యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

యువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య

రొద్దం: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దకోడిపల్లికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న ఒక్కగానొక్క కుమారుడు లింగమయ్య (24). ఏడాది క్రితం తండ్రి పోతన్న మృతి చెందడంతో లింగమయ్య రోజూ దానిమ్మ కాయల ప్యాకింగ్‌కు వెళ్తూ తల్లి మల్లికమ్మను పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు మిత్రులతో కలిసి గ్రామ శివారు ప్రాంతానికి మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. స్నేహితులు కత్తితో మెడపై విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. గంజాయి బ్యాచ్‌ లింగమయ్యను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజూ గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులతో వాపోయారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఐ రాఘవన్‌, ఎస్‌ఐ వీరాంజినేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులతో విచారణ చేపట్టారు. ఓ నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి బ్యాచ్‌ పనేనని

గ్రామస్తుల ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement