సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల నియామకాలు ‘టిస్’ ఆధారంగా వివరాలు తీసుకున్న విద్యాశాఖ ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు సీనియార్టీ జాబితాలు వారి నుంచి రిమార్కులు కోరనున్న విద్యాశాఖ మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ వార్షిక పరీక్షలు -
సబ్ జైలును పరిశీలించిన న్యాయమూర్తి
ధర్మవరం అర్బన్: సబ్ జైలులో ఖైదీలకు సదుపాయాలు సక్రమంగా ఉండాలని సంబంధిత అధికారులను ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ ఆదేశించారు. బుధవారం ధర్మవరంలోని సబ్ జైలును న్యాయమూర్తి తనిఖీ చేశారు. వంట గది, బ్యారెక్లు, సరుకుల నిల్వ గది, జైలు పరిసరాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ.. వసతులపై ఆరా తీశారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. ఉచిత న్యాయ సహాయ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శివరామకృష్ణయ్య, న్యాయవాదులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు పుట్టపర్తి టౌన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ)లో భాగంగా లోయర్, హయ్యర్ గ్రేడ్ల్లో డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణకు సంబంధించి ఈ నెల ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ కొత్తచెరువులోని జెడ్పీహెచ్ఎస్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడు చేసుకోవాలి. హాల్టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి. ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్కడప అర్బన్: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు కడప అర్బన్ పీఎస్ ఎస్ఐ మోహన్కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక తాలూకా పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీ కుంట మండలం గౌకనపల్లికి చెందిన షేక్ దర్బార్ వలి గతంలో సెల్ఫోన్ దొంగతనాల కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన విధానాలు మార్చుకోకుండా మోటార్ సైకిళ్లను అపహరించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్ సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న విషయాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు అపహరణకనగానపల్లి: ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కొని ఉడాయించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు శ్రీరెడ్డి నారాయణమ్మ మధ్యాహ్నం ఒంటరిగా ఇంటికి వెళుతుండగా రోడ్డు పక్కన మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసు లాక్కొని ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. ఆ సమయంలో ఆమె కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకునే లోపు దుండగులు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ శ్రీధర్, కనగానపల్లి ఎస్ఐ రిజ్వాన్ వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలితో వివరాలు ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చోరీ కేసుల్లో పలువురి అరెస్ట్ పెనుకొండ: వివిధ చోరీ కేసుల్లో పలువురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. వివిధ కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల మేరకు తమ పరిధిలో ఉన్న కేసుల్లో నిందితులను బుధవారం అరెస్ట్ చేసి, రూ. 50.40 లక్షల విలువ చేసే బంగారంతో ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ ఆదర్శం
భూమికి, వాటి యజమానులకు రక్షణగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ విషం చిమ్మింది. పచ్చమీడియా విషప్రచారం చేసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో దావోస్ వేదికగా ఇటీవల జరిగిన సదస్సులో ఆ విష ప్రచారం బట్టబయలైంది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనం.. ఆవశ్యకతను వివరిస్తూ ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ ప్రశంసలు కురిపించారు. అది కూడా సీఎం చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో.. ఆయన సమక్షంలోనే ప్రశంసించడం గమనార్హం. అనంతపురం అర్బన్: భూ యాజమాన్యానికి సంబంధించి గ్రామస్థాయిలో 1బి, అసైన్మెంట్, ఈనాం వంటి పలు రిజిస్టర్లు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే భూ రికార్డుల శాఖ కార్యాలయంలో మరికొన్ని, సబ్రిజిస్ట్రార్, పంచాయతీ, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఇంకొన్ని రికార్డులు నిర్వహిస్తుంటారు. అటవీ, దేవదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా... చట్టపరంగా ఏదీ తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా... వేరే వాళ్లు అది తనదని దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇలాంటి కేసులు కోర్టులో చాలా నడుస్తున్నాయి. అయితే టైట్లింగ్ చట్టం ద్వారా ఒక్కసారి రిజిస్టర్ అయితే భూ యజమానులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఆ హక్కులపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లూ ఉంటాయి. ఇంతటి బృహత్తర చట్టాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తయితే ఇక తమకు విలువ ఉండదని భావించిన అప్పటి ప్రతిపక్ష టీడీపీ... పచ్చ మీడియా విష ప్రచారాన్ని చేపట్టాయి. చివరకు అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్పై అక్కసుతో ఆ చట్టాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేశారు. హుక్కులకు ప్రభుత్వ పూచీ ● ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ జవాబుదారీ వహించదు. ● రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని... రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. ● టైట్లింగ్ చట్టం కింద రూపొందించిన రిజిస్టర్ ప్రకారం టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో పాత రికార్డులేవీ చెల్లవు. టైట్లింగ్ ద్వారా భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా పరిహారం కూడా చెల్లిస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ● టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే రెండేళ్లలోపు దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారు అవుతుంది. టైట్లింగ్ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒక్కసారి నిర్ధారణ అయితే అదే అంతిమ నిర్ణయం అవుతుంది. ● భూములకు సంబంధించిన వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా నమోదు చేస్తారు. టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్య తలెత్తితే పరిష్కారానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుతంలా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లవచ్చు. ● ఇప్పటి వరకూ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్టేషన్ మాత్రమే జరుగుతుంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అయితే ల్యాండ్ టైటిల్ చట్టం కింద రిజిస్ట్రేషన్కు సంబంధించి పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. ఈ వ్యవస్థను జిల్లా, రాష్ట్ర స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పట్లోనే స్పష్టత ఇచ్చిన నీతి ఆయోగ్ తప్పుడు పత్రాలతో... భూ యజమానుల తప్పుడు ఆధార్లు సృష్టించి వారి భూములను వేరొకరికి విక్రయించిన పలు ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. వీటిపై పోలీసు విచారణ జరగడం... వాస్తవమని నిర్దారణ కావడం... తదనంతరం కేసులు నమోదు కావడం... తదితర పరిణామాలు ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలిసిందే. ఇదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద రిజిస్టర్ జరిగితే... యజమానిని కాదని వారి భూమిని తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భూ యజమానులకు సంపూర్ణ భరోసానిస్తూ జగన్ ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రవేశపెట్టగానే రాజకీయాల్లో పెను దుమారం రేగింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఈ అంశంపై అప్పటి అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఆ సమయంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టం పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబునిచ్చింది. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని స్పష్టం చేసింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని పేర్కొంది. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన టైట్లింగ్ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో కితాబు చంద్రబాబు సమక్షంలోనే దావోస్ వేదికగా అభినందనల వెల్లువ అయినా వైఎస్ జగన్పై అక్కసుతో రద్దు చేసిన చంద్రబాబు సర్కారు -
మోక్ష మార్గం... శివనామ స్మరణం
భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు. ఈ సత్య విషయాన్ని తెలియజెప్పే నిర్గుణ పరతత్వ స్వరూపమే ‘లింగం’. ఈ లింగోద్భవ వేళ శివనామస్మరణ మోక్ష మార్గానికి మార్గమని పెద్దలు చెబుతుంటారు. ఆ సమయం రానే వస్తోంది. మహాశివరాత్రి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. తాడిమర్రి/ఎన్పీ కుంట: కాకిముట్టని తీర్థంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో వెలసిన కాటికోటేశ్వర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన స్వామి.. కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాడని భక్తుల నమ్మకం. రెండు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ నుంచి తెప్పించి ప్రతిష్టించిన శివలింగం, నవగ్రహాలు, గదాగుండం, కొండపై గుహలో అక్కమ్మ దేవతలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి పర్వదినాన రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రానికి అనంతపురం నుంచి నార్పల మీదుగా పార్నపల్లి బస్సులో వెళ్లవచ్చు. అలాగే ధర్మవరం నుంచి పులివెందుల బస్సులో దాడితోట మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు. కాకి ముట్టని తీర్థం కాటికోటేశ్వర క్షేత్రంలో కాకులు మచ్చుకై నా కనిపించవు. అందుకే ఈ కోనేటిలోని నీటిని కాకిముట్టని తీర్థమని అంటారు. పూర్వం ఇక్కడి గుహలో వెలసిన అక్కమ్మ దేవతలు కోనేటిలో జలకాలు ఆడేవారని, ఆ సమయంలో వారి వస్త్రాలపై కాకులు రెట్ట వేయడంతో వారు ఆ ప్రాంతంలో కాకులు ఉండకుండా శాసించినట్లుగా ఓ పూర్వగాథ ఉంది. 14 నుంచి జాగరణ మహోత్సవాలు ఎన్పీకుంట మండలం గూటిబైలులో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే తిమ్మమాంబ జాగరణ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వెలసిన తిమ్మమ్మ మర్రిమాను 8.15 ఎకరాల్లో విస్తరించి, 6,800 ఊడలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. మహావృక్షం వెనుక పురాణగాథ ఉంది బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబకు దిగువ గూటిబైలు గ్రామానికి చెందిన బాలవీరయ్యతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి జీవితం ఆనందంగా సాగింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడిన బాలవీరయ్య మృతి చెందడంతో ఆ రోజుల్లో కొనసాగుతున్న ఆచారం మేరకు తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధం కాగా, చితి పక్కకు వైదొలగకుండా నాలుగు వైపులా ఎండిన మర్రి గుంజలను నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి నేడు మహావృక్షంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆలయ నిర్మాణంతో నిత్య పూజలు బెంగుళూరుకు చెందిన కై వారం యోగినారాయణస్వామి ట్రస్ట్ ధర్మాధికారి డాక్టర్ ఎంఎస్ జయరాం 2011లో తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ, బాలవీరయ్య దంపతుల ఆలయంతో పాటు తిమ్మమాంబ సతీసహగమనం చేసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఘాట్ను నిర్మించారు. ఈ సారి జాగరణ మహోత్సవాలను ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. తిమ్మమ్మ మర్రిమానుకు అరకిలోమీటరు దూరంలో శివప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ధ్యానం చేసుకునేందుకు వీలుగా గదులు కూడా నిర్మించారు. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కాటికోటేశ్వరుడు ప్రాతివత్య మహిమకు ప్రతీకగా నిలిచిన తిమ్మమాంబ క్షేత్రం -
ఆ సంబంధమే హత్యకు ఉసిగొల్పింది
పెనుకొండ: వివాహేతర సంబంధం కారణంగానే ఓ యువకుడు హతమయ్యాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పెనుకొండ సీఐ రాఘవన్ తెలిపారు. పెనుకొండలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐలు వెంకటేషులు, వీరాంజనేయులుతో కలసి నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. రొద్దం మండలం పెదకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న దంపతుల ఒక్కాగానొక్క కుమారుడు లింగమయ్య (24) దానిమ్మ కాయల ప్యాకింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లితో కలసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో లింగమయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని అవమానంగా భావించిన వివాహిత సోదరుడు మనోజ్, కుటుంబసభ్యులు పలుమార్లు లింగమయ్యను మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా లింగమయ్యను హతమార్చాలని మనోజ్ పథకం వేశాడు. తన తోటి మిత్రులు నవీన్, ప్రభాస్ ద్వారా ఈ నెల 3న గ్రామ శివారులోకి లింగమయ్యను మనోజ్ పిలిపించుకున్నాడు. అక్కడ మాటామాట పెరగడంతో అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోడి కత్తులతో లింగమయ్యను మనోజ్ పొడిచాడు. ఆ సమయంలో లింగమయ్యను కదలకుండా నవీన్, ప్రభాష్ గట్టిగా పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన లింగమయ్య ఘటనా స్థలంలోనే మరణించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో మంగళవారం ఉదయం పెద్దమంతూరు గ్రామ శివారున తచ్చాడుతున్న మనోజ్, నవీన్, ప్రభాస్ను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు కోడి కత్తులు, మూడు సెల్ఫోన్లు, ఓ మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్ -
చెరువులో పడి యువకుడి మృతి
పెనుకొండ రూరల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, రత్నమ్మ దంపతుల కుమారుడు హరీష్ (21) కుటుంబసభ్యులతో కలసి మరువపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. కూలి పనులతో జీవనం సాగించేవాడు. మంగళవారం ఉధయం గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం కనగానపల్లి: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురానికి చెందిన మహేష్ (32).. రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన రాధమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్లుగా మరూరులోనే నివాసముంటూ బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం రాత్రి మరూరు నుంచి కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన మహేష్.. గ్రామ సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రాయదుర్గంలో దొంగల బీభత్సం
● 2 కిలోల వెండి ఆభరణాల అపహరణ రాయదుర్గం టౌన్: స్థానిక బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న సయ్యద్ జువెలరీ షాపులో ఐదుగురు దుండగులు ప్రవేశించి దాదాపు రూ.6 లక్షల విలువైన 2 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. ఒక్క వెండి ఆభరణం కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటలకు జరిగింది. కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే చోరీ చేసి తాము వచ్చిన ద్విచక్ర వాహనాలపైనే దుండగులు పరారైన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ఫుటీజీల్లో నిక్షిప్తమయ్యాయి. తొలుత రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు దుండగులు మాస్క్లు ధరించి జువెలరీ షాపు షట్టర్ను ఇనుప రాడ్తో వంచారు. ఓ దుండగుడు బయట కాపలా కాస్తుండగా మరో నలుగురు లోపలకు ప్రవేశించి దుకాణాలోని వెండి ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకున్నారు. బంగారం ఉన్న లాకర్ను పెకలించేందుకకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలపై బళ్లారి వైపుగా ఉడాయించారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు అటుగా వెళ్లిన స్థానికులు దుకాణం షట్టర్ వంచి ఉండడం గమనించి సమాచారం ఇవ్వడంతో యజమాని సయ్యద్ హరూన్ బాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పట్టణ సీఐ జయనాయక్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతపురం నుంచి వచ్చిన క్లూస్టీమ్ సాయంతో దుండగుల వేలి ముద్రలు సేకరించారు. యజమాని హరూన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కోర్టు భవనాల నిర్మాణానికి సహకరించండి
● జిల్లా జడ్జికి పురం న్యాయవాదుల వినతి హిందూపురం: స్థానిక కోర్డు భవనాల నిర్మాణంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా జడ్జి భీమారావును హిందూపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నేరువప్ప, న్యాయవాదులు కృష్ణమూర్తి, శివశంకర్ విన్నవించారు. ఈ మేరకు జిల్లా జడ్జిని అనంతపురంలోని జడ్జి చాంబర్లో కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టుకు న్యాయమూర్తిని నియమించాలని కోరారు. పాతబడిన బిల్డింగులను తొలగించి, నూతన భవనాలను నిర్మించాలని విన్నవించారు. ఇందుకు జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానానికిప్రతిపాదనలు పంపనున్నట్లు హామీనిచ్చారని న్యాయవాదులు తెలిపారు. -
సీమ ప్రాజెక్టులకురూ.8 వేల కోట్లు కేటాయించాలి
● రాయలసీమ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ పెనుకొండ: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 2026–27 బడ్జెట్లో కనీసం రూ.8 వేల కోట్ల మేర నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రాయలసీమ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకనట విడుదల చేశారు. వ్యవసాయంపై ఆధారపడిన రాయలసీమ ప్రాంతం సుదీర్ఘ కాలంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా అనే నాలుగు ప్రాజెక్టులను చేపట్టారన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తీ చేయడానికి ఆధునీకరణకు రూ.60 కోట్లు అవసరముందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2024 వరకు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది రూ.15,078 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కనీసం రూ.8 వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో చెరువుల పునరుద్దరణ, వాగులు, వంకలను కాలువలతో అనుసంధానించడం, పర్యావరణ పరిరక్షణ, పెన్నానది పునరుజ్జీవనం చేయడం, నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. రౌడీషీటర్పై పీడీ యాక్ట్కదిరి టౌన్: తరచూ నేరాలకు పాల్పడుతూ శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తున్న కదిరిలోని పూల బజారుకు చెందిన రౌడీ షీటర్ బాలమురళీకృష్ణ అలియాస్ బాలుపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం కదిరి పట్టణ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. తరచూ నేరాలు, ఘర్షణలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బాలుపై ఇప్పటికే పట్టణ పీఎస్లో 7 కేసులు నమోదయ్యాయన్నారు. 2024, ఏప్రిల్లో కదిరి తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి, ఏడాది కాలానికి గాను బైండోవర్ చేశామన్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఆదేశాలతో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. -
సచివాలయ విధుల నుంచి మినహాయించండి
ప్రశాంతి నిలయం: సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్–3లకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పనులు తప్ప ఇతర విధుల నుంచి మినహాయింపునివ్వాలని ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు లింగా రామమోహన్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పనులతో పాటు దాదాపు 40 రకాల యాప్ల ద్వారా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఏఎన్ఎం గ్రేడ్–3లు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ఎన్సీడీ, అబా ఐడీ, లెప్రసీ స్క్రీనింగ్, ఆర్సీహెచ్, అన్మోల్, 104, ఆర్బీఎస్కే, ఇమ్యునైజేషన్, ఎన్డీడీ, డ్రై డే ఫ్రైడే వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఇవి కాక పెన్షన్ పంపిణీ, ఈకేవైసీ అప్డేట్, డోర్టు డోర్ సర్వే, యూనిటైడ్ హౌస్ హోల్డ్ సర్వే తదితర పనులకు కేటాయించడంతో ఒత్తిడి అధికమవుతోందని, దీంతో సచివాలయ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మద్యం మత్తులో ఘర్షణ – ఒకరి మృతి చిలమత్తూరు: మద్యం మత్తులో చోటు చేసుకున్న ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన అన్నదమ్ములు వడ్డె తిరుపాలు, వడ్డె శంకరప్ప మంగళవారం రాత్రి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై చర్చించుకుంటూ కూర్చొన్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామస్తులు కల్పించుకుని సర్ది చెప్పి ఇద్దరినీ ఇళ్లకు పంపించేశారు. కాసేపటికే తిరుపాలు (47) తన ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకలోని బాగేపల్లిలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మునీర్ అహమ్మద్.. ఘర్షణపై ఆరా తీసి, బాగేపల్లిలోని ఆస్పత్రికి చేరుకుని తిరుపాలు మృతదేహాన్ని పరిశీలించారు. ఎదపై చిన్నపాటి గాయాన్ని గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కూటమి నేతలను వేంకటేశ్వరస్వామి క్షమించడు
కదిరి టౌన్: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామితో పరాచకాలు ఆడుతున్నారని, ఆ దేవదేవుడు చంద్రబాబుతో పాటు కూటమి నాయకులను క్షమించడని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. మంగళవారం కదిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ సమన్యయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తీ జరగలేదని సీబీఐ సిట్ తెల్చి చెప్పినా చంద్రబాబు, పవన్కళ్యాణ్ కల్తీ జరిగిందని పదే పదే పాట పాడుతుండటం హేయమన్నారు. కల్తీ జరిగింది తిరుమల లడ్డులో కాదు...ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత సంస్థ అయిన హెరిటేజ్లో కల్తీలు జరిగాయన్నారు. అందుకే ఎఫ్ఎస్ఎస్ఐఎ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) జరిమానా విధించిందన్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హెరిటేజ్ సంస్థను రాష్ట్రంలో నిషేధించాలన్నారు. భక్తులు మనోభావాలు దెబ్బతీయటమే లక్ష్యంగా చంద్రబాబు, ఎమ్మెల్యేలు పనిగా పెట్టుకున్నారన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం నియమించిన సీబీఐ సీట్ మీద కూడా వారికి విశ్వాసం లేదన్నారు. కుట్రల ప్రకారం రిపోర్టులు రాకపోయేసరికి న్యాయ వ్యవస్థని తప్పుబడుతున్నారన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల పాపాలకు తగ్గట్టుగా శిక్షలు పడక తప్పదన్నారు. శ్రీశైలంలో శివ భక్తులపైన లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సనాతన సేనాని అని చెప్పుకొనే పవన్కళ్యాణ్ భక్తులపైన లాఠీచార్జీ జరిగితే ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, మండల కన్వీనర్లు రవికుమార్రెడ్డి, అశోక్వర్ధన్రెడ్డి, సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులునాయుడు, యూత్ అధ్యక్షుడు రమేష్యాదవ్, పట్టణ అధ్యక్షుడు బాబా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్న రెడ్డప్ప, సర్పంచ్ హైటెక్ రమణ, ఎంపీటీసీ సభ్యుడు తిమ్మారెడ్డి, నాయకులు ఎహెసాన్, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హెరిటేజ్ను నిషేధించాలి అందులో జరిగిన కల్తీపై సీఎం చంద్రబాబు సమాధనమివ్వాలి వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్యయకర్త మక్బూల్ -
ఆక్రమణలపై చర్యలు శూన్యం
పుట్టపర్తి అర్బన్: వాగులు, వంకలు, చెరువులు, నదులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కూటమి నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని పని కానిచ్చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాలు ఆక్రమిస్తున్నా ఆయన సైతం మనవాల్లే కదా అని వెనుకేసుకొస్తున్నట్లు తెలిసింది. పర్యాటక కేంద్రమైన పుట్టపర్తి పరిధిలోని చిత్రావతి నదికి ఇరువైపులా స్థలాలు ఆక్రమించి భవనాలు నిర్మించారు. లోకాయుక్తలో కేసు నడుస్తున్నా ఆక్రమణలకు విరామం ఇవ్వకుండా కబ్జా చేస్తూనే ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నా కొంత విరామం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ కబ్జా పర్వాన్ని మొదలు పెట్టారు. కబ్జాల వ్యవహారంపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఇటీవల సీరియస్ కావడంతో ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులు నివేదికను సిద్ధం చేసి సమర్పించినట్లు తెలిసింది. ప్రభుత్వ స్థలాలే టార్గెట్ ఇటీవల సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను అడ్డుపెట్టుకొని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ ఉన్న అర ఎకరా స్థలాన్ని ఆక్రమించడానికి మట్టి తోలి చదును చేసి సిద్ధం చేశారు. మట్టి తోలి సిద్ధం చేయగానే ఎనుములపల్లికి చెందిన చెరువు సంఘం అధ్యక్షుడు, టీడీపీ నేత చిమిరాల సుధాకర్ తన స్వంత స్థలంలోకి చెరువు స్థలాన్ని కలుపుకునే ప్రయత్నాలు చేశారు. పక్కనే ఇరిగేషన్ కార్యాలయం ఉన్నా పట్టించుకోలేదు. చివరకు ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తీసుకురాగానే ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. అయితే అధికారులు మాత్రం ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మరికొంత కాలం గడిస్తే పట్టించుకోకుండా ఆయనకే వదిలేసేలా ఉన్నారన్న విమర్శలున్నాయి. కర్ణాటక నాగేపల్లి వద్ద చిత్రావతి నదిని ఆనుకొని ఇరిగేషన్కు చెందిన సుమారు అర ఎకరా స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. లక్షలాది రూపాయల బిల్లులు చేయించడానికి సిద్ధం చేశారు. దీన్ని సైతం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ప్రస్తుతానికి నిర్మాణాలు ఆపేశారు. అయితే అందులోని నిర్మాణ సామగ్రి, ఇటుకలు అలాగే ఉంచారు. రాత్రిళ్లు నిర్మాణాలు చేపట్టినా ఆశ్చర్య పోనవరం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే స్థానిక ఆర్టీసీ బస్ డిపో వద్ద సుమారు అర ఎకరా స్థలంలో పార్కు పేరు చెప్పి నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు పూర్తి కాకనే స్థానిక ఎమ్మెల్యే పార్కును ప్రారంభించేశారు. అందులో ఒక్క మొక్క కూడా పెట్టలేదు. ప్రస్తుతానికి పార్కుకు తాళం వేసి మూసేశారు. దీని బిల్లుల కోసం కమిషనర్పై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన లాంగ్ లీవ్ పెట్టి పెట్టె బేడా సర్దుకున్నారు. మూడు ఎకరాల స్థలం ఆక్రమణ పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద ఓ నాయకుడు సర్వే నంబర్ 178లో సుమారు 3 ఎకరాలు ఇరిగేషన్కు చెందిన భూమిని ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. దీనిపై బత్తలపల్లి, గువ్వలగుట్టపల్లి గ్రామస్తులు, రైతులు కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రాలు సైతం సమర్పించారు. తమ చెరువుకు నీళ్లు రాకుండా అడ్డు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరితే పట్టా రద్దు చేశామని చెబుతున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఆర్డీఓను ఆశ్రయించినా ఫలితం లేదంటున్నారు. కబ్జాలపై ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు నివేదికను సమర్పించడంతో దాని ఆధారంగానైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న చర్చసాగుతోంది. కలెక్టర్కు నివేదిక సమర్పించిన ఇరిగేషన్ అధికారులు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేరా? -
3.6 లక్షలు
గ్యాస్ కోత ఇలా... చిత్రంలోని మహిళ పేరు రమణమ్మ. నల్లచెరువు మండలం పెద్దయల్లంపల్లి. గ్యాస్ సిలిండర్ కొన్న ప్రతిసారీ డెలివరీ బాయ్ను అడిగితే రెండు రోజుల్లో నగదు జమ అవుతుందని చెబుతున్నాడని, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి డబ్బులు పడలేదని వాపోయారు. నిర్వాహకులను అడిగితే అధికారుల వద్దకు వెళ్లాలని చెబుతున్నారని, నిబంధనలు ఏం ఉన్నాయో కూడా చెప్పే వాళ్లు లేరన్నారు. ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రమాదేవి. రొద్దం వాసి. దీపం–2 పథకంలో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సిలిండర్ డబ్బులు కూడా జమ కాలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే.. వచ్చే నెలలో చూద్దామంటూ మాట దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పి.. ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకుండా కొర్రీలు పెట్టడం ఏంటని వాపోతున్నారు. ఈమె పేరు లక్ష్మీనరసమ్మ. పరిగి మండలంలో నివసిస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏడుసార్లు సిలిండర్లు కొనుగోలు చేశారు. అయితే మొదట్లో రెండుసార్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఆ తర్వాత జమ కాలేదు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే నిబంధనలు మారాయని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి, పుట్టపర్తి: ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక పథకంలో కొర్రీలు పెడుతూ వినియోగదారుల నెత్తిన భారం మోపారు. షరతులు విధిస్తూ.. ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఏడాదిలో ఒకసారి సబ్సిడీ పొందిన వారికి.. మరో రెండుసార్లు నగదు జమ కావడం లేదు. మూడు, నాలుగు నెలల లోపు ఏదో షరతు పేరుతో అనర్హుల జాబితాలో పేరు ఉందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఉత్తుత్తి ప్రచారమేనా? చంద్రబాబు ప్రభుత్వం 2024 నవంబర్లో దీపావళి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళలకు ఒక్కో సిలిండర్ అందజేసి ఫొటోలకు ఫోజులిచ్చి.. ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత అదే లబ్ధిదారులకు మరో సిలిండర్ కూడా ఉచితంగా రాకపోవడం గమనార్హం. తొలిసారి సిలిండర్ అందుకున్న వారికి ఇప్పటి వరకు సిలిండర్ డబ్బులు జమ కాలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే.. నిబంధనలు మార్చారని.. ఇప్పుడు అర్హత కోల్పోయారని సమాధానం చెబుతున్నారు. దీంతో ఉచిత గ్యాస్పై ఆధారపడిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా కోత జిల్లా వ్యాప్తంగా 5.61 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో తొలివిడతలో 2024లో 3.6 లక్షల మందికి దీపం–2 పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేశారు. ఆ తర్వాత రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య 2025లో 3.4 లక్షలకు తెచ్చారు. ప్రస్తుతం దీపం–2 పథకం లబ్ధిదారులు 2026లో 2.95 లక్షలు మాత్రమే ఉన్నారు. ఏడాది వ్యవధిలో వేలాది మంది అర్హత కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముందుగా నగదు చెల్లించి సబ్సిడీ కోసం వేచి చూసి.. నిరాశ చెందుతున్నారు. ఏడాదిలో ఒక సిలిండర్ ఇచ్చి ఉచిత గ్యాస్ పథకానికి మంగళం అర్హత ఉన్నప్పటికీ జమ కాని సబ్సిడీ జిల్లా వ్యాప్తంగా చాలా మందికి మొండి చెయ్యి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తానన్న సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ కనెక్షన్లు2024లో గ్యాస్ సబ్సిడీ పొందిన వారు2.955.61లక్షలు -
ఇంటర్ ప్రాక్టికల్స్కు 47 మంది డుమ్మా
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్స్కు 47 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు విద్యాధికారి చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. 25 కళాశాలల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ జరగ్గా ఉదయం జరిగిన పరీక్షలో 615 మందికిగాను విద్యార్థులకు 602 మంది, సాయంత్రం జరిగిన పరీక్షల్లో 717 మంది విద్యార్థులకు 683 మంది హాజరయ్యారన్నారు. రెండు విడతల్లోనూ మొత్తం 47 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ముగ్గురికి షోకాజ్ నోటీసులు లేపాక్షి: ఉపాధి పథకం కింద పనిచేసే అధికారులు, ఉపాధి సిబ్బందిపై జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమయపాలన పాటించక పోవడం, రికార్డులను అప్డేట్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయని టెక్నికల్ అసిస్టెంట్లు అయూబ్ అన్సార్, సీవీ రవికుమార్, మల్లికార్జునకు షోకాజ్ నోటీసులు, ఏపీఓ చంద్రశేఖర్, ఈసీ మధుసూదన్రెడ్డికి మెమోలిచ్చారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు ● పోలీసుల అదుపులో నలుగురు బత్తలపల్లి: గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న నలుగురు దుండగులను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్లితే.. బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి గ్రామ సమీపంలోని పాడుబడిన కాటమయ్యస్వామి ఆలయం వద్ద మంగళవారం ఉదయం ధర్మవరం పట్టణానికి చెందిన బసినేని సత్యనారాయణ అలియాస్ సత్తి, గాజుల హరికృష్ణ, మీసా శ్రీనివాసులు, బీరే రమేష్ గుప్త నిధుల కోసం ఆలయ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. స్థానికులు వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, గడారు, పారను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 54 రోజులకుగాను హుండీలు లెక్కించగా రూ.91,29,512 నగదు, 4 గ్రాముల బంగారు, 170 గ్రాములు వెండి, విదేశీ కరెన్సీలు కెన్వయా (సిలింగ్)400, కెనడా డాలర్స్ 5, సింగపూర్ డాలర్లు 2 వచ్చాయన్నారు. హుండీల పర్యవేక్షణాధికారి ప్రసాద్, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. భూ నిర్వాసితుల నిరసన పెనుకొండ రూరల్: నాసన్, బెల్ కంపెనీలకు భూములుచ్చిన సోమందేపల్లి రైతులు పునరావాసం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు మంగళవారం నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టిన అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఏఓకు అందజేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ ఆనంద్కుమార్ ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు. -
‘సూర్యఘర్’తో ఖర్చులు తగ్గించుకోండి
ప్రశాంతినిలయం: ప్రధాన మంత్రి సూర్య ఘర్ విద్యుత్ యోజనతో ప్రజలు విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. మంగళవారం కొత్తచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రధాన మంత్రి సూర్యఘర్ విద్యుత్ యోజన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు. దీంతో విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గించుకోవచ్చన్నారు. కిలోవాట్కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణకుమార్, విద్యుత్శాఖ ఎస్ఈ మోసెస్, ఉద్యానశాఖాధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, విద్యుత్శాఖ డీఈ శివరాములు తదితరులు పాల్గొన్నారు. 17న జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు ధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిశోర్ తెలిపారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, రాష్ట్రస్థాయి శాప్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 17న ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్ 13, 15, 17, 19 బాలుర, బాలికల విభాగంలో చదరంగం పోటీలు, 24న సైక్లింగ్లో అండర్–18 విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు తిరుపతిలో, 28 నుంచి మార్చి 1 వరకు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు విషయాన్ని గమనించాలన్నారు. -
పక్కాగా ‘పది’ పరీక్షల నిర్వహణ
ప్రశాంతినిలయం: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం బుక్కపట్నం మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రీఫైనల్ పరీక్షలకు ప్రతి విద్యార్థి హాజరయ్యేలా చూడాలన్నారు. మెరుగైన బోధన అందించి పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట డిఈఓ కిష్టప్ప ఉన్నారు. అనంతరం సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు. అందరికీ ఉపాధి అవకాశాలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. మంగళవారం బుక్కపట్నంలో ఏపీ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణను ఆయన పరిశీలించారు. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ధర్మవరం అర్బన్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ను మంగళవారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎస్పీ హేమంత్కుమార్, సీఐ నాగేంద్రప్రసాద్లకు సూచించారు. సైబర్ క్రైమ్, వివిధ రకాల చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నైట్ బీట్ను మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్, ఆలయ పరిసరాలు, రైల్వేస్టేషన్లలో తరచూ తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులను విచారించి స్టేషన్కు తరలించాలన్నారు. చైన్ స్నాచర్ల బారిన పడకుండా తెల్లవారుజామున వాకింగ్ వెళ్లే వారికి తగిన సూచనలు, జాగ్రత్తలు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
రెండుసార్లు మాత్రమే ఇచ్చారు
చంద్రబాబు ప్రభుత్వం దీపం–2 పథకం అమలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఐదు సిలిండర్లు కొన్నాను. కేవలం రెండుసార్లు మాత్రమే డబ్బులు ఇచ్చారు. మిగతా మూడుసార్లు నగదు జమ చేయలేదు. నిబంధనలు మార్చారని నిర్వాహకులు చెబుతున్నారు. మొదట్లో ఉన్న అర్హత నెలల వ్యవధిలో ఎలా కోల్పోతామో అధికారులే చెప్పాలి. – సింధ్య, చౌళూరు, హిందూపురం మండలం నెలల తరబడి వేచి చూడాలా? గతేడాది ఏప్రిల్లో సిలిండర్ బుక్ చేస్తే 40 రోజుల తర్వాత నగదు ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత గత నవంబరులో ఓసారి బుక్ చేస్తే ఈ ఏడాది మొదట్లో జమ చేశారు. అయితే ఇప్పటి వరకు ఐదుసార్లు బుక్ చేయగా.. కేవలం రెండుసార్లు మాత్రమే సబ్సిడీ నగదు జమ అయింది. అది కూడా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. – చంద్రకళ, కోనాపురం, పెనుకొండ మండలం -
పెళ్లి చేసుకుని ఉన్నదంతా ఊడ్చేసింది!
పుట్టపర్తి టౌన్: తొలి భర్తకు విడాకులివ్వకుండానే తనను రెండో పెళ్లి చేసుకుని తన వద్ద ఉన్నదంతా ఊడ్చేసిందని, విచారణ జరిపి న్యాయం చేయాలని పెనుకొండకు చెందిన సుబ్బారావు అడిషనల్ ఎస్పీ అంకిత సురానాను కోరారు. తనకు జరిగిన అన్యాయంపై పెనుకొండ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టించుకోలేదన్నారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మరో బాధితుడు రమేష్తో కలిసి తన భార్య మహాలక్ష్మిపై ఫిర్యాదు చేశాడు. నగదు, నగలు ఎత్తుకెళ్లింది.. పెనుకొండకు చెందిన సుబ్బారావు పట్టణంలో సిమెంట్ రింగులు విక్రయిస్తూ జీవనం సాగించే వాడు. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పామిడికి చెందిన పెళ్లిళ్ల పేరయ్య మస్తానయ్యను సంప్రదించారు. దీంతో మస్తానయ్య పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి సంబంధం కుదిర్చి ఓ గుడిలో ఇద్దరికీ పెళ్లిచేశాడు. అయితే మహాలక్ష్మికి అప్పటికే రమేష్ అనే వ్యక్తితో వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. ఈ విషయం తెలియని సుబ్బారావు ఆమెను పెళ్లి చేసుకుని పెనుకొండలోనే కాపురం పెట్టాడు. మూడు నెలల తర్వాత ఇంటి పనులకు సాయంగా ఉంటారని తన బంధువులను ముగ్గురిని పెనుకొండకు పిలిపించుకున్న మహాలక్ష్మి ఆ తర్వాత తన అసలు రంగు బయటపెట్టింది. సుబ్బారావును చిత్రహింసలకు గురిచేసింది. చివరకు సుబ్బారావుతో గొడవ పడి 30 తులాల బంగారం, ఇంటిపత్రాలు తీసుకొని నెల్లూరుకు వెళ్లిపోయింది. పెళ్లి కుదిర్చిన మస్తానయ్య వద్దకు వెళ్లితే ఆయన పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో సుబ్బారావె తన బంధువులతో కలిసి నెల్లూరుకు వెళ్లి మహాలక్ష్మిని కాపురానికి రావాలని కోరినా ఆమె నిరాకరించింది. దీంతో ఇరుగుపొరుగుతో వివరాలు ఆరా తీయగా ఆమె మొదటి భర్త రమేష్ గురించి తెలపడంతో ఆయన్ను కూడా కలిశాడు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి నెల్లూరు పోలీస్టేషన్లో సుబ్బారావు వేధిస్తున్నాడని, విడాకులు కావాలని కేసు పెట్టింది. భరణం కింద రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో సుబ్బారావు నెల్లూరులో మరింత లోతుగా విచారించగా మహాలక్ష్మి ఇలా చాలా మందిని మోసం చేసిందని... నిత్యం పెళ్లిళ్లు చేసుకుంటూ మోసం చేస్తోందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతను సోమవారం ఏఎస్పీ అంకిత సురానాను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన ఏఎస్పీ విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యపెళ్లి కూతురిపై చర్యలు తీసుకోండి పరిష్కార వేదికలో ఏఏస్పీ సురానాకు విన్నవించిన బాధితుడు పరిష్కార వేదికకు 90 వినతులు.. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అందే అర్జీలన్నీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అడిషనల్ ఎస్పీ అంకితా సురానా పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 90 వినతులు అందాయి. అడిషనల్ ఎస్పీ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు న్యాయ సలహాదారుడు సాయినాథ్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ ఇస్మాయిల్, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
మడకశిర రూరల్: మండలంలోని గౌరీపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనం ఢీ కొని ఓ గుర్తు తెలియని మహిళ (40) మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతురాలి ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆరా తీశారు. యాచకురాలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 94901 12475, 94405 53820 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
భగవంతుడితో ఆటలు సరికాదు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తూ కూటమి నేతలు భగవంతుడితో ఆటలాడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. సోమవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలతో మేడలు కట్టే కూటమి నేతలు... ఎన్నో వివాదాలను వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించారన్నారు. దేవుడి లడ్డును కూడా కల్తీ అంటూ రాజకీయం చేస్తున్నారన్నారు. లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ కాలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం లడ్డూ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలు తెలుసుకున్నారన్నారు. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ నివేదికతో కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. అందువల్లే ఇప్పుడు టాయిలెట్ క్లీనర్లు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా నెయ్యి కల్తీ జరిగి ఉంటే ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ లాంటి సంస్థలు బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఊరుకునేవా అని ఆమె ప్రశ్నించారు. ఇది పూర్తిగా చంద్రబాబు కుట్ర మాత్రమేనన్నారు. రాజకీయాల కోసం భగవంతుడితో ఆటలు సరికాదని చంద్రబాబుకు, ఆయనకు వంత పాడుతున్న పవన్కళ్యాణ్కు హితవు పలికారు. ఇక చంద్రబాబు సంస్థ హెరిటేజ్ పాలు కల్తీ అయినట్లు వార్తలు వస్తున్నాయని, వాటిపైనా టీడీపీ నేతలు స్పందించాలన్నారు. ఇప్పటికై నా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం మాని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయడంలో చొరవ చూపాలన్నారు. -
పచ్చపాతం తగదు
● సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ఆవేదన పెనుకొండ రూరల్: బిల్లుల మంజూరులో అధికారులు ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించడం తగదని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సవిత ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు.. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి తమకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ సొంత డబ్బు వెచ్చించి, అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించామన్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో బిల్లులు ఇవ్వకపోవడంతో కష్టాల్లో కూరుకుపోయామని వాపోయారు. -
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమితమైన ప్రేమ చూపుతున్నారు. ఆయన ఉద్యోగ విరమణ చేసినా.. తిరిగి అదే స్థానంలో మరికొంత కాలం కొనసాగించేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. అధికారి ద్వారా ప్రతిపాదనలు పెట్టించి మరీ ప్రభుత్వ పెద్దలకు సిఫార్సు చేస్తున
హంద్రీ–నీవా సీఈ నాగరాజ రిటైర్డు ● 10 రోజులైనా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని వైనం ● ఆ సీటులో మరికొంతకాలం కొనసాగేందుకు ప్రయత్నాలు ● ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు ● రూ.వందల కోట్ల బిల్లుల మంజూరు కోసమేననే ఆరోపణలు అనంతపురం సెంట్రల్ : జల వనరుల శాఖలో ఎన్నడూ లేనివిధంగా నయా ట్రెండ్కు టీడీపీ ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారినే తిరిగి కొనసాగించాలంటూ పట్టుబడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఆయన తప్ప సమర్థవంతమైన మరో అధికారి లేరా... ఇంత వరకూ ఆయన చేసిన సేవలు ఏమిటి అనే ప్రశ్నలు ఎవరికై నా ఉత్పన్నం కాకమానదు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రమే ఆయన సేవలు కావాలని ఒత్తిడి తెస్తుండడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రధాన కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం ఫేజ్–2 పరిధి (అనంతపురం, చిత్తూరు)లోనే రూ.1300 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్ పనుల వల్ల భూగర్భజలాలు అభివృద్ధి చెందవని, నేరుగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు నీరు తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని రాజకీయపక్షాలే కాకుండా రైతులు సైతం వ్యతిరేకించినా పరిగణనలోకి తీసుకోకుండా ముందుకుపోయారు. రూ.వందల కోట్లు నీళ్ల ప్రాయంగా వెచ్చిస్తున్నారు. ఎక్కడేకానీ డిస్ట్రిబ్యూటరీ పనుల జోలికి వెళ్లకుండా ప్రధాన కాలువకు లైనింగ్ చేశారు. దాదాపు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. త్వరలో నీటి సరఫరా ఆగిపోతే మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు. రెండు నెలల కాలంలోనే రూ.వందల కోట్లు విలువ చేసే పనులు జరిగాయి. అయితే ఈ పనుల పర్యవేక్షణలో చీఫ్ ఇంజినీర్ (సీఈ) విధులు క్రియాశీలకం. ప్రస్తుతం పనిచేస్తున్న హంద్రీ–నీవా సీఈ నాగరాజ పదవీ కాలం జనవరి 30తో ముగిసింది. దాదాపు పది రోజులు కావస్తున్నా తదుపరి సీఈ ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని సీఈ నాగరాజ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఓ మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యేకే రూ.వందల కోట్లు హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు లైనింగ్ పనులతో పాటు గతంలో ఆధునికీకరణ పనులు కూడా దక్కించుకున్న ఓ కాంట్రాక్టు సంస్థకు అధిపతి అయిన ఎమ్మెల్యేకు రూ.వందల కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. దీంతో సదరు ఎమ్మెల్యే.. సీఈ పదవీకాలం పొడిగించేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మంత్రి అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయని జోరుగా చర్చించుకుంటున్నారు. ముందు నుంచి ఈ ఇద్దరి ఆశీస్సులతోనే సదరు అధికారి సీఈగా నియమితులయ్యారనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఎస్ఈగా ఉన్న ఆయనను అడహాక్ పదోన్నతిపై సీఈగా నియమించారు. తాజాగా పదవీ విరమణ చెందినా కూడా సీఈగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరముంటే పొడిగించవచ్చు ప్రభుత్వ అవసరాన్ని బట్టి అధికారుల పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఈఈ, ఎస్ఈల పదోన్నతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ముఖ్యమైన అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా సీఈ క్యాడర్ పోస్టుల్లో అధికారులు లేరు. ఈ నేపథ్యంలో నేను పదవీ కాలాన్ని పొడిగించాలని కోరాను. ఇంత వరకూ ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. గతంలో ఇతర జిల్లాల్లో ఈఈ పదవీకాలాన్ని పొడిగించారు. – నాగరాజ, చీఫ్ ఇంజినీర్, హంద్రీ–నీవా -
ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు వివరించారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, రీఛార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీలకూ ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు.. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 39 వినతులు అందాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని సీఎండీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గురవయ్య, పి.అయూబ్ఖాన్, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆదిశేషయ్య, ఆర్.పద్మ, జె.రమణాదేవి, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, ఎం.కృష్ణారెడ్డి, కె.సంపత్కుమార్, సీహెచ్ రామచంద్ర రావు, జనరల్ మేనేజర్లు సురేంద్రరావు, జగదీష్, చక్రపాణి, లత తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
● తల్లి పరిస్థితి విషమం నల్లచెరువు: కదిరి సమీపంలోని కౌలేపల్లి గ్రామం వద్ద 42వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడిన చిన్నారి షాఫియా కౌసర్(1) అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తల్లి సల్మా పరిస్థితి విషమంగా ఉంది. కదిరి పట్టణ పోలీసులు తెలిపిన మేరకు... నల్లచెరువు మండలం ఊబిచెర్ల గ్రామానికి చెందిన షేక్ షాజహాన్, సల్మా దంపతులు జ్వరంతో బాధపడుతున్న తమ కుమార్తె షాఫియా కౌసర్కు చికిత్స చేయించేందుకు ఆదివారం రాత్రి కదిరిలోని ఆస్పత్రికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కౌలేపల్లి సమీపంలోకి చేరుకోగానే మదనపల్లి వైపుగా వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న షాఫియా, సల్మాను అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కదిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రిమాండ్కు హత్య కేసులో నిందితుడు రొళ్ల: మండలంలోని ఎం.రాయాపురం గ్రామంలో గత శనివారం సాయంత్రం కట్టెతో బాది దివ్యాంగుడు ప్రసన్నకుమార్ (40)ను హతమార్చిన కేసులో నిందితుడు నాగరాజప్పను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించారు. ఈ మేరకు మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్ వెల్లడించారు. యువతి బలవన్మరణం తనకల్లు: ఒంటరితనాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తనకల్లులోని సంజీవయ్య నగర్లో నివాసముంటున్న జయమ్మ, రామాంజులు దంపతులు అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి వీరి కుమార్తె రెడ్డి ప్రసన్న తన పిన్ని ఈశ్వరమ్మ వద్దే ఉంటూ వెటర్నరీ కోర్సు పూర్తి చేసింది. మూడు నెలల క్రితం పిన్ని కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో ఒంటరిగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోసమని హైదరాబాద్కు వెళ్లిన ఆమె అక్కడ పని నచ్చక తిరిగి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో ఒంటరితనాన్ని భరించలేక మనోవేదనకు లోనైన రెడ్డి ప్రసన్న (21) సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టపక్కల వారి సమాచారంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. వ్యక్తి మృతిపై కలకలం ● గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన బంధువులు సాక్షి, టాస్క్ఫోర్స్: ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఖననం చేసిన ఘటన బత్తలపల్లి మండలం పత్యాపురం తండాలో కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన నాగభూషణ్ నాయక్ వారం రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకున్నట్లుగా తెలిసింది. దీంతో ఓ ఆటోలో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి గుట్టు చప్పుడు కాకుండా వైద్యం అందించారు. రెండు రోజుల అనంతరం మృతి చెందినట్లుగా సమాచారం. ఉరి వేసుకుని చనిపోయారంటూ బంధువులు చెబుతున్నా.. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే పోలీసులు అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు బయటపడకుండా ఉండేందుకు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లి పెడదారి పట్టించనట్లుగా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వక్ఫ్భూముల జోలికొస్తే ఊరుకోం
పుట్టపర్తి అర్బన్: వక్ఫ్బోర్డు భూముల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ముస్లింలు హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి పనుల పేరిట వక్ఫ్భూములను స్వాధీనం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ముస్లింలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డికి వినతి పత్రం అందజేసి వక్ఫ్బోర్డు భూములు పరాధీనం కాకుండా సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయానని మండిపడ్డారు. అలాగే మైనార్టీల ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఈక్రమంలోనే సీఎం చంద్రబాబు వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారన్నారు. అందులో భాగంగానే మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్బోర్డు భూములను ప్రభుత్వ భూములుగా మార్చిందన్నారు. ఈ విషయంలో వక్ఫ్బోర్డుకు గానీ, ఆ భూములను పర్యవేక్షిస్తున్న అంజుమన్– ఆ– ఇస్లామియా సంస్థకు గాని కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. ఇదే తరహాలో మంగళగిరి ప్రాంతానికి సమీపంలోని మల్లయ్యపాలెంలో 232 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వక్ఫ్బోర్డుకు ఇప్పటివరకూ ఎకరా భూమి కేటాయించని చంద్రబాబు...ఎప్పుటినుంచో వక్ఫ్బోర్డు ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. పేద ముస్లింలకు, విద్యార్థులకు, మసీదులకు, పాఠశాలలకు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగపడే వక్ఫ్భూములను స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. అలాకాకుండా వక్ఫ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఒక్కహామీ నెరవేర్చలేదు.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని మైనార్టీసెల్ నాయకులు మండిపడ్డారు. దుల్హన్ పథకానికి దిక్కులేదని, వడ్డీ లేని రుణాలు ఊసేలేదని, మసీదులు మరమ్మత్తులకు పైసా ఇవ్వలేదని మైనార్టీలు మండిపడ్డారు. శ్మశాన వాటికలకు ప్రహరీలు, స్థలాలను కేటాయిస్తామని చెప్పి రెండేళ్లవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇవన్నీ చేయకపోగా వక్ఫ్ భూములను పీపీపీకి ఇస్తామంటున్నారని, పీపీపీ అంటే పేద ప్రజల పీక పిసికే పార్టీ అని ఎద్దేవా చేశారు. మైనార్టీలమంతా ఏకమై భూములను రక్షించుకుంటామన్నారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు చాంద్బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అమానుల్లా, నిషార్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శులు ఎన్హెచ్ బాషా, మున్వర్ బాష, మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శులు ఫారుఖ్, అసిఫుల్లా, మైనార్టీ విభాగం లేపాక్షి మండల కన్వీనర్ నిసార్ అహమ్మద్, హిందూపురం మండల కన్వీనర్ మన్సూర్ ఖాన్, మడకశిర మండల కన్వీనర్ సికిందర్, పబ్లిసిటీ వింగ్ జిల్లా కార్యదర్శి చాంద్బాషా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ షాజహాన్, హిందూపురం మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ సలాం, ప్రధాన కార్యదర్శి సయ్యద్ షంషీర్, నీలకంఠాపురం ఇన్చార్జ్ చాంద్బాషా, కొండకమర్ల మైనార్టీ లీడర్ బాబ్జాన్, మడకశిరకు చెందిన అన్సార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కార్ను హెచ్చరించిన ముస్లింలు వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన -
బాలిక కిడ్నాప్.. భయంతో వదిలేశారు!
తనకల్లు: బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు స్థానికులను చూసి భయపడి చిన్నారిని వదిలి పారిపోయారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆదివారం సాయంత్రం తమ దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని ఇద్దరు యువకులు బైక్లో కిడ్నాప్ చేశారు. కొంతదూరం తీసుకువెళ్లిన తర్వాత మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు మద్యం తాగుతూ కనిపించడంతో భయపడిన యువకులు... బాలికను అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. ఈ విషయంపై సోమవారం బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాచిగూడ–తిరుపతి మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కాచిగూడ–తిరుపతి మధ్య ఈ నెల 12న వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (07511) 12వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తిరుపతి రైల్వే జంక్షన్కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఇందులో 3ఏ, చైర్ కార్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అప్పరాచెరువులో హిటాచీ సీజ్ సాక్షి, టాస్క్ఫోర్స్: బత్తలపల్లి మండలంలోని అప్పరాచెరువు గ్రామ సమీపంలోని రాళ్ల గుట్ట వద్ద అక్రమంగా మట్టిని తవ్వుతున్న హిటాచీ యంత్రాన్ని అధికారులు సీజ్ చేశారు. రైతుల ముసుగులో కొందరు కూటమి నాయకులు చెరువులోని సారవంతమైన మట్టిని విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. గ్రామస్తుల సమాచారంతో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఆదివారం రాత్రి అప్పరాచెరువులో దాడులు నిర్వహించారు. చెరువులో అక్రమంగా మట్టిని తవ్వేందుకు ఉంచిన హిటాచీని సీజ్ చేశారు. తనిఖీల్లో తహసీల్దార్ స్వర్ణలత, డిప్యూటి తహసీల్దార్ షణ్ముఖ కుమార్ యాదవ్, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ షేక్ ఖాజావలి, టెక్నికల్ అసిస్టెంట్ పురుషోత్తం తదితరులు ఉన్నారు. అనుమతులు టీడీపీ వాళ్లకేనా..? అప్పరాచెరువులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అధికారులు కేవలం బీజేపీ నేతలకు చెందిన హిటాచీని మాత్రమే సీజ్ చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన నేతల వాహనాలను వదిలి తమ వాహనాన్నే సీజ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక పోట్లమర్రి చెరువులో మట్టిని తరలించేందుకు అనుమతులు లేవని తమకు చెప్పిన అధికారులు... టీడీపీ వారికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ వద్దే తేల్చుకుంటామంటున్నారు. -
అక్షరాస్యతతోనే ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట
ప్రశాంతినిలయం: ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి ఆర్థిక నేరాలను అరికట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్బీఐ రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంచుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడం తదితర అంశాలపై అవగాహన పెరగాలన్నారు. వారోత్సవాల్లో బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్, డిజిటల్ ఆర్థిక భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఎఫ్ఓ చక్రపాణి, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, డీపీఓ సమత, ఐసీడీఎస్ పీడీ ప్రమీళ, ఎల్డీఎం రమణకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్
పావగడ: స్థానిక శనీశ్వరాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం సందర్శించారు. సర్వ సేవా పూజలు, ప్రాకారోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అలాగే శీతలాంభదేవికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట తల్లి, పినతల్లి ఉన్నారు. కలెక్టర్ను ఆలయ సమితి మాజీ అధ్యక్షుడు కేవీ శ్రీనివాస్ శాలువా కప్పి సన్మానించారు. అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి ● జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సురేష్బాబు నల్లమాడ: అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వయోజనులకు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కె.సురేష్బాబు సూచించారు. నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాలో సోమవారం నిర్వహించిన సంచార వైద్య సేవలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు. గర్భిణులకు సకాలంలో టీకాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎపిడమాలజిస్ట్ బాలాజీనాయక్, సీహెచ్ఓ వన్నప్ప, రెడ్డిపల్లి పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లోటిలో చిరుత సంచారం మడకశిర రూరల్: మండలంలోని ఎల్లోటి గ్రామ శివారు ప్రాంతాల్లో వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. చిరుతను గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం సమయంలో పొలాల వద్దకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇటీవల చిరుత దాడిలో జింక, గేదె మృతిచెందాయని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సైతం చిరుత జాడను పసిగట్టే ప్రయత్నం చేపట్టారు. తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగ రొళ్ల: మండలంలోని ఎం.రాయాపురంలో ఓ ఇంటి పక్కనే ఉన్న స్తంభం నుంచి సోమవారం ఉదయం 11 కేవీ విద్యుత్ తీగ ఉన్నఫళంగా తెగిపడింది. ఆ సమయంలో జన సందోహం, జీవాలు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైతుల వ్యవసాయ బోరుబావులకు ఎం.రాయాపురంతో పాటు అగళి మండలం హళ్లికెర గ్రామానికి బీజీ హళ్లి విద్యుత్ సబ్స్టేషన్ నుంచి 11 కేవీ విద్యుత్ తీగలు లాగారు. అయితే కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన అధికారులు 30 ఏళ్లుగా పైబడిన విద్యుత్ తీగలు లాగడంతో నాణ్యత లేక అవి కాస్త ఎక్కడిక్కడ తెగిపోతున్నాయని రైతులు ఆరోపించారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపండి
ప్రశాంతినిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ల అందే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవ విషయాలు తెలుస్తాయని, అప్పుడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై మొత్తంగా 293 అర్జీలు అందాయి. అర్జీలను స్వీకరించిన జేసీ..వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలన్నారు. రూ.15 వేల పింఛన్ ఇవ్వండి.. నాకు చిన్నప్పటి నుంచే కాళ్లు, వెన్నుపూస దెబ్బ తినడంతో వీల్ చైర్కే పరిమితమయ్యా. 90 శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయినా రూ.6 వేల పింఛనే ఇస్తున్నారు. వృద్ధులైన నా తల్లిదండ్రులు కూడా ఏ పనీ చేసుకోలేని పరిస్థితిలో నాకొచ్చే పింఛన్పైనే ఆధారపడి బతుకుతున్నారు. నాపై దయచూపి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయండి. – ఆకుతోట మురళి, పెడపల్లి, పుట్టపర్తి మండలం రోడ్డు వేయించండి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి జాతీయ రహదారి–342 వరకూ 4 కిలోమీటర్లు మేర తారురోడ్డు లేదు. గుంతలమయమైన ఆ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు వాహనాలపైనుంచి కిందపడి గాయపడ్డారు. ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే విద్యార్థి జీవితం నష్టపోవాల్సి వస్తుంది. వెంటనే తారు రోడ్డు వేసి సమస్య పరిష్కరించాలి. – సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అధికారులకు జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం ‘పరిష్కార వేదిక’కు 293 అర్జీలు -
మహిమాన్వితుడు వీరనారాయణస్వామి
ముదిగుబ్బ: మండలంలోని సంకేపల్లి గ్రామ సమీపంలో వెలసిన వీరనారాయణ స్వామి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. చిన్నపాటి గుడిసెలో ఉన్నా.. నిత్య పూజలు, మహా అన్నదానాలతో భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఏటా మహాశివరాత్రి మరుసటి రోజు ఆలయం వద్ద పరుస నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఆలయం వద్ద నిర్వహించనున్న పరుసకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఉత్సవాలు జరిగేది ఇలా.. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లిలో ఉన్న వీరనారాయణ స్వామి ఆలయం నుంచి శివరాత్రి పర్వదినాన ఉదయాన్నే ఉపవాస దీక్షతో కాలినడకన భక్తులు, ఆలయ పూజారులు కన్యకలగొందికి చేరుకుంటారు. అక్కడ వెలసిన శివాలయంలో ఆదిదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డప్పు వాయిద్యాలతో బుక్కపట్నం మండలం పాముదుర్తికి చేరుకుని వీరనారాయణ స్వామికి ప్రీతిపాత్రులైన పూజారి తాళ్ల జంగమన్న వంశస్తులతో కలసి యలగల గంప (వెదురు దబ్బలతో అల్లిన గంప)ను తీసుకుని పాముదుర్తిలోని రెడ్డివారి బావి వద్ద గంగ పూజను నిర్వహిస్తారు. అనంతరం కన్యకలగొందికి చేరుకుని శివాలయంలో యలగలగంపను పూలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత డప్పు వాయిద్యాలతో యలగలగంపను ఊరేగింపుగా గుంజేపల్లి మీదుగా సంకేపల్లి వద్ద ఉన్న పరుస మాన్ల వద్దకు చేర్చి గద్దైపె వీరనారాయణస్వామి యలగలగంపను అధిష్టింపజేస్తారు. ఈ పూజలు నిర్వహించేందుకు ఒక రోజు సమయం పడుతుంది. శివరాత్రి జాగారం అనంతరం మరుసటి రోజున పరుసమాన్లలో వీరనారాయణస్వామికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పరుసను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవంలో యలగలగంపను దర్శించుకుంటే ఎలాంటి ఆపదలు కలగవని భక్తుల నమ్మకం. యలగలగంపను స్వామి ఆవహించి ఉంటాడని విశ్వాసం. భారీగా తరలి రానున్న భక్తులు.. వీరనారాయణస్వామి పరుసకు భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఎడ్లబండ్లను కట్టుకుని రైతు కుటుంబాలు, కొత్తగా కొన్న పశువులను వెంటబెట్టుకుని రైతులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో సంకేపల్లి సమీపంలోని వీరనారాయణస్వామి ఆలయానిక చేరుకుంటారు. అక్కడ యలగలగంపను అధిష్టింపజేసిన గద్దె చుట్టూ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, పశువులతో ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని, ఏడాది పొడువునా ఎలాంటి ఆపదలు కలగకుండా స్వామి కాపాడుతాడని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని భక్తుల నమ్మకం. పరుస రోజున అక్కడే ఉన్న పూజారి వంశీకులలో ఒకరిని స్వామి ఆవహించి భవిష్యవాణిని వినిపిస్తారు. ఏడాదిలో వర్షాల ఆగమనం, పంటలు పండే తీరును తెలుసుకుని వాటికి అనుగుణంగా రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతుంటారు. పరుసకు ఏపీ నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వసతులు కల్పించేరా? లక్షలాది మంది భక్తులు హాజరయ్యే వీరనారాయణ స్వామి పరుసకు వసతులు కల్పించడంలో అధికారులు ప్రతిసారి విఫలమతున్నారు. మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఏటా భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీంతో పాటు పరుసమాన్ల వద్దకు వెళ్లే రహదారి ఒన్వే కావడంతో రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటోంది. పరుసలోకి వెళ్లడానికి సంకేపల్లి మీదుగా, బయటకు రావడానికి కమ్మవారిపల్లి మీదుగా అధికారులు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మండల ప్రజలు కోరుతున్నారు. పాతూరులో పెద్దమ్మ స్వామి పరుష.. ముదిగుబ్బ పాతూరులో వెలసిన పెద్దమ్మస్వామి ఆలయాన్ని శివరాత్రి పర్వదినం సందర్భంగా ముస్తాబు చేస్తారు. జాగారం రాత్రి పెద్దమ్మస్వామి మూలవిరాట్ను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి పల్లకీలో పురవీధుల గుండా ఊరేగిస్తారు. తెల్లవారేసరికి పల్లకీని గ్రామం వెలుపల ఉన్న నల్లలమ్మ స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లతారు. అక్కడ పెద్దమ్మ స్వామి పరుసను ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పరుసకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ నెల 16న పరుస భవిష్యవాణి వినేందుకు వేలాదిగా తరలిరానున్న భక్తులు -
వామ్మో చిరుత !
కదిరి అర్బన్: ఇటీవల చిరుతపులుల సంచారంతో కదిరి నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పశువులపై చిరుతల దాడులు పెచ్చురిల్లుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, గొర్రెల కాపరులు, అడవులకు సమీపంలో ఉన్న స్టోన్ క్రషర్ యూనిట్ల కార్మికులు మరింతగా భయపడుతున్నారు. అటవీ శివారు గ్రామాల్లో ఆందోళన కదిరి నియోజకవర్గంలో ఇటీవల వరుసగా చిరుతల సంచారాన్ని పసిగట్టిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అటవీ శివారు గ్రామాల్లో ప్రజలు చీకటి పడితే ఇళ్లను వదిలి బయటకు రావడం మానేశారు. గత నెల 29న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలోని లఘువమ్మ కొండ వద్ద చిరుతను గమనించిన స్టోన్ క్రషర్ కార్మికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిరుత తన పిల్లలతో కలిసి వెళ్తున్నట్లుగా ఉన్న పాదముద్రలను గుర్తించారు. అనంతరం ఈ నెల 1న నల్లచెరువు మండలం పోలేవాండ్లపల్లి వద్ద రహదారి దాటుతున్న చిరుతను వాహనదారులు గమనించారు. అలాగే ఈ నెల 6న తనకల్లు మండలం తురకవాండ్లపల్లి సమీపంలో సింగరాతిచెరువు వద్ద గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ ప్రాంతంలో చిరుతతో పాటు దాని పిల్లలు కూడా ఉన్నట్లు గొర్రెల కాపరి గుర్తించాడు. గిరి ప్రదక్షిణపై ప్రభావం కదిరి కొండ వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖాధ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఆ పరిసర కొండల్లోనే చిరుత పాదముద్రలు గుర్తించడంతో గిరి ప్రదక్షణ చేసేందుకు భక్తులు వెనుకాడుతున్నారు. కదిరి కొండవద్ద ఉపాధి హామీ కూలీలు సైతం పనులను అక్కడి నుంచి వేరేచోటికి మార్చుకున్నారు. పని ప్రాంతంలో టపాసులను సిద్ధంగా ఉంచుకుంటున్నారు. చిరుతల భయంతో బెంబేలెత్తుతున్న జనం ఇప్పటికే మూడు చోట్ల కనపడిన చిరుతలు చిరుతల కదలికలపై నిఘా కదిరి నియోజకవర్గ పరిసరాల్లో చిరుతల సంచారంపై నిఘా ఉంచాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గొర్రెల కాపరులు, అటవీ శివారు ప్రాంతాల్లోని క్రషింగ్ యూనిట్లలో పనిచేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా ఉండడం, తరచూ శబ్దాలు చేస్తుండడం లాంటివి చేయాలి. చిరుత పాదముద్రలు కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలి. – గుర్రప్ప, కదిరి అటవీక్షేత్ర అధికారి -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రొళ్ల: వ్యక్తి హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మడకశిర రూరల్ పీఎస్ సీఐ రాజ్కుమార్ తెలిపారు. స్థానిక పీఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్ఐ గౌతమితో కలసి ఆయన వెల్లడించారు. రొళ్ల మండలం ఎం.రాయాపురం గ్రామంలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ (40)ను అదే గ్రామానికి చెందిన నాగరాజప్ప శనివారం సాయంత్రం కట్టెతో దాడి చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. హతుడి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఆదివారం సాయంత్రం ఎం.ఆర్.గొల్లహట్టి గ్రామానికి వెళ్లే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం మలుపు వద్ద తచ్చాడుతున్న నాగరాజప్పను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యక్తిగతంగా అనుమానంతో ప్రసన్నకుమార్పై కట్టెతో దాడి చేసినట్లుగా నాగరాజప్ప అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి,. సోమవారం ఉదయం మడకశిరలోని జేఎఫ్సీఎం న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
10 మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పెనుకొండ రూరల్: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పది మంది గాయపడ్డారు. పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకొంది. వివరాలు.. ఆదివారం హిందూపురం డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు ధర్మవరం బయలుదేరింది. మార్గమధ్యంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ క్రమంలో బస్సు కండక్టర్ చాంద్ బాషా, డ్రైవర్ వెంకటరమణ నాయక్తో పాటు ప్రయాణికులు భాస్కర్, చిన్న నరసప్ప, లక్ష్మమ్మ, సుజాత, కల్పన, వెంకటమ్మ, చెన్నకేశవ, శ్రీనాథ్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న కియా స్టేషన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్ చాంద్ బాషా, చిన్న అంజనప్ప, కల్పనను ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన కియా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పొంచి ఉన్న ‘జల’గండం
మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు చెరువులు, బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల మట్టం పడిపోతుండడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. మడకశిర విద్యుత్ డివిజన్ పరిధిలో మడకశిర, రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం మండలాలు ఉన్నాయి. గత ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో అన్ని చెరువులూ నిండలేదు. ప్రస్తుతం కొన్ని చెరువుల్లోనే కొంత మేర నీరు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గుతుండడం గమనార్హం. కొత్తగా బోరు తవ్వకాలు.. వ్యవసాయ బోర్లలో నీటి మట్టం తగ్గుతుండడంతో రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి కొంత మంది రైతులు కొత్తగా బోరు తవ్వకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రైతులు దాదాపు 120 బోర్లు కొత్తగా తవ్వించినట్లు తెలిసింది. ఓ బోరు బావి తవ్వించడానికే రూ.3.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బోరు బావిలో నీరు లభిస్తే మోటార్ ఏర్పాటు చేయడానికి మరో రూ.3 లక్షలు రైతు భరించాల్సి ఉంటుంది. గత్యంతరం లేని పరిస్థితిలో అప్పులు చేసి మరీ రైతులు బోరు బావులు తవ్విస్తున్నారు. వేసవిలో కష్టాలు తప్పవా..? వేసవి ఇంకా ప్రారంభం కాకనే చాలా బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. భవిష్యత్తులో నీటి మట్టం మరింతగా పడి పోయే ప్రమాదం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని బోర్లు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడాల్సి వస్తుంది. ప్రధానంగా వక్క తోటల రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారనుంది. బోరు బావుల్లో తగ్గుతున్న నీటి లభ్యత పడిపోతున్న భూగర్భ జలమట్టం ఆందోళనలో అన్నదాతలు వేసవిని తలచుకుని హడలెత్తుతున్న వైనం -
వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాంపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. భారీగా భక్తులు తరలి రావడంతో వెంకటాంపల్లి కొండప్రాంతం కిటకిటలాడింది. ఆదివారం వేకువజామునే లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ఉదయం పది గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 51 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి గోవింద నామస్మరణతో లాగారు. -
వ్యాపార కోణం.. రైతుకు సహకారం
పంటల సాగుకు రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్త్తేసిన ప్రస్తుత తరుణంలో కొందరు వ్యాపారుల వినూత్న ఆలోచన అన్నదాతలకు వరంగా మారింది. సారవంతమైన భూమి, బోరుబావి ఉన్న రైతులకు కొందరు వ్యాపారులు విత్తు నుంచి కోతల వరకూ సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు రకాల పంటలను రైతులకు సూచిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. పంట దిగుబడిని కొనుగోలు చేసిన వెంటనే డబ్బు అందజేస్తున్నారు. పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని కదిరి, తనకల్లుతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా (చియా సీడ్స్) పంటల సాగుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయా పంటలకు చెందిన విత్తనాలను రైతులకు సదరు వ్యాపారులు సమకూర్చడమే కాకుండా వాటి సాగు విధానాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన ఎరువులు, మందులు, నీటి తడుల వివరాలతో పాటు కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చైతన్య పరుస్తున్నారు. ఆర్థికంగా అండగా.. తాము సూచించిన పంటల సాగు చేపట్టిన రైతులకు విత్తనం మొదలు కూలీల ఖర్చు వరకూ అన్ని రకాల సదుపాయాలను వ్యాపారులే కల్పిస్తున్నారు. రైతు చేయాల్సిందల్లా పంటలను సాగు చేయడం, వాటిని సంరక్షించడం, అవసరమైన నీటి తడులు అందించడం, రోగాలు వ్యాపిస్తే వాటిని సదరు వ్యాపారులకు తెలియజేసి అవసరమైన మందులు తీసుకుని పిచికారీ చేయించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువులు అందించి పంట పూర్తి కాగానే వ్యాపారులకు తెలియజేస్తే వారే క్షేత్రస్థాయిలో పరిశీలించి యంత్రాల సాయంతో కోతలు ముగిస్తారు. పంటల దిగుబడులను క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి ముందస్తుగా నిర్ణయించిన ధరల ప్రకారం అప్పటికప్పుడు నగదు అందజేస్తారు. కేవలం మూడు నెలల్లోనే రైతుపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వ్యాపారులు అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో జిల్లాలోని పలు మండలాల్లో సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా గింజల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. 1,074 హెక్టార్లకు పైగా.. వ్యాపారుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా 1,074 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, సబ్జా గింజలు, సజ్జ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 250 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 420 హెక్టార్లలో సబ్జా గింజలు, 404 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సజ్జ సాగులో ఉన్నాయి. బోరుబావి ఉండి, ఆసక్తి కనబరిచే రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను వ్యాపారులే అందజేస్తున్నారు. పంట పూర్తి కాగానే మిషన్ల ద్వారా కోతలు చేపట్టి నూర్పిడి అనంతరం ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు రైతులకు నగదు చెల్లించిన తర్వాతనే మార్కెట్కు పంట దిగుబడులను తరలిస్తున్నారు. ఈ లెక్కన క్వింటా పొద్దుతిరుగుడు పంటను రూ.12 వేలతో, క్వింటా సబ్జా గింజలను రూ.13,500తో, క్వింటా సజ్జ పంటను రకాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల సహకారంతో తమకు ఆర్థిక, మార్కెటింగ్ ఇబ్బందులు తొలిగిపోయాయని రైతులు పేర్కొంటున్నారు. సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా పంటల సాగుకు వ్యాపారుల ప్రోత్సాహం విత్తు నుంచి కోత వరకూ సహకారం దిగుబడిని కొనుగోలు చేసి డబ్బు అందజేత -
వర్షాలు కురవాలి
వేసవి ప్రారంభానికి ముందే కొన్ని బోర్లలో నీటి లభ్యత తగ్గిపోయింది. ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురిస్తేనే మేలు జరుగుతుంది. లేకపోతే చాలా బోర్లు ఎండి రైతులు పంటలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల పలువురు రైతులు కొత్తగా రూ.లక్షలు ఖర్చు పెట్టి బోర్లు తవ్విస్తున్నారు. అప్పులభారం మోస్తున్నారు. –రవికుమార్, బీజీహళ్లి, రొళ్ల మండలం ఆందోళన కలిగిస్తోంది బోర్లపైనే ఆధారపడి 5 వేల వక్క చెట్లు సాగు చేశా. బోర్లలో నీటి లభ్యత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో బోర్ల మనుగడ మరింత కష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణా జలాలతో చెరువులను నింపితే బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. లేకపోతే రైతులకు కష్టాలు తప్పవు. –చంద్రప్ప, మధూడి, అగళి మండలం -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవ చ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పుట్టపర్తి: జిల్లావ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 1,489 మంది విద్యార్థులకు గాను 1,433 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,274 మందికి గాను 1,224 మంది హాజరయ్యారన్నారు. మొత్తంగా 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పరీక్షల పరిశీలకుడు రమేశ్ ధర్మవరం, హిందూపురంలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. -
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలవ్వాలి
ప్రశాంతినిలయం: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం విద్యాశాఖ అధికారులు, హాస్టల్ వార్డెన్లు, ఎంఈఓలు, హెచ్ఎంలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్లిప్ టెస్టుల్లో సీ,డీ గ్రేడులు సాధించిన విద్యార్థులను 45 రోజుల పాటు హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర ప్రసాద్రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రెడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రైతును నష్టపరిచిన నకిలీ విత్తనంకనగానపల్లి: వ్యాపారుల మాటలు నమ్మి, వారు అంటగట్టిన నకిలీ విత్తనాలతో పంట సాగు చేపట్టి కనగానపల్లి మండలం ముత్తువకుంట గ్రామానికి చెందిన రైతు ఎం.నారాయణ మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. రైతు నారాయణ అనంతపురంలోని వినాయక ట్రేడర్స్ నిర్వాహకుడి మాటలు నమ్మి రూ.35 వేలు చెల్లించి పీహెచ్ఎస్– ప్లస్ అనే కళింగర విత్తనాలు కొనుగోలు చేసి, తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. తర్వాత వివిధ దశల్లో రూ.4 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాడు. నీరు సమృద్ధిగా అందించడంతో పంట ఏపుగా పెరిగి 90 రోజుల్లోనే కోతకు వచ్చింది. అయితే కాయ కోసి చూస్తే తెల్లగా బెండు బారిపోయి కనిపించింది. కాయలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు పంట కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని విత్తనం విక్రయించిన వ్యాపారితో పాటు విత్తన తయారీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళితే వారి నుంచి స్పందన లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. 13 టన్నుల దిగుబడి పొలంలోనే ఉండిపోయిందని, రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. అధికారులు స్పందించి నకిలీ విత్తనం అంటగట్టిన వ్యాపారిపై చర్యలు తీసుకుని తనకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నాడు. పోలీసుల అదుపులో నకిలీ పత్రాల సృష్టికర్తలు! పుట్టపర్తి టౌన్: ఓ గృహాన్ని అక్రమంగా కొట్టేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం నగరంలోని శారద నగర్లో కనకదర్గ అనే సత్యసాయి భక్తురాలు 1980 సంవత్సరంలో 6.43 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. సత్యసాయి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె పదవీ విరమణ తరువాత తన సోదరి శ్రీలక్ష్మితో కలసి శారదానగర్లో నివసించేవారు. వ్యక్తిగత పని నిమిత్తం గత ఏడాది నవంబర్లో రాజమండ్రికి వెళ్లిన కనకదుర్గ, శ్రీలక్ష్మిలు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలోనే అనంతపురం నగరానికి చెందిన ఓ టీడీపీ నేత వారి ఇంటిని కొట్టేసేందుకు పన్నాగం పన్నాడు. కనకదుర్గ జీవించి ఉన్న సమయంలో హిందూపురం ప్రాంతానికి చెందిన శకుంతల ఆమె బాగోగులు చూసిందని, అందుకు ప్రతిఫలంగా తన ఇంటిని ఆమెకు రాసివ్వగా.. శకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ. శేఖర్కు జీపీఏ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కనకదుర్గ బంధువులు అనంతపురం ఎస్పీని ఆశ్రయించారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ అనంతరం నకిలీ పత్రాలు సృష్టించిన పుట్టపర్తికి చెందిన టీడీపీ నాయకులు ఆవుల సుబ్రమణ్యం, దయ్యాల ఉమాపతి, శేఖర్ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పరిగి: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 2004–05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సెల్ఫీలు తీసుకున్నారు. విద్యనభ్యసించిన తరగతి గదుల్లో సంచరిస్తూ సందడి చేశారు. అనంతరం తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించారు. పాఠశాలకు రూ.30 వేలు విలువైన ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ను అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం కృపాసత్యరాజు, లక్ష్మయ్య, ప్రభాకర్, సురేష్, వహీదాఖాన్, చందనశ్రీ, రామాంజి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు దగ్ధం
నల్లమాడ: మండలంలోని గంగాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి రైతు నాగయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాగయ్య మరో ఇంట్లో నిద్రిస్తున్నట్లుగా తెలిసింది. రెండున్నర తులాల బంగారు నగలు, రూ.20 వేల నగదు, విద్యుత్ ఉపకరణాలు, వంట పాత్రలు, దుస్తులు, పట్టాదారు పాసు పుస్తకం తదితరాలు కాలి బూడిదయ్యాయి. ఇంటి గోడలు, పైకప్పు బాగా దెబ్బతిన్నాయి. రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. లారీ బీభత్సం గుత్తి: స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని లక్ష్మమ్మ గుడి సమీపంలో ఆదివారం ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన డ్రైవర్ ఆనందరెడ్డి ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని నుంచి లారీలో తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే అప్పటికే మద్యం సేవించి ఉండడంతో గుత్తి ఆర్ఎస్కు చేరుకోగానే మత్తు కారణంగా నియంత్రణ కోల్పోయి లారీని ఇష్టానుసారంగా నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. డివైడర్ మధ్యలో ఉన్న రెండు బటర్ఫ్లై విద్యుత్ స్తంభాలను ఢీకొనడంతో అవి కాస్త విరిగి పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించినా ఫలితం లేకపోయింది. చివరకు ఎన్టీఆర్ సర్కిల్లో లారీని అడ్డుకుని డ్రైవర్ ఆనందరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు. యువకుడి దుర్మరణంపరిగి: వరుస ప్రమాదాలు చోటు చేసుకుని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం మండలం సూగూరు సడ్లపల్లికి చెందిన ధనుజంయరెడ్డి కుమారుడు సి.బాబు (26) స్థానిక ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. మడకశిర మండలం అగ్రంపల్లిలో నివాసముంటున్న తన అక్క ప్రమీలమ్మను చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పరిగి మండలం హొన్నంపల్లి పంచాయతీ జంగాలపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో రెండు వాహనాలపై ఉన్న వారు రోడ్డుపై పడ్డారు. ఈ క్రమంలో బాబుపై వాహనం దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు.డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు కనగానపల్లికి చెందిన వ్యక్తికి కాలు విరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జేసీబీ యజమానుల ర్యాలీహిందూపురం: పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా తమ సేవల ధరలను పెంచిక తప్పడం లేదని హిందూపురంలో జేసీబీ వాహన యజమానులు గళమెత్తారు. ఆదివారం సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా డీజిల్ ధరలు, యంత్రాల విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దీంతో జేసీబీల నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జేసీబీ పనివేళల ధరలు పెంచక తప్పడం లేదన్నారు. గతంలో గంటకు రూ.వెయ్యి చొప్పున తీసుకునేవారని, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం గంటకు రూ.1,300 చొప్పున తీసుకునేలా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సూగూరు ఆలయం వద్ద నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకూ జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీబీ వాహన యజమానులు హనుమంతరెడ్డి, నేపాల్ నాగరాజు, ఆనంద్ కుమార్, లోకేష్, ఆనంద్, వెంకటేష్, సడ్లపల్లి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
వనరుల విధ్వంసం
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత బత్తలపల్లి మండలంలో ‘పచ్చ’మూక అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. కొండలు, గుట్టలను స్వాహా చేసేస్తున్నారు. మాఫియాగా ఏర్పడి వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. అక్రమంగా రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారు. గ్రావెల్ దందా బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి, అప్పరాచెరువు గ్రామాల చెరువులు, గుట్టల్లో 20 అడుగుల మేర తవ్వేసి గ్రావెల్ను తరలిస్తున్నారు. 15 శాతం మేర కమీషన్లు రూపంలో వాటాలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రామాపురం, కోడేకండ్ల, గరిశలపల్లి, ఉప్పర్లపల్లి, ఓబుళాపురం దంపెట్ల గ్రామాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ యంత్రాల సాయంతో ఇసుక తవ్వేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు, హిటాచీలతో ఇసుక తోడేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టరుకు నెలకు రూ.5 వేల చొప్పున ఓ శాఖ అధికారులకు ముడుపులు అందిస్తున్నట్లు టీడీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. కేవలం ఇసుక, మట్టిలోనే కాకుండా బొగ్గులు కాల్చేవారితోనూ టీడీపీ నేతలు భారీగా దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దందా విషయంలో టీడీపీ లోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం, కిడ్నాప్ చేయడం, దీనిపై కేసులు నమోదై జైలుకు వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరూ ఏమీ చేయలేరట... గత నెలలో మండలంలోని పోట్లమర్రి గ్రామంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య మట్టి తరలించే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ వర్గీయులు గ్రామ కట్టుబాటు మేరకు చెరువులో మట్టిని రైతులకు తరలిస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోగా వైఎస్సార్సీపీ వర్గీయులపై అధికారులు కేసులు పెట్టారు. అదే టీడీపీ నేతలు ఆదివారం మళ్లీ గ్రామ చెరువులో హిటాచీ పెట్టి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించడం గమనార్హం. గ్రామస్తులు దీనిపై ప్రశ్నిస్తే ‘మాకు కలెక్టర్, ఎస్పీ నుంచి అనుమతులు వచ్చాయి. ఎవరూ ఏమీ చేయలేరు. అడ్డుపడితే వైఎస్సార్సీపీ వాళ్లకు పట్టిన గతే మీకూ పడు తుంది’ అని హెచ్చరించినట్లు సమాచారం. ధర్మవరం ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ స్వర్ణలత పోట్లమర్రి చెరువును గత నెలలో పరిశీలించి అనుమతులు లేకుండా మట్టిని తరలించవద్దని చేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ మళ్లీ యథేచ్ఛగా తరలిస్తున్నా ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. అప్పరాచెరువులో పాఠశాల ముందు నుంచి మట్టి టిప్పర్లు వేగంగా వెళ్తుండడంతో గ్రామస్తులు తమ పిల్లలను బడికి పంపాలన్నా భయపడుతున్నారు. రెవెన్యూ, పోలీసులు, ఇరిగేషన్ అధి కారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బత్తలపల్లి మండలంలో రెచ్చిపోతున్న ఇసుక, మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు -
సంఘటిత పోరాటాలతో సమస్యలకు పరిష్కారం
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భానూజీరావు అనంతపురం ఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కారం కావాలన్నా, హక్కులు దక్కాలన్నా సంఘటిత పోరాటాలతోనే సాధ్యమవుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానూజీరావు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోని డీఎంహెచ్ఓ కమిటీ హాలులో ఉమ్మడి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా జనసభ జరిగింది. ఉద్యోగుల హక్కులు, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భానూజీరావు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్గా ఎం.ఈశ్వర్, ప్రధాన కార్యదర్శిగా సి.వరప్రసాద్, కోశాధికారిగా ఎం.రాజేష్తో పాటు 23 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి.గురునాథ్, వైస్ చైర్మన్లు దివాకర్బాబు, సుశీల, కోశాధికారి యు.అనిల్, నాయకులు బి.వరపుత్ర, షేక్ మస్తాన్, పి. లవరాజు, అమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతిపావగడ: స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడేటి గ్రామానికి చెందిన నరేష్ (20) అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్డాడు. ఆదివారం ఉదయానికి ఆ గ్రామ గేటు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు బోయ పాతన్న, జయమ్మ అక్కడకు చేరుకుని బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అరసికెరె పీఎస్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో మంగళవాడ గ్రామానికి చెందిన నరసింహమూర్తి (50) మృతి చెందాడు. ఈ ఘటనపై అరసికెరె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గిరిజనుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్
‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. తనదైన బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు ఈ భువిపై వెలసిన ఆయనే సంత్ సేవాలాల్ మహరాజ్. కారణజన్ముడిగా బంజారాలు ఆరాధించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గుత్తి రూరల్: అనంతపురం జిల్లా మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సేవాగఢ్లో సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీలలో ఘనంగా జరగనున్నాయి. తమ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జన్మస్థలమైన సేవాఘడ్లో జరిగే ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు అశేషంగా హాజరవుతారు. 14న శనివారం రాత్రి జ్యోతి ప్రజ్వలనతో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సేవాగఢ్ విశిష్టత గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని రాంజీనాయక్ తండాలో భీమా నాయక్, ధర్మిణి బాయి దంపతులకు 1739, ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. తండ్రి భీమానాయక్ ఆ తండాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. గ్రామంలో రచ్చబండపై పంచాయితీ తీర్పులు ఇచ్చేవారు. అ కట్టను భీమానాయక్ కట్టగా పిలుస్తుంటారు. ఈ కట్టకు ఎదురుగా ఉన్న బావిలో అక్కమ్మ దేవతలు స్నానం చేసేవారని, దీంతో ఆ బావిని పవిత్ర ‘కాళోకుండ్’గా పిలుస్తుంటారు. ఈ బావిలోనే సేవాలాల్ మహరాజ్ అప్పట్లో స్నానం ఆచరించి, భీమానాయక్ కట్టపై కూర్చొని తన ఆధ్యాత్మిక బోధనలతో బంజారాల్లో చైతన్యం తీసుకువచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ కాళోకుండ్ దగ్గరలో రూ.1.2కోట్లతో దండం మోరో మాత (మారెమ్మ దేవత) ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని విద్యలూ నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమైన సేవాలాల్.. తన ఆధ్యాత్మిక బోధనలతో జాతిని ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఇందులో ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. దేశంలోనే అరుదైన ఆలయం దాదాపు పాతిక సంత్సరాల క్రితం వరకూ సేవాగఢ్ ప్రాంతం నిర్జనమైన కొండ గుట్టలతో నిండి ఉండేది. చారిత్రక ఆధారాలను పరిశీలించిన అనంతరం రూ. కోటి వ్యయంతో అక్కడ సేవాలాల్ ఆలయాన్ని బంజారా నాయకుడు రంజిత్ నాయక్ నిర్మించారు. ఆలయ నిర్మాణానికి బంజారాలను ఏకం చేసి విరాళాలు సేకరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఓ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. 2000 సంవత్సరంలో మొట్టమొదటి సారి సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బంజారాలు పాల్గొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సేవాలాల్ మహరాజ్ ఆలయ పరిసరాల్లోనే రూ.1.2కోట్లతో మారెమ్మ (మాతా జగదాంబ) ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి ఇలా చేరుకోవచ్చు సేవాఘడ్కు గుత్తి బస్టాండ్ నుంచి నేరుగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. రైలులో గుత్తి, గుంతకల్లు స్టేషన్లకు వచ్చిన భక్తులు ఆటోల ద్వారా బస్టాండులకు చేరుకొని ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో ప్రయాణించేవారు గుత్తి–గుంతకల్లు మార్గంలో గొల్లలదొడ్డి క్రాస్ నుంచి లోపలకు మూడు కిలోమీటర్ల దూరం వెళితే సేవాలాల్ ఆలయం వస్తుంది. భారతదేశంలోనే ఏకై క ఆలయం ‘సేవాగఢ్’ నాడు కొండ గుట్టల ప్రాంతం.. నేడు పుణ్య క్షేత్రం సేవాగఢ్లో 13 నుంచి జయంత్యుత్సవాలు -
ప్రభుత్వం ఆదుకోవాలి
ధర్మవరం: జిల్లాలోని ధర్మవరం, గోరంట్ల, చిలమత్తూరు, సోమందేపల్లి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాలలో 35 వేలకు పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.30 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మిరమిట్లు గొలిపే రంగురంగుల పట్టుచీరలను నేతన్నలు తయారు చేస్తున్నారు. కానరాని మద్దతు.. పట్టుచీరలను ఆకర్షణీయంగా రూపొందించేందుకు బార్డర్, పల్లు (కొంగు), మధ్యలో డిజైన్ తదితర చోట్ల జరీ వాడకం తప్పనిసరి. బంగారం, వెండి, రాగి వంటి లోహాల పూతతో చేసే దారాన్ని జరీ అంటారు. ప్రధానంగా కంచి జరీ (వన్గ్రాం గోల్డ్ పూత), జర్మన్ సిల్వర్ జరీ (వెండి పూత), నార్మల్ టెస్టెడ్ జరీ (గోల్డ్ కలర్ కోటింగ్), కాపర్ జరీ (రాగిపూత)ని నేతన్నలు ఉపయోగిస్తారు. ఇటీవల బంగారం, వెండి, రాగి ధరలు పెరగడంతో అందుకనుగుణంగా జరీ రేటు కూడా విపరీతంగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం రూ.2 వేలు పలికిన కంచి జరీ మార్కు ఇటీవల ఏకంగా రూ. 4 వేలకు చేరింది. అదేవిధంగా జర్మన్ సిల్వర్ జరీ రూ.800 నుంచి రూ.1,200కు, కాపర్ జరీ రూ.700 నుంచి రూ.1,000కు, నార్మల్ టెస్టెడ్ జరీ రూ.600 నుంచి రూ.800కు ఎగబాకాయి. ఒక పట్టు చీర తయారీకి కనీసం రెండు మార్కుల వరకు జరీ వాడాల్సి ఉంటుంది. అనతికాలంలోనే జరీ ధరలు భారీగా పెరగడం, పట్టుచీరలకు మద్దతు ధర మాత్రం 5 ఏళ్ల క్రితం ఎంత ఉందో నేటికీ అంతే ఉండటంతో నేతన్నలు నష్టాల పాలవుతున్నారు. సరఫరాలో జాప్యం.. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో మాత్రమే జరీ తయారవుతుంది. అక్కడి వ్యాపారుల నుంచి జిల్లాకు చెందిన చేనేతలు జరీ కొనుగోలు చేసి తీసుకొస్తారు. ముందుగా జరీ బాక్స్లకు నగదును డీడీల రూపంలో చెల్లిస్తేనే సూరత్ లోని కంపెనీ నిర్వాహకులు, ఏజెంట్లు పంపుతారు.ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో జరీకి డిమాండ్ పెరగడంతో నగదు చెల్లించినా ఇక్కడికి సరుకు సరఫరాలో జాప్యం అవుతోంది. దీంతో నేతన్నలకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు. కష్టతరంగా మగ్గాల నిర్వహణ గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలతో ఆధునిక డిజైన్లను చేనేత మగ్గాలలో తయారు చేస్తే కార్మికులకు కొంత లాభదాయకంగా ఉండేది. ఇటీవల జరీ ధరల పెరుగుదల కారణంగా చేనేతలకు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి జరీ ధరల పెరుగుదలను నియంత్రించాలి. చేనేతలకు సాయం అందించాలి. –జింకా కంబగిరి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం పెరిగిన జరీ ధరలకనుగుణంగా పెట్టుబడి వ్యయం బాగా పెరిగింది. ఇప్పటికే ముడిపట్టు, రేషం (నిలువుదారం, అడ్డదారం) ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని పెరిగిన జరీ ధరలు మరింత సంక్షోభంలోకి నెట్టాయి. రోజంతా కష్టపడినా దిన కూలీ కూడా దక్కడం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే మగ్గాల నిర్వహణ కష్టంగా మారుతుంది. –నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం పట్టుచీరలు అందంగా, ఆకర్షణీయంగా కనపడేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించే జరీ ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో అదనపు భారం పడడంతో నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం స్పందించి చేయూత అందించకుంటే భారీగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెరిగిన జరీ ధరలు పట్టుచీరలకు మాత్రం ‘మద్దతు’ లేని వైనం నష్టాలబాటలో నేతన్నలు ప్రభుత్వం చేయూతనివ్వాలని వేడుకోలు -
బాల్య వివాహాలను అరికట్టాలి
● కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు ● బాల్య వివాహముక్తి రథయాత్రకు శ్రీకారం ప్రశాంతి నిలయం: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలపై కలిగే అనర్థాలు వివరించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సమత స్వచ్ఛంద సంస్థ 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శనివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2030 నాటికి భారత్ను బాల్య వివాహాలు లేని దేశంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ప్రచార జాతాలో భాగంగా బాల్య వివాహాల చట్టం 2006 గురించి, శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బంది సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ (1098)కు, పోలీసులకు (112) ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ ఇందిర, సమత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఆదినారాయణరెడ్డి, బాలల పరిరక్షణ అధికారి మహేష్, సెక్రెటరీ వెంకటేషు, మనోహర్, ఉమా శంకర్రెడ్డి, సునీత, శారద, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం 1,210 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,020 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. అలాగే 9వ తరగతిలో ప్రవేశం కోసం 828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన వెల్లడించారు. -
వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం
పుట్టపర్తి: బుక్కపట్నం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలో కొండలో వెలసిన చెన్నకేశవ స్వామి తడక మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం తరుగు వంశీయులు తీసుకొచ్చిన తడకను స్వామి వారి ఆలయంపై కప్పారు. అనంతరం తరుగు వంశీయులు వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. కిక్కిరిసిన చండ్రాయునికొండ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయానికి చేరుకునేందుకు నూతనంగా రోడ్డు వేసింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు దారి మధ్యలో భక్తుల సౌకర్యార్థం తాగునీటిని ఏర్పాటు చేశారు. -
పేదింట క్రీడా ఆణిముత్యం
తాడిమర్రి:పేదింట క్రీడా ఆణిముత్యం మెరిసింది. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. వివరాలు.. తాడిమర్రి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన మందల ఈరప్ప, శివమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె పావని బీఎస్సీ వరకు చదివింది. పావని ఒకవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాణిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాల స్థాయి నుంచి తాను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటిన పావని 2015లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్కి ఎంపికై ంది. 2016లో శ్రీకాకుళంలో సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొంది. 2017లో సీనియర్ విభాగంలో కర్నూల్, 2018లో గుంటూరులో జరిగిన సీనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడింది. ఆటకు విరామమిచ్చినా.. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరడంతో నాలుగేళ్లు విరామం తీసుకున్న అనంతరం తిరిగి ఆట ప్రారంభించిన పావని రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా తరఫున సీనియర్ విభాగంలో జరిగిన రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎంపికైంది. 2025–2026లో ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికై ంది. తమిళనాడులోని దిండిగల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఉత్తమ ఆటతీరుతో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి 5 వరకు నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ టెస్టు సిరీస్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించింది. బంగారు పతకం సాధించి దేశం మొత్తం గర్వించేలా చేసింది. ఇప్పటివరకూ పావని 11 సార్లు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు, 3 సార్లు జాతీయ స్థాయి టోర్నమెంట్లు, ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి ఆత్మకూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గ్రామస్తులు పావనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో దూసుకెళ్తున్న పావని అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం అత్యుత్తమ ఆటతో జిల్లాకు ఖ్యాతి అసోసియేషన్ పెద్దల ప్రోత్సాహంతోనే మాది చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. నాతో పాటు, నా చెల్లెల చదువుల కోసం మా తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. స్కూల్ గేమ్స్లో చక్కటి ఆటతీరు చూపుతున్న నాపై అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాజారామ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విజయ శంకర్రెడ్డి, బాలాజీ, ఉపాధ్యక్షులు గౌస్మొహిద్దీన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరయ్య, వెంకటేష్ నమ్మకం ఉంచారు. ముందుండి ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించారు. ప్రభుత్వం చేయూతనిస్తే మరింతగా రాణిస్తాననే నమ్మకముంది. – పావని -
ప్రకృతి వ్యవసాయం సూపర్
బత్తలపల్లి: ప్రకృతి సాగు విధానం చాలా బాగుందని ఫ్రాన్స్ దేశస్తులు కితాబిచ్చారు. శనివారం బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఫ్రాన్స్కు చెందిన సీనియర్ ఎకానమిస్ట్ డాక్టర్ బ్రునో డోరియన్, పీహెచ్డీ పరిశోధకురాలు మిస్ క్యారీ లేపాల్ట్లు సర్వే నిర్వహించారు. సీఆర్పీలతో ఏటీఎం మోడల్, ఏ–గ్రేడ్ మోడల్, సీఎండీఎస్ మోడల్స్ చూశారు. చాంపి యన్ రైతులు, నూతనంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు, రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంతకు ముందు ఫ్రాన్స్ దేశస్తులను గ్రామస్తులు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఊరేగించారు. గురజాల అప్పస్వామి దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మానాయక్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నవీన్, మాస్టర్ ట్రైనర్ హరికుమార్, డివిజన్ ఇన్చార్జ్ గంగమ్మ, ఎల్1 నరసింహులు, ఎల్2 పార్వతి, ఎన్ఎఫ్ఐలు, ఎల్3లు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ దేశస్తుల కితాబు -
పేకాట రాయుళ్ల అరెస్ట్
ముదిగుబ్బ: ముదిగుబ్బలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 17 మందిని శనివారం ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆదేశాల మేరకు సీఐ శివరాముడు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 86,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హేమంత్కుమార్ హెచ్చరించారు. మద్యం మత్తులో సొంతింటికే నిప్పు ముదిగుబ్బ: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన ఘన కార్యంతో అతని సొంతిల్లే దగ్ధమైంది. వివరాలు.. మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన చాకలి నారాయణస్వామి మద్యానికి బానిసయ్యాడు. పూటుగా తాగి శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అతను ఇంట్లో దుస్తులకు నిప్పు పెట్టాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు వెంటనే స్పందించి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ హిందూపురం టౌన్: హజ్ యాత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, జిల్లా నుంచి మక్కా సందర్శించే వారి యాత్ర క్షేమదాయకం కావాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఫైరోజా బేగం అన్నారు. జిల్లా నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న 161 మంది యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం పట్టణంలో నిర్వహించారు. హిందూపురం ప్రాంతం నుంచి 110 మంది యాత్రికులు హజ్కు వెళ్తున్నారని నిర్వాహకులు చెప్పారు. యాత్రికులు విదేశీ పర్యటనలో ఆయా దేశాలకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే తెలియజేయాలని, అక్కడికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మంజువాణి, డీఐఓ డాక్టర్ సురేషబాబు, వైద్యాధికారి డాక్టర్ కేసీకే నాయక్, వైద్యులు కిరణ్మయి, ఉషారాణి, హజ్ కమిటీ నూరుద్దీన్, వైద్య సిబ్బంది వన్నప్ప, ముస్తఫా, రమేష్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య హిందూపురం: స్థానిక కొట్నూరు–కగ్గల్లు రైల్వేగేట్ వద్ద శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం పొందినట్లు రైల్వే హెచ్సీ ఎర్రిస్వామి తెలిపారు. మృతుడు ఎరుపు, తెలుపు రంగు షర్టు, నీలం రంగు చెక్స్ లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. సమాచారం తెలిసిన వారు హిందూపురం రైల్వే పోలీసు స్టేషన్ నం. 94412 38182, 91820 19510కు తెలియజేయాలని కోరారు. బీటెక్ విద్యార్థి బలవన్మరణం గార్లదిన్నె: బీటెక్ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని కమలాపురంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. కమలాపురం గ్రామానికి చెందిన చింతబరరెడ్డి, జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి (21) బెంగళూరులో గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. శ్రీకర్ రెడ్డి మొదటి, ద్వితీయ సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. తోటి స్నేహితులు పాస్ కావడం, ఫైనల్ ఇయర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యం బాధపడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలో శనివారం తమ వ్యవసాయ తోటలో చీనీ చెట్లకు మందు పిచికారీ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన శ్రీకర్ రెడ్డి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
21 నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవ పోస్టర్లు, బ్రోచర్లను శనివారం గవిమఠం ఆవరణలో పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం ఇన్చార్జ్ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 26న స్వామి వారి మహారథోత్సవం, 27న లంకాదహనం ఉంటాయన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్గౌడ్, పాటిల్ రాజశేఖర్, మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు. -
కీలక దశ.. మెళకువలతో లాభాల దిశ
కళ్యాణదుర్గం: ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చింది. ఈ సమయంలో దిగుబడి పెంచుకోవడానికి కొన్ని మెళకువలు పాటిస్తే గణనీయమైన లాభాలు సాధించవచ్చు. కొమ్మలకు పూత వచ్చే ప్రస్తుత సమయంలో వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సమయాల్లో పూత వచ్చినప్పటికీ అది ముడుచుకుని పోయే ప్రమాదం ఉంది. సీజనల్ పూత పూర్తిగా రాకపోవడం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాప్టలిస్ అసిటిక్ ఆమ్లాన్ని స్పిరిట్లో కరిగించి ఆ తర్వాత మంచినీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. కొమ్మలకు పూత సాగి పూలు విచ్చుకుని పిందెకట్టే అవకాశం అధికంగా ఉంటుంది. సాగునీటి యాజమాన్యం... మామిడి పూత సమయంలో తోటలకు నీటి తడులు చాలా అవసరం. పూత,మొగ్గ బయట పడే సమయంలో మామిడి తోటలకు తప్పనిసరిగా నీటిని అందించాల్సి ఉంటుంది. వేళ్ల నుంచి చివర కొమ్మ వరకు తడి అందేలా చేస్తే అన్ని కొమ్మలకు పూత సాగే అవకాశం ఉంటుంది. నీటిని అందించే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పదిహేనేళ్లు దాటని తోటలకు ఒక్కసారి (బాగా తేలిక నేలలైతే), వారం రోజుల తర్వాత మరోసారి సాగునీరు అందించాలి. లేదంటే డ్రిప్ ద్వారా వారం రోజుల పాటు నీరు అందిస్తే ప్రయోజనం ఉంటుంది. పిందె దశలో.. రబీలో ఆలస్యంగా కోతకు వచ్చే రకాల చెట్టుపై హోర్మోనులను పిచికారీ చేస్తే పూత, పిందె రాలడం బాగా తగ్గుతుంది. తెల్లపూత, జొన్న గింజ, పరిమాణంలో పిందెలు ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో 4 గ్రాముల నాప్టలీన్ అసిటెక్ ఆమ్లం, దీనికి తోడు 400 గ్రాముల బోరాన్ కలిపి పూతపై పడేలా పిచికారి చేసుకోవడం వల్ల పిందెకట్టే సమయంలో రాలడాన్ని నివారించవచ్చు. కాయ దశకు వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో పూతపై మాత్రమే తుంపర్లు పడే విధంగా జాగ్రత్తలు వహించడంతో పాటు పిందె పరిమాణం పెరుగుతన్న సమయంలో కూడా నీటిని అదించడం మొదళ్లలో తడి ఆరకుండా చూడాలి. పూత దశలో మామిడి తోటలు యాజమాన్యం పాటించాలని అధికారుల సూచనలు -
మెళకువలు పాటించాలి
పిందె పరిమాణం నుంచి అభివృద్ధి సమయంలో మెలకువలు పాటించాలి. పదిహేనేళ్లకు పైన ఉన్న చెట్లపై 500 గ్రాముల యూరియాతో పాటు 1–15 కిలోల పొటాషియం చొప్పున వేస్తే పిందె అభివృద్ధి చెంది వాతావరణ మార్పులను తట్టుకుంటుంది. ఇరవై ఏళ్లు దాటిన తోటల్లో నీటి సౌకర్యం లేనప్పుడు పిందె పరిమాణం బాగా పెరిగిన అనంతరం లీటరు నీటికి 100 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే మేలు. – డాక్టర్ ఈ చండ్రాయుడు, కేవీకే కో ఆర్డినేటర్ -
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పుట్టపర్తి అర్బన్: పదో తరగతిలో ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం ఆయన పుట్టపర్తి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఫలితాల మెరుగునకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసే క్లాసులకు విద్యార్థులందరూ హాజరు కావాలన్నారు. ఏదైనా కారణం చేత పాఠశాలకు రాలేని విద్యార్థులు సమీపంలోని హాస్టళ్లకు అనుసంధానించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలన్నారు. పారిశుధ్యం మెరుగుపరచాలి ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణం, పట్టణ మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం మెరుగునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో డోర్ టు డోర్ చెత్తసేకరణ వందశాతం జరగాలన్నారు. వ్యర్థాలు వేరు చేసి తరలించడం, ప్రాసెసింగ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోనూ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. టిడ్కో కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు 4,176 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ధ్రువీకరించాలన్నారు. మున్సిపాలిటీలోని వీధి దీపాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, డీఈఈలు, టిడ్కో అధికారులు హాజరయ్యారు. గుండెపోటుతో హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మృతి పుట్టపర్తి: బుక్కపట్నం మండలం గూనిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పి.శ్రీనివాసరెడ్డి (57) గుండె పోటుతో శనివారం మృతి చెందారు. విధుల్లో ఉన్న సమయంలోనే ఆయకు ఛాతీలో నొప్పి రావడంతో ఎంఈఓ గోపాల్ నాయక్ హుటాహుటీన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. సౌమ్యుడు, అంకిత భావంతో పనిచేసే శ్రీనివాసరెడ్డి ఆకస్మిక మృతితో స్వగ్రామం ఎనుములపల్లిలో విషాదం నెలకొంది. ఆయన భార్య రాధిక బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి అనేక ఏళ్లుగా సర్పంచుగా సేవలందించి గుర్తింపు పొందారు. అలాగే శ్రీనివాసరెడ్డి చిన్నాన్న రమణారెడ్డి ఎస్కేయూ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా పని చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు
బత్తలపల్లి: నేత్రదానంతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని విశ్వదీప సేవా సంఘం సభ్యులు అన్నారు. మండల కేంద్రమైన బత్తలపల్లి ఓసీ కాలనీకి చెందిన పల్లపోతుల రామలక్ష్మమ్మ (78) శనివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణంలోని విశ్వదీప సేవా సంఘం సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారుడు గణేష్ (గణేష్ సిమెంట్ బ్రిక్స్), కోడలు శ్రీలక్ష్మీ, మనవ రాళ్లు సుస్మిత, దీక్షిత, కుమార్తె సుగుణమ్మ, అల్లుడు కృష్ణప్ప, స్టోర్ ప్రకాష్, పి.గోపాల్ అంగీకారంతో అనంతపురం రెడ్క్రాస్ డీవై కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ జి.రాఘవేంద్ర రామలక్ష్మమ్మ కంటి కార్నియా సేకరించారు. కుటుంబ సభ్యులకు విశ్వదీప సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంఘం ఫౌండర్ కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మరణించిన మనిషి మన మధ్య లేకపోయినా వారి నేత్రాలు జీవించి ఉంటాయన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్, కార్యదర్శి జూజారు రఘు, టి.చంద్రశేఖర్రెడ్డి, ధనుంజయ, సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్కు ఎంపిక గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జ్యోతి అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 2వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయస్థాయి 7వ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో (40 సంవత్సరాల వయస్సు పైబడిన) జ్యోతి 800 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్లో ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం గోపాల్రెడ్డి, పీడీ ఎంకె.రాజేష్ తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో గుంతకల్లు ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, డీ.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాల్లు పాల్గొని జ్యోతిని అభినందించారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన ఆమె త్వరలో జరగబోయే అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎంఈఓలు, హెచ్ఎం పేర్కొన్నారు. -
ఫైవ్మెన్ కమిటీ పెత్తనమేంటి?
పరిగి: ‘‘ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నియమించిన ఐదుగురు సభ్యుల (ఫైవ్మెన్) కమిటీ పెత్తనమేంటి.. ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాన్ని వారికి ఎవరిచ్చారు. అసలు ఫైవ్మెన్ కమిటీని ఎవరు ఎన్నుకున్నారు. ఆ కమిటీతో ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీలకు గౌరవం కొరవడింది. అధికారులు కూడా ప్రొటోకాల్ పాటించకుండా ఆ కమిటీ సభ్యులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. క్షమించరాని నేరం’’ అంటూ పరిగి మండల సభలో ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ సవిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రారంభమైన పది నిమిషాలలోపే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. టీడీపీ ఫైవ్ మెన్ కమిటీ గురించి ఎంపీటీసీ మారుతి ప్రస్తావిస్తూ.. వారి పెత్తనంపై నిలదీయగా.. మిగతా సభ్యులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా ఎంపీటీసీలు సభ నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం అధికారులు సభ్యులకు నచ్చజెప్పడంతో పాటు ఎంపీపీ సవిత జోక్యంతో సమావేశం పునఃప్రారంభమైంది. బిల్లులు మంజూరు టీడీపీ సర్పంచులకేనా? పంచాయతీలకు ఉన్న అధికారాన్ని విస్మరించి టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న సర్పంచ్లకు మాత్రమే అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయడంపై సభ్యులు మండిపడ్డారు. మండలంలోని 14 పంచాయతీల్లో కేవలం బీచిగానిపల్లి పంచాయతీకి మాత్రమే బిల్లులు మంజూరు చేయడంపై అభ్యంతం తెలిపారు. బిల్లుల మంజూరులో డిప్యూటీ ఎంపీడీఓ అవలంబిస్తున్న ధోరణి సరికాదన్నారు. మంత్రి సవిత ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ... పదవికి రాజీనామా చేసి పచ్చకండువా కప్పుకోవాలన్నారు. వచ్చేవారంలో బిల్లులు మంజూరు చేయకపోతే కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో తహసీల్దారు, ఎంపీడీఓ స్పందించారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు లేనట్టేనా? రైతులకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక కనీసం కూలీ ఖర్చులు సైతం రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 5 కిలోల మొక్కజొన్న విత్తనాలు రూ.1,500 ఉంటే, రైతులు పండించిన పంట వంద కేజీలు రూ.1,500 పలకడం దారుణమన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, ఎంపీడీఓ రెడ్డెప్ప, వైస్ ఎంపీపీలు వేదవతి, శకుంతలమ్మ, జెడ్పీటీసీ శ్రీరామప్ప, మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పరిగి మండల సభలో సభ్యుల నిలదీత ప్రొటోకాల్ పాటించని అధికారులపై ఆగ్రహం ఎంపీపీ జోక్యంతో కొనసాగిన సమావేశం -
ప్రైవేటు క్లినిక్లలో ఆకస్మిక తనిఖీలు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని పలు ప్రైవేటు క్లినిక్లలో శనివారం సాయంత్రం జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బృందంలోని ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్కుమార్, తహసీల్దార్ సురేష్బాబు, ఎస్ఐ ఉమాదేవి, డాక్టర్ సురేష్, వీఆర్ఓ రవిశేఖర్రెడ్డిలు క్లినిక్లలో రోగులకు అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి రోగులకు చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించి క్లినిక్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు ప్రైవేటు క్లినిక్లకు షోకాజ్ నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. క్లినిక్లలో ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలని, ఎలాంటి ఇంజెక్షన్లు, సైలెన్ బాటిళ్లు, స్టెరాయిడ్లు రోగులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు ప్రైవేటు క్లినిక్ నిర్వాహకులు చికిత్సా కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయారు. మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలకు తాళం.. చెన్నేకొత్తపల్లి: నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలకు శనివారం అధికారులు తాళాలు వేశారు. మండల కేంద్రంలోని పలు ఆర్ఎంపీ కేంద్రాలను తహసీల్దార్ సురేష్కుమార్, ఎంపీడీఓ బాలక్రిష్ణుడు, వైద్యాధికారి డాక్టర్ రవినాయక్, ఎస్ఐ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు తేలడంతో ఆయా కేంద్రాల నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. కేంద్రాల్లో కేవలం ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వాసుపత్రులకు పంపాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మూడు కేంద్రాలకు తాళాలు వేశారు. కాగా, తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు ఆర్ఎంపీలు కేంద్రాలకు తాళం వేసి వెళ్లిపోవడం గమనార్హం. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ రేపు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభ ఈ నెల 8న (ఆదివారం) ఉదయం 9 గంటలకు అనంతపురంలోని డీఎంహెచ్ఓ కమిటీ హాలులో నిర్వహించనున్నట్లు ఏపీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సి.వరప్రసాద్, రాఘవేంద్ర, శివానంద, సిద్ధయ్య, సాకే చంద్ర, రామకృష్ణ, కిరణ్యాదవ్, బి.మహేంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను శుక్రవారం అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) వారు విడుదల చేసి, మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంస్థాగతంగా సంఘం బలోపేతం లక్ష్యంగా మహాజనసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి నెలా రెండో శనివారం ‘హలో ఔట్సోర్సింగ్ ఏపీ’ పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర నాయకులు, జేఏసీ నేతలు హాజరుకానున్న మహాజనసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఎల్పీఎం సమస్యలను పరిష్కరిస్తాం
నల్లచెరువు: మండలంలో రీ సర్వే పూర్తయిన పంతులచెరువు, తవళంమర్రి గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. జాయింట్ ఎల్పీఎంలు ఉన్న రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎల్పీఎంలను విభజించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే పట్టాదారు పాస్బుక్లకు సంబంధించి జరుగుతున్న ఈ–కేవైసీ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలిచారు. కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
పుట్టపర్తి అర్బన్: గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి మొక్కజొన్న పంట దగ్ధమైంది. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు మురళి, శివప్ప, అంజి తదితరులు చిత్రావతి సమీపంలోని వేంకటేశ్వరస్వామి కొండ సమీపంలో సుమారు 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు రాజేయడంతో మంటలు వ్యాపించి సుమారు రెండు ఎకరాల్లోని పంట మొత్తం కాలిపోయింది. చుట్టుపక్కల రైతులు స్పేయర్లను ఉపయోగించి నీటిని పిచికారీ చేస్తూ మంటలను అదుపు చేశారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. బోర్వెల్ రాడ్ పడి వ్యక్తి మృతి బ్రహ్మసముద్రం : బోర్వెల్ రాడ్ తలపై పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకలి రామన్న పొలంలో గురువారం అర్ధరాత్రి బోర్ వేస్తుండగా పలువురు గ్రామస్తులు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బోర్వెల్ హైడ్రాలిక్ రాడ్ ఉన్నఫళంగా జారి అక్కడే ఉన్న గొల్ల అజ్జప్ప(45) తలపై పడింది. ఘటనలో అజ్జప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. ముగిసిన రీసెర్చ్ అడ్మిషన్ల ఇంటర్వ్యూలు అనంతపురం: ఈ నెల 2వ తేదీ నుంచి జేఎన్టీయూ (ఏ)లో చేపట్టిన రీసెర్చ్ అడ్మిషన్ల ఇంటర్వ్యూలు శుక్రవారం ముగిశాయి. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో నలుగురు, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం నుంచి 136 మంది, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ విభాగం నుంచి 103 మంది, ఎకనమిక్స్ విభాగంలో 31 మంది, ఈఈఈ విభాగంలో 139 మంది అభ్యర్థులు హాజరు కాగా, జేఎన్టీయూ (ఏ) వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల ప్రక్రియ సజావుగా జరిగినట్లు డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఎ.సురేష్బాబు వెల్లడించారు. మళ్లీ చిరుత కలకలం బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని సంజీవపురంలో మరోసారి చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళపై 3 రోజుల క్రితం చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ శుక్రవారం చిరుత ప్రత్యక్షం కావడం గమనార్హం. అయితే చిరుతను చూసిన గ్రామానికి చెందిన యువకులు రాళ్లు, కర్రలతో దాన్ని వెంబడించగా.. హెచ్ఎల్సీ వైపు పారిపోయింది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రమూ సహాయక చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు అడ్డుకున్న కాలనీ వాసులు కనగానపల్లి: మండలంలోని తూంచర్ల గ్రామంలో శుక్రవారం తారురోడ్డు పనులను స్థానిక ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. అనంతపురం నుంచి తూంచర్ల మీదుగా తగరకుంట వైపు తారురోడ్డు పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ రోడ్డును స్థానిక టీడీపీ నేత పొలాల వైపు నుంచి కాకుండా కాలనీ వైపు మళ్లించారు. ఇందు కోసం కాలనీలోని మరుగుదొడ్లను తొలగించడంతో పలువురు దళితులు ఆందోళన చేపట్టి అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే. దీంతో సర్వే అనంతరం రహదారి కొలతలు నిర్ధారించి రోడ్డు వేయాలని భావించారు. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి శుక్రవారం పనులు కొనసాగిస్తుండడంతో ఎస్సీ కాలనీ వాసులు అక్కమ్మ, లక్ష్మీదేవి, పార్వతమ్మ, నాగన్న, నల్లప్ప తదితరులు అడ్డుకున్నారు. -
క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు
● రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ గుత్తి: రాయలసీమ డయాసిస్ పరిధిలో ఉన్న క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ తెలిపారు. గుత్తి సీఎస్ఐ చర్చిలో పాస్టర్లు, క్రైస్తవ సంఘం సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమై మాట్లాడారు. క్రైస్తవ మిషనరీ ఆస్తులను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే , ఇతర ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను బిషప్తో పాటు క్రైస్తవ సంఘం పెద్దలు, పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో డివిజనల్ చైర్మన్ డేవిడ్ నాయక్, ఎంఎస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ రస్సెల్ కిరణ్, బిషప్ సతీమణి భారతి, క్రైస్తవ సంఘం సభ్యులు విజయ్కుమార్, సునీల్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడే ప్రాణాలు బలిగొంది ● వైద్యురాలి మృతిపై తల్లిదండ్రుల ఆరోపణ తలుపుల: విజయవాడలోని జీజీహెచ్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తూ బుధవారం రాత్రి మృతి చెందిన పీజీ వైద్యురాలు బత్తుల దీపిక (27) ఘటనపై తల్లిదండ్రులు బత్తుల కోదండ రామిరెడ్డి, భారతి అనుమానాలు వ్యక్తం చేశారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే తమ కుమార్తె మృతికి కారణమంటూ ఆరోపించారు. దీపిక అమ్మమ్మ గారి ఊరైన తలుపుల మండలం మాడికవాండ్లపల్లిలో శుక్రవారం బంధుమిత్రుల మధ్య దీపిక అంత్యక్రియలు జరిగాయి. అనంతపురానికి చెందిన కోదండ రామిరెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, గైనకాలజిస్టుగా మౌనిక, అనస్థీషియా వైద్యురాలిగా దీపిక పనిచేస్తున్నారు. మౌనికకు పెళ్లి అయి పాప కూడా ఉన్నారు. పీజీ పూర్తి కాగానే దీపికకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో నిరంతరాయంగా 36 గంటల పాటు పని చేయాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయిన దీపిక చనిపోయిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. వ్యాపారం పేరుతో టోకరా బుక్కరాయసముద్రం: డబ్బు తీసుకుని కిరాణా సరుకులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను శుక్రవారం వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ఆనంద్గుప్తా బీకేఎస్లోని ముసలమ్మ కట్ట వద్ద రఘురామ ట్రేడర్స్ పేరుతో గోదాము ఏర్పాటు చేసుకుని, నగరంలోని పలు కిరాణా దుకాణాలకు సరుకులు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే శ్రీసాయి ట్రేడర్స్ పేరుతో హోల్సేల్ డీలర్ షిప్ నిర్వహిస్తున్న అనంతపురానికి చెందిన రామలక్ష్మి అరవింద్ దంపతులకు నిత్యావసర సరుకుల కోసం రూ.28.70 లక్షలను ఆనంద్గుప్తా చెల్లించాడు. అనంతరం రామలక్ష్మి దంపతులు సరుకులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిలదీస్తే అరవింద్ బెదిరింపులకు దిగాడు. ఘటనపై బాధితుడు ఆనంద్గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మహిళ దుర్మరణం
పెనుకొండ రూరల్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ రూరల్ పరిధిలోని అమ్మవారిపల్లికి చెందిన ఉప్పర రామాంజినమ్మ (54).. కియా పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తిగత పనిపై కియా పరిశ్రమ మెయిన్ గేట్ వద్దకు వెళ్లిన ఆమె అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపుగా వెళుతున్న వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అక్కంపల్లిలో దొంగ హల్చల్ మడకశిర: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని అక్కంపల్లిలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఓ దొంగ హల్చల్ చేశాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వీటిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రముఖ కాంట్రాక్టర్ బాబు ఇంట్లోకి చొరబడేందుకు దొంగ ప్రయత్నించాడు. అయితే ఇంటి గేట్ వద్ద ఉన్న కుక్క పసిగట్టి అరవడంతో అక్కడి నుంచి జారుకున్న దొంగ పక్కనే ఉన్న మరో ఇంటి ఆవరణలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ను అపహరించుకెళ్లాడు. శెట్టిపల్లి వద్ద కంటైనర్ బోల్తా చిలమత్తూరు: మండలంలోని కోడూరు – పుట్టపర్తి ప్రధాన రహదారిపై శెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం బోల్తా పడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. -
రైతులు ఫిర్యాదు చేస్తే లైసెన్స్ రద్దు
● వ్యవసాయశాఖ జేడీ కృష్ణయ్య ఓడీచెరువు: ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై రైతులు ఫిర్యాదు చేస్తే ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కృష్ణయ్య హెచ్చరించారు. మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర, బాలాజీ ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువులు, పురుగు మందుల రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, ధరల పట్టిక కచ్చితంగా బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ సనావుల్లా, కదిరి ఏఓ శ్రీహరినాయక్ పాల్గొన్నారు. నేడు 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష లేపాక్షి: లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పట్టణంలో అజిజీయ, ఎంజీఎం, ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలకు 1205 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయం, ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డులతో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంతినిలయం: తనకల్లు మండలంలో ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఖాళీ సీట్లకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. 2026–27 సంవత్సరానికి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 80 సీట్లు ఉన్నాయని, అందులో ఎస్టీ 60, ఎస్సీ 10, బీసీ 4, ఓసీ 2, పీహెచ్సీలకు 2, ఏఈక్యూ 2 సీట్లు ఉన్నాయన్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల 28 వరకూ ఉంటుందన్నారు. ఏప్రిల్ 4న రాత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ప్రిన్సిపాల్ ఫోన్ నంబర్ 8500941752, 8333807978ను సంప్రదించాలన్నారు. ఇంటర్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోండి ప్రశాంతినిలయం: తనకల్లు మండలంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు(బాలికలు) దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గిరిజన బాలికలు ఈనెల 9 నుంచి మార్చి 4వ తేదీ లోపు దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మార్చి 8న ఉదయం 11 గంటలకు ఉంటుందన్నారు. 11న పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్మేళా ధర్మవరం అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈనెల 11న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు హైదరాబాద్, బెంగళూరు, కడప, పెనుకొండ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికెట్లతో ఆ రోజు ఉదయం 9 గంటలకు పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. -
చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా..
హిందూపురం అల్లకల్లోలంగా మారింది. నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో సామాన్య జనం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. వివిధ కేసుల్లో ఉన్న వారు బెయిల్పై బయటకు వచ్చి దర్జాగా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం క్రిమినల్స్కు అడ్డాగా మారింది. అత్యాచారాలు, రాబరీలు, హత్యలు, హత్యాయత్నాలు, గూండాయిజం పెరిగిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఎస్పీ సతీష్కుమార్ జిల్లాకు వచ్చిన తర్వాత నేరాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ హిందూపురం నియోజకవర్గ పరిస్థితి మాత్రం మారలేదు. నిఘా వైఫల్యమే కారణమా? అధికార పార్టీ నాయకుల చేతుల్లో పోలీసులు కీలు బొమ్మల్లా మారడంతోనే హిందూపురంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్న విమర్శలున్నాయి. దీనికి తోడు పోలీసులు కూడా నిఘా పెట్టడంలో విఫలమయ్యారన్న వాదనలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టడంతో నేరాల తీవ్రత తక్కువగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. పోలీసులు... టీడీపీ నేతల ధాటికి తట్టుకోలేకపోవడం, పోలీసుల నిఘా లేదన్న సంకేతాన్ని గుర్తించడం కారణంగా రౌడీమూకలు, దొంగలు రెచ్చిపోతున్నారని అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం ధ్వంసం.. గతేడాది నవంబర్ 15న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద వందల మంది టీడీపీ నాయకులు , కార్యకర్తలు చేరుకొని బీభత్సం సృష్టించారు. చైర్లు, భవనం అద్దాలు, కంప్యూటర్లను పగలగొట్టారు. పోలీసుస్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక నుంచి రౌడీషీటర్లు.. హిందూపురం పట్టణం రాష్ట్ర సరిహద్దులో ఉంది. దీంతో కర్ణాటక రాష్ట్రం సరిహద్దు పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లు యథేచ్ఛగా జిల్లాలో సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. పోలీసుల నిఘా కొరవడటంతోనే జిల్లాలో సెటిల్మెంట్లు , దాడులకు యత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో తరచూ జరుగుతున్న పరిణామాలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితులున్నాయి. కనీసం ఇప్పటికై నా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండి లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన నెల రోజులకే హిందూపురం రూరల్ మండలంలోని గొళ్లాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ సతీష్ను టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. 2024లోనే చిలమత్తూరు మండలంలోని టేకులోడు పంచాయతీ నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తా కోడళ్లను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. 2025లో దొంగలు యథేచ్చగా రాబరీలకు తెగబడ్డారు. గన్స్, కత్తులు చూపించి హిందూపురం రూరల్ మండలం కిరికెర సమీపంలో ఓ ఇంట్లో దోపిడీ చేశారు. అదే సంవత్సరం జూలైలో హిందూపురం రూరల్ మండలంలోని తూముకుంట ఎస్బీఐ రాబరీ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లేపాక్షి మండలంలోని మైదుగోళంలో ఓ వ్యక్తి తలను వేరుచేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసులతో పాటు సామాన్యులను కూడా బెంబేలెత్తించింది. చిలమత్తూరు మండలంలో టీడీపీ నేతల దాష్టీకాలకు అంతే లేకుండా పోయింది. గతేడాది ఆగష్టులో ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసి ఆయనపై దాడి చేయడం, ఆయన తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు బాబూరెడ్డి పై గతంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. నిందితుడికి టీడీపీ నేత నాగరాజు యాదవ్ అనుకూలంగా ఉండటంతో బాబూరెడ్డిని కనీసం పోలీసులు అరెస్ట్ కూడా చేయలేకపోయారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో చోరీలు జరిగాయి. హుండీల్లోని డబ్బులను దుండగులు దోచుకెళ్లారు. అంతకంతకూ పెరిగిపోతున్న నేరాలు సెటిల్మెంట్లు, హత్యలు, దొంగతనాలతో ప్రజల బెంబేలు పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న వైనం ఖాకీలు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మల్లా మారడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయంటున్న ప్రజలు పోలీసులపైనే దాడి.. 2024 అక్టోబర్లో చిలమత్తూరు మండలం టేకులోడు సమీపంలో జరిగిన అత్తా కోడళ్లపై అత్యాచారంలో ప్రధాన నిందితుడు కావడి నాగేంద్ర శుక్రవారం ఉదయం కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచడం సంచలనం రేపింది. 70కి పైగా కేసులు ఉన్న నిందితుడు తప్పించుకుని తిరుగుతూ అఘాయిత్యాలు కొనసాగిస్తున్న తరుణంలో పోలీసులు బృందాలుగా విడిపోయి చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీప్రాంతం కనుమ వద్ద నాగేంద్ర ఉన్నాడన్న సమాచారంతో వెళ్లగా కానిస్టేబుల్తో పాటు సీఐ ఆంజనేయులపై నిందితుడు దాడి చేసి గాయపరిచాడు. అయితే సీఐ కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులపైనే దాడి చేసి గాయపరిచిన నిందితుడికి పట్టణంలోని పోలీసు సిబ్బంది నిరంతరాయం సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
నేరాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
కదిరి టౌన్: మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసులతో పాటు ఒక్కరి బాధ్యతని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. శుక్రవారం కదిరి పట్టణంలోని దత్త ఫంక్షన్హాల్ కదిరి పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘మీ భధ్రత – మా బాధ్యత ’ మహిళా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్కుమార్తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ఆడపిల్లలు బయటికి వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి వారితో కలిసి ఎక్కడికి వెళ్లకూడదన్నారు. ఐదారేళ్ల బాలికలకు చాకెట్లు ఇచ్చి వారిపై లైంగిక దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లినప్పుడు ఆడ పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో వదిలి వెళ్లాలని, అప్పుడే వారికి రక్షణ ఉంటుందన్నారు. ప్రమాదం పొంచి ఉన్న సమయంలో బాలికలు, మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు పట్టణంలో విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, మహిళా డీఎస్పీ ఇందిరి తదితరులు పాల్గొన్నారు. -
గొర్రె పిల్లలపై చిరుత దాడి
తనకల్లు: మండల పరిధిలోని తురకవాండ్లపల్లి సమీపంలోని సింగరాతి చెరువు వద్ద గొర్రెల మందపై శుక్రవారం చిరుత పులి దాడి చేసింది. గొర్రెల కాపరి వెంకటరమణ వివరాల మేరకు.. తురకవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ తన గొర్రెలను సమీపంలోని అడవిలోకి మేత కోసం తీసుకెళ్లాడు. అయితే గొర్రెలకు నీటిని తాగించడానికి సమీపంలోని సింగరాతి చెరువు వద్దకు తీసుకెళ్లి కొద్దిదూరంలో కూర్చున్నాడు. హఠాత్తుగా చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. రెండు గొర్రె పిల్లల గొంతులను కొరకడం చూసిన వెంకటరమణ భయాందోళనకు గురయ్యాడు. తనపై చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడి వెంటనే చెరువులోకి దూకి అటు నుంచి దగ్గర్లోని గుట్టలోకి పెద్దగా కేకలు వేసుకుంటూ వెళ్లిపోయాడు. కేకలకు భయపడిన చిరుత రెండు గొర్రె పిల్లలను అక్కడే వదిలేసి సమీపంలోని చెట్లపొదల్లోకి వెళ్లింది. సమాచారం అందుకున్న వెంకటరమణ కుమారుడు ముని, మరికొందరు గ్రామస్తులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వెంకటరమణతో పాటు గొర్రెలను ఇంటికి తీసుకెళ్లారు. ఘటనపై అటవీశాఖాధికారి గుర్రప్పను ‘సాక్షి’ వివరణ కోరగా గొర్రె పిల్లలపై చిరుత దాడి చేసినట్లు సమాచారం అందిందని, అటవీ సిబ్బంది పంపి విచారణ చేయిస్తామన్నారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై పోస్టుకార్డు ఉద్యమం
ధర్మవరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లపై పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యరద్శి రమావత్ రామకృష్ణ నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో సీఎం చంద్రబాబుకు 200 పోస్టుకార్డులు పంపుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరంలోని శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై స్పందన లేకుండా పోయిందన్నారు. పలుమార్లు విన్నవించినా ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కాని చలనం లేకుండా పోయిందన్నారు. దీంతో ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. యూటీఎఫ్ పోస్ట్కార్డు ఉద్యమం ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలను తీసుకెళుతున్నట్లు వివరించారు. 12వ పీఆర్సీ నియామకం, పెండింగ్ డీఏల చెల్లింపు, 29 శాతం మధ్యంతర భృతి, ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటన, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడం, 2004 ముందు నియామకమైన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయడం తదితర సమస్యలపై పోరుబాట చేపట్టినట్లు వివరించారు. డిమాండ్లపై ఈ నెల 15వ తేదీ లోపు ప్రభుత్వం స్పందించకపోతే 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ పట్టణ గౌరవాధ్యక్షుడు కేవీ నాగిరెడ్డి, నాయకులు సాయి గణేష్, ప్రదీప్కుమార్, పాఠశాల హెచ్ఎం ఉమాపతి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జానకి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆగని గుప్త నిధుల తవ్వకాలు
పెనుకొండ: చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పెనుకొండ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దుండగులు రాత్రికి రాత్రే తవ్వకాలు చేస్తూ పురాతన భవనాలు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. పెనుకొండ కేంద్రంగా పాలన.. విజయనగర రాజులు, జైన రాజులు, చోళులు ఇతర ఎంతో మంది రాజులు పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు. పెనుకొండ ఊరువాకలి ఆంజనేయస్వామి, ఆర్డీఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో అప్పట్లో రాజులు ప్రధాన కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు దాచారన్న ప్రచారం ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది ముఠాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు. పెనుకొండ పరిసరాల్లోని గగన్మహల్, కోటగోడ, రాంబురుజులు, తిమ్మరుసు బందీఖానా, తిమ్మరుసు సమాధి, బసవణ్ణ బావి, నాగుల బావి, కొండపై ఖిల్లా, లక్ష్మీనరసింహస్వామి ఆలయం వీరణ్ణ కొండపై ఉన్న కట్టడాలు, ఇటీవల వెలుగు చూసిన వైష్ణవ ఆలయం ఇతర ఎన్నో కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే పెనుకొండ కొండ సొరంగం, గగన్మహల్ నుంచి ఉన్న రహస్య మార్గాల ద్వారా రొద్దం మండలం బొక్కసంపల్లి వద్ద సైతం గతంలో రాజులు ముస్లిం చక్రవర్తుల కంట పడకూడదని ఏనుగుల ద్వారా బంగారు, వజ్రాలు ఇతర సామగ్రిని తరలించారని ప్రచారంలో ఉంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు నిరవధికంగా ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. పెరిగిన పర్యాటకులు.. పెనుకొండకు ఇటీవల బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. సెలవులు వస్తే చాలు వాహనాలతో కొండపైకి రావడం అలవాటుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వీరణ్ణ కొండ వెనుక ప్రాంతంలో ఉన్న వైష్ణవ ఆలయాన్ని గుర్తించిన అధికారులు ఆలయం ఆవరణలో ఇష్టారాజ్యంగా నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు గుర్తించారు. పెనుకొండ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా ఇలాంటి ఘటనలపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండలో పురాతన కట్టడాల ధ్వంసం పట్టించుకోని అధికారులు, పోలీసులు కట్టడాల పరిరక్షణకు చర్యలు గుప్త నిధుల వేటగాళ్లతో పురాతన కట్టడాలు దెబ్బతింటున్న విషయం వాస్తవమే. స్థానిక పోలీసులకు తెలియజేసి తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదే విధంగా విషయాన్ని పురావస్తు శాఖ డీడీ, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. పురాతన కట్టడాల పరిరక్షణకు తగిన సిబ్బందిని నియమించి కట్టడాలను పరిరక్షిస్తాం. – స్వామినాయక్, పురావస్తుశాఖ అధికారి -
సేవాలాల్ జయంత్యుత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు గుత్తి మండలం సేవాఘడ్లో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం అదనపు బస్సులు నడపాలన్నారు. సేవాఘడ్ వద్ద స్టాపింగ్ సదుపాయం కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాలు, కనీస వసతులు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి వేడుకలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గుంతకల్లు ఆర్డీఓ ఏబీవీఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, ట్రస్ట్ అధ్యక్షుడు కేశవనాయక్, కార్యదర్శి అశ్వర్థనాయక్, ప్రతినిధులు బాలనాయక్, డీఎల్డీఓ విజయలక్ష్మి, గుత్తి, గుంతకల్లు తహసీల్దారు పుణ్యవతి, రమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జేసీ విష్ణు చరణ్ -
ఆర్డర్ ఇస్తే .. కొట్టుకొచ్చేస్తారు !
ధర్మవరం అర్బన్: ఎవరైనా కొత్త బైక్పై మోజు పడితే షోరూంలలో కొనుగోలు చేస్తారు. అయితే కోరుకున్న బైక్ను క్షణాల్లో అపహరించి తెచ్చిచ్చి సొమ్ము చేసుకునే ఘటన ధర్మవరంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా... వివరాలను ధర్మవరం రెండో పట్టణ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రెడ్డప్పతో కలసి డీఎస్పీ హేమంత్ కుమార్ వెల్లడించారు. ధర్మవరానికి చెందిన అనంత బాబు, ఇదే పట్టణంలోని ఇందిరానగర్ నివాసి సాకే మల్లికార్జున, ముదిగుబ్బ ఓల్డ్టౌన్లో నివాసముంటున్న మద్దినేని నాగరాజు ఓ ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే తమ వద్ద ద్విచక్ర వాహనాలు ఉన్నాయని గ్రామీణులకు నమ్మబలికేవారు. ఏ కంపెనీ బైక్ కావాలన్నా.. ఏ మోడల్దైనా ముందుగా ఆర్డర్ తీసుకుని ఆ బైకును అపహరించి తక్కువ ధరకే విక్రయించేవారు. ధర్మవరం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, హిందూపురం, అనంతపురం, తాడిమర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల ద్విచక్ర వాహనాల అపహరణలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టూ టౌన్ సీఐ రెడ్డప్ప నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్యార్డు సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సాకే మల్లికార్జున, మద్దినేని నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాల అపహరణలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అనంతబాబు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. ఇద్దరు బైకు దొంగల అరెస్ట్ 12 ద్విచక్ర వాహనాల స్వాధీనం పరారీలో ప్రధాన నిందితుడు -
బాబు వంచనపై గర్జన
అనంతపురం: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిలిచిపోవడానికి కారణమైన సీఎం చంద్రబాబు వైఖరి, మోసంపై అనంతపురం జిల్లా రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ప్రజల గర్జన ప్రభుత్వాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పోతిరెడ్డిపాడు’కు వేలాదిమంది అన్నదాతలు, ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ప్రభుత్వాన్ని నిలదీశారు. పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేయాలని నినదించారు.‘జల’కంటక సర్కార్పై గర్జించిన గళాలుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్ధాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టిన సీఎం చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేసింది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జించింది. ‘తీరు మారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్పై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదుంటూ హెచ్చరించింది. ‘తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ‘ఓటుకు నోటు’ కేసు భయం ఉంది. హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారం’టూ మండిపడింది.సంఘటితమైన సీమ నేతలురాయలసీమ ప్రయోజనాలపై రాజీ పడబోమని సీమ నేతలు, రైతులు పిడికిలి బిగించారు. వీరికి మద్దతుగా‘ సీమ’ ప్రయోజనాలు కాంక్షించే పలు రైతు, ప్రజా సంఘాల నేతలు సభలో పాల్గొన్నారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా.. వాడుకోలేని దయనీయ స్థితి. సీమకు, కృష్ణా జలాలకు అడ్డంకిగా ఉన్న చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాయలసీమ అంటే కరువు పీడిత ప్రాంతం కాదు.. బాబు పీడిత ప్రాంతమని రైతులు ఏకరువు పెట్టారు. రాయలసీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారిందన్నారు. -
ప్రకృతి వ్యవసాయం అద్భుతం
తాడిమర్రి: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు కొనియాడారు. గురువారం ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు డాక్టర్ బ్రూనో డోరియన్ (సీనియర్ ఎకనామిక్స్), పీహెచ్డీ పరిశోధకురాలు క్యారీ లేఫాల్ట్ మండలంలోని నార్శింపల్లిలో పర్యటించారు. ముందుగా ఏపీ సీఎన్ఎఫ్ అధికారులు, రైతులు వారికి ఘన స్వాగతం పలికి ఎద్దుల బండిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేశారు. పంటల సాగు, దిగుబడి, ఆదాయం తదితర వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజన్ లక్ష్మా నాయక్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నవీన్ పరిశోధన బృందానికి ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అనంతరం పరిశోధన బృంద సభ్యులు వ్యవసాయంపై సెమీ డైరెక్టివ్ ఇంటర్వ్యూల ద్వారా సర్వే నిర్వహించారు. ముందుగా సీఆర్పీ నబీరసూల్తో చర్చించిన అనంతరం ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, పీఎండీఎస్ మోడల్స్ తదితర రకాల పంటలు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులను కూడా కలిసి పంటల సాగు, ఖర్చు, దిగుబడి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ సిబ్బంది హరికుమార్, గంగమ్మ, ఎల్వన్ నారాయణప్ప, ఎన్ఎఫ్ఐ శ్రీహర్ష, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. కితాబునిచ్చిన ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ బృందం -
బస్సు కింద పడి డిగ్రీ విద్యార్థి మృతి
పుట్టపర్తి అర్బన్: కాలేజీ ముగిసిన తర్వాత ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తూ ప్రమాదవశాత్తూ బస్సు దిగే సమయంలో కిందపడటంతో డిగ్రీ విద్యార్థి సాయి కిరణ్ (19) మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లో గురువారం చోటు చేసుకుంది. పుట్టపర్తి రూరల్ ఎస్ఐ క్రాంతి వివరాలమేరకు.. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లికి చెందిన ప్రభాకర్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయికిరణ్ కొత్తచెరువులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బస్సు దిగే క్రమంలో కింద పడిన సాయికిరణ్పై బస్సు ఎక్కింది. తీవ్రంగా గాయపడిన సాయికిరణ్ను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో బీడుపల్లిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివించాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారని, దేవుడు వారికి తీరని అన్యాయం చేశాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డీపీటీఓ మధుసూదన్, ఎస్ఐ క్రాంతి ఆస్పత్రికెళ్లి వివరాలను నమోదు చేసుకున్నారు. తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు
అనంతపురం: గంజాయి సరఫరా, విక్రయ ముఠాలోని ఆరుగురు యువకులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం జిల్లా మొదటి సెషన్స్ కోర్టు జడ్జి సత్యవాణి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2021 జూన్ 17న అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దగ్గర ఎస్ఐ నబిరసూల్ వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక కారులో 29 కేజీల గంజాయి దొరింది. వీటిని తరలిస్తున్న అనంతపురానికి చెందిన కుంచపు వడ్డే పవన్కుమార్, గాజుల అఖిల్, ధనరాజ్, కళ్యాణదుర్గానికి చెందిన గాజుల నాగరాజు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంకు చెందిన పూల సునీల్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పల్లె వెంకట రవితేజలను అరెస్ట్ చేశారు. వీరంతా 21 నుంచి 29 ఏళ్లలోపు వయసు కలిగిన యువకులే. అప్పటి సీఐ మురళీధర్రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అనంతపురం మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు సాక్షులను జడ్జి సత్యవాణి విచారించారు. నేరం రుజువు కావడంతో అనంతపురం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్చు చెప్పారు. స్పెషల్ పీపీ లేపాక్షి నాయుడు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. పర్వతారోహకుడు ఈశ్వర్కు అభినందన మడకశిర: పట్టణానికి చెందిన పర్వతారోహకుడు, ట్రెక్కింగ్లో విశేష ప్రతిభ కనబరస్తున్న ఈశ్వర్ను గురువారం పుట్టపర్తిలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఈశ్వర్ను మడకశిర నుంచి ప్రత్యేకంగా పిలిపించుకుని కలెక్టర్ అభినందించారు. సాహస క్రీడల్లో ఈశ్వర్ రాణిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈశ్వర్ జిల్లాకే గుర్తింపు తెచ్చారని, ఇది ప్రజలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్లో మరెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారని ఈశ్వర్ తెలిపారు. యువతకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతానని ఈశ్వర్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కిషోర్ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి
కదిరి టౌన్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి(ఏబీసీడబ్ల్యూఓ) గుర్రం బాలాజీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బకాయిల మంజూరు కోసం వార్డెన్ నుంచి లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల మేరకు..గాండ్లపెంట మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ వార్డెన్గా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కోరగా...రూ.18 వేలు లంచం ఇవ్వాలని ఏబీసీడబ్ల్యూఓ గుర్రం బాలాజీ డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మీనారాయణ రూ.15 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా వార్డెన్ గురువారం కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో ఉన్న ఏబీసీడబ్ల్యూఓ నివాసానికి వెళ్లి.. ఆయనకు రూ.15 వేల నగదు అందజేశారు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు బాలాజీని పట్టుకున్నారు. ఈ మేరకు గుర్రం బాలాజీపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ హమీద్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
ప్రశాంతి నిలయం: జిల్లాలో పశుఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో పశుసంపద, వ్యాప్తిస్తున్న వ్యాధులు, స్థానిక పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఔషధాల జాబితాను తయారు చేయడానికి పశు వైద్యులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకంలో భాగంగా ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 10 మంది గైర్హాజరు పుట్టపర్తి అర్బన్: ఇంటర్ (జనరల్) ప్రాక్టికల్స్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. 16 కేంద్రాల్లో జరుగుతున్న ప్రాక్టికల్స్కు గురువారం 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్కు 484 మందికి గాను 480 మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్కు 535 మందికి గాను 529 మంది హాజరైనట్లు చెప్పారు. వివిధ కారణాలతో ఉదయం, మధ్యాహ్నం సెషన్లు కలిపి మొత్తంగా 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ బోర్డు రాష్ట్ర బోర్డు పరిశీలకులు సౌజన్య, డీఈసీ మెంబర్ రామరాజు, ప్రశాంతి, జయచంద్ర, ప్రశాంత్ తదితరులు ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ప్రాక్టికల్స్ను పర్యవేక్షించారు. క్వింటా చింతపండు రూ.25 వేలు హిందూపురం: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో చింతపండు విక్రయాలు ఊపందుకున్నాయి. గురువారం మార్కెట్కు 1,650 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.15,500, కనిష్టం రూ.6 వేల ప్రకారం ధర పలికిందన్నారు. మార్కెట్లో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన ఉత్పత్తులు తీసుకువస్తే మంచి ధరలకు ఉత్పత్తులను విక్రయించుకోవచ్చన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించండి ● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం పుట్టపర్తి టౌన్: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు, నిందితులు అరెస్ట్ గురించి డీఎస్పీ విజయకుమార్ను ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఇందుకోసం డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పేకాట, గంజాయి, మహిళా నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. -
ఢిల్లీని తాకిన ఉపాధ్యాయుల సెగ
పుట్టపర్తి: ఉపాధ్యాయుల సమస్యల సెగ ఢిల్లీని తాకింది. పలు సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ సంఘం నేతలు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసినట్లు జిల్లా శాఖ అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానుజులు యాదవ్ తెలిపారు. 2010 కంటే ముందు నియామకం పొందిన 30 లక్షల మంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. లేదా పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు. నేటి నుంచి గ్రామోత్సవ్ అనంతపురం అగ్రికల్చర్: స్థానిక సాయినగర్లో ఉన్న అంబేడ్కర్ భవన్ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘అనంత గ్రామీణ మహోత్సవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డు, నేస్తం ఎన్జీఓ సంయుక్తంగా 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో వివిధ జిల్లాల నుంచి నేతన్నలు, ఎస్హెచ్జీ, రైతులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఉత్పత్తులు, ఆభరణాలు, పనిముట్ల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. నాబార్డు ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో పాటు రూడ్సెట్, గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులతో పాటు ఉమ్మడి జిల్లా రైతులు, మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలి ● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మడకశిర: పనుల్లో వేగవంతం, పారదర్శకత కోసం ఇక నుంచి ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాలను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి.. సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఫైళ్ల క్లియరెన్స్లో పారదర్శకత పాటించేందుకే ఈ– ఆఫీస్ను ప్రవేశపెట్టామన్నారు. పాత రికార్డులన్నీ భద్రపరచాలని ఆదేశించారు. కార్యాలయాల ప్రాంగణాలు, రికార్డు గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని పరిశీలించి... నూతన కార్యాలయ ఏర్పాట్లపై సమీక్షించారు. మడకశిర రెవెన్యూ సబ్ డివిజన్కు సంబంధించిన రికార్డులన్నీ పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి మడకశిర కార్యాలయానికి వెంటనే తరలించాలని ఆర్డీఓను ఆదేశించారు. మ్యుటేషన్, డిజిటల్ రికార్డులను పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణను కూడా పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనందకుమార్, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి తదితరులు ఉన్నారు. -
లాటరీ ద్వారా మద్యం బార్ల ఎంపిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం షాపులకు లాటరీ తీసి ఎంపిక చేశారు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రెండు బార్లకు నాలుగు దరఖాస్తులు రాగా వాటికి లాటరీ తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ అధికారులు, బార్ లైసెన్స్ దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ ముగిసిందన్నారు. ధర్మవరం టౌన్లో ప్రకటించిన రెండు బార్లలో ఒక్కో బార్కు నాలుగు దరఖాస్తు వచ్చాయి. అందులో ఒకటి డోలా రాజారెడ్డికి , మరోటి లక్ష్మీనారాయణ దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్శాఖ అధికారి గోవిందనాయక్, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు.ఆటో నుంచి కిందపడి మహిళ మృతిపరిగి/గుడిబండ: పరిగి మండలంలోని పరిగి పెద్ద చెరువు కింద పన్నేడమ్మ గుడి సమీపంలో గొల్ల లక్ష్మమ్మ (50) అనే మహిళ ఆటోలో ప్రయాణిస్తూ నిద్ర మత్తులో జారిపడి కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఎస్ఐ రంగడుయాదవ్ వివరాలమేరకు... మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ పదేళ్ల క్రితం జరిగిన విద్యుదాఘాతంతో భర్త నారాయణప్పను కోల్పోయింది. పొలం పనులకు వెళ్లే లక్ష్మమ్మ... సీజన్ కావడంతో ప్రస్తుతం చింతపండును సేకరించి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇటీవల సేకరించిన చింతపండును సంచుల్లో నింపుకుని అమ్మడానికి గురువారం వేకువజామున తన స్వగ్రామం నుంచి ఆమెతో పాటు నారాయణప్ప అనే మరో వ్యక్తి ఆటోలో హిందూపురానికి బయలుదేరారు. ఈక్రమంలో పరిగి వద్దకు చేరుకోగానే నిద్రమత్తులో ఉన్న లక్ష్మమ్మ ఆటో నుంచి జారిపడి కింద పడిపోయింది. చికిత్స నిమిత్తం హిందూపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్రూల్స్ అమలుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఈఓలు, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయాలు, డైట్ ఉద్యోగుల వర్క్షాపు గురువారం నిర్వహించారు. స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో జరిగిన వర్క్షాపును జేడీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోక్సో కేసుల్లో త్రీమెన్ కమిటీని నియమించి మూడు నెలల్లో విచారణ నివేదిక తీసుకోవాలన్నారు. క్రమశిక్షణ చర్యల కేసులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కొన్ని కేసుల్లో సస్పెన్షన్లు చేస్తున్నా...తర్వాత వాటిని రీఓక్ చేయడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదికి మించి సస్పెన్షన్లో ఉండకూడదన్నారు. కొందరు దూరప్రాంతాల్లో పని చేస్తున్న వారు కావాలనే చిన్నచిన్న తప్పులకు సస్పెన్షన్లు చేయించుకుంటున్నారన్నారు. 3–4 ఏళ్లు సస్పెన్షన్లోనే ఉంటూ అరజీతం పొందుతున్నారన్నారు. సమావేశంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా డీఈఓలు ఎం.ప్రసాద్బాబు, కిష్టప్ప, ఏడీ మునీర్ఖాన్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అండర్ –14 రాష్ట్ర జట్టుకు రోహిత్
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 రాష్ట్ర క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఎస్ మహ్మద్ షోయబ్, జట్టులో సభ్యుడిగా కే రోహిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు చైన్నెలో జరగనున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీల్లో రోహిత్ ఆంధ్ర జట్టు సభ్యుడిగా బరిలో దిగనున్నాడు. లెఫ్టార్మ్ చైనమన్ (హిందూపురం) బౌలర్గా స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్లలో 13 వికెట్లు తీసుకున్నాడు. హిందూపురం ఎంజీఎం స్కూల్లో రోహిత్ విద్యనభ్యసిస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ షోయబ్ ఏసీఏ లెవెల్ 0 క్రికెట్ కోచ్. గుంతకల్లు రైల్వే సబ్ సెంటర్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం హర్షించదగ్గ విషయమని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్రెడ్డి పేర్కొన్నారు.జాతీయ రహదారిపై లారీ దగ్ధం కనగానపల్లి: 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక లారీ టైర్ పేలడంతో మంటలు వ్యాపించి రోడ్డుపైనే లారీ దగ్ధమైంది. పోలీసుల వివరాల మేరకు... గురువారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఖాళీ అట్ట పెట్టెల వేసుకొని వెళ్తోంది. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే లారీ ముందు టైరు పేలింది. మంటలు వ్యాపించడంతో అట్ట పెట్టెలు అంటున్నాయి. లారీడ్రైవర్లు రాజేంద్రన్, వెంకట్ లారీ ఆపేసి కిందకు దిగారు. లారీ అంతా కాలిపోయింది. ఘటనతో జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాసేపటి తర్వాత పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
ఎరలతో పురుగులకు చెక్
పుట్టపర్తి అర్బన్: వివిధ పంటలను ఆశించే పురుగులతో రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. వాటిని అరికట్టేందుకు వేలాది రూపాయలు వెచ్చించి రసాయనిక మందులు కొనుగోలు చేసి పిచికారీ చేస్తున్నారు. దాని వలన ఆశించిన ఫలితాలు రాకపోగా భూమి కలుషితమవుతోంది. దీంతో రానురాను పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులు రసాయనిక మందులపైనే ఆధార పడకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే స్థిరమైన నాణ్యమైన ఉత్పత్తులు సాధించడానికి వీలవుతుంది. ఈ చర్యల్లో భాగంగా ఎరల వినియోగం గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బయ్య చెబుతున్నారు. లింగాకర్షక ఎరలు.. పంటలపై వాలే మగ రెక్కల పురుగులను సహజంగా ఆడ రెక్కల పురుగులు ఆకర్షిస్తాయి. దీనికి గాను ఆడ రెక్కల పురుగుల తల, రెక్కలు, కాళ్లు, జననాంగాల నుంచి కొన్ని రసాయనాలు విడుదల చేస్తాయి. ఈ రసాయనాలనే కృత్రిమంగా తయారు చేసి లింగాకర్షక ఎరలుగా రూపొందిస్తున్నారు. ఈ ఎరలు ప్రధానంగా మగ రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. వాటిని పాలిథిన్ సంచుల్లో గరాటా ఆకారపు పాత్రల్లో ఉంచి పొలం మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో కర్రలు పాతి వాటి చివరన ఎరలను ఉంచుతారు. వాటి ద్వారా మగ పురుగులు వచ్చి సంచుల్లో పడి చనిపోతాయి. వాటి సంఖ్య ఆధారంగా పురుగుల ఉధృతి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. దీపపు ఎరలు.. గొంగళి పురుగుల జాతికి చెందిన రెక్కల పురుగులు, కొన్ని రకాల పెంకు పురుగులు పంటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వాటిని నాశనం చేసేందుకు తెల్లని కాంతిని విరజిమ్మే విద్యుత్ దీపాలను రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ పొలం మధ్యలో అక్కడక్కడా ఏర్పాటు చేస్తే పురుగులు కాంతికి ఆకర్షితమవుతాయి. లైట్ల కింద క్లోరోఫైరిఫాస్, కిరోసిన్ లాంటి ద్రావణాలను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, చెరువకులో పీక పురుగు, కాండం తొలిచే పురుగు, కంది, పత్తిలో కాయతొలిచే పురుగు, వేరు పురుగు దీపపు ఎరల చేత ఆకర్షింపబడతాయి. సాగు చేసే పంటను బట్టి 1 ,2 మీటర్ల ఎత్తులో దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. దీపాల వద్దకు చేరుకోగానే రెక్కల పురుగులు విషపు ద్రావణంలో పడిచనిపోతాయి. విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసుకోలేని రైతులు రాత్రిపూట సామూహికంగా మంటలు వేస్తే రెక్కల పురుగులు అందులోపడి చనిపోతాయి. ఎర పంటలు.. పురుగుల నిర్మూలనకు ఎర పంటలు కూడా బాగా దోహదపడతాయి. పత్తిలో శనగ పచ్చ పురుగు నివారణకు బెండ, పొగాకు, లద్దె పురుగు నివారణకు ఆముదం మొక్కలు అక్కడక్కడా వేసుకోవాలి. దీంతో ప్రధాన పంటలకు పురుగు తాకిడి తగ్గుతుంది. వేరుశనగకు చుట్టూ నాలుగు సాల్లు జొన్న వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఎర పంటపైనే పురుగు మందును పిచికారీ చేసి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తద్వారా రైతులకు పెట్టుబడులు కూడా తగ్గుతాయి. పసుపు రంగు ఎరలు.. దోస, కళింగర, పత్తి, వంగ వంటి పంటలను ఆశించే తెల్లదోమ నిర్మూలనకు పసుపు రంగు ఎరలు అధికంగా ఉపయోగపడతాయి. ఈ ఎరలను ఎకరాకు పది ఏర్పాటు చేస్తే మంచిది. ఈ ఎరలకు తెల్ల దోమలు వచ్చి అతుక్కొని చనిపోతాయి. ప్రస్తుతం మామిడి, దోస, కళింగర పంటలు విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ పూత దశలోనూ, పిందె దశలో ఉన్నాయి. వాటికి పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఎరల వాడకంతో మందుల ఖర్చు తగ్గుతుంది. మామిడిలో బాటిల్లో విషద్రావణంతో ఎర ఏర్పాటు చేసిన దృశ్యంఎరకు పడి చనిపోయిన దోమలు, పురుగులు వివిధ పంటలకు పురుగులు ఆశిస్తుండటంతో తగ్గుతున్న దిగుబడి ఎరల వాడకంతో ఉత్తమ ఫలితాలు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి ఉత్తమ ఫలితాలు వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు -
అరణ్యవాసా.. చెన్నకేశవా!
పుట్టపర్తి: అరణ్యాన వెలసినా... తన భక్తుల మదినే ఆవాసంగా చేసుకున్న చెన్నేకేశవ స్వామి తడకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుక్కపట్నం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ స్వామి భక్తులకు కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. శతాబ్దాల కిందట ఇక్కడ వెలసిన స్వామిని భక్తులు మల్లో చెన్నుడని, జెన్నావలప్ప అని రకరకాల పేర్లతో కొలుస్తుంటారు. ఏటా మాఘమాసంలో తరుగువాండ్లపల్లికి చెందిన తరుగు వంశీయులు ఆనవాయితీగా తడకోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ శనివారం స్వామి వారికి తడకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఇక స్వామి వెలసిన కొండ మరోభాగంలో దీపం గుండుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ గుండుపై దీపం వెలిగిస్తే సుదూరంలో ఉండే చెన్నకేశవ ఆలయంలో ఉన్నవారికి కనిపిస్తుందని ఇక్కడి వారు చెబుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆదాయం ఉన్నా దేవదాయ శాఖ అధికారులు మాత్రం ఆలయం అభివృద్ధికి గానీ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏర్పాట్లు పూర్తి.. శనివారం జరిగే తడకోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తరుగు వంశీయులు తెలిపారు. తాగునీరు, అన్నదాన ప్రసాదాలు అందించే ఏర్పాట్లు పూర్తి చేశామని, వాహనాల పార్కింగ్కు కొండపై చదును చేశామన్నారు. చండ్రాయునిపల్లి సమీపంలో వెలసిన చెన్నకేశవ స్వామి రేపు తడకోత్సవం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు -
ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు
ధర్మవరం: కరువుసీమ రైతులకు వరదాయనిగా భావించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలివేసిన చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దగ్గర ప్రజల భవిష్యత్ను తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి ఆయన ధర్మవరం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులను తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా పేర్కొనడం చూస్తే చంద్రబాబు కుట్ర రాజకీయాలు బహిర్గతమయ్యాయన్నారు. సీమ ప్రజలకు అన్యాయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను ప్రజలంతా ఎండగట్టాలన్నారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించకుండా మౌనంగా ఉండటం వల్ల రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. తాజాగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపడం ద్వారా మనకు రావాల్సిన నీటిని తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘చలో పోతిరెడ్డి పాడు’ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని భవిష్యత్లో డిమాండ్లు సాధించుకునే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గడ్డం కుళ్లాయప్ప, పెద్దిరెడ్డిగారి శ్రీనివాసులు, చెలిమి రామయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు గుర్రం శ్రీనివాస్రెడ్డి, వేముల అమర్నాథ్రెడ్డి, గజ్జల శివ, జింకా కంబగిరి, రెడ్డివారి రాజశేఖర్రెడ్డి, ఆవుల పోతిరెడ్డి, మద్దిలేటి మల్లికార్జున, కత్తె పెద్దన్న, కేశగాళ్ల కృష్ణ, చింతా భాస్కర్రెడ్డి, ఆకుల రామలింగ, అశోక్కుమార్రెడ్డి, అడ్రా నారాయణస్వామి, చంద్ర, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన స్వార్థ రాజకీయం కోసం రైతుకు అన్యాయం సీమ ప్రజల భవితను రేవంత్ దగ్గర తాకట్టుపెట్టాడు ‘చలో పోతిరెడ్డిపాడు’ ఆరంభం మాత్రమే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
పుట్టపర్తిటౌన్: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ సతీష్కుమార్, ఆర్డీఓ సువర్ణ సూచించారు. బుధవారం కొత్తచెరువు శ్రీ చైతన్య పాఠశాల మైదానంలో పాఠశాలల అధినేత డాక్టర్ బీఎస్రావ్ జ్ఞాపకార్థం జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్, ఆర్డీఓ సువర్ణతోపాటు ఏజీఎమ్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల అలవాటవుతాయన్నారు. విద్యార్థులకు ప్రత్యేకమైన లక్ష్యం ఉండాలన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, బంగారు భవిష్యత్కు బాటలు వేసుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని చైతన్య బ్రాంచ్ల నుంచి దాదాపు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాళ్లు, కోఆర్డినేటర్లు, డీన్లు, ఏఓలు, పీఈటీలు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
రోడ్డు నిర్మాణం వివాదాస్పదం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి సమీపంలో క్రషర్ల యజమానులు నిర్మిస్తున్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. గురువారం నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని క్రషర్ల యజమానులకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారంటూ రైతులు వాపోతున్నారు. బాధితులు తెలిపిన మేరకు...అనంతపురం–కదిరి రహదారి నుంచి క్రషర్ల వద్దకు వెళ్లేదారి 8 అడుగులు (బండిరస్తా) మాత్రమే ఉందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ దాదాపు 25 అడుగుల వరకు బీటీ రోడ్డు వేస్తున్నారు. క్రషర్ల యజమానులు సొంత నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. గతంలోనూ ఈ రోడ్ల మీదుగానే తాము తిరుగుతున్నామని దుమ్ముధూళితో పంటలు నష్టపోతున్నామని చెప్ప డంతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని యజమానులు చెబుతున్నారు. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ రైతులు పనులను అడ్డుకోగా. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రైతులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ వాపోయారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. 10 సెంట్ల నుంచి ఎకరా వరకు భూములు కోల్పోతున్నామని, అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి జైల్లోకి పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో రోడ్లు వేస్తున్నారన్నారు. క్రషర్ల యజమానులు మాట్లాడుతూ... ఇప్పటికే నెల రోజుల పాటు క్రషర్లు బంద్ చేశామన్నారు. రోడ్డు సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాస్తవానికి 40 అడుగుల రోడ్డు ఉందని ఇందులో తాము 30 అడుగుల్లో మాత్రం రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. సొంత నిధులతో రోడ్లు వేస్తున్నా... అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని వాపోతున్న రైతులు, రోడ్డు పనులు చేయిస్తున్న దృశ్యం -
తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ దూరం
పుట్టపర్తి అర్బన్: తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ను దూరం చేయవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం పేర్కొన్నారు. బుధవారం జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్తో పాటు దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేశామన్నారు. 3,41,441 మందిని స్క్రీనింగ్ చేయగా బీపీ 60,144 మంది, షుగర్ 43,008 మంది, నోటి క్యాన్సర్ 186 మంది, బ్రెస్ట్ క్యాన్సర్ 199 మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 162 మందిలో గుర్తించినట్లు చెప్పారు. పొగాకు వాడకం నివారించాలని, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ జయించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ సురేష్, డీపీఎంఓ డాక్టర్ నాగేంద్ర నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఎపిడెమియాలజిస్ట్ బాలాజీ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్య, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సీహెచ్ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం అనంతపురం: స్థానిక సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుభాష్రోడ్డులో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు మాట్లాడుతూ రిటైల్ ఫార్మాట్లు, విస్తృత శ్రేణి కలెక్షన్లు, మెరుగైన కస్టమర్ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. సంప్రదాయలు, వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నమ్మకం, పారదర్శకత, కస్టమర్ల నమ్మకాన్ని పెంపొందించుకుని రాయలసీమలోనే పెద్ద జ్యువెలరీ మాల్గా గుర్తింపు దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మలబార్ గోల్డ్ హెడ్ (రిటైల్ ఆపరేషన్స్,ఇండియా) సిరాజ్ పికే, జోనల్ హెడ్ (సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ) నిఖిల్ చంద్రన్, మహమద్ షరీజ్ (హైదరాబాద్ జోనల్ హెడ్), షానిబ్ (తెలంగాణ జోన్ హెడ్), హఫీజ్ మహమ్మద్ (డిప్యూటీ షోరూం హెడ్, అనంతపురం), తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు!
రొద్దం: మండల పరిధిలోని పెద్దకోడిపల్లిలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన యువకుడు లింగమయ్య కేసులో ముగ్గురు నిందితులు పోలీ సుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. గురువారం లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడి ఇంటి వద్ద మృతదేహాన్ని పూడ్చి పెడతారనే సమాచారం రావడంతో సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. లింగమయ్య అంత్యక్రియలు సాఫీగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు కదిరి టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడిని కదిరి పోలీ సులు అరెస్టు చేశారు. సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. స్థానిక రాజీవ్గాంధీ నగర్లో నివాసం ఉంటున్న పట్రా చంద్రశేఖర్ కుమారులు పట్రా శివ, పవన్ లు గత ఏడాది ఆగస్టులో అయ్యప్ప గుడి వీధికి చెందిన సాయికిషోర్ను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు యత్నించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లోనే పట్రా పవన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న పట్రా శివకుమార్ను రాబడిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి కదిరిలో అరెస్టు చేశారు. బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. గతంలో శివపై 6 కేసులు ఉండడంతో అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఎద్దు పొడిచి మహిళా రైతుకు తీవ్ర గాయాలు గుత్తి రూరల్: గుంతకల్లు మండలంలోని శంకరబండ గ్రామంలో ఎద్దు పొడిచి ఓ మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. శంకరబండ గ్రామానికి చెందిన మహిళా రైతు నారాయణమ్మ పాడితో పాటుగా వ్యవసాయ పనుల కోసం పశువులు కొనుగోలు చేసింది. రోజు మాదిరిగానే బుధవారం ఎద్దులకు మేత పెట్టేందుకు ఇంటి సమీపంలో ఉన్న వామి వద్దకు తీసుకెళ్తోంది. అయితే ఒక ఎద్దు ఒక్కసారిగా బెదురుకొని నారాయణమ్మపైకి దూసుకెళ్లి పైకి ఎత్తి పడేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఎద్దును అదుపు చేసి తీవ్రంగా గాయపడిన నారాయణమ్మను ఆటోలో చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు. ‘దుర్గం’లో దొంగల అలజడి కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు అలజడి సృష్టించారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు సంచరించిన దృశ్యాలు స్థానికంగా ఓ ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారం క్రితం రెవెన్యూ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలోనే మళ్లీ దొంగల సంచారంతో స్థానికులు హడలెత్తుతున్నారు. -
‘చలో పోతిరెడ్డిపాడు’కు తరలిరండి
కనగానపల్లి: కరువు ప్రాంత రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా గురువారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదన్నారు.గాలేరు, హంద్రీ–నీవా, తెలుగుగంగ కాలువలకు సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు అందాలంటే శ్రీశైలం డ్యాంలో 881 అడుగుల్లో నీరు ఉండాలన్నారు. కానీ 800 అడుగుల దిగువన నీరున్నా తెలంగాణ వారు పాలమూరు– రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్నారన్నారు. మనకు హక్కుగా ఉన్న నీటిని వాడుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టి, అప్పట్లోనే 50 శాతం పనులు కూడా పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం పనులను అన్యాయంగా ఆపేశారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో సాగునీటి హక్కుల కోసం రాయలసీమ రైతులంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద చేపట్టనున్న బహిరంగ సభకు రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపు -
ఏపీ సూపర్ కప్ విన్నర్స్ గోదావరి లెజెండ్స్
అనంతపురం అర్బన్: ఆర్డీటీ స్టేడియంలో బుధవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ విన్నర్గా నిలిచి ఎఫ్సీ ఏపీసూపర్ కప్ ఫుట్బాల్–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తరువాత జరిగిన పెనాలిటీ షూటౌట్లో కోరమాండల్ ఎఫ్సీపై 3–0 గోల్స్తో విజయం సాధించి టైటిల్ను కై వసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి. నిర్ణీత సమయంలోనూ, అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దృఢమైన రక్షణాత్మక ఆటతో ఇరు జట్ల డిఫెండర్లు ప్రత్యర్థులకు స్పష్టమైన గోల్ అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్ పెనాలిటీ షూటౌట్కు చేరింది. గోల్స్గా మార్చిన గోదావరి లెజెండ్స్ పెనాలిటీ షూటౌట్లో గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ఆటగాళ్లు మూడు పెనాలిటీలను గోల్స్గా మార్చారు. రాజా దేబ్నాథ్, విఘ్నేష్ వేలమురగన్, రమేశోర్ మీతే గోల్స్ సాధించారు. గోల్ కీపర్ సచిన్ ఝూ రెండు కీలక పెనాలిటీలను అడ్డుకుని జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఈ విజయంతో గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ప్రతిష్టాత్మక ఏపీ సూపర్ కప్ను గెలుచుకోవడంతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీని అందుకుంది. టోర్నమెంట్లో కోరమాండల్, కొల్లేరు, పెన్నా, గోదావరి, విశాఖ, వంశధార, నల్లమల, తుంగభద్ర జట్లు పాల్గొన్నాయి. ఎనిమిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించి నాకౌట్ దశల ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ గెలుపు గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ స్టార్ ఆటగాడు, సహ యజమాని పృథ్వికి వ్యక్తిగతంగా కూడా మైలురాయిగా మారింది. కలెక్టర్ ఆనంద్ అభిందన ఏపీ సూపర్ కప్–2026 కైవసం చేసుకున్న గోదావరి లెజెండ్స్ జట్టును కలెక్టర్ ఓ.ఆనంద్ అభినందించారు. కలెక్టర్ను ఆయన చాంబర్లో ఆటగాళ్లు పృథ్వి, షాజెబ్, రాజేష్లు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. -
ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి
రాప్తాడురూరల్: ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా పరిషత్ ఇన్చార్జ్ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. డీడీఓ నాగ శివలీలతో కలిసి బుధవారం అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్ఎస్)ను పరిశీలించారు. సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వెంకటసుబ్బయ్య సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి వర్ల శంకర్, పంచాయతీ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ శివ పాల్గొన్నారు. ఎస్డీసీ తిప్పేనాయక్ బదిలీ ● కాకినాడ డీఆర్ఓగా నియామకం అనంతపురం అర్బన్: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) డి.తిప్పేనాయక్ను కాకినాడ డీఆర్ఓగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిప్పేనాయక్ ప్రస్తుతం అనంతపురం కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) ఎస్డీసీగా ఉన్నారు. రస్తా విషయంలో ఇరువర్గాల ఘర్షణ గార్లదిన్నె: రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన మండల పరిధిలోని సంజీవపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... యర్రగుంట్ల రెవెన్యూ పొలం సర్వే నంబర్ 26/6లో సంజీవపురానికి చెందిన చితంబరయ్య కుమారులు దివ్యాంగుడు పెద్దన్న, లక్ష్మినారాయణ, శివయ్యలు 8 ఎకరాల పట్టా భూమి సాగు చేసుకుంటున్నారు. బీరప్ప కుమారులు ఎర్రిస్వామి, ఆదినారాయణకు కూడా 3 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇరువర్గాల మధ్య కొంతకాలంగా దారి విషయమై వివాదం నెలకొంది. బీరప్ప కుమారులు ఇటీవల కోర్టు నుంచి శాశ్వత ఇంజెంక్షన్ ఆర్డర్ పొందారు. బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో చితంబరయ్య భార్య కొండమ్మ స్పృహతప్పి పడిపోయింది. ఆదినారాయణ భార్య సరస్వతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి ఇరువురినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను గర్భిణి చేసిన ఆటోడ్రైవర్ గుత్తి రూరల్: ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను గర్భిణిని చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు బాలిక రోజూ ఆటోలో వస్తున్న క్రమంలో డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. శభాష్ వెంకటలక్ష్మి విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాల పదో తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటింది. తృతీయ స్థానంలో నిలిచింది. వారం క్రితం తమిళనాడులో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్రం తరఫున జట్టులో ప్రాతినిధ్యం వహించిన వెంకటలక్ష్మి అత్యంత ప్రతిభ కనబరిచి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ తులసి విద్యార్థిని అభినందించారు. పేదింట పుట్టినా ఒకవైపు చదువులతో పాటు మరోవైపు క్రీడల్లో కూడా రాణించడం గర్వకారణమన్నారు. ఆ కానిస్టేబుల్ సస్పెన్షన్ పుట్లూరు: మహిళపై అత్యాచారయత్నం చేసిన యల్లనూరు పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ మారుతికుమార్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జనవరి 30న పుట్లూరు మండలంలోని అరకటివేముల గ్రామంలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు పుట్లూరు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్పై కేసు నమోదైన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు మారుతీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక సజావుగా జరిగింది. ఎంపీపీగా హులికుంట ఎంపీటీసీ సభ్యురాలు ఎస్ఆర్ సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపీపీ–1గా గుడ్డగురికి ఎంపీటీసీ సభ్యుడు లింగరాజు, వైస్ ఎంపీపీ–2గా రొళ్ల ఎంపీటీసీ సభ్యురాలు సౌమ్య కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీలుండగా బుధవారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు దొడ్డేరి ఎంపీటీసీ సభ్యురాలు హెచ్డీ కవిత, రొళ్ల–2 ఎంపీటీసీ సభ్యుడు డీఎల్ నాగరాజు, మల్లినమడుగు ఎంపీటీసీ సభ్యురాలు రత్నమ్మ ముగ్గురు గైర్హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీ ఎన్నికలో పాల్గొన్నారు. ఎన్నిక ప్రక్రియకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రామకృష్ణయ్య వ్యవహరించారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎంపీపీ ఎన్నికను తహసీల్దార్ షేక్షావలి, ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి, మండల పరిషత్ ఏఓ ప్రసాద్, కార్యదర్శి శ్రీనాథ్, మండల పరిషత్ సిబ్బంది పర్యవేక్షించారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
రాయలసీమలో పుట్టిన చంద్రబాబు...సీమ ద్రోహిగా మారారు. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతోనే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తే.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేతులు కలిపిన చంద్రబాబు దాన్ని నిలిపివేశారు. దీనివల్ల వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఆయన్ను ఈ ప్రాంత రైతులు ఎప్పటికీ క్షమించరు. చందబ్రాబు వైఫల్యం..రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకే వైఎస్సార్ సీపీ ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలి. – ఉషశ్రీ చరణ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు -
మట్టిదొంగలు.. ‘పచ్చ’ నేతలు
పరిగి: రాష్ట్రం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతలు బరితెగించారు. సంపాదన పరమావధిగా సహజ వనరులను దోచుకు తింటున్నారు. చివరకు మట్టినీ వదలడం లేదు. బుధవారం మండలంలోని శ్రీరంగరాజుపల్లి వద్ద చెరువు సమీపంలో కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా మట్టిని తవ్వుతుండగా.. సమాచారం అందుకున్న ఎస్ఐ రంగడుయాదవ్ సిబ్బందితో కలిసి వెళ్లారు. పోలీసులను చూడగానే అక్కడున్న వారు వాహనాలు వదిలి పరారయ్యారు. దీంతో టీడీపీ నాయకులు నేతులపల్లి లోకేష్, శ్రీరంగరాజుపల్లికి చెందిన హనుమంతరాయప్పకు చెందిన రెండు జేసీబీ వాహనాలతో పాటూ మరో ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని ఎస్ఐ తెలిపారు. పోలీసుల దాడితో పరారీ.. వాహనాలు స్వాధీనం -
పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లకూడదు: జేసీ
చిలమత్తూరు: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేయనున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాల్లో కొలతలు, హద్దులు తదితర వివరాలన్నీ పక్కాగా ఉండాలని, ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని దేమకేతేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మార్చి నెలలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన పట్టాదారు డ్రాఫ్ట్ పుస్తకాలను జేసీ పరిశీలించారు. ఈ–కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతుల వేలిముద్రలు, భూమి విస్తీర్ణం తదితర వివరాలు, వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం కొడికొండలో పర్యటించి అక్కడ జరుగుతున్న రీసర్వేను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోజ్కుమార్, డీటీ జగన్నాథ్, సర్వేయర్లు కోదండపాణి , రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.‘విద్యాంజలి’తో బడులు బలోపేతంపుట్టపర్తి అర్బన్: ‘విద్యాంజలి–2.0’ కార్యక్రమం ద్వారా దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల అందించే చేయూతతో సర్కారు బడులు బలోపేతం అవుతాయని డీఈఓ కిష్టప్ప తెలిపారు. బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఓ ట్రస్ట్లో ‘విద్యాంజలి 2.0’ అమలుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు, ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని పాఠశాలలకు సహాయం చేసేలా పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలతో కార్యకమ్రాలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలల పోర్టల్లో తమ పాఠశాల పేరు రిజిష్టర్ చేయాలని, అక్కడే తమ పాఠశాలల అవసరాలను అందులో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పెనుకొండ డివిజన్ ఉప విద్యాధికారి జాన్రెడ్డెప్ప, సెక్టోరియల్ అధికారులు చంద్రశేఖర్, హరి ప్రసాద్, పుల్లన్న, రెహమాన్, ఫణి శర్మ, మాధవరెడ్డి, కోఆర్డినేటర్లు డాక్టర్ పుల్లన్న, జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.‘ఉపాధి’ పనుల పురోగతికి చర్యలు● ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షన్ముఖ్కుమార్ప్రశాంతి నిలయం: ఉపాధి హామీ పథకంలో పనుల పురోగతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పథకం రాష్ట్ర డైరెక్టర్ షన్ముఖ్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఉపాధి పనుల స్థితిగతులపై పీడీ విజయ్ప్రసాద్తో కలిసి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో 59,270 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు అధికారులు డైరెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకూ భౌతికంగా 23,288 పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఉద్యాన తోటల్లో 15,378, హౌసింగ్ పరిధిలో 1,777 పనులకు మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. వీటితో కలిపి సుమారు 40,443 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఇంకా 18,827 పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా జీరో ఎక్స్పెండేచర్ పనులు 500, డీసీసీ పనులు 5,735 మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. 20 పనుల కంటే తక్కువ చేసిన పంచాయతీలు జిల్లాలో 102 ఉన్నట్లు వివరించారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. -
సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం
రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు. తప్పు చేయలేదంటే ఖండించాలి. కిరణ్కుమార్రెడ్డి హయాంలోనూ హంద్రీ–నీవా కాలువ పనులకు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీఓను రద్దు చేయించారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఈ విధంగా పదేపదే రాయలసీమకు ద్రోహం చేయడం చంద్ర బాబుకు అలవాటుగా మారిపోయింది. – కె.సలీం మాలిక్, మానవతా సంస్థ -
ప్రజల పక్షాన పోరాడుతాం
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిని విస్మరించి ఈ ప్రాంతానికి ఉరి వేయాలన్న ఆలోచనను పాలకులు విరమించుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. రాయలసీమ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడడానికి అలుపెరుగని పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ (రఫ్) తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. – తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు -
పౌర సేవల్లో జాప్యం ఉండకూడదు
ప్రశాంతి నిలయం: మీ– సేవ కేంద్రాల ద్వారా అందించే పౌరసేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మీ–సేవ కేంద్రాల ఆపరేటర్లకు సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి ఆపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మ్యుటేషన్, కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర ముఖ్యమైన రెవెన్యూ సేవలను నిర్దిష్ట గడువులోపు ప్రజలకు అందించాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఎవరూ కూడా అదనపు రుసుము వసూలు చేయకూడదన్నారు. ప్రతి దరఖాస్తునూ రెవెన్యూ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. మీ–సేవా కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు మహేష్, శర్మ, ఆనంద తితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ను అందుబాటులోకి తేవాలి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న బ్లడ్ బ్యాంకులో సౌకర్యాలన్నీ కల్పించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పరిధిలోని పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి సమావేశానికీ డీఆర్ఎంజీఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ తప్పక హాజరు కావాలన్నారు. రక్తం లేకుండా రోగులు ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించాలని, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విస్తృతం చేయాలన్నారు. ఈ వారాన్ని టీకా వారంగా డ్రైవ్ చేపట్టి వంద శాతం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యాధికారి శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మీ–సేవా ద్వారా సర్వీసులు సకాలంలో అందించాలి మీ–సేవ ఆపరేటర్లకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం -
చిన్నారి అనుమానాస్పద మృతి
● టీకా వికటించడం వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ యల్లనూరు: వ్యాధి నిరోధక టీకా వేసిన కొన్ని గంటల తర్వాత ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. టీకా వికటించడం వల్లే ప్రాణం పోయిందంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నిట్టూరుకు చెందిన అనిత, ఓబులేసు దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో మూడో సంతానమైన మూడు నెలల కుమార్తెకు బుధవారం ఉదయం 11 గంటలకు ఏఎన్ఎం ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకా వేయించారు. అయితే సాయంత్రం చిన్నారికి జ్వరం వచ్చింది. ఈ సమయంలో తల్లి పాలు పట్టింది. అయితే చిన్నారికి నోరు, ముక్కులోంచి పాలురావడం, అపస్మారకస్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. టీకా వేయడం వల్లే ఇలా జరిగిందని భావించిన వారు హుటాహుటిన తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు వైద్యులు లోకేష్కుమార్ తాడిపత్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. నిట్టూరులో ఈ చిన్నారితో పాటు మరో ముగ్గురికి టీకాలు వేసినట్లు గుర్తించారు. టీకా గడువు కూడా ముగియలేదు. ఒకవేళ టీకా వికటించి ఉంటే మిగిలిన చిన్నారుల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. చనిపోయిన చిన్నారికి ఇంకేదైనా అనారోగ్యం ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు. అయినప్పటికీ చిన్నారి మృతిపై గ్రామంలో విచారణ కొనసాగుతోందని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీకా వికటించడం వల్లే చిన్నారి చనిపోయిందనే అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని డాక్టర్ లోకేష్కుమార్ చిన్నారి తల్లిదండ్రులతో చర్చించారు. -
రైతులను బలి చేశారు
ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేశారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి తద్వారా రాయలసీమ ద్రోహిగా నిలిచారు. సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించేందుకు పోతిరెడ్డి పాడు వద్ద గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాయలసీమ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి -
27 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
చిరుత దాడిలో 12 గొర్రెల మృతి
గుమ్మఘట్ట: మండలంలోని రంగసముద్రం గ్రామంలో గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనిల్కుమార్ తన 60 గొర్రెలను మందగా తోలాడు. అర్ధరాత్రి సమయంలో మందపై చిరుత దాడి చేసింది. 12 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృత్యువాత పడ్డాయి. రూ.2 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదరరెడ్డి, పశు వైద్యులు నవీన్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంజినేయులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రభుత్వం బాధితునికి పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బియ్యం వ్యాపారి బలవన్మరణం తాడిపత్రిటౌన్:బియ్యం వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో జరిగింది. సీఐ ఆరోహణరావు తెలిపిన మేరకు.. పట్టణంలోని మెయిన్ బజార్లో నరేంద్రకుమార్ (45), భార్య రజనీకుమారి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైఎస్సార్ సర్కిల్లో నరేంద్రకుమార్ కిరాణ స్టోర్ నడుపుతున్నాడు. 10 సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం కూడా చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం నరేంద్రకుమార్ అప్పులు చేశాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆవేదనలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో మంగళవారం కిరాణా స్టోర్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా రాయదుర్గం: ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశామని, ఒక్క బాక్సు కర్ణాటక మద్యం కూడా దిగుమతి కాకుండా చర్యలు చేపట్టామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య,ఈఎస్ రామమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్స్టేషన్ను సీఐ జయనాథ్రెడ్డితో కలిసి సందర్శించారు. స్థానిక ఎస్హెచ్ఓ (సీఐ) మహేష్కుమార్ ఆధ్వర్యంలో బార్ పాలసీపై డీసీ, ఈఎస్ అవగాహన కల్పించారు. బార్ లైసెన్స్ దరఖాస్తు విధానాలు, అర్హతలు, రుసుం, స్లాబు వివరాలు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డీసీ, ఈఎస్లు సిబ్బంది సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ కేసులపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సీఐ ఉత్తమ అవార్డులకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. చింతచెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి పెద్దవడుగూరు: చింతచెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధి లోని విరుపాపురం గ్రామంలో జరిగింది. ఎస్ఐ ఆంజినేయులు తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన శ్రీనివాసులు (46)కు భార్య పుష్పలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసులు చింతకాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పెద్దవడు గూరు మండలంలోని విరుపాపురం సమీపంలో చింత చెట్లు కొనుగోలు చేశాడు. మంగళవారం చెట్లు ఎక్కి చింతకాయలు కోస్తుండగా అదుపుతప్పి కిందకు జారిపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికుల సాయంతో భార్య గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొండుపల్లి గనిలో ప్రమాదం ● ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు పెద్దవడుగూరు: మండల పరిధిలోని కొండుపల్లి గనిలో ప్రమాదం చోటు చేసుకొంది. ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున కొండుపల్లి గనిలో డోలమైట్, బలపం రాయిని వెలికి తీసేందుకు కొండుపల్లికి చెందిన గొల్ల నరేష్, బోయ అనిల్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బలపం రాళ్లు మీద పడడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని తోటి కార్మికులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. -
సీఎం, డిప్యూటీ సీఎంలపై చర్యలు తీసుకోండి
పుట్టపర్తి: ‘కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం తగదు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల విచారణలో నెయ్యి కల్తీ కాలేదని తేల్చినా దుష్ప్రచారానికి తెగబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం మడకశిరలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి అర్బన్ అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లి ఎస్ఐ లావణ్యకు, కదిరిలో వైఎస్సార్సీపీ నాయకులు పట్టణ పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసుస్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ఎన్పీకుంట: వైద్య సిబ్బంది తమకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వర్తించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ సురేష్బాబు సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. అంగన్ వాడీ కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను గుర్తించి వారు మెరుగైన స్థితికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిల్వ ఉంచిన టీకాలను పరిశీలించారు. ఓపీ, రికార్డులను తనిఖీ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బాలాజినాయక్, సీహెచ్ఓలు, వన్నప్ప, నాగలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ మహేశ్వరరెడ్డి, ఆరోగ్యకార్యకర్తలు రమేష్రెడ్డి, ఆదినారాయణ, ఫార్మసిస్ట్ ప్రకాష్, ఏఎన్ఎమ్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించాలి గాండ్లపెంట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందేలా ఆరోగ్యసిబ్బంది పని చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్బాబు అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. టీకాల రికార్డులు, టీకాలు నిల్వ ఉంచిన గదులను పరిశీలించారు. వైద్యాధికారి మహేశ్వరమారుతి, సామాజిక ఆరోగ్య అధికారి నాగేష్, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి క్రమ శిక్షణ అవసరం
పుట్టపర్తి టౌన్: పోలీస్శాఖలో అంకితా భావంతో విధులు నిర్వర్థించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. పుట్టపర్తి పోలీస్ కార్యాలయం సమీపంలో పరేడ్ మైదానంలో మంగళవారం ఏఆర్ డీ మొబలైజేషన్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీష్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను పరిశీలించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఏఆర్ సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం, దేహదారుడ్యం మెరుగుపర్చుకునేందుకు 15 రోజుల డీ మొబలైజేషన్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి అన్ని విభాగాల నుంచి 87 శాతం మంది హాజరుకావడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలను తెలుసుకోవచ్చన్నారు. విధుల్లో తప్పులు చేస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ప్రతి మూడో శనివారం ఏఆర్ సిబ్బంది సమస్యలపై తనను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు వలి, మేహేష్, రవికుమార్, ఆర్ఎస్ఐలు ప్రదీప్సింగ్, వెంకటేశ్వర్లు, ప్రసాద ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సతీష్కుమార్ -
సందర్భం:
హిందూపురం టౌన్: ప్రస్తుతం సమాజాన్ని క్యాన్సర్ భూతం పట్టిపీడిస్తోంది. గతంతో పోల్చితే క్యాన్సర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గ్రామాల్లో అవగాహన లేక గతంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేవారుకాదు. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేయించుకోవాలనే ఆలోచన వస్తోంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పెరగడం వల్ల వ్యాధి ఎంతమందికి ఉందో తెలుస్తోంది. భయం వద్దు.. చాలా మంది క్యాన్సర్ అనగానే ఇక అంతేనంటూ భయాందోళన చెందుతారు. అయితే ప్రాణాంతకమైన క్యాన్సర్ను కూడా ఆత్మవిశ్వాసంతో జయించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో దానిని గుర్తించి చికిత్స పొందడం ద్వారా మరణాన్ని జయించవచ్చని, ఇప్పటికే ఎంతో మంది ఈ తరహా చికిత్స తీసుకుంటూ బతికి బయటపడ్డారని వివరిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంటున్నారు. వీటిని దూరం పెట్టాల్సిందే.. ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్, డీలక్స్, పొగాకు వంటివి తినడం, పొగ తాగడం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ వీటి వల్లే వస్తుంది. రొమ్ము క్యాన్సర్ జన్యుపరమైన కారణాలతో వస్తుంది. బయట ఫుడ్స్ తినడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, గడ్డలు ఏర్పడటం, రొమ్ము వద్ద చనుమొనలో ద్రవం కారడం, చర్మంలో మార్పు, పురీషనాళంలో నొప్పి, నిరంతర దగ్గు, కఫంలో రక్తం పడటం, ఛాతినొప్పి, భరించలేని తలనొప్పి,వికారం, వాంతులు, అవయవాల్లో బలహీనత వంటివి క్యాన్సర్ లక్షణాలు. చిన్న పరిమాణపు క్యాన్సర్ లేదా ప్రాథమిక దశల్లో ఉన్న వాటికి చికిత్స చేయడం సులభం. కారణాలు క్యాన్సర్ వ్యాధి రావడానికి 4 శాతం జన్యుపరంగా, 6 శాతం తీసుకునే నీరు, ఆహారం, 15 శాతం స్థూలకాయం, 40 శాతం పొగాకు, 10 శాతం ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి. మిగిలిన 25 శాతం క్యాన్సర్లకు సరైన కారణాలు లేవు. నాలుగు దశలు క్యాన్సర్లో నాలుగు దశలు ఉన్నాయి. మొదటి దశలో క్యాన్సర్ కణాల్ని స్క్రీనింగ్ ద్వారా గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు. ఇలా చేయడం ద్వారా 95 నుంచి 100 శాతం వరకు వ్యాధి నయం చేయవచ్చు. రెండో దశలో క్యాన్సర్ కణాలు ఒక భాగం నుంచి ఇతర భాగాలకు కొంచెం, కొంచెంగా విస్తరించడం ప్రారంభమవుతుంది. వాటికి రేడియోథెరఫీ అందిస్తే 70 నుంచి 80 శాతం వరకు పూర్తి స్థాయిలో నయమవుతుంది. ఇక మూడో దశలో క్యాన్సర్ ఇతర భాగాలకు పూర్తిగా విస్తరిస్తుంది. రేడియోథెరపీ, కీమోథెరపీ ఇస్తే 50 నుంచి 60 శాతం మందికి తగ్గుముఖం పడుతుంది. ఇక చివరి దశలో క్యాన్సర్ కీలకమైన అవయవాలకు సోకుతుంది. ఇలాంటి వారికి చికిత్స అందించినా ఆశించిన ఫలితం ఉండదు. కేవలం 5 నుంచి 10 శాతం మంది మాత్రమే బతికే అవకాశాలుంటాయి. క్యాన్సర్లో రకాలు క్యాన్సర్లో పలు రకాలు ఉన్నాయి. మహిళల్లో సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం ఉంటుంది. పురుషుల్లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ను పలు పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఎఫ్ఎన్ఎసీ, పాప్సిమీర్, బయాప్సీ పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. జిల్లాలో పెరుగుతున్న బాధితులు సకాలంలో గుర్తిస్తే మేలు అలసత్వం వీడాలంటున్న వైద్య నిపుణులు నేడు వరల్డ్ క్యాన్సర్ డే సంకేతాలిలా.. మలమూత్ర విసర్జనలో మార్పులు దీర్ఘకాలం మానని పుండ్లు, అసహజ రక్తస్రావం గొంతు బొంగురుపోవడం నొప్పి లేకుండా పెరుగుతున్న కణితులు, శరీరంలో ఎక్కడైనా ముద్దలు తీవ్రమైన అలసట, బలహీనత పుట్టుమచ్చల్లో సహజ మార్పులు -
యువకుడి దారుణ హత్య
రొద్దం: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దకోడిపల్లికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న ఒక్కగానొక్క కుమారుడు లింగమయ్య (24). ఏడాది క్రితం తండ్రి పోతన్న మృతి చెందడంతో లింగమయ్య రోజూ దానిమ్మ కాయల ప్యాకింగ్కు వెళ్తూ తల్లి మల్లికమ్మను పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు మిత్రులతో కలిసి గ్రామ శివారు ప్రాంతానికి మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. స్నేహితులు కత్తితో మెడపై విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. గంజాయి బ్యాచ్ లింగమయ్యను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజూ గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులతో వాపోయారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐ రాఘవన్, ఎస్ఐ వీరాంజినేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులతో విచారణ చేపట్టారు. ఓ నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ పనేనని గ్రామస్తుల ఆరోపణ -
నేత్రదానంతో ఇద్దరికి వెలుగు
ధర్మవరం అర్బన్: నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపును అందించవచ్చని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ధర్మవరం పట్టణంలోని పీఆర్టీవీధికి చెందిన అంబాభవాని ఆలయం మాజీ అధ్యక్షుడు సఫారు లక్ష్మణరావు(78) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర మృతుని కంటి కార్నియాను సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య జయలక్ష్మి, కుమారుడు శివరాంమూర్తి, కుమార్తె భారతి, కోడలు చైతన్య, కుటుంబ సభ్యులు , విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం అధ్యక్షుడు గాజుల సురేష్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శి జుజారు రఘు, సభ్యులు ధనుంజయ, వెంకటేష్, కేశవరెడ్డి పాల్గొన్నారు. -
త్వరలోనే రావొచ్చు
మామిడి రైతులకు సంబంధించిన బీమా కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతోంది. పరిహారం త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సాగు, నష్టం , రైతుల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపాం. జిల్లాలో 2,353 మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లించిన మాట వాస్తవమే. ఇన్సూరెన్స్ మొత్తాన్ని బీమా కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిహారం చెల్లిస్తాయి. – చంద్రశేఖర్, ఉద్యానశాఖ జిల్లా అధికారి -
బైకుల సీజ్.. తల్లిదండ్రులపై చర్యలు
రాప్తాడురూరల్: షర్ట్ విప్పి విన్యాసాలు చేసుకుంటూ రోడ్డుపై బైకు నడిపిన బాలురకు రాప్తాడు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారు నడిపిన బైకులను సీజ్ చేశారు. వివరాలను రాప్తాడు సీఐ శ్రీహర్ష మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం రాణినగర్కు చెందిన బాలురు ఈనెల 1న బుక్కరాయసముద్రంలో జరిగిన తేరుకు వెళ్లారు. అక్కడి నుంచి మూడు బైకుల్లో రాప్తాడు సమీపంలోని అయ్యవారిపల్లి వంక వద్దకు ఈతకు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై విన్యాసాలు చేసుకుంటూ వెళ్లారు. ఓ బాలుడు అత్యుత్సాహంతో షర్ట్ను విప్పేసి బైకు నడిపాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి... ‘గంజాయి బ్యాచ్ హల్చల్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో ఎస్పీ జగదీష్ స్పందించి రాప్తాడు పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సాంకేతికత ఆధారంగా బాలురు, వారి తల్లిదండ్రులను గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చారు. మైనర్లు నడిపిన బైకులను సీజ్ చేశారు. బైకుల రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులపై ఎంవీఐ యాక్ట్ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదని, సదరు వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి నోటీసు జారీ చేస్తామన్నారు. -
కూలీని మింగిన ఇసుక మేట
హిందూపురం: ఇసుక మేట మీద పడి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని అప్పలకుంట వద్ద జరిగింది. హిందూపురం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని మేళాపురానికి చెందిన రామమూర్తి (70) కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మంగళవారం అప్పలకుంట గ్రామ సమీపంలోని పెన్నానది వద్ద ఇసుక తవ్వి ట్రాక్టర్లో నింపే పనులకు వెళ్లాడు. ఇసుక తవ్వుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇసుక మేట కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇసుకలో కూరుకుపోయిన రామమూర్తి ఊపిరాడక మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్యాలను సాధించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇండికేటర్స్ను ప్రతి నెలా 5వ తేదీ లోపు స్వర్ణాంధ్ర పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఇండికేటర్స్ వారీగా లక్ష్యాలను సాధించాలన్నారు. బీ గ్రేడ్, సీ గ్రేడ్లో ఉన్న జిల్లా శాఖ అధికారులను వారికి సంబంధించిన శాఖలను మెరుగైన గ్రేడ్ సాధించేందుకు వీలుగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, సీపీఓ విజయ్కుమార్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 108 మంది గైర్హాజరు పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 32 కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాకికల్స్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షలకు 108 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ మీడియట్ విద్యాశాఖాధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జనరల్లో 2035 మంది విద్యార్థులకు 1976 మంది, ఒకేషనల్లో 1453 మందికి 1413 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమం, భద్రత, చేయూతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న డీఎస్పీ కార్యాలయంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, రిసెప్సన్ కౌంటర్ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి లాయర్, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పోలీస్ మహిళా ప్రతినిధులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొదటగా కదిరిలో ప్రారంభించామని 27 ఫిర్యాదులు రాగా 16 పరిష్కారమైనట్లు చెప్పారు. ఇందులో భాగంగా పుట్టపర్తిలో ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. డీఎస్పీ విజయకుమార్, సీఐలు శ్రీనివాసులు, సురేష్, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేతనాల పెంపు ఇంకెప్పుడు? పుట్టపర్తి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్లో అంగన్వాడీల వేతనాల పెంపు, స్కీం నిర్వహణకు సరిపోని విధంగా బడ్జెట్ కేటాయించడం దుర్మార్గమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం బుక్కపట్నం మండల కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ నాయకులతో కలిసి బడ్జెట్ కాపీలను తగులబెట్టారు. ఓబిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దేశ వ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లతో సహా కోటి మంది స్కీం వర్కర్ల హక్కులను కాలరాసిందన్నారు. ఎంతో కాలంగా వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. మౌలిక సదుపాయాలకు సైతం ఈ బడ్జెట్ సరిపోదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి నాగమణి, జ్యోతి, పద్మ, శ్యామల, గంగ, సౌమ్య, నాగరత్న, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన గ్రూప్–1 విజేత
ప్రశాంతినిలయం/పుట్టపర్తి టౌన్: లేపాక్షి గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి సురేష్ గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన పుట్టపర్తిలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు పూల మొక్క అందజేసి శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రామప్ప, సురేష్ గురువులు ప్రసాద్, రమణారెడ్డి, సూపరింటెండెంట్ రమణ, పూర్వ అధ్యక్షుడు రామాంజి తదితరులు పాల్గొన్నారు. వంద అరటి చెట్లు నరికివేత● రూ.లక్ష వరకు పంట నష్టం కనగానపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు వంద అరటి చెట్లను నరికివేసిన ఘటన కనగానపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేర కు.. కనగానపల్లికి చెందిన రైతు సత్యనారాయణ రెండు ఎకరాల పొలంలో 3 వేల అరటి మొక్కలు నాటాడు. ప్రస్తుతం అరటి గెలలు కోత దశలో ఉన్నాయి. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి వంద చెట్లను నరికివేశారు. దీంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపాడు. దీనిపై మంగళ వారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రిజ్వాన్ కేసు నమోదు చేశారు. పొలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మామపై అల్లుడి దాడి పరిగి: కోనాపురం గ్రామంలో మామపై అల్లుడు దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగడు యాదవ్ తెలిపిన వివరాలు... ఒడిషా రాష్ట్రం గంజామ్ జిల్లా బరంపుర గ్రామానికి చెందిన సనాతన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 30 ఏళ్ల క్రితం పరిగి మండలానికి వలస వచ్చాడు. మోదా పంచాయతీ పరిధిలోని కోనాపురంలో నివాసముంటున్న సనాతన్కు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ వస్తోంది. తాగుడుకు బానిసైన ఇతని అల్లుడు ప్రశాంత్ డబ్బుల కోసం తరచూ సనాతన్తో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం యథావిధిగా డబ్బులడిగాడు. ఇవ్వకపోవడంతో కొడవలితో సనాతన్పై దాడి చేయగా అతడి చేయి, తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సనాతన్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వెంటనే పరిహారం చెల్లించాలి
మామిడి రైతులు చెల్లించిన ప్రీమియానికి వెంటనే పరిహారం చెల్లించాలి. గత ఏడాది మామిడి రైతులు వివిధ కారణాలతో పంటను కోల్పోయారు. ఈ విషయంపై గతంలోనే కలెక్టర్కు గ్రీవెన్స్లో రైతులు అంతా కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏడాది గడిచినా పరిహారంపై ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. చిత్తూరు రైతులను ఒకలా, ఇతర జిల్లాల రైతులను ఒకలా చూసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం సిగ్గుచేటు. తోతాపురి కాయల కొనుగోలులో వ్యత్యాసం చూపి మామిడి రైతులను నట్టేట ముంచారు. – ఆవుటాల రమణారెడ్డి, అగ్రిబోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు -
సేవాలాల్ ఆశయాలు కొనసాగిద్దాం
పుట్టపర్తి టౌన్: సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామని కలెక్టర శ్యాంప్రసాద్, ఆల్ ఇండియా బంజార భక్త సేవా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో మంగళవారం ఆల్ ఇండియా బంజార భక్త సేవా సంఘం (ఏబీబీఎస్ఎస్) ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్, సత్యసాయిబాబా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి సేవాలాల్ మహారాజ్ రథయాత్రను ప్రారంభించారు. బంజారా సాంప్రదాయ నృత్యాలు, డప్పులు, గిరిజన పాటలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ బంజార మహిళలతో కలసి నృత్యం చేశారు. సేవాఘడ్ ట్రస్ట్ అధ్యక్షుడు మహారాజ్స్వామి, జనరల్ సెక్రటరీ అశ్వర్థనాయక్, డంగావత్ రమేష్నాయక్, అఖిల భారత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీనాయక్, గిరిజన ప్రజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జుననాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సొంత వైద్యం.. మొదటికే మోసం
సాక్షి, పుట్టపర్తి: ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్లో పరిశోధించి మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకీ పెరిగిపోతోంది. అందులోనూ ఎక్కువగా పారాసిటమాల్ మాత్రను కొనుగోలు చేస్తున్నారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, జలుబు ఏది సోకినా.. డాక్టర్ను సంప్రదించకుండానే ఆ మాత్రను మింగేయడం అలవాటుగా మార్చుకున్నారు. డాక్టర్ ఇచ్చిన మందుల గురించి కూడా గూగుల్లో వెతికి వాటి ద్వారా వచ్చే దుష్ఫలితాలను తెలుసుకుని వాడకుండా పడేస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అతి తెలివితో ప్రమాదం పల్లె ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని వారు ఏ చిన్న అనారోగ్యం వచ్చిన డాక్టర్ను సంప్రదిస్తున్నారు. అయితే విద్యావంతులు, ఉద్యోగులు ఆస్పత్రులకు వెళ్లలేక స్మార్ట్ఫోన్ ద్వారా గూగుల్లో పరిశోధించి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నారు. అలాంటి మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలిక రోగాలకు దారి తీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది కిడ్నీ బాధితుల్లో అతిగా మాత్రల వినియోగంతోనే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. విచ్చలవిడిగా విక్రయాలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందులు విక్రయిస్తున్నారు. మొబైల్లో చూపించినా, వాట్సాప్ ద్వారా డాక్టర్ను సంప్రదించినట్లు తెలిపినా మందులిస్తున్నారు.డాక్టర్ను సంప్రదించకుండా వెళ్లే వారిని మెడికల్ షాపుల నిర్వాహకులు కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారం పోగొట్టుకోలేక విక్రయాలు చేస్తున్నారు. డాక్టర్లను సంప్రదించకుండానే మందుల వినియోగం మెడికల్ స్టోర్లలోనూ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు కొత్త రోగాలను ‘కొని’ తెచ్చుకుంటోన్న బాధితులు పుట్టపర్తికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం జలుబు చేసింది. ఈ క్రమంలో గూగుల్లో మాత్రల కోసం వెతికి స్థానికంగా ఉండే ఓ మెడికల్ స్టోర్లో రెండు, మూడు రకాల మాత్రలు తీసుకుని మింగాడు. జలుబుతో పాటు దగ్గు, జ్వరం ఎక్కువైంది. మాట్లాడేందుకు కూడా కాలేదు. వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాడు. మోతాదుకు మించి మందులు తీసుకోవడంతోనే సమస్య తలెత్తినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అయినట్లు బాధితుడు తెలిపాడు. ధర్మవరానికి చెందిన ఓ 55 ఏళ్ల మహిళకు జనవరి రెండో వారంలో జ్వరం సోకింది. వెంటనే తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మందుల ఫొటోలు తెప్పించుకుంది. అనంతరం స్థానికంగా ఓ మెడికల్ షాపులో వాటిని తెచ్చుకుని మింగింది. మరుసటి రోజున ఉదయం నుంచి వాంతులు కావడంతో పాటు నీరసం వచ్చి స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పలు పరీక్షలు చేసిన తర్వాత రోగానికి సంబంధం లేని మాత్రలు మింగడంతో సమస్య తలెత్తిందని తేల్చాడు. అప్పటికే సుమారు రూ.5 వేల వరకు ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరే కాదు.. జిల్లాలో చాలామంది ఇటీవల సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. వైద్యులను సంప్రదించాలి జబ్బు చేసినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. గూగుల్లో పరిశోధించి కొనే మాత్రలతో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ వద్దకు వెళ్తే రోగ తీవ్రత ఆధారంగా మాత్రల మోతాదు ఇస్తారు. అతి తెలివి ప్రదర్శించి లేని పోని రోగాల బారిన పడొద్దు. జబ్బు ముదిరి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. గూగుల్లో దొరికే సమాచారమంతా కచ్చితమైనది కాదు. – డాక్టర్ ఫైరోజబేగం, డీఎంహెచ్ఓ -
బాలికను గర్భిణి చేసిన కామాంధుడి అరెస్టు
కదిరి టౌన్: బాలికను గర్భిణిని చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కదిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నాగేంద్ర వివరాలు వెల్లడించారు. వివరాలు.. ఎన్పీ కుంట మండలంలోని ఓ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. బాలికపై కన్నేసిన కుంచెపు మహేంద్ర ఆమైపె పలుమార్లు లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే బాధితురాలిని నిందితుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఒక ప్రయివేట్ నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లి ఇంజెక్షన్ వేయించగా, అదే రోజు గర్భస్రావం జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం గాండ్లపెంట మండలం రెక్కమాను సమీపంలోని కురుమామిడి ఆర్డీటీ ఆస్పత్రి ఎదుట మహేంద్రను అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్ఫోన్, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడిని కదిరి కోర్టులో ఎదుట హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు క్రిష్ణమూర్తి, సుమతి పాల్గొన్నారు. -
2 వేల అరటి చెట్లు దగ్ధం
యల్లనూరు: అగ్నిప్రమాదంలో 2 వేల అరటి చెట్లు దగ్ధమైన ఘటన యల్లనూరు సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రైతులు మహబూబ్బాషా, రఫీలు యల్లనూరు సమీపంలో పదెకరాల్లో 15 వేల అరటి మొక్కలను సాగు చేస్తున్నారు. పొలం పక్కనే బీడు భూమి ఉంది. అందులో పెరిగిన గడ్డికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు పక్కనే ఉన్న అరటి తోటకు వ్యాపించి 2 వేల అరటి చెట్లు దగ్ధమయ్యాయి. నాలుగు మోటర్లు, ట్రాక్టరు డ్రిప్ పైపులు, 70 పీవీసీ పైపులు కూడా కాలిపోవడంతో రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. రెండో కోతకు గెలలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని వైఎస్సార్టీఏ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో డీఈఓ కిష్టప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీహెచ్ఓను పాఠశాల మొత్తానికి ఇవ్వాలని, ఎస్ఎస్సీ డ్యూటీ నుంచి దివ్యాంగులు, 55 సంవత్సరాలు పైబడినవారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులకు సీఎల్ వినియోగించుకొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నాడు–నేడు రెండో విడత, ఎస్ఎస్సీ వంద రోజుల ప్రణాళికలో సెలవు దినాల్లో పనిచేసిన వారికి సీసీఎన్ మంజూరు చేయాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రతాప్రెడ్డి, రామ్మోహన్, మహమ్మద్, అలీ, తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంట్లో చోరీఎన్పీకుంట: మండల పరిధిలోని ఆసంవారిపల్లికి చెందిన సిద్ధా హరీష్నాయుడు ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని శివాలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో హరీష్నాయుడు పాల్గొన్నాడు. భార్య కూడా వెంట రావడంతో ఇంటికి తాళం వేసుకొని వెళ్లాడు. ఆలయంలో పూజల అనంతరం తిరిగి ఇంటికి రాగా తలుపులు తెరచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 31 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ కిషోర్రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని సోమవారం క్లూస్ టీం పరిశీలించి, వేలి ముద్రలు సేకరించింది. యువకుడి మృతదేహం లభ్యంపెనుకొండ (సోమందేపల్లి): సోమందేపల్లి మండలం నక్కల గుట్ట వద్ద హంద్రీ–నీవా లిఫ్టు పంపు హౌస్లో గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ పట్టణంలోని నారాయణమ్మ కాలనీకి చెందిన మహేష్కుమార్ (26) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం హంద్రీ–నీవా లిఫ్టు పంపు హౌస్ వద్దకు ఈత కోసం వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. అక్కడున్న కొందరు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి కావడంతో ప్రయత్నాలు విరమించుకున్న పోలీసులు సోమవారం పెనుకొండ అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం యువకుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుని సోదరుడు శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెచ్చిపోయిన దొంగలు● 11 మంది రైతుల పొలాల్లో కేబుల్ వైరు చోరీ అగళి: దొంగలు రెచ్చిపోయారు. 11 మంది రైతుల పొలాల్లో కేబుల్ వైరు చోరీ చేశారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని మధూడి గ్రామంలో సర్పంచ్ శివకుమార్, దేవరాజు, రంగనాథప్ప, గిరీష్, సత్యనారాయణ, రవిశంకర్, గోవిందప్ప, తదితర 11 మంది రైతుల పొలాల్లో దాదాపు 480 మీటర్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించింది: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల
శింగనమల(నార్పల): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. నార్పల మండలం బండ్లపల్లిలో సోమవారం ఆమె ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కరువు ప్రాంతం కావడంతో ఈ పథకాన్ని ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఈ పథకం ఉపాధి కూలీల జీవితాల్లో వెలుగులు తెచ్చిందన్నారు. అలాంటి పథకానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేరు మార్చడంతో పాటు నిర్వీర్యం చేస్తోందన్నారు. 40 శాతం నిధులు రాష్ట్రాలే భరించాలని పేర్కొనడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి,రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు దాదాగాంధీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, శింగనమల కాంగ్రెస్ ఇన్చార్జ్ సాకే శంకర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రిపై కుమారుడి దాడి పెద్దవడుగూరు: మండల పరిధిలోని జి.వెంకటాంపల్లిలో సోమవారం తండ్రి శ్రీనివాసులుపై అతని కుమారుడు సాయి కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆస్తి తన పేరిట రాయాలంటూ కొన్ని రోజులుగా కుమారుడు సాయి తన తండ్రి శ్రీనివాసులుపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం సాయంత్రం తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆక్రోశంతో సాయి తన తండ్రి శ్రీనివాసులు తలపై కట్టెతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు పెద్దవడుగూరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఆంజినేయులు తెలిపారు. మరణించి.. మరో ఇద్దరికి చూపువజ్రకరూరు: ఆమె మరణించినా మరో ఇద్దరికి చూపు ప్రసాదించింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు గ్రామానికి చెందిన ఎం.భాగ్యలక్ష్మిదేవి (70) రెండు రోజుల క్రితం ఇంట్లో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. ఈ క్రమంలో మృతురాలు భాగ్యలక్ష్మిదేవి నేత్రాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆస్పత్రి ప్రతినిధి సమాచారం మేరకు ఐ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర అక్కడికి చేరుకుని నేత్రాలను సేకరించారు. తమ తల్లి చివరి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుమారులు ఎం. రమేష్, ఎం.విశ్వ నాథ్, కుమార్తెలు శ్రీదేవి, విజయలక్ష్మి, ఉషారాణి తెలిపారు. -
కోళ్లఫాం షెడ్డులో అగ్ని ప్రమాదం
వజ్రకరూరు: కోళ్లఫాం షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగి రూ.15 లక్షల నష్టం వాటిల్లిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరుకు చెందిన రైతు గోపి జయరామిరెడ్డి తన వ్యవసాయం పొలంలో కోళ్లఫాం షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల షెడ్డులో వేరుశనగ, కంది, పప్పుశనగ పొట్టుతో పాటు వరిగడ్డి నిల్వ చేశాడు. దీంతోపాటు సొప్పు కటింగ్ మిషన్, ఇతర వ్యవసాయ పనిముట్లు, పెంకులు, తీర్లు ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున షెడ్డులో మంటలు ఎగిసిపడుతుండడం గమనించిన స్థానికులు వెంటనే రైతు గోపి జయరామిరెడ్డికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న గోపిజయరామిరెడ్డి, కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే షెడ్డులోని గడ్డితో పాటు వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, ఏఎస్ఐ రమేష్, వీఆర్ఓ మారెన్న తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలిబూడిదైన వేరుశనగ పొట్టు, వ్యవసాయ పనిముట్లు రూ. 15 లక్షల నష్టం -
శవంపై శవం.. ఎన్నాళ్లిలా?
బత్తలపల్లి:‘నివాసముండేందుకు ఎలాగూ స్థలాలు ఇవ్వలేకపోతున్నారు. కనీసం చనిపోయాకనైనా శవం పూడ్చేందుకు ఆరడుగుల స్థలం కేటాయించండయ్యా’ అంటూ అధికారులను బత్తలపల్లి వాసులు వేడుకుంటున్నారు. బత్తలపల్లి శ్మశాన వాటికలో మృతదేహాలను పూడ్చేందుకు ఆరడుగుల స్థలం లేక కాలనీవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో ఎక్కడ తవ్వినా ఒకటి, రెండు పుర్రెలు, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. గ్రామం ఏర్పడినప్పుడు 1.47 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిక ఉండేది. రానురాను ఆక్రమణలకు గురి కావడంతో శ్మశాన వాటిక కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఎకరా విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైంది. రోడ్డు విస్తరణ జరిగితే అది కూడా ఉండదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా బత్తలపల్లిలో దాదాపు 25వేల మంది జనాభా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో కొంత సమాధులతో నిండిపోగా మిగిలిన కొద్దిపాటి స్థలంలో ఖననం చేయాల్సి వస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చట్టపరంగా కనీసం మూడు ఎకరాల స్థలం శ్మశాన వాటికకు కేటాయించాల్సి ఉంది. ఈ అంశంపై పాలకుల వద్ద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఎవరైనా మృతి చెందితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. ఇతర ప్రాంతాల్లో ఖననాలు శ్మశాన వాటికకు స్థలం కేటాయింపుపై గతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానికులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అలాగే ధర్మవరం ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ను కలిసివినతి పత్రం అందజేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్కూ వినతి పత్రం అందజేశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీలు తప్ప ఇప్పటి వరకూ ఆచరణలో కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక శ్మశాన వాటికలో మృతదేహాలను పాతి పెట్టేందుకు స్థలం లేక చాలా మంది తమ స్వగ్రామాలకో, అనంతపురంలోనూ ఖననం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఊరికి దూరంగా మూడు ఎకరాల్లో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరడుగుల స్థలం లేక అష్టకష్టాలు కుంచించుకుపోయిన శ్మశాన వాటిక అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం స్థలం కేటాయించాలంటున్న గ్రామస్తులు -
చెట్టును ఢీకొన్న టాటా ఏస్
మడకశిరరూరల్: మండలంలోని యూ రంగాపురం వద్ద జాతీయ రహదారిలో సోమవారం ఓ టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం వాహనంలో లోడ్ వేసుకుని బెంగళూరు వెళ్లిన పావగడకు చెందిన శివ, దుర్గాప్రసాద్లు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో యూ రంగాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతినగా, అందులో శివ, దుర్గాప్రసాద్ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరినీ బయటకు తీశారు. శివకు కుడికాలు, దుర్గాప్రసాద్కు ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే వారిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మొరుగైన చికిత్సల కోసం హిందూపురం తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలు -
హెల్మెట్ లేదా?..పెట్రోల్ వేయం!
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు నిబంధన విధించారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారుల శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరి చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ వేయవద్దని బంకుల నిర్వాహకులకు సూచించారు. ఈ క్రమంలో సోమవారం అనంతపురంలోని పలు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేని వారికి ఇంధనం వేయలేదు. అలాగే పోలీసులు పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టి హెల్మెట్ లేని వారికి జరిమానా విధించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
కనికరించండి.. న్యాయం చేయండి
పుట్టపర్తి టౌన్: ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. మీరైనా కనికరించి న్యాయం చేయండి’ అంటూ బాధితులు ఎస్పీ సతీష్ కుమార్ను వేడుకున్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి మొత్తం 130 వినతులు అందాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ సతీష్ కుమార్ అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి మాట్లాడారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఇందిర, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సీఐ లక్ష్మికాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని... ● భర్త తనను మోసం చేసి వెళ్లిపోయాడని నేలకోట తాండాకు చెందిన సరస్వతీబాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. బత్తలపల్లి పశువైద్యశాలలో కాంపౌండర్గా పనిచేస్తున్న గోరంట్ల మండలం పాలసముద్రంకు చెందిన సురేష్ నాయక్, తాను ఒకరినొకరం ప్రేమించుకుని గత ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకున్నామన్నారు. కొన్ని రోజులు కాపురం చేసిన సురేష్నాయక్ ఉన్నట్లుండి వదిలి వెళ్లిపోయాడన్నారు. దీనిపై ధర్మవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు.భర్త కావాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్పీ ధర్మవరం డీఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. సురేష్నాయక్ను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ చేసి సరస్వతికి న్యాయం చేయాలని ఆదేశించారు. ●తనను అత్తమామలు వేధిస్తున్నారంటూ రొద్దం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జ్యోతి తిరుమల అనే మహిళ ఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో జీర్ణించుకోలేక అత్తమామతో పాటు తన భర్త సోదరుడు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కులం పేరుతో దూషిస్తూ ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ బలవంతం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. మడకశిర పోలీసుస్టేషన్ అధికారులకు ఎస్పీ ఫోన్ చేసి తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. -
‘కల్తీ’ ప్రచారకులపై చర్యలు తీసుకోండి
పరిగి: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ కల్తీ ప్రచారం చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేష్లపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దుష్ప్రచారానికి ఒడిగట్టిన కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని పరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టర్లను తయారు చేస్తున్న ముద్రణ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్వహించిన విచారణలో టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదన్న విషయం బట్టబయలైందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగంగా కల్తీ నెయ్యి అంటూ వెంకన్న భక్తులను మానసికక్షోభకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ కాలేదని ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పినా... కూటమి నేతలు అసత్య ప్రచారాన్ని ఆపకపోవడం దుర్మార్గమన్నారు. కల్తీ అంటూ ఇప్పటికీ అసత్య ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్ శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని, శ్రీవారి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. దాడులకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం చంద్రబాబేనని ఉషశ్రీచరణ్ ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోవాలంటూ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్తే ఆయనపై కర్రలు, రాళ్లతో దాడికి సిద్ధమైన టీడీపీ గూండాలను పోలీసులు నిలువరించపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐదు గంటల పాటు దాడులు చేసినా పట్టించుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం, ఆపై దాడులు చేసిన వారిని విడిచిపెట్టడం చూస్తే దీని వెనుక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన చంద్రబాబుకు పాలించే హక్కు లేదని, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని ఉపేక్షించబోం సర్పంచ్లు, ఎంపీటీసీలకు రావాల్సిన బిల్లులను పక్షపాత ధోరణితో జాప్యం చేస్తే ఉపేక్షించబోమని, త్వరలోనే పెనుకొండలో ధర్నా నిర్వహిస్తామని ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. అప్పులు చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు రావాల్సిన బిల్లులను మంజూరు చేయకుండా మంత్రి సవిత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు బిల్లులు చేయొద్దని సాక్షాత్తు ఓఎస్డీ సుమన జయంతి చెప్పడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీపీ సవిత, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లడ్డూకు వాడే నెయ్యి కల్తీ అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కల్తీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు వైఎస్ జగన్ ఫ్లెక్సీలతో దుష్ప్రచారాన్ని చేస్తే ఊరుకోం పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు డీఈ శివరాములు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక గణేష్ సర్కిల్ సమీపంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు అదాలత్ ఉంటుందన్నారు. విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ధర్మవరం మున్సిపాలిటీ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానిపల్లి మండలాల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను రాత పూర్వకంగా తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. బాల్య వివాహాలను అరికడదాం ● కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపు పుట్టపర్తి అర్బన్/పుట్టపర్తి టౌన్: బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్లే కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఐసీడీఎస్, రెడ్స్, శక్తి టీం సంయుక్త ఆధ్వర్యంలో 100 రోజుల క్యాంపెయిన్ కోసం బాల్య వివాహ ముక్తి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ రథాలను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. ఇందు కోసం రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. మొదటి విడతగా కదిరి, పుట్టపర్తి డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, రెడ్స్ డైరెక్టర్ భానుజా పాల్గొన్నారు. -
అడవిలో నిప్పు.. ఎగసిపడిన మంటలు
పెనుకొండ: స్థానిక పులేకమ్మ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అటవీ ప్రాంతానంతా వ్యాపించాయి. మంటలు ఎగసిపడటంతో పచ్చని చెట్లు బూడిదయ్యాయి. అడవిని ఆవాసంగా చేసుకుని బతుకుతున్న వన్యప్రాణాలూ మంటల్లో కాలి మృత్యువాతపడ్డాయి. దట్టమైన పొగ జాతీయ రహదారిని కమ్మేయగా...వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కళ్లముందే కాలిపోతున్న అటవీ ప్రాంతాన్ని, వన్యప్రాణులను చూసి ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతమంతా బోధ గడ్డి ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని, అందువల్ల బోధగడ్డిని తొలగించడంతో పాటు అటవీ ప్రాంతానికి ట్రెంచ్లు చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
‘పల్లె’ సార్ చెప్తేనే పింఛన్ !
ఓడీచెరువు: వృద్ధులకిచ్చే పింఛన్లోనూ రాజకీయ వైరం చూపుతున్నారు. అర్హత ఉండి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సరే ‘పల్లె’ సార్ చెబితేనే పింఛన్ మొత్తం ఇస్తామంటూ అధికారులు వృద్ధులను వేధిస్తున్నారు. రాజకీయ కారణాలతో కొందరికి నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వకుండా ఆ తర్వాత స్థానికంగా లేరంటూ జాబితా నుంచి తీసేస్తున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనలు తెలిసి జనం పాలకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సార్తో ఫోన్ చేయించండి.. ఓడీచెరువు మండలం కొండకమర్ల పంచాయతీ చెరువుమునెప్పపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఎనుమల వెంకటశివారెడ్డి, చెరువు చిన్నపరెడ్డి ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలవుదీరాక వీరిపై రాజకీయంగా కక్షగట్టారు. వృద్ధులు, ఏ ఆసరా లేని వారిని బలిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారికి పింఛన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇందులో ఎనుమల వెంకటశివారెడ్డి, చెరువు చిన్నపరెడ్డికి నాలుగు నెలలుగా పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు. శ్రీనివాసరెడ్డికి మూడు నెలలుగా పింఛన్ మొత్తం అందించకుండా వేధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వారు తమకు పింఛన్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా ఎంపీడీఓ సార్ ఆపమన్నాడని సమాధానం ఇచ్చారు. ఎంపీడీఓను పింఛన్ డబ్బులిప్పించాలని అభ్యర్థించగా.. ‘‘పల్లె సార్ ఆపమన్నాడు, పల్లె సార్ దగ్గరికిపోయి ఫోన్ చేయిస్తేనే మీ పింఛన్ ఇస్తాం’’ అని చెప్పారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేతనయితే సాయం చేయాలి గానీ... ఇలా కీడు చేస్తారా అని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి ఫించన్ ఈ నెల ఆపితే మూడు నెలలు గడిచిపోతుందని.. అప్పుడు పింఛన్ జాబితా నుంచి పేరు తొలగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్నప్ప, వెంకటశివారెడ్డిల పేర్లు పింఛన్ జాబితా నుంచి గతనెలలోనే తొలగించారు. గతంలో కూడా వీరిని ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేయగా.. విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి ఎంపీడీఓ కార్యాలయ అధికారులను మందలించడంతో అదే రోజు వారికి పింఛన్ అందించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అధికారుల వింత వైఖరి గతంలో పింఛన్ అందుకుంటున్న వారికీ నెలలుగా మొండిచేయి నాలుగు నెలల తర్వాత స్థానికంగా లేరంటూ పింఛన్ రద్దు -
కొత్త రైల్వేలైన్లకు నిధులు కష్టమే
● డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: కేంద్రం ప్రవేశపెట్టిన 2026–2027 బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్లో కొత్త రైల్వే లైన్లకు నిధులు దక్కడం కష్టమేనని డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్వనివైష్టవ్ ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశాన్ని అధికారులు డీఆర్ఎం కార్యాలయంలో సోమవారం సాయంత్రం వీక్షించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు దాదాపు రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ.4,000 కోట్లకు పైగా రైల్వేకు కేటాయించినట్లు తెలిపారు. హైదరాబాద్ వయా అమరావతి మీదుగా చైన్నె, హైదరాబాద్ – బెంగళూరు మధ్య హై స్పీడ్ డైమండ్ ప్రాజెక్ట్ (హై స్పీడ్ ప్రత్యేక రైల్ మార్గం)ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయన్నారు. దీంతో ఇండియన్ రైల్వే మరో చరిత్ర సృష్టించబోతోందన్నారు. అయితే కొత్త రైల్వే లెన్లకు దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీంతో తమ డివిజన్కు కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయింపులు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. డివిజన్కు రైల్వే నిధుల కేటాయింపులపై పింక్ బుక్ విడుదల అనంతరం పూర్తిస్థాయిలో తెలుస్తాయన్నారు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు చుర్గుగా సాగుతున్నాయని, పూర్తి స్థాయి జోనల్ ఏర్పాటు చేసుకోవడానికి మరో మూడేళ్లపైగా సమయం పడుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వింటా చింతపండు రూ.23 వేలు హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్లో చింతపండు విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం మార్కెట్కు 1,500 క్వింటాళ్ల చింతపండు రాగా, క్వింటా (కరిపులి రకం) గరిష్టంగా రూ.23 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయని మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. ఇక ఫ్లవర్ రంక క్వింటాల్ గరిష్టంగా రూ.18 వేలు, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికిందని ఆయన వెల్లడించారు. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కార్యదర్శి సూచించారు. రేపు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి 11 మంది ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికకు ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ ఆనంద్కుమార్ వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నిక నేపథ్యంలో బుధవారం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తహసీల్దార్ షేక్షావలి తెలిపారు. ఈ ఎన్నికను 11 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు గుర్తించిన పత్రిక విలేకరులు మాత్రమే హాజరు కావాల్సి ఉందన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. -
నాణ్యమైన పరిష్కారం చూపండి
ప్రశాంతినిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో పరిష్కరించి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదికకు వివిధ సమస్సపై 203 అర్జీలు వచ్చాయి. వీటిని వెంటనే ఆయా శాఖలకు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్లతో సమస్యలకు పరిష్కారం.. రెవెన్యూ క్లినిక్ల ద్వారా ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లను ఆయన సందర్శించారు. రెవెన్యూ సమస్యలున్న వారు రెవెన్యూ క్లినిక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ఆయా రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు అక్కడే ఉండి ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ● కదిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ 2025 ఆగస్టు 31వ తేదీన తామంతా పదవీ విరమణ పొందామని, ఇంతవరకూ తమకు రావాల్సిన గ్రాట్యుటీ రూ.13.67 లక్షలు, లీవుల డబ్బు రూ.6.13 లక్షలు మంజూరు కాలేదని పలువురు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు కలెక్టర్కు తెలిపారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందక తమ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అలాగే తమకు రూ.9,645 మాత్రమే పింఛన్ వస్తుందని, అందువల్ల రేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. ● తనకు ప్రమాదంలో ఒక కాలు పోయిందని 90 శాతం అంగవైకల్యం ఉన్నా.. ప్రభుత్వం కేవలం రూ.4 వేల పింఛన్ మంజూరు చేసిందని తలుపుల మండలం వీఆర్ తండాకు చెందిన రామునాయక్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. 70 ఏళ్ల వయస్సులో ఏ పనీ చేసుకోలేని తన పరిస్థితి అర్థం చేసుకుని రూ.15 వేల పింఛన్ ఇప్పించాలని కోరారు. అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం పరిష్కార వేదికకు 203 అర్జీలు -
కంటైనర్లో మంటలు
చెన్నేకొత్తపల్లి: ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా కంటైనర్ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాలు.. తమిళనాడులోని హోసూరు నుంచి మహారాష్ట్రలోని లాథూర్కు ప్లాస్టిక్ క్రేట్ల లోడుతో బయలుదేరిన కంటైనర్ ఆదివారం సీకేపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా క్యాబిన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ జ్ఞానేంద్రయాదవ్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పెనుకొండ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేసేలోపు క్యాబిన్ మొత్తం కాలిపోయింది. -
కామంతో కళ్లుమూసుకుని..
ఎన్పీకుంట: మానవత్వం మంటకలిసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కుమార్తైపెనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన స్నేహితులనూ ఆమైపె పురిగొలిపి చివరికి గర్భం దాల్చేలా చేశాడు.వివరాలు..ఎన్పీకుంట మండలంలోని ఓ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువు తోంది. ఇటీవల విద్యార్థిని తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఉపాధ్యాయి నులు గమనించి ఆస్పత్రికి పంపారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. బాలికను ఆరా తీస్తే భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి.తండ్రి కారణంగానే ఇలా జరిగినట్లు తెలిసింది. మద్యం మత్తులో తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడని ఆమె వాపోయింది. ఒకసారి తన స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. సదరు కామాంధుడిపై గతంలో పలు పోలీసు కేసులున్నట్లు తెలిసింది. కుమార్తైపె పలుమార్లు తండ్రి అఘాయిత్యం గర్భం దాల్చిన బాలిక ఎన్పీ కుంట మండలంలో దారుణం


