breaking news
Bigg boss reality show
-
కమల్ హాసన్పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్బాస్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్బాస్లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్ఫైర్లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె -
అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ
కన్నడ బిగ్బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్బాస్కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరుఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్బాస్కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.బెస్కాం నోటీసులుబిగ్బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్బాస్కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్ -
'బిగ్బాస్' షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్లో బిగ్బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్బాస్ సెట్ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు.అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది.బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్ హోస్ట్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. -
విలన్గా భరణి.. తనూజ కోసం శ్రీజ బలి
బిగ్బాస్ తెలుగు సీజన్ 5వ వారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తి అయింది. అయితే, కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్లోకి బిగ్బాస్ తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ వారికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడంతో అందరూ గందరగోళంలో పడ్డారు. ఫైనల్గా ఇమ్మాన్యుయేల్ (Emmanuel) టాస్క్లో గెలిచి ఇమ్యూనిటీని సాధించుకున్నాడు.బిగ్బాస్ రణరంగంలో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిపించారు. ఇమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ బెడ్పై ఎక్కువ సమయం ఉంటారో వారు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారని చెప్తారు. ఈ గేమ్లో బలమైన కంటెస్టెంట్స్ డీమాన్, కళ్యాణ్, ఇమ్మూ, భరణి ఒక టీమ్గా అయిపోయి.. వారి ప్రయారటీ ప్రకారం వరుసుగా బెడ్పై నుంచి కిందకు తోసేస్తారు. మొదటి రౌండ్లో సంజన, తర్వాతి రౌండ్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత దివ్య,డీమాన్, శ్రీజ ఆట నుంచి విరమిస్తారు.శ్రీజను బలంగా నెట్టేసిన భరణిచివరి రౌండ్లో భరణి, శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరిని మాత్రమే కిందకు తోసేయాలి. అయితే, గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చిందని తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది. ఆ మాటలకు కళ్యాణ్తో పాటు ఇమ్మూ కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, భరణి, తనూజకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇలా వారందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. ఈ క్రమంలో శ్రీజకి గాయం కూడా అయింది. దీంతో శ్రీజను ఓదార్చేందుకు భరణి వెళ్తాడు. ఇలా మంచితనంగా నటించకండి అన్నా అంటూ భరణిపై శ్రీజ పైర్ అవుతుంది. చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా తోసేయడం ఏంటి అంటూ సీరియస్ అయింది. మంచోడిలా నటించకండి. నీలా మంచిదానిలా నటించడం నాకు రాదన్నా.. అంటూ బాధ పడుతుంది. రేలంగి మావయ్యలా నటిస్తున్నావంటూ భరణిని శ్రీజ దుమ్ములేపింది. ఇక్కడ గెలిచిన భరణి, తనూజ, కళ్యాణ్, ఇమ్మూలకు గాలి- నిప్పు- నీరు టాస్క్ను బిగ్బాస ఇస్తాడు. ఇందులో విజేతగా ఇమ్మాన్యుయేల్ నిలుస్తాడు.కన్నీళ్లు పెట్టుకున్న దివ్యఈ టాస్క్లో అమ్మాయిల నుంచి ఎక్కువగా పోరాడింది దివ్య మాత్రమే... నమ్మిన భరణి కూడా తనకు సాయం చేయకపోవడంతో ఆమె బాధ పడింది. భరిణి ఎక్కువగా తనూజకు మాత్రమే అండగా నిలబడటం దివ్య సహించలేకపోయింది. బెడ్ మీద నుంచి తనను తోసేస్తున్నా కూడా భరణి అడ్డు పడలేదు. ఆపై అమ్మాయిలు ఎవరూ కూడా ఆమె కోసం నిలబడలేదు. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.విలన్గా భరణి..బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో చివర రౌండ్ జరుగుతున్న సమయంలో మాటల్లో పెట్టి శ్రీజను భరణి తోసేశారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. గతంలో తనూజకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమె కిందకు పంపితే బాగుంటుందని శ్రీజ చెబుతుంది. అందరూ శ్రీజ కరెక్ట్ అంటున్న సమయంలో తనూజ కోసం భరణి చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ టాస్క్లో దివ్య తర్వాత ఎక్కువగా గేమ్ ఆడింది కూడా శ్రీజానే.. కానీ, తనూజ మాత్రం కనీసం ఆటలో భాగం కాకుండా అలా ఉండిపోయింది. ఆమెను సేవ్ చేసి శ్రీజను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. గతంలో సుమన్కు ఇమ్యూనిటీ వచ్చిందనే కదా కిందకు తోసేశారు.. మరి తనూజాను ఎందుకు తోయలేదంటూ భరణిని ప్రశ్నిస్తుంది. ఇలా బుల్లెట్ లాంటి ప్రశ్నలతో శ్రీజ దుమ్ములేపుతుంది. రేలంగి మామయ్య రూపంలో ఉన్న విలన్ భరణి అంటూ విమర్శలు వస్తున్నాయి. -
2015లో మిస్క్యారేజ్.. ఇన్నాళ్లకు గుడ్న్యూస్ చెప్పిన పింకీ
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీ గుర్తుందిగా.. ఇప్పుడా పింకీ తల్లి కాబోతోంది. పింకీ అలియాస్ సుదీప (Sudeepa Pinky) గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్త శ్రీరంగనాథ్తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకోగా.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా కుటుంబం పెద్దదవుతోంది అని రాసుకొచ్చింది. అయితే తనకు ఈ మధ్యే డెలివరీ అయిందని, మెటర్నటీ షూట్ ఫోటోలను ఆలస్యంగా పోస్ట్ చేసిందంటున్నారు. మరి తన డెలివరీ గురించి సుదీప క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.2015లో మిస్క్యారేజ్సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది. 2015లో తొలిసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. 2015లో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ, అప్పుడు రెడీగా లేను. అయినా సరే, చూద్దామని ప్రెగ్నెన్సీని అలాగే ఉంచుకున్నాను. కొంతకాలానికి పొట్టలో బిడ్డతో మాట్లాడటం మొదలుపెట్టాను. బేబీ హార్ట్బీట్ కూడా బాగానే ఉంది. నాకు థైరాయిడ్ సమస్య ఉండేది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, థైరాయిడ్ ఎక్కువవడంతో బిడ్డను కోల్పోయాను అని చెప్తూ ఏడ్చేసింది.సినిమా1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో వచ్చిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పింకీ. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ఆ మధ్య తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్ అందుకుంది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత మళ్లీ స్క్రీన్పై కనిపించనేలేదు. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్గా జరుపుకుంటా!: శివజ్యోతి -
ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్గా జరుపుకుంటా!: శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శివజ్యోతి (Shiva Jyothi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. వచ్చే ఏడాది తన పొత్తిళ్లలోకి పండంటి బిడ్డ రానుందని ఈ మధ్యే ప్రెగ్నెన్సీ వార్తను షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు తల్లి కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా శివజ్యోతి సీమంతం జరిగింది. మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గుండెచప్పుడి కోసం ఎదురుచూస్తున్నాయంటూ ఐదో నెల సీమంతం ఫోటోలను షేర్ చేసింది.మీరు లేకుండా ఎలా?ఇది చూసిన చాలామంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్కా? అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో శివజ్యోతి.. ఇది ఊర్లో జరిగిన వేడుక అని.. 7 లేదా 9వ నెలలో మళ్లీ ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుందామని చెప్పుకొచ్చింది. మీరు నాకు చాలా ఇంపార్టెంట్, నా బిడ్డ కోసం మీరంతా ఎదురుచూశారు. మీరు లేకుండా నా సీమంతం ఎలా జరుగుతుంది? అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రాండ్గా జరుపుకోనుందన్నమాట!ఎవరీ శివజ్యోతి?శివజ్యోతి.. తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అక్కడినుంచి బిగ్బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టి పాపులారిటీ దక్కించుకుంది. ఈ షోలో టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచింది. ఈ రియాలిటీ షో తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ షోలలో పాల్గొంటూ బాగానే సంపాదించింది. తన ఊరికి చెందిన గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి -
జడుసుకున్న దివ్య.. రీతూ ఓవరాక్షన్! ఆ ముగ్గురు మాస్క్తోనే..
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్తో ఇద్దరు షాక్లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సరదా గేమ్స్నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్మేట్స్తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఏడ్చేసిన రీతూఅయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. శ్రీజకు తుత్తర ఎక్కువేఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్లాంటి పాయింట్స్ పెడుతుంది. రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?
హరిత హరీశ్, మాస్క్ మ్యాన్, హృదయ మానవ్.. ఇవన్నీ ఒక్కరి పేర్లే! అయినా హరీశ్.. మాస్క్ మ్యాన్గానే ఎక్కువ ఫేమస్. అగ్నిపరీక్షలో అతడి ముక్కుసూటితనం మెచ్చిన జడ్జిలు బిగ్బాస్ 9కి పంపారు. ఈ సీజన్లో తిరుగులేని కంటెస్టెంట్ అనుకున్నారు. అతడికి ఎవరూ ఎదురునిలబడలేరనుకున్నారు. కానీ బిగ్బాస్ హౌస్లో అంతా తలకిందులైంది. హౌస్లో అగ్గిరాజేస్తాడనుకుంటే తనే అగ్గిలో దూకి బూడిదలా మిగిలాడు (Mask Man Haritha Harish).అలక బూనిన హరీశ్ఇతడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. కానీ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోతాడు. షోలో గొడవలు కామన్.. అప్పుడే పోట్లాడుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. కానీ ఇతడు మాత్రం గొడవ దగ్గరే ఆగిపోయాడు. అవతలివారు కలుపుకుపోవాలన్నా కూడా దూరం పెట్టాడు. జనాలు అతడిని ఇంకొన్నివారాలు ఉంచాలనుకున్నా సరే నేను రానంటూ ఒక మూలన సైలెంట్గా కూర్చుండిపోయాడు. అన్నం మీద అలక చూపించాడు.ఆ ఒక్క సంఘటనతో సైలెంట్'ఇన్నాళ్లూ ఇమ్మాన్యుయేల్, భరణి మగాళ్లనుకున్నా.. కానీ ఆడవాళ్లతో ఫైట్ చేస్తున్నానని ఇప్పుడర్థమైంది' అని ఆవేశంలో ఓ కామెంట్ పాస్ చేశాడు. దీంతో ఆడవాళ్లంటే అంత చులకనా? అని అతడికి పెద్ద క్లాస్ పడింది. నా ఉద్దేశ్యం అది కాదు, నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని హర్టయ్యాడు. అప్పటినుంచి డౌన్ అవుతూ వచ్చాడు. నాగార్జున అన్నట్లుగానే ఇంట్లో వస్తువులకు, హరీశ్కు మధ్య పెద్ద తేడా లేనట్లుగానే కనిపించింది.ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే!తనకు ఆడాలని, హౌస్లో ఉండాలని కాస్తయినా ఆసక్తి లేకపోతే ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు? అందుకే బయటకు పంపించేశారు. అయితే ఓ విషయంలో మాత్రం హరీశ్ను మెచ్చుకుని తీరాల్సిందే! ఓ గేమ్లో హరీశ్.. దివ్యను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినా ఆమె చూసి పట్టుకోండి.. అంటూ అనవసర కామెంట్లు చేయడంతో అతడు ఆమె కాళ్లు మొక్కాడు. అక్కడ హరీశ్ అందరికీ నచ్చేశాడు. గుండెలో ఎంత బాధుంటే అలా చేస్తాడు! అని హరీశ్పై జాలిపడ్డారు.రెమ్యునరేషన్తను ఎలిమినేట్ అయినప్పుడు కూడా అతడి ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇంట్లో ఉండాలని లేదు, ఇలాంటి మనుషుల మధ్య ఉండలేను అని చాలాసార్లు అన్న హరీశ్.. ఎట్టకేలకు వారి మధ్య నుంచి బయటకు వచ్చేస్తున్నందుకు లోలోన సంతోషించాడేమో! ఇకపోతే హరీశ్ వారానికి రూ.60-70 వేల మేరకు పారితోషికం తీసుకున్నాడు. ఈ లెక్కన నాలుగు వారాలకు గానూ రూ.2.50 లక్షల పైచిలుకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది! -
ఆయన రూ. 50 ఇస్తేనే తినేవాడిని.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు: మహేశ్ విట్టా
మహేశ్ విట్టా.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి... షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి కమెడియన్గానూ ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్బాస్ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కూడా అయ్యాడు. మంచి ఫేం అయితే సంపాదించాడు కానీ ఆర్థికంగా మాత్రం ఇంకా స్థిరపడలేదంటున్నాడు మహేశ్. ఇప్పటికీ ఆయనకంటూ సొంత ఇల్లు లేదట. తనకే కాదు తన ఫ్యామిలీ వాళ్లకు కూడా ఆస్తులేమి లేవని అంటున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహేశ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.సినిమాలంటే పిచ్చి..నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఇంటర్ అయిపోగానే నేను సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పా. మా వాళ్లు..చదువు అంతా పూర్తయిన తర్వాత పంపిస్తా అన్నారు. దీంతో కడప ప్రొద్దుటూరులోనే డిగ్రీ పూర్తి, హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేశా. ఒక ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి చెప్పి ఇండస్ట్రీకి వచ్చా. డైరెక్టర్ కావాలని నా ఆశ. వచ్చిన మూడు నెలల్లోనే నాకు ఫన్ బకెట్ సిరీస్ చాన్స్ వచ్చింది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్. కానీ అనుకోకుండా నేను నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు యాక్టింగ్ చేస్తేనే డబ్బులు ఇస్తా అన్నారు. దీంతో ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే యాక్టింగ్ చేశా. తినడానికి డబ్బులు లేకుంటే.. ఊరికనే ఆఫీస్కి వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని. ఎవరైనా అడిగితే డైరెక్టర్ హర్ష పిలిచాడని అబద్దం చెప్పేవాడిని. ఆయన అడిగితే మేడం పిలిచిందని చెప్పేవాడి. ఆయనే అర్థం చేసుకొని రూ. 50 జేబులో పెట్టి తిని రమ్మని చెప్పేవాడు. అలా నన్ను ఆరు నెలల పాటు చంటి పిల్లాడిలా కాపాడాడు. ఇక్కడ లేదు.. ఊర్లో లేదు..ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చా. మంచి ఫేం అయితే సంపాదించా కానీ డబ్బులు మాత్ర జమ చేయలేదు. ఇప్పటి వరకు నాకంటూ సొంత ఇల్లు లేదు. సిటీలోనే కాదు ఊర్లో కూడా నాకు ఇల్లు లేదు. మా ఫ్యామిలీ పేరున ప్రాపర్టీస్ కూడా లేవు. ఉన్నంతలో సంతోషంగా అయితే ఉన్నాం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కోటి రూపాయలు సంపాదిస్తే చాలు హ్యాపీగా బతకొచ్చు అనుకున్నా. కానీ కోటీ రూపాయలు జమ చేయాలంటే ఎన్ని సినిమాలు చేయాలి? పైగా ఇక్కడ చాలా వరకు డబ్బులు రావు. చాలామంది నిర్మాతలు నాకు డబ్బులు ఎగ్గొట్టారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. డబ్బులు ఇవ్వమని ముఖంపైనే చెప్పేవాళ్లు. కొంతమంది అకౌంట్లో వేస్తామని చెప్పి.. వేయరు. గట్టిగా అడుగుదామంటే.. మిగతావాళ్లకు ఎక్కడ తప్పుగా చెప్పి అవకాశాలు రాకుండా చేస్తారోననే భయం. నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులది ఇదే పరిస్థితి’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు. -
నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి
అగ్నిపరీక్షలో దుమ్ము లేపింది శ్రీజ దమ్ము (Srija Dammu). ఏ టాస్క్ ఇచ్చినా చకచకా ఆడేసేది. బ్రేకుల్లేని బైకులా మాట్లాడటం మొదలుపెడితే ఆపేదే కాదు. ఫుల్ ఎనర్జీతో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో అడుగుపెట్టింది. కానీ, ఇక్కడకు వచ్చాక సీన్ రివర్స్ అయింది. తనకు ఉన్న క్రేజ్, వచ్చిన పాజిటివిటీ అంతా కూడా నెగెటివ్గా మారింది.గంజి తాగి స్కూలుకి..ప్రతివిషయానికి నోరేసుకుని పడిపోవడంతో శ్రీజపై నెట్టింట ట్రోల్ జరిగింది. అయితే తనపై వ్యతిరేకత వస్తున్న విషయం గ్రహించి శ్రీజ తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసింది. కాస్త సైలెంట్ అయిపోయింది. ఆటలో మాత్రం శివంగిలా ఆడుతోంది. తాజాగా శ్రీజ తండ్రి దమ్ము శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీజ చిన్నప్పుడు గంజి తాగి స్కూలుకు వెళ్లేది. సన్మానించారుతనకు ఒక్క మార్కు తక్కువ వేసినా ఊరుకునేది కాదు. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. అగ్నిపరీక్షకు వెళ్లే ఒకరోజు ముందు తను సెలక్ట్ అయినట్లు చెప్పింది. తనకు మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. బిగ్బాస్కు వెళ్తానంటే సరేనన్నాం. ఎంతోమందిని దాటుకుని షో దాకా వెళ్లడమే గొప్ప విషయం. వైజాగ్ అమ్మాయి శ్రీజ.. బిగ్బాస్కు వెళ్లిందంటూ నన్ను పిలిచి మా ఊర్లో సన్మానం చేశారు.కించపరిచేలా ట్రోలింగ్నేను పారిశుద్ధ్య కార్మికుడిని. నా వృత్తిని కించపరిచేలా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చేతులతో చెత్త పట్టుకోవడం అంత ఈజీ కాదు. నా కూతురు చెత్త బ్యాగ్ పట్టుకున్న వీడియోను.. చెత్తబండివచ్చిందమ్మా చెత్తబండి అన్న వాయిస్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. నా పనిని కించపరుస్తూ నా కూతురిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా బాధేసింది అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీజ.. రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ను పక్కన పెట్టి మరీ బిగ్బాస్కు వెళ్లడం విశేషం.చదవండి: సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. రీతూది మోసం కాదట! -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. శ్రీజను ఇరికించి, రీతూది మోసం కాదని..
అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతే కాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4వ ఎపిసోడ్ హైలైట్స్లో మీరూ చూసేయండి..సంజనాను శిక్షించిన నాగ్సంజనాను దొంగ వేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున (Nagarjuna Akkineni). అంతేకాదు, ఓనర్ నుంచి తప్పించి టెనెంట్గా మార్చాడు. హౌస్లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజనా ఎక్కువకాలం హౌస్లో ఉండటం కష్టమే! మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు, మీకూ తేడా లేనట్లే ఉందన్నాడు. గోల్డెన్ స్టార్తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫామెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్లు ఇచ్చాడు. నాలుగు వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి.. నువ్వు ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్.. అంటూ కెప్టెన్సీ టాస్క్లో ఆమె సృష్టించిన గందరగోళం... దాని వల్ల కల్యాణ్- రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కల్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు.తనూజను హెచ్చరించిన నాగ్హౌస్కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజ (Thanuja Puttaswamy)కు సలహా ఇచ్చాడు. సంజనా- తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ.. టీ కప్పులో తుపానులా.. మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్లో.. కల్యాణ్ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు. కల్యాణ్పై ప్రశంసలుఅటు కల్యాణ్తో మాత్రం.. మూడువారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈవారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే (రీతూ చేతిలో) మోసపోయావనీ అన్నాడు. సంజనాకు అసిస్టెంట్లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీశ్కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా రెండు వారాలకు నామినేట్ చేశారు.చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే! -
పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా!
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ (Actress Hema). టాలీవుడ్లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదుకెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్డ్గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. అందుకే బిగ్బాస్కు వెళ్లా..లాక్డౌన్లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్బాస్ హౌస్లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని. నాగార్జున వస్తే..త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ -
బిగ్బాస్లోకి 'ప్రభాస్' ఫ్రెండ్తో పాటు మరో నలుగురికి ఎంట్రీ!
బిగ్బాస్-9 తెలుగులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారి పేర్లు కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్బాస్లో ఆట మరింత రణరంగంగా మారనుందని చెప్పవచ్చు.సినీ నటుడు ప్రభాస్ శీను(Prabhas Sreenu) బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 11,12 తేదీలలో వీరందరూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరో ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆయన పేరునే ట్యాగ్లైన్గా మార్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో సంఖ్య పెరగడంతో పాటు ఆట మరింత ఆసక్తిగా ఉండనుందని సమాచారం. బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్(Nikhil Nair) కూడా బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. భారీ కటౌట్తో ఉన్న నిఖిల్ సిరీయల్స్తో మెప్పించాడు. ఇంటింటి గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్తో గుర్తింపు పొందాడు.అలేఖ్య చిట్టి పికిల్స్తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య(Ramya) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఆమె పేరు బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో బిగ్బాస్ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్.లఘు చిత్రాలు, వెబ్ సీరిస్లతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్(Akhil Raj) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయినట్లు సమాచారం. అయితే, సోషల్మీడియాలో అతనికి పెద్దగా గుర్తింపు లేదు. ఇలా బిగ్బాస్తో అందరికీ దగ్గరకావాలనే ప్లాన్ ఉన్నాడు. యూకేలో నివసిస్తున్న మౌనిషా చౌదరి(Mouneesha Chowdary) బిగ్బాస్లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్స్టోరీ చెప్పాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్బాస్ పెట్టిన టాస్క్లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్బాస్కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్బాస్కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
స్టార్ క్రికెటర్ సోదరి.. 'బిగ్బాస్'లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) హోస్ట్గా ‘బిగ్బాస్ 19’( Bigg Boss 19) ఆగష్టులో మొదలైంది. హిందీలో కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఈ షోలోకి భారత క్రికెటర్ అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈమేరకు సోషల్మీడియాలో పలు పోస్ట్లు కనిపిస్తున్నాయి.ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malti Chahar) హిందీ బిగ్బాస్-19లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి బాలీవుడ్ పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్గా కూడా రాణిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మాల్తీకి సుమారు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2014లో ఫెమినా మిస్ ఫోటోజెనిక్, మిస్ సుడోకు కిరీటాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్లతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. View this post on Instagram A post shared by Malti Chahar (@maltichahar) -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
పేరెంట్స్ చూస్తున్నారు.. లవ్ట్రాక్స్ అవసరమా? కల్యాణ్ నాతో..
ప్రియా శెట్టి (Priya Shetty)... అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు అందరూ క్యూట్ అన్నారు. తీరా బిగ్బాస్ 9 (Bigg Boss Telugu 9)కి వచ్చాక ఈమె మాకొద్దని అందరూ దండం పెట్టేశారు. ఈమె అరుపులకు, గొడవలకు చెవులకు చిల్లులు పడేలా ఉన్నాయంటూ మూడోవారమే తనను బయటకు పంపేశారు. తాజాగా తన బిగ్బాస్ అనుభవాన్ని బయటపెట్టింది ప్రియ. ఆమె మాట్లాడుతూ.. నేను హైపర్ యాక్టివ్. బిగ్బాస్ షోలో నేను నాలా ఉన్నాను. గొడవలు జరిగినప్పుడు నేనే కాదు, అందరూ అరిచారు. లేడీ లక్.. అప్పుడే నచ్చలేహౌస్లో అందరికంటే నేనే ఎక్కువ ఏడ్చాను. కానీ ఎపిసోడ్లో అది కనిపించలేదు. అగ్నిపరీక్షలో షాకీబ్తో కలిసి లేడీ లక్ అని లవ్ ట్రాక్స్ క్రియేట్ చేశారు. జనాలు నన్ను ఆ కోణంలో చూడటం నాకు నచ్చదు. అలాంటి లవ్ ట్రాకులు నాకు గిట్టవు. షోలో ప్రేమాయణాలు నడిపించడమనేది ఇష్టం లేదు. షోలో నాకెవరూ నచ్చరని ఫిక్సయ్యే షోకి వెళ్లాను. అమ్మానాన్న నాకోసం సంబంధాలు చూస్తున్నారు. నేనేమైనా పిచ్చిపనులు చేస్తే.. ఏంటండి? మీ అమ్మాయి అలా చేస్తోందని అడుగుతారు. అలాంటివన్నీ అవసరమా?అక్క అని పిల్చేవాడు కాదుఅలాంటి ట్రాకులు నాకొద్దు అని క్లారిటీతో ఉన్నాను. నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను. పవన్ కల్యాణ్.. నాకంటే చిన్నోడు. వాడు నన్నెప్పుడూ పెద్దమ్మ, శూర్పనఖ, పెద్దక్క అని పిలుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అక్క అని పిలవమంటే పిలిచేవాడు కాదు. పిలవలేక కాదు, నన్ను విసిగించాలని! గయ్యాళి, రాక్షసి అనే పిలిచేవాడు. మొదటినుంచి మా ఇద్దరి మధ్య అక్కాతమ్ముడి అనుబంధమే ఉంది. తనెప్పుడూ అసౌకర్యంగా టచ్ చేయలేదు. నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఓదార్చడానికి వస్తే.. వద్దురా బాబు, నన్ను వదిలెయ్ అని తోసేదాన్ని. కల్యాణ్నే కాదు ఎవర్నీ నా దగ్గరకు రానివ్వలేదు అని ప్రియ క్లారిటీ ఇచ్చింది.ఓదార్పు యాత్రబిగ్బాస్ హౌస్లో ట్రయాంగిల్, స్క్వేర్ అని కొన్ని ట్రాకులు నడుస్తున్నాయి. ఇద్దరు పవన్ల మధ్య రీతూ చౌదరి ఉండటంతో ఇదో ట్రయాంగిల్లా మారింది. ఇక పవన్ కల్యాణ్.. ఎవరైనా ఏడిస్తే చాలు ఓదార్పు యాత్ర మొదలుపెట్టేవాడు. అమ్మాయిలకు హగ్గులిచ్చి చిన్నపిల్లల్ని ఓదార్చినట్లు ఓదార్చేవాడు. తను చూసే పద్ధతి కూడా అస్సలు బాగుండేది కాదు. ఇక చాలాసార్లు ప్రియ.. అతడు హగ్ ఇవ్వడానికి వస్తుంటే తప్పించుకుని పారిపోయేది. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రియను ప్రేక్షకులు మెచ్చుకున్నారు.చదవండి: దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణె -
ఇంగ్లిష్ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్? నోరు పారేసుకున్న సంజనా
గతంలో గౌతమ్ సీక్రెట్ రూమ్కు వెళ్లొచ్చి నెగెటివ్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఓవర్ డైలాగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్వీక్ ఎలిమినేట్ అయి వీకెండ్లో మళ్లీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..వెరైటీ నామినేషన్స్ఈవారం నామినేషన్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). హౌస్మేట్స్తో లూడో గేమ్ ఆడించాడు. కాకపోతే డైస్ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్లో సుమన్ శెట్టి టీమ్(సుమన్, ఫ్లోరా, రాము రాథోడ్) గెలిచింది. కెప్టెన్సీలో పవన్కు ఫేవర్ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు సుమన్. సుమన్ టీమ్కే మరొకర్ని నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. రాము సంజనాను నామినేట్ చేశాడు.ఇంగ్లిష్ వచ్చా?మీ వల్ల హౌస్ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్.. హౌస్లో మోస్ట్ ఆఫ్ ది వయొలెన్స్ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్ తెలుసా? వయొలెన్స్ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.హరీశ్ బెదిరింపులుఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తపఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్ను నామినేట్ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్ చెప్పారు. నామినేషన్స్లో ఆరుగురుకానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్ ఫేస్ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ నామినేట్ అయ్యారు. ఏదేమైనా మనీష్, ప్రియల ఎలిమినేషన్తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్లు పడవు అని అర్థమై సైలెంట్ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు -
సంజనాను కాపాడుతున్న బిగ్బాస్.. తనూజపై నెగటివ్
బిగ్బాస్ సీజన్-9 నుంచి ప్రియ ఎలిమినేట్ తర్వాత శ్రీజలో కాస్త ఎక్కువ ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్లో శ్రీజ చాలా జాగ్రత్తగా తన ఆట ఆడింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్లో దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనే స్ట్రాటజీ శ్రీజ వేసింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ కంటే ఇమ్యూనిటీ టాస్కులు పెట్టి బిగ్బాస్ తన పంతా మార్చుకున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. సోమవారం ఎపిసోడ్లో కిచెన్ చుట్టూ సంజన, తనూజ మధ్య పెద్ద వార్ నడిచింది. అయితే, తనూజపై సంజనా చేసిన కామెంట్స్ను బిగ్బాస్ కొన్ని టెలికాస్ట్ చేయలేదు. కేవలం తనూజాదే తప్పు అన్నట్లుగా ఎపిసోడ్లో చూపించారు. లైవ్ చూసిన నెటిజన్లు ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.సోమవారం ఎపిసోడ్ కిచెన్ నుంచే మొదలైంది. కొంచెం పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను సంజనా అడుగుతుంది. దీనికి తనూజ ఓకే చెప్పింది. దీంతో సంజనా కిచెన్ దగ్గరికెళ్లి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్తో చెప్పకుండానే తనపని తాను చేసుకుంటుంది. అలా మీరే ఫుడ్ చేసుకుంటే ఎలా అంటూ వాళ్లిద్దరూ ఆమెను ఆపేస్తారు. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేశాం మళ్లీ ఇది దేనికి అని డీమాన్ అడుగుతాడు. మరోవైపు దివ్య కూడా రెడీ అవ్వాలి ఎక్కువ టైమ్ లేదంటూ కెప్టెన్తో చెప్పింది. అప్పుడు శ్రీజతో చేయించుకుంటానని సంజన అంటుంది. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే తనూజ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చిదంటూ తనూజ అడుగుతుంది. దీంతో సంజనా ఫైర్ అవుతుంది. అయ్యో ఏంటమ్మా చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ తన నోటికి పని చెప్పింది. ఆమెకు కౌంటర్గా తనూజ కూడా వాయిస్ పెంచింది. నా డిపర్ట్మెంట్కి వచ్చి మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటూ సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన వాదనను పూర్తిగా బిగ్బాస్ చూపించలేదు.సంజనా కావాలనే ట్రిగ్గర్ చేస్తుందా..?సోమవారం ఎపిసోడ్ చూసిన వారందరూ తనూజాది తప్పు.. సంజనానే కరెక్ట్ అనుకుంటారు. కానీ, బిగ్బాస్ లైవ్ చూసిన వారికి మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో సంజనాది మొత్తం నెగటివ్నే ఉంటుంది. తనూజపై ఆమె దారుణమైన కామెంట్లు చేసినప్పటికీ వాటిని టెలికాస్ట్ చేయలేదు. దీంతో తనూజపై నెగటివిటీ కనిపిస్తుంది. బిగ్బాస్ లైవ్ చూసిన వారందరూ ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఆమె కావాలనే కంటెస్టెంట్స్ను ట్రిగ్గర్ చేస్తుందని అర్థం అవుతుంది. సంజనా రీఎంట్రీ కోసం తనూజ చేసిన సాయం గురించి తెలిసిందే. కానీ, దానిని కూడా తక్కువ చేస్తూ ఆమె ఇమాన్యూల్తో విమర్శలు చేస్తుంది. అదొక సాయమా ఏంటి అంటూ దాటేసింది. ఆపై తనూజకు సిగ్గు, లజ్జా లేదంటూ సంజనా విరుచుకుపడింది. అదొక చీప్, చెత్త, చీప్ మెంటాలటీ అంటూ తనూజపై నోటికి వచ్చిన మాటలు సంజనా అనేసింది. ఆపై శ్రీజను కూడా విమర్శించింది. తన కోసం దుస్తులు కూడా త్యాగం చేయలేదంటూ శ్రీజను కూడా తిట్టేసింది. ఇవన్నీ బిగ్బాస్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. దీంతో అందరూ సంజనానే కరెక్ట్ అంటూ అనుకోవడం సహజమే.ఇద్దరికీ ఇమ్యూనిటీఈ వారం నామినేషన్స్ నుంచి ఇద్దరికి ఇమ్యూనిటీ లభించింది. అందుకోసం 'వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు' అంటూ ఒక టాస్క్ను పెట్టారు. ఇందులో 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున ఆరు టీములుగా బిగ్బాస్ విభజించాడు. అయితే, ఫైనల్గా సుమన్ శెట్టి, తనూజ తమ గేమ్తో పాటు ఇంటి సభ్యుల సపోర్ట్తో ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకున్నారు.Sacrifice chesina gratitude kuda ledu 🤮 siggu lajja anta 👎🏻#BiggBossTelugu9 pic.twitter.com/ewyzHv3atI— Voice 🏎️ (@Ak12Mr_) September 30, 2025 -
అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth).. యూట్యూబ్లో ఒకప్పుడు వెలుగు వెలిగాడు. వెబ్ సిరీస్లు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్తో బాగా క్లిక్కయ్యాడు. టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న సమయంలోనే బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. అలా తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్బాస్లో మాత్రం సిరి హన్మంత్తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.వివాదాల్లో షణ్నుషో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయనతో బ్రేకప్.. ఓ కేసులో ఇరుక్కోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ సినిమాలు చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత తొలిసారి షణ్ముఖ్ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈమేరకు గ్లింప్స్ వదిలారు. అందులో షణ్ను మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్పై చాలా ఆసక్తి ఉందని మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు. జీవితం అయిపోయిందనుకున్నానేను బిగ్బాస్కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. తర్వాత ఓ కేసులో నా పేరు వచ్చింది. చాలా బాధపడ్డాను. దాన్నుంచి అంత ఈజీగా బయటపడలేకపోయాను. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అలా ఒకరోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పిల్లాడు నన్ను పిలిచి, నువ్వంటే చాలా ఇష్టం అన్నా.. కానీ, ఇప్పుడు నచ్చట్లేదని చెప్పాడు. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. కమ్బ్యాక్ ఇవ్వాలని ఆరోజే నిర్ణయించుకున్నాను.అమ్మకు క్యాన్సర్ఈ మధ్య మా నాన్న రైలు అందుకోవాలన్న ఆత్రంతో ప్లాట్ఫామ్పై పరిగెడుతుండగా బీపీ ఎక్కువై పడిపోయాడు. ఆరోజు నేను బాధను పంటికింద బిగపట్టాను. ఎందుకంటే అమ్మకు క్యాన్సర్. తనకు సర్జరీ జరిగింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే కుట్లు ఊడిపోతాయి. అందుకని ఆరోజసలు నేను ఏడవనేలేదు. ఏదేమైనా నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయాను అంటూ షణ్ముఖ్ ఎమోషనలయ్యాడు.చదవండి: పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్ -
కోర్ట్ జంట డ్యాన్స్.. రీతూ తల్లి వాయిస్ మెసేజ్.. దద్దరిల్లేలా దసరా ఎపిసోడ్!
మరో నాలుగు రోజుల్లో దసరా (అక్టోబర్ 2న విజయదశమి) పండగ రాబోతోంది. కానీ బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో ఈ పండగ ముందే వచ్చేసింది. నేడు దసరా స్పెషల్ ఎపిసోడ్ రానుంది. రాత్రి 7 గంటలకే ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. దేత్తడి హారిక డ్యాన్స్, లిప్సిక సాంగ్, తెలుసు కదా హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, రాఖీ ఖన్నా, శ్రీనిధి శెట్టి.. కె ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా స్పెషల్ ఎంట్రీతో ప్రోమో దద్దరిల్లింది. నీ గేమ్ నీకోసం ఆడు: రీతూ తల్లికోర్ట్ జంట రోషన్-శ్రీదేవి డ్యాన్స్తో అదరగొట్టారు. ఫ్యామిలీ నుంచి లెటర్స్, ఆడియో మెసేజ్ మిస్సయిన హౌస్మేట్స్కు ఈరోజు బంపరాఫర్ ఇచ్చారు. ముందుగా రీతూ చౌదరికి ఆమె తల్లి పంపిన వాయిస్ మెసేజ్ వినిపించారు. హలో అమ్ములు, నేనిక్కడ బానే ఉన్నాను. నీ గేమ్ నీకోసమే ఆడుకో నాన్న. ఎవరి కోసమో నువ్వు వెళ్లలేదు. నేను దేనిగురించి అంటున్నానో నీకు తెలుసు. కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది. తల్లి గొంతు వినగానే రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అబ్బాయిలతో గేమ్ పక్కన పెట్టి నీ గేమ్ నువ్వు ఆడు అని రీతూ తల్లి చెప్పకనే చెప్పింది. మరి ఇకనైనా రీతూ మారుతుందా? లేదా? చూడాలి!చదవండి: ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన -
లత్కోర్ హరీశ్.. దారుణంగా అవమానించిన నాగ్! జుట్టు కత్తిరించుకున్న రీతూ
నామినేషన్స్లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్ఫైర్తో శనివారం ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్బాల్ ఆడాడని రాముపై మండిపడింది. త్యాగాలు చేస్తే హౌస్లోకి సంజనా..అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్ మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు. జుట్టు కత్తిరించుకున్న రీతూతనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్బాయ్ హెయిర్కట్ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్ కట్ చేసింది. జుట్టు కట్ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్తోనే సీజన్ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్. ఒప్పుకోని సుమన్, శ్రీజఅందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్.. సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు.. సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్ను స్టోర్ రూమ్లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్రూమ్లో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు.లత్కోర్ పంచాయితీఇకపోతే నామినేషన్స్లో హరీశ్.. పవన్-రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్.. లత్కోర్ హరీశ్ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్లో సంచాలక్గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్బాస్ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ద ట్రయల్ 2 సిరీస్ రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే! -
మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్లా సంజనా
బిగ్ షాక్.. సంజనా ఎలిమినేట్ అంటూ అందరిచెవిలో పూలు పెట్టాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయినవాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారో.. తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. సుమన్ స్టాండ్ తీసుకోడుఅందులో సంజనా (Sanjana Galrani).. నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా! అని అమాయకంగా ముఖం పెట్టింది. దానికి నాగార్జున.. దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే వాళ్లకు కూడా చిరాకొస్తుందన్నాడు. ఇక ఇంటిసభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ.. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడు. హరీశ్.. ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు. ఏం బిడ్డా? తక్కువ చూశానా?ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప.. తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కుతున్నాడు. అతడితో బతకలేం.. ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు. రాము (Ramu Rathod).. నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేసాన్రా బిడ్డా.. నేను చీప్ అమ్మాయినా? అని నిలదీసింది.రికార్డింగ్ ఉంది, ఊరుకో..అందుకు రాము.. నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రికార్డింగ్ ఉంది, ఊరుకో.. అని నోరు మూయించింది. భరణితో.. ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది. ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్మూ, ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు. చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్ -
'బిగ్బాస్' సంజనాకు సుప్రీం కోర్ట్ నోటీసులు
డ్రగ్స్ కేసులో సినీ నటి సంజన గల్రానీకి సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్బాస్లో కంటెస్టెంట్గా ఉన్న విషయం తెలిసిందే. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ సమయంలో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనా గల్రానీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో 14వ నిందితురాలిగా సంజనాను చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు.సంజన గల్రానీపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024 మార్చి 25న, కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, Section 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్లో జరపలేమని పేర్కొంది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు సంజనా గల్రానీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.సంజన గల్రానీ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పేర్కొన్నారు.. ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని, అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు. సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న చాలామంది డ్రగ్స్ వాడినట్టు సమాచారం ఉంది. విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు. కానీ, ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమచారం. ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.బిగ్బాస్9లో సంజనబిగ్బాస్9 తెలుగు సీజన్లో సంజన గల్రానీ సత్తా చాటుతున్నారు. ఈ సీజన్కు హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్గా గుర్తింపు పొందారు. అయితే, ఎలిమినేషన్ పేరుతో ఆమెను సీక్రెట్ రూమ్కు బిగ్బాస్ పంపారు. ప్రస్థుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఆమె రాణిస్తున్నారు. -
మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్రూమ్కు!
ఏమాటకామాట.. ఈ సీజన్కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడుబిగ్బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్బాస్ఇక బిగ్బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు. అందరి నిర్ణయం ఒక్కటేదీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను. సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూఅలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.ఒంటరివాడ్ని అయిపోయా!నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్లో ఉండొచ్చని బలంగా నమ్మారు.చదవండి: దీపికా పదుకొణెకు మరో బిగ్ సినిమా ఛాన్స్ -
సంజనా ఎలిమినేట్! వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఈవారం మొదట్లో హౌస్మేట్స్కు కొన్ని ఫలాలిచ్చాడు. అందులో రంగురంగుల విత్తనాలున్నాయి. నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్ప్రైజ్లు అందుకున్నారు. నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు. ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్బాస్.గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్హౌస్లో ఒకర్ని బయటకు పంపాలన్నాడు. ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీశ్. భరణి, రాము, డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ అందరూ కలిసి చర్చించుకున్నారు. మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేశారు. దీంతో సంజనాను వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్బాస్. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది.నామినేషన్స్లోనే లేదుఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. అప్పటివరకు సీక్రెట్రూమ్లో ఉంచుతారు. అయితే ఈ విషయం హౌస్మేట్స్కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఇదంతా స్టంట్ అని అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. చదవండి: 8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్! -
వాళ్లను టాప్ 5లో పెట్టిన వైల్డ్కార్డ్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కొత్త కెప్టెన్ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. అయితే దానికంటే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితకు బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులను వారి ఆట,మాట ఆధారంగా వరుస ర్యాంకుల్లో నిల్చోబెట్టమన్నాడు. దాదాపు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అలాగే హౌస్మేట్స్కు ర్యాంకులిచ్చింది. రెండుమూడు మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నాయి.ర్యాంకింగ్..భరణిని టాప్ 1లో, ఇమ్మాన్యుయేల్ను రెండో స్థానంలో, సంజనాను మూడు, డిమాన్ పవన్ను నాలుగు, తనూజను ఐదో స్థానంలో నిలబెట్టింది. సుమన్, రీతూ, ప్రియ, హరీశ్, శ్రీజ, కల్యాణ్, రాము, ఫ్లోరాకు వరుసగా ఆరు నుంచి 13 స్థానాలిచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్నవారు మాత్రేమ కెప్టెన్సీకి పోటీ పడతారని ప్రకటించాడు బిగ్బాస్.కెప్టెన్సీ టాస్క్వీరితోపాటు దివ్యను కూడా కంటెండర్గా అనౌన్స్ చేశాడు. వీళ్లకు తప్పిస్తారా? గెలిపిస్తారా? అన్న గేమ్ పెట్టాడు. ఈ గేమ్లో భరణి, ఇమ్మాన్యుయేల్ చివరి వరకు పోరాడారు. హౌస్మేట్స్ సహకారంతో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్సీకి పోరాడి ఓడియాడు. మూడోసారి మాత్రం గెలిచి దక్కించుకున్నాడు. మరి ఇమ్మాన్యుయేల్ను కెప్టెన్గా ప్రకటించేశారా? లేదంటే బిగ్బాస్ మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ! ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది బిగ్బాస్ బ్యూటీ, నటి వితికా షెరు (Vithika Sheru). చెల్లి కృతికను చంటిపాపలా చూసుకుంటుంది. తన పెళ్లి కూడా వితిక చేతుల మీదుగానే జరిగింది. 2022లో కృతిక- కృష్ణల వివాహం ఎంతో ఆడంబరంగా, కన్నులపండగ్గా జరిగింది. రెండు రోజుల క్రితం కృతిక.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.చెల్లెలికి సర్ప్రైజ్వితికాకు అసలే సర్ప్రైజ్లంటే చాలా ఇష్టం. తన భర్తను, ఫ్రెండ్స్ను ఎప్పుడూ ఏదో ఒకరంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చెల్లెలికి ఊహించని కానుకనిచ్చింది. అదే ఆమె సీమంతం. ఒక గదిని అందంగా డెకరేట్ చేసి చెల్లెలి సీమంతం జరిపింది. ఫ్రెండ్స్, కజిన్స్ సమక్షంలో సర్ప్రైజ్ సీమంతం జరుపుకోవడంతో కృతిక మనసు సంతోషంతో నిండిపోయింది. పెద్దమ్మ గిఫ్ట్వీళ్లంతా కలిసి చిన్నపాటి బేబీ డ్రెస్పై బొమ్మలు పెయింట్ వేశారు. వితిక అయితే అక్షరాభ్యాసానికి రెడీగా టీషర్ట్పై తెలుగు అక్షరాలను గీసింది. అందులో పెద్దమ్మ అనే అక్షరాలను పొందుపరిచి వాటిని అండర్లైన్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను వితికా అభిమానులతో పంచుకుంది. అది చూసిన అభిమానులు.. మీ ఓపికను మెచ్చుకుని తీరాల్సిందే! అవతలివారి సంతోషంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)చదవండి: ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత -
బలవంతంగా ఆర్మీకి.. మాతో కలిసి భోజనం కూడా చేయడు: పవన్ పేరెంట్స్
పవన్ కల్యాణ్ పడాల.. అగ్నిపరీక్షలో ఇతడిని చూసి విన్నింగ్ మెటీరియల్ అనుకున్నారంతా! ఫోకస్ అంతా ఆటపైనే ఉండేది. ఆలోచనంతా గెలుపుపైనే ఉండేది. ఇలాంటి వ్యక్తి బిగ్బాస్ షోలో అడుగుపెడితే అసలైన మజా ఉంటుంది, అవతలి కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని భ్రమింపజేశాడు. కానీ, బిగ్బాస్కు వచ్చీరావడంతోనే తన ఫోకస్, ఆలోచనలన్నీ పక్కనపెట్టేశాడు. ట్రాక్ తప్పిన పవన్అసలు లక్ష్యాన్ని గాలికొదిలేసి రీతూ, తనూజలను ఓరచూపులు చూడటం, అమ్మాయిలు ఏడిస్తూ వారిని హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయట్లేదు. ఇది చూసిన బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ప్రియులకు నీరసమొచ్చేసింది. ఆర్మీ జాబ్కు బ్రేక్ తీసుకుని మరీ బిగ్బాస్కు వచ్చిన పవన్ ట్రాక్ తప్పడం ఒకింత ఆశ్చర్యమనే చెప్పవచ్చు. అయితే పవన్.. పేరెంట్స్ కోసమే బలవంతంగా ఆర్మీకి వెళ్లాడు. ఇష్టం లేకుండా సైన్యంలో చేర్పించారని తల్లిదండ్రులతో ఏడాదిన్నరపాటు మాట్లాడనేలేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేక..ఈ విషయం గురించి పవన్ (Pawan Kalyan Padala) తండ్రి మాట్లాడుతూ.. నేను, నా భార్య కొన్నేళ్లక్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాం. చావు అంచులవరకు వెళ్లొచ్చాం. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఆ సమయంలో వాడిని వాళ్ల అత్త దగ్గరకు పంపించాం. అక్కడ నాలుగైదేళ్లున్నాడు. అక్కడినుంచి హాస్టల్లో చేర్పించాం. చదువైపోగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరను, ఇంటికొచ్చేస్తా.. అన్నాడు. అలాగైతే నా ఇంటికి రావొద్దని చెప్పాను. బలవంతంగా ఉద్యోగానికి..ఆరోజు వచ్చేయ్రా అనుంటే ఈ పరిస్థితిలో ఉండేవాడా? మా బాబాయ్, అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తారు. అలా నా కొడుకుని కూడా అదే రంగంలో చూడాలనుకున్నాను. బలవంతంగా ఆర్మీకి పంపించామని 14 నెలలు మాతో మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా కట్ చేసేవాడు. నెల రోజులపాటు సెలవులకు ఇంటికి వచ్చినా సరే బయట ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. మాతో కూర్చుని పావుగంటైనా మాట్లాడేవాడు కాదు.. కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు.నా డబ్బుతోనే పెళ్లి చేస్తానేను తిరగడానికి వచ్చాను, మీతో ఊసులాడటానికి కాదంటాడు. వాడికెలా ఉండాలో తెలీదు. వాడు స్నానం చేయడానికి వెళ్తే కూడా బాత్రూమ్లో నేనే నీళ్లు పెట్టేవాడిని. నేను ఒకప్పుడు డ్రైవర్ను. ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల కిరాణ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా. కల్యాణ్ డబ్బు ఇస్తానంటాడు.. కానీ నేను తీసుకోను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వాడి పెళ్లి చేస్తాను. అదే భయంగా ఉందిఅగ్నిపరీక్షకు అప్లై చేసిన విషయం చెప్పలేదు. సెలక్ట్ అయ్యాక చెప్పాడు. మా ఇష్టాన్ని తను కాదనలేదు కాబట్టి తన ఇష్టాన్ని మేమూ అంగీకరించాం. బిగ్బాస్ షోలో కల్యాణ్ ఆట గురించి ఎవరైనా చెప్తుంటే ఆ క్షణం ఆనందంగా ఉంటుంది, కానీ మనసుకు నచ్చదు. ఆ షో నుంచి వచ్చాక ఉద్యోగానికి వెళ్తాడా? లీవ్ గురించి అక్కడేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్నదే భయంగా ఉంది అని పవన్ తండ్రి చెప్పుకొచ్చాడు.చదవండి: హౌస్మేట్స్ను వెర్రిపప్పలను చేసిన బిగ్బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు -
హౌస్మేట్స్ను వెర్రిపప్పలను చేసిన బిగ్బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు!
మీరు పొడిచిందేమీ లేదు, మీ వల్ల షోకి మజా కూడా లేదు అనుకున్నాడో ఏమోకానీ వైల్డ్కార్డులను దింపబోతున్నాడు బిగ్బాస్ (Bigg Boss 9 Telugu). ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో అగ్నిపరీక్ష నుంచి నలుగురు కంటెస్టెంట్లను హౌస్కి పంపించాడు. అందులో ఎవరు బిగ్బాస్ హౌస్లో ఉండాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోమని కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. ముందుగా వచ్చిన నలుగురు.. షాకిబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత, అనూష రత్నం తామెందుకు అర్హులనేది పాయింట్స్ చెప్పారు. శ్రీజ, కల్యాణ్కు కౌంటర్లుఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చనగానే శ్రీజ (Srija Dammu) పైకి లేచింది. హౌస్లోకి రావాలనుకుంటే ఎవర్ని స్వాప్ చేసుకుంటావ్? అని అడిగింది. అందుకు అనూష.. నీతోనే స్వాప్ చేసుకుంటా.. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండు మీద పిన్నీస్ పెట్టి పొడుస్తూనే ఉంటావ్.. నీ అంత నెగెటివిటీ ఎవరి దగ్గరా లేదు అని చెప్పింది. అటు దివ్య కూడా.. శ్రీజతోనే స్వాప్ చేసుకుంటానంది. షాకిబ్, నాగ.. పవన్ కల్యాణ్తో స్వాప్ చేసుకుంటామన్నారు. అగ్నిపరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ లేదన్నారు.వీడికి ఇంకో అమ్మాయి కావాలట! ఈ చర్చలయ్యాక బిగ్బాస్ వారిని బయటకు పంపించాడు. దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్, అనూష ఓవర్ స్మార్ట్.. నాగ, షాకిబ్లో ఎవరైనా ఓకే అని రీతూ అంది. డిమాన్ మాత్రం.. దివ్య అయితే బాగుంటుందన్నాడు. పక్కనే ఉన్న సంజనా.. వీడికి ఇంకో అమ్మాయి కావాలట.. అంటూ ఏడిపించింది. అనంతరం బిగ్బాస్.. ఏ కంటెస్టెంట్ కావాలన్నది హౌస్మేట్స్తో ఓటింగ్ వేయించాడు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ట్రయాంగిల్ కాస్తా..ఈ ఆటలో మీ పావు మీరు కదిపారు. ఇప్పుడు నేను అసలైన ఆట ఆడతా అన్నట్లుగా అందరికీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. హౌస్మేట్స్ను ఆటలో అరటిపళ్లను చేస్తూ తక్కువ ఓట్లు వచ్చిన దివ్య నిఖితను హౌస్లోకి పంపించాడు. ఈ దెబ్బకు హౌస్మేట్స్ షాకై చూస్తుండిపోయారు. ఇక రావడంతోనే దివ్య.. హౌస్లో ట్రయాంగిల్ నడుస్తోంది.. అది దాదాపు స్క్వేర్ యాంగిల్ అవుతుందేమోనని చెప్పింది.అందరూ షేకయ్యారుఆ ఒక్క మాటతో అందరూ వణికిపోయారు. ఇద్దరు పవనాలు (డిమాన్ పవన్, పవన్ కల్యాణ్) మధ్యలో రీతూ అన్న విషయం అందరికీ తెలిసిందే! స్క్వేర్ అన్నదంటే కల్యాణ్.. తనూజను లింక్ చేస్తోందని అర్థం. దివ్య కావాలనే ఈ లవ్ ట్రాక్ గురించి బయటపెట్టింది. నేను ఒక్క మాట చెప్తే దానికి నలుగురు షేక్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు ఎలా ఉంటారో చూస్తానుద! ఏది నిజమైన లవ్ ట్రాక్? ఏది డ్రామా? తెలిసిపోతుంది అని కెమెరాలతో మాట్లాడింది. మళ్లీ దొంగతనం గోలఇక సంజనా.. రానురానూ గజదొంగలా మారిపోతోంది. దొంగతనం తప్ప ఏదీ చేయను అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. తనూజ కాఫీ పౌడర్, సుమన్ సిగరెట్స్ దాచేసిన ఆమె.. ఇప్పుడు దివ్య నిఖిత మేకప్ సామాన్ కొట్టేయాలని పథకం రచించింది. దొంగతనం ఒకసారి చేస్తూ క్యూట్ ఏమో కానీ, ఇలా పదేపదే చేస్తుంటే అది చూసేవారికి రోత పుట్టిస్తుంది. ఈ విషయంలో ఈసారైనా నాగ్.. సంజనాకు క్లాస్ పీకుతాడేమో చూడాలి!చదవండి: నాకు పిల్లలు కావాలి: సల్మాన్ ఖాన్ -
బిగ్బాస్లోకి మరో కంటెస్టెంట్ ఫిక్స్.. శ్రీజ, పవన్ను ఏకిపారేశారు!
బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం పదమూడు మంది కంటెస్టెంట్లున్నారు. విన్నింగ్ మెటీరియల్ అనిపించేలా ఏ ఒక్కరూ లేరు. అంతో ఇంతో ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆటకు ఆట.. వినోదానికి వినోదం, ఎమోషన్స్కు ఎమోషన్.. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అతి మంచితనం చూపిస్తున్నాడు.అగ్నిపరీక్ష నుంచి మరొకరుఇకపోతే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ ప్రేక్షకులకు విపరీతంగా విసుగు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా! అయితే అదే అగ్నిపరీక్ష నుంచి మరో ఇద్దర్ని హౌస్కు పంపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో షాకిబ్, దివ్య నిఖిత, నాగ ప్రశాంత్, అనూష రత్నం ఉన్నారు. వీరిలో ఒకర్ని మీరే ఎంపిక చేయాలని బిగ్బాస్ కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. ఉన్నదున్నట్లు మాట్లాడిన అనూషదానికంటే ముందు అనూష.. శ్రీజ (Dammu Srija)కు వరుస కౌంటర్లిచ్చింది. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండుపై పిన్నుతో గుచ్చినట్లు పొడుస్తూనే ఉంటావ్. 24 గంటలు నెగెటివ్ ఎనర్జీతో ఉండే నీతోనే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నా అంది. ఆ మాటకు శ్రీజ షాకై అలా చూస్తూ కూర్చుండిపోయింది. షాకీబ్.. పవన్ కల్యాణ్ స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. టైంపాస్ చేయడానికా?అక్కడితో ఆగలేదు. పవన్ చేస్తున్న పనుల్ని ఎండగట్టాడు. షోకి ఎందుకొచ్చినం బ్రో? టైంపాస్ చేయడానికి కాదు కదా.. బయటకు వెళ్లగొడితే ఎట్లుంటదనేది నేను ఆల్రెడీ చూసేశిన. ఆ ఫీలింగ్ మీకు తెలియదు అన్నాడు. మొత్తానికి వచ్చీరావడంతోనే శ్రీజ, పవన్ కల్యాణ్కు ఆడియన్స్ ఎలా ఫీలవుతున్నారనేది చెప్పి వారికి హింట్లు ఇచ్చేశారు. ఇక హౌస్మేట్స్ అందరూ దివ్య నిఖితను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ముచ్చుముఖం రీతూ.. నా భర్తకు ఏదో అలవాటు చేసింది -
లక్స్ పాప సేఫ్.. నీలా బూతులు మాట్లాడనంటూ రీతూను రెచ్చగొట్టిన శ్రీజ
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై రెండు వారాలైందంతే.. అప్పుడే ఫ్యామిలీ కోసం బోరుమని ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. ప్రతిసారి కనీసం నెల రోజుల తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లెటర్లు గట్రా పంపేవాడు. అదేంటో కానీ ఈసారి రెండువారాలకే ఈ కుటుంబ ఎమోషన్స్ ఎపిసోడ్ మొదలుపెట్టేశారు. బ్లూ సీడ్స్ అందుకున్నవారికే ఈ అవకాశం కల్పించాడు. సీక్రెట్ బాక్స్ ఓపెన్అందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫోటో గెల్చుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో తనూజ, ప్రియ ఇంటినుంచి లెటర్స్ అందుకున్నారు. సుమన్ ఇంటినుంచి ఏదైనా అందుకోవాలంటే భరణి సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్బాస్ మెలిక పెట్టాడు. దీంతో అతడు తన బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఒక చైన్, లాకెట్ ఉంది. లాకెట్లో అమ్మ, గురువు అని రాసుంది. వీరిద్దరూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పాడు.శ్రీజ, రీతూ మధ్యే అసలైన పోటీఅలా సుమన్ తండ్రి ఫోటో అందుకున్నాడు. కానీ సంజనాకు ఏదీ అందలేదు. ఇకపోతే బ్లాక్ సీడ్స్ ఉన్న ముగ్గురు రీతూ, శ్రీజ, ఫ్లోరాకు గురి తప్పద్దు అనే గేమ్ పెట్టాడు. ఈ గేమ్కు సంజనాను సంచాలక్గా పెట్టారు. ఇక బరిలో దిగిన శ్రీజ, రీతూ పోటాపోటీగా ఆడారు. రీతూ విజయం తథ్యం అన్న సమయంలో శ్రీజ ఆటను మలుపు తిప్పింది. తను గెలవకపోయినా పర్లేదు కానీ రీతూ గెలవకూడదన్న ఉద్దేశంతో ఫ్లోరాకు సాయం చేసింది.నీలాగా బూతులు మాట్లాడట్లేదుగాఅది చూసిన రీతూ.. గేమ్ సరిగా ఆడు, నువ్వు గెలవాలని ఆడు కానీ, ఇదేంటి? అని చిరాకు పడింది. అందుకు శ్రీజ.. నా గేమ్ నా ఇష్టం. నువ్వు మొన్న రాముకు సపోర్ట్ చేయలేదా? నేను ఫ్లోరాకు సమాన అవకాశం రావాలని చేస్తున్నా.. నీలాగా బూతులు మాట్లాడి వేరొకరినైతే హర్ట్ చేయట్లేదుగా అని కౌంటరిచ్చింది. చివరకు ఈ గేమ్లో ఫ్లోరా గెలిచి ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకుంది.ఎప్పుడూ ఇంతే..అంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కకపోవడంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు అదృష్టం కలిసిరాదు, ఎప్పుడూ ఇంతే.. అని బోరుమని ఏడవడంతో అందరూ ఆమెను ఓదార్చారు. ఇక ఈ వారం ఫ్లోరా గెలవడంతో నామినేషన్స్లో ఐదుగురే మిగిలారు. వారే ప్రియ, రాము, రీతూ, పవన్ కల్యాణ్, హరీశ్. వీరిలో ప్రియ డేంజర్ జోన్లో ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి!చదవండి: స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి -
బిగ్బాస్కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు తిడుతున్నారు?
సామాన్యుల్లో నుంచి వజ్రాల్ని వెలికితీసి పంపాలనుకుంది బిగ్బాస్ (Bigg Boss Telugu 9) టీమ్. అందుకే అగ్నిపరీక్ష కార్యక్రమం నిర్వహించింది. దానికి బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగానూ వ్యవహరించారు. గేమ్స్ ఆడుతూ, ముక్కుసూటిగా మాట్లాడిన వారిని, చలాకీగా ఉన్నవారిని సెలక్ట్ చేసి పంపారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లోకి వెళ్లాక అంతా రివర్స్ అయింది. కామనర్లపై నెగెటివిటీఆట సంగతి పక్కనపెడితే మాటలు, గొడవలు, రూల్స్, ప్రవర్తన.. అన్నిరకాలుగా పెంట పెంట చేశారు. దీంతో కామనర్లు మాకొద్దురా బాబూ అని జనం తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతవారం కామనర్ల నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చంటున్నారు. అందులో ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది. పుట్టుకతో వచ్చిన గొంతుఈ క్రమంలో ప్రియ (Priya Shetty) పేరెంట్స్ సురేఖ-వివేకానంద ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వారు మాట్లాడుతూ.. బిగ్బాస్కు వద్దనే చెప్పాం. అగ్నిపరీక్షకు ట్రై చేస్తుంటే కూడా వద్దన్నాం. తనే గట్టిపోటీనిస్తానంటూ షోకి వెళ్లింది. అగ్నిపరీక్షలో ఆదరించిన ప్రేక్షకులే ఇప్పుడు బిగ్బాస్ షోలో ఉన్నప్పుడు విమర్శిస్తున్నారు. పుట్టుకతో వచ్చిన గొంతుకకు మనమేం చేయలేం. చాలా తప్పుతను ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. వాయిస్ వల్ల మీకు డిఫరెంట్గా కనిపిస్తుందంతే! గొంతు వల్ల ఆమెను ట్రోల్ చేయడం చాలా తప్పు. అగ్నిపరీక్షలో కూడా అదే గొంతుంది. అప్పుడేమో క్యూట్ అంటూ ఓట్లేశారు. ఇప్పుడెందుకు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు? ఈ ట్రోలింగ్ చూస్తుంటే బాధేస్తోంది. బిగ్బాస్ వల్ల తన పెళ్లికి ఏమీ ఎఫెక్ట్ కాదు. తనను అర్థం చేసుకునే వ్యక్తితోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్
బిగ్బాస్ హౌస్లో రీతూ చౌదరి (Rithu Chowdary) వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాన్ పవన్, లేదంటే పవన్ కల్యాణ్తో కూర్చుని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ, ఏదో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్బాస్ హౌస్ను పార్క్లా మార్చేసింది. కెప్టెన్గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాడిలా కల్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, హత్తుకుని ఓదారుస్తున్నాడు.భార్యను వదిలి రీతూతో..చిన్నచిన్నవాటికే కన్నీళ్లుపెట్టుకుంటున్న రీతూ బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో! హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! అయితే తను గర్భంతో ఉండగా మహేశ్.. రీతూతో క్లోజ్గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడంది.రీతూ, నేను ఫ్రెండ్స్తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేశ్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! తనను ఫ్రెండ్లా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?ఇల్లు ఖాళీ చేయించిందిఏడేళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. నటి లవ్స్టోరీ
డిమాన్ కెప్టెన్ అవ్వడం కోసం అడ్డదారులు తొక్కిన రీతూ చౌదరి (Rithu Chowdary)కి పెద్ద ఝలక్ తగిలింది. కెప్టెన్గా డిమాన్ ఒకర్ని సేవ్ చేయొచ్చంటే అతడు రీతూకి బదులుగా శ్రీజను సేవ్ చేశాడు. అది చూశాక రీతూ.. నా హార్ట్ బ్రేక్ అయిందంటూ ఏడ్చేసింది. అటు శ్రీజ.. ఓనర్లందరూ కలిసి తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదన్నారంటూ ఏడుపు అందుకుంది. దీంతో ఇమ్మూ రంగంలోకి దిగి నువ్వు నా చెల్లివి.. అని ఓదార్చడంతో తను కుళాయి కట్టేసింది. తర్వాత బిగ్బాస్ రీతూను కన్ఫెషన్ రూమ్కు పిలిచాడు. చికెన్ కోసం సీక్రెట్స్ బట్టబయలుఅక్కడ తనకెంతో ఇష్టమైన చికెన్ ఎదురుగా కనిపించేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది రీతూ. అమ్మ, అన్నయ్య నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతారు.. అంటూ వాళ్లను గుర్తు చేసుకుంది. అయితే ఇక్కడే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల రహస్యాలు చెప్తేనే ఆ చికెన్ తినొచ్చన్నాడు. తనూజకు.. కల్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పైకి మాత్రం చూపించదు. అతడు దగ్గరుంటే తను సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. డిమాన్ గురించి అడగ్గా.. పవన్ సింగిల్, గతంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ తనకు కరెక్ట్గా ప్రపోజ్ కూడా చేయలేదు.సీక్రెట్ చెప్పి సంజనాదీంతో తను వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు ఎవర్నీ సరిగా ప్రేమించలేదన్నాడు. ఇప్పుడైతే నా మీద మంచి అభిప్రాయం ఉందన్నాడు అని ఉన్నదంతా చెప్పేసింది. ఇవి అందరికీ తెలిసినవేగా! మంచి రహస్యాలు కావాలన్నట్లుగా బిగ్బాస్ డిమాండ్ చేశాడు. దీంతో రీతూ.. సాయంత్రం లోపు కనుక్కుని మంచి సీక్రెట్స్ చెప్తానంది. అలా సంజనా దగ్గర ఓ రహస్యాన్ని కనుక్కుంది. సంజనా మాట్లాడుతూ.. కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. అయితే, అతడు నన్ను కొట్టేందుకు ప్రయత్నించాడు. నా తలపై కొడితే కుట్లు వేస్తారు.. ముఖం పాడవుతుంది, హీరోయిన్ కాలేను, అప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చనుకున్నాడు. సినిమా చూపిస్తాతర్వాత మా మధ్య గొడవై నేను వదిలేశాను. అప్పుడతడు పిచ్చోడై గడ్డం, మీసాలు పెంచాడు. ఓ రోజు కారు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పింది. ఇదిలా ఉంటే బిగ్బాస్ వైల్డ్కార్డ్ ఎంట్రీల గురించి అందరికీ హింటిచ్చాడు. నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆటను నా చేతిలోకి తీసుకోబోతున్నా.. అసలు సినిమా ఎలా ఉంటుందో వచ్చేవారం చూపిస్తా.. జరగబోయేది మీ ఊహకు మంచి ఉండబోతోంది అన్నాడు. గార్డెన్ ఏరియాలో చెట్టుపై ఎవరి పేర్లు రాసి ఉన్న పండ్లను వారు తీసుకోవాలన్నాడు. అందులోని విత్తనం మీ భవిష్యత్తును సూచిస్తుందన్నాడు. అప్పుడే ఇంటి నుంచి సందేశాలుఅయితే ఫలాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుకు రమ్మంటే రీతూ, ప్రియ, శ్రీజ ముందుకొచ్చారు. దీంతో వాళ్లు తమ పండ్లకు బదులుగా బిగ్బాస్ పంపిన మరో మూడు పండ్లను తలా ఒకటి తీసుకున్నారు. ఒక్కో రంగు విత్తనం దేన్ని సూచిస్తుందనేది సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. ముందుగా బ్లూ విత్తనం వచ్చినవారి (ఇమ్మాన్యుయేల్, సంజన, సుమన్ శెట్టి, తనూజ, ప్రియ)కి బిగ్బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఏడ్చేసిన ఇమ్మూఇంటి నుంచి వచ్చిన సందేశాలను, జ్ఞాపకాలను గెలుచుకోవాలన్నాడు. ఇందుకోసం 100% ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లగా.. తండ్రి లెటర్ కావాలంటే బ్యాటరీలో 45%, తల్లి ఆడియో మెసేజ్ కావాలంటే 35%, ఫ్యామిలీ ఫోటో కావాలంటే 25% బ్యాటరీని వాడాల్సి ఉంటుందన్నాడు. అన్నింటికంటే తక్కువ బ్యాటరీ ఖర్చయ్యే ఫోటోను ఇమ్మూ సెలక్ట్ చేసుకుని ఎమోషనలయ్యాడు. చదవండి: రాజకీయాల్లోకి హీరో వరుణ్ సందేశ్ తల్లి -
Bigg Boss 9: ‘సారీ అమ్మా.. ’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కమెడియన్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 9వ సీజన్ చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. మూడోవారం నామినేషన్స్లో హరీశ్, ప్రియ, కల్యాణ్, రాము, రీతూ,ఫ్లోరా ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. ఇప్పటికి వరకు కండబలం, బుద్ది బలంపై ఫోకస్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు భావోద్వేగ బలంపై దృష్టిపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో..వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే అది పొందాలంటే కొంత మూల్యం చెల్లించాల్సిందే అంటూ అక్కడ వందశాతం నిండి ఉన్న బ్యాటరీని చూపించాడు.బటన్ ప్రెస్ చేసి అవకాశం దక్కించుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ముందు మూడు ఆప్షన్లు పెట్టాడు బిగ్బాస్. నాన్న నుంచి వచ్చిన లేఖను పొందలాంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం తగ్గింపోతుందని, అమ్మ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ని పొందాలంటే 30 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, ఫ్యామిలీ ఫోటోని పొందాలంటే 25శాతం తగ్గుతుందని చెప్పి.. ఇందులో ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ఇది విని ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నేను ఏడిస్తే..మా అమ్మ తట్టుకోలేదు’ బిగ్బాస్ అంటూ కన్నీళ్లు తూడ్చుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ కోసం ఇమ్మాన్యుయేల్ చివరి ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. -
అందరూ కలిసి హరీశ్ను బలి చేశారుగా! నామినేషన్స్లో ఎవరంటే?
తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లతో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్ చేయాలన్నాడు. అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయుండాలన్నారు.నామినేషన్స్కెప్టెన్ అయ్యాక సంజనాకు అహం పెరిగిపోయిందని హరీశ్, ప్రియ.. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వదని శ్రీజ అభిప్రాయపడ్డారు. అలా మొదట సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. ఇక టెనెంట్స్లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్ను నామినేషన్స్లో ఇరికించేశారు. ఇంతటితో అయిపోలేదు. బిగ్బాస్ ఈ ప్రక్రియలో ఓ ట్విస్ట్ ఇచ్చాడట! గండం గట్టెక్కిన సంజనానామినేషన్స్లో ఉన్నవారు ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడట! దీంతో సంజనా.. రాము రాథోడ్తో స్వాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే టెనెంట్స్లోనుంచి ప్రియ, కల్యాణ్ కూడా నామినేషన్స్లోకి వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి రీతూ, సుమన్, ఫ్లోరా, రాము, ప్రియ, కల్యాణ్, హరీశ్ నామినేషన్స్లో ఉన్నారా? లేదంటే మళ్లీ ఏవైనా ట్విస్టులు ఇచ్చారా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్బాంబ్ వేసిన మనీష్
బిగ్బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్పై ఓ బిగ్బాంబ్ విసిరాడు. మరి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. రీతూ చౌదరి వల్ల కెప్టెన్సీ పెంటపెంటయింది. దీంతో కెప్టెన్సీ టాస్క్ను రద్దు చేసి మళ్లీ గేమ్ పెట్టారు. ఈ గేమ్లో పవన్ కష్టపడి కెప్టెన్సీ సాధించుకున్నాడు. తర్వాత ఓ ఫన్ గేమ్ ఆడించగా అందులో కామనర్స్ గెలిచారు.మనీష్ ఎలిమినేటెడ్ఇక నాగ్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా చివరకు ఫ్లోరా, మనీష్ (Manish Maryada) మిగిలారు. ఎలాగో ఫ్లోరా ఎలిమినేషన్ ఖాయమని ఫిక్సయిన కామనర్లు.. ఆమెకు ఆల్ ద బెస్ట్, మిస్ యూ అంటూ డైలాగులు చెప్పారు. తీరా ఫ్లోరా సేఫ్, మనీష్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే అందరూ నోరెళ్లబెట్టారు. మనీష్ వెళ్లేముందు అతడితో ఓ గేమ్ ఆడించారు. ఈ షోలో టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరు? చెప్పాలన్నాడు. బాటమ్ 3లో శ్రీజఅందుకు మనీష్ ముందుగా బాటమ్ 3లో శ్రీజ (Dammu Srija) పేరు చెప్తూ తను గేమ్ సరిగా ఆడట్లేదన్నాడు. తర్వాత ఫ్లోరా సైనిని బాటమ్లో పెడుతూ.. ఆమె పని తప్ప గేమ్ కనిపించట్లేదన్నాడు. సుమన్ను కూడా బాటమ్ 3లో యాడ్ చేశాడు. సుమన్ అన్నా.. హ్యాట్సాఫ్. మీరు ఏం ఆడుతున్నారన్నా.. నేనసలు ఊహించనేలేదు. అయినా బాటమ్లో ఎందుకున్నారంటే.. అలా కనిపించి, ఇలా వెళ్లిపోతారు. మీకంటూ ఓ స్టాండ్ తీసుకోరు అని చెప్పుకొచ్చాడు. తర్వాత టాప్ 3 గురించి మాట్లాడాడు. ఆయనే నెం.1నా ప్రకారం భరణిగారు నెం.1. ఆయన అందరి కోసం ఆలోచిస్తారు, మరోపక్క గేమ్ కూడా ఆడతారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెండర్. మీలాంటివాళ్లతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు, మీతో ఫైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్.. మొదట ఇతడిని నేను సీరియస్గా తీసుకోలేదు. కామెడీ చేస్తారంతే అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు. కామెడీ, ఎమోషన్స్, గేమ్.. అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని తప్పకుండా టాప్ 3లో చూడాలనుకుంటున్నా.. వేరేవాళ్ల కోసం ఆటను వదిలేయకండి అని సూచనలిచ్చాడు.అపార్థం చేసుకున్నా..కామనర్ల నుంచి ఏకైక వ్యక్తిని టాప్ 3లో చేర్చాడు. అతడే హరీశ్. ఎమోషన్స్ దగ్గరే ఆగిపోకండి. కొంచెం కోపం తగ్గించుకుంటే టాప్ 1కి వెళ్తారు అన్నాడు. తర్వాత నాగార్జునను అడిగి మరో వ్యక్తిని టాప్ 4గా వెల్లడించాడు. ఆవిడే సంజన. సంజనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో తర్వాత అంత అర్థం చేసుకున్నాను. నాకు, తనకు ఇంట్లో ఏ పనీ లేదు. అయితే పని రాలేదు కాబట్టి తనే పని తెచ్చుకుంటా.. అది కూడా గేమే అంది. అప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయింది.రాత్రి ఒంటరిగా కన్నీళ్లుపగలంతా అందర్నీ సతాయిస్తుంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కువ మిస్ అయ్యేది సంజననే.. అని ఎమోషనలయ్యాడు మనీష్. అందరినీ పని అడిగాను, ఎవరూ ఇవ్వలేదు. ఈమె ఒక్కరే నాకు వర్క్ ఇచ్చింది. తనకు నేను వంట చేసి పెట్టాను. మీరు టాప్ 3లో ఉండాలి. భాష నీకు అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ ధైర్యం చెప్పాడు. జైల్లోకి ఫ్లోరా..అందుకు సంజనా.. నేను తెలుగమ్మాయినే, నాకు భాష ఏం అడ్డం కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్లో మోస్ట్ బోరింగ్ మనిషిగా ఫ్లోరాను ఎంపిక చేశారు. దీంతో ఆమె జైల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆమె చేసే వాష్రూమ్ డ్యూటీ టెనెంట్స్లో ఒకరికి వేయాలన్నాడు నాగ్. దీంతో ఈ బిగ్బాంబ్ను మనీష్ ఇది నా రివేంజ్ అంటూ ప్రియకు ఆ క్లీనింగ్ పని అప్పగించి సెలవు తీసుకున్నాడు.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో రెండోవారం కూడా ఫ్లోరా సేవ్ అయింది. ఆ విషయం ఆమె కూడా నమ్మలేకపోతోంది. అందుకే నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున.. ఫ్లోరా సేవ్, మనీష్ ఎలిమినేట్ అనగానే ఏంటి? ఇది నిజమేనా? అని కొన్ని క్షణాలపాటు షాక్లో ఉండిపోయింది. ఆమెకే కాదు హౌస్మేట్స్కు కూడా ఇది పెద్ద షాకే! అందులోనూ కామనర్లకు మరీ పెద్ద షాక్!తన గోతి తనే తవ్వుకున్న మనీష్మనీష్ (Maryada Manish) ఎలిమినేషన్కు ఎవరూ కారణం కాదు, ఆయన స్వీయతప్పిదాలే తన కొంప ముంచాయి. హౌస్లో ఓవర్ థింకింగ్కు కేరాఫ్ అడ్రస్గా మారాడు. కామనర్లను ఓనర్లను చేయగానే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. కారణం లేకుండానే సెలబ్రిటీ రాము రాథోడ్ను ఈసడించుకున్నాడు, కసురుకున్నాడు. భరణిని సైతం అసహ్యంగా చూశాడు. అలాంటి వ్యక్తి పక్కన పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు. నా బెడ్ షేర్ చేసుకోను అని భరణిని శత్రువును చూసినట్లే చూశాడు.కన్నీళ్లు వృథాఓ గేమ్లో సంచాలక్గా వ్యవహరించి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రియ, శ్రీజల వల్ల ఎక్కువ ఇబ్బందిపడింది మనీషే! మూలన కూర్చుని ఏడువుపో అని శ్రీజ అతడిని కూరలో కరివేపాకులా తీసిపడినా మాటలు పడ్డాడు, పక్కకెళ్లి ఏడ్చాడు, తప్ప ఆమెను నామినేట్ చేయలేదు. ప్రియ మానిటర్గా ఉంటే భోజనం కూడా చేయనని భీష్మించుకున్నాడు తప్ప ఆమెను కూడా నామినేట్ చేయలేదు. కొంప ముంచిన నామినేషన్వీళ్లిద్దరి వల్ల మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. నామినేషన్స్లో మాత్రం వాళ్లను వదిలేసి సెలబ్రిటీలను నామినేట్ చేయడం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ అతడిపై నెగెటివిటీని మరింత పెంచాయి. మనీష్ ఎలిమినేషన్కు ఇదే బలమైన కారణం! వాళ్లను నామినేషన్ చేసుంటే మనీష్ సేవ్ అవడంతో పాటు అతడి గ్రాఫ్ విపరీతంగా పెరిగుండేది. ఇకపోతే మనీష్.. ఇంగ్లీష్ దొరలా ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేవాడు. లైవ్లో అయితే మరీ దారుణంగా తెలుగు తప్ప ఇంగ్లీషే మాట్లాడేవాడు.రెమ్యునరేషన్ ఎంత?ఈ విషయంపై బిగ్బాస్ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయి. తెలుగు రాని ఫ్లోరా, సంజనాయే చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మనీష్ మాత్రం మహామేధావిలా ఇంగ్లీష్లోనే ఎందుకు వాగుతాడన్న అసహనం కూడా జనాల్లో ఉంది. ఇలా తను చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండోవారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కామనర్లందరికీ దాదాపు రూ.70-80 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మనీష్ రెండు వారాలకుగానూ లక్షన్నర సంపాదించాడన్నమాట!చదవండి: నా భర్తతో బిగ్బాస్ రీతూ ఎఫైర్.. వీడియో విడుదల చేసిన నటుడి భార్య -
రీతూ వల్ల కెప్టెన్సీ పాయే.. కానీ మళ్లీ గెలిచి సాధించిన పవన్
నువ్వు అనుకుంటే అయిపోద్ది సామీ! అన్నది సినిమా డైలాగ్.. అయితే బిగ్బాస్ (Bigg Boss Telugu 9)లోనూ రీతూ బలంగా కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే! డిమాన్ పవన్ కెప్టెన్ అవాలని ఆశపడింది. తాను సగం చాక్లెట్ తిని.. ఎంగిలి చేసిన చాక్లెట్ను పవన్కు ఇస్తూ నువ్వే కెప్టెన్ అవాలి అని కళ్లతోనే ఆర్డరేసింది. తీరా సంచాలక్ పదవి తన చేతికే రావడంతో పవన్ను కెప్టెన్ చేసేసింది.మళ్లీ కెప్టెన్ అయిన పవన్కానీ నాగార్జున ఈ వ్యవహారాన్నంతా వీడియో వేసి మరీ చూపించాడు. సంచాలక్గా రీతూ.. భరణిని అవుట్ చేయడం తప్పని చెప్పాడు. పవన్ను కావాలనే గెలిపించిందన్నాడు. దీంతో పవన్.. నిజాయితీగా కెప్టెన్సీ గెలుస్తాను, ఇది నాకొద్దంటూ కెప్టెన్సీ బ్యాడ్జ్ తిరిగిచ్చేశాడు. దీంతో హౌస్లో మరోసారి కంటెండర్లు భరణి, మనీష్, ఇమ్మాన్యుయేల్, పవన్ మధ్య గేమ్ పెట్టారు. ఈ గేమ్లో పవన్ గెలిచి మళ్లీ కెప్టెన్సీ సాధించాడని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ పవన్ కెప్టెన్సీ బ్యాడ్జ్తో కనిపించాడు. చదవండి: నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్ -
నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్
జింతాత జితా జితా.. జింతాత తా.. శనివారం ఎపిసోడ్ చూశాక ఈ పాట కచ్చితంగా వేసుకోవాల్సిందే! ఆ రేంజ్లో ఉంది నాగార్జున హోస్టింగ్. మేమే తోపు, ఇల్లంతా మాదే అన్న భ్రమలో బతికేస్తున్న సామాన్యుల మబ్బులు విడిపోయేలా క్లాస్ పీకాడు. ముఖ్యంగా ప్రతిదానికీ గొడవపడటం ఒక్కటే మార్గం అన్నట్లుగా నోరేసుకుని పడిపోతున్న ప్రియ, శ్రీజల నోటికి తాళం వేసేలా మాట్లాడాడు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా చూసేద్దాం..ఒళ్లంతా కళ్లు లేవునాగార్జున (Nagarjuna Akkineni) వచ్చీరావడంతోనే రీతూ చౌదరి సంచాలక్గా ఫెయిలైందని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టాడు. భరణిని కావాలనే గేమ్లో ఎలిమినేట్ చేసిందని చూపించాడు. పవన్ కెప్టెన్ అవాలని ముందునుంచే నిర్ణయించుకున్న ఆమె అనుకున్న ప్రకారం అతడిని కెప్టెన్ చేసిందన్నాడు. రీతూ మాత్రం.. నాకున్నవి రెండే కళ్లు, బాడీ మొత్తం లేవు కదా.. టాస్క్లో పవన్ వేరేవాళ్లకు రంగు పూసింది కనిపించలేదు. నాకతడిపై సాఫ్ట్ కార్నర్ లేదు. కావాలని గెలిపించలేదు అని కహానీలు చెప్పింది. సారీ చెప్పిన రీతూకానీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ రీతూ (Rithu Chowdary) తప్పు నిర్ణయం తీసుకుంది సార్. ప్రియ, శ్రీజ, మనీష్ శాడిస్టులుగా ప్రవర్తించారు. టెనెంట్స్కు అన్యాయం జరిగింది అన్నారు. దాంతో రీతూ చేసేదేంలేక సారీ చెప్పింది. అయితే ప్రియ, శ్రీజ మాత్రం మేమేం తప్పు చేశాం? అని ఏమీ ఎరగనట్లే మాట్లాడారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాం, అందులో తప్పేముంది? అని ప్రశ్నించింది. ప్రియ, శ్రీజలకు ఇచ్చిపడేసిన నాగ్దీనికి నాగ్.. షోకి వెళ్లేవరకు మాత్రమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే అని క్లాస్ పీకాడు. ఎంతసేపూ తుత్తుత్తు అంటూ మాట్లాడతారు. ఇద్దరూ కాదు, ఎవరో ఒకరే మాట్లాడండి అని ప్రియ, శ్రీజలను హెచ్చరించాడు. అలాగే ప్రియ సంచాలక్గా ఫెయిలైన వీడియో (చక్రం టాస్క్లో పవన్ కల్యాణ్ ఫౌల్ గేమ్) కూడా ప్లే చేశాడు. మొదట తనది తప్పేనని ఒప్పుకున్న ఆమె.. తర్వాత తనసలు తప్పు చేయలేదు, అంతా కరెక్ట్గానే ఉందని నాగార్జునతోనే వాదించింది.ఇది కరెక్ట్ కాదు సార్ఇక మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేసిన నాగ్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెడతానని ప్రకటించాడు. ఈసారి కూడా రీతూ చౌదని సంచాలక్గా ఉంటుందని వెల్లడించాడు. ఇది నచ్చని శ్రీజ.. ఇది కరెక్ట్ కాదు సార్.. అంటూ నాగార్జుననే ఎదిరించింది. సంచాలక్ చేసిన తప్పుకి ప్లేయర్ను తీసేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. పవనే ఈ కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడు. ఫెయిర్గా ఆడి గెలవాలనుకుంటున్నాడు. నీకేంటి సమస్య? ప్రతి విషయంలో తుత్తుత్తు అని వస్తావ్ అని శ్రీజ దుమ్ము దులిపేశాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లంటే ఇదే!అలా నెత్తికెక్కిన కామనర్ల కళ్లు కిందకు వచ్చేలా చేశాడు. నాగార్జున కామనర్లపై విరుచుకుపడినప్పుడల్లా ప్రేక్షకుల చప్పట్లతో స్టూడియో దద్దరిల్లిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చేశాడు. ఓనర్షిప్ గెలిచి సాధించుకున్న రాము, భరణి ఓనర్లుగానే కొనసాగుతారన్నాడు. మరి టెనెంట్లయ్యాకైనా కామనర్ల గర్వం అణుగుతుందేమో చూడాలి!చదవండి: బిగ్బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్! -
గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్
ఒక్కసారి నోరు జారితే ఆ మాటను తిరిగి తీసుకోలేం. ఆ విషయం తెలిసి కూడా చాలామంది అదేపనిగా నోరు జారుతూ ఉంటారు. తీరా తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుంటారు. బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో అదే జరిగింది. నిన్న బిగ్బాస్ టెనెంట్లకు ఓనర్లయ్యే అవకాశం కల్పించాడు. ఒక్కో రౌండ్లో ఎలిమినేట్ అయినవారు మిగతావారిలో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చన్నాడు.గాజులేసుకుని కూర్చోండిదాంతో సంజనా, ఫ్లోరా.. ఫస్ట్ సుమన్ను టార్గెట్ చేసి అతడు ఎలిమినేట్ అయ్యేలా చేశారు. అయితే సుమన్ (Suman Shetty) కాసేపు ఆడకుండా సోఫాలో కూర్చున్నందుకు అతడిపై సెటైర్లు వేసింది. మీరు మమ్మల్ని చెడ్డోళ్లను చేసి మీరు గాజులేసుకుని కూర్చోండి అని సుమన్పై ఫైర్ అయింది. అందుకతడు మీరెప్పుడో చెడ్డోళ్లయ్యారు అని కౌంటర్ ఇచ్చింది. సంజనాకు వార్నింగ్ఇక అక్కడే ఉన్న శ్రీజ.. అలాంటి మాటలు మాట్లాడొద్దంటూ సంజనాకు వార్నింగ్ ఇచ్చింది. సంజనా కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. మాస్క్ మ్యాన్ హరీశ్.. ఆడవాళ్లను చాలా చులకన చేసి మాట్లాడాడంటూ గతవారం నాగార్జునతోనే వాదించింది సంజనా. మరిప్పుడు తనే స్వయంగా.. సుమన్ను గాజులేసుకుని కూర్చోండి అనడంలో అర్థమేంటి? అంటే, ఆడవారికి ఏదీ చేతకాదు, ఓ మూలన కూర్చోమనా? ఈ కామెంట్స్తో ఆమె స్త్రీలను అవమానించట్లే అవుతుంది కదా! క్షమాపణలు కోరిన సంజనాఆవేశంలో నోటికి ఎంతొస్తే అంత వాగుతారా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇకపోతే గేమ్ అయ్యాక తన తప్పు తెలుసుకున్న సంజనా.. సుమన్కు సారీ చెప్పింది. నీ చెల్లి అనుకుని క్షమించమని కోరింది. దీంతో అతడు కూడా ఆమె సారీని యాక్సెప్ట్ చేశాడు. మరి నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించి సంజనాకు క్లాస్ పీకుతాడో? లేదో? చూడాలి! We stand with #SumanSetty anna.Worst #SanjanaGalrani 💦She degraded women by saying they’re only capable of wearing bangles and sitting.Last week she tried assassinate #Harish #Maskman character using the same point.What sanjana did is actually insulting women. 🤬… pic.twitter.com/tpKSWotVi4— Guru (@Guruprasath_02) September 19, 2025 చదవండి: నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? -
నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునిక సదానంద్ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. నాకింకా పెళ్లి కాలేఈమె కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. నేను సింగర్ (కుమార్ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది. తప్పేంటి?ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్షిప్ గురించి కునిక కుమారుడు అయాన్ లాల్ స్పందిస్తూ.. నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది. 27 ఏళ్ల వయసులో లవ్అమ్మ అతడిని (కుమార్ సాను) సింగర్గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.రెండు పెళ్లిళ్లు- విడాకులుకునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్ -
పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్
బిగ్బాస్ హౌస్లో బండచాకిరీ చేస్తున్న టెనెంట్స్లో ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్బాస్. ఇందుకోసం ఓ గేమ్ పెట్టాడు. ఓనర్లు విసిరే బంతులు, బొమ్మలను టెనెంట్లు క్యాచ్ చేసి వారి బాస్కెట్లో వేసుకోవాలి. ఎండ్ బజర్ వచ్చేవరకు ఆ బాస్కెట్లోని వస్తువులను ఎవరూ ఎత్తుకుపోకుండా భద్రంగా దాచుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ వస్తువులుంటే వారు ఎలిమినేట్ అవుతూ వస్తారు.గివప్ ఇచ్చేసిన సంజనామొదటి రౌండ్లో ఫ్లోరా, సంజనా బాగానే ఆడారు. కానీ ఫ్లోరా ఓడిపోయింది. అటు సంజన కూడా.. ఆల్రెడీ ఓ వారం కెప్టెన్గా ఇంట్లో ఉన్నాను కాబట్టి వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంటూ గేమ్ నుంచి నిష్క్రమించింది. అయితే వీరిద్దరూ టెనెంట్స్లో ఎవరిని ఓనర్స్గా చూడాలనుకుంటున్నారో వారికి సపోర్ట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9).ఈడ్చిపడేసిన సుమన్దీంతో ఇద్దరూ కలిసి రెండో రౌండ్లో సుమన్ దగ్గరున్న బొమ్మలు తీయబోయారు. వారిని వదిలించుకునే క్రమంలో సుమన్ (Suman Shetty) మోచేయి ఫ్లోరాకి తగిలింది. డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలి వారికి దెబ్బలు తగిలినా సరే సంచాలక్ ప్రియ.. అతడిని ఎలిమినేట్ చేసింది. కానీ తర్వాతి రౌండ్లో రీతూ డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలివారిని కొట్టినా ప్రియ ఆమెను ఎలిమినేట్ చేయకపోవడం గమనార్హం.రీతూ రిక్వెస్ట్ పట్టించుకోని సుమన్రీతూ నన్ను కొట్టినప్పుడు ఎందుకు ఔట్ చేయలేదు? మీ ఫ్రెండ్ అని వదిలేశారా? అని సంజనా నిలదీసినా సరే ప్రియ పట్టించుకోలేదు. ఇక ఫ్లోరా, సంజన, సుమన్.. ముగ్గురూ రీతూ (Rithu Chowdary)నే అటాక్ చేశారు. అన్నా ప్లీజ్ అన్నా, వాళ్లను ఆపు అన్నా.. అని రీతూ.. సుమన్ను బతిమాలుకున్నా అతడు పట్టించుకోలేదు. రీతూ బాస్కెట్ ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్మూకి వస్తువులు పంచేశారు. అది జీర్ణించుకోలేని రీతూ పిచ్చిపట్టినట్లుగా ఆడింది. రాము బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంది.మాట మార్చేసిన రీతూఇక్కడ మరో ముఖ్య విషయమేంటంటే.. చివరి వరకు మనిద్దరమే ఉండాలని రామూతో డీల్ మాట్లాడుకున్న రీతూ.. దాన్ని మర్చిపోయింది. ఆమె మాట తప్పడం చూసి షాకైన రాము.. ఆటాడకుండా శిలలా నిల్చుండిపోయాడు. అది చూసి ఇమ్మూకి పాపం అనిపించడంతో తన బొమ్మలు రాముకిచ్చాడు. అలాగే రీతూ చేసిన పనిని తప్పుపట్టాడు. దీంతో ఆమె.. ముగ్గురు కలిసి నామీద పడితే ఫెయిర్గేమా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ మాటతో తనూజ కూడా రియాక్ట్ అయింది. నోరు మూయ్నువ్వు నా దాంట్లో బొమ్మలు తీద్దామని రాముతో చెప్పలేదా? అంటే నీకు గ్రూప్ గేమ్ కావాలి.. వాడికి వద్దా? అని నిలదీసింది. దాంతో రీతూ.. నేను, నీ పేరే చెప్పలేదని బుకాయించింది. ఈ క్రమంలో ఇద్దరూ నువ్వు నోరు మూయ్ అంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. సంజనా, ఫ్లోరా, సుమన్ సపోర్ట్ చేస్తామంటే తనూజ, ఇమ్మాన్యుయేల్ మాకు వద్దంటే వద్దని వేడుకున్నారు. సింగిల్గానే ఆడతామన్నారు. అలా రీతూ, తనూజ అవుట్ అయ్యాక ఇమ్ము, రాము మిగిలారు.ఓనర్గా రామువీరిలో ఒకరిని ఓనర్గా ప్రకటించమని టెనెంట్స్కు బాధ్యత అప్పగించాడు బిగ్బాస్. రీతూ తప్ప అందరూ ఇమ్మాన్యుయేల్కే ఓటేశారు. కానీ, రీతూ అస్సలు వినిపించుకోలేదు, రాము ఓనర్ అవ్వాల్సిందేనని బలంగా వాదించింది. దీంతో రామునే ఓనర్గా ప్రకటించారు. ఇదంతా అయ్యాక ఇమ్మూ ఎమోషనలయ్యాడు. నేను ఆడలేదా? గ్రూప్ సపోర్ట్ అడిగానా? అంటూ రీతూ మాటల్ని తలుచుకుని బాధపడ్డాడు. -
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. హరిత ఏమందంటే?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసిన ఏకైక కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీశ్. నేను మోనార్క్ను, ఎవరి మాటా వినను అన్న టైప్లో ప్రవర్తిస్తుంటాడు. అగ్నిపరీక్షలో అడుగుపెట్టినప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడి జడ్జిలనే ఆగం చేశాడు. తనలో సగమైన భార్య కోసం తన పేరును హరిత హరీశ్గా మార్చుకున్నాడు. నేనేమైనా గుడిలో గంటనా?కానీ, ఓసారి కోపం వచ్చి ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలిపాడు. ఈ ఒక్కమాటతో అందరూ నోరెళ్లబెట్టారు. భార్యపై చేయి చేసుకునేంత దుర్మార్గుడివా? మూర్ఖుడివా? అని తిట్టిపోశారు. తాజాగా ఈ వివాదంపై హరీశ్ (Mask Man Harish) సతీమణి హరిత స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇదేమైనా గుడిలో గంటా? స్కూల్ బెల్లా? ఉదయం, సాయంత్రం కొట్టడానికి? ప్రతి కుటుంబంలో చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తను నన్ను కొట్టిన సంఘటన కూడా పెద్దగా గుర్తులేదు. అందుకే హృదయ్ మానవ్ఎందుకంటే మా మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అలాంటిది! 20 ఏళ్ల జీవితంలో మేము ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కొన్నాం. అవన్నీ వదిలేసి దాన్ని పట్టుకుని వేలాడలేం. షో కోసం అబద్ధం చెప్పకుండా ఆయన దాన్నింకా గుర్తుపెట్టుకుని మరీ చెప్పాడు. హృదయంలో ఏదీ దాచుకోడు. అందుకే హృదయ మానవ్ అయ్యాడు. మా పెళ్లయి 15 ఏళ్లవుతోంది. మేమిలా దూరంగా, మాట్లాడుకోకుండా ఇన్నిరోజులు ఎప్పుడూ లేము. నా భర్త మంచివాడు. కావాలనే అతడిని నెగెటివ్ చేస్తున్నారు. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉంది, అదింకా బయటకు రావడం లేదు అని హరిత చెప్పుకొచ్చింది.చదవండి: ఉగ్రరూపం చూపించిన సుమన్.. అమ్మాయిలను ఈడ్చిపడేశాడు! -
ఉగ్రరూపం చూపించిన సుమన్.. అమ్మాయిలను ఈడ్చిపడేశాడు!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ గోల అయిపోయింది. డిమాన్ పవన్ సెకండ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడిక టెనెంట్స్కు ఓనరయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందుకోసం సెలబ్రిటీలకు గేమ్స్ పెట్టాడు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఓనర్లు విసిరే వస్తువులను పట్టుకుని వాటిని ఎండ్బజర్ వరకు తమ బాస్కెట్లో భద్రంగా దాచుకోవాలి. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ వస్తువులుంటే వారే గెలిచినట్లు!కొట్టేసుకున్న సెలబ్రిటీలుప్రియ, మనీష్.. బొమ్మలు, బంతులు విసరగా టెనెంట్లు వాటిని క్యాచ్ చేసి బాస్కెట్లో వేసుకున్నారు. ఆ తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. పక్కవాళ్ల బొమ్మల్ని తస్కరించే పని షురూ చేశారు టెనెంట్లు. ఈ క్రమంలో కిందామీదా పడి కొట్టుకున్నట్లే కనిపించారు. ఫ్లోరా, ఇమ్మాన్యుయేల్ కలిసి రీతూను కిందపడేశారు. సుమన్ శెట్టి.. మోచేతితో ఫ్లోరాను గుద్దిపడేశాడు. ఎవర్నైనా కొడితే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తానంది ప్రియ. అయినా సుమన్ తగ్గలేదు. విశ్వరూపం చూపించిన సుమన్తన దగ్గరకు వస్తే తడాఖా చూపిస్తా అన్నట్లుగా విశ్వరూపం చూపించాడు. అయితే సంజనా అతడి బాస్కెట్లోనుంచి దొంగతనం చేయబోతే ఆమె చేయిని విసురుగా నెట్టేశాడు. దానికి ప్రియ.. సుమన్ను ఎలిమినేట్ చేసింది. ఆ కోపంతో అతడు తన బాస్కెట్ను కాలితో తన్నేశాడు. మరి టెనెంట్లలో ఎవరు ఓనర్ అయ్యారనేది చూడాలి! చదవండి: బిగ్బాస్ 9 గ్రాండ్ లాంచ్కు దారుణమైన TRP రేటింగ్స్ -
బిగ్బాస్ 9 గ్రాండ్ లాంచ్కు దారుణమైన TRP రేటింగ్స్
బిగ్బాస్ (Bigg Boss Telugu 9).. ఈసారి చదరంగం కాదు రణరంగమే! అని నాగార్జున చెప్తూనే ఉన్నాడు. దాన్ని కంటెస్టెంట్లు ఎలా అర్థం చేసుకున్నారో కానీ.. హౌస్లో తెలివిగా పావులు కదపడానికి బదులు గొడవలు, కొట్లాటలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కలిసి మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని కూడా కయ్యంగా మారుస్తున్నారు. విభేదాలు వచ్చినప్పుడయితే హౌస్ అగ్నిగోళంలా మండిపోతోంది. అది చూస్తున్న జనాలకు సైతం పిచ్చెక్కుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేస్తున్నారేంట్రా? అని జనం కంటెస్టెంట్లను ముఖ్యంగా కామనర్లను తిట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. వరుసగా ఏడోసారి నాగార్జునే (Nagarjuna Akkineni) హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడూ సెలబ్రిటీలనే తీసుకునే బిగ్బాస్ ఈసారి కామనర్లపైనా ఓ కన్నేశాడు. సెలబ్రిటీలను తొమ్మిది మందిని, అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు కామనర్లను హౌస్లోకి పంపించాడు.పర్వాలేదనిపించేలా టీఆర్పీఈసారి డబల్ హౌస్ అంటూ ఊరించడం, కామనర్ల రాకకోసం స్పెషల్గా అగ్నిపరీక్ష పెట్టడంతో షోపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో బిగ్బాస్ 9 లాంచింగ్ ఎపిసోడ్ దద్దరిల్లిపోతుందనుకున్నారంతా.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యంత దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఈసారి 13.7 రేటింగ్ వచ్చినట్లు స్వయంగా నాగార్జునే వెల్లడించాడు. అలాగే లాంచింగ్ ఎపిసోడ్ను 5.9 బిలియన్ మినిట్స్ (590 కోట్ల నిమిషాలు) వీక్షించారని తెలిపాడు. కానీ ఇవి గతంలో వచ్చిన రికార్డులకంటే ఎక్కువేం కాదు!ఇప్పటివరకు అదే అత్యధికంజూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్ ఫస్ట్ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని హోస్టింగ్ చేసిన రెండో సీజన్కు 15.05 వచ్చింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే బిగ్బాస్ బాధ్యతలు భుజానెత్తుకున్నాడు. అలా మూడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు 17.92, నాలుగో సీజన్కు 18.50, ఐదో సీజన్కు 18, ఆరో సీజన్కు 8.86, ఏడో సీజన్కు 18.1, ఎనిమిదో సీజన్కు 18.9 రేటింగ్ వచ్చింది. ఈసారి (Bigg Boss 9) ఏడో సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లకంటే తక్కువగా 13.7 మాత్రమే వచ్చింది. 5.9 Billion viewing minutes 💫 breaking all the records in the country. Your undisputed love proves once again that BiggBoss stands unmatched ❤️This is only for the opening act...the drama,thrill and unforgettable moments are just getting started!And on Television… pic.twitter.com/ivWM6NsdTv— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 18, 2025 చదవండి: కెప్టెన్గా డిమాన్ పవన్.. దగ్గరుండి గెలిపించిన రీతూ చౌదరి -
కమెడియన్ రోహిణి బర్త్డే.. గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన తల్లి
బిగ్బాస్ 8 కంటెస్టెంట్, కమెడియన్ రోహిణి (Actress Rohini) ఇటీవల పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. సెప్టెంబర్ 8న ఇంట్లోనే తన బర్త్డే వేడుకలు జరుపుకుంది. తాజాగా పుట్టినరోజు నాడు వచ్చిన కానుకల గురించి వెల్లడించింది. తన ఫ్రెండ్స్ ఉంగరం, నెక్లెస్, హ్యాండ్ బ్యాంగ్, చీర వంటి కానుకలను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.బంగారు కానుకతన తల్లి ఊహించని బహుమతిచ్చిందంటూ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. రోహిణికి తల్లి నాలుగు బంగారు గాజులను గిఫ్ట్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన గాజులను చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది. మా అమ్మ నాకోసం బంగారు గాజులు కొనిందోచ్ అంటూ యూట్యూబ్లో వీడియో షేర్ చేసింది. ఇకమీద ఇవే వేసుకుని తిరుగుతానంది.సీరియల్స్తో మొదలైన జర్నీఅటు బుల్లితెర షోలలో, ఇటు సినిమాల్లో కమెడియన్గా రాణిస్తోంది రోహిణి. సీరియల్స్తోనే తన కెరీర్ మొదలైంది. అక్కడినుంచి వెండితెర వరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. మధ్యలో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతో సివంగిగా గుర్తింపు తెచ్చుకుంది. మత్తు వదలరా, బలగం సినిమాలే కాకుండా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్తో బాగా పాపులర్ అయింది.చదవండి: అల్లు అరవింద్ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు! -
కెప్టెన్గా డిమాన్ పవన్.. దగ్గరుండి గెలిపించిన రీతూ చౌదరి
బిగ్బాస్ 9.. ఈసారి డబల్ హౌస్ అంటూ ఊదరగొట్టారు. ఇదేదో కొత్త కాన్సెప్ట్లా ఉందే అని అందరూ తెగ ఎగ్జైట్ అయ్యారు. పైగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనగానే బుల్లితెర ప్రేక్షకులు ఈసారి షో హిట్టవడం ఖాయం అని ముందుగానే ఫిక్సయిపోయారు. కానీ కంటెస్టెంట్ల ఎంపిక చూశాక నీరసించారు, అయినా అగ్నిపరీక్ష నెగ్గొచ్చిన కామనర్లున్నారుగా.. వాళ్లు ఆటతో రఫ్ఫాడిస్తారులే అనుకున్నారు.విసుగు తెప్పిస్తున్న కామనర్లుకట్ చేస్తే రఫ్ఫాడించడం దేవుడెరుగు.. షో చూడాలంటేనే విసుగొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్కు ఓనర్లు అన్నందుకు నిజంగానే యజమానుల్లా ఫీలైపోతున్నారు. సెలబ్రిటీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు గొడవలకు సై అంటూ నోరేసుకుని మీద పడిపోతున్నారు. వాళ్ల ఓవరాక్షన్తో ప్రేక్షకులకు షో చూడాలంటేనే విసుగు పుడుతోంది. దీంతో ఆ వైల్డ్ కార్డులు ఎప్పుడొస్తాయా? అని జనం ఎదురు చూస్తున్నారు.కెప్టెన్సీకి ఎవరు అనర్హులు?నిన్న (సెప్టెంబర్ 18) ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఓనర్లలో ఎవరు కెప్టెన్సీకి అనర్హులు? ఎవరు అర్హులో చెప్పాలని టెనెంట్లను ఆదేశించాడు బిగ్బాస్. దీంతో వాళ్లు ప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, హరీశ్ను అనర్హులుగా తేల్చారు. దాంతో వాళ్లు కాసేపు గొడవపడ్డారు. ఇక అర్హులుగా భరణి, మనీష్, డిమాన్ పవన్ (Demon Pavan)ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురూ టెనెంట్స్లో ఒకరిని కెప్టెన్సీ కంటెండర్గా సెలక్ట్ చేయాలన్నారు.రీతూ కోరిక పవన్ కాదంటాడా?దాంతో వాళ్లు పెద్దగా చర్చలు పెట్టకుండా ఏకాభిప్రాయంతో ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పారు. అలా భరణి, మనీష్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ రంగుపడుద్ది అనే టాస్క్లో పాల్గొన్నారు. అయితే దీనికంటే ముందు.. ఓ ఆసక్తికర చర్చ జరిగింది. నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలని రీతూ (Rithu Chowdary) కోరడం.. నీకోసం ట్రై చేస్తా అని డిమాన్ పవన్ కళ్లలోకి కళ్లు పెట్టి మాటివ్వడం జరిగింది. మీ కోరికకు నేనెందుకు కాదంటాను అనుకున్నాడో ఏమో కానీ బిగ్బాస్ కెప్టెన్సీ టాస్క్కు రీతూను సంచాలక్గా పెట్టాడు.మొదట టార్గెట్ చేసిందెవరు?ఇంకేముంది, గేమ్ను తనకు నచ్చినట్లు మార్చేసింది. మొదటి రౌండ్లో మనీష్.. భరణిని టార్గెట్ చేసి అతడి ప్లేటు కింద పడేశాడు. దీంతో భరణి మనీష్కు రంగు పూశాడు. అలా మనీష్ ఔట్ అయ్యాడు. రెండో రౌండ్లో భరణి, ఇమ్మూ కలిసి డిమాన్ను టార్గెట్ చేశారు. దీంతో కామనర్స్.. కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లే టాస్క్ జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఒక్కడిని టార్గెట్ చేస్తున్నారంటూ అరిచారు. ఈ గేమ్లో డిమాన్ ఔటవ్వాల్సింది. కానీ రీతూ అలా ఎలా చేస్తుంది? తాను ఆపమన్నా సరే, భరణి మూడుసార్లు పక్కవాళ్లపై రంగు పూశాడంటూ అతడిని గేమ్ నుంచి తీసేసింది. తర్వాతి రౌండ్లో ఇమ్మాన్యుయేల్ పోరాడి ఓడిపోయాడు. దీంతో విన్నర్ డిమాన్ పవన్.. హౌస్లో రెండో కెప్టెన్గా నిలిచాడు.చదవండి: ఒక్క ఏడాదిలోనే రూ.140 కోట్ల నష్టం: మిరాయ్ నిర్మాత -
ఎలిమినేషన్: కామనర్ల ఓవరాక్షన్.. ఆ కంటెస్టెంట్కు మూడినట్లే!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్లో ఏ నలుగురికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో టెనెంట్స్ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్, పవన్ కల్యాణ్లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్ పవన్, మర్యాద మనీష్లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.నామినేషన్స్లో ఏడుగురుఈ వారం మనీష్, హరీశ్, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, భరణి నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్ ఓవరాక్షన్తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్ చేస్తున్నారు. డేంజర్ జోన్లో ముగ్గురుదీంతో మనీష్, ప్రియ, డిమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు. డిమాన్ పవన్.. తన గేమ్ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్.. వరస్ట్ కామనర్స్ అంటూ తన టీమ్నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్, పవన్లపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి! చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..! -
4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ను చంపేసినట్లుంది కథ! హౌస్లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్లో ఎవరున్నారో చూసేద్దాం..తలతిక్క సమాధానాలునాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నాపై ముద్ర వేశారునేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.దమ్ముంటే బిగ్బాస్ను అడగండితర్వాత శ్రీజ కూడా హరీశ్ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్బాస్ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.సుమన్ను బలి చేసిన కెప్టెన్ సంజనాదీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. మరోవైపు లైవ్లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్! -
చేతిలో రెండు టమాటోలు పెట్టి దొబ్బేశావ్ కదే.. ప్రేమకు నమస్కారం టైటిల్ వీడియో
సోషల్ మీడియా నుంచి సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బిగ్బాస్, పలు వెబ్ సిరీస్లతో యూత్కు దగ్గరైన షణ్ముఖ్ ఇప్పుడు ప్రేమకు నమస్కారం (Premaku Namaskaram) అంటూ థియేటర్స్లోకి రానున్నాడు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను పంచుకున్నారు. ప్రేమలో విఫలమైన వారందరూ బార్లోనే కలుస్తారని ఈ ట్రెండ్ను ఇంతటితో ఆపేయాలని చెబుతూ షణ్ముఖ్ తెరపైకి వస్తాడు. సోషల్మీడియాలో వైరల్ అయిన కొందరు ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తదనంతో కూడిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ క్రమంలోనే సోషల్మీడియాలో సన్సేషన్ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్హార్ట్స్ చిత్రంతో యూట్యూబ్ సన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌళి తనూజ్ బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ను క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ సన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ప్రేమకు నమస్కారం అనే చిత్రంతో రానున్నారు. ఇందులో ఉల్క గుప్తా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రముఖ నటుడు శివాజీ, నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్ దర్శకుడు. మంగళవారం హీరో షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'ప్రేమకు నమస్కారం' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది.ఈ గ్లింప్స్ వీడియోను గమనిస్తే.. ఇదొక యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్.. లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్ల్ఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే బాధలు ఫన్నీగా ఎంతో ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి.టోటల్గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. -
నన్ను నేనే తిట్టుకున్నా.. చచ్చిపోవాలని ట్రై చేశా: నైనిక
డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక అనసురు (Nainika Anasuru) తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. టాస్కుల్లో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఫినాలే వరకు వెళ్లలేకపోయింది. కవర్ సాంగ్స్తో అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను, కెరీర్లో అనుభవించిన బాధలను పంచుకుంది.చచ్చిపోవాలని ట్రై చేశా..నైనిక మాట్లాడుతూ.. 'ఢీ షో చేస్తున్న సమయంలోనే నేను డిప్రెషన్కు గురయ్యాను. నా ఫ్యామిలీతో సహా ఎవరూ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదని బాధపడ్డాను. ఇంట్లోవాళ్లు పాతకాలం మనుషుల్లా ఆలోచించేవారు. వేధింపులను కూడా కొంతవరకు భరించాలన్నట్లుగా చెప్పేవారు. కానీ, అది నా వల్ల కాదు. ఎవర్నీ ఏమీ అనలేక, ఏం చేయలేక పది మంది ముందు నన్ను నేనే తిట్టుకుని ఏడ్చేదాన్ని. ఎందుకిలా అయిపోతున్నానో అర్థం కాలేదు. చనిపోయేందుకు ప్రయత్నించాను. దాదాపు ఏడాదిపాటు బాధపడుతూ నా జీవితాన్ని వృథా చేసుకున్నాను. ఇండస్ట్రీలో చీకటి కోణంకానీ, దానివల్లే నన్ను నేను ఎంత ప్రేమించుకోవాలో తెలిసొచ్చింది. ఇకపోతే ఇండస్ట్రీలో అందరూ నిలదొక్కుకోలేరు. నిజాయితీగా మాట్లాడాలంటే నాకు ఓ కూతురుంటే తనను ఈ ఇండస్ట్రీకి అస్సలు పంపించను. వద్దని చెప్పేస్తా! ఇండస్ట్రీలో చాలా చీకటికోణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. కాస్టింగ్ కౌచ్లాంటివి ఫేస్ చేశాను. కొందరు డైరెక్ట్గా కాల్ చేసి మరీ అడుగుతుంటారు. సినిమా ఆఫర్లు ఇచ్చి కమిట్మెంట్స్ అడిగారు. అందరూ గలీజ్ అయిపోయారు.దరిద్రంగా తయారైందిఈ మధ్య నాకు ఓ రియల్ ఎస్టేట్ గ్రూప్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్ కోసం అనుకున్నా.. కాదు, పర్సనల్ అన్నారు. ఆయనేమంటున్నారో అర్థం కాకపోయినా డీల్ ఏంటో చెప్పండి అన్నాను. అందుకతడు.. మీ గురించి బయట ఓ ప్రచారం జరుగుతోంది. మీకు ఓ రేట్ ఫిక్స్ చేస్తున్నారు. మీ ఫోటోలతో పాటే ఆ రేట్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అన్నాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇండస్ట్రీ ఎంతో దరిద్రంగా తయారైందనేది! అని నైనిక బాధపడింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్గా ఉన్నారు. రెచ్చిపోయిన భరణిహౌస్లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్బాస్. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.పర్మినెంట్ ఓనర్గా భరణిఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్గా మారిపోయాడు. భరణిని ఓనర్గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. మాట మార్చిన ఇమ్మాన్యుయేల్అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్ ఇచ్చారు. నమ్మకం మీద దెబ్బ కొట్టారుఅందులో భాగంగా జెన్యూన్గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. ఇకపై సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్బాంబ్ వేసింది.చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..? -
Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హోస్లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైనీ(ఆషా షైనీ) ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో శ్రష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే, వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్మీడియాలో చర్చ జరుగుతుంది.బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభ పడింది లేదని చెప్పాలి. హౌస్లో ఆమె కేవలం వారంరోజులు మాత్రమే ఉండటంతో తను రెమ్యునరేషన్గా రూ. 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో రీతూ చౌదరి, రాము రాథోడ్,సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్,సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రేష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా ఆమె బిగ్బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున కోరారు.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. భరణి, రీతూ చౌదరి, తనూజ, పేర్లు చెప్పింది. -
ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్?
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..మాస్క వెనక రహస్యంసమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్లో సెటిలయ్యాడు.అన్ని ఉద్యోగాల్లో..ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్లో టీచర్గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారు.యాక్సిడెంట్2017లో హరీశ్కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్తోనే బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్లో కొనసాగడం కష్టమే!చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
ఫోటోతో పాటు కింద నా రేటు కూడా వేసి వైరల్ చేశారు: బిగ్బాస్ నైనిక
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే గతంలో దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు భయపడేవారు. కానీ ఈ మధ్య తమకు ఇబ్బంది కలిగిస్తే.. మీడియా ముఖంగా వారి పేర్లను బటయపెడతున్నారు. క్యాస్టింగ్ కౌచ్పై చర్చిస్తూ.. నూతన నటీనటులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపుల గురించి బాహాటంగానే వెల్లడించారు. తాజాగా డ్యాన్సర్, బిగ్బాస్ ఫేం నైనిక కూడా క్యాస్టింగ్ కౌచ్పై స్పందించారు. చాలామందిలాగానే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కి గురయ్యానని చెప్పింది. కమిట్మెంట్ ఇస్తే.. సినిమా చాన్స్ ఇస్తామని చాలా మంది అడిగారని, తాను నో చెప్పడంతో వాళ్లంతా మళ్లీ కాల్ చేయలేదని చెప్పింది. తాజాగా ఆమె ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.‘సినీ ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్గా తయారైంది. అందరూ గలీజ్ అయిపోయారు. ఓపెన్గానే కమిట్మెంట్ అడిగేస్తున్నారు. ఆ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి..‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన బ్రాండ్ని ప్రమోట్ చేయాలేమో అనుకున్నా. ఓకే చెప్పా. ఆయన మరోసారి ‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అని చెప్పడంతో నాకు అర్థమైంది. నాకు తెలిసిన వ్యక్తి కావడంతో.. ‘మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్ అయింది’ అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిల వల్లే ఈ ఫార్మెట్ క్రియేట్ అయింది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు కూడా. నేను ఆర్టిస్ట్ అయినా కూడా.. ఒకవేళ నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి రానివ్వను. ఈ ఫీల్డ్ మంచిది కాదని చెబుతా’అని నైనిక చెప్పుకొచ్చింది.ఇక తన తండ్రి గురించి కూడా నైనిక చెప్పుకొచ్చింది. ఆయన తమతో ఉండరని, తానే ఇంటి నుంచి పంపేశానని చెప్పింది. ‘డాడీ మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. అమ్మని టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. ‘నువ్వు ఉంటే నేను ఇంట్లో ఉండను’ అని డాడీతో చెప్పా. ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు. డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. అమ్మ నన్ను చాలా బాగా పెంచింది. కష్టపడి ఆడిషన్స్కి తీసుకెళ్లేది. అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను. ఆమెకు ఒక మంచి ఇళ్లు కొనివ్వడమే నా లక్ష్యం’ అని నైనిక చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా డ్యాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. బిగ్బాస్ 8 లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తూనే..ఆర్టిస్ట్గానూ ప్రయత్నాలు చేస్తుంది. -
నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.కామనర్స్కు క్లాస్ పీకిన నాగ్సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్ను నిలదీశాడు నాగ్.రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు. వీడియో బయటకు లాగిన నాగ్అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్కు చిన్నచూపు ఉందని క్లియర్గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్మేట్స్తో పాటు నాగ్పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్ -
డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?
గంపెడాశలతో బిగ్బాస్ హౌస్కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, డిమాన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్లో ఉన్నారు.వీళ్లంతా కనిపించారువీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్ (Emmanuel). ఓనర్ల (కామన్మ్యాన్)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్లో ఇరగదీశాడు రాము రాథోడ్. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్ను షేక్ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్గా నిలించింది. గ్లామరస్ కంటెంట్నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎపిసోడ్లో జాడ లేని కంటెస్టెంట్లుమిగిలిందల్లా డిమాన్ పవన్, శ్రష్టి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతోంది.ఇలాగైతే ఎలిమినేషన్ ఖాయంఆమె నుంచి పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎటువంటి వైబ్స్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్ ఎందుకని నాగ్ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడనేది వేచి చూడాలి!చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ కూడా!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్గా నిలిచింది.సత్తా చూపించిన రాముఅయితే ఈ కెప్టెన్సీ టాస్క్లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.బాడీ షేమింగ్నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. ముగ్గురు ఆడోళ్లుఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్కెప్టెన్ సంజనా హౌస్మేట్స్కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి! -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్గా ఈ గేమ్లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్గా నిలబడేవారని బిగ్బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్కు భరణి, సంజనకు శ్రీజ, పవన్కు ప్రియ, హరీశ్కు పవన్ కల్యాణ్ సపోర్ట్గా వచ్చారు.సంచాలక్గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్ఫెయిర్ అంటూ అని మనీష్ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్బాస్కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్ ఏమైపోతుందో మరి!అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనాతను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్లో ఈమెనే అందరికంటే హైలైట్గా నిలుస్తోంది.కెప్టెన్గా..ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్ చేయమని బిగ్బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్ -
బిగ్బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో మొదటివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. కామనర్స్ నుంచి డిమాన్ పవన్, సెలబ్రిటీలలో భరణి మినహా మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇక ఈ షోకి కావాల్సిన కంటెంట్ నేనిస్తానంటూ ఫుల్ జోష్ మీదుంది సంజనా. మొన్న షాంపూ కోసం పంచాయితీ పెట్టిన ఆమె నిన్న గుడ్డు దొంగిలించి అందరికీ బీపీలు వచ్చేలా చేసింది. గుడ్డు ఎవరు కొట్టేశారో అర్థం కాక ఓనర్స్ (కామనర్స్) తల పట్టుకున్నారు. టెనెంట్స్లోనే అసలైన దొంగ ఉన్నాడని తెలిసి వాళ్లందరిపైనా ఒంటికాలిపై లేచారు.అందరి అనుమానం తనపైనేమీరు ఇంట్లో అడుగుపెట్టేదే లేదని టెనెంట్స్పై ఆంక్షలు విధించారు. అయితే అందరి అనుమానం సంజనా (Sanjana Galrani)పైనే.. కానీ ఆమె మాత్రం ఓపక్క నవ్వుతూ, మరోపక్క అమయాకంగా ముఖం పెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. ఈ క్రమంలో భరణి, హరీశ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇలా అందరూ అరుచుకుంటూ ఉంటుంటే అప్పుడు సంజనా సైలెంట్గా వచ్చి.. ఆకలేసి నేనే గుడ్డు తిన్నా.. అడిగితే ఇవ్వరనే అలా చేశాను అని తాపీగా చెప్పింది. ఇరికించేసిందిగా!దీంతో ఓనర్లు.. అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పొచ్చు కదా? అని ఫైర్ అయ్యారు. ఇక సంజనా తాను తినేటప్పుడు కిచెన్లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని, రాముకు కూడా తెలుసని ఇరికించేసింది. దాంతో అందరూ షాకయ్యారు. శ్రష్టి అయితే సంజనా దగ్గరకు వెళ్లి.. గుడ్డు తినడానికి సిగ్గు లేదా? అని తిట్టేసింది. అటు రీతూ చౌదరి.. మీ ముగ్గురూ కలిసి గేమ్ ఆడారు అని భరణిపై ఫైర్ అయింది. అప్పుడు భరణి నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ఏడ్చేసిన సంజనామేము కిచెన్లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజకి చెప్పిందట. 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను.. ఏదో ప్రాబ్లమ్ ఉందంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నా అన్నాడు. అప్పుడు సంజనా ఎంటరై.. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా గురించి మీకు తెలీదు. నేను బాధితురాలిని. నేను ప్రతిరోజు ఏడుస్తూనే పడుకుంటాను అని ఏడ్చేసింది. అలా ఒక్క గుడ్డు దొంగతనంతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా -
నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.షేడ్స్ చూపిస్తున్న కామనర్స్ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్బాస్. కామనర్స్ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.చేతులెత్తి దండం పెట్టిన తనూజఅంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.అర్హత లేదని హెచ్చరికఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో (Bigg Boss Reality Show) నుంచి బయటికి వచ్చిన పలువురు సినిమాల్లో హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని గోల్డెన్ గెట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలో నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ.. బిగ్బాస్ ఫేమ్ విక్రమన్ను హీరోగా ఎంపిక చేయడానికి కారణం అతని పర్సనాలిటీ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండడమేనన్నారు. ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రకు తను పర్ఫెక్ట్గా ఉంటారన్నారు. చిత్ర కథ వాస్తవానికి దగ్గరగా, చాలా ఫ్రెష్గా కలర్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. సంగీతం, విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. టోటల్గా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శ్రీధర్ ఛాయాగ్రహణం, అజేష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విక్రమన్.. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. -
రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!
బిగ్బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది. నీ పనిమనిషినా?ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.ఫుటేజ్ కోసమా?అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. రీతూ తలకు గాయంసుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ -
గుండంకుల్.. ఎంతమాటన్నాడ్ సార్? అపరిచితుడు బయటకొచ్చేశాడు!
బిగ్బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్గా, కామనర్స్ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!ఒక్క పూట అన్నం కోసం..వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్బాస్కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్బాస్ మరోసారి వారించాడు. గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీవారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.బాడీ షేమింగ్అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది. అపరిచితుడు బయటకొచ్చేశాడుఇక బిగ్బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట! చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్ -
బిగ్బాస్ 9: అతనికి మద్దతుగా నాగబాబు పోస్ట్.. నెటిజన్స్ సెటైర్స్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ఆదివారం గ్రాండ్గా ప్రారంభం అయింది. ఈ సారి కూడా హోస్ట్గా కింగ్ నాగార్జుననే వ్యవహరించాడు. మొత్తం 15 మంది హౌస్లోకి వెళ్లారు. సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాక చక్కర్లు కొట్టిన లిస్టులో ఉన్న వాళ్లే..ఇప్పుడు హౌస్లోకి అడుగుపెట్టారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ట వర్మ, సంజనా గల్రానీ, ఆశాశైనీలు సెలబ్రెటీ కంటెస్టెంట్స్గా వెళ్లగా.. కామనర్స్గా మాస్క్ మెన్ హరీశ్, శ్రీజ, మర్యాద మనీష్, జవాన్ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇలా బిగ్బాస్ షో ప్రారంభం అయిందో లేదో అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు ఏడో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు భరణికి మద్దతు తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు.(చదవండి: బిగ్బాస్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే.. హైలెట్స్ ఇవే)‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్బాస్ 9 సీజన్లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. నాగబాబు పోస్టుపై కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ‘నీ నోటితో అన్నావ్గా..ఇక త్వరగానే బయటకు వచ్చేస్తాడులే’, ‘నాలుగు వారాల్లో వచ్చేస్తాడు’, ‘భరణిని గెలిపించాలని జనసైనిక్స్కి నాగబాబు టాస్క్ ఇచ్చాడు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది భరణికి మద్దతుగా పోస్టులు పెట్టారు.ఇక భరణి విషయానికొస్తే.. అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. బాహుబలి, ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో నటించాడు. గతకొంతకాలంగా అటు వెండితెరపై కానీ, ఇటు బుల్లితెరపై కానీ భరణికి సరైన అవకాశాలు రావడం లేదు. బిగ్బాస్ 9 గుర్తింపు వస్తే.. అవకాశాలు వస్తాయనే ఆశతో హౌస్లోకి వెళ్లాడు. మరి భరణి ఎన్నిరోజులు హౌస్లో ఉంటాడో చూడాలి. -
నాకు చావెందుకు రాలేదు? నిరూపించుకోవడానికే వచ్చా: హీరోయిన్ కన్నీళ్లు
సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమసైంది సంజనా గల్రాని (Sanjana Galrani). బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్లో పరిచయమైంది. తెలుగులో కన్నా కన్నడలో మంచి స్టార్డమ్ సంపాదించింది. 2020లో రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అంతా బాగున్న సమయంలో డ్రగ్స్ కేసుతో తన కెరీర్ కుప్పకూలింది. డ్రగ్స్ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగు పెట్టింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్ ఇబ్రహీంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది.ఒక్కో మీడియా ఛానల్ ఒక్కోలాగా చెప్పింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్బాస్కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది. -
నువ్వసలు మనిషివే కాదు, లూజర్.. కట్ చేస్తే బిగ్బాస్ షోలో!
బిగ్బాస్ 9 (Bigg Boss 9 Telugu) ఈసారి స్పెషల్గా ఉండబోతోంది. కారణం.. సామాన్యుల ఎంట్రీ! గతంలోలాగా ఎవరో ఒకర్ని తీసుకురాలేదు. సత్తా ఉన్న సామాన్యులనే తీసుకురావాలని అగ్నిపరీక్ష షో నిర్వహించారు. వేలాది మంది అప్లై చేసుకోగా వారిలో 15 మందిని అగ్నిపరీక్షలో పరీక్షించారు. చివరకు 13 మంది మిగిలారు. ఇప్పుడు వారందరూ బిగ్బాస్ 9కి వచ్చారు.ఆరుగురికి ఎంట్రీ అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్గా వ్యహరించగా, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరించారు. అభిజిత్ మినహా మిగతా ముగ్గురు నేడు స్టేజీపైకి వచ్చారు. షోలో ఎల్లో కార్డులతో కంటెస్టెంట్లను భయపెట్టిన వీరు గ్రీన్ కార్డులతో కంటెస్టెంట్లలో కొత్త ఆశలు రేకెత్తించారు. నవదీప్.. దమ్ము శ్రీజను, బిందు మాధవి.. హరీశ్ను సెలక్ట్ చేసి హౌస్లోకి పంపించారు.ప్రేక్షకుల ఓట్లతో ముగ్గురునువ్వు మనిషివే కాదంటూ హరీశ్ను తిట్టిన బిందుమాధవి.. అందర్నీ కాదని అతడిని సెలక్ట్ చేయడం విశేషం. ప్రేక్షకుల ఓట్లతో పవన్ కల్యాణ్, డిమాన్ పవన్, డాక్టర్ ప్రియ హౌస్లోకి వెళ్లారు. చివర్లో నాగ్ షో ముగించేస్తుంటే శ్రీముఖి ఆపండంటూ ఎంట్రీ ఇచ్చింది. ఇంకొక్కరిని లోనికి పంపించమని వేడుకుంది. అభిజిత్, తాను కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ మర్యాద మనీష్ను సెలక్ట్ చేసింది. అలా ఏడుగురు కంటెస్టెంట్లు సామాన్యుల కేటగిరీలో హౌస్లోకి వెళ్లారు. -
#BiggBossTelugu9 : బిగ్బాస్ 9 సీజన్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
అధ్యక్షా.. ఈ కమెడియన్ ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?
అధ్యక్షా.. డైలాగ్తో పాపులర్ కాదు సెన్సేషన్ అయ్యాడు కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతడు ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా ద్వారా కాదు, బిగ్బాస్ షో ద్వారా! తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టిన సుమన్ శెట్టి తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. తొలి సినిమాకే నంది అవార్డుఅధ్యక్షా.. నన్ను గుర్తుపట్టారా? సుమన్శెట్టిని.. చిన్నప్పటినుంచే సినిమాలంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యాక ఓ మ్యాగజైన్లో కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి వెంటనే హైదరాబాద్ వెళ్లాను. దర్శకుడు తేజ నన్ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. జై మూవీతో కెరీర్ మొదలైంది. ఫస్ట్ సినిమాకే నంది అవార్డు గెలిచాను. జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం సినిమాల్లో అవకాశాలిచ్చి తేజ గారు నాకు గాడ్ ఫాదరయ్యారు.300 సినిమాలుతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశాను. అలా సినిమాలు చేస్తుండగా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. నాకు ఓ కూతురు, కొడుకు సంతానం. 2019లో మా నాన్న చనిపోయారు. నాన్న లేకపోయేసరికి ఒంటరితనం ఆవరించింది. నీ కెరీర్ మళ్లీ మొదలుపెట్టు అని అమ్మ తోడుగా నిలిచింది. బిగ్బాస్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాను. బిగ్బాస్ హౌస్లో ఈ సుమన్ శెట్టి ఆటేంటో చూపిస్తా అన్నాడు సుమన్ శెట్టి. మరి ఈ కమెడియన్ బిగ్బాస్లో ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి! -
మా ఇంటిబిడ్డలా చూసుకుంటాం.. అభయమిచ్చిన నాగ్
'ముద్దమందారం' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కూతుర్ని టీచర్ను చేయాలనుకుంటే తనూజ మాత్రం నటనవైపు అడుగులు వేసింది. కాలేజీలో చదువుతున్న సమయంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా సినిమా చేసింది. మూడేళ్లు మాటల్లేవ్దాంతో ఆమె తండ్రి మూడేండ్లు నటితో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజయ్యాక తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ముద్ద మందారం సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహికతోనే తన దశ తిరిగిపోయింది. తాజాగా ఆమె తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్నకు యాక్టింగ్ అస్సలు ఇష్టం లేదు. అయినా హైదరాబాద్కు వచ్చి యాక్టింగ్ ద్వారా పేరు సంపాదించుకున్నాను. తప్పకుండా శిక్షిస్తారుఅప్పుడు వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు బిగ్బాస్కు వెళ్తున్నా అని కూడా నాన్నకు తెలియదు. ఆయన తప్పకుండా నన్ను శిక్షిస్తారు. నాతో మాట్లాడరు.. నాన్నకు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో నాగ్.. ఆడపిల్లను మా ఇంటిబిడ్డలా చూసుకుంటాము. ఇండస్ట్రీ గురించి ఎటువంటి భయం అవసరం లేదు అని అభయమిచ్చాడు. -
మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని.. అప్పుడే మొదలెట్టేశాడుగా!
బిగ్బాస్ (Bigg Boss Reality Show) ప్రతి సీజన్లో ఓ కమెడియన్ కచ్చితంగా ఉండాల్సిందే! ఎప్పుడూ గొడవలతో అగ్నిలా భగభగమండుతూ ఉండే హౌస్లో నవ్వుల వర్షం కురిస్తేనే బాగుంటుంది. అందుకే కమెడియన్ ఉంటేనే షోకి కళ. ఈ సారి ఓ ఫేమస్ కమెడియన్ను పట్టుకొచ్చారు. అతడే జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel). నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ, ఎదుటివారి పెదాలపై నవ్వు చూడటం కోసం తనపై తాను జోకులు వేసుకోవడానికి కూడా వెనుకాడడు.ఒక్క ఛాన్స్తాజాగా బిగ్బాస్ 9 స్టేజీపై అడుగు పెట్టిన ఇమ్మాన్యుయేల్ తన జర్నీ వివరించాడు. 'నేను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదు. అందుకే అమ్మానాన్నకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నాను. పొలంపనిలో సాయం చేశాను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తాడంటారు. అలా నాకు వచ్చిన ఒక్క ఛాన్స్.. నేను కన్న కలవైపు మొదటి అడుగు పడేలా చేసింది. అవకాశం వచ్చింది, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. నాగార్జునతో కామెడీమూడేళ్లు గడిచిపోయాక మన తలరాత మనమే రాసుకోవాలని అర్థమైంది. వందల స్కిట్లు రాసి, అందులో నటించి మిమ్మల్ని అలరించాను. బిగ్బాస్లో నా పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను' అంటూ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తన టాలెంట్నంతా బయటపెట్టాడు. నాగార్జునతో.. బిగ్బాస్లో మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని అంటూ జోకులు మొదలుపెట్టేశాడు. అలాగే ఆడ గొంతుకతో పాట పాడి అలరించాడు. తర్వాత మిమిక్రీ చేశాడు. -
బిగ్బాస్: 20 ఏళ్లకే లవ్, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్ పాప.. సాంగ్తో బాగా ఫేమస్ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది.రానా నాయుడు, ద ట్రయల్ వెబ్ సిరీస్లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్బాస్ 9 షోలో అడుగుపెట్టింది.అసలేం జరిగిందంటే?20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్గానూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది. -
Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్.. వీళ్లు కన్ఫార్మ్!
ఊహకందని మార్పులు..ఊహించని మలుపులు. డబుల్ హౌస్తో డబుల్ జోష్తో మీ ముందుకు వచ్చేసింది బిగ్బాస్ నైన్ అంటూ బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో.. తొమ్మిదో సీజన్ నేడు(సెప్టెంబర్ 7) గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించారు. వారు ఎవరనేది గుర్తుపట్టకుండా ప్రోమోని కట్ చేశారు. అయితే తొలి రోజే ఓ కంటెస్టెంట్కి షాకిచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.ఓ కంటెస్టెంట్ హౌస్లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రెండు హౌస్ల ఉండబోతున్నాయి. టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లబోతున్నారట. వారిలో 9 మంది డైరెక్ట్గా హౌస్లోకి వెళ్లగా, మిగతా 5 మంది అగ్ని పరీక్షలో గెలిచిన వాళ్లు వెళ్తారు. సెలెబ్రిటీ లిస్ట్లో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, తనూజ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. కామనర్స్గా కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వెళ్లే అవకాశం ఉంది. -
బిగ్బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్తో తేల్చేసిందిగా!
తిన్నాతిరం పడతలే, ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటత్తుండు, నా పేరే ఎల్లమ్మ.. వంటి పాటలతో యూట్యూబ్లో నెస్సేషన్ అయింది ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ (Nagadurga Gutha). నాలుగేండ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకుంది. పద్నాలుండేగ్ల వయసులో పేరిణి నాట్యం నేర్చుకుంది. నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం కూడా స్థాపించింది. లాక్డౌన్లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫోక్ సాంగ్స్ క్వీన్ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్లో అందంగా స్టెప్పులేసింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్లో నటించే ఛాన్స్ వచ్చిందట! అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్గా అడిగారట! కానీ ఆ అవకాశాలను తిరస్కరించిన నాగదుర్గ.. నటన అంటే ఇష్టమే కానీ నాట్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల అని చెప్పుకొచ్చింది. పీహెచ్డీ పట్టా చేతికొచ్చాకే సినిమాల గురించి ఆలోచిస్తానన్న ఈమె కలివి వనం అనే ఒకే ఒక్క సినిమాలో మాత్రం నటిచింది.బిగ్బాస్పై ఆసక్తి లేదుఇంతలో నాగదుర్గ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొననుందని ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై నాగదుర్గ స్పందించింది. తాను బిగ్బాస్ 9వ సీజన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ షోకి వెళ్లాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని తెలిపింది. కాబట్టి ఈ ప్రచారానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టమని కోరింది. అయితే త్వరలోనే ఓ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.చదవండి: దృశ్యం నటుడు కన్నుమూత -
నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తెను: బిగ్బాస్ బ్యూటీ
నేను ఐశ్వర్య రాయ్ కంటే అందగత్తెను అంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్బాస్ బ్యూటీ తాన్య మిట్టల్ (Tanya Mittal). తాన్య ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. ఈ షో కోసం ఏకంగా 800 చీరలు, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ పట్టుకెళ్లింది. పూటకో చీర మారుస్తానని, దానికి మ్యాచింగ్ కోసం కిలోల కొద్ది నగల్ని బిగ్బాస్ హౌస్కు పట్టుకెళ్లింది. అక్కడకు వెళ్లాక.. తనకు ఫ్రిజ్ డోర్ తీయడం రాదని, తలస్నానం చేయడం రాదంటూ షోలో ఒకటే ఓవరాక్షన్ చేస్తోంది.అవన్నీ నావల్ల కాదుఈ క్రమంలో ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో తాన్య.. నాకు చాలా వింత కోరికలున్నాయి. సుష్మితా సేన్ గెలిచిన మిస్ యూనివర్స్ కిరీటాన్ని నాకు బహుకరించినట్లు కలగన్నాను. పైగా నేను ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంటాను.. కానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సాయంత్రం ఆరు దాటిందంటే బయటకు వెళ్లకూడదు, ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడకూడదు, జీవితంలో వంట తప్ప ఏదీ నేర్చుకోకూడదు.. ఇలా నేను బతకలేను. అందంపైనే ఆసక్తి ఏర్పడింది. అందంగా కనిపించాలన్న కోరిక నాలో ఎక్కువవుతూ వచ్చింది అని చెప్పుకొచ్చింది. అలాగే తను 12వ తరగతివరకు మాత్రమే చదివినట్లు తాన్య పేర్కొంది.చదవండి: నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా! -
వద్దు వద్దంటూనే మళ్లీ హోస్ట్గా.. కన్నడ బిగ్బాస్ ఎప్పటినుంచంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభానికి రెడీ అయింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా ఉన్నాడు. ఈసారి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కన్నడ బిగ్బాస్ కొత్త సీజన్ కూడా ఇదే నెలలో షురూ అవనుంది. ఈ షో నేను చేయను, నా వల్ల కాదు అని కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) పక్కకు తప్పుకున్నాడు. కానీ, షో నిర్వాహకులు బతిమాలి మళ్లీ ఆయన్నే హోస్ట్గా ఒప్పించారు.ఈ నెలలోనే..ఈమేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కర్ణాటక సాంప్రదాయాలు, రకరకాల మనుషులను, సినిమా, సీరియల్స్, రీల్స్.. ఇలా చాలానే చూపించారు. అవన్నీ చూస్తుండగా సడన్గా డిష్ పోతుంది. అప్పుడు కిచ్చా సుదీప్ కాఫీ చేత పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. సర్.. సెట్, కంటెస్టెంట్లు రెడీ, ఏడు కోట్ల కన్నడిగులు రెడీ.. మరి మీరు అని కొంత బెరుకుతో అమ్మాయి అడగ్గా నేనూ రెడీ అంటూ కాఫీ సిప్ చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో చెప్పాడు సుదీప్. చివర్లో సెప్టెంబర్ 28 నుంచి బిగ్బాస్ ప్రారంభం అని ప్రకటించారు. View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
‘బిగ్బాస్’లోకి ‘రాను బొంబాయికి రాను’ రాము.. ప్రభాస్ హీరోయిన్.. లిస్ట్ ఇదే?
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి అందరికి తెలిసిందే. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో అయితే బిగ్బాస్ షో కోసం ఎదురు చూసే బుల్లితెర ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. త్వరలోనే సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. ఈ సారి ఈ గేమ్ షోని సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్కి కంటెస్టెంట్లను డైరెక్ట్గా హౌస్లోకి పంపేవారు. ఈ సారి మాత్రం షో ప్రారంభానికి ముందే కొంతమందికి ‘అగ్ని పరీక్ష’ పెట్టారు. ఇందులో పాల్గొని గెలిచిన ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపుతారు. వీరితో పాటు మరికొంతమంది డైరెక్ట్గా బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు.సరికొత్తగాబిగ్బాస్ సీజన్ 9ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు బిగ్బాస్ కంటెస్టెంట్స్ అంతా ఒకే హౌస్లో ఉండేవాళ్లు. కానీ సీజన్ 9లో మాత్రం కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి..వేరు వేరు హౌస్లో ఉండబోతున్నారు. ఈ సీజన్లో 15 మంది కంటే ఎక్కువే హౌస్లోకి వెళ్లబోతున్నారు. వారిలో సగం ఒక హౌస్లో ఉంటే..మరో సగం మంది వేరే హౌస్లో ఉంటారు. ఆట తీరుని బట్టి కంటెస్టెంట్ ఏ ఇంట్లో ఉండాలో డిసైడ్ చేస్తారట. వీరికి పెట్టే టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నాయట. ఈ సారి మైండ్ గేమ్తో పాటు ఫిజికల్ టాస్క్లు కూడా కాస్త కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కంటెస్టెంట్స్ వీరే?ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్బాస్ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. సీజన్ 9లో పాల్గొనేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. వారిలో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, కమెడియన్ సుమన్ శెట్టి, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీరియల్ నటుడు భరణి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీరిలో నిజంగానే ఎంతమంది బిగ్బాస్ షోలోకి వెళ్తున్నారనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే. -
కాబోయే అత్తకు బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్..
బుల్లితెర నటి కీర్తి భట్ (Keerthi Bhat) సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో తన లైఫ్ జర్నీ చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో వేదన పడింది. ఎవరూ లేని తాను ఓ అనాథ పాపను దత్తత తీసుకుంది. కానీ బిగ్బాస్కు వెళ్లేముందే ఆ పాప చనిపోయింది. ఎన్నో కష్టాలుప్రేమించిన వ్యక్తి అనుమానంతో విషం కక్కుతుంటే బ్రేకప్ చెప్పి ఆ బాధ నుంచి బయటకు వచ్చింది. ఇలా ఎన్నో బాధలను పంటికింద భరిస్తూ యాక్టింగ్ అనే టాలెంట్నే నమ్ముతూ బతికేస్తోంది. రెండేళ్ల క్రితం కీర్తి, హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాబోయే కోడలు వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా.. మాకు పాప ఎందుకు, నువ్వే మాకు పాప.. కావాలంటే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుందాం అని విజయ్ పేరెంట్స్ కీర్తితో అన్నారు.అత్తకు సర్ప్రైజ్ఈ విషయాన్ని కీర్తి ఓ షోలో చెప్తూ.. అలాంటి అత్తమామలు దొరకడం తన అదృష్టం అంటూ వారిలోనే తన పేరెంట్స్ను చూసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా తనకు కాబోయే అత్తకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె పుట్టినరోజునాడు చిన్న ప్రైవేట్ థియేటర్ బుక్ చేసింది. అక్కడికి అత్తమామను తీసుకెళ్లి వారితో కేక్ కట్ చేయించింది. తర్వాత వాళ్లతో కలిసి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే అత్తమ్మా.. నీ నవ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని కీర్తి క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: బిగ్బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్! -
బిగ్బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్!
మరో నాలుగు రోజుల్లో బిగ్బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇంకా కంటెస్టెంట్ల ఎంపికపై టీమ్ తర్జనభర్జన పడుతూనే ఉంది. మొదటినుంచి నేను రెడీ అంటూ ముల్లెమూట సర్దేసుకున్నవారు పారితోషికం, నెగెటివిటీ గురించి ఆలోచించి ఓ అడుగు వెనక్కు వేస్తున్నారు. మరికొందరేమే ఓసారి ట్రై చేస్తే పోలా అని షోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇద్దరు ఎలిమినేట్ఇదిలా ఉంటే కామన్ మ్యాన్ కోసం బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో 15 మందిని సెలక్ట్ చేశారు. వారిలో ఐదుగురిని హౌస్కు పంపించనున్నారు. జడ్జిలు బిందుమాధవి, నవదీప్, అభిజిత్.. వారిని సానబెట్టి రాటుదేలుస్తున్నారు. అలాగే సరిగా పర్ఫామెన్స్ ఇవ్వనివారిని బయటకు పంపించేస్తున్నారు. అలా లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రసన్నకుమార్, శ్వేతను ఎలిమినేట్ చేశారు. ఈ పంచాయితీ సెట్టవదుఅయితే ప్రసన్నకు రెడ్ కార్డ్ ఇవ్వగానే అతడు నా జర్నీ ఇంతటితో ఆగిపోదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడున్న అందరికంటే నువ్వు వెయ్యి రెట్లు స్ట్రాంగ్.. నిన్ను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యా.. కానీ, ఈ షో నీ వల్ల కాదు, ఈ లొల్లి, ఈ పంచాయితీ నీతో కాదు.. అని నవదీప్ చెప్పాడు. అభిజిత్ సైతం.. నేను రియాలిటీ షో గెలిచుండొచ్చు, కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు అని అభినందించాడు.చదవండి: మర్యాదగా నా ఫోటోలను డిలీట్ చేయండి: హీరోయిన్ వార్నింగ్ -
800 చీరలు, 50 కిలోల జ్యువెలరీతో బిగ్బాస్లోకి.. ఎవరీ బ్యూటీ?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు.. అక్కడేం చేయాలి? ఎలా సిద్ధంగా ఉండాలి? అవతలివారిని ఎలా ఢీకొట్టాలి? మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఒక్కరు మాత్రం అవన్నీ పక్కనపెట్టి ఎలా రెడీ అవాలి? తన రాయల్ లైఫ్ను ప్రజలకు ఎలా చూపించాలి? అన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆవిడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రెన్యూర్ తాన్య మిట్టల్ (Tanya Mittal).50 కిలోల నగలుఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. ఈమె బిగ్బాస్ హౌస్కి ఏకంగా 800 చీరలు తీసుకెళ్లింది. అంతే కాదు, 50 కిలోల నగలను సైతం పట్టుకెళ్లిందట! ఇంత ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు.. నా లగ్జరీలను నేనెందుకు వదిలేసుకోవాలి? నా చీరలు, నగలు అన్నీ నాతోపాటే తీసుకెళ్తా.. రోజుకు మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అని షోకి వెళ్లడానికి ముందే చెప్పింది. వెండి వస్తువులను కూడా వెంట తీసుకెళ్లింది. ఇలాంటి వీఐపీ ట్రీట్మెంట్ తాన్యకు మాత్రమే దక్కడం గమనార్హం!ఎవరీ తాన్య?మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 2000వ సంవత్సరంలో తాన్య మిట్టల్ జన్మించింది. 19 ఏళ్ల వయసులో కేవలం రూ.500తో 'హ్యాండ్మేడ్ లవ్ బై తాన్య' పేరిట హ్యాండ్బ్యాగ్, నగల బిజినెస్ ప్రారంభించింది. తర్వాత ఇందులో చీరలు అమ్మడం కూడా మొదలుపెట్టింది. 2018లో మిస్ ఆసియా టూరిజం యూనివర్స్ టైటిల్ గెలిచింది. తనకు ఇన్స్టాగ్రామ్లో 2.5 మిలియన్ ఫాలోవర్లున్నారు. బిజినెస్, యాడ్స్ ద్వారా నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది. View this post on Instagram A post shared by Tanya Mittal (@tanyamittalofficial) చదవండి: మా ఇంట్లో ఎవరూ బీఫ్ తినరు: సల్మాన్ ఖాన్ తండ్రి -
అలా చేయలేను.. అందుకే ‘షో’ కి నన్ను పిలవరు : బిగ్బాస్ ఫేం కీర్తి భట్
బుల్లితెరపై రోజూ రకరకాల షోలు ప్రసారం అవుతుంటాయి. ఒక చానల్లో కామెడీ షో..మరో చానల్లో డ్యాన్స్ షో.. ఇంకో చానల్లో సింగింగ్ షో.. ఇలా నిత్యం పదుల సంఖ్యల్లో షోలు టెలికాస్ట్ అవుతుంటాయి. అయితే ఈ షోలలో ఎక్కువగా సీరియల్ నటీనటులలతో పాటు ‘బిగ్బాస్’ మాజీ కంటెస్టెంట్స్ కనిపిస్తుంటారు. యాంకర్గానో..జడ్జిగానో..టీమ్ లీడర్గానో..లేదా స్పెషల్ గెస్ట్ గానో ఏదో ఒకరకంగా వాళ్లు టీవీల్లో సందడి చేస్తుంటారు. శ్రీముఖి, లాస్య, శివజ్యోతి, అరియానా, శోభా శెట్టి, విష్ణుప్రియ..ఇలా చాలామంది బిగ్బాస్ ప్లేయర్స్ ఇప్పుడు వరుస షోలతో బిజీ అయిపోయారు. కానీ బిగ్బాస్తో ఎంతో పేరు సంపాదించున్న కీర్తి భట్ మాత్రం ఎలాంటి షోలలో కనిపించడం లేదు. బిగ్బాస్ షో టెలికాస్ట్ అయ్యే చానల్లో సైతం ఆమె కనిపించడం లేదు. తాజాగా దీనికి గల కారణాన్ని బయటపెట్టింది కీర్తి భట్. అందరిలానే తాను గ్లామర్ షో చేయనని..వాళ్లు చెప్పినట్లుగా చిన్న చిన్న దుస్తులు ధరించలేనని..అందుకే తనని ఏ షోకి పిలవరని అంటోంది. అడుక్కోవడం నచ్చదునేను గతంలో ఒక ఇంటర్వ్యూలో ‘అమ్మాయిలు గ్లామర్గా ఉంటేనే బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్లు చెప్పినట్లుగా మోకాళ్ల వరకు దుస్తులు వేసుకునే వాళ్లకే అవకాశం ఇస్తారు. నేను అలా చేయలేను. అందుకే నాకు అవకాశాలు రావు’ అని చెబితే కొంతమంది పర్సనల్గా తీసుకొని ఫీలయ్యారు. నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పింది నిజం. అలా అని వాళ్ల డ్రెసింగ్పై కామెంట్స్ చేయడం సరికాదు. నేను అలా వేసుకోలేను. చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు. చాన్స్ ఇవ్వమని నేను ఎవరిని అడిగే రకం కూడా కాదు. అలా అడిగితే ఛీప్ అయిపోతాం. ఎంత కష్టం వచ్చినా ఇంకొకరి సహాయం తీసుకోకూడదనే వ్యక్తిత్వం నాది.ఎవరూ సపోర్ట్ చేయలేదుబిగ్బాస్ వల్ల నా కెరీర్కి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఆ షో వల్ల నేను జనాలకు దగ్గరైన మాట నిజమే. కానీ కెరీర్ పరంగా మాత్రం ఏం యూజ్ కాలేదు. షో ద్వారా వచ్చిన ఫేంతో నాకు అవకాశాలు రాలేదు. టాప్ 5, 10లో ఉన్నవాళ్లను ఆఫర్స్ వచ్చాయి. అలా కొంతమందికి బిగ్బాస్ షో కలిసొచ్చింది. నా వరకు అయితే ఈ షోతో నా కెరీర్లో ఎలాంటి మార్పులు రాలేదు. అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ప్రవర్తను మార్చుకున్నా. బిగ్బాస్కి వెళ్లే ముందు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఎవరు ఎవరికీ లేరు. మనం దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడారు. నేను చాలా త్వరగా మనుషులను నమ్మేస్తాను. కొంచెం మంచిగా మాట్లాడితే నా వాళ్లే అనుకుంటాను. అన్ని చెప్పేస్తా. ఇప్పుడు నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం పోయింది’ అని కీర్తి భట్ చెప్పుకొచ్చింది. కాగా కార్తీకదీపం, మనసిచ్చిచూడు వంటి సీరియళ్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి..బిగ్బాస్ సీజన్ 6లో పాల్గొని.. తనదైన ఆటతీరుతో టాప్ 3 లో స్థానం సంపాదించుకుంది. సింగర్ రేవంత్ ఆ సీజన్ విన్నర్గా నిలిచాడు. -
బట్టలు చించుకుంటున్నారు.. ఎవడ్రా బిగ్బాస్? కట్ చేస్తే షోలో కన్నీళ్లు!
మరికొద్దిరోజుల్లో బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కన్ఫార్మ్ చేసేశారు. అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా? సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు. ఎవరో ఒకర్ని కాకుండా అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించినవారికే రియాలిటీ షోలో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అగ్నిపరీక్ష మొదలైంది. 15 మంది మధ్య పోటీ జరుగుతోంది.ఓటేయండి ప్లీజ్వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం (Anusha Ratnam) కూడా ఉంది. తాజాగా హాట్స్టార్ ఆమె ఓట్ అప్పీల్ చేసిన వీడియో రిలీజ్ చేసింది. అందులో అనూష మాట్లాడుతూ.. ఉద్యోగం చేశా, ట్యూషన్ టీచర్గా చేశా.. కంటెంట్ క్రియేటర్గానూ పని చేశాను. మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఎంటరయ్యాను. ప్రతి తెలుగింటికి నా గొంతు వినిపించాలంటే నన్ను బిగ్బాస్లోకి పంపించాలి. బిగ్బాస్కు నన్ను పంపించాలంటే ఓటింగ్ ముఖ్యం. కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి.గర్వపడేలా చేస్తా..ఈమెను ఎందుకురా పంపించాం? అని నిరాశ చెందకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా.. మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటేయమని వేడుకుంది. అనూష రత్నం వరంగల్ అమ్మాయి. తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఇటీవల వర్జిన్ బాయ్స్ మూవీ ఈవెంట్లో యాంకరింగ్ కూడా చేసింది. ఎవడ్రా బిగ్బాస్?బిగ్బాస్కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షోపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే? అందరూ బిగ్బాస్, బిగ్బాస్ అని బట్టలు చించేసుకుంటున్నారు. ఎవడ్రా బిగ్బాస్ అని హేళన చేసింది. కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ కావడంతో ఆమెను నేరుగా టాప్ 15కి పంపించారు. అప్పుడు విష్ణుప్రియ.. ఇప్పుడు అనూషఅక్కడినుంచి నేరుగా బిగ్బాస్ 9కి పంపమని వీడియోలు చేస్తోంది అనూష. మరి తను బిగ్బాస్ 9లో ఉంటుందా? లేదా? అనేది చూడాలి! గతంలో విష్ణుప్రియ కూడా.. షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. కట్ చేస్తే గత సీజన్లో ప్రత్యక్షమైంది. ఆట ఆడకుండా పిక్నిక్కు వచ్చినట్లు కూర్చుంది. మరి ఈ అనూష షోకి వెళ్తుందా? వెళ్తే ఎలా ఆడుతుంది? అన్నది చూడాలి! View this post on Instagram A post shared by Telugu Heartful (@telugu_heartful) చదవండి: కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. టీజర్ రిలీజ్ -
అఫీషియల్: వచ్చేవారమే బిగ్బాస్ 9 ప్రారంభం
బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్బాస్ 9 షో (Bigg Boss 9 Telugu) కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్బాస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. సెప్టెంబర్ 7న బిగ్బాస్ 9 ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. 9వ సీజన్ కావడంతో ప్రోమోలో నవగ్రహాలను చూపించారు. అలాగే ఈసారి రెండు హౌస్లు ఉంటాయన్నారు. ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్ మ్యాన్ కోసం అని తెలుస్తోంది. అలాగే బిగ్బాస్నే మారుస్తున్నట్లు చెప్పాడు నాగ్. అంటే బిగ్బాస్ వాయిస్ మారొచ్చని తెలుస్తోంది. అగ్నిపరీక్షఇప్పటికే కామన్ మ్యాన్ కోసం సెలక్షన్ జరుగుతోంది. హాట్స్టార్లో అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 15 మంది సెలక్టయ్యారు. వారికి రకరకాల గేమ్స్ పెడుతున్నారు. నచ్చినవారికి ఓట్లేసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓట్లు ఎక్కువ వచ్చిన ఒకరిద్దరు కంటెస్టెంట్లను హౌస్లోకి పంపించవచ్చని తెలుస్తోంది. అలాగే అగ్నిపరీక్ష షో జడ్జిలైన బిందు మాధవి, నవదీప్, అభిజిత్.. ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లను సెలక్ట్ చేసి డైరెక్ట్గా పంపించవచ్చని భోగట్టా! మరి హౌస్లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే! -
పెళ్లయి 9 ఏళ్లు.. ఇంకా పిల్లలు వద్దంటోంది: నటుడు
హిందీ బిగ్బాస్ 19వ సీజన్ (Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను లాంచ్ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టారు. వారిలో బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) ఒకరు! తాజాగా ఓ ఎపిసోడ్లో యూట్యూబర్ మృదుల్ తివారీతో తన కుటుంబ విషయాలను చర్చించాడు. నా భార్య పేరు ఆకాంక్ష చమోలా (నటి).. ఈ ఏడాది నవంబర్ నాటికి మా వైవాహిక జీవితానికి 9 ఏళ్లు నిండుతాయి అని చెప్పాడు.పిల్లలంటే ఇష్టం.. భార్య వద్దంటోందిఎంతమంది పిల్లలు అని మృదుల్ అడగ్గా.. ఎవరూ లేరని బదులిచ్చాడు గౌరవ్. నా భార్య పిల్లలు వద్దంటోంది. కానీ, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. కాబట్టి తనేం చెప్పినా నేను ఒప్పుకుని తీరాల్సిందే! ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలను మనం గౌరవించాల్సిందే! తను అన్నదాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే మాపై చాలా బాధ్యతలున్నాయి. నేను షూటింగ్స్ కోసం రోజంతా బయటే ఉండాల్సి వస్తుంది. తను కూడా షూటింగ్స్తో బిజీగా ఉంటుంది. ఎవరు చూసుకుంటారు?అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుంటే వారిని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యతను బయటవారికి అప్పజెప్పడం మాకిష్టం లేదు. ఓసారి నాకు పిల్లలు కావాల్సిందేనని తన దగ్గర పట్టుపట్టాను. అప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక తను చెప్పింది కూడా కరెక్టే అనిపించి చైల్డ్ ప్లానింగ్ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.దాంపత్యానికి 9 ఏళ్లుగౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షోలో పాల్గొని టైటిల్ గెలిచాడు. ఆ షోలోనే ఆకాంక్షతో ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్లో ఆమెను తొలిసారి చూడగానే లవ్లో పడ్డానని, అలా అతడే ధైర్యం కూడదీసుకుని ఓ అడుగు ముందుకేసి ఆమెతో మాట కలిపానని తెలిపాడు. అలా తమ జర్నీ పెళ్లివరకు వచ్చిందన్నాడు. గౌరవ్- ఆకాంక్ష 2016లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. -
పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. రెండోసారి బంపరాఫర్!
బిగ్బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో 15 మంది మిగిలారు. వీరిమధ్య రకరకాల పోటీలు పెడుతూ ఏరోజుకారోజు ఫలానా కంటెస్టెంట్ బెస్ట్, ఫలానా కంటెస్టెంట్ వరస్ట్ అని ప్రకటిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోమని జియోహాట్స్టార్లో ఓటింగ్ వెసులుబాటు కల్పించారు. నిన్నటి ఎపిసోడ్లో శ్రీజ బెస్ట్ అయితే కల్కిని వరస్ట్ పర్ఫామర్గా ప్రకటించారు. మరి ఈ రోజు ఏం జరిగిందనేది నేటి (ఆగస్టు 28) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..లీడర్గా దాలియాఇప్పటికే నిన్న గేమ్ గెలిచిన ప్రియ.. నేడు కూడా లీడర్గానే కొనసాగింది. మరో లీడర్ కోసం టైమ్ గేమ్ ఆడించారు. అందరినీ బాక్సుల్లో కూర్చోబెట్టి సరిగ్గా రెండు నిమిషాల్లో లేవాలన్నారు. అయితే ఫస్ట్, లాస్ట్ లేచినవారు ఆటలో ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చారు. తొమ్మిదో స్థానంలో నిలబడ్డవారికి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. అలా దాలియా గెలిచి లీడర్ అవగా.. షాకిబ్, మనీష్ తొలి, చివరి స్థానాల్లో లేచి ఆటలో లేకుండా పోయారు.కుండ పగిలిందిప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, నిఖిత, నాగ ప్రశాంత్, శ్రేయ ఒక టీమ్గా; దాలియా.. ప్రసన్న, శ్వేత, పవన్, అనూష, కల్కి మరో టీమ్గా ఏర్పడ్డారు. వీళ్లందరికీ కుండ గేమ్ ఇచ్చారు. వేలితో కుండ కట్టి ఉన్న తాడును పట్టుకోవాలన్నారు. కుండ కింద పడేసినవాళ్లు ఎలిమినేట్ అవడం కాదు కానీ, ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని మెలిక పెట్టారు. ఈ గేమ్లో ప్రియ టీమ్ నుంచి పవన్ కల్యాణ్, దాలియా టీమ్ నుంచి కల్కి చివరి వరకు ఉన్నారు. కంటతడి పెట్టుకున్న జవాన్తన టీమ్ లీడర్ ప్రియ.. కుండ పడేసేయ్ అని చెప్పడంతో పవన్ తనకు సత్తా ఉన్నా సరే, దాన్ని కిందపడేశాడు. తీరా చూస్తే అందులో ప్రియ ఫోటోనే ఉండటంతో వారి టీమ్ ఓడిపోయింది. చివరి వరకు ఉన్న కల్కి కుండలో తన ఫోటోనే ఉంది. అలా తాను గెలవడంతో పాటు తన టీమ్ను సైతం గెలిపించింది. అయితే చివరి వరకు వచ్చి ఓడిపోయానని సైనికుడు పవన్ కంటతడి పెట్టుకున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. ఎంత కష్టపడ్డా చివరకు ఇలాగే జరుగుతుందని ఎమోషనల్ అయ్యాడు. రెండోసారి ఓట్ అప్పీల్ఈ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ప్రకటించడంతో అతడు ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈ బంపరాఫర్ ఇతడికి రెండోసారి రావడం విశేషం! అలాగే తన టీమ్ను గెలిపించిన కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిన్న వరస్ట్ ప్లేయర్ అన్నవారితోనే సూపర్ అనేలా గేమ్ ఆడింది. మర్యాద మనీష్ను వరస్ట్ ప్లేయర్గా ప్రకటించారు. చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్లో చిక్కుకుపోయిన హీరో మాధవన్! -
టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్
బిగ్బాస్ అగ్నిపరీక్షలో సామాన్యుల మధ్య పోటీ జరుగుతోంది. వీరిలో టాప్ 15 సెలక్షన్ జరిగిపోయింది. ఈ పదిహనుమంది మధ్యలో గేమ్స్ పెట్టి ఐదు లేదా తొమ్మిది మందిని ఎంపిక చేసి బిగ్బాస్ 9వ సీజన్కు పంపించనున్నారు. మరి ఎలాంటి టాస్కులు పెట్టారు? అసలు టాప్ 15లో ఎవరున్నారనేది నేటి (ఆగస్టు 27) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..టాప్ 15 వీళ్లే..ప్రసన్న కుమార్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, అనూష రత్నం, దమ్ము శ్రీజ, సైనికుడు పవన్ పడాల, దాలియా, కల్కి, షాకిబ్, శ్వేతా శెట్టి, దివ్య వేలమురి, శ్రేయ, డిమాన్ పవన్, నాగ ప్రశాంత్, హరిత హరీశ్ (మాస్క్ మ్యాన్).. వీరందరూ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో టాప్ 15కి చేరారు. వీరందరికీ నాగార్జున ఆల్ ద బెస్ట్ చెప్పిన వీడియో ప్లే చేయడంతో కంటెస్టెంట్లు సంతోషించారు. ఇక షో అంతా అరగుండుతో ఉండాల్సిందే అని మాస్క్ మ్యాన్కు పెట్టిన కండీషన్ను తీసేశారు. అరగుండు ఎందుకులే అంటూ బిందుమాధవి అతడికి గుండు గీసింది.రెండు టీమ్స్..వీళ్లందరికీ 1 నుంచి 15 వరకు స్టాండ్స్ ఇచ్చి.. మీకు అర్హత ఉన్న స్థానాల్లో నిలబడమన్నారు. దీంతో చాలామంది మొదటి మూడు స్థానాల కోసం పోటీపడ్డారు. నీకంటే నాకే అర్హత ఉంది, నువ్వు ఎమోషనల్గా వీక్.. ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ర్యాంకుల కోసం కొట్లాట జరిగింది. ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు వేయించుకోవాలన్న టాస్క్ను గుర్తు చేసిన మనీష్.. కల్కి ముందే ప్లాన్ చేసి తన ఫ్రెండ్కు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండమని చెప్పడంతో ఆ గేమ్ తను గెలిచేసిందన్నాడు. అది నిజం కాదని కల్కి ఎక్కువగా వాదించకపోవడంతో ఒకరకంగా తను దాన్ని ఒప్పుకున్నట్లుగానే కనిపించింది. ఓట్ అప్పీల్ఇక ఈ గేమ్లో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న వారిని రెడ్ టీమ్గా, తర్వాతి ఆరు స్థానాల్లో ఉన్నవారిని బ్లూ టీమ్గా విడదీశారు. చిట్టిచివర్లో 15వ స్థానంలో ఉన్న దాలియాను సంచాలక్గా పెట్టారు. ఈ గేమ్లో ప్రసన్నకుమార్ను సంచాలక్ అన్యాయంగా ఎలిమినేట్ చేసింది. దీంతో ఆట యూటర్న్ తిరిగింది. బ్లూ టీమ్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. టీమ్ లీడర్ ప్రియ.. చివరి వరకు ఆడి గెలిపించిన పవన్ పడాలను సెలక్ట్ చేసింది. దీంతో అతడు ఓట్లేయమని అడిగాడు. చెత్త ప్లేయర్బిందుమాధవి.. వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్గా కల్కిని ప్రకటించింది. వాల్యుబుల్ ప్లేయర్గా శ్రీజను ప్రకటించగా ఆమె స్టేజీపైకి వచ్చింది. దమ్ము మాటల్లోనే కాదు చేతల్లోనూ ఉంది. నా వాయిస్ చిరాకుగా ఉన్నా ఆట ఇంట్రస్టింగ్గా ఉంటుంది. ఒక్క ఛాన్సిస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తా అని తనకు ఓటేయమని అభ్యర్థించింది. ఆమె చలాకీతనం చూసిన అభిజిత్.. నువ్వు షోలో ఉండొద్దని రెడ్ కార్డ్ చూపించా.. కానీ, ఇప్పుడు నా మనసు మారిందన్నాడు. చదవండి: ఒక్కసారిగా కళ్లముందుకు.. మనసంతా సంతోషంగా ఉంది: నిహారిక -
‘బిగ్బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే
బుల్లితెరపై ‘బిగ్బాస్’రియాల్టీ షోకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా అంతటా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక హిందీలో అయితే ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా 19వ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం అయింది. మనుషుల ఎమోషన్తో సాగే ఈ షో.. కొంతమందికి జీవిత భాగస్వాములను కూడా వెతికిపెట్టింది. ఈ షోలో పాల్గొని, ప్రేమలో పడి..పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ‘బిగ్బాస్’కలిపిన జంటలపై ఓ లుక్కేద్దాం.సారా ఖాన్- అలీ మర్చంట్ బిగ్బాస్ షో ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తొలి జంట సారా ఖాన్, అలీ మర్చంట్. హిందీ బిగ్బాస్ 4లో పాల్గొన్న వీరిద్దరు.. షోలో ఉన్నప్పుడే ప్రేమలో పడి వివాహం(2010లో) చేసుకున్నారు. అయితే, వీరి ప్రేమ కథ సుఖాంతం కాలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు.మోనాలిసా- విక్రాంత్ సింగ్ రాజ్పూత్భోజ్పురి హీరోయిన్ మోనాలిసా (అంతరా బిస్వాస్) బిగ్బాస్ 10లో పాల్గొన్నప్పుడు, ఆమె బాయ్ఫ్రెండ్ విక్రాంత్ సింగ్ రాజ్పూత్ షోలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి, జాతీయ టెలివిజన్లో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ క్షణం అభిమానులకు ఎమోషనల్ మూమెంట్గా నిలిచింది. 2017లో వీరు బిగ్బాస్ హౌస్లోనే వివాహం చేసుకున్నారు, ఇది షో చరిత్రలో అరుదైన సంఘటన. తర్వాత వారు సాంప్రదాయ వివాహ వేడుకను కూడా జరుపుకున్నారు. వీరి బంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది.యువికా చౌదరి-ప్రిన్స్ నరులాహిందీ బిగ్బాస్ 9లో పాల్గొన్న ప్రిన్స్ నరులా, యువికా చౌదరితో స్నేహంగా మొదలైన బంధం క్రమంగా ప్రేమగా మారింది. షోలో ప్రిన్స్ యువికా కోసం హార్ట్ ఆకారంలో చపాతీ చేసి ప్రపోజ్ చేసిన సన్నివేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు దీన్ని గేమ్ స్ట్రాటజీ అనుకున్నప్పటికీ, షో తర్వాత వీరి ప్రేమ నిజమని నిరూపితమైంది. 2018 అక్టోబర్ 12న వీరు గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. యువికా ప్రిన్స్ కంటే ఏడేళ్లు పెద్దవారైనప్పటికీ, వారి బంధం అభిమానులకు స్ఫూర్తిగా నిలిచింది.సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్ బిగ్బాస్ 9లో పాల్గొన్నారు. వీరు 2011 నుంచి డేటింగ్లో ఉన్నప్పటికీ, షోలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, షో ఒత్తిడిలో కూడా వారి బంధం బలపడింది. 2016లో వీరు సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి నిర్వైర్ అనే కుమారుడు జన్మించాడు.పాయల్ రోహత్గీ- సంగ్రామ్ సింగ్బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ, రెజ్లర్ సంగ్రామ్ సింగ్ బిగ్బాస్ 7లో కలుసుకున్నారు. వీరి సంబంధం షో తర్వాత కూడా కొనసాగింది, దాదాపు 12 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.2022 జులై 9న ఆగ్రాలో వీరు వివాహం చేసుకున్నారు. -
బిగ్బాస్లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్తో గుర్తింపు
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha) దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే రేసు నుంచి కొందరిని ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. వీళ్లంతా కామన్ ఆడియన్స్ విభాగంలో బిగ్బాస్9లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, సెలబ్రిటీలు ఎవరు పాల్గొననున్నారు అనే అంశంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముద్ద మందారం సీరియల్ హీరోయిన్ బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిపోయినట్లు సమాచారం.బిగ్బాస్ హౌస్లోకి ప్రతి ఏడాది సీరియల్స్లలో గుర్తింపు పొందిన వారిని తీసుకుంటారు. ముఖ్యంగా కన్నడకు చెందిన అమ్మాయిలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని తెలిసిందే. కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, యష్మి గౌడ, నిఖిల్ వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు సీజన్-9లోకి 'ముద్ద మందారం' సీరియల్లో పార్వతి పాత్రతో మెప్పించిన 'తనుజా గౌడ' ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయింది. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.కన్నడకు చెందిన తనుజా గౌడ కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఎక్కువగా సీరియల్స్లోనే నటించింది. దాదాపు 5 సంవత్సరాలు ప్రసారమైన ముద్ద మందారంతో ఆమెకు తెలుగులో పాపులారటీ తెచ్చుకుంది. ఆ తర్వాత నాగ భైరవి సీరియల్లోనూ ఆమె నటించింది. ఆమె గ్లామర్తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న నటిగా గుర్తింపు పొందింది. బిగ్బాస్లో ఇప్పటికే కన్నడ అమ్మాయిలు బాగా రాణించారు. దీంతో తనుజా గౌడ కూడా మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ ఓవరాక్షన్
బిగ్బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15కి ఆరుగురు సెలక్ట్ అయ్యారు. మిగిలిన తొమ్మిది స్థానాల కోసం 16 మంది పోటీపడుతున్నారు. వీరికి డేర్ ఆర్ డై అంటూ రకరకాల టాస్కులిచ్చారు. గెలిచినవారిని టాప్ 15కి పంపించారు. మరి ఎవరెవరు ఫైనల్స్లో అడుగుపెట్టారో నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్లో చూసేద్దాం..అరగుండుతో బిగ్బాస్లోమొదటగా మాస్క్ మ్యాన్ హరీశ్, సాయికృష్ణను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్ విసిరారు. సీజన్ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు. మాస్క్ మ్యాన్ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్ అందుకుని అరగుండు గీసుకున్నారు. దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్ 15కి పంపించారు. నెక్స్ట్ దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి ఐయామ్ లూజర్ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు. ఊర్మిళ మోడల్ కాబట్టి తాను రిజెక్ట్ చేసింది. శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. అయితే ఐయామ్ లూజర్కు బదులుగా ఐ లవ్ బిగ్బాస్ అని పచ్చబొట్టు వేయించారు.పది నిమిషాల్లో కిలో బరువుతర్వాత సోల్జర్ పవన్ కల్యాణ్, అబూకు 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ, బర్గర్ ముందు పెట్టారు. ఈ గేమ్లో పవన్ గెలిచాడు. ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్లో ప్రియ రెండు చేతులుపయోగించి దాలియాను ఓడించింది. కానీ, జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్కు పంపించారు. షాకీబ్, కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్ ఇచ్చింది. ముందుగా షాకీబ్ను బయటకు పంపేసి.. ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అర్జంట్గా డబ్బులు వేయించుకోవాలి. (Bigg Boss Agnipariksha)షాకీబ్కు అన్యాయంఎవరి అకౌంట్లో ఎక్కువ అమౌంట్ పడుతుందో వారు నెక్స్ట్ లెవల్కు వెళ్తారంది. దీంతో కల్కి తన ఫ్రెండ్కు రెండుసార్లు ఫోన్ చేయగా రూ.90 వేలు అకౌంట్లో పడ్డాయి. తర్వాత షాకీబ్ను స్టేజీపైకి పిలిచారు. కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్ చెప్పలేదు. ఎవరికైనా కాల్ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్లో వేయించుకో అంది శ్రీముఖి. కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని రూ.10 వేలు అడిగాడు. అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అతడి అకౌంట్లో రూ.50 వేలు పడ్డాయి.దమ్మున్న శ్రీజఎవరి దగ్గర ఎక్కువుంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఈ గేమ్లో కల్కి గెలిచింది. తనకు క్లియర్గా టాస్క్ వివరించి చెప్పలేదని షాకీబ్ ప్రశ్న లేవనెత్తాడు. దీంతో శ్రీముఖి.. ఎవరికైనా అన్ఫెయిర్ అనిపించిందా? అని అడగ్గా.. దమ్ము శ్రీజ చేయెత్తింది. తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి.. అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు. నవదీప్, శ్రీముఖి ఓవరాక్షన్కానీ నవదీప్ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు. ఎందుకు అన్ఫెయిర్గా అనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీజ.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు. మొత్తానికి నాలుగు ఎపిసోడ్లో హరీశ్, శ్రీజ, ప్రియ, కల్కి.. టాప్ 15లో అడుగుపెట్టారు. చదవండి: నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్ -
భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే వెనక్కులాగారు!
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha)కు వేలాదిమంది అప్లై చేశారు. వారిలో ట్రాన్స్జెండర్ అంకితనాయుడు ఒకరు. పలు రౌండ్లలో ముందుకు వెళ్లిన ఆమె అగ్నిపరీక్ష స్టేజీపై మాత్రం కనిపించలేదు. అందుకు గల కారణాన్ని, తన జర్నీని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంకిత నాయుడు మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చీరకట్టుకుని, బొట్టు పెట్టుకుని గాజులు వేసుకునేదాన్ని. అక్కల పెళ్లయ్యాకే..18 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను అమ్మాయిలా మారాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు అక్కల పెళ్లయ్యే వరకు ఆగి ఆ తర్వాతే అమ్మాయిగా మారాను. ఈ మధ్య నాకు బిగ్బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. బిగ్బాస్ షో చాలా పెద్ద ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామ్కు నేను సెలక్ట్ అయ్యానని తెలిసి సంతోషపడ్డాను. నాకు మొదటి నుంచీ ఈ షో అంటే ఇష్టం!భిక్షాటన చేశా.. తర్వాత..అయితే గతంలో నేను భిక్షాటన చేశాను, వేశ్యగా మారాను, షాప్ ఓపెనింగ్స్కు వెళ్లాను. ఇవన్నీ దాటుకుని వచ్చాను. ఇప్పుడు బిగ్బాస్లో ఛాన్స్ వస్తే అక్కడ నన్ను నేను నిరూపించుకోవచ్చనుకున్నాను. నేను వెళ్లి నా కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలనుకున్నాను. గతంలో బిగ్బాస్ (Bigg Boss Reality Show)కు వెళ్లిన ప్రియాంక సింగ్.. చాలామందికి డ్రీమ్గర్ల్ అయిపోయారు. తను నాకు రోల్మోడల్. స్టేజీపైకి వెళ్లకుండానే..ఈ సీజన్లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ, నా కమ్యూనిటీ వాళ్లు నన్ను వెనక్కు లాగేశారు. అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి నన్ను స్టేజీపైకి రమ్మని ఆహ్వానించింది. ఓ పాట కూడా ప్లే చేశారు. ఇంతలో వెళ్లకుండానే ఆపేశారు. మా కమ్యూనిటీ వాళ్లు.. బిగ్బాస్ టీమ్కు నేను వేశ్యగా పనిచేసినప్పటి వీడియోలు పంపారు. దాంతో వాళ్లు నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీనివల్ల మీకే కాదు, షోకి సైతం నెగెటివిటీ వస్తుందన్నారు. వాళ్ల ఆలోచనప్రకారం వాళ్లు కరెక్టే! ఎప్పుడో జరిగినదాన్ని..మా కమ్యూనిటీ వాళ్లే ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎప్పుడో జరిగినదాన్ని ఇప్పుడు తీసి చూపించడం నచ్చలేదు. మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అని బీరాలు పలికే లీడర్స్.. నేను సెలక్ట్ అయితే ఎందుకు జీర్ణించుకోలేకపోయారు? పైగా అదే లీడర్ అక్కడ సెలక్ట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె ఎంపికవలేదు. మా వాళ్లు నన్ను నెగిటివ్ చేసి ఇంకెప్పుడూ బిగ్బాస్కు వెళ్లకుండా చేశారు అని అంకిత నాయుడు చెప్పుకొచ్చింది.చదవండి: సీక్రెట్గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె -
సిద్దిపేట మోడల్కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష!
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)లో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మరి మూడో ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం.. మొదటగా ఆర్మీ జవాన్ వచ్చాడు. అతడికి యాక్టింగే ఎక్కువ ఇష్టమన్నాడు. ఒకవేళ బిగ్బాస్ గెలిచి ఆఫర్లు వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే ఆర్మీకి వెళ్లిపోతానన్నాడు. అతడికున్న క్లారిటీ జడ్జిలకు నచ్చింది. అలా అని ఇతడిని నేరుగా టాప్ 15కి పంపించలేదు, ఎలిమినేట్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు.సిద్దిపేట మోడల్కు షాక్సింగర్, డ్యాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చిన షకీం.. స్టేజీపై సరిగా డ్యాన్స్ చేయలేకపోయాడు. అయినా ఇతడికి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్కు పంపించాడు. సిద్దిపేట మోడల్ స్టేజీపై రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీవి అంటూ పంపించేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం తన స్టోరీ చెప్పింది. తండ్రి లేకపోయినా తనే కుటుంబం కోసం నిలబడి అప్పులు తీర్చానని, చెల్లిని విదేశాల్లో చదివించానని పేర్కొంది. 98 మంది ప్రపోజ్అయితే నామినేషన్స్ చేయమంటే మాత్రం తడబడింది. అప్పటికే తన స్టోరీ విని కరిగిపోయిన జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఆమెను టాప్ 15లోకి పంపించారు. తనకు 98 మంది ప్రపోజ్ చేశారంటూ స్టేజీపైకి వచ్చిన శ్రీకృష్ణను, డాక్టర్ నిఖితను.. మరికొందరిని హోల్డ్లో పెట్టారు. యూకే నుంచి బిగ్బాస్ కోసమే వచ్చానన్న శ్వేతను టాప్ 15లోకి పంపించారు. ఈమె తల్లికి క్యాన్సర్ కాగా.. ఈ ఎపిసోడ్ వచ్చేకంటే ముందే ఆమె కన్నుమూయడం విషాదం! రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలామందిని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసి పంపించేశారు. 19 ఏళ్ల అబ్బాయికి అన్యాయం?19 ఏళ్ల అమ్మాయి శ్రేయను ఎంకరేజ్ చేసిన జడ్జిలు అదే వయసులో ఉన్న అబ్బాయి జనిత్ను మాత్రం ఎలిమినేట్ చేయడం గమనార్హం! ఒక ప్రమాదంలో తల్లికి 80% గాయాలయ్యానని, అయినా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషించిందన్నాడు. తండ్రి చనిపోయినా అన్నీ తనే చూసుకుందన్నాడు. ఒకమ్మాయి విదేశాల్లో చదివించి, మరో అమ్మాయికి పెళ్లి చేసి, అతడిని చదివిస్తోంది అని తల్లి గొప్పదనం చెప్పాడు. అది విని జడ్జిలు లేచి చప్పట్లు కొట్టారు. తాను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నానన్నాడు. జీవితంపై క్లారిటీ ఉన్న ఇతడిని రిజెక్ట్ చేశారు.టాప్ 15 కోసం పోటీఫైనల్గా ఇప్పటివరకు టాప్ 15లో ఆరుగురిని సెలక్ట్ చేశారు. 16 మందిని హోల్డ్లో పెట్టారు. ఈ పదహారు మందికి రకరకాల టాస్కులు పెట్టి వారిలో 9 మందిని టాప్ 15లో చేర్చనున్నారు. మరి ఆ టాస్కులేంటి? ఎవరు సెలక్ట్ అవుతారన్నది రేపటి ఎపిసోడ్ రివ్యూలో చూద్దాం..చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా! -
అగ్నిపరీక్ష: చిరాకు తెప్పించిన అతడు, బిందు, శ్రీముఖినే ఓడించిన ఆమె
బిగ్బాస్ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్కు 15 మందిని సెలక్ట్ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్బాస్ తొమ్మిదో సీజన్కు పంపించనున్నారు. ఈ ఎంపిక బాధ్యత బిందుమాధవి, నవదీప్, అభిజిత్లపై ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఎనిమిది మందిని టెస్ట్ చేశారు. మరి రెండో ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారు? జడ్జిలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూసేద్దాం..మాటల తుపానుమొదటగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్ స్టేజీపైకి వచ్చాడు. యాక్టింగ్ కోసమే బిగ్బాస్ (Bigg Boss 9 Telugu)కు రావాలనుకుంటున్నానన్న ఇతడు శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేశాడు. ఇతడికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దమ్ము శ్రీజ.. రాగానే ఓవర్ చేసింది. ఆమె నోటివాగుడుకు అందరూ బెంబేలిత్తిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. నీ ఆడపులి టైటిల్ నేను లాగేసుకుంటానని బిందుమాధవితో సవాలు చేసింది. ఆమె మాటలు ఎవరికీ నచ్చలేదు. నవదీప్ ఒక్కడే తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.పేడ రుద్దుకోమనగానే..తర్వాత తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ జరిగాయి. తర్వాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్కు మాస్ టాస్కులిచ్చారు. పిడకలు చేయమనగానే చేసింది. చెంపలకు పేడ రుద్దుకోమనగానే బుగ్గలపై పూసుకుంది. ఈమెక్కూడా నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. చిదానందశాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురిని జడ్జిలు ఎలిమినేట్ చేశారు. అడ్వొకేట్ నాగప్రశాంత్కు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.అబ్బాయిలే గ్రేట్19 ఏళ్ల శ్రేయకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి టాప్ 15కి పంపించారు. అబ్బాయిలే గ్రేట్ అంటూ అమ్మాయిలను చులకన చేసిన రవి అనే కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేశారు. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో 30 నిమిషాలు పురిటినొప్పులు భరిస్తారు, అదొక్కటే గ్రేట్ అన్నట్లుగా మాట్లాడాడు. తొమ్మిది నెలల జర్నీ అతడి కళ్లకు కనిపించలేదా? అని అక్కడున్నవాళ్లు షాకయ్యారు. కోపంతో బిందుమాధవి అతడిని గెంటేసినంత పని చేసింది. సింగర్ శ్రీతేజ్కు ఒక ఛాన్సిద్దామంటూ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరూ ఇంట్రస్టింగ్గా లేరంటూ దాదాపు ఏడుగురిని వెంటవెంటనే ఎలిమినేట్ చేశారు (Bigg Boss Agnipariksha).బిందు, శ్రీముఖిని ఓడించిన కల్కిఅనంతరం ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ స్టేజీపైకి వచ్చాడు. ఇతడికి బిందు మినహా మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్తో నెక్స్ట్ లెవల్కు పంపించారు. మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి స్టేజీపైకి వచ్చి.. మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం లేరు. కానీ మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే అంటూ తన స్టోరీ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్లో బిందు, శ్రీముఖిని ఓడించింది. ఈమెక్కూడా బిందుమినహా మిగతా ఇద్దరూ ఓ ఛాన్సిద్దామని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ -
పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టాలన్నది చాలామంది ఆశ. ఎలాగైనా సరే బిగ్బాస్ టీమ్ కంట్లో పడాలని చిత్రవిచిత్ర పనులు చేసిన జనాలున్నారు. అందులో మల్టీస్టార్ మన్మద రాజా ఒకరు. ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇతడు అగ్నిపరీక్ష షోకి సెలక్ట్ అవగా.. ఫస్ట్ ఎపిసోడ్లో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు.పేడ రుద్దుకోమని టాస్క్కానీ ఏడుపొక్కటే ఆయుధం అన్నట్లుగా కేవలం సింపతీ కోసమే ట్రై చేశాడు. ఇది చూసి జడ్జిలు ముగ్గురూ అతడిని రిజెక్ట్ చేశారు. బిగ్బాస్లో ఛాన్స్ కావాలంటూ సోషల్ మీడియాలో పిచ్చిపనులు చేసే వాళ్లందరికీ హౌస్లో ఎంట్రీ ఉండదని అతడి ఎలిమినేషన్తో క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే తాజాగా సెకండ్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో పేడ రుద్దుకోమని చెప్పగానే ఓ లేడీ కంటెస్టెంట్ ఏమాత్రం ఆలోచించకుండా బుగ్గలపై పేడ పూసుకుంది. మరో లేడీ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ స్టేజీపై కాస్త అతిగా ప్రవరిస్తూ జడ్జిలకు చిరాకు తెప్పించింది.శ్రీముఖికి కౌంటర్ఆమె అరుపులకు శ్రీముఖి స్పందిస్తూ.. ఇలా మొత్తుకుంటే పిల్ల ఏం అరుస్తుందని టీవీలు బంద్ చేస్తారని సరదాగా అంది. అలాగైతే సీజన్ 3లో నువ్వున్నప్పుడే టీవీలు ఆఫ్ చేసేవారని శ్రీజ కౌంటరిచ్చింది. ఆమెకు అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వగానే.. ఓ, పవర్ఫుల్గా ఉండేవాళ్లను హ్యాండిల్ చేయలేక రెడ్ ఇచ్చారా? అని నిలదీసింది. మరో ప్రోమోలో గొంగలి కప్పుకుని వచ్చిన తాత నర్సయ్య తన పాటతో అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్లో మిరాయ్ ప్రమోషన్స్ కూడా జరిగాయి. చదవండి: అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు -
అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు
బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతోంది. కానీ ఆ సామన్యులెవరన్నది తేల్చేందుకు అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) షో మొదలుపెట్టారు. ఇందులో 45 మంది పాల్గొననున్నారు. సామాన్యుల కలను నెరవేర్చడానికే ఈ అగ్నిపరీక్ష అంటూ తొలి ఎపిసోడ్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు. మరి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం..రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే ఎలిమినేట్అగ్నిపరీక్ష స్టేజీపై వచ్చిన సామాన్యులకు బిగ్బాస్ షోలో ఉండే అర్హత ఉందా? లేదా? అన్నది జడ్జిలు నవదీప్, అభిజిత్, బిందుమాధవి తేల్చనున్నారు. ఏ కంటెస్టెంట్కైనా వీరు ముగ్గురూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే మాత్రం అతడు/ఆమె నేరుగా ఎలిమినేట్ అయినట్లు లెక్క! మొదటగా విజయవాడ నుంచి దివ్య నిఖిత నైటీలో వచ్చింది. ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఒక సాయిపల్లవి, ఒక శ్రీలీల.. ఒక దివ్య నిఖితలా అందరికీ గుర్తుండిపోవాలన్నదే తన కోరిక అంది.డేర్ అండ్ డాషింగ్అభిజిత్ను నామినేట్ చేయమని టాస్క్ ఇవ్వగా.. ఒకే ఒక మైండ్ టాస్క్ ఆడి గెలిచావు. ఎప్పుడూ సోఫాలోనే కూర్చుంటూ గేమ్ కంటే కూడా వేరేవాళ్లమీదే ఫోకస్ పెట్టావు. నీ ఆట నాకు నచ్చలేదు. గేమ్పై ఫోకస్ లేని నిన్ను నామినేట్ చేస్తానంటూ ధైర్యంగా మాట్లాడింది. తర్వాత నాన్న గురించి చెప్తూ ఎమోషనలైంది. ఆమెకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.మాస్క్ మ్యాన్ ఎంట్రీతర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఏడేళ్లుగా మాస్క్ వేసుకునే తిరుగుతున్నట్లు చెప్పాడు. ఇతడి పేరు హృదయ్ మానవ్ అని తెలిపాడు. తిక్కగా మాట్లాడుతున్న అతడి వైఖరి నచ్చిక అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో మానవ్ హర్టయ్యాడు. నన్ను చూడగానే జడ్జి చేస్తున్నారు.. బిగ్బాస్ కోసం ఈ మాస్క్ వేసుకోలేదన్నాడు. గత మూడు సీజన్ల నుంచి మంచి కంటెస్టెంట్లే రాలేదు, అందుకే నేనొచ్చానని తన గురించి తాను ఓవర్గా చెప్పుకున్నాడు. పెద్దావిడకు ఛాన్సిచ్చిన అభిజిత్దీంతో బిందుమాధవి.. మాస్క్ మ్యాన్కు లూజర్ అనే బోర్డు వేసింది. అయినా అతడు వెనక్కు తగ్గలేదు, జడ్జిలపై ఫైర్ అయ్యాడు. సరే, నీగురించి ఇంకాస్త తెలుసుకోవాలంటూ నవదీప్ ఒక్కడే.. అతడికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. మూడో కంటెస్టెంట్గా.. ముసలి వయసులో ఉన్న కేతమ్మ వచ్చింది. తనకు ఛాన్సిద్దామని అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్గా ప్రియా శెట్టి వచ్చింది. ముఖంలోనే కాకుండా తన మాటల్లోనూ క్యూట్నెస్ ఉంది. ఆమెకు అభిజిత్ మినహా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. మల్టీ స్టార్ మన్మధ రాజాకు ఝలక్ఐదో కంటెస్టెంట్గా మల్టీ స్టార్ మన్మధ రాజా వచ్చాడు. బిగ్బాస్లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష చేశానన్నాడు. తనకు ఆస్తులు లేవు, అయినవారు లేరంటూ ఏడుస్తూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. సింపతీకి చోటు లేదంటూ జడ్జిలు అతడిని బయటకు పంపించేశారు. ఆరో కంటెస్టెంట్గా సయ్యద్ అబూ వచ్చాడు. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఏడో కంటెస్టెంట్గా దివ్యాంగుడు ప్రసన్నకుమార్ వచ్చాడు. ఒంటికాలుతోనే మారథాన్ చేసినట్లు తెలిపాడు. అతడి టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు. జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. గ్రీన్ ఫ్లాగ్ వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ రౌండ్కు వెళ్తారు.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో ఆయన్ను వైల్డ్ కార్డ్గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!వైల్డ్ కార్డ్గా..పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్లో బిగ్బాస్ హౌస్లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.తెలుగు సినిమాలో..కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు -
Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా!
బిగ్బాస్ 9 కంటే ముందు వస్తోన్న బిగ్బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss Agnipariksha)పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ గురించి రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా మూడో ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ వయసులో ఉన్న ఓ ముసలమ్మ స్టేజీపై అడుగుపెట్టింది. నెత్తిన బోనంతో పాటలు పాడుకుంటూ జోష్గా వచ్చింది. నల్గొండ దగ్గర కొండతిరుమలగిరి మా ఊరు.. చాలా కష్టాలు పడ్డాను సర్.. నా చిన్నబిడ్డ నన్ను, నా భర్తను పోషిస్తోంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరినీ కలిశా.. ఈ జన్మకు ఇంతే చాలు అని ఎమోషనలైంది.మాకు నిద్రుండదుఆయన స్టోరీ విన్న అభిజిత్.. మీ జీవితంలో సగం కూడా నేను చూడలేదు, కానీ లోపల ఆట నేను చూశాను. ఆ గేమ్ మీకు చాలా కష్టంగా ఉంటుందవ్వా.. అన్నాడు. అందుకామె మాత్రం నాకు తోచినంత ఆడతా.. అని తన ఆసక్తిని చూపించింది. తర్వాత దివ్యాంగుడు ప్రసన్నకుమార్ స్టేజీపైకి వచ్చాడు. అతడి స్టోరీ విన్న నవదీప్.. ఈ కథను మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు అంటూ గ్రీన్ సిగ్నల్ చూపించాడు.అర్ధరాత్రి షోఇదంతా బాగానే ఉంది కానీ షో టైమింగ్స్ మాత్రమే కాస్త తేడాగా ఉంది. ఎప్పుడూ బిగ్బాస్ రాత్రి 9 లేదా 9.30 గంటల ప్రాంతంలో వచ్చేది. కానీ ఈ అగ్నిపరీక్ష మాత్రం ఎటూ కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు రానుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు జియో హాట్స్టార్లో కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారు. ఫలానా సమయం అని లేకుండా రోజులో మీకు నచ్చినప్పుడు దాన్ని చూసుకోవచ్చన్నమాట! ఇది చాలామందికి నచ్చడం లేదు. అగ్నిపరీక్షకు ప్రత్యేక సమయం కేటాయిస్తేనే బాగుంటుంది, ఇలా అర్ధరాత్రి అప్లోడ్ చేయడం అనవసరం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ నటి -
కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు
వచ్చే నెలలో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss 9 Agnipariksha) మొదలుకానుంది. సామాన్యుల ఎంపిక కోసం ఈ షో డిజైన్ చేశారు. వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేశారు. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్కు ఎవర్ని సెలక్ట్ చేయాలి? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు.నీకొక్కడికే హృదయం ఉందా?ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓ మాస్క్ మ్యాన్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నీ పేరేంటని జడ్జిలు అడగ్గా.. స్కిన్ నేమ్ మానవ్.. సోల్ నేమ్ హృదయ్ మానవ్ అన్నాడు. హృదయ్ మానవ్ పేరుకు అర్థమేంటన్న ప్రశ్నకు.. హృదయమున్న మానవుడు అని సింపుల్గా రిప్లై ఇచ్చాడు మాస్క్ మ్యాన్. అంటే మా అందరికీ హృదయాలు లేవా? అని నవదీప్ అడగ్గా పోనీ, అలాగే అనుకోండి అని ర్యాష్ ఆన్సరిచ్చాడు. కోపమొస్తే కొట్టేస్తా..చిన్నప్పటి నుంచి కోపిష్టిని, కోపమొస్తే ఆగను.. కొట్టేస్తా! అనడంతో జడ్జిలు షాక్తో నోరెళ్లబెట్టారు. బిగ్బాస్ హౌస్లోకి వెళ్లేది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కాదన్న మాటకు అభిజిత్ ఏకీభవించలేదు. ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? అని అడిగితు.. ఫ్రెండ్స్కు ట్రోఫీ ఇచ్చేస్తామా? అని మాస్క్ మనిషి సెటైర్ వేశాడు. ఇతడి తీరు నచ్చక అభిజిత్ రెడ్ సిగ్నల్ చూపించాడు. దీంతో అతడు నాకు ఛాన్సివ్వాలని లేకపోతే ఓకే.. కానీ నా క్యారెక్టర్ను డిసైడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.జడ్జి చేయడానికి దేవుళ్లా?జడ్జి చేయడానికే ఇక్కడ కూర్చున్నామని నవదీప్ కౌంటరిచ్చాడు. అప్పటికీ అతడు మీరేమైనా దేవుళ్లా అంటూ.. మాట్లాడుతూనే పోయాడు. ఇక బిందు మాధవి.. అతడి మెడలో లూజర్(ఓటమిపాలు) బోర్డు తగిలించింది. ఈ ప్రోమో చూసిన జనాలు.. మాస్క్ మనిషి ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. అని కామెంట్లు చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో హాట్స్టార్లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. చదవండి: నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి? -
బిగ్బాస్ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్ చేశారా?
జనాల దృష్టిని ఆకర్షించేందుకు బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) అంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కామన్ మ్యాన్గా షోలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మీదే అంటూ ఊరించడంతో దాదాపు 20 వేల మంది అప్లై చేసుకున్నారు. దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కనీసం ఐదుగురిని బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)కు సెలక్ట్ చేయనున్నారు.దివ్యాంగుడి పేరిట రికార్డులుఈ షో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపించారు. అందులో గంగవ్వ వయసులో ఉన్న మహిళ, మాస్క్ మ్యాన్.. ఇలా విభిన్న వ్యక్తులున్నారు. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన వ్యక్తి ప్రసన్నకుమార్. ఇతడు ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్, లెక్చరర్ కూడా! మారథాన్లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ఇలాంటి వ్యక్తి.. షోలో అడుగుపెడితే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని అందరూ భావించారు. అతడు కచ్చితంగా బిగ్బాస్ 9వ సీజన్లో ఉండాల్సిందేనని బలంగా కోరుకున్నారు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అతడు ఎలిమినేట్ అయ్యాడట! శ్వేతాశెట్టి అనే అమ్మాయితో పాటు ప్రసన్నకుమార్ ఎలిమినేట్ అయినట్లు ఓ వార్త వైరలవుతోంది. ఇది చూసిన జనాలు నిరాశచెందుతున్నారు. ప్రసన్న కుమార్ను కనీసం బిగ్బాస్ హౌస్ వరకైనా పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రసన్న ఎలిమినేషన్ నిజమేనా? అతడు 9వ సీజన్లో అడుగుపెడతాడా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. View this post on Instagram A post shared by prasanna kumar aliga (@prasanna_kumar_aliga)చదవండి: ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన -
పెళ్లయి 8 ఏళ్లు.. బుల్లితెర జంటకు పేరెంట్స్గా ప్రమోషన్
బుల్లితెర నటి, బిగ్బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం సాహ్ని (Marina Abraham Sahni) గుడ్న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మెరీనా- రోహిత్ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నటికి డెలివరీ అయి చాలారోజులే అవుతున్నప్పటికీ కొంతకాలంగా గోప్యంగా ఉంచింది. నేడు (ఆగస్టు 16న) శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కూతురు పుట్టిందని చెప్తూ తన ఫోటోను షోర్ చేసింది. పాపకు 'తెయారా సాహ్ని' అని నామకరణం చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. మెరీనా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రెగ్నెన్సీ జర్నీమెరీనా 2021లో తొలిసారి ప్రెగ్నెంట్ అయింది. కానీ ఫస్ట్ స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్బీట్ వస్తుందేమోనని మూడునెలలవరకు కడుపులో శిశువును అలాగే మోసింది. డాక్టర్లు హెచ్చరించడంతో చివరకు దాన్ని తీసేయించుకుంది. 2022లో మరోసారి గర్భం దాల్చింది. అది కూడా మిస్క్యారేజ్ అయింది. ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ప్రేమ పెళ్లిమెరీనా పుట్టిపెరిగిందంతా గోవాలోనే! మెరీనా పదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె తల్లికి హైదరాబాద్లో స్కూల్ ప్రిన్సిపల్గా ఛాన్స్ వచ్చింది. అలా తను ఇక్కడే సెటిలైంది. మోడలింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్లో, సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అమెరికా అమ్మాయి సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మెరీనా అబ్రహం. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి ధారావాహికల్లోనూ నటించింది. ఓ సినిమా టైంలో పరిచయమైన రోహిత్ (Rohit Sahni)తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొన్నారు. మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్.. టాప్ 5లో స్థానం సంపాదించుకున్నాడు. View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) చదవండి: గర్భంతో ఉండగా ప్రతిరోజు భగవద్గీత చదివా..: హీరోయిన్ -
అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే!
ప్రతి ఏడాది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) వస్తుంది. అది కామన్.. కానీ, ఈసారి బిగ్బాస్ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ను జరిపించనున్నారు. దీనికి బిగ్బాస్ మాజీ విన్నర్స్ అభిజిత్ (Abhijeet), బిందు మాధవి, బిగ్బాస్ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.నా తడాఖా చూపిస్తా!తాజాగా పెద్దపులి అభిజిత్ మళ్లీ వచ్చాడంటూ హాట్స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్ చాక్లెట్ బాయ్గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్బాస్తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్బాస్ వాయిస్ మారింది. గంభీరంగా వినిపించే బిగ్బాస్ గొంతుక పేలవంగా మారిపోయింది. గొంతు మారిపోయిందిమరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్బాస్ 9వ సీజన్లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్ పడ్డారు. దీంతో హాట్స్టార్ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ కోసమే ఈ కొత్త వాయిస్ వాడామని, బిగ్బాస్ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయిన కంటెస్టెంట్లు బిగ్బాస్ 9లో కామనర్స్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. The Peddha Puli @Abijeet roars Back! 🦁This time, not as a contestant, but as the formidable Judge of Bigg Boss Agnipariksha! A true test to crack. ⌛#BiggbossTelugu9 Agnipariksha starts from August 22nd exclusively on JioHotstar #BiggbossTelugu9#BiggbossAgnipariksha… pic.twitter.com/IXOzs4xyzZ— JioHotstar Telugu (@JioHotstarTel_) August 16, 2025 చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్ -
బిగ్బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు
ప్రతి ఏడాది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి సీజన్ 9 కన్నా ముందు బిగ్బాస్ అగ్నిపరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఏదో తూతూమంత్రంగా కామనర్స్ను సెలక్ట్ చేయడం లేదు. వారికంటూ ప్రత్యేకంగా ఓ షో పెట్టి.. అందులో పోటీలు నిర్వహించి, జడ్జిల నిర్ణయాల ఆధారంగా సామాన్యులను ఎంపిక చేస్తారన్నమాట!వచ్చేవారమే అగ్నిపరీక్షతాజాగా ఈ అగ్నిపరీక్ష వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేశారు. బిగ్బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! చదవండి: థైరాయిడ్ క్యాన్సర్.. సర్జరీ తర్వాత గొంతు మూగబోయింది: యాంకర్ -
Bigg Boss: 15 మందికి అగ్నిపరీక్ష.. ఫైర్ మీదున్న జడ్జిలు!
బిగ్బాస్ (Bigg Boss Reality Show)కు రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. అలాంటివారికి ఓ అవకాశం కల్పించేందుకు కామన్ మ్యాన్ ఎంట్రీ పేరిట కొందరిని హౌస్లోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఈసారి కామన్ మ్యాన్గా రావాలనుకుంటే అగ్నిపరీక్షను గెలిచి రావాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. ఏదేమైనా సరే బిగ్బాస్ 9 (Bigg Boss 9 Telugu)వ సీజన్లో కనిపించాలని దాదాపు 20 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. జడ్జిలుగా ముగ్గురువారిలో 100 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా 45 మందిని సెలక్ట్ చేశారు. వీరిని అగ్నిపరీక్ష కార్యక్రమానికి పిలిచారు. ఈ కార్యక్రమానికి మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్లను జడ్జిగా నియమించారు. వీళ్లు.. మొదటి రౌండ్లో 15 మందిని ఎంపిక చేశారు. వాళ్లెవరంటే..1. దివ్య నిఖిత (ఇన్ఫ్లుయెన్సర్)2. అనూష రత్నం (ఇన్ఫ్లుయెన్సర్)3. శ్వేతా శెట్టి4. శ్రియ5. డిమాన్ పవన్6. దమ్ము శ్రీజ (ఇన్ఫ్లుయెన్సర్)7. ప్రసన్న కుమార్ (దివ్యాంగుడు)8. ప్రశాంత్ (లాయర్)9. షాకీబ్ (ఇన్ఫ్లుయెన్సర్)10. కల్కి (మిస్ తెలంగాణ రన్నరప్)11. దాలియా షరీఫ్ (జిమ్ ట్రైనర్)12. మాస్క్ మ్యాన్13. పవన్ కల్యాణ్ (జవాన్)14. మరియాద మనీష్ (బిజినెస్మెన్)15. ప్రియా శెట్టిఅగ్నిపరీక్ష వీడియో లీక్..వీరిలో కల్కి.. అభిజిత్తో స్టెప్పులేయించిందని తెలుస్తోంది. ఇక అగ్నిపరీక్ష ప్రోగ్రామ్కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకైంది. అందులో బిందు మాధవి.. ఏయ్, ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తున్నావ్? అంటూ ఓ కంటెస్టెంట్పై అసహనం వ్యక్తం చేసింది. నవదీప్ అయితే.. ఏ.. పో.. అంటూ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇక అభిజిత్ కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడని భోగట్టా! ఇకపోతే 15 మందిలో నుంచి 5 లేదా 9 మందిని సెలక్ట్ చేసి బిగ్బాస్ హౌస్కు పంపించనున్నారు. ఈ అగ్నిపరీక్ష షో జియోహాట్స్టార్లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా -
లేడీ యాంకర్ చేతబడి.. వాళ్లను చెప్పు తీసుకుని కొట్టాలి: యాంకర్ రవి
యాంకర్ రవి (Anchor Ravi).. ఫుల్ క్రేజ్ ఉన్న యాంకర్. టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటాడు. బిగ్బాస్కు వెళ్లి విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. తాజాగా బిగ్బాస్ జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. యాంకర్ రవి మాట్లాడుతూ.. ఎక్కడైతే మనిషిని పుట్టుమచ్చలతో సహా చూస్తారో.. ఇక వాళ్లు సెలబ్రిటీలు కారు. పెద్ద పెద్ద హీరోలు సినిమా రిలీజ్కు ఐదు రోజుల ముందు కనిపిస్తారంతే.. తర్వాత వాళ్లు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారన్నది తెలియదు. అదే స్టార్డమ్ను నిర్ణయిస్తుంది. మరీ రెగ్యులర్గా కనిపిస్తే చులకనైపోతాం. బిగ్బాస్లో అందరూ నటిస్తారుఅందుకే బిగ్బాస్కు వెళ్లాలనుకోలేదు. నాలుగు సీజన్ల నుంచి పిలుపొచ్చినా రిజెక్ట్ చేశాను. ఐదో సీజన్కు అడిగినప్పుడు.. ఫలానా మొత్తం ఇస్తేనే బిగ్బాస్కు వస్తానని తప్పించుకోవాలని చూశాను. కానీ, వాళ్లు అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఓకే చెప్పక తప్పలేదు. కానీ ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కున్నాను. అయితే బిగ్బాస్ వల్ల మనం సంపాదించుకున్న పేరంతా కుప్పకూలిపోతుంది. ఆ షోకి వెళ్లిన ఎవరైనా నటించాల్సిందే! ఎవరైనా బిగ్బాస్కు వెళ్లిన వాళ్లు నేను నటించలేదు, రియల్గా ఉన్నాను అని చెప్తే చెప్పు తీసుకుని కొట్టాలి. చేతబడిమన చుట్టూ కెమెరాలున్నాయంటే కచ్చితంగా నటిస్తారు. ఆ షోకి ఒక డైరెక్టర్, పది మంది రచయితలుంటారు అని చెప్పుకొచ్చాడు. అలాగే తనపై ఓ లేడీ యాంకర్ పూజలు చేయించిందని తెలిపాడు. నా బ్యాచ్లో ఒక యాంకర్ నాపై చేతబడి లాంటి పూజలు చేయించింది. అలా చేస్తే వాళ్లకేం మజా వచ్చిందో మరి! ఇవన్నీ నేను నమ్మను.. కానీ.. ఇలా చాలామంది మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ యాంకర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.చదవండి: మహేశ్బాబు అయిష్టంగా చేసిన సినిమా ఏదో తెలుసా? -
40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్స్టార్లో 'బిగ్బాస్' అగ్నిపరీక్ష
"బిగ్బాస్ షోలో సామాన్యులు". కామన్ మ్యాన్ అంటారే కానీ వారు అప్పటికే సోషల్ మీడియాలో కొద్దోగొప్పో ఫేమస్ అయినవారినే రియాలిటీ షోకి తీసుకొస్తారు! గత రెండు మూడు సీజన్లలో ఇదే జరిగింది. అయితే ఈసారి (Bigg Boss Telugu 9) ఒక్కరిని కాదు కనీసం ముగ్గురు, నలుగురినైనా కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఎంపిక చేస్తారట! ఇప్పటికే షోలో పాల్గొనడానికి అనేకమంది వీడియోలు పంపి దరఖాస్తులు చేసుకున్నారు.40 మందితో షోమొదటి దశలో సుమారు 200 మందిని సెలక్ట్ చేశారు. హావభావాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. ఇలా పలు అంశాల ఆధారంగా వీడియోలు జల్లెడ పట్టి అందులో 100 మందిని ఎంపిక చేశారు. వీరితో గ్రూప్ డిస్కషన్స్ అయ్యాక చివరగా 40 మందిని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడీ 40 మంది మధ్యే అసలైన పోటీ జరగనుంది. వీరికి బిగ్బాస్ అగ్నిపరీక్ష (BIGG BOSS AGNIPARIKSHA) పెట్టనున్నాడు. ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.అగ్నిపరీక్షఅసలు ఆ 40 మంది ఎవరు? ఆ అగ్నిపరీక్షలో ఎలాంటి టాస్కులిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే! అయితే ఈ అగ్నిపరీక్షను బిగ్బాస్ అభిమానులు జియోహాట్స్టార్లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. వచ్చే నెలలోనే ఈ అగ్నిపరీక్ష కార్యక్రమం ఉండనుంది. ఇందులోనుంచి ముగ్గురు, నలుగురు కంటెస్టెంట్లను ఎంపిక చేసిన తర్వాత.. సెప్టెంబర్లో బిగ్బాస్ 9 ప్రారంభం కానుంది. చదవండి: చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా -
బిగ్బాస్ కొత్త సీజన్.. సగానికి సగం పారితోషికం తగ్గించేసిన స్టార్ హీరో!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)ను విజయవంతంగా ముందుకు నడిపించడంలో హోస్ట్దే ప్రధాన పాత్ర! కంటెస్టెంట్లను వాయించడానికి, తప్పొప్పులు చెప్పడానికి, సరిదిద్దడానికి హోస్ట్ వీకెండ్లో రెండుసార్లు వస్తూ ఉంటాడు. షో చప్పగా ఉంటే దాన్ని రంజుగా మారుస్తాడు, ఊపు మీదంటే మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎటొచ్చీ గేమ్ను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా ట్రై చేస్తాడు.15 ఏళ్లుగా హోస్టింగ్అయితే సినిమాలు చేసే స్టార్లు టీవీ షోలలో హోస్ట్గా కనిపించాలంటే అంత ఈజీ కాదు. వారు అడిగిన రేంజులో డబ్బు ఇచ్చుకుంటేనే బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమవుతారు. తెలుగులో మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని బిగ్బాస్ షోకి హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత అంటే మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. హిందీలో మొదట అర్షద్ వార్సీ, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు సెలబ్రిటీలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వచ్చే నెలలోనే ప్రారంభంనాలుగో సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ షోను తన భుజాలపై ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఆగస్టు 30న హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సల్మాన్.. ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. అయితే హీరో ఈసారి తన రెమ్యునరేషన్ను భారీగా తగ్గించుకున్నాడట! కారణం గత సీజన్లతో పోలిస్తే బిగ్బాస్ 19వ సీజన్కు పెద్దగా బడ్జెట్ కేటాయించలేదని తెలుస్తోంది. పారితోషికంలో రూ.100 కోట్ల కోత!సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం సల్లూ భాయ్ వీకెండ్కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్బాస్ 17వ సీజన్కు రూ.200 కోట్లు, 18వ సీజన్కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం అందుకోవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పుకోవాలి!ఓటీటీకే ప్రాధాన్యతబిగ్బాస్ 19వ సీజన్లో ఓటీటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. హాట్స్టార్లో ఎపిసోడ్ రిలీజ్ చేసిన గంట- గంటన్నర తర్వాతే టీవీలో ప్రసారం కానుందట! అలాగే ఈ సీజన్ ఐదు నెలలు కొనసాగుతుందని, మొదటి మూడు నెలలు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తే తర్వాత ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి వారు చివరి రెండు నెలలు షో బాధ్యతలు అందుకోనున్నారని భోగట్టా! మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ) -
'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా!
బిగ్బాస్ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయికిరణ్, ముకేశ్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్లోకి పంపించనున్నారు.బిగ్బాస్లో టాలీవుడ్ సెలబ్రిటీలుతాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్బాస్ టీమ్ కాదట! హిందీ బిగ్బాస్ టీమ్! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కంటెస్టెంట్లు వీళ్లేనా?ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (హీరోయిన్ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కూతురు), సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!సన్యాసం తీసుకున్న ఆమె కూడా!వీరే కాకుండా లతా సబర్వాల్ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది), ఆశిష్ విద్యార్థి (టాలీవుడ్ విలన్), హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్బాస్కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు -
ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్బాస్ టీమ్
చాలామంది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు పాపులారిటీ, డబ్బు కోసమే వెళ్తుంటారు. బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాక పూర్తిగా అందులోనే లీనమవుతారు. కొన్నిసార్లు ప్రేమలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా ఓ నటి నిజంగానే లవ్లో పడింది. కానీ అవతలి వ్యక్తి ఫుటేజీకోసం, పాపులారిటీ కోసం ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ విషయం తెలిసి సదరు నటి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.బ్రేకప్ అయ్యాక హౌస్లోకి..ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్బాస్ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియుడితో బ్రేకప్ అయి విపరీతమైన బాధలో ఉన్న ఓ ప్రముఖ నటి బిగ్బాస్ షోలో పాల్గొంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశ్యంతో రియాలిటీ షోకి వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ హౌస్లోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అది ఆమె గుర్తించలేకపోయింది. అతడు మోసం చేస్తున్నాడని గ్రహించిన రోజు బాధ తట్టుకోలేకపోయింది.అదే వారం ఎలిమినేట్తను షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున మూడుగంటలకు బాత్రూమ్కి వెళ్లి చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె చేస్తున్న పనిని గ్రహించి మేమంతా సెట్లోకి పరిగెత్తి తనను అడ్డుకున్నాం. మా లక్ ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ముంబై నుంచి వచ్చేవరకు తనతో మాట్లాడుతూ కూర్చున్నాం. పొద్దున ఏడింటివరకు తనతోనే ఉన్నాం. అదే వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించేశాం అని చెప్పుకొచ్చాడు. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.బిగ్బాస్ ఎన్ని భాషల్లో?డచ్ రియాలిటీ షో బిగ్బ్రదర్ నుంచి పుట్టిందే బిగ్బాస్. ఇండియాలో బిగ్బాస్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో బిగ్బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.చదవండి: యాంకరింగ్లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభానుముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్బాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్బాస్ టీమ్ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. బిగ్బాస్ హౌస్లో AI రోబోసింగర్, డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్బాస్లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్బాస్ హౌస్కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.రోబో విశేషాలుయూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్తో లెహంగాలో క్యూట్గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్బాస్ షోలో అడుగుపెడితే గేమ్ ఛేంజర్గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు -
కన్నడ బిగ్బాస్ హోస్ట్ ఎవరో ప్రకటించిన టీమ్
బిగ్బాస్ షో వివిధ రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీ రియాల్టీ షో అని తెలిసిందే. త్వరలో కన్నడ బిగ్బాస్-12 సీజన్ ప్రారంభం కానుంది. దాదాపు అన్ని సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన హీరో సుదీప్ ఇకపై తాను ఆ కార్యక్రమానికి హోస్ట్గా చేయాలనుకోవడం లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే, ఈసారి ఎవరు హోస్ట్గా చేస్తారని కన్నడలో ఆసక్తి పెరిగింది. మళ్లీ కిచ్చా సుదీప్ హోస్ట్గా రావాలని ఆయన అభిమానులు #KicchaBackOnBBK, #BiggBossKannada12 హ్యాష్ట్యాగ్స్తో వైరల్ చేశారు. దీంతో సుదీప్ మనసు మార్చుకున్నారు. మళ్లీ హోస్ట్గా చేస్తానని ఆయన అధికారికంగా ప్రకటించారు.బిగ్బాస్ హోస్ట్ విషయంలో కిచ్చా సుదీప్ తన మనసు మార్చుకున్నారు. మళ్ళీ 'బిగ్ బాస్' షోను హోస్ట్ చేయడానికి అంగీకరించారు. ఈమేరకు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. కలర్స్ కన్నడ ఛానల్ 'బిగ్ బాస్' నిర్వాహకులు కిచ్చా సుదీస్తో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలిసింది. కిచ్చా సుదీప్ హోస్ట్గా ఒప్పుకోకుంటే తమకు వేరే ఆప్షన్లు లేవని నిర్వహాకులు అన్నారు. అందుకే ఆయన్ను ఒప్పించామని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, 12వ సీజన్ తర్వాత, 13వ సీజన్కు ఎవరు హోస్ట్గా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాబోయే 4 సీజన్లకు తానే హోస్ట్గా ఉంటానని ఆయన అన్నారు. తాము అలాంటి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు.కన్నడ బిగ్బాస్ ఎందుకు చేయనని చెప్పానంటే..మిగతా భాషల్లో బిగ్బాస్కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్బాస్కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే హోస్టింగ్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే నాకు బిగ్బాస్ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశానని ఆయన అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని చెప్పడంతోనే హోస్ట్గా చేసేందుకు ఒప్పుకున్నానని సుదీప్ అన్నారు. -
బిగ్బాస్ 9లోకి కామన్ ఆడియన్స్ .. ఇలా రిజస్టర్ చేసుకోండి
బిగ్బాస్ 9 (Bigg Boss Season 9) నుంచి ఇప్పటికే ఒక వీడియోతో ప్రకటన వచ్చేసింది. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్గా మరోసారి అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ పేల్చేశారు. అయితే, తాజాగా 'కాల్ ఫర్ ఎంట్రీస్' పేరుతో మరో వీడియోను బిగ్బాస్ టీమ్ వదిలింది. గతంలో మాదిరి ఈసారి కామన్ ఆడియన్స్ను కంటెస్టెంట్స్గా తీసుకుంటామని వీడియోలో పేర్కొన్నారు.బిగ్బాస్ షోను ఎంతో ప్రేమిస్తున్న ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్గా హౌస్లోకి ఎంట్రీ ఉంటుందని, అది కూడా కంటెస్టెంట్స్గా వచ్చే ఛాన్స్ ఉందని నాగార్జున తెలిపారు. ఈ సీజన్లో సెలబ్రిటీస్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా బిగ్బాస్- 9లోకి వెళ్లొచ్చు. అందుకు మీరు చేయాల్సింది www.bb9.jiostar.comలో రిజస్టర్ కావడమే. ఆపై బిగ్బాస్లో పార్టిసిపేట్ కావడానికి కారణం చెబుతూ వీడియోను అప్లోడ్ చేయడమే అంటూ వివరాలు ప్రకటించారు. -
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
బిగ్బాస్ 9 (Bigg Boss Season 9).. ఆగమనానికి సర్వం సిద్ధమవుతోంది. తాజాగా బిగ్బాస్ 9 లోగోనూ లాంచ్ చేస్తూ ప్రోమో రిలీజైంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నాడు కింగ్ నాగార్జున. ఈసారి కూడా హోస్ట్ నాగార్జునే అన్న విషయం ప్రోమోతో స్పష్టమైపోయింది.బజ్ హోస్ట్గా..కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్నవారిలో చాలామంది ఈ షోలో భాగం కానున్నారు. అలాగే ఈ వారం మొదలవుతున్న కూకు విత్ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా బిగ్బాస్లో పార్టిసిపేట్ చేయనున్నారు. అటు బిగ్బాస్ బజ్ హోస్ట్గా ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో బిగ్బాస్ 9 షురూ కానుంది. చదవండి: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
అందరిచూపు సౌత్వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్బాస్ 18 ఫేమ్, హీరోయిన్ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అన్నీ ప్రత్యేకమేదంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్ప్లే, విజన్ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.ఎగ్జయిట్ అయ్యా.. కానీ!తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్ మార్ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే గూగుల్పే..
బిగ్బాస్ షోకు రెండుసార్లు వెళ్లొచ్చాడు గౌతమ్ కృష్ణ (Gautham Krishna). మొదటిసారి ఫినాలే వరకు చేరకుండానే ఎలిమినేట్ అయ్యాడు. రెండోసారి మాత్రం వైల్డ్ కార్డ్లా వెళ్లి వైల్డ్ ఫైర్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అతడు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ తన బిగ్బాస్ సంపాదనను బయటపెట్టాడు. బిగ్బాస్ షోలో నేను పది వారాలున్నాను. అందుకుగానూ నేను రూ.30 లక్షలు సంపాదించాను. నా సంపాదనలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడు వచ్చిందంటే.. 25 ఏళ్ల మురళీనాయక్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు.స్టేజీపై ఆర్థిక సాయంమరి నేనేం చేశాను? అని ఆలోచించుకున్నాను. అందుకే సమవర్తి అనే ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా సంపాదనలో సగం ఈ ట్రస్టుకే ఇస్తాను. అలా బిగ్బాస్ ద్వారా సంపాదించినదాంట్లో సగం అంటే రూ.15 లక్షలు ఈ సంస్థ ఖాతాలో వేస్తున్నాను. మొదటగా మురళీ నాయక్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను చచ్చేలోపు లక్ష మందికి సాయం చేయాలన్నదే నా కోరిక. నేను నా మాట నిలబెట్టుకోకపోతే నన్ను ఏకిపారేయండి అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే మురళీ నాయక్ కుటుంబానికి స్టేజీపై లక్ష రూపాయలు గూగుల్ పే చేశాడు. సోలోబాయ్ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
బిగ్బాస్ 'స్రవంతి' దాతృత్వం.. జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం
బిగ్బాస్ గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీనాయక్ తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి కుటుంబానికి యాంకర్, బిగ్బాస్ ఫేమ్ స్రవంతి ఆర్థిక సాయిం ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన శ్రీరాంనాయక్, జ్యోతిబాయి దంపతులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 'ఆపరేషన్ సిందూర్'లో మురళీనాయక్ మరణించిన విషయం తెలిసిందే.లక్ష రూపాయలు సాయంబిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియా నుంచి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో యాంకరింగ్ చేసే స్థాయికి ఆమె చేరుకుంది. అయితే, ఆమె పలు సందర్భాల్లో తోచిన సాయం చేసి దాతృత్వం చాటుకుంది. తాజాగా 'సోలో బాయ్' సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి ఆమె యాంకర్గా పనిచేశారు. ఆ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన బిడ్డను తిరిగి తీసుకురాలేమని, తమవంతుగా ఆర్థిక సాయం మాత్రం చేయగలమని ఆమె తెలిపింది. దేశాన్ని కాపాడే బిడ్డను కన్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పింది. ఆ కుటుంబం కోసం ఉచితంగానే యాంకరింగ్ చేస్తాసోలో బాయ్ వేడుక పూర్తికాగానే డబ్బులు ట్రాన్సఫర్ చేస్తానని ఆమె చెప్పింది. ఇంతలో సంగీత దర్శకుడు కూడా సాయం ప్రకటించారు. త్వరలో మురళీనాయక్ గ్రామం 'కళ్లితండా'లో సంగీత కచేరి ఏర్పాటు చేసి వచ్చిన డబ్బు ఆ కుటుంబానికి అందిస్తామని ప్రకటించారు. అదే కార్యక్రమానికి రెమ్యునరేషన్ లేకుండా యాంకరింగ్ చేస్తానని స్రవంతి తెలిపింది. స్రవంతి ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆమె సంపాదించిన డబ్బులో కొంత పలు సందర్భాల్లో సాయం చేసింది. గతేడాదిలో భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు స్రవంతి కూడా తనవంతుగా లక్ష రూపాయలు ముఖ్యమంత్రి నిధికి పంపింది. దీంతో స్రవంతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. స్రవంతిలో అందమే కాదు.. మంచి గుణం కూడా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. -
లైఫ్లో ఒక్కసారైనా ఆ హీరోతో నటించాలి, బిగ్బాస్ ప్రైజ్మనీ ఏం చేశానంటే?
తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే కౌశల్ మండా (Kaushal Manda) ఒక సంచలనం. ఇతడు బిగ్బాస్ రెండో సీజన్లో అడుగుపెట్టినప్పుడు అభిమానులు కౌశల్ ఆర్మీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, రోడ్డుపై ర్యాలీలు కూడా చేశారు. ఏదైతేనేం.. రెండో సీజన్ కప్పు కొట్టడంతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు.500 సినిమాలు చేసేవాడినిషోలు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కౌశల్ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో రాజకుమారుడు మూవీతో సినీప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి దాదాపు 98 సినిమాల్లో యాక్ట్ చేశాను. అందరూ కేవలం ఒకే వృత్తిపైనే ఫోకస్ పెడతారు. కానీ, నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను. మోడలింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కొరియోగ్రఫీ.. ఇవన్నీ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ఇవేవీ లేకుంటే ఈపాటికి 500 సినిమాలు అయిపోయేవి.ఆ హీరోలతో పని చేయాలనుందిహీరో ఉదయ్కిరణ్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అతడు సుమారు 16 సినిమాలు చేసుంటే అందులో 12 చిత్రాల్లో నేనూ యాక్ట్ చేశాను. తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి, కమల్ హాసన్ గారితో కలిసి పని చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఆ ఛాన్స్ వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను. ఇకపోతే మా అమ్మ క్యాన్సర్తో పోరాడుతూ చనిపోయింది. అందుకే బిగ్బాస్ ద్వారా వచ్చిన ప్రైజ్మనీని క్యాన్సర్ బాధితులకే విరాళమిస్తానని ప్రకటించాను. ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక -
బిగ్బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.ఆ నెలలో షురూ..ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. సంప్రదింపులు- చర్చ దశల్లోనే..కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు. పార్టిసిపెంట్లు వీళ్లేనా?అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్ -
బిగ్ బాస్లోకి యూట్యూబర్లు,ఇన్ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...
ఎక్కడో ఇంగ్లండ్లో పుట్టి ఓ హీరోయిన్ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్ మూలాలు కలిగిన బిగ్బాస్(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ బిగ్ బాస్.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్స్టా గ్రామ్ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన, మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్స్టా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఇన్స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్తో ఇన్ఫ్లుయెన్సర్గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రసిద్ధి పొందిన కిర్రాక్ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్జె కాజల్, ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్ స్టేటస్కు బిగ్ బాస్ ద్వారా మరింత గ్లామర్ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోందనగానే సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు, తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్ బాస్కు సంబంధించినవి కాకపోయినా... ప్రాంతీయ బిగ్బాస్లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్ బాస్ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.హిందీలో బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ఖాన్ సమర్పిస్తున్న బిగ్ బాస్ 19 గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్ కోసం మేకర్స్ గణనీయమైన ఫార్మాట్ మార్పును ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన, స్థిరపడిన బాలీవుడ్ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.టెల్లీ రిపోర్టర్ నివేదిక ప్రకారం, బిగ్ బాస్ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్ అప్పీల్ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్ బాస్ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్ బిగ్బాస్ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్ బాస్ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్కు కాకపోయినా వచ్చే సీజన్పై సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు. -
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
టాలీవుడ్లో అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా 'తెప్పసముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ను విడుదల చేశారు. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. 'ఎస్.ఎస్.మీడియా' సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం. మాస్ మహారాజ్ రవితేజ 'ఈగల్' వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
ట్రంప్ ‘బిగ్బాస్’ షో!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవరిదీ ఆలోచన? కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు? ‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్ను బిగించడం, కన్సాస్లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది. -
బిగ్బాస్ షో హోస్ట్గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)ను తెలుగులో మొదలుపెట్టింది జూనియర్ ఎన్టీఆర్. తొలి సీజన్కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను సక్సెస్ చేశాడు. కానీ తర్వాత మాత్రం ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో హీరో నాని (Nani) ధైర్యం చేసి యాంకర్గా మారాడు. ఇది రియాలిటీ షో అన్న విషయం మర్చిపోయి గేమ్ షోనే కదా.. హోస్ట్ చేసేద్దాం అనుకున్నాడు. తన యాంకరింగ్ కూడా బాగానే ఉండేది.రెండో సీజన్ హోస్ట్ నానికానీ కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం నానిపై విమర్శలు చేసేవారు. తన జడ్జిమెంట్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఇదంతా చూసి నానికి దిమ్మతిరిగిపోయింది. ఏదో హోస్ట్గా వచ్చిన పాపానికి చెడుగుడు ఆడేసుకుంటున్నారని అప్సెట్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ రెండో సీజనే.. తన ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఇంకెప్పుడూ ఈ రియాలిటీ షో జోలికి వెళ్లనన్నాడు.అదే ఆఖరి రోజుప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్బాస్ షో గురించి స్పందించాడు. నాని మాట్లాడుతూ.. నా జీవితంలో బిగ్బాస్ చాప్టర్ ముగిసిపోయింది. మళ్లీ దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. రెండో సీజన్ చివరి ఎపిసోడ్ రోజే బిగ్బాస్ హోస్ట్గా నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అని పోస్ట్ పెట్టాను. బయటి ప్రపంచం తెలిసిందిబిగ్బాస్.. బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్లకు కట్టినట్లు చూపించింది. నన్ను మరింత టఫ్గా మార్చింది. ఒక గేమ్ షో అనుకుని వెళ్లాను. ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా? అనిపించింది. అయితే చాలామంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయ్.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్బాస్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడటం లేదని నాని చెప్పకనే చెప్పాడు.చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
పహల్గాంలోనే ఉన్నా.. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే: ఆర్జే కాజల్
పహల్గాం: అందమైన మైదానాలు, మంచు కొండలు, పైన్ అడవులు.. ఎండాకాలంలో కాస్త సేద తీరుదామని జమ్మూకశ్మీర్లోని పహల్గాం (Pahalgam)కు వెళ్లిన పర్యాటకులెందరో.. ! ఈ ఆనందాన్ని చెల్లాచెదురు చేశారు ఉగ్రవాదులు. దేశంలో అలజడి సృష్టించేందుకు పర్యాటకులపై పంజా విసిరారు. భారీ ఆయుధాలతో అమాయక జనంపై విరుచుకుపడ్డారు.ఉగ్రదాడిఉగ్రదాడి అని అర్థమైన పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. కానీ మైదాన ప్రాంతం కావడంతో తలదాచుకునే వీలు కూడా లేకుండా పోయింది. ఈ దాడిలో 26 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి నుంచి ప్రముఖ హిందీ బుల్లితెర జంట దీపికా కక్కర్- షోయబ్ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు. తెలుగు బిగ్బాస్ కంటెస్టెంట్, నటి ఆర్జే కాజల్ (RJ Kajal) సైతం కశ్మీర్ పర్యటనలో ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.వీడియో షేర్ చేసిన కాజల్ఈ క్రమంలో కాజల్ తను క్షేమంగా ఉన్నట్లు వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం నేను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం స్థానిక పోలీసులు అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. నాకోసం ఆరా తీసిన అందరికీ కృతజ్ఞతలు అని వీడియో షేర్ చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఎంతగానో బాధించిందని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్! -
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
బిగ్బాస్ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy)కి గతేడాది బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాన్నుంచి కోలుకుంటున్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె పంటికింద నొప్పి భరిస్తూ ఆపరేషన్కు సిద్ధమైంది. ఇందుకోసం తలపై భాగంలో కొంత జుట్టును కూడా తీసేశారు. తలకు కుట్లు వేస్తుంటే అషూ ఆ నొప్పిని భరించలేకపోయిన ఫోటోను సైతం వీడియోలో పొందుపరిచింది. మానసికంగా, శారీరకంగా ఎంతో కుంగుబాటుకు గురైన అషూ తనకిలాంటి పరిస్థితి వచ్చిందేంటని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు తెలిపింది. ఇదే జీవితం'ఇదే కదా జీవితమంటే.. దయచేసి ఇతరులపట్ల దయతో ప్రవర్తించండి. ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి. దానివల్ల చాలామంది బాగుపడతారు' అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. నువ్వు ఒక ఫైటర్వి అని కామెంట్లు చేస్తున్నారు.అరగుండుతో ఇబ్బందులుఇటీవలే ఓ షోలో అషూ రెడ్డి తన తలకు జరిగిన సర్జరీ గురించి చెప్తూ ఎమోషనలైంది. బ్రెయిన్ ఆపరేషన్ కావడంతో తలపై జుట్టు తీసేశారంది. అదేదో పూర్తిగా తీసేసినా బాగుండు కానీ అరగుండు చేశారని బాధపడింది. అద్దంలో తన ముఖం చూసుకుని కెరీర్ అయిపోయిందనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. డాక్టర్లు ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోమంటే అషూ.. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక రెండు నెలలకే సెట్స్లో అడుగుపెట్టింది. విగ్స్తో తన అరగుండును కవర్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చింది. వర్క్లో బిజీ అవ్వడం వల్లే తను కోలుకున్నానంటోంది.బిగ్బాస్.. సినిమాడబ్స్మాష్ వీడియోలతో ఫేమస్ అయింది అషూ. అచ్చుగుద్దినట్లు సమంతలా ఉండటంతో తనకు బాగా క్రేజ్ వచ్చింది. అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అలా ఈ వర్మ బ్యూటీ తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. నెల రోజులకే షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత ఓటీటీలో బిగ్బాస్ నాన్స్టాప్ సీజన్లోనూ పాల్గొంది. ఛల్ మోహనరంగ, బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్, ఎ మాస్టర్ పీస్ చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)చదవండి: శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే? -
మమ్మల్నే కాదు, మా అమ్మను కూడా.. చాలా డిస్టర్బ్ అయ్యా: విష్ణుప్రియ
'ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా చూడరు' ఇది చాలామంది ఇళ్లలో ఉండేదే. తన ఇంట్లో కూడా ఇదే వివక్ష చూపించారంటోంది బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ (Vishnupriyaa bhimeneni). తాజాగా ఆమె సోషల్ మీడియాలో తను బాధపడ్డ క్షణాలను గుర్తు చేసుకుంది. నేను ఎప్పుడూ నా సంతోషకర క్షణాలనే మీతో పంచుకున్నాను కానీ నేను బాధపడ్డ విషయాల గురించి మీకెప్పుడూ చెప్పలేదు. అందుకే నేను డిస్టర్బ్ అయిన ఓ సందర్భాన్ని ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. వ్యత్యాసం చూపించేవారుచిన్నప్పుడు మేము మా నానమ్మవాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. అక్కడ నన్ను, మా చెల్లిని ఒక రకంగా.. మా బావ, తమ్ముడిని మాత్రం మరోరకంగా చూసేవారు. వాళ్లకు ఎక్కువ పాకెట్మనీ, ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేవారు. మా పరిస్థితి మాత్రం అలా ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే పొలాల దగ్గరకు వెళ్లినా సరే సాయంత్రం ఆరింటిలోపు ఇంటికొచ్చేయాలి. అబ్బాయిలకైతే మాత్రం వాళ్లకు నచ్చినంత సేపు బయట తిరగొచ్చు. ఎండలో కూడా ఆడుకోవచ్చు.మమ్మల్ని కన్నందుకు అమ్మపై కోపంమేము ఎండలో అడుగు కూడా బయటపెట్టడకూడదు. మా అమ్మ వరుసగా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నందుకు అత్తమామలు తీవ్ర నిరాశచెందారట. ఈ విషయం అమ్మ చెప్పింది. ఇలాంటి అసమానతలపై హోంటౌన్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆ సిరీస్కు చాలా కనెక్ట్ అయ్యాను అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ ఆహాలో ప్రసారం అవుతోంది.బిగ్బాస్ షోలో మెరిసిన విష్ణువిష్ణుప్రియ విషయానికి వస్తే.. ఆమె తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొంది. ఈ షోలో గేమ్పై ఫోకస్ పెట్టడానికి బదులు పిక్నిక్కు వచ్చినట్లుగా ఎంజాయ్ చేసేది. కాకపోతే తను మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడటం.. అమాయకత్వంతో అభిమానులను ఆకర్షించింది. అలా ఆ సీజన్లో ఫైనల్స్కు అడుగుదూరంలో ఆగిపోయింది. ఫినాలేకు ముందు వారమే ఎలిమినేట్ అయిపోయింది.చదవండి: నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్పై పరుచూరి రివ్యూ -
బిగ్బాస్ 'నబీల్' కొత్త కారు.. నిద్రలేని రాత్రులు గడిపానంటూ..
యూట్యూబర్, బిగ్బాస్ కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది (Nabeel Afridi) కొత్త కారు కొనుగోలు చేశాడు. మహీంద్రా ఎక్స్యూవీ700ఏఎక్స్7 లగ్జరీ కారును ఇంటికి తెచ్చేసుకున్నాడు. మొత్తానికి తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు కారు వీడియోను షేర్ చేశాడు. ఒకప్పుడు ఏడు సీటర్ల కారు గురించి కలలు కనేవాడిని.. ఇప్పుడేకంగా మహీంద్రా లగ్జరీ కారును సొంతం చేసుకున్నాను. జీరో సబ్స్క్రైబర్లు, జీరో ఫాలోవర్ల నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. మీ వల్ల కూడా అవుతుందిమనసు నిండా ఆలోచనలు, ఒక నోట్ప్యాడ్తో నా జర్నీ మొదలైంది. ఎన్నో కష్టనష్టాలను చూశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఇది కేవలం కారు మాత్రమే కాదు ఒక మైల్స్టోన్. నేను నా కలను నిజం చేసుకున్నానంటే మీరు కూడా మీ కలను సాకారం చేసుకోగలరు. ముందు కలగనండి.. దానికోసం ప్రయత్నించండి.. తర్వాత దాన్ని సాకారం చేసుకోండి అని క్యాప్షన్ జోడించాడు. అభిమానులు లేకపోయుంటే ఇంతదూరం వచ్చేవాడినే కాదంటూ నబీల్ ఎమోషనలయ్యాడు.కొత్త కారు ధరెంతంటే?కొత్త కారు కొన్న నబీల్కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నారు. 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కారు ధర రూ.25 లక్షల పైనే ఉందని తెలుస్తోంది. నబీల్ అఫ్రిది.. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో ఫేమస్ అయ్యాడు. అలా వచ్చిన గుర్తింపుతో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొన్నాడు. ఈ షోలో సెకండ్ రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by Nabeel Afridi (@iamnabeelafridi) చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్ -
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
గంగవ్వ (Milkuri Gangavva).. ఎరుకనే కదా! అమాయకత్వం, బోలాతనం, గడబిడ మాట్లాడే వైఖరితో అందరికీ సుపరిచితమైంది. యూట్యూబ్ ఆమెను అందరికీ చేరువ చేసింది. తెలంగాణ యాసతో ఆమె మాట్లాడుతుంటే మనింట్లో బామ్మ ముచ్చటచెప్పినట్లే ఉంటది. మై విలేజ్ షో ద్వారా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ఫేమస్ అయింది. ఆ మధ్య తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్లోనూ పాల్గొని తన హుషారుతో అందర్నీ నవ్వించింది.గంగవ్వ కొత్త లుక్ప్రస్తుతం మళ్లీ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న ఆమె తాజాగా కొత్త లుక్తో అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన ఆమె బిగ్బాస్ 5 విన్నర్ వీజే సన్నీ ప్రారంభించిన టీబీసీ సెలూన్కు వెళ్లింది. ఇంకేముంది.. సన్నీ దగ్గరుండి గంగవ్వ జుట్టు కడిగించి, దానికి నల్ల రంగు వేయించాడు. పనిలో పనిగా కొత్త హెయిర్ స్టైల్ కూడా ట్రై చేసింది గంగవ్వ. జుట్టు స్ట్రెయిటినింగ్ చేయించుకుని వదిలేసింది. అవసరమైతే తలకు నూనెంటకుండా ఈ హెయిర్ స్టైల్ను ఇలాగే కంటిన్యూ చేస్తానంది. కాలికి పెడిక్యూర్ కూడా చేయించుకుంది.సినిమాలు ఫైనల్గా గంగవ్వ కొత్త లుక్ చూసిన అభిమానులు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు. గంగవ్వ యూట్యూబ్ స్టార్ కాకముందు ఓ వ్యవసాయ కూలీ. తనకు ముగ్గురు పిల్లలు. రెక్కల కష్టంతో ముగ్గురు పిల్లల పెళ్లి చేసింది. మలి వయసులో యూట్యూబర్గా మారడమే కాకుండా సినిమాల్లోనూ అడుగుపెట్టింది. మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, స్వాగ్, గేమ్ ఛేంజర్ వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: 'జాట్' సినిమాను బాయ్కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు -
బిగ్బాస్లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్'.. హాట్స్టార్ అలా క్లూ ఇచ్చేసిందా..?
ప్రముఖ రియల్టీ షో బిగ్బాస్ తెలుగు సీజన్- 9 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలౌతుందని తెలిసిందే. అంటే మరో నాలుగు నెలల్లో బిగ్బాస్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనుల్లో యూనిట్ ఉంది. సీజన్-9లో పాల్గొనే కంటెస్టంట్స్ ఎంపిక విషయంలో బిగ్బాస్ టీమ్ ఉంది.సోషల్మీడియాలో బాగా వైరల్ అయిన వారికే బిగ్బాస్లో ఎంట్రీ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి వారినే టీమ్ సెలక్ట్ చేస్తుంది. అయితే, కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. సోషల్మీడియాలో మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్స్ ఉన్నారు. చాలాకాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ట్రెండింగ్లో ఉన్నారు. అయితే, కస్టమర్స్పై వారు బూతులతో విరుచుకుపడటం.. అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్పై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు కనీసం 100 మిలియన్స్కు పైగానే వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయి. అలా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్లలో (చిట్టి, అలేఖ్య, రమ్య) ఒకరికి తప్పుకుండా బిగ్బాస్లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరల్ అవుతుంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయిని తెలుస్తోంది. మోడ్రన్ డ్రెస్లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. రీసెంట్గా జియోహాట్స్టార్లో పికిల్స్కు సంబంధించిన ఒక సీన్ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు.ఇదే విషయంపై బిగ్బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్బాస్కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. అసలు బిగ్బాస్కు కూడా కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పవచ్చు. అప్పుడే తమ రేటింగ్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అనుకుంటారు. ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ధైర్యంగా కెమెరాల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. ఆపై లెక్కలేనన్ని నెగటివ్ కామెంట్లు వస్తున్నా సరే వాటిని తట్టుకుని నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి వారి పేర్లు నోటెడ్ అయిపోయాయి. ఇలా ఎన్నో అంశాలు వారికి బిగ్బాస్ ఛాన్స్ దక్కేలా చేస్తాయని చెప్పవచ్చు. Guess we're in a pickle 🫠Ippudu mirchi kaavali ante, hotstar lone chuddali 🙃#Chatrapathi #Prabhas #HomemadePickle #JioHotstarTelugu pic.twitter.com/tqAC5ELmLg— JioHotstar Telugu (@JioHotstarTel_) April 3, 2025 -
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ చేసిన శోభా శెట్టి.. ఎందుకంటే?
శోభా శెట్టి (Shobha Shetty).. కొంతకాలం క్రితం వరకు ఈమెను కార్తీకదీపం మోనితగానే గుర్తుపెట్టుకున్నారు జనాలు. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్తో శోభా శెట్టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షోలో తను లవ్లో ఉన్నట్లు తెలిపింది. యశ్వంత్ రెడ్డి (Yashwanth)తో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. గతేడాది జనవరిలో తాంబూలాలు మార్చుకోగా మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. 11 నెలలు కావొస్తున్నా ఇంకా పెళ్లెప్పుడనేది చెప్పడం లేదు శోభ.తాజాగా శోభ.. ప్రియుడితో కలిసి పూజ చేసింది. దాదాపు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. పూజ చేయడానికి గల కారణం గురించి శోభ మాట్లాడుతూ.. కొత్తింట్లోకి వచ్చి ఎనిమిది నెలలవుతోంది. అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టాం. దిష్టి తాకి అదిప్పుడు పాడైపోయింది. అందుకే పంతులుగారిని పిలిచి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. యశ్వంత్ ఎక్కువగా నమ్మడు. కానీ మా అత్తమ్మ, నేను ఎక్కువ నమ్ముతాం. అందుకే పూజ చేశాం అని శోభా శెట్టి చెప్పుకొచ్చింది.చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ -
బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు వెళ్లిన సోనియా ఆకుల (Soniya Akula) విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పెత్తనం ఉండాలి.. నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా ఆమెకు బిగ్బాస్లో ఛాన్స్ వస్తే మళ్లీ వెళ్తారా? అన్న ప్రశ్న ఎదురైంది.నాగార్జున వద్దుఅందుకు సోనియా మాట్లాడుతూ.. నాకైతే వెళ్లాలని లేదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్గా నాగార్జున (Nagarjuna Akkineni) సార్ ఉండకూడదని కోరుకుంటున్నాను. హౌస్లో నేనొకటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా! హోస్ట్గా సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్లిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను.రానాకు ఎలా మాట్లాడాలనేది తెలుసురానా.. ఫ్రెండ్షిప్ను లవ్ అని ముద్ర వేయరనుకుంటున్నాను. తనకెలా మాట్లాడాలనేది తెలుసు. నాగార్జున హోస్ట్ అయితే మాత్రం నేను కచ్చితంగా బిగ్బాస్కు వెళ్లను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలొస్తున్నాయి. సెలక్టివ్గా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా కెరీర్ నెమ్మదిగా ముందుకుసాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ నేడు (మార్చి 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. సడన్గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ -
ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ఉద్యమంఎలాగైనా సరే ఈ బెట్టింగ్ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్ యాప్స్ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్ చేసినవాళ్లను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్అనంతరం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడురైతు పేరు వాడుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్బాస్కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్ యాప్స్తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్..ఈ ఇన్ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తేకానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ లోకల్ బాయ్ నాని, సన్నీయాదవ్, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్దే అన్న టాక్ వినిపిస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు -
ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి
కొన్నేళ్లుగా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదంటోంది బిగ్బాస్ బ్యూటీ, నటి సనా మక్బుల్ (Sana Makbul). సమంతలాగే తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని వాపోయింది. శరీరంలోని కణాలు.. అవయవాలపై దాడి చేస్తున్నాయంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో సనా మక్బుల్ మాట్లాడుతూ.. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఈ మధ్యే శాఖాహారిగా మారిపోయాను. నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ రోగినని చాలామందికి తెలియదు. 2020లో బయటపడిందినాకు కాలేయ వ్యాధి ఉంది. ఇది 2020లో బయటపడింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధి కారణంగా నా శరీరంలోని కణాలు నా అవయవాలపై దాడి చేస్తున్నాయి. అది శరీరమంతటా పాకొచ్చు, కిడ్నీలపైనా దాడి చేయొచ్చు, మోకాళ్ల నొప్పులకు కారణం కావచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. సమంతకు ఉన్న ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్. దీని వల్ల ఆమె కండరాల బలహీనతను ఎదుర్కొంటోంది. అలాగే నాకున్న ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కాలేయం డ్యామేజ్ అవుతోంది.నయమవుతుందో.. లేదో!స్టెరాయిడ్స్, కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నాను. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఇది వచ్చిందనుకుంటున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో, లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్లో నటిస్తోంది.చదవండి: అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా -
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
బిగ్బాస్ షోకు వెళ్లడం వల్ల తనకు మంచే జరిగిందంటోంది నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గిపోయానని చెప్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నాజూకుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. శిల్పా మట్లాడుతూ.. బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండదు. దీనివల్ల మితంగానే తినేదాన్ని. ఫలితంగా 11 కిలోలు తగ్గిపోయాను. బయటకు వచ్చాక మరో రెండు కిలోలు తగ్గాను.జీవితంలోనే మొదటిసారి..మొత్తంగా 13 కిలోల పైన బరువు తగ్గాను. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా సన్నబడిపోయావ్, నీ వయసు తగ్గిపోతుందేంటి అన్న ప్రశంసలు నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను. అవి వింటుంటే నాకు మరింత ఎనర్జీ వస్తోంది. బిగ్బాస్లో మూడు, నాలుగు నెలలపాటు ఉన్నాను. బయటకు రాగానే తొలిసారి నమ్రత (Namrata Shirodkar)ను కలిసినప్పుడు నన్ను చూసి షాకైంది. చాలా సన్నబడిపోయావ్ అంది. నన్ను చూసి నా కుటుంబం ఎంతగానో గర్విస్తోంది.మంచి డైట్..ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నాను. ఇంకాస్త బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్పై మనం ఉన్నదానికంటే కాస్త బొద్దుగానే కనిపిస్తాం. కాబట్టి నాకు నేను కఠిన నియమాలు పెట్టుకుంటున్నాను. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. గతంలో నేను లావుగా ఉన్నానని చయ్యా చయ్యా పాటకు నన్ను రిజెక్ట్ చేశారు. నాకోసం కష్టపడుతున్నా..అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. నాకోసం నేను కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. శిల్ప.. ఖుదా గవా, ఏక్ ముత్తి ఆస్మాన్, త్రినేత్ర, ప్రతీక్ష, పెచాన్, ఆంఖెన్.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించింది. హీరో మహేశ్బాబుకు శిల్ప శిరోద్కర్ మరదలు అవుతుంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73)చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
సిరాజ్తో 'బిగ్బాస్' బ్యూటీ డేటింగ్.. లైక్ కొట్టడం వల్లే ఇదంతా
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్తో నేను డేటింగ్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.సిరాజ్తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.హిందీ టీవీ సీరియల్స్తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Mahira Sharma (@mahirasharma) -
Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్గా మరో స్టార్ హీరో!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్కి నాని హోస్ట్గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగార్జుననే బిగ్బాస్ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్బాస్ షోకి మరింత ప్లస్ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్కి నాగార్జున హోస్ట్గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.కొత్తదనం కోసం కొత్త హోస్ట్!బిగ్బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్ని కూడా మార్చబోతున్నారట మేకర్స్. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ విజయ్ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ చెబితే తప్ప తెలియదు.కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్తట్రెండ్బిగ్బాస్ తొమ్మిదో సీజన్ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్ మ్యాన్ కచ్చితంగా హోస్లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్కి బ్రేక్ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్, ప్రముఖ సింగర్, కొరియోగ్రాఫర్ కూడా ఈ సారి హౌస్లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్ని ప్లాన్ చేస్తున్నారు. -
రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత
బిగ్బాస్ (Bigg Boss Reality Show) విన్నర్ గెల్చుకునే ప్రైజ్మనీ రూ.50 లక్షలు. తెలుగులోనే కాదు హిందీలోనూ ఈ ప్రైజ్మనీ దాదాపు అంతే ఉంటుంది. అయితే వినడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ అది వెంటనే చేతికి ఇస్తే ఇంకా బాగుండేదంటున్నాడు హిందీ బిగ్బాస్ 18వ సీజన్ విజేత కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra). సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గత నెలలోనే పూర్తయింది. ఈ షోలో కరణ్ టైటిల్ గెలవగా వివియన్ డిసేన రన్నరప్గా నిలిచారు. కరణ్.. రూ.50 లక్షలు గెలిచాడన్నమాటేకానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదట!చేతికందని ప్రైజ్మనీతాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కలర్స్ ఛానల్లో నేను పాల్గొన్న మొదటి షో ఖత్రోన్ కె ఖిలాడీ-సీజన్ 14. గతేడాది జరిగిన ఈ షోలో విజయం సాధించాను. తద్వారా రావాల్సిన డబ్బు ఇటీవలే ముట్టింది. ఇదే ఛానల్లో ప్రసారమైన బిగ్బాస్ షోలోనూ పాల్గొని మరోసారి విజయం సాధించాను. కానీ ఇప్పటివరకు రూ.50 లక్షల ప్రైజ్మనీని నాకివ్వనేలేదు. అలాగే కారు కూడా బహుమతిగా ఇస్తామన్నారు. దానికోసం ఎంతో ఎదురుచూడగా ఇప్పుడు నాచేతికి వచ్చేసింది.అభిమానులతో జాలీగా..అయితే ఈ షో నేను గెలుస్తాననుకోలేదు. అభిమానుల అండదండల వల్లే నా విజయం సాధ్యమైంది. ఒకవేళ నేను గెలవకపోయినా ఇంతే సాధారణంగా ఉండేవాడిని. బిగ్బాస్ తర్వాత నాకు విపరీతమైన ప్రేమాభిమానాలు దక్కుతున్నాయి. చాలా సమయం ఫ్యాన్స్తోనే గడుపుతున్నాను. నన్ను ఆశీర్వదించిన మహిళలకూ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కరణ్ బిగ్బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో తన సిబ్బంది పిల్లలకు చదువు చెప్పిస్తానన్నాడు. View this post on Instagram A post shared by KaranVeerMehra (@karanveermehra) చదవండి: తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్.. -
మా మధ్య గొడవలు లేవు : శిల్పా శిరోద్కర్
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కొద్దిరోజుల క్రితం హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, చాలామంది అభిమానాన్ని ఆమె దక్కించుకుంది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడినట్లు బిగ్బాస్లో ఉన్నప్పుడే శిల్ప చెప్పింది. ఆ సమయంలో వారిద్దరూ రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్లో నమ్రత రావాలని కూడా ఆమె కోరుకుంది. కానీ, నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్బాస్కు వెళ్లింది. శిల్పకు సపోర్ట్గా ఆమె అక్కాబావ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)- మహేశ్బాబు(Mahesh Babu) తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని రూమర్స్ రావడంతో శిల్ప శిరోద్కర్ మరోసారి రియాక్ట్ అయింది.'సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ల వల్ల బంధాలను జడ్జ్ చేయడం తప్పు. సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సంబంధాలను అంచనా వేయకూడదు.. మనుషుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదు. మేమిద్దరమూ మా భావాలను బహిరంగంగా వ్యక్తీకరించుకోలేం.. ఆన్లైన్ వేదికగా అలాంటివి మాకు ఇష్టం ఉండదు. నాకు సపోర్ట్గా నమ్రత పోస్ట్ చేస్తేనే మా మధ్య సంబంధాలు ఉన్నాయని, లేదంటే గొడవలు ఉన్నాయని ఊహించుకోవడం చాలా తప్పు. నా గుర్తింపు కోసం నేను బిగ్ బాస్ 18కి వెళ్లాను. నమ్రత సోదరి గానో లేదా మహేష్ మరదలిని కావడం వల్లో వెళ్లలేదు. వాస్తవానికి మహేశ్ ఒక సూపర్ స్టార్. ఆయన చాలా పాపులర్. కానీ, వారు నా కెరీర్లో భాగం కావాలని అర్థం కాదు కదా..? మహేశ్, నమ్రత ఇద్దరూ చాలా ప్రైవేట్గా ఉండాలనుకుంటారు. దీంతో వారికి పొగరు అని అందరూ అనుకుంటారు. ఇదీ ముమ్మాటికి నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. మహేశ్ చాలా సింపుల్, కూల్గా మాట్లాడుతారు. అతను చాలా మంచి వ్యక్తి. మీకు ఏదైనా అవసరమైతే.., ఎల్లప్పుడూ మీ కోసం అండగా నిలబడుతాడు.' అని శిల్పా పేర్కొంది. బిగ్ బాస్లో శిల్పా శిరోద్కర్కు ఓటు వేయాలని మహేశ్, నమ్రత శిరోద్కర్ విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆమె తప్పకుండా గెలిచి ఉండేది అని చాలామంది భావించారు. ఈ క్రమంలో శిల్ప ఇలా రియాక్ట్ అయింది.నమ్రతను కలిసిన శిల్పతాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్డే సందర్భంగా శిల్ప ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. -
గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్బాస్ విన్నర్
రైతుబిడ్డ బిగ్బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.గొర్రెలు మేపడమే ఇష్టంఅరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్బాస్ విషయానికి వస్తే.. బిగ్బాస్ హౌస్ను చాలా మిస్ అవుతున్నాను. భగవంతుడి ఆశీస్సులున్నాయిఅక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.ఎవర్ని తీసుకొస్తే వారినే..పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by 🧿ಹನುಮಂತ ಲಮಾಣಿ🧿 (@hanumantha_lamani_official_) చదవండి: ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను -
కన్నడ బిగ్బాస్ విన్నర్గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్మనీ ఎంతో తెలుసా..?
కన్నడలో బిగ్బాస్ సీజన్ 11 (Kannada Bigg Boss 11) ముగిసింది. మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ విజేతగా నిలిచాడు. సుమారు 120 రోజులుగా కొనసాగిన ఈ సీజన్లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్గా కొనసాగారు. జనవరి 26న బిగ్బాస్ ఫైనల్ ముగిసింది. దీంతో ట్రోఫీతో పాటు నగదును విజేతకు సుదీప్ అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంది.బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత(Hanumantha) విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆట మొదలపెట్టిన అతను ఏకంగా టైటిల్ విన్నర్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మంచి గుర్తింపు పొందాడు. సంగీతంతో పరిచయం లేకుండానే 2018 సారిగమప కన్నడ 15వ సీజన్లో హనుమంత రన్నరప్గా నిలిచాడు. దీంతో చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. ఆపై మరుసటి ఏడాదిలో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో పాల్గొన్న హనుమంత ఇక్కడ కూడా తన టాలెంట్తోనూ మెప్పించాడు. ఈ గుర్తింపుతో బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా 21వ రోజున హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. చివరకు కన్నడ బిగ్బాస్ సీజన్ 11 విజేతగా నిలిచాడు.ప్రైజ్మనీ ఎంత..?ట్రోఫీ రేసులో హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్-5లో ఉన్నారు. అయితే, గట్టిపోటీ తట్టుకుని హనుమంత విజేత కాగా.. రన్నరప్గా త్రివిక్రమ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో రజత్, మోక్షిత, మంజు వరుసగా ఉన్నారు. విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్గా నిలిచిన త్రివిక్రమ్కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. తెలుగు బిగ్బాస్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.ಅತೀ ಹೆಚ್ಚು ವೋಟ್ಸ್ ಪಡೆದು ವಿಕ್ಟರಿ ಬಾರಿಸಿದ ಹನುಮಂತು!ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/a6YfYVNVWm— Colors Kannada (@ColorsKannada) January 26, 2025 -
అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్తో క్లారిటీ..
బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).. ఇటీవలే హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడింది. ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్ స్వయంగా వెల్లడించింది. బిగ్బాస్కు వెళ్లేముందు నమ్రతతో గొడవైందని.. రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్లో నమ్రత రావాలని కోరుకుంది.పట్టించుకోలేదా?కానీ నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్బాస్కు వెళ్లింది. ఇకపోతే శిల్పకు సపోర్ట్గా ఆమె అక్కాబావ నమ్రత- మహేశ్బాబు తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. షో నుంచి వచ్చిన వెంటనే శిల్ప ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. నమ్రత ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. తను కచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని చెప్పను. ఇలాంటివి మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. తను నాకు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా తనేంటో నాకు తెలుసు.. నేనేంటో తనకు తెలుసు అని చెప్పింది.బర్త్డే విషెస్తాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్డే సందర్భంగా శిల్ప ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మహేశ్- నమ్రత దంపతులు.. శిల్పకు సపోర్ట్గా లేరు, పట్టించుకోవట్లేదన్న రూమర్లకు ఈ పోస్ట్తో చెక్ పడినట్లైంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..! -
‘సల్మాన్ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్ కుమార్
'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్మెంట్ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్కి పుల్స్టాఫ్ పెట్టేశాడు.అసలేం జరిగింది?గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.వాస్తవం ఎంటంటే..?సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్బాస్ సెట్లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు. -
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్! -
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్లో భాగంగా చాహత్ తల్లి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్బాస్ టీమ్కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్బాస్ టీమ్నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
బిగ్బాస్ ఫ్యామిలీ వీక్లో భార్య ఎంట్రీ.. రొమాన్స్ వీడియో వైరల్
బాలీవుడ్లో బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. జనవరి 19న ఫైనల్ కూడా జరగనుంది. ఈ క్రమంలో అన్ని సీజన్స్ మాదిరే అక్కడ కూడా ఫ్యామిలీ వీక్ ఇప్పుడు జరుగుతుంది. టైటిల్ రేసులో ఉన్న వివియన్ డిసేనా అనే కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యామిలీ వీక్లో భాగంగా తన సతీమణి వహ్బిజ్ దొరాబ్జీ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తన సతీమణితో ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.వివియన్ డిసేనా బాలీవుడ్ సీరియల్స్లలో ఆయనకు చాలా పాపులారిటీ ఉంది. పలు రియాలిటీ షోలలో కూడా సత్తా చాటాడు. ఇప్పుడు కూడా బిగ్బాస్ 18 టైటిల్ రేసులో ఉన్నాడు. అయితే, ఫ్యామిలీ వీక్లో భాగంగా చాలా రోజుల తర్వాత తనను కలవడానికి వచ్చిన భార్యతో ఆయన రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దానిని చూసిన నెటిజన్లు వివియన్ను ట్రోల్ చేస్తున్నారు. బిగ్బాస్లో అన్ని కెమెరాల ముందు వివియన్, నూరాన్ ఇద్దరూ బెడ్పై చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలను టెలికాస్ట్ చేశారు. వివియన్ సతీమణి నూరాన్ కూడా పలు సీరియల్స్లలో నటించింది. ఆమె మోడల్గా కూడా రానించింది.పబ్లిక్ ఫ్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్న ఇలాంటి షోలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో బిగ్బాస్ నిర్వాహుకుల మీద కూడా వారు ఫైర్ అవుతున్నారు. హిందీ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివి కొత్త కాదు. గత సీజన్స్లలో కూడా ఇలాంటి సీనే వైరల్ అయింది. హౌస్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటిమేట్ సీన్ అంటూ ట్రెండ్ అయింది. దీంతో షో నిర్వాహకులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అదంతా ఫేక్ అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, తాజాగా బిగ్ బాస్ 18 నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రం నిజమైనదేనని చెప్పవచ్చు.