సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం
రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు. తప్పు చేయలేదంటే ఖండించాలి. కిరణ్కుమార్రెడ్డి హయాంలోనూ హంద్రీ–నీవా కాలువ పనులకు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీఓను రద్దు చేయించారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఈ విధంగా పదేపదే రాయలసీమకు ద్రోహం చేయడం చంద్ర బాబుకు అలవాటుగా మారిపోయింది.
– కె.సలీం మాలిక్, మానవతా సంస్థ


