breaking news
Hyderabad
-
స్మార్ట్ కార్డు.. తప్పులతడక
కరీంనగర్ 44వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్కాలనీకి చెందిన భూంపల్లి విజయ, జొన్నల సంధ్య, గన్ను రాజమణిలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వీరి చౌకధరల దుకాణ నంబరు 2084150 కాగా, కార్డులపై మాత్రం 58వ డివిజన్లో చిరునామాగా, రేషన్షాప్ నంబరు 2084168గా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2084168 నంబరు గల రేషన్షాప్ 58వ డివిజన్లో కాకుండా, 13వ డివిజన్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 44వ డివిజన్లో దాదాపు 150 మందికి జారీ అయిన స్మార్ట్ కార్డులు ఇలానే ఉన్నాయి. ఒక్క కరీంనగర్లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు పంపిణీ చేసిన పట్టణాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.పోలంపల్లి ఆంజనేయులు క్యూఆర్ కోడ్.. హోలోగ్రామ్.. అత్యాధునిక భద్రతా ఫీచర్లు అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్కార్డులు లబ్ధిదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. కార్డుపై ఉన్న పేరు తప్ప మరే వివరమూ సరిపోలడం లేదు. అసలు ఆ కార్డు ఎవరిదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒక జిల్లాలో ఊరి పేరు మారితే.. మరో జిల్లాలో గ్రామ పంచాయతీ పేరు తారుమారైంది. ఇంకొకచోట హ్యాబిటేషన్ పేరు స్థానంలో మరో గ్రామం పేరు వచ్చి చేరింది. ఇంటిపేరు తారుమారైంది. మరోచోట పిన్కోడ్ మారింది.. మరికొన్ని చోట్ల రేషన్ దుకాణం నంబరే తప్పుగా ముద్రితమైంది. ఇంటి నంబర్, ఫోన్నంబర్ లేకపోవడంతో లబ్ధిదారుల ఇళ్లను వెతికి కార్డులు అందించడమే అధికారులకు సవాలుగా మారింది. ఈ స్మార్ట్ కార్డులను ముంబై కేంద్రంగా ఉన్న ఏజెన్సీల ద్వారా బల్క్ ప్రింటింగ్ చేయించగా, సాఫ్ట్వేర్ ఫార్మాటింగ్లో లోపాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటి కార్డుల డేటా ధ్రువీకరణపై అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకుపైగా ఆహార భద్రతా కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ చేపట్టారు. వీటి ద్వారా సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంత భారీస్థాయిలో కార్డుల ముద్రణ చేపట్టే ముందు కుటుంబ వివరాలు, గ్రామ పంచాయతీ, మండలం, వార్డు, పిన్కోడ్, రేషన్ దుకాణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. 15 వేల కార్డులకు ఒకే ఊరు! పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో వెలుగుచూసిన ఘటన స్మార్ట్ కార్డుల డేటా లోపాల తీవ్రతను చాటుతోంది. మండలంలోని 22 గ్రామాలకు చెందిన కార్డులపై ‘ఓదెల’అనే గ్రామం పేరే ముద్రితమైంది. హరిపురం గ్రామానికి చెందిన 423 కార్డుల పంపిణీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. పోస్టల్ పిన్కోడ్లోనూ తప్పులు గుర్తించారు. మండలంలో పంపిణీ చేయాల్సిన సుమారు 15 వేల కార్డుల్లో ఇదే సమస్య ఉన్నట్టు తేలడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. – హరిపురం, రూపునారాయణపేట, శానగొండ, జీలకుంట గ్రామాలకు వచ్చిన కార్డుల్లో గ్రామం పేరు, పిన్కోడ్ తదితర వివరాలు తప్పుగా ముద్రించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రస్తుతం స్మార్డ్ కార్డులు పంపిణీ చేస్తుండగా, కార్డులపై పిన్కోడ్ 505186కు బదులు 505185గా ఉంది. కరీంనగర్లో 24వేల కార్డులు వెనక్కి– కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్కు మంజూరైన కార్డులో కరీంనగర్ బదులు మహబూబ్గర్ జిల్లా, అక్కడి 1425022 రేషన్ షాపు కేటాయించారు. – పలు డివిజన్లలో లబ్ధిదారుల డివిజన్ స్థానంలో మరో డివిజన్ పేరు, కేటాయించిన రేషన్ దుకాణానికి బదులు మరో దుకాణం నంబర్ ముద్రితమైంది. చాలా చోట్ల అడ్రస్లు దొరక్క, ఆ లబ్దిదారు ఎవరో తెలియక కార్డులు డివిజన్ల వారీగా పేరుకుపోతున్నాయి. గతంలో అద్దె ఇంట్లో ఉండి ఇప్పుడు మారిన వారికి సంబంధించిన కార్డులన్నీ పక్కన పడేస్తున్నారు. కార్డులో ఫోన్నంబరు లేకపోవడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా ఉంది. దీంతో పంపిణీ కాకుండా 24వేల కార్డులు మిగిలిపోయాయి. ఇందులో దాదాపు 20 వేల కార్డులను రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 3వేల కార్డుల్లో తప్పుల గుర్తింపు కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని రామేశ్వర్పల్లి గ్రామానికి బదులు రామ్రెడ్డి పల్లి గ్రామంగా 400 కార్డులు ప్రింట్ అయ్యాయి. ఇస్రోజివాడి గ్రామంలో 501 కుటుంబాలకుగాను 499 కార్డులు మంజూరు కాగా, ఉగ్రవాయి గ్రామంగా ప్రింట్ అయింది. చిన్న మల్లారెడ్డి గ్రామం పేరుకు బదులు చిన్న చేగురుగా 400 కార్డుల్లో ముద్రించారు. రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి బదులు మద్దికుంటగా 605 కార్డుల్లో ముద్రణ జరిగింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో సుమారు 3,000 స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు తారుమారైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా జిల్లాలో ఇలా... ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగులో 680 స్మార్ట్ రేషన్ కార్డులు ఉండగా.. ఏకంగా 358 కార్డుల్లో లబ్ధిదారులు నివసించే సిద్ధిక్నగర్కు బదులు గుబ్బగుర్తి పేరు ముద్రించారు. సిద్దిక్నగర్కు సంబంధించిన పిన్కోడ్ 507165కు బదులు 507305గా నమోదైంది. – బోనకల్ మండలంలోని లక్ష్మీపురం, తూటికుంట్ల ప్రాంతాల్లో కొందరు లబ్ధిదారుల ఇంటిపేర్లు సైతం తప్పుగా ముద్రితమయ్యాయి. మూడు మండలాల్లో ఇలాంటి తప్పులు గుర్తించామని, మరిన్ని వివరాలు సేకరించి సరిచేసిన కార్డులు తిరిగి ఇస్తామని ఖమ్మం జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్ తెలిపారు. – కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో అధికారిక కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 10 మంది లబ్ధిదారులకు కార్డులు ఇవ్వగా.. ఐదుగురి కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైంది. నమూనాగా ఎంపిక చేసిన కార్డుల్లోనే సగం తప్పులు రావడం గమనార్హం. – మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతంలో 13వ రేషన్ దుకాణం పరిధిలోని 480 కార్డుల్లో ‘వరిగుంతం’కు బదులు ‘కుల్చారం’పేరు ముద్రించారు. దీంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని 4వ వార్డు కార్డుల్లో మున్సిపాలిటీ పేరుకు బదులు ‘వట్టూర్’గ్రామం పేరు రావడంతో అక్కడా పంపిణీ ఆపేశారు. కార్డులు వెనక్కి పంపించాం హరిపురం గ్రామ కార్డుల్లో కొన్ని తప్పులు ఉండడంతో, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం కార్డులను వాపస్ ఇచ్చాం. ఊర్లో 253 కార్డులు ఉన్నాయి. అంటిల్లోనూ ఉన్న తప్పులను సరిచేసి, సరైన వివరాలతో తిరిగి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. – విజయ నాగరాజుయాదవ్, సర్పంచ్, హరిపురం -
అంతా ‘రాజకీయమే’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్లో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ గేటు బయట చేసిన ఆందోళన కేంద్రంగానే దుమారం కొనసాగింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సెషన్ మాత్రమే జరిగింది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు చెందిన సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు జరగ్గా, అసెంబ్లీ బయట అధికార, విపక్ష సభ్యులు రాష్ట్ర గవర్నర్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. సభ ప్రారంభం కాగానే.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే మళ్లీ గొడవ మొదలైంది. తమ ఆందోళన సందర్భంగా మహిళా సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన గురించి బీఆర్ఎస్ సభ్యు లు సభలో లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో సహా పలువురు మంత్రులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యుల వ్యవహరశైలిని తప్పుపట్టారు. గందరగోళం మధ్య సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులందరినీ సెషన్ మొతానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివపత్రాప్ శుక్లాను కలిశారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. మంత్రులతో సీఎం భేటీ అసెంబ్లీలోని తన చాంబర్లో సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులతో బుధవారం నాటి పరిణామాలపై చర్చించారు. బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్, సభ నిర్వహణపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. సభ జరిగినన్ని రోజులు ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విరామం తర్వాత కూడా అసెంబ్లీ రాజకీయ అంశాలపైనే కొనసాగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం నిర్వహించగా, ఆ ప్రదేశాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి కూడా అటు కేసీఆర్, ఇటు బీఆర్ఎస్లను టార్గెట్ చేశారు. మండలిలో ప్రకంపనలు మండలిలోనూ రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. మండలి ప్రారంభం కాగానే సస్పెన్షన్కు గురైన తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలను సభకు అనుమతించి వారి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో ప్రశ్నోత్తరాలను ముగించిన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలను ప్రవేశపెట్టిన అనంతరం గురువారం నాటికి వాయిదా వేశారు. కాగా తాతామధు, నవీన్రెడ్డిలపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాన్ని మండలి చైర్మన్ గుత్తా, మహేశ్గౌడ్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీకి పంపించారు. దళితులు, మహిళల గౌరవం కాపాడాలి బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దళితులు, మహిళల గౌర వం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజహరుద్దీన్, వివేక్, లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ»ొజ్జులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశా రని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తన చొక్కాను విప్పారని, తదితర సోమవారం జరిగిన ఘటనల గురించి గవర్నర్కు వారు వివరించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనై తికమైన అంటరానితన ఆచరణను బీఆర్ఎస్ ప్రదర్శించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై అ త్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్య లు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. -
చలో హైదరాబాద్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ)తలపెట్టిన చలో హైదరాబాద్ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వక హామీతో ఈనెల 10వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్, అనంతరం మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో టీజీఈజేఏసీ అత్యవసర సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్కు సర్వం సిద్ధం చేశామని, మహాధర్నా స్టేజీ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి అడ్వాన్స్లు కూడా చెల్లించామన్నారు. కానీ సీఎస్ లిఖిత పూర్వక హామీని విశ్వసించి జేఏసీ తలపెట్టిన కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అడిగిన 18వ తేదీ గడువు అనంతరం ఈనెల 19న జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత నెల 27 నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచనలు చేశారన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీఎస్ సంజయ్జాజు సచివాలయంలో జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారన్నారు. అనంతరంనాలుగు అంశాలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వమని రెండవ పీఆర్సీ కమిషన్ చైర్మన్కు సీఎస్ లేఖ రాశారని, అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనానికి పే రివిజన్ కమిషన్ నిపుణులు, అధికారులు, వివిధ సంఘాల సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూడు డీఏలు ఇవ్వాలని సీఎస్ను కోరామని, ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు పెట్టామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈనెల 18వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సీఎస్ కోరారన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హమీని పూర్తిగా విశ్వసించి ఛలో హైదరాబాద్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉద్యోగులకు 64 రకాల సమస్యలున్నప్పటికీ... ప్రధానంగా నాలుగింటిపైనే ఒత్తిడి చేస్తున్నామని, ఆర్థిక భారం లేని అంశాలను త్వరలో జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. గతనెల 27వ తేదీన క్షేత్రస్థాయిలో ధర్నాలు, ఈనెల 1న నిరసనలతో ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈనెల 10వ తేదీన మహా ధర్నా కోసం నాలుగు చోట్ల దరఖాస్తు చేశామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని, సరూర్నగర్ స్టేడియంలో నిర్వహణకు కోర్టు కూడా అనుమతించిందన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ, టీజీఓ ప్రధాన కార్యదర్శులు ముజీబ్ హుస్సేని, బి.శ్యామ్, జేఏసీ ప్రతినిధులు జి.సదానంద్గౌడ్, చావ రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులతో ఈనెల6న నాంపల్లిలో చేపట్టిన సంకల్పసభతో ప్రభుత్వం దిగొచ్చిందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీఎస్ మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయిల పరిష్కారానికి ప్రతినెలా కనీసం రూ.2వేల కోట్లు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరగా..ఈ అంశలపై ఈ నెల18న స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
మా హక్కులు పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు, కేసులు, వారి అరెస్టులు సస్పెన్షన్లపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు జరిగాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై పోలీసులు, మార్షల్స్ దాడి చేశారు. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పోలీసులు వారికి ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు రోప్ పార్టీలు ఏర్పాటు చేసి వేలాది మందిని అక్కడికి అనుమతించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 167, 355 తదితర నిబంధనల మేరకు మా హక్కులు కాపాడండి. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి భద్రత కల్పించాలి..’అని ఆ వినతిపత్రంలో బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. గవర్నర్తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని వివరించాం.. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్ను కలిసినట్లు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇ చ్చిన హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను అందజేశామని చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనను కూడా వివరించామన్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై దాడి యత్నం, తమపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తీరును వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. అసెంబ్లీ, శాసనమండలిలోకి రానివ్వకుండా తమను ప్రభుత్వం అడ్డుకుందని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాసనమండలి సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని వివరించామని, ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపైనా ఫిర్యాదు చేశామని చెప్పారు. తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని, సీఎస్, డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇ చ్చినట్లు తెలిపారు. -
అసెంబ్లీ ముగిసేంత వరకు బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం లోక్భవన్లో గవర్నర్ను కలిశారు. అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు అనుసరించాల్సిన రాజకీయ, పోరాట వ్యూహంపై శాసనసభా పక్షం సభ్యులతో వారు చర్చించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పేలా అసెంబ్లీ వేదికగా కొనసాగించిన పోరాటాన్ని ఇక సభ వెలుపల కూడా విస్తరించాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. గురువారం ఉదయం కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అల్పాహార భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రానున్న మూడు రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను చర్చించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అసెంబ్లీలో చర్చకు నోచుకోని 22ఏ అంశంతోపాటు పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను మాక్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని భావిస్తోంది. ఆయా అంశాలను కేవలం తెలంగాణ భవన్కే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలోనూ ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఇచి్చన హామీలు, వాటి అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీ వెళ్లనుంది.సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులతో కూడిన బృందం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్తోపాటు మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనుంది. అసెంబ్లీ పరిసరాల్లో తమకు జరిగిన అవమానం, పోలీసుల వ్యవహారశైలి, తమపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను ఆయా కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నారు. గవర్నర్ను కలిసిన సందర్భంగా కూడా ఈ అంశాలను ఆధారాలతో వివరించిన నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనలోనూ వాటిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ప్రత్యేకంగా విద్యుదుత్పత్తికి నీళ్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి అవసరాల కోసమే నీటిని విడుదల చేయరాదని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టంచేసింది. ఈ నెల 4న జలసౌధలో జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలతో రూపొందించిన మినిట్స్ ప్రతిని తాజాగా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు హాజరై తమ రాష్ట్రాల నీటి అవసరాలను తెలియజేశారు.సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్టు 2027 మధ్యకాలంలో ఉండనున్న తాగునీటి అవసరాలకు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి జలాశయాల నుంచి జరపాల్సిన నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో వివిధ రకాలుగా చర్చలు జరిపినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్సీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని మినట్స్లో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో నీటి పంపిణీపై తుది నిర్ణయాన్ని త్వరలో జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఉన్నది 147 టీఎంసీలు.. కావాలన్నది 297 టీఎంసీలుఏపీ ఈఎన్సీ (ఇరిగేషన్) మాట్లాడుతూ సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్టు 2027 వరకు తమ రాష్ట్రానికి 104 టీఎంసీల నీళ్లు అవసరమని తెలియజేశారు. సెప్టెంబర్ 3 నాటికి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో పంపిణీ చేస్తే ఏపీకి 97.41 టీఎంసీల వాటా వస్తుందని, దానిని విడుదల చేయాలని కోరారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఈఎన్సీ (జనరల్) మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలోనే నీటి పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలకు 46 టీఎంసీలతో కలిపి మొత్తం 200 టీఎంసీల నీరు తమ రాష్ట్రానికిఅవసరమని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఏపీ తక్షణమే నీటి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జలాశయాల్లో కనీస నిల్వ మట్టానికి ఎగువన 147.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 297 టీఎంసీలకు పైనే నీళ్లను కోరడం గమనార్హం. మినిట్స్ను తిరస్కరిస్తున్నాం.. తెలంగాణత్రిసభ్య కమిటీ సమావేశంలో జరిగిన వాస్తవ చర్చలు, నిర్ణయాలేవీ.. కృష్ణా బోర్డు తమకు పంపిన మినట్స్ ప్రతిలో ప్రతిబింబించడం లేదని తెలంగాణ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మినట్స్ను అంగీకరించడం లేదని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఓపీ రమేశ్బాబు కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. -
మేనేజ్మెంట్ కోటా తుది మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) బుధవారం విడుదల చేసింది. నీట్లో అర్హత సాధించి, మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో రిజిస్ట్రార్ పేరిట ఈ జాబితాను ప్రకటించింది. మెరిట్ జాబితాలో ప్రణవ్ అభిజిత్ సాల్గర్కర్ (రోల్ నంబరు 13115202570) 590 మార్కులు సాధించి, ఆల్ ఇండియా ర్యాంకు 13,689తో తొలి స్థానంలో నిలిచారు. జాబితా క్రమసంఖ్య 7,113 వరకు అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. చివరి క్రమసంఖ్యలో మయూరేష్ ఫిర్కేవార్ 177 మార్కులతో, 11,94,890 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉన్నారు. గత విద్యా సంవత్సరాల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొంది, కళాశాలల్లో చేరని కొంతమంది అభ్యర్థుల విషయంలో వర్సిటీ ప్రత్యేక నిబంధనలు అమలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు జీఓఎంఎస్ నంబర్ 125 ప్రకారం ఆయా అభ్యర్థుల అర్హతలను పరిమితం చేసినట్టు మెరిట్ జాబితాలోని రిమార్క్స్లో పేర్కొంది. కొందరికి కేవలం బీడీఎస్, మరికొందరికి కేవలం ఎంబీబీఎస్ ప్రవేశానికి మాత్రమే అర్హత ఉన్నట్టు స్పష్టం చేసింది. మెరిట్ జాబితాలో అభ్యర్థుల నీట్ ర్యాంకు, మార్కులు, స్థానిక, స్థానికేతర, మైనారిటీ, ఎన్ఆర్ఐ తదితర వివరాలను పొందుపరిచారు. అభ్యర్థులు తమ వివరాలను వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.వెబ్ ఆప్షన్లు షురూ: ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీలు) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభిస్తూ వర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 11 సాయంత్రం 4 గంటల వరకు అవకాశముంది. ప్రైవేట్ వైద్య, దంత కళాశాలలతోపాటు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అనురాగ్ యూనివర్సిటీ పరిధిలోని నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నారు. కాగా మొదటి విడత కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి విడతల కౌన్సెలింగ్కు అనర్హులవుతారని వర్సిటీ స్పష్టం చేసింది. సీట్లను బ్లాక్ చేసి తర్వాతి విడతలకు వెళ్లకుండా ఈ నిబంధన విధించింది. వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీటు కేటాయించిన తర్వాత సంబంధిత కళాశాలలో చేరని విద్యార్థులు కూడా తదుపరి విడతల కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా బీ కేటగిరీ సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 15 శాతం అన్రిజర్వ్డ్ (ఆల్ ఇండియా) అభ్యర్థులకు కేటాయిస్తారు. అభ్యర్థులు కళాశాలలు, కోర్సుల వారీగా తమకు నచ్చిన క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం కోర్సును మధ్యలోనే నిలిపివేసే అభ్యర్థులు అసలు ధ్రువపత్రాలను తిరిగి పొందేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.20 లక్షల డిస్కంటిన్యూయేషన్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని కేఎన్ఆర్యూహెచ్ఎస్ పేర్కొంది.యూనివర్సిటీ ఫీజులు ఇలా..: సీటు కేటాయించిన అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఆన్లైన్ ద్వారా వర్సిటీ ఫీజు చెల్లించాలి. ఎంబీబీఎస్ బీ కేటగిరీకి రూ.లక్ష, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి రూ.2 లక్షలు నిర్ణయించారు. బీడీఎస్లో బీ కేటగిరీకి రూ.40 వేలు, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి రూ.80 వేలు చెల్లించాలి. దీనికి అదనంగా కళాశా లల్లో ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నీలిమా మెడికల్ కాలేజీలో బీ కేటగిరీ ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.16.50 లక్షలు, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి రూ.24.75 లక్షలుగా ఉంది.వెబ్ ఆప్షన్లకు tspvtmedadm. tsche.in వెబ్సైట్లో, సాంకేతిక సమస్యలకు 9392685856, 7842136688, 9059672216, నిబంధనలపై సందేహాలకు 7901098840, 9490585796 , చెల్లింపుల సమస్యలకు 9618240276 నంబర్లను సంప్రదించాలని వర్సిటీ సూచించింది. -
'కోహెడ'కు రూ.637.70 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి సమీపంలో కోహెడలో నిర్మించనున్న ప్రపంచస్థాయి సమగ్ర పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తోంది. మార్కెట్ తొలి దశ పనులకు రూ.637.70 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలో 178.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర పండ్ల మార్కెట్ను అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా ఆరు వేలం హాళ్లు, వాటికి అనుబంధంగా మీజనైన్ ఏసీ అంతస్తులు నిర్మించనున్నారు. వీటితోపాటు షెడ్–4, కర్బూజ తదితర పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్, రైతుల కోసం కిసాన్ రిటైల్ మార్కెట్, వాహనాలు నేరుగా లోపలికి వెళ్లి సరుకులు తరలించే సదుపాయం, ప్రాంగణం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మార్కెట్ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పనుల పర్యవేక్షణ తదితర బాధ్యతలను ఆ శాఖ నిర్వహించనుంది. రైతులకు ఆధునిక సదుపాయాలు ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే పండ్ల ఉత్పత్తిదారులకు ఆధునిక మార్కెటింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్ల విక్రయాలు, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. తద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కోహెడ సమగ్ర పండ్ల మార్కెట్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. -
ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కేసులో ఇరికించారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఒక కేసులో అరెస్టు చేసి, అందులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని మరో కేసులో ముద్దాయిగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ దీనిని పూర్తిగా ’రివర్స్ ఇంజనీరింగ్’ కేసుగా అభివర్ణించింది. ఈ కేసులో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన పులి ఓబులేసుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పులి ఓబులేసు దాఖలు చేసిన ఎస్ఎల్పీ (క్రిమినల్)పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మా సనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీరు అతడిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు నేరం అంగీకరించాడని చెప్పి ఈ కేసులో ఇరికించారు. ఆ తర్వాతే ఫిర్యాదుదారుడిని సృష్టించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదొక రివర్స్ ఇంజనీరింగ్ కేసు‘ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్ను బెయిల్పై విడుదల చేయాలని పేర్కొంది.అసలేం జరిగిందంటే...: 2014 నవంబర్ 19న హైదరాబాద్లో కేబీఆర్ పార్కు వద్ద ఆడి కారులో కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పులి ఓబులేసు తుపాకీతో వెళ్లి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ప్రతిఘటించడంతో కారు అద్దంపై కాల్పులు జరిపాడు. బాధితుడి సోదరుడు అడ్డు కోగా, అతడిని కొరికి తుపాకీ వదిలేసి పరారయ్యాడు. విచారణ జరిపిన కింది కోర్టు.. కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నేరాలు రుజు వైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్షలు విధించింది. అయితే, బాధితుడిని కారు నుంచి మరో ప్రాంతానికి తరలించనందున కిడ్నాప్ సెక్షన్ వర్తించదంటూ జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. అయితే, హత్యా యత్నం, ఆయుధ చట్టం కింద కింది కోర్టు విధించిన శిక్షలను మాత్రం సమర్థించింది. -
ఆ రెండూ కుట్రలే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను, ఆయన మాతృమూర్తిని కించపరిచి అవమానించటం, అనంతరం ఆయనకు మద్దతుగా నిరసన తెలిపిన దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలను కుట్రలుగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇందుకు వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయిపై దాడి చేసిన కసబ్ లాంటి ఉగ్రవాదులకు కొన్ని అంశాలను నూరిపోసి ఉన్మాదులుగా మార్చి మన దేశంపైకి పంపిన తరహాలోనే, కేసీఆర్ కూడా తన అనుచరులకు ఇలాగే నూరిపోసి ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారని ఆరోపించారు. దాంతో పేట్రేగిన నేతలు ఆ రోజు దళిత స్పీకర్ను కించపరచటమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ముందురోజు ఫామ్హౌస్లో జరిగిన భేటీలో చేసిన కుట్ర మొదలు ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై సంపూర్ణ విచారణ చేపడతామన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు జాయింట్ కమిషనర్ విజయకుమార్ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం శాసనసభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులను అవమానించేలా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్టుగా చెబుతున్న వ్యవహారంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కోర్టులు బెయిల్ ఇచ్చినా ప్రజలు బెయిల్ ఇవ్వరు ‘చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది కోర్టుల నుంచి బెయిల్ పొందవచ్చు. కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదు. జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెబితే కిరీటం ఊడిపోతుందా? స్థాయి తగ్గుతుందా? సభాపతిని అవమానించిన విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గబోదు. సభాపతి పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్కుమార్ మనసుకు గాయం చేసేలా ఉన్మాదంతో వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించే స్థాయికి వెళ్లారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటుంటుందా? సభలో అధికారులపై దాడులు చేయడంతోపాటు స్పీకర్ కుర్చీని అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. దళితులపై అవమానకర చర్యలు స్పీకర్ను అవమానించిన ఘటనకు నిరసనగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఫామ్హౌస్ వద్ద డప్పు దరువులతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారే తప్ప ఎలాంటి ఉన్మాదానికీ పాల్పడలేదు. దళిత సోదరులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు. నిరసన తెలిపిన దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా దళితనులను తీవ్రంగా అవమానించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. మరి దొరతనం, ఆహంకారంతో ఉన్న ఆ నేతల మనసుల్లో పేరుకుపోయిన అంటరానితన భావజాలాన్ని ఎలా శుద్ధి చేస్తారు? యాసిడ్తో కడగాలా? దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే అందరి కడుపులు నిండుతున్నాయి. మనకు అన్నం పెడుతున్న వారిని ఇంతగా అవమానిస్తారా? దళితులను అవమానపరుస్తూ వారిని కించపరిచిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అప్పుడే వారికి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో తెలిసొస్తుంది. ఖర్గేనూ అవమానించారు.. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలోని కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించింది. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తల్లిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గేను అవమానించడం బాధాకరం. ఉత్తరాఖండ్లోని ఓ మైదానంలో ఖర్గే సభలో పాల్గొన్న అనంతరం ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య. ఆ ఘటనను ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది. తాజాగా తెలంగాణ వేదికగా బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వ్యవహారానికి తెరలేపింది. వారిని వదిలే ప్రసక్తే లేదు.. విద్యా రంగంలోని అక్రమాలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్లలో జరిగిన దురాగతాలు, రాష్ట్రంపై పేరుకుపోయిన అప్పుల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకునేందుకు ఈ కుట్రలు పన్నారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ను అవమానించే స్థాయికి వెళ్లడం అత్యంత దురదష్టకరం. కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసింది. కాంగ్రెస్ విధానం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమే..’ అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పీకర్కు పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్..
తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో మూడేళ్లు పెంచడంతో మొత్తం పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు అందుబాటులోకి వచ్చింది.తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే నియామకాలకు ఈ సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లోని కానిస్టేబుల్ పోస్టులకు ఇది వర్తించనుంది. అలాగే, కానిస్టేబుల్తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీంతో వయోపరిమితి కారణంగా ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పోలీస్ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనివ్వగా, రాబోయే నియామకాల్లో అర్హత కలిగిన మరికొందరు అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది.అయితే ఈ అదనపు మూడేళ్ల సడలింపుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన వయోపరిమితి నిబంధనలను ప్రత్యేకంగా పరిశీలించాలి.ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2026న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏడేళ్ల సడలింపునకు మరో మూడేళ్లు కలపడంతో మొత్తం పదేళ్ల వరకు సడలింపు లభించనుంది.దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్, సమాన హోదా పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చనుంది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది.ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్ -
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంతటా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో టీజీ సేఫ్ బృందం తనిఖీలు చేపట్టింది. కూకట్పల్లిలో భూలక్ష్మీ మెస్లో కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఉప్పల్ పిస్తా హౌస్లో..కాగా, ఉప్పల్ బ్రాంచ్ పిస్తా హౌస్ కేక్ తిన్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. కుళ్లిపోయిన కేక్ అమ్మారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేక్ తిన్న కాసేపటికే వాంతులు అయ్యాయన్న బాధితులు.. కేక్ నుంచి దుర్వాసన వచ్చిందని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల అత్తాపూర్లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో హెచ్– ఫాస్ట్, ఫుడ్సేప్టీ అధికారుల తనిఖీల్లో ఫ్రిజ్లో కుళ్లిన మాంసాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఐస్క్రీమ్లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. ఏప్రిల్ నెలలో మంగళ్హాట్లో కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్పై పోలీసులు దాడులు నిర్వహించగా.. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది! -
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ను అవమానిస్తున్నారు...శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్ -
బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు.బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. నిన్న కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) నినాదాలు చేశారు.ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ సభ్యుల్ని కోరారు. అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. సస్పెండ్ అయిన వాళ్లలో.. కేటీఆర్, హరీష్రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, అనిల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు 22 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ సమయంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఛాంబర్ వద్ద మార్షల్స్ కేటీఆర్, హరీశ్రావును అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మండలి నుంచి వాకౌట్ఇటు శాసనమండలిలో తమ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్పై ఓటింగ్ నిర్వహించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని కోరింది. అందుకు ఆయన అనుమతించలేదు. తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడం దారుణమంటూ మండలి విపక్ష నేత మధుసూధనాచారి నిరసన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. సభ ఉన్నత విలువలు పాటించాలి. మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట. ఎక్కడైనా ఇలా ఉంటుందా?. తెలంగాణకు అనేక సేవలు అందించిన మహానుభావుని చావు కోరుతారా?. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి...మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. నిన్న సభలోకి వస్తె వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. మా సభ్యులు సభలోకి వచ్చేవరకు మా నిరసన కొనసాగుతుంది. మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. మమల్ని ఎత్తివేస్తారా?. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర. నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. అయినా చైర్మన్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: ఇది ఫామ్హౌజ్లో జరిగిన కుట్రే! -
లోక్భవన్కు బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్కు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్భవన్కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్కు సిద్ధమవుతోంది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్ను కోరాలని చూస్తోంది. నేడు మండలిలో కీలక చర్చమరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా.. -
ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్
సాక్షి, సిటీబ్యూరో: ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తుదారుల నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు డిపాజిట్ (ఈఎండీ)గా ఆన్లైన్ ద్వారా రూ.10 వేలు స్వీకరించారు. ఇళ్ల కేటాయింపు లాటరీ పూర్తి కావడంతో ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దరఖాస్తుదారులు చెల్లించిన అకౌంట్కే డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎటువంటి దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అయితే.. కొంతమంది దరఖాస్తుదారులు నగదు ద్వారా, ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇలా చెల్లించిన వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov. in ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు చేశారో, అదే అకౌంట్కు తిరిగి జమ అవుతుందని గౌతం తెలిపారు. సందేహాల నివృత్తికి 040– 24603572ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. చదవండి: పుట్టిన 13 రోజులకే పాస్పోర్టు -
తమాషా చేస్తున్నారా? లోపలేస్తా!
హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ముందస్తు అరెస్టు కోసం కంటోన్మెంట్ ఐదోవార్డు గృహలక్ష్మి కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన కార్ఖానా సీఐ అనూరాధ దురుసు ప్రవర్తన చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం క్రిశాంక్ ఇంట్లోకి వెళ్లేందుకు సీఐ, ఇతర సిబ్బంది యత్నించారు. ఇంటికి లోపలి నుంచి తాళం ఉండటంతో పనివాళ్లతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో క్రిశాంక్ భార్య, చిన్న పాప మాత్రమే ఉందని చెప్పినా వినకుండా తలుపులు తీయాలంటూ పనివాళ్లను గద్దించారు. తమాషాలు చేస్తున్నారా? లోపలేస్తానంటూ కార్ఖానా సీఐ బెదిరించడం గమనార్హం. ఇంతలో క్రిశాంక్ భార్య సుహాసిని బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేడని చెబుతుండగా, ఫోన్ లోకేషన్ ఇక్కడే చూపిస్తుందని వాదించారు. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన క్రిశాంక్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. చదవండి: పుట్టిన 13 రోజులకే పాస్పోర్టు -
ఫిర్యాదులే.. పరిష్కారాలేవీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేలు.. క్రమంగా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలుగా మాత్రమే మారుతున్నాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్య చెప్పేందుకు ఒకసారి వచ్చిన బాధితుడు.. పరిష్కారం కాకపోవడంతో మళ్లీ రావడం, మరోసారి వినతిపత్రం ఇవ్వడం.. ఇలా అదే సమస్యతో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు పలు జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ఒకే సమస్య.. మళ్లీ మళ్లీ అదే గోడు గ్రీవెన్స్డేలో కొత్తగా వచ్చే ఫిర్యాదులతోపాటు గతంలోనూ ఇదే సమస్యపై ఫిర్యాదు చేసినవారు తిరిగి వస్తున్న ఉదంతాలు ఉన్నాయి. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు, పింఛన్లు, రేషన్కార్డులు, ప్రభుత్వ పథకాల అమలు, రహదారులు, విద్యుత్ తదితర అంశాలపై ఫిర్యాదులు పునరావృతమవుతున్నాయి. ‘ఇంతకుముందు ఫిర్యాదు చేశాం.. పరిష్కారం కాలేదు. అందుకే మళ్లీ వచ్చాం’అని పలువురు బాధితులు చెబుతున్న పరిస్థితి అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వినతిపత్రం తీసుకున్నారు.. అంతేనా? గ్రీవెన్స్డేలో బాధితుడి నుంచి వినతిపత్రం తీసుకొని, దానిని సంబంధిత అధికారికి పంపడం సాధారణ ప్రక్రియగా మారింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఫిర్యాదుపై విచారణ జరిగిందా? బాధితు డికి సమాచారం ఇచ్చారా? సమస్య పరిష్కారమైందా? అన్నది చాలాచోట్ల స్పష్టంగా తెలియడం లేదు. ఫిర్యాదు ఏ శాఖకు వెళ్లింది? ఎవరు విచారణ చేయాలి? ఎప్పటిలోగా పరిష్కరించాలి? అన్న వివరాలు బాధితుడికి అందుతున్నాయా? అన్నది కూడా పరిశీలించాల్సిన అంశంగా మారింది. -
మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది!
హైదరాబాద్: పోలీసులు గుర్తించకుండా మాస్క్ పెట్టుకొని దొంగతనానికి పాల్పడిన నిందితుడిని కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడిన ఓ మచ్చ పట్టించింది. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్రోడ్ నెం.10లో నివసించే ప్రముఖ మద్యం వ్యాపారి శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లోకి గత నెల 31న ఓ దొంగ ప్రవేశించి అల్మారాలోని నగలు తస్కరించి పరారయ్యారు.అంతకుముందు ఇదే రోడ్డులో రెండు ఇళ్లల్లో దొంగతనానికి యత్నించి విఫలమై మూడో ఇల్లు శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించగా ఆయన భార్య నీలు కౌర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇక్కడ సీసీ ఫుటేజీలు, వేలి ముద్రలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించగా కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడ్డ ఓ మచ్చను పోలీసులు గమనించారు. పాత నేరస్తుల కదలికలను పరిశీలించిన కనురొమ్మలపై మచ్చ ఉన్న వ్యక్తిని గుర్తించారు.గత నెల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన కేసులో నిందితుడి వివరాలు నమోదయ్యాయి. ఈ మచ్చ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పెందుర్తికి చెందిన గౌరేష్(27) బంజారాహిల్స్రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో అద్దెకు ఉంటూ జూనియర్ ఆరి్టస్ట్గా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలపై దృష్టి పెట్టాడు. శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారం దొంగతనం చేసి అందులో కొంత విక్రయించి గోవాకు ఫ్లైట్లో వెళ్ళాడు.గోవాలో ఓ క్యాసినోలో జూదం ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. బంగారం రికవరీ చేసే దిశలో పలు కోణాల్లో విచారణ కొనసాగుతున్నది. చోరీ జరిగిన 48 గంటల్లోనే క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితుడు గౌరేష్ గతంలో మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోనూ దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి పేకాట కోసం జూబ్లీహిల్స్లో దొంగతనం చేశాడు. -
కేటీఆర్ అరెస్టు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్కు తరలించడంతో బోయిన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్ను బోయిన్పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ను పోలీసు స్టేషన్లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్రావుపై క్రిమినల్ కేసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్రావుతోపాటు డి.సు«దీర్రెడ్డి, గంగుల, పాడి కౌశిక్రెడ్డి, జి.జగదీశ్వర్రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -
తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతామధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డిలపై కఠిన చర్యలు తీ సుకోవాలని పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. స్పీకర్ను అవమానించడం బీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని వారు ఆరోపించారు.మరోవైపు నల్లబ్యాడ్జీలతో మండలికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. సభ జరుగుతున్నంత సేపు వెల్లోకి దూసుకొచ్చి ‘వీ వాంట్ జస్టిస్.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. అక్రమ కేసులు ఎత్తివేయాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ పలుసార్లు వాయిదా వేశారు. మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభను ప్రారంభిస్తూ..సోమవారం సభ బయట జరిగిన ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసిన విషయాన్ని సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘నిన్న జరిగిన సంఘటన బాధాకరం. స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. తాతా మధు వ్యాఖ్యలతో ప్రజల్లో సభ పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లే అవకాశం ఉంది’మహేశ్గౌడ్ అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా ప్రకటించారు.అనంతరం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, తాతా మధు, నవీన్కుమార్లు తనపై పుస్తకాలు చించి విసిరారని, ఆ పుస్తకాల్లోని పిన్నులు గుచ్చుకుంటే గాయం అయ్యేదని..పెద్దల సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని పదేపదే సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్పీకర్పై పరుషపదజాలం వాడడం నిమ్న జాతులను అవమానించడమేనని, ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక స్వభావమని విమర్శించారు. మహిళా పోలీసులపైనా బీఆర్ఎస్ సభ్యులు దాడి చేశారని, ఈ విషయంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల విషయంలో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, స్పీకర్పై అవమానకరమైన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్పీకర్ను ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, స్పీకర్ అంటే పారీ్టలకతీతంగా గౌరవం ఇవ్వాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ళీ అంతకు ముందు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, శంకర్నాయక్, ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ దళితులపట్ల బీఆర్ఎస్ ఈ ధోరణి సరికాదన్నారు. అనంతరం టీ బ్రేక్ ఇస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు.ఇవి కూడా చదవండి: ఫామ్హౌస్లో జరిగిన కుట్రే -
‘సర్’నోటీసులొచ్చే ఓటర్లు వీరే!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్), 2026 కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకోనున్న ఓటర్ల జాబితాను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సర్, 2026లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలను అందించకపోవడంతో వీరిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా ..ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ రెండు కేటగిరీల కలిపి మొత్తం 92లక్షల మంది ఓటర్లుండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి జాబితాలను మంగళవారం ఆన్లైన్లో ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వెబ్సైట్ (https://ceotelangana.nic.in) లో ఈ జాబితా అందుబాటులో ఉంది. పార్ట్నంబర్ల(పోలింగ్బూత్ నంబర్) వారీగా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. జిల్లా పేరు, నియోజకవర్గం పేరు, తమ పోలింగ్ బూత్ సంఖ్య తెలిసి ఉంటే ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. సర్–2026 ముసాయిదా జాబితాలో చాలా మంది ఓటర్ల పోలింగ్బూత్/పార్ట్ నంబర్లు మారాయి. 1050 టోల్ఫ్రీ నంబర్కు ‘ఈసీఐ ఎపిక్నంబర్’ను ఎస్ఎంఎస్ చేస్తే సంబంధిత ఓటరు కొత్త పార్ట్ నంబర్ను ఈసీ ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తుంది. దీని ద్వారా పైన పేర్కొన్న జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించి చూడవచ్చు. వెబ్సైట్లో కొన్ని నియోజకవర్గాలు/పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన జాబితాలను ఇంకా అప్లోడ్ చేయలేదు. వాటిని తెరిచేందుకు ప్రయతి్నస్తే త్వరలో అప్లోడ్ చేస్తారనే సందేశం ప్రత్యక్షం అవుతోంది. -
ఫామ్హౌస్లో జరిగిన కుట్రే
సాక్షి, హైదరాబాద్: శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే..ఒక రోజు ముందు 6వ తేదీన ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెట్టి కుట్రకు తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని నూరిపోసి పంపించిన తరహాలో బీఆర్ఎస్ సభ్యులను ప్రేరేపించి పంపించారని విమర్శించారు. కుట్రదారుల డైరెక్షన్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులు పాత్రధారులుగా సభలో ప్రవర్తించారని, ప్రధాన సూత్రధారులు బీఆర్ఎస్ అత్యున్నత నాయకత్వమేనని విమర్శించారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తెలంగాణ సమాజం సంస్కారం, సంస్కృతి, మహిళల గౌరవానికి సంబంధించిన సమస్య అని భట్టి విక్రమార్క అన్నారు.రూపుమాపని మానసిక అస్పృశ్యత: దామోదర స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మానసిక అస్పృశ్యత రూపుమాపలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర. ఆత్మగౌరవ చరిత్ర. ఆత్మగౌరవమే మా అలంకారం. ఆత్మగౌరవమే మా స్ఫూర్తి. ఆ ఆత్మగౌరవంతోనే ఈ స్థాయికి వచ్చాం’అని మంత్రి అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే యువత తిరగబడుతుందని, ముఖ్యంగా దళిత సమాజాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, ఎన్నో కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్గా ఉన్నత స్థానానికి చేరుకున్న గడ్డం ప్రసాద్కుమార్ను అవమానించడం బాధాకరమన్నారు.ఇవీ చదవండి: తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు -
అసలు హరీశ్రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మంగళవారం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్కు చెందిన హరీశ్రావుకు మైక్ ఇవ్వకూడదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తుంది కాబట్టి మైక్ ఇచ్చానని చెప్పారు. అయితే, సోమవారం అసెంబ్లీ గేటు బయట జరిగింది అనుకోకుండా అయితే, హరీశ్రావు సభలో మాట్లాడింది మాత్రం తనను మనస్తాపానికి గురిచేసిందన్నారు. జరిగిన దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో క్షమాపణలు చెబుతారేమో అనుకున్నానని, కానీ హరీశ్రావు అందుకు విరుద్ధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అందుకే మొదటిసారి కోపానికి వచ్చానని, మనస్తాపం చెందానని, సభలో కూర్చోవాలని అనిపించలేదని, మంగళవారం ఒక్కరోజు ప్యానెల్ స్పీకర్తో సభను నడిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పదేళ్లు మంత్రిగా హరీశ్రావు ఉన్నాడని, ఆయన కూడా ఇలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. తననుద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన మాటలకు రాష్ట్రమంతా ఊగిపోతోందని, దళిత సంఘాలు కోపంగా ఉన్నాయని చెప్పారు. తాతా మధు మాట్లాడిన ప్రదేశం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని, ఆ విషయం బీఆర్ఎస్ వారికి తెలియదనుకుంటా అని వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్లాగా చేయాలనుకుంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లను చేసినట్టు తాతా మధు, కౌశిక్రెడ్డిలను కూడా సభ నుంచి బయటకు పంపించేవారమన్నారు. అక్కడ కనపడుతోంది అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ ప్రసాద్కుమార్ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ గేటు బయట కేటీఆర్, హరీశ్రావు, నవీన్రెడ్డిలు పోలీసులు కొట్లాడింది, తాతా మధు మాట్లాడింది ప్రత్యక్షంగా కనపడుతోందని చెప్పారు. కానీ, మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదని, అందుకే విచారణ చేయమని చెప్పానన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పైనుంచి కింది వరకు నల్ల దుస్తులు వేసుకొని వచ్చినా అభ్యంతరం లేదని, కానీ ఆ దుస్తులపై ఉన్న రాతలు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే, 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న నిబంధనలను తొలగించి తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్తగా అసెంబ్లీ రూల్స్ తెచ్చాడని, ఆ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, ఆ నిబంధనల ప్రకారమే చెబుతున్నామన్నారు. రాహుల్గాంధీ నల్లటీషర్టుపై ఆదానీ అని రాసుకొని వెళ్లలేదని, కేవలం నల్ల టీషర్టు వేసుకొని మాత్రమే పార్లమెంటులోకి వెళ్లారని చెప్పారు. ప్రభుత్వమే అడిగింది తాజా పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని సభలో ప్రభుత్వమే డిమాండ్ చేసిందని స్పీకర్ చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు కేసీఆర్ ఫోన్ చేయలేదన్నారు. సభ ప్రారంభానికి ముందు తానే కేసీఆర్కు ఫోన్ చేశానని, సభకు రావాలని అడిగానని చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే వస్తానని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. తాను ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి సభకు రావాలని కోరుతానని వెల్లడించారు. తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీలో సభ్యులు కానప్పటికీ చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ అలా చేయడం లేదని, చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి చైర్మన్కు పంపుతామని స్పీకర్ ప్రసాద్కుమార్ చెప్పారు. -
తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్కుమార్ రెడ్డిలను సస్పెండ్ చేయాలన్న సభ్యుల డిమాండ్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆమోదించారు. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ఇద్దర్నీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఉదయం విరామం తర్వాత సాయంత్రం 6 గంటలకు శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు సభ్యులు మండలికి వచ్చారని, చట్టసభలో కీలక వ్యక్తిని ఉద్దేశించి వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండానే మండలి నిబంధనల మేరకు తాతా మధు, నవీన్రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉదయం ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్కు మండలి చైర్మన్ను కోరుతూ శాసనసభలో తీర్మానం చేసే వరకు మండలి సమావేశాన్ని వాయిదా వేశారు. అసెంబ్లీ నుంచి ఆ మేరకు తీర్మానం అందిన తర్వాత మండలి తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే వారి సస్పెన్షన్ ప్రకటన చేసిన చైర్మన్ సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కాగా తాతా మధుసూదన్, నవీన్కుమార్ రెడ్డిపై సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణ నిబంధనలకు అనుగుణంగా మండలి చైర్మన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ తీర్మానించింది. సోమవారం శాసన సభాపతిని ఉద్దేశించి వారు అత్యంత అవమానకరంగా, కించపరిచేలా దూషించారంటూ ఆ వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి ‘ఇటువంటి ప్రవర్తన శాసనమండలి సభ్యుని హోదాకు ఏమాత్రం తగదు. శాసన సభాపతి గౌరవం, అధికారం రాజ్యాంగబద్ధ హోదాకు ఇది తీవ్ర భంగం కలిగించింది. రాష్ట్ర శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా దీనిని సభ పరిగణిస్తోంది. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు బాధ్యత వహించి, సభ హుందాతనం, సభా మర్యాదలను పరిరక్షించేందుకు, శాసన సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సభ తీర్మానిస్తోంది. ఈ తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్కు పంపించాలి..’అని శాసనసభ తీర్మానించింది. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యులెవరూ సభలో లేరు. భూముల నిషేధిత జాబితా (22ఏ) అంశంపై చర్చకు పట్టుబట్టుతూ బీజేపీ సభ్యులూ అప్పటికే వాకౌట్ చేశారు. -
రెండోరోజూ అదే వే'ఢీ'
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల ఢీ అంటే ఢీ రెండోరోజూ కొనసాగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటిరోజు సోమవారం బీఆర్ఎస్ నేతలు నల్ల టీ షర్టులు ధరించి రావడం, వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ‘అనుచిత వ్యాఖ్యల వ్యవహారంతో’పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తెలిసిందే. కాగా మంగళవారం కూడా అదే వాతావరణంలో ఉభయ సభలు జరిగాయి. ఈ అంశంపై రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు రెండు పార్టీలు పోటీలు పడి వ్యూహాలు రచించాయి. ఇక అసెంబ్లీ బయట కూడా ఇదే తీరు కొనసాగించాయి. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావుల మధ్య మాటల యుద్ధం సాగగా, కాంగ్రెస్ చేపట్టిన ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం ముట్టడి కార్యక్రమం, కేసీఆర్ను ఉద్దేశించి ఆ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తాజా ఉద్రిక్తతకు, వివాదానికి దారి తీశాయి. మరోవైపు మహిళా పోలీసులపై బీఆర్ఎస్ సభ్యుల దురుసు ప్రవర్తనపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇక అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే అంశం నడిచింది. ఎమ్మెల్యేలతో మంతనాలు ఉదయం అసెంబ్లీకి రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్రెడ్డి స్పీకర్ చాంబర్కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ప్రభుత్వం పక్షాన అండగా ఉంటామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఓదార్చారు. ఆ తర్వాత రేవంత్రెడ్డి తన చాంబర్లో రాష్ట్ర మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిల విషయంలో అసెంబ్లీ వేదికగా ఏం చేయాలన్న దానిపై అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతితో చర్చించారు. ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టే తీర్మానం ఎలా ఉండాలి? భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై మాట్లాడిన సీఎం.. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిని కోరుతూ శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహతో తీర్మానం ప్రతిపాదింపజేసి, ఆమోదింపజేయాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. కాంగ్రెస్ ముట్టడి కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండాలని నిర్ణయించారు. తాతా మధు, నవీన్రెడ్డిల సస్పెన్షన్ నేపథ్యంలో నిరసనలు, ధర్నాతో బీఆర్ఎస్ నేతలు వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. ‘అనుచిత వ్యాఖ్యలపై’చర్చ..సస్పెన్షన్ తీర్మానం మంగళవారం మధ్యాహ్నం సభ ప్రారంభమైన తర్వాత ప్యానెల్ స్పీకర్ స్థానంలోకి వచ్చిన కడియం శ్రీహరి సోమవారం నాటి అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై చర్చను ప్రారంభించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రారంభించగా, పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. ఆ తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యకు విజ్ఞప్తి తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ఈ తీర్మానాన్ని సభ ఆమోదించి శాసనమండలికి పంపింది. స్పీకర్ మనస్తాపం.. తాతా మధు ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్రావు వీలున్నంత వరకు తమ పార్టీ ఎమ్మెల్సీలకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే స్పీకర్ ప్రసాద్కుమార్ కొంత ఆవేశానికి లోనయ్యారు. హరీశ్రావును ఉద్దేశించి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల వైఖరి, హరీశ్రావు వ్యాఖ్యలకు స్పీకర్ మనస్తాపం చెందారు. ఉదయం సభను కొంతసేపు వాయిదా వేసిన అనంతరం చాలాసేపు ఆయన తన చాంబర్లోనే ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు అసెంబ్లీ కార్యదర్శితో మాట్లాడారు. విలేకరులతో ఇష్టాగోష్టిలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత సభ లోపలికి వెళ్లిన ఆయన మనస్తాపం కారణంగా కొద్దిసేపు మాత్రమే సభా కార్యకలాపాలు నిర్వహించి, ప్యానల్ స్పీకర్ కడియం శ్రీహరికి సభాధ్యక్షత బాధ్యతను అప్పగించి వెళ్లిపోయారు. మహిళా కమిషన్కు ఫిర్యాదు సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై..కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, మట్టా రాగమయి, పరి్ణకారెడ్డి, యశస్వినిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా నేతలు కల్వ సుజాత, గుండు సుధారాణి, ఇందిరా శోభన్లు మహిళా కమిషన్ను కలిశారు. మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారని, వారి ముందే అర్ధనగ్న ప్రదర్శన చేశారని, అనుచితంగా వ్యవహరించారంటూ కమిషన్ కార్యదర్శి, సభ్యులకు ఫిర్యాదును అందజేశారు. తగ్గని బీఆర్ఎస్ – అసెంబ్లీ లోపలా, బయటా ఆందోళనలు – నల్ల బ్యాడ్జీలతో సమావేశాలకు హాజరు – కాంగ్రెస్ చేపట్టిన కేసీఆర్ ఎర్రవల్లి నివాసం ముట్టడి కార్యక్రమంపై మండిపాటు – తాతా మధు, నవీన్రెడ్డి సస్పెన్షన్పై నిరసన, ధర్నా ప్రదాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ లోపలా, బయట అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం కొనసాగించింది. మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో స్పీకర్ సభకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనసభ లాబీల్లోని బీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సభ లోపలా బయటా కాంగ్రెస్ అనుసరిస్తున్న ఎత్తుగడలపై చర్చించారు. ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు అందిన సమాచారంపై చర్చించారు. వారికి పోలీసులు సహకరిస్తున్నారని తెలియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎర్రవల్లికి వెళ్లాలని నిర్ణయించారు. అయితే పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్సీలు మాత్రం సభలోనే ఉండాలని నిర్ణయించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట ఎర్రవల్లిలో కేసీఆర్కు సంఘీభావం తెలిపేందుకు కేటీఆర్, హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అయితే రాజీవ్ రహదారి మీదుగా ఎర్రవల్లికి వెళ్లే క్రమంలో నగర శివారులోని బొల్లారం, హకీంపేట వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నిరసన తెలుపుతూ తమ వాహనాల నుంచి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలి నడకన ఎర్రవల్లికి బయలుదేరారు. అయితే హరీశ్రావుతో పాటు కొందరు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని జవహర్నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన కేటీఆర్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు వార్తను తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున జవహర్నగర్, బోయిన్పల్లి పోలీసు స్టేషన్లకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బోయినపల్లి పోలీసు స్టేషన్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం తోపులాటకు, దాడికి దిగాయి. సాయంత్రం ఐదు గంటల వరకు నేతలను పోలీసు స్టేషన్లోనే నిర్బంధించిన పోలీసులు ఆ తర్వాత వదిలి పెట్టారు. పోలీసు నిర్బంధం నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాయంత్రం తిరిగి అసెంబ్లీకి చేరుకున్నారు. నిరసనలు..ధర్నా తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీ బయట పోలీసులు దురుసుగా వ్యవహరించారని, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మంగళవారం శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిని అరెస్టు చేయడంపై మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో సమావేశాలకు అంతరాయం కలిగింది. తర్వాత సాయంత్రం మధు, నవీన్కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మండలి చైర్మన్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో జరిగిన నిరసనలో ఏకపక్షంగా సస్పెన్షన్ విధించి సభను వాయిదా వేసుకుని వెళ్లారని విమర్శించారు. సస్పెన్షన్కు సంబంధించిన శాసనసభ తీర్మానం కాపీని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చ లేకుండా ఎమ్మెల్సీల సస్పెన్షన్కు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొద్దిసేపు గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ.. ధర్నా నిర్వహించారు. ఆ తరువాత వారిని పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. మీడియా పాయింట్లో తాతా మధు మాట్లాడుతుండగా అసెంబ్లీ మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు. మధు, నవీన్కుమార్రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ను ఉద్దేశించి షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. -
HYD: సరూర్నగర్లో గజం రూ.1,64,000
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్లోని 4,356 చదరపు గజాల స్థలానికి సోమవారం హెచ్ఎండీఏ బిడ్డింగ్ నిర్వహించింది. గజానికి రూ.1,50,000 కనీస ధర నిర్ణయించగా, అత్యధికంగా రూ.1,64,000 నమోదైంది. వేలం ద్వారా రూ.71.44 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం వేసిన భూమి.. సరూర్నగర్లోని ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో వ్యాపార వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ను ఈ ధర ప్రతిబింబించిందని తెలిపారు. చదవండి: ‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్ను ఓదార్చిన సీఎం రేవంత్ -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కరణ్ రాజేంద్ర దర్దా
న్యూఢిల్లీ: దేశంలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ ప్రచురణకర్తల సంఘం అయిన ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్)కి 2026–27 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మాత్) ఎన్నికయ్యారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 67వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఎన్నికను ప్రకటించారు. అలాగే ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్గా తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా), వైస్ ప్రెసిడెంట్గా హర్ష మ్యాథ్యూ (వనిత), గౌరవ ట్రెజరర్గా అనంత్నాథ్ (గృహశోభిక) ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్గా మేరీ పాల్ కొనసాగనున్నారు. మరోవైపు 41 మందితో కూడిన ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో కె.ఆర్.పి. రెడ్డి (సాక్షి), ఐ. వెంకట్ (ఈనాడు), వివేక్ గోయెంకా (ద ఇండియన్ ఎక్స్ప్రెస్–ముంబై), జయంత్ మామ్మెన్ మ్యాథ్యూ (మలయాళ మనోరమ) ఉన్నారు. -
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్ను ఓదార్చిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయించే దిశగానూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మంగళవారం అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైంలో.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఆయన చాంబర్లో కలిశారు. నిన్నటి పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్కు భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని.. ఎవరినీ వదిలపెట్టబోమని స్పష్టం చేశారు.సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ పరిణామంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో నిన్న కంటతడి పెట్టారు. అయితే స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల తీరు అమానుషమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు అని.. బాధ్యులపై చర్యలు తప్పవంటూ సభలో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై ఈ ఉదయం సీఎం రేవంత్రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపాలని.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించే అంశాల్ని ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిలను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఆందోళన సందర్భంగా మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో అనుచితంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తిట్టింది నీ తల్లిని కాదు.. హరీశ్రావుపై స్పీకర్ ఆగ్రహం -
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ రాజు ఆసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కూప్పకూలారు. తక్షణమే స్పందించిన మంత్రి శ్రీహరి.. ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు మరణించారు. -
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి అన్నారు. గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిర్వాహకులు వెంటనే http://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తుది నిమిషం దాకా వేచిచూడకుండా అధికారిక పోర్టల్ ద్వారా సమాచారం అందించి హైదరాబాద్ సిటీ పోలీస్కు సహకరించాలి. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు యంత్రాంగానికి వీలవుతుంది’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.మరోవైపు, గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేల మోత మోగిస్తే సహించేది లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమర్పించాలి. డీజే, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.గతేడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
గాంధీ సూపరింటెండెంట్గా డాక్టర్ ఉషారాణి
హైదారబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ టి.ఉషారాణిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టులో కొనసాగిన డా.వాణి డీఎంఈగా పదోన్నతిపై వెళ్లడంతో సూపరింటెండెంట్ పోస్టు సుమారు నెల రోజులు ఖాళీగా ఉంది. దీంతో ప్రభుత్వం నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఉషారాణిని గాంధీ ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ ఆస్పత్రిలో అదనపు డీఎంఈగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీహెచ్ రాజకుమారిని పరిపాలనా కారణాలతో తక్షణమే రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు జీఓ జారీ చేశారు. చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది? -
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్కు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్ మాట్లాడారు. ఆ సమయంలో.. చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. దళిత స్పీకర్ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్ను కోరారామె. ఆ సమయంలో హరీశ్ రావు మరోసారి జోక్యం చేసుకుని.. స్పీకర్గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్రావు వైఖరి స్పీకర్నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్ను డిక్టేట్ చేయడం ఏంటి?. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ? అంటూ బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. -
మండలి నుంచి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 8వ తేదీ) సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్- ప్రభుత్వ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అంశంపై సభ హోరెత్తిపోయింది. దీనిలో భాగంగా స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలపై చర్యలకు సభలో తీర్మానం పెట్టారు. ఇందుకు సభలో ఆమోదం లభించింది. తెలంగాణ శాసనమండలి వద్ద ఉద్రిక్తతమండలి వాయిదా పడ్డా బీఆర్ఎస్ ఆందోళనబీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ నిరసనఅంతకుముందు మండలిలో సైతం బీఆర్ఎస్ ఆందోళనతాతా మధు, నవీన్రెడ్డిలు చైర్మన్ చాంబర్ ముందు బైఠాయించి నిరసనఎమ్మెల్సీలను బలవంతంగా లాక్కెళ్లిన మార్షల్స్ శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ నిరసన ఎమ్మెల్సీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ నిరసనశాసనమండలి ఆవరణలో సభ్యుల ఆందోళన మండలి నుంచి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు సస్పెన్షన్ఈ సెషన్ వరకూ ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ఎథిక్స్ కమిటీకి సిఫారుసుశాసనమండలి రేపటికి వాయిదాశాసన మండలికి సీఎం రేవంత్బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానంతీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తీర్మానంలో పేర్కొన్న శాసన సభ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ కు పంపాలని తీర్మానం ఆధారాలతో కౌన్సిల్ కు పంపాలని తీర్మానం దామోదర రాజనరసింహ సభలో పెట్టిన తీర్మానాన్ని బలపర్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఅదే సమయంలో శాసన మండలికి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి వచ్చారుమరోవైపు శాసన మండలికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శాసస సభ రేపటికి వాయిదాఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలపై చర్యలకు సభలో తీర్మానం అసెంబ్లీ రేపటికి వాయిదాసభాపతిని అన్నారంటే సభ మొత్తాన్ని అన్నట్లే : భట్టితాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలకు సభలో తీర్మానం యావత్ చట్ట సభనే బీఆర్ఎస్ నేతలు అవమానించారుసభాపతిని అన్నారంటే సభ మొత్తాన్ని అన్నట్లే దళిత వర్గాల్లో పుట్టి స్పీకర్గా ఎదిగిన వ్యక్తి గడ్డ ప్రసాద్రాష్ట్రం ఏర్పడించే ఆత్మగౌరవం నినాదం మీద తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని మండలి చైర్మన్కు పంపాలని నిర్ణయం స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంస్పీకర్పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందిస్పీకర్పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంవ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందిఎప్పుడైనా ఆవేశంలో మాట్లాడినా క్షమాపణలు కోరాఎస్సీ,ఎస్టీ,ముస్లీంలు అత్యంత వెనకబడిన వర్గాలు ప్యానెల్ స్పీకర్గా కడియం శ్రీహరిశాసన సభ చైర్ను ప్యానల్ స్పీకర్ కు అప్పగించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.ప్యానల్ స్పీకర్గా కడియం శ్రీహరినిన్న స్పీకర్ పై BRS MLC వ్యాఖ్యలకు మనస్థాపానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ఈ రోజు సభకు దూరంగా ఉండాలని నిర్ణయంఈ నేపథ్యంలో సభను ప్రారంభించి - ప్యానల్ స్పీకర్ బాధ్యతలు శాసన సభ నుంచి బీజేపీ వాకౌట్ కనీస సమాచారం లేకుండా సభను గంటల కొద్ది వాయిదా వేసారని నిరసన వాయిదాకు నిరసనగా బీజేపీ వాకౌట్ 22A అంశాన్ని సభలో ఎప్పుడు చర్చ జరుపుతారో చెప్పకపోవడం పై నిరసనగా బీజేపీ వాకౌట్ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధంవాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మాణం చేయనున్న శాసనసభతాతామధు, నవీన్లపై చర్యలకు రంగం సిద్ధంస్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసిన సీఎం రేవంత్బాధ్యులపై తగిన చర్యలు తీసకుంటాం: సీఎం రేవంత్సీఎం రేవంత్తో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, న్యాయశాఖ నిపుణుల భేటీబీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహార శైలి, చర్యలపై న్యాయ సలహా తీసుకుంటున్న సీఎంశాసనసభలో తీర్మానం చేసి మండలికి పంపించాలని ప్రభుత్వం ఆలోచనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే అవకాశంమీడియా పాయింట్:పిరికితనంతో ప్రభుత్వం వ్యవహారం చేస్తోంది: జగదీష్ రెడ్డిఅసెంబ్లీకి రాకుండా మమ్మల్ని అడ్డుకున్నారుకాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందిఅసెంబ్లీలో చర్చలు జరపడం ప్రభుత్వానికి ఇష్టం లేదుకాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పి కేసీఆర్ ఫామ్ హౌస్కు పంపిస్తున్నారుసీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి కాంగ్రెస్ వాళ్ళను ఫామ్ హౌస్కు పంపుతున్నారుపోలీసు ఎస్కార్ట్లు ఇచ్చి కేసీఆర్ ఇంటికి వద్దకు పంపుతున్నారుసీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారుపై స్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు14 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారుస్పీకర్ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలి: మంత్రి సీతక్కమహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారుమహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాంమహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకోండిఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్దిమహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారు?మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటాంకేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారుఎస్సీ, ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుందివీళ్లకు తల్లులు లేరా? లకారంతో ఎలా తిడతారు? గౌరవ సభ.. కౌరవ సభగా మారింది: హరీష్రావుసీనియర్ నాయకుఆలు సబిత గొంతు నొక్కారుదాడి జరిగిన సబితా ఇంద్రారెడ్డిపై కేసు పెట్టారుమహిళా ఎమ్మెల్యేపై కేసులు పెట్టడం సమంజసమా?తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదాబీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో 15 నిముషాల పాటు సభ వాయిదాఅసెంబ్లీలో స్పీకర్, హరీష్రావు మధ్య మాటల యుద్ధంబీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని దూషించారు: స్పీకర్అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదుదళితులంటే బీఆర్ఎస్కు చిన్నచూపు: కాంగ్రెస్ సభ్యులుబీఆర్ఎస్ నేతలు తీరును తెలంగాణ సమాజం అంగీకరించదుచర్చ జరగకుండా బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారు అసెంబ్లీ ఆవరణలో మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరినవీన్ మిట్టల్ పీఎస్ రాజు అకస్మాత్తుగా కుప్పకూలడంతో వెంటనే స్పందించిన మంత్రిఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించిన మంత్రివైద్య సిబ్బందిని పిలిపించి.. బాధితుడిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలా చర్యలుమహిళల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గౌరవం లేదు: మంత్రి సీతక్కఎలాంటి కారణం లేకుండా కవితను సస్పెండ్ చేశారుహరీష్ రావును విమర్శించినందుకు కవితను సస్పెండ్ చేశారుమహిళా ఎమ్మెల్యేలను ముందుకు నెట్టిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లుమహిళా పోలీసులపై కేటీఆర్ దురుసుగా ప్రవర్తించారుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహంనా సంగతి ఏంటో హరీష్ రావు చెప్పాలిమీ తల్లిని కాదు.. నా తల్లిని అన్నారుగడ్డం ప్రసాద్ పట్ల మాకు గౌరవం: హరీష్ రావువ్యక్తిగతంగా నాకు చైర్ పైన రెస్పెక్ట్ ఉందిస్పీకర్ను ఉద్దేశించి అనలేదని తాత మధు అన్నారులిఖిత పూర్వకంగా తన వివరణను మీడియా కూడా ఇచ్చారుఅలా భావించి ఉంటే విచారం వ్యక్తం చేశాడు.మేము విచారణ వ్యక్తం చేస్తున్నాంసీఎం రేవంత్కు కౌశిక్రెడ్డి సవాల్కొడంగల్లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేను హుజూరాబాద్లో రాజీనామా చేస్తారేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తారేవంత్ రెడ్డి మాడ్లాడిన భాష.. ఉపయోగించిన పదజాలం తెలంగాణ సమాజం మొత్తం చూసిందిఅసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరంమంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక పోస్ట్తల్లిని అవమానించిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రితాత మధు వ్యాఖ్యలపై పొంగులేటి ట్వీట్బీజేపీ వాయిదా తీర్మానంఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చించాలని డిమాండ్వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే అరెస్ట్ సమయంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. శాసనసభ ప్రాంగణంలో నిన్న తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తానేం దూషించలేదని నిన్ననే మధు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం ఎమ్మెల్సీ తాతా మధు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోంచి బయటకు రావాలని పిలిచారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని మధు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనంతరం అధికారులు వాళ్లతో మాట్లాడి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్కుమార్ రెడ్డిపై సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా ఆయన్ని తరలించారు. మధును తరలిస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడించేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే పోలీస్ అధికారి మైక్ను తోసేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మధు చెప్పారు. తాతా మధును నారాయణగూడ పీఎస్కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మధు, నవీన్లను ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.ఇటు.. అసెంబ్లీ గేటు వద్ద నిన్నటి పరిణామాల నేపథ్యంలో పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి సహా మరికొందరిపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టినట్లు తెలుస్తోంది.తాతా మధు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కలత చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో కంటతడి పెట్టారు. ఆ సమయంలో ‘‘మధు వ్యాఖ్యలు స్పీకర్కే కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: గొంతులు నొక్కారు.. చీరలు లాగారు.. -
పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
హైదరాబాద్: వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) క్యూర్ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ, వైష్ణవి ఎంక్లేవ్లో నివాసం ఉంటోంది. ఏడాది నుంచీ ఇక్కడే ఉంటున్న డాక్టర్ కీర్తి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాఘవను వివాహం చేసుకుంది.పనిపై భర్త రాఘవ తిరుపతికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఇంటి పైపోర్షన్లోనే కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కీర్తి ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. దీంతో వారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా కీర్తి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 6 నెలలకే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం క్రితం తిరుపతికి వెళ్లిన భర్త ఎందుకు తిరిగిరాలేదు... భార్యతో గొడవపడి వెళ్లాడా లేక ఏదైనా పనిపై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారని, వారిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి తెలిపారు.ఇవీ చదవండి: కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్! -
ఏడాది గడిచినా మెట్రో టేకోవర్ పూర్తి కాలేదు.. అసలు సమస్య ఏంటి?
సాక్షి, హైదరాబద్: చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ ఏడాది కాలన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఎల్అండ్టీ సంస్థకు ఇంకా రుణాలు చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఎల్అండ్టీ నిర్వహణలోనే ఉంది. రెండో దశ పైన కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన లభించినప్పటికీ మొదటి దశ టేకోవర్ పూర్తయితే తప్ప రెండోదశపై ముందడుగు వేయలేని పరిస్థితి.ఎల్అండ్టీకి చెల్లించాల్సిన రూ.1461.47 కోట్లతో పాటు రూ.13,538.53 కోట్ల బ్యాంకు రుణాల రీఫైనాన్సింగ్ కోసం ఐఆర్ఎఫ్సీ నుంచి ఎస్బీఐ క్యాపిటల్ సంస్థను ఆశ్రయించడం మినహా ఈ ఏడాది కాలంలో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. రుణ సేకరణ కోసం మెట్రోరైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల ముంబయిలో ఎస్బీఐ క్యాపిటల్ సంస్థతో సమావేశమై రుణాల చెల్లింపు కోసం నిధులను త్వరగా అందజేయాలని కోరారు.స్వాదీన ప్రక్రియ ప్రారంభం ఇలా...రెండో దశకు అనుమతినివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2024లో కేంద్రాన్ని కోరింది. డీపీఆర్లను అందజేసింది. కానీ సాంకేతిక సమస్యల దృష్ట్యా తొలిదశ నిర్వహణపై ఎల్అండ్టీతో స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుంటే మినహా అనుమతినివ్వలేమని కేంద్రం చెప్పింది.ఈ క్రమంలో ఎల్అండ్టీ సంస్థతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా అప్పటికే రూ.5000 కోట్ల అప్పుల భారం పడడంతో ఇక మెట్రో రైళ్లను నడుపలేమంటే గతేడాది సెపె్టంబర్ మొదటి వారంలో ఎల్అండ్టీ చేతులెత్తేసింది. మెట్రో నుంచి వైదొలగనున్నట్లు స్పష్టంగా ప్రకటించింది.ఎల్అండ్టీ నుంచి మొదటి దశను స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆ తరువాత స్వా«దీన ప్రక్రియలో అడుగులు పడ్డాయి.ఒప్పందం కుదిరింది...ఎల్అండ్టీ సంస్థ నుంచి పూర్తి ఈక్విటీ కొనుగోలు (షేర్ పర్చేస్ అగ్రిమెంట్) కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ అండ్ టీ (ఎల్అండ్టీ) సంస్థకు చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను రూ.1,461.47 కోట్లు చెల్లించి కొనుగోలు చేయడానికి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)కుదుర్చుకుంది.ఎల్ అండ్ టీ పేరిట ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల రుణాన్ని రీఫైనాన్స్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ బదిలీ విలువ సుమారు రూ.15,000 కోట్లుగా ఖరారైంది.ఐఎఆర్ఎఫ్సీ నుంచి నిధులను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కానీ తుది దశలో ఆ సంస్థ నిరాకరించడంతో ఈ ప్రక్రియ మొదటికొచ్చింది.ఇవీ చదవండి: నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు! -
నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు విస్తృత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. భారీ విగ్రహాల నిమజ్జనం, లక్షలాది మంది భక్తుల రాక, ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, చెత్త పేరుకుపోవడం వంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు వివిధ విభాగాల సమన్వయంతో కార్యాచరణ రూపొందించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్లు, ఈతగాళ్లు, పడవలు, వైద్య శిబిరాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్య బృందాలను అందుబాటులో ఉంచనున్నారు.జీహెచ్ఎంసీలో 47 చెరువులు.. జీహెచ్ఎంసీ పరిధిలో 47 సరస్సులు, చెరువుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో 17 సరస్సులు, 30 చెరువులు, కొలనులు ఉన్నాయి. వీటి వద్ద 110 క్రేన్లు కేటాయించే ప్రణాళిక సిద్ధమైంది. ఖైరతాబాద్, అంబర్పేట, జల్పల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో 41 క్రేన్లు, ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద 21 క్రేన్లు ఉంటాయి. నిమజ్జన ప్రాంతాల వద్ద 770 మంది పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.సైబరాబాద్ పరిధిలో 54 నిమజ్జన కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. వీటిలో 32 సరస్సులు, 13 బేబీ పాండ్లు, 7 తాత్కాలిక పాండ్లు, ఒక పోర్టబుల్ పాండ్, మరో పాండ్ ఉన్నాయి. 81 క్రేన్లు, 1,138 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 130 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో కొత్త తాత్కాలిక నిమజ్జన పాండ్లను ప్రతిపాదించారు. దుర్గం చెరువు, అంబీర్ చెరువు, పరికి చెరువు, ఐడీఎల్ లేక్, ఊర చెరువు, పెద్ద చెరువు లతోపాటు కొల్లూరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 1,138 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.కేబుళ్ల తొలగింపు..తాత్కాలిక లైట్లు నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాల్లో ఫోకస్ లైట్లు, తాత్కాలిక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న కేబుళ్లను తొలగించనున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులు, ఫుట్పాత్లకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టనున్నారు.రంగంలో గణేశ్ యాక్షన్ టీమ్స్ నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చెత్త పేరుకుపోకుండా గణేశ్ యాక్షన్ టీమ్స్(జీఏటీ)ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆయా మార్గాల వారీగా పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించి మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా: సీఎండీ ఖైరతాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని, అలాగే ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గణేష్ ఉత్సవాలపై సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాల వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్టాండ్బై జనరేటర్లు ఏర్పాటు చేయాలని, నగరానికి విద్యుత్ సరఫరా అందించే 220 కేవీ, 132 కేవీ స్టేషన్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.ఎంఎంసీలో 40 ప్రాంతాల్లో..మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియ కోసం 84 క్రేన్లు, 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 62 మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ చెరువుల వద్ద క్రేన్లు..రోడ్లపై జీఏటీలు, వినాయకులను తరలించే మార్గాల్లో బారికేడ్లు.. అత్యవసర సేవలకు వైద్య, ఫైర్, రెస్క్యూ బృందాలు, విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బంది సిద్ధంగా ఉండనున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించేందుకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్కృష్ణారెడ్డి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: తెలంగాణకు ఇది చీకటి రోజు -
గొంతులు నొక్కారు.. చీరలు లాగారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటన అత్యంత హేయమని, సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని, చీరలు పట్టుకుని లాగారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఆరోపించారు. మహిళల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం లేదని విమర్శించారు.పోలీసుల ముసుగులో కొందరు గూండాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది అసెంబ్లీనా?.. రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన గొంతు, జుట్టు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అడ్డుకోకుంటే తమను కిందపడేసి పోలీసులు తొక్కేవారని అన్నారు.ప్రశ్నిస్తే గొంతు పిసికే పరిస్థితిప్రశ్నిస్తే గొంతు పట్టుకుని పిసికే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని సబిత విమర్శించారు. జరిగిన ఘటనను మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాగా పేర్కొనడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి అహంకారం పెరిగిపోయిందని, ఘటనపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవికి సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా పోలీసులు గొంతులు నొక్కారని కంట తడిపెట్టారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతోందన్నారు. తమ టీషర్టులపై ముఖ్యమంత్రి మాట్లాడే బూతు భాష లేదని, కేవలం హామీల అమలు కోరుతూ నినాదాలున్నాయని కోవా లక్ష్మి తెలిపారు. పోలీసులు కేటీఆర్ గొంతు పట్టుకుని లాగారని, హరీశ్రావు చొక్కా చించారని, జగదీశ్రెడ్డి స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు.ఇవి కూడా చదవండి: దాడికి రేవంత్రెడ్డిదే బాధ్యత -
దాడికి రేవంత్రెడ్డిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి హోదాలో రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ‘ఆడ బిడ్డల చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన?..’ అని నిలదీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ భయపడుతోంది..తప్పు చేయకుంటే ప్రజా సమస్యలను ఎజెండాలో పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో తమకూ ఉందని అన్నారు. ‘రాహుల్గాంధీ నల్ల టీ షర్టు వేసుకుని, నినాదాలు చేస్తూ పార్లమెంట్కు వెళ్తే అడ్డుకోరు.. మేం అదే చేస్తే పోలీసులు అడ్డుకుంటారా?..’ అని నిలదీశారు. రేవంత్రెడ్డి గతంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారంటీ అని చెప్పారని, ఇప్పుడు తమ నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.గతంలో మేం క్షమాపణ చెప్పాం..సీఎం కూడా ఎమ్మెల్యేనే అని, స్పీకర్ పక్షపాత వైఖరి వీడి అందరికీ సమాన నిబంధనలు వర్తింపజేయాలని కేటీఆర్ కోరారు. తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదిస్తూ అసలు దాడి ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు కేసీఆర్ ఆదేశాలతో తాము క్షమాపణ చెప్పామని, అదే తమ సంస్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని, మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.దళితులపై రేవంత్ కపట ప్రేమదళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దళిత బంధును ఎత్తివేసి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తమ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.జగదీశ్రెడ్డికి పరామర్శనిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని కేటీఆర్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన క్షేమ సమాచారాన్ని కేటీఆర్ వైద్యులనడిగి తెలుసుకున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. -
ఉద్యోగ సమస్యలపై ఐక్యంగా పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటం మరింత బలపడింది. ఇప్పటివరకు రెండు జేఏసీలుగా కొనసాగుతున్న ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ)కి రాష్ట్ర చైర్మన్గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతుండగా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మరో జేఏసీ కొనసాగుతోంది. కొంతకాలంగా ఈ రెండు జేఏసీలు ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై వేర్వేరుగా ప్రకటనలు, నిరసనలు చేపడుతున్నాయి. ఇటీవల పెన్షన్ విద్రోహదినం, ఇతర నిరసనలను కూడా వేర్వేరుగా నిర్వహించడంతో ఉద్యోగ వర్గాల్లో గందరగోళం నెలకొంది. విడివిడిగా ఉద్యమిస్తుండటం వల్ల ప్రభుత్వ హామీల అమలు, సమస్యల పరిష్కారం వేగవంతం కావట్లేదనే భావన ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. దీంతో ఈ సందిగ్ధతకు టీజీఈజేఏసీ చెక్ పెట్టింది. వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని జేఏసీ మద్దతు కోరగా ఆయన వెంటనే టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావుతో సోమవారం భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడేందుకు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఉద్యోగుల కోసం చేస్తున్న ఉద్యమంలో టీజీఈజేఏసీతో కలిసి ఉంటానని లచ్చిరెడ్డి వెల్లడించారు. ‘చలో హైదరాబాద్’తప్పకుండా నిర్వహిస్తాం: మారం జగదీశ్వర్ ఈ నెల 10న చలో హైదరాబాద్ నిరసనను తప్పకుండా నిర్వహిస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని టీజీఈజేఏసీ తీర్మానించింది. సోమవారం టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీజీఈజేఏసీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చలో హైదరాబాద్కు ప్రతి ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావాలని చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అన్ని సంఘాల ప్రతినిధుల ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ‘మన హక్కుల సాధన కోసం ఐక్యంగా కదులుదాంం. చలో హైదరాబాద్ను విజయవంతం చేద్దాంం. లక్ష మందితో హైదరాబాద్ను కదిలిద్దాం’అని నినాదాలు చేశారు. -
కమ్యూనిస్టులు– కాంగ్రెస్ కలిసి పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత ప్రమాదకరమైన మోదీని గద్దె దించేందుకు జాతీయస్థాయిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇప్పటి నుంచే పునాది వేయాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తే ప్రజా సమస్యలకు తమ ప్రభుత్వం సహేతుకమైన పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు అక్రమ పద్ధతులను బీజేపీ అనుసరిస్తుందని, అందులో భాగంగానే ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తుందని ధ్వజమెత్తారు. సీపీఎం సీనియర్ నేత, రైతాంగ ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరు ఓడాలో, గెలవాలో ఎన్నికల సంఘం నిర్ణయించే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన కొడంగల్లోనే వలస వెళ్లిన పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని, సుమారు 81 వేల ఓట్లను అనుమానాస్పద ఓట్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బిహార్, పశ్చిమబెంగాల్లో గెలిచిన విధంగానే, ఓట్లను తొలగించిన విధానాన్ని తెలంగాణలో అమలు చేసి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించి, తమకు అనుకూలంగా ఉండేందుకు ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 33 శాతం ఓట్లను తొలగిస్తున్నప్పుడు మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక్కరు మాట్లాడడం లేదన్నారు. రైతాంగానికి ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా’సారంపల్లి మల్లారెడ్డి సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై అపారమైన అవగాహన ఉన్న నాయకుడని రేవంత్రెడ్డి కొనియాడారు. భూసారం నుంచి విత్తనం, పెట్టుబడి, పంట, కౌలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర వరకు వ్యవసాయ రంగంలోని ప్రతి అంశంపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి ప్రత్యేకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. మల్లారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిపేలా రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని సీఎం తెలిపారు. ప్రమాదంలో’లౌకికవాదం, ప్రజాస్వామ్యం : ప్రకాశ్ కారత్ దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్లు, ఆదివాసీలు లక్ష్యంగా ఎస్ఐఆర్ కింద ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను సందేహాస్పద ఓట్లుగా మిగిలాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు తొత్తుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం రైతులు, పేదలు, కార్మికుల సమస్యల కోసం పోరాడిన నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సభలో నేతలు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షత వహించగా, మంత్రి అజహరుద్దీన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, తమ్మినేని వీరభద్రం, వీరయ్య, జ్యోతి, మల్లు లక్ష్మి, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి రచన ‘నాగేటి సాళ్లు’పుస్తకాన్ని ప్రకాశ్ కారత్ ఆవిష్కరించగా, మల్లారెడ్డిపై ప్రజానాట్యమండలి రూపొందించిన పాటల సీడీని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. -
తెలంగాణకు ఇది చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే ఇది చీకటి రోజని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అవమానకర వ్యాఖ్యలు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు సోమవారం తీవ్ర దుమారం రేపాయి. భోజన విరామం తర్వాత శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. తాతా మధు వ్యాఖ్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించారు. అప్పటికే బీజేపీ సభ్యులు 22ఏ పై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్లకార్డులతో బైఠాయించారు. బీఏసీలో చర్చ తర్వాత ఈ అంశాన్ని చేపడదామని, స్పీకర్కు జరిగిన అవమానంపై చర్చ అత్యంత ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. బీఆర్ఎస్ను కాపాడుతున్నారనే అనుమానం కలిగించొద్దు ‘స్పీకర్ పదవి అంత అత్యున్నతమైనది. అన్ని పార్టీల మద్దతుతో ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తిని గౌరవించడం అందరి బాధ్యత. సభలో సీఎం అయినా, శాసనసభ్యుడైనా సభాపతికి ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటి స్పీకర్ మనసు ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యల వల్ల గాయపడింది. దీన్ని గడ్డం ప్రసాద్కుమార్కు జరిగిన అవమానంగానే చూడకూడదు. యావత్ తెలంగాణ సిగ్గుపడే ఘటన ఇది. మనుషులు ప్రయోగించలేని, సభ్య సమాజం సహించలేని భాష వాడి, అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఇంతకన్నా చర్చనీయాంశం మరొకటి ఉండదని బీజేపీ గుర్తించాలి. చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ దుర్మార్గాలను కాపాడుతున్నారనే అనుమానం ప్రజలకు కలిగేలా వ్యవహరించవద్దు. ఫాంహౌస్ నుంచి సభ్యులను పురిగొల్పారు.. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు బీఆర్ఎస్ నాయకుడు ఫాంహౌస్లో సమావేశం ఏర్పాటు చేసి తన సభ్యును పురిగొల్పారు. పోలీసులపై దాడి చేసి, సభాపతిని దూషించడమంటే క్షమించరాని నేరం. ఇది అనాలోచిత చర్య కాదు.. తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతితో పాటు కుటుంబ సభ్యులను అవమానించారు. బీఆర్ఎస్ పుట్టినప్పుడు, విజయం సాధించినప్పుడు దళితులనే ఆయుధంగా వాడారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తానని, దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని నమ్మించి, దళిత బంధు ఇస్తానని నమ్మించిన పార్టీ బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చాక దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ఆ పార్టీది దళిత వ్యతిరేక ఆలోచన. తల్లిని దూషిస్తే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది ఇలాంటి సంఘటన స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇలాంటి పోకడలను నియంత్రించకపోతే రాబోయే తరాలు ఈ సభను కూడా క్షమించవు. తల్లిని అవమానించే విధంగా మాట్లాడితే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది. ఇలాంటి చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉంది. విశృంఖలత్వం, అడ్డగోలుతనం, ఏం మాట్లాడినా చెల్లుతుందనే అహంకారం, ఏం చేసినా చూసుకోవడానికి ఫాం హౌస్లో తమ నాయకుడు ఉన్నాడనుకునే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమించి ఊరుకుంటే చట్టసభలకు విలువ ఉండదు. దీనిపై చర్చించి స్వయం నియంత్రణ విధానం తేవాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు. -
రణరంగం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డు కోవడం తోపులాటకు దారితీసింది. నేతలు కింద పడిపోవడం, అస్వస్థతకు గురికావడం, నిరసనలు, నినాదాలు, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు దారి తీసింది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మండిపడింది. సభలో అడుగు పెట్టక ముందే తమను అడ్డుకుని, తమ పార్టీ సభ్యులపై పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించింది. పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా ఎమ్మెల్యేల గొంతు పిసికారని, చీరలు లాగారనే ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇది శాసనసభా? కౌరవసభా? అని బీఆర్ఎస్ నిలదీసింది. మరోవైపు పోలీసులతో జరిగిన వాగ్వాదం సందర్భంగా శాసనసభ స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం మండిపడింది. సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. సదరు సభ్యుడితో రాజీనామా చేయించి, ప్రతిపక్ష నేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తమపై జరిగిన దాడికి సీఎం రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని, హోంమంత్రిగానూ వ్యవహరిస్తున్న ఆయనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఘటనలు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నడుమ సభ లోపలా, బయటా ఆరోపణలు, విమర్శలు, పరస్పర సవాళ్లకు తెరతీశాయి. విలపిస్తున్న సునీతారెడ్డిని ఓదారుస్తున్న సబితారెడ్డి టీషర్టు విప్పి లోనికి అనుమతించాలన్న హరీశ్రావు సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్పార్కు వద్ద ఉన్న అమరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరయ్యేందుకు నల్లని టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ అసెంబ్లీ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. ‘హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అంటూ టీషర్టులపై నినాదాలు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మెయిన్ గేటు వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్రావు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో హరీశ్రావు, జగదీశ్రెడ్డి కిందపడిపోయారు. దీంతో ఆగ్రహించిన హరీశ్రావు తాను ధరించిన నల్ల టీ షర్టును విప్పి విసిరేశారు. ఎలాంటి నినాదాలు లేనందున తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి కూడా టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసు వాహనంలో తెలంగాణ భవన్కు తరలించారు. మహిళా నేతల ఆవేదన అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో హరీశ్రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కిందపడిపోయారు. జగదీశ్రెడ్డి అస్వస్థతకు గురికాగా.. ఎమ్మెల్యేలు సుదీర్రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సపర్యలు చేశారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేటీఆర్ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జుట్టు పట్టుకుని, గొంతు నొక్కారని సబిత ఆరోపించగా, తన చీర లాగారంటూ సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సబిత, సునీత, కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, మాధవరం కృష్ణారావు తదితరులు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
ఆటో ఛార్జీలు పెరగనున్నాయా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆటో ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, పర్మిట్ల సమస్యలు, బీమా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఆటో కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో ప్రస్తావించిన సమస్యలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు. సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.2012 తర్వాత పెరగని ఆటో ఛార్జీలుఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2012 తర్వాత ఛార్జీలు పెరగలేదని, ప్రస్తుతం పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఛార్జీలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఛార్జీలు ఎంత మేర పెంచాలన్న అంశాన్ని పరిశీలించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ఛార్జీల పెంపును అమలు చేసే అవకాశం ఉంది.ఆర్టీసీ ఈవీ ఆటోలపై దుష్ప్రచారమేటీజీఎస్ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ ప్రత్యేక యాప్ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయి. ఓలా, ఉబెర్, ర్యాపిడో తరహాలో పనిచేసే యాప్ రూపకల్పనపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డుఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకోనుంది. ఈ ప్రతిపాదనను కేబినెట్లో చర్చించిన అనంతరం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రులు తెలిపారు. బోర్డు ద్వారా ఆటో కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.పెండింగ్ పర్మిట్లకు పరిష్కారంజీఓ ఎంఎస్ నంబర్ 263 కింద తిరస్కరించబడిన కేసులతో పాటు గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్లో ఉన్న ఆటో రిక్షా పర్మిట్ల కోటాను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.అగ్రిగేటర్ పాలసీపై ప్రత్యేక అధ్యయనంఅగ్రిగేటర్ల ద్వారా వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రం ప్రకటించిన అగ్రిగేటర్ పాలసీలో ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించే అవకాశం ఉన్నందున దీనిపై రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అగ్రిగేటర్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావాన్ని పరిశీలించనున్నారు.ఇతర జిల్లాల ఆటోలపై నిబంధనలు కఠినంఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆటో సంఘాల ప్రతినిధులు కోరారు. దీనిపై రవాణా శాఖ స్పందిస్తూ నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నిబంధనల అమలులో నగరంలోని ఆటో కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.సారథి పోర్టల్ సమస్యకు పరిష్కారంఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ విషయంలో సారథి పోర్టల్లో స్పష్టత లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్నవారు ఆటో నడిపే విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి స్పష్టత కోరనున్నట్లు తెలిపారు.18,700 ఆటోలకు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు రెట్రోఫిట్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని సుమారు 18,700 ఆటోలకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా పాలసీఆటో డ్రైవర్ల ప్రమాదాలు, సహజ మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పథకాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశంపై కార్మిక శాఖతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ పాలసీ’ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు.సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయంఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఆటో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణతో పాటు కార్మిక శాఖ, పోలీస్, ట్రాఫిక్ శాఖల అధికారులు, వివిధ ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును పొడిగించారు. అభ్యంతరాలను స్వీకరించే గడువు గత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 16 వరకు ఉంది. అయితే, దీన్ని ఇప్పుడు అక్టోబరు 7 వరకు పొడిగించారు. తుది జాబితాను గత షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 19న ప్రకటించాల్సి ఉండగా, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు నవంబరు 9న ప్రకటిస్తారు. సీఈవో కీలక సమావేశంతెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్ రెడ్డి సోమవారం అదనపు సీఈవో డాక్టర్ వసం వెంకటేశ్వర్ రెడ్డి, ఉప సీఈవో జి.ఎస్. చారి కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)-2026పై జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఓటరు నమోదు అధికారులు (ఈఆర్ఓలు)తో వీడియో సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఎస్ఐఆర్-2026 కింద నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన దృష్టి సారించి, ఈ కింది సూచనలు చేశారు.నోటీసుల పంపిణీ: ప్రతి నోటీసును సంబంధిత ఓటరుకు బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) వ్యక్తిగతంగా అందజేసేలా చూడాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల చిరునామాలను గుర్తించేందుకు బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏలు) సహాయం బీఎల్ఓలు తీసుకోవాలి.పెండింగ్ కేసుల పరిష్కారం: జిల్లాలకు అందించిన అదనపు లాగిన్లను వినియోగించి పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించేలా చూడాలి.అన్-మ్యాపింగ్, అసాధారణ కేసుల జాబితాలు: రాజకీయ పార్టీల సమావేశాల్లో అన్-మ్యాపింగ్, అసాధారణతల కేసుల జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేయాలి. క్లెయిమ్లు, అభ్యంతరాల కాలంలో బీఎల్ఏలు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలి.పత్రాల అప్లోడ్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు పత్రాలను సరిగ్గా అప్లోడ్ చేయాలి. కంప్యూటర్ ఆపరేటర్లు ఎలాంటి తప్పులు చేయకూడదు. వారి పర్యవేక్షణలో కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన తప్పులకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు బాధ్యత వహించాలి.విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగుల (పీడబ్ల్యూడీలు) ఇళ్లకు సూపర్వైజర్లు వెళ్లాలని ఆదేశించారు. ఓటర్లకు సహాయం చేసేందుకు ఈఆర్ఓ, డీఈఓ స్థాయిలో సహాయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి.అదనంగా, నోటీసుల అందజేత, విచారణల షెడ్యూల్, ఈఆర్ఓ, డీఈఓ లాగిన్లలో పెండింగ్ కేసుల పరిష్కారంపై అన్ని జిల్లాల డీఈఓలతో ప్రధాన ఎన్నికల అధికారి పురోగతిని సమీక్షించారు. -
‘ఇది తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం’
హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.ఇదీ చదవండి:నల్లదుస్తులతో వస్తే తప్పేంటి?: సబిత ఫైర్ -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ తీరును, పోలీసుల జోక్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.అసెంబ్లీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎలా అడ్డుకుంటారు? అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధిలోకి వస్తుంది, అక్కడ పోలీసులకు ఏం పని? అని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. నిరసన సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పూర్తి ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తం అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. -
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది : తాతా మధు
సాక్షి,హైదరాబాద్: పోలీసులు తనపై దుర్మర్గంగా వ్యవహారించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. బీఆర్ఎస్పై జరుగుతున్న దాడిని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు నాటకాలాడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మరోవైపు తాతా మధు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్పై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా తాతా మధు మీడియాతో మాట్లాడుతూ... నేను స్పీకర్ను దూషించలేదు. స్పీకర్ చైర్పై నాకు అపారమైన గౌరవం ఉంది. పోలీసులు నాపై దుర్మార్గంగా వ్యవహారించారు. అనారోగ్యంతో ఉన్న నన్ను పోలీసులు గొంతు పట్టుకున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రక్షణ లేకుండా పోయింది. నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసులపైనే మాట్లాడాను. కాంగ్రెస్ కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. బీఆర్ఎస్పై దాడిని కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం రేవంత్రెడ్డి స్పందన తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘చెప్పలేని భాషతో స్పీకర్ను దూషించారు. చట్టసభ నుంచి తాతా మధును డిస్మిస్ చేయాలి. తాతా మధు చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఇది సభకు జరిగిన తీవ్ర అవమానం. కేసీఆర్ ఫాంహౌస్లో కుట్రకు ప్లాన్ వేసి, ఈరోజు అసెంబ్లీ ముందు ఆ ప్లాన్ను అమలు చేశారు. సభాపతినే కాదు, సభాపతి కుటుంబ సభ్యులను కూడా అవమానించారు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి,హైదరాబాద్: యూకే వీసా స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నందన దంపతులపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె కదలికలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.లండన్లో పర్మినెంట్ ఉద్యోగాలు, భారీ వేతనాలు ఇప్పిస్తామని నందన దంపతులు పలువురికి ఆశ చూపారు. ఈ నకిలీ ఉద్యోగాల ఆశతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న అనంతరం, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ఏపీలోని కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ మోసంలో ఆమె భర్త మధుకర్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నందనపై ఉన్న కేసులు, లుక్అవుట్ నోటీసుల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్లో ఏం జరుగుతోంది? -
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్తున్న ఒక జంట అఫ్జల్గంజ్లో బస్సు దిగుతుండగా పొరపాటున తమ డబ్బుల సంచిని బస్సులోనే మర్చిపోయారు. అయితే దీన్ని గుర్తించిన ఆర్టీసి ఉద్యోగిని, తిరిగి ఆ బ్యాగును సంబంధిత వ్యక్తులకు అప్పగించడం విశేషంగా నిలిస్తోంది. అఫ్జల్గంజ్ వద్ద బస్సులో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పలు ప్రశంసలు దక్కించుకుంటోంది. వివరాలు ఇన్నా ఉన్నాయి... షాద్నగర్కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్ , ఆయన భార్య హైదరాబాద్ సిటీ బస్సు ఎక్కారు. అఫ్జల్గంజ్ వద్ద దిగిన ఆ తర్వాత, వారు నాంపల్లి వైపు వెళ్లారు ఆ హడావిడిలో, రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను పొరపాటున బస్సులోనే వదిలివేశారు. కాసేపటికే తమ పొరపాటును గ్రహించిన ఆ దంపతులు ఆందోళనతో బస్సు స్టాండ్కు తిరిగి వచ్చారు.అదే సమయంలో, TGSRTC కండక్టర్ సరిత (ఎంప్లాయి నంబర్: 152270) బస్సులో ఎవరూ లేని బ్యాగ్ను గమనించారు. ఆమె వెంటనే డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, ఆ నగదు సురక్షితంగా ఉండేలా చూశారు. ఇంతలో బ్యాగు పోగొట్టుకున్న జహంగీర్ , ఆయన భార్య బస్సు స్టాండ్కు చేరారు. దీంతో సరిత, నరసింహులు ఆ రూ. 3 లక్షల నగదును వారికి అప్పగించారు. దీంతో వారి సంతోషానికి అవధుల్లేకుండాపోయింది.ఇదీ చదవండి : నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా𝐓𝐆𝐒𝐑𝐓𝐂 𝐜𝐨𝐧𝐝𝐮𝐜𝐭𝐨𝐫 𝐫𝐞𝐭𝐮𝐫𝐧𝐬 ₹𝟑 𝐥𝐚𝐤𝐡 𝐜𝐚𝐬𝐡, 𝐚𝐬 𝐇𝐚𝐣 𝐛𝐨𝐮𝐧𝐝 𝐜𝐨𝐮𝐩𝐥𝐞 𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐬 𝐢𝐧 𝐛𝐮𝐬A Telangana State Road Transport Corporation (TGSRTC) conductor returned ₹3 lakh in cash after a Haj-bound couple accidentally left their money… pic.twitter.com/tCIblqD9fS— Sudhakar Udumula (@sudhakarudumula) September 6, 2026మరోవైపు కండక్టర్ నిజాయితీని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రయాణికుడి డబ్బును తిరిగి ఇచ్చినందుకు ఆయన సరితను అభినందించారు. నిజాయితీ, చిత్తశుద్ధితో బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ఇదొక ఉదారణ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! -
కేసీఆర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నీళ్ల సమస్యకు కేసీఆర్ కూడా ఓ కారణమేనని, ఇరిగేషన్ను నాశనం చేసిందే ఆయనని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా చిట్చాట్లో ఉత్తమ్ మాట్లాడుతూ..తెలంగాణలో నీటి సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ అయితే.. రెండోది ఎల్నినో ప్రభావం. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు. నీళ్ల పంపకాల విషయంలోనూ అన్యాయం చేశారు. ఆయన వల్లే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి. భారీగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగా నిర్మించి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నేనే ఇంజనీర్ను అంటూ కాళేశ్వరం కట్టి మరీ కూల్చారు. ఇంజినీర్లు చెప్పినట్లు ఉంటే.. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యి ఉండేది. ఆయన హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసినా ఆశించిన మేర ఆయకట్టుకు నీరందలేదు. ఇదే కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన ఇలాగే చేశారు. అసలు ఎస్ఎల్బీసీని పూర్తి కాకుండా గత ప్రభుత్వమే అడ్డుకుంది. ప్రస్తుతం మా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయితే మేమేం చేయగలం?’’ అని ఉత్తమ్ చెప్పారు.కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు కొందరు ఆయన్ను హీరోగా భావించారని, ఇప్పుడు అదే తరహా విమర్శలు ఆయనపై వస్తే మాత్రం నానాయాగీ చేస్తున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు. తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆర్ రే కారణం. కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం జీరో. నీళ్ల కోసం పాదయాత్ర చేస్తానన్న కేసీఆర్ ప్రకటనపైనా ఉత్తమ్ స్పందిస్తూ.. ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని, ఇరిగేషన్ విషయంలో ఆయన బయటకు రాకుండా ఫామ్హౌజ్లో ఉంటేనే బెటర్ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ నీటి రాజకీయ వివాదం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఇరిగేషన్పై బీఆర్ఎస్ది బోగస్ ప్రచారమే! -
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్షంపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగారు. సోమవారం ఉదయం నల్ల టీషర్లుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ దుస్తులతో అనుమతించబోమని చెప్పారు. అయితే తమను లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో మెయిన్గేట్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నేల మీద పడుకుని పలువురు నేతలు నిరసన తెలిపారు. తన టీ షర్ట్ తీసేసి.. ఇప్పుడైనా అనుమతించాలని హరీశ్రావు కోరారు. అయినా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో వాగ్వాదం కాస్త.. తోపులాటగా మారింది. పోలీసులు నెట్టేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. కేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026ఈ క్రమంలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు మెడ బట్టి నెట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గాయాలయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయి. తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టగా.. సబిత ఓదార్చారు. ఆపై హరీష్రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డినలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుకౌరవ సభలా మారిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు https://t.co/0Nua3mziEr pic.twitter.com/Ada7X5MXwj— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ వద్ద తమకు అవమానం జరిగిందని.. పోలీసులు తమతో ప్రవర్తించిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.స్పీకర్ చెబితేనే: డీసీపీ శిల్పవల్లిఅసెంబ్లీ గేటు వద్ద పరిణామాలపై స్థానిక డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతించొద్దని స్పీకర్ ఆదేశించారని.. అందుకే అడ్డుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో నిజం లేదని.. తామేం అమర్యాదగా నడుచుకోలేదన్నారు. అలాగే.. వద్దని చెబుతున్నా బలవంతంగా నిరసనలకు దిగడంతోనే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.ఇదీ చదవండి: ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన రేవంత్రెడ్డి -
బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే ప్రతిపక్షం దూకుడును ముందే పసిగట్టిన రేవంత్ ప్రభుత్వం కౌంటర్కు దిగింది.22ఏ భూముల వ్యవహారంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనా చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరఫున ఈ అంశాలపై చర్చకు ప్రతిపాదనను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పెట్టనున్నారు. సమావేశంలో చర్చించి వీటిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ లేవనెత్తాలనుకున్న అంశాలనే అధికార పక్షం చర్చకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.22ఏపై ఇప్పటికే రగడతెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం కొంతకాలంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. 22ఏ జాబితాలో భూములు చేరడంలో అధికారుల తప్పిదాలపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పారు. రిజిస్ట్రేషన్ సాధ్యం కాని కేసుల్లో అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు.ఫీజు రీయింబర్స్మెంట్పైనా ఫోకస్మరోవైపు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించనుంది. విద్యార్థులు, కళాశాలల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైనా చర్చకు సిద్ధమని చెబుతోంది. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో నిధుల విడుదలపై హామీలు ఇచ్చారు. ఆగస్టులో ప్రభుత్వం రూ.2,400 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.నల్ల టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసనఅసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్లతో నిరసనకు సిద్ధమయ్యారు. 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు రైతులు, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలనూ సభలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రధానంగా నిలదీయాలనుకుంటున్న 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుండటం ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.నేడు అసలు సమరం!సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను సీఎం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వివిధ నివేదికలను సభ ముందుంచనున్నారు.ఇదీ చదవండి: ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు -
బతికున్నారని.. తిరిగొస్తారని..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడే చేరుకున్నామంటూ సమాచారం ఇచ్చినవారు కొందరు.. ఇందాకే బయలుదేరామంటూ కబురందించినవారు ఇంకొందరు.. ఇంకాసేపట్లో గమ్యం చేరుకుంటామనే మాటచెప్పిన వారు మరికొందరు.. ఆ కొద్దిసేపటికే వారంతా అదృశ్యమయ్యారు. అప్పటి వరకు మాట్లాడిన, సంబంధాలు కలిగి ఉన్నవారు ఆకస్మిక జల ప్రళయంలో నగరానికి చెందిన సుమారు 15 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. గత నెల 26న నేపాల్లో హఠాత్ వరదల్లో ఆచూకీ లేకుండాపోయినవారి కుటుంబీకుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇంకా కొన్ని ప్రయత్నాల అనంతరం అదృశ్యమైన వారి స్థితి ఇదంటూ అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం తమవారు బతికున్నారని.. ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ జ్ఞాపకాల్లో కుటుంబాలు.. నగరానికి చెందిన నేపాల్ వరద బాధిత కుటుంబాల్లో ఎవరిని పలకరించినా అదృశ్యమైన వారి జ్ఞాపకాలే వెంటాడుతున్నాయని చెబుతున్నారు. తమవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే రోజులు గడిచిపోతున్నాయని చెబుతున్నారు. విహార/తీర్థ యాత్ర తమకు ఇంతటి విషాదాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని కన్నీంటి పర్యంతమవుతున్నారు. కొందరు కుటుంబీకులు తమ వారి కోసం నేపాల్ వరకు వెళ్లి ఎంతో ఆశతో గాలించి నిరాశతో తిరిగి వచ్చారు. ఆ వరదల్లో తప్పిపోయిన వాళ్లల్లో కొందరు ఇటీవలే వచ్చినట్లు వివిధ రాష్ట్రాల నుంచి వార్తలు వస్తున్నాయని, తమ వాళ్లు కూడా అలానే మృత్యుంజయులు కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆ చిరునవ్వుల కోసం..నాగోలు: నేపాల్ వరదల్లో గల్లంతైన ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసినీ రెడ్డి (44) ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. భారత రాయబార కార్యాలయం అధికారులు ఆమె జాడను కనుగొనాలని తల్లిదండ్రులు మహేందర్రెడ్డి, ప్రేమలతా రెడ్డి కోరుతున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న భర్త సంజీవరెడ్డి, పెద్ద కుమారుడు భారత్కు వచ్చి అనంతరం నేపాల్ వెళ్లారు. భారత రాయబార అధికారులతో మాట్లాడి సుహాసిని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి భారత్కు చేరుకున్నారు. సుహాసిని సమాచారం ఇప్పటికీ తెలియకపోవడంతో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’ -
పబ్లో అర్ధరాత్రి ఘర్షణ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక స్టార్ హోటల్ పబ్లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ సోదరుడు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్లోని ఎనిమిదో అంతస్థులో ‘కారా కారా’ పేరుతో పబ్ ఉంది. శనివారం రాత్రి దాదాపు 2.10 గంటల ప్రాంతంలో పబ్లో దాదాపు 200 మందికిపైగా ఉన్నారు. అదే సమయంలో పబ్లో గోడకు, టేబుల్కు మధ్యలో ఉన్న అనిల్ కుమార్యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ (టిల్లు)ను దాటుకొని వెళ్లడానికి మరో యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న అరవింద్ యాదవ్ స్నేహితులు యువకుడిపై దాడికి దిగారు. ఇది గమనించిన యువకుడి స్నేహితులు సైతం ఒక్కసారిగా రెచ్చిపోయి అరవింద్తోపాటు అతని స్నేహితులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పబ్లో రణరంగం చోటచేసుకొంది. బీరు సీసాలతో చేతులు, కాళ్లతో దాడికి దిగబడటంతో చుట్టు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకొంది. ఈ గొడవలో ఒక యువతి కింద పడిపోయింది. అదే సమయంలో పబ్లోని బౌన్సర్లు వచ్చి ఇరువర్గాలను అడ్డుకొని అక్కడి నుంచి కిందకు పంపారు. వీరంతా హోటల్ సెల్లార్లోకి చేరుకుని అక్కడా ఘర్షణకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్ నిర్వాహకులతోపాటు అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఇరువర్గాలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లో అద్దాలు పగిలి ఉండటంతోపాటు, బల్లలు, కురీ్చలు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో అరవింద్ యాదవ్ టోపీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పబ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని విచారిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమయానికి మించి పబ్ను నడపడంతో మరో కేసు సైతం సుమోటోగా నమోదు చేశారు. -
తెలంగాణకు అలర్ట్.. కాసేపట్లో ఈ జిల్లాల్లో గట్టి వానలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి వాతావరణం మారిపోయింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు అలర్ట్లు జారీ చేయడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, ఆదివారం రాత్రి హైదరాబాద్లో మోస్తరు వర్షం కురిసింది.సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీంతో నగరవాసులు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.SEPTEMBER 7, 2026 FORECAST ⚠️⛈️ Another HUMID DAY followed by fresh SCATTERED THUNDERSTORMS in Telangana from afternoon hours ⚠️⛈️ SCATTERED THUNDERSTORMS expected across Sangareddy, Vikarabad, Rangareddy, Nalgonda, Yadadri - Bhongir, Medak, Siddipet, Jangaon, Kamareddy,…— Telangana Weatherman (@balaji25_t) September 7, 2026సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు, ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు పరిస్థితిని బట్టి ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇక మంగళవారం, బుధవారం తెల్లవారుజాము వరకు మరికొన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, రంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.ఇదీ చదవండి: ఎల్నినో ఎఫెక్ట్.. 30 జిల్లాల్లో పాతాళానికి నీరు.. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.DISTRICTS UPDATE - 6.50 AM ⚠️🌧️ Ongoing SCATTERED MODERATE RAINS across Rangareddy, Suryapet, Khammam, Yadadri - Bhongir (Ramannapeta), Bhadradri - Kothagudem, Mahabubabad (Dornakal) will continue till 8.30/9am later reduce 🌧️👍Another SCATTERED THUNDERSTORMS DAY expected in…— Telangana Weatherman (@balaji25_t) September 7, 2026 -
హిజ్రా మాఫియా: తొలుత రెక్కీ.. తర్వాత రౌండప్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు చింతల్లో హిజ్రాలు శుక్రవారం హల్చల్ చేశారు. గృహప్రవేశం జరుగుతున్న ఇంటికి వెళ్లిన ట్రాన్స్జెండర్ల బృందం వారి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇవ్వడానికి యజమాని ససేమిరా అనడంతో రెచ్చిపోయిన హిజ్రాలు తమ వికృత చేష్టలతో వారికి నరకం చూపించారు. ఈ ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే శుభకార్యాలు జరిగే ఇళ్లు, కొత్తగా ఏర్పా టయ్యే దుకాణాలు/వ్యాపార సంస్థలు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీరి ఆగడాలు నగర జీవికి కొత్తేం కాదు. అనేకమంది వేడుకల సమయంలో వీరి బారినపడ్డ వారే. వీరి విషయంలో పోలీసు విభాగం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండట్లేదనే విమర్శ ఉంది. నిజానికి ప్రభుత్వం హిజ్రాలకు ట్రాఫిక్ పోలీసు, హైదరాబాద్ మెట్రో, హైడ్రాల్లో పని చేయడానికి అవకాశం కల్పిస్తోంది. వీటికి తోడు మరికొన్ని సదుపాయాలు కావాలని హిజ్రాలు కోరుతుండగా.. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే అడ్డగోలుగా వ్యవహరించే హిజ్రాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ‘సాక్షి’తో అన్నారు. కలిసొస్తున్న సెంటిమెంట్! సమాజంలో ఉన్న అసలైన హిజ్రాల కంటే ఆ వేషం వేసుకుని సంచరించే నకిలీలతోనే ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నారు. వీళ్ల వసూళ్ల దందా ఆద్యంతం వ్యవస్థీకృతంగా సాగుతుంది. వీళ్లు సాధారణ రోజుల్లో జంక్షన్లు, దుకాణాల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతూ భిక్షాటన చేస్తారు. ఇక మంచి రోజులు, ముహూర్తాలు ఉన్న సమయంలో వివాహాలు, ఇతరత్రా వేడుకలు, దుకాణాల ప్రారం¿ోత్సవాల వద్దకు చేరుకుంటారు. ఈ సీజన్లో హిజ్రాల్లో కొందరు ఆయా కాలనీలు, రహదారుల వెంట ద్విచక్ర వాహనాలు, ఆట్లో తిరుగుతూ టెంట్లు వేసిన, అలంకరించి ఉన్న ఇళ్లు, వ్యాపార సంస్థల్ని గుర్తిస్తారు. ఈ వివరాలు, లోకేషన్ను ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా తమ వారికి చేరవేస్తారు. ఈ వెంటనే గ్రూపులుగా ఏర్పడే హిజ్రాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో గ్యాంగ్ చొప్పున వెళుతుంది. ఇళ్లు, దుకాణాల యజమానులను చుట్టుముట్టి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే నానా రభస సృష్టిస్తారు. వికృత చేష్టలకు పాల్పడతారు. అశ్లీల పదాలతో దూషిస్తారు. తమకు నచ్చిన మొత్తం అందేదాకా ఇది కొనసాగుతుంది. ఒకరు వసూలు చేసిన చోట మరొకరు వసూలు చేయకుండా ఇంటి గేటు, గోడపై ఓ గుర్తు పెట్టి వెళ్తారు. మరోపక్క అనేక మందికి ఈ హిజ్రాలు శపిస్తే కీడు జరుగుతుందనే సెంటిమెంట్ ఉండటం కూడా వీరికి కలిసి వస్తోంది. కొందరు బాధితులు ఈ కారణంగానే పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదు. కొన్నిసార్లు ఫిర్యాదులు అందినా... చర్యలు తీసుకుంటే ఠాణాల వద్ద హిజ్రాలు చేసే హంగామా, రాద్ధాంతం తట్టుకోలేక పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి. అవకాశాలు వినియోగించుకోవాలి ట్రాన్స్జెండర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక విభాగాల్లో పని చేసేందుకు అవకాశం ఇస్తోంది. నిరక్షరాస్యుల కోసం స్వయం సహాయక సంఘాల మాదిరిగా రుణాలు అందిస్తోంది. వీటిని అందరూ అందిపుచ్చుకోవాలి. అయితే కొందరు ట్రాన్స్జెండర్లలో ఉద్యోగం చేస్తే వచ్చే జీతం సరిపోదనే భావన ఉంది. అందుకే భిక్షాటన, వసూళ్లు చేస్తున్నారు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం జల్సాలకు సరిపోకపోవచ్చు కానీ.. బతకడానికి సరిపోతుంది. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్జెండర్లు తమ పంథా మార్చుకోవాలి. – నవీన, మెట్రో రైల్ సెక్యూరిటీ మాకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం మాకు అవకాశాలు కల్పిస్తున్నా ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా గది అద్దెకు తీసుకుందామంటే యజమానులు ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా రెట్టింపు బాడుగ వసూలు చేస్తున్నారు. ఈ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. నా స్నేహితురాళ్లల్లో సహస్ర చారీ బీఈడీ చేశారు. హనీ సింగ్ హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి వారికి ఆయా రంగాల్లో అవకాశం కల్పించాలి. మైనారీ్ట, ఎస్సీఎస్టీ, బీసీ హాస్టళ్ల మాదిరిగా మాకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేయాలి. మాలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే మరికొందరు ట్రాన్స్జెండర్లు సాధారణ జీవితం గడపడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. – సోఫియా, మెట్రో రైల్ సెక్యూరిటీ ఉన్నతాధికారుల దృష్టికి వేధింపులు: డీజీపీ సీవీ ఆనంద్ ట్రాన్స్జెంటర్లతో ఎదురవుతున్న ఇబ్బందులపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదివారం ‘ఎక్స్’వేదికగా స్పందించారు. హైదరాబాద్లో నకిలీ హిజ్రాల మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్ చేసిన విజ్ఞప్తికి స్పందనగా ఒక పోస్టు పెట్టారు. ‘ట్రాన్స్జెండర్ల వేధింపులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. నిజానికి నేను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయి. అప్పట్లో వీరి బెడదను అరికట్టడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. అలాంటి డ్రైవ్ను మరోసారి చేపట్టాలని పోలీస్ కమిషనర్లను ఆదేశిస్తా. ట్రాన్స్జెండర్లను ప్రధాన సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. హైదరాబాద్లో వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. వాళ్లు కూడా బాగానే పని చేస్తున్నారు..’అని డీజీపీ పేర్కొన్నారు. త్వరలో సమగ్ర విధానం హద్దుమీరి ప్రవర్తించే ట్రాన్స్జెండర్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొందరిపై కేసులు కూడా నమోదు చేశాం. అయితే బాధితుల్లో అనేక మంది ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. ట్రాన్స్జెండర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది వెంటనే ‘112’కు ఫోన్ చేసి మా దృష్టికి తీసుకురండి. సమీప పోలీసుస్టేషన్కూ ఫోన్ చేయొచ్చు లేదా నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం స్పందించి కఠిన చర్యలు తీసుకుంటాం. వీరివల్ల నగరవాసులకు ఎదురవుతున్న సమస్యకు పరిష్కారం కోసం త్వరలోనే సమగ్ర విధానం రూపొందించనున్నాం. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ కొత్వాల్ -
యువత ఉపాధికి గడ్కరీ పిలుపు.. తెలంగాణ ప్లేట్ ఫిరాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలకు కళ్లెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యానికి కారణమవుతోంది. ఒకవైపు యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు టూవీలర్లను కూడా ట్యాక్సీలుగా తిప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వా లని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంతకాలం యాప్ ఆధారిత అగ్రిగేటర్ల అదీనంలో వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు ట్యాక్సీలుగా తిరుగుతున్నాయి. ఇప్పుడు అలా తిరిగేందుకు వీలు లేకుండా, పసుపు రంగు (ఎల్లో) నంబర్ ప్లేట్తో వాణిజ్య వాహనాలుగా నమోదు చేసుకుంటేనే ట్యాక్సీగా నడిపేందుకు అనుమతించేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. ఆటో వాలాల ఒత్తిడితోనే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. ఆటోవాలాల ఒత్తిడితో.. మీటర్లను అలంకారప్రాయంగా మార్చి ఎడాపెడా చార్జీలు డిమాండ్ చేస్తారనే ఆరోపణలు ఆటోవాలాలపై ఉన్నాయి. కాగా కొంతకాలంగా వీరు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. పుష్కరకాలంగా కొనసాగుతున్న పాత చార్జీలను పెంచాలన్న డిమాండ్తో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇతర ఆర్థిక సహకారాల కోసం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సానుకూలత వ్యక్తం చేసిన ప్రభుత్వం చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రిట్రోఫిట్మెంట్ ద్వారా డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు ఏర్పాటు చేసుకుంటే రూ.లక్షన్నర ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించింది. అయితే నగరంలో పెద్ద సంఖ్యలో తిరుగుతూ ప్రయాణికులకు చేరువైన బైక్ ట్యాక్సీలను నియంత్రించాలన్న డిమాండ్పై ఆటో యూనియన్లు పట్టుపట్టాయి. ఎల్లో నంబర్ ప్లేట్తో ఉండే వాణిజ్య వాహనాలనే ట్యాక్సీలుగా అనుమతించాలని, సాధారణంగా వైట్ ప్లేట్తో ఉండే బైక్లను ట్యాక్సీలుగా కొనసాగించరాదని కోరారు. ఈ డిమాండ్తో సమ్మె చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గడ్కరీ ఏమన్నారు.. ‘దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరళమైన విధానాలతో వ్యవహరించాలి. సొంత ద్విచక్రవాహనాలను బైక్ ట్యాక్సీలుగా వినియోగించుకోవటం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది కొత్తగా ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇవి ప్రయాణికులకు తక్కువ చార్జీలకే అందుబాటులో ఉంటాయి. రవాణా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆ«దీనంలోని అంశం అయినందున, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’అని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. బైక్ ట్యాక్సీలకు పెరుగుతున్న డిమాండ్ ప్రస్తుతం రాష్ట్రంలో 18,314 బైక్లను ట్యాక్సీలుగా వాడుతూ యువత ఉపాధి పొందుతోంది. నిజానికి రాష్ట్ర రవాణా శాఖ ఎల్లో ప్లేట్ నిబంధనను గతంలోనే పొందుపరిచింది. కానీ ఉబర్, ర్యాపిడో, ఓలా లాంటి యాప్ ఆధారిత అగ్రిగేటర్ల ద్వారా తెలుపు ప్లేట్తో కూడిన సాధారణ ద్విచక్రవాహనాలను కూడా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఒకరు, వేగంగా ప్రయాణించడానికి వీలైన ఈ ట్యాక్సీలకు నగరంలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆటోవాలాల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో ప్లేట్ నిబంధనను కఠినంగా అమలులోకి తెస్తే, ఈ బైక్ ట్యాక్సీలన్నీ దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ‘ఎల్లో’పెను భారం.. సాధారణ బైక్ను వాణిజ్య వాహనంగా మార్చుకోవాలంటే పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. కన్వర్షన్ చార్జీలు రూ.3 వేలతో ముగిసినా.. తర్వాత క్రమం తప్పకుండా పన్నులు, రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ రోడ్ ట్యాక్స్, త్రైమాసిక పన్ను, ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు.. ఇలా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇక ఒకసారి వాణిజ్య వాహనంగా మారిన తర్వాత దాన్ని సొంత వాహనంగా వినియోగించుకోవటం కూడా ఇబ్బందే. అది నిబంధనలకు విరుద్ధమైనందున దానికి పెనాల్టీ చెల్లించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా యువత బైక్ ట్యాక్సీలను విడిచిపెట్టే అవకాశం ఉంది. ప్రయాణికులకు చార్జీల పోటు నగరంలో క్యాబ్, ఆటోల చార్జీలు భారీగా ఉంటున్నాయి. యాప్ అల్గారిథమ్ రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని చార్జీలను పెంచి వడ్డిస్తోంది. వాటితో పోలిస్తే బైక్ ట్యాక్సీ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది వీటిని వాడుతున్నారు. ఇక చిన్నచిన్న పార్శిళ్ల తరలింపునకు కూడా వీటిని వాడటం అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ బైక్ ట్యాక్సీలు దూరమైతే, ఆ మేరకు ప్రయాణికుల జేబుకు కూడా చిల్లు పడుతుంది. -
30 జిల్లాల్లో పాతాళానికి గంగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజలాలు ఆందోళనకర రీతిలో పడిపోయాయి. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుత వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టాలు పాతాళానికి చేరాయి. రాష్ట్ర భూగర్భ జలశాఖ 2026 ఆగస్టు మాస రెండో పక్షం నివేదిక ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో సగటున 2.09 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయినట్టు వెల్లడైంది. ఈ ఆగస్టు(2026)లో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 7.87 మీటర్లు ఉండగా, గతేడాది (2025) ఇదే సమయానికి ఇది 5.78 మీటర్లు మాత్రమే ఉంది. అంటే సగటున 2.09 మీటర్లు నీటి మట్టం పడిపోయింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 574 మి.మీల సాధారణ వర్షపాతం ఉండాల్సి ఉండగా, 474 మి.మీ మాత్రమే కురిసింది. ఇది 17% లోటు వర్షపాతాన్ని సూచిస్తుంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 3.48 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 12.12 మీటర్ల లోతులకు పడిపోయాయి. భూగర్భ జలశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,771 పీజో మీటర్ల ద్వారా నమోదు చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో మారుతున్న భూగర్భజల స్థితిగతులు స్పష్టమవుతున్నాయి. ⇒ రాష్ట్రంలో 33 జిల్లాలుండగా, 17 జిల్లాల్లో 21–45 శాతం వరకు తీవ్రమైన వర్షపాత లోటు నమోదైంది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలోని 30 జిల్లాల్లో భూగర్భ జలాల నీటిమట్టాలు పడిపోయాయి. అత్యధికంగా హైదరాబాద్లో 5.76 మీ., సూర్యాపేటలో 5.35 మీ., వికారాబాద్ జిల్లాలో 5.16 మీ.ల మేర భారీ పతనం నమోదైంది. రెండు జిల్లాల్లోనే భూగర్భ జలాల నీటిమట్టం పెరిగింది. మెదక్ జిల్లాలో 0.92 మీ.లు, మంచిర్యాలలో 0.1 మీ.లు మేర వృద్ధి నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో మార్పు లేదు. 28% భూభాగంలోనే సురక్షితం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా భూగర్భ జలాల లోతులను భూగర్భ జలశాఖ వర్గీకరించింది. ⇒ రాష్ట్ర విస్తీర్ణంలోని 28 శాతం ప్రాంతంలోనే 5 మీ.ల కంటే తక్కువ లోతుల్లోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. 5 మీ.ల లోపు లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే సురక్షిత పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణిస్తారు. అంటే, రాష్ట్రంలోని 28 శాతం భూభాగంలోనే భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్నాయి. ⇒ రాష్ట్రంలో సింహభాగం..అంటే 46% విస్తీర్ణంలోని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 5–10 మీ.ల లోతుల్లో ఉన్నాయి. ⇒ రాష్ట్రంలోని 20 శాతం విస్తీర్ణంలోని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 10 నుంచి 15 మీటర్ల లోతుకు పడిపోయాయి. ⇒ రాష్ట్ర విస్తీర్ణంలోని 5 శాతం ప్రాంతంలో 20 మీ.ల కంటే అధిక లోతుల్లోకి భూగర్భజలాలు పతనమయ్యాయి. ఇవి ప్రధానంగా మేడ్చల్–మల్కాజిగిరి నైరుతి భాగాలు, రంగారెడ్డి ఉత్తర భాగాలు, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఆగ్నేయ, పశ్చిమ భాగాలు, కామారెడ్డి ఉత్తర భాగాలు, నాగర్కర్నూల్ దక్షిణ–మధ్య భాగాలు, భూపాలపల్లి ఉత్తర భాగాలు, నిజామాబాద్ దక్షిణ భాగాలు, భద్రాద్రి జిల్లాల ఆగ్నేయ భాగాల్లో విస్తరించి ఉన్నాయి దశాబ్దపు సగటు కన్నా పతనం ఆగస్టు నెల దశాబ్దపు (2016–2025) సగటు లోతు 7.59 మీ.లతో పోలిస్తే ప్రస్తుతం(7.87 మీ) మరింత లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలోని 621 మండలాల్లో పరిశీలిస్తే..266 మండలాల్లో (43%) దశాబ్దపు సగటు కంటే నీటి మట్టాలు పెరిగాయి. 355 మండలాల్లో (57%) దశాబ్దపు సగటు కంటే నీటి మట్టాలు పడిపోయాయి. 128 మండలాల్లో 2 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోవడం గమనార్హం. 20 మీటర్ల కంటే అధిక లోతుల్లో భూగర్భ జలాలుంటే.. అత్యంత లోతైన భూగర్భజలాల ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల దశాబ్దపు సగటు విస్తీర్ణం 1,168 చ.కి.మీ ఉండగా, గత ఆగస్టు నాటికి 1,413 చ.కి.మీ.కు పెరిగింది. నగర ప్రాంతాల్లోనే ఆందోళనకరం మే 2026 (వర్షాకాలానికి ముందు)తో పోలిస్తే జూలై–ఆగస్టు వర్షాలతో భూగర్భ జలాలు 1.61 మీటర్లు పైకి ఉబికివచ్చినా, గత ఏడాదితో పోలిస్తే 2.09 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంత జిల్లాలైన హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతోపాటు వ్యవసాయాధారిత సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో పాతాళ గంగ మరింత లోతుకు పడిపోయింది. రాబోయే రోజుల్లో నీటి పొదుపు చర్యలు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు చేపట్టకపోతే తాగు,సాగు నీటిఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదముందని భూగర్భ జలశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
'ఏఐ' జోస్యం.. చేతిలోనే 'జాతకం'!
కూకట్పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనఘకు అమెరికా ఆఫర్ వచ్చింది. వెళ్లాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంది. ‘రాత్రి 11 గంటలకు ఒక యాప్లో ఫ్రీ చాట్ చేశా. 2 నిమిషాలకే ఫ్రీ అయ్యా. తర్వాత డబ్బులు అడిగింది. శని వక్రంలో ఉన్నాడు..రెండు నెలలు ఆగమంది. చెప్పింది బాగానే ఉంది కానీ జనరల్ మాటల్లా అనిపించింది’అంటోంది. దిల్సుఖ్నగర్కు చెందిన రమేశ్ పెళ్లి సంబంధం కోసం అమ్మాయి జాతకం కలవాలని చూస్తున్నాడు. ‘సిద్ధాంతి దగ్గరకు వెళ్తే రోజంతా వేస్ట్ అని.. ఒక యాప్లో 36 గుణాలు ఫ్రీగానే చెక్ చేశా. వెంటనే మాంగళిక దోషం ఉందని, పరిహారం కూడా చెప్పేసింది. టైం, డబ్బు కలిసొచ్చాయి’అన్నాడు. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జాతకం అంటే తెల్లవారుజామునే లేచి సిద్ధాంతి ఇంటి ముందు క్యూలో నిలబడటం. పుట్టిన వేళ, నక్షత్రం చెబితే ఆయన కాగితంపై లెక్కలు వేసి, గంట తర్వాత లగ్నం, రాశి, దశ, ఏలినాటి శని, మంగళ దోషం చెప్పేవారు. పెళ్లి కుదరాలన్నా..ఉద్యోగం రావాలన్నా..ఇల్లు కట్టాలన్నా ఆయన మాటే శాసనం. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది. ఆ సిద్ధాంతి మీ జేబులోని ఫోన్లోకే వచ్చేశాడు. పేరే ఏఐ పండితుడు. గత రెండేళ్లలో దేశంలో ఏఐ జోతిష్య యాప్స్ వాడకం 300 శాతం పెరిగింది. మొత్తం ఇండస్ట్రీ విలువ ఏకంగా 6 బిలియన్ డాలర్లకు చేరింది. గూగుల్ ప్లే స్టోర్ లెక్కల ప్రకారం వివిధ యాప్స్ ఇప్పటికే 8 కోట్ల డౌన్ లోడ్స్ దాటేశాయి. రోజుకు లక్ష మందికి పైగా యువత ఏఐతోనే దినఫలం, జాతకం తెలుసుకుంటోంది.పండితుడు చేసేదిమీ పుట్టిన వివరాలు తీసుకొని పంచాంగం చూసి, కుండలి (జాతక చక్రం) గీసి, దోషాలు లెక్కించి, ముహూర్తం చెప్పేవా రు. దీనికి గంటల సమయం, రూ.500 నుంచి రూ.2000 ఫీజు. యాప్ చేసేది మీరు పుట్టిన తేదీ, టైం, ఊరు కొట్టగానే నాసా డేటా, స్విస్ ఎఫిమెరిస్ లెక్కలతో 10 వేల పాయింట్లతో 5 సెకన్లలోనే కుండలి రెడీ. లగ్నం, రాశి, నక్షత్రం, దశ, అంతర్దశ, యోగాలు, మంగళ దోషం, కాలసర్ప దోషం అన్నీ తెలుగులోనే గ్రాఫ్తో సహా చూపిస్తోంది. ఏఐ జోస్యం ప్రామాణికం కాదు ఏఐ అనేది కేవలం లెక్కలు వేసే యంత్రం మాత్రమే. గ్రహ గతుల లెక్కలు కరెక్ట్గా వేయగలదు కానీ, మనిషి మనసు, కర్మ, అ నుభవంతో చెప్పే సూక్ష్మాన్ని, విచక్షణను చెప్పలేదు. ఏఐ ఇచ్చే ది బార్నమ్ స్టేట్మెంట్స్ లాంటి జనరల్ జోస్యం. సింహరాశి వాళ్లందరికీ ఒకే ఫలితం ఎలా ఉంటుంది? 20 ఏళ్ల యువకుడికి ఉద్యోగం, 26 ఏళ్ల వాడికి పెళ్లి, 40 ఏళ్ల వాడికి ఇల్లు, కారు, 70 ఏళ్ల పెద్దాయనకు ఆరోగ్యం.. ఇలా వయసు, దశను బట్టి ఫలితం మారుతుంది. దీన్ని ఏఐ చెప్పలేదు. కాబట్టి ఏఐ ద్వారా వచ్చే ఫలితాలు ఎప్పటికీ ప్రామాణికం కావు. – సిద్ధాంతి ఆదరాసుపల్లి విఠల్ శర్మఎలా వాడుతున్నారు? చాట్బాట్ పండితుడు: ‘నా పెళ్లి ఎప్పుడు..నాకు ప్రమోషన్ ఉందా? ’అని తెలుగులోనే టైప్ చేసినా, లేదా వాయిస్లో అడిగినా, వెంటనే వాయిస్లోనే సమాధానం. 50 భాషల్లో మాట్లాడుతోంది. ఫేస్ అండ్ పామ్ రీడింగ్: మీ మొహం ఫొటో, అరచేయి ఫొటో అప్లోడ్ చేస్తే ఏఐ స్కాన్ చేసి హస్త సాముద్రికం, ఫేస్ లక్షణాలతో జాతకం చెబుతోంది. పండితుడు కళ్లతో చూసి చెప్పేది ఇప్పుడు కెమెరా చెబుతోంది. పెళ్లి పొంతన, ముహూర్తం: అబ్బాయి, అమ్మాయి వివరాలు కొడితే 36 గుణాలు, మాంగళిక దోషం సెకన్లలో. శుభ ముహూర్తం కూడా కేలండర్లో మార్క్ చేసి పెడుతోంది. పండితుడు రోజంతా లెక్కేసేది ఇప్పుడు ఒక్క క్లిక్. పరిహారాలు : ఏ దోషానికి ఏ రాయి వేసుకోవాలి, ఏ పూజ చేయాలి, ఏ మంత్రం చదవాలి అనేది కూడా వీడియోలతో సహా సూచిస్తోంది. వేద, వెస్ట్రన్ కలిపి చెబుతుండటంతో యువత బాగా అట్రాక్ట్ అవుతోంది. -
మనిషికి పంది కిడ్నీ
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ మార్పిడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. అప్పటివరకు డయాలసిస్ తప్పని పరిస్థితి. అవయవం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితికి పరిష్కారం దిశగా వైద్యరంగంలో మరో కీలక ముందడుగు పడింది. జన్యుమార్పులు చేసిన పంది కిడ్నీని మనిషికి అమర్చి.. ఏకంగా 271 రోజులపాటు డయాలసిస్ అవసరం లేకుండా జీవించేలా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు... ఆ తర్వాత అదే రోగికి మానవ కిడ్నీని విజయవంతంగా అమర్చారు. పంది అవయవాన్ని తాత్కాలికంగా ఉపయోగించి, తర్వాత మానవ అవయవానికి మా రడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ దీర్ఘకాలిక కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నారు. మానవ కిడ్నీ దొరకడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో 2025 జనవరిలో జన్యుమార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చారు. కిడ్నీ వెంటనే పనిచేయడం ప్రారంభించింది. 271 రోజులపాటు డయాలసిస్ లేకుండానే ఆయన జీవించారు. అనంతరం పంది కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో దాన్ని తొలగించారు. ఆ తర్వాత మానవ దాత నుంచి కిడ్నీని అమర్చగా అది వెంటనే పనిచేయడం ప్రారంభించింది. ఈ వివరాలు ఇటీవల ది లాన్సెట్లో ప్రచురితమయ్యాయి. జన్యువుల్లో మార్పులు చేసి... పంది అవయవాల్లో ఉండే కొన్ని వైరస్ల జన్యు పదార్థం మనిషికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. అందుకే పంది జన్యువుల్లో మార్పులు చేయడంతోపాటు అవయవాన్ని అత్యంత నియంత్రిత పరిస్థితుల్లో పెంచడం, రోగిని క్షుణ్ణంగా పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకున్నారు. శరీరం తిరస్కరించే కొన్ని పదార్థాలను తొలగించడంతోపాటు.. మనిషి శరీరానికి అనుకూలంగా ఉండే ఏడు మానవ జన్యువులను చేర్చారు. -
ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శాసనసభలో చేపట్టాల్సిన అధికారిక కార్యక్రమాలతో కూడిన ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’ను శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి జారీ చేశారు. తొలిరోజు ఎజెండాలో భాగంగా ప్రశ్నోత్తరాలతో పాటు పలు కీలక నివేదికలను సభకు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎస్ఎస్)కు సంబంధించిన 2024–25 ఆడిట్ నివేదికను సభ ముందుంచుతారు. అలాగే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) తెలంగాణకు సంబంధించిన 2024–25 ఆడిట్ నివేదికను కూడా ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు సంబంధించిన 2013–14, 2014–15, 2015–16, 2016–17, 2017–18 వార్షిక నివేదికలను సభ ముందుంచనున్నారు. బీఏసీలో పలు అంశాలపై చర్చ అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలు తదితర అంశాలపై తుది నిర్ణయం.. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకోనున్నారు. తొలిరోజు సభ ముగిసిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సమావేశాలను తక్కువ వ్యవధిలోనే ముగించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఈ నెల 13 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటేరియన్ల సమావేశాలకు హాజరు కావాల్సి ఉండటంతో 11వ తేదీ మధ్యాహా్ననికే సమావేశాలు ముగించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అయితే దీనిపై సోమవారం జరిగే బీఏసీ భేటీలోనే స్పష్టత రానుంది. కాగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, భూవివాదాలు, సాగునీరు, 22ఏ నిషేధిత భూముల అంశం తదితర ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఏసీ సమావేశం కీలకంగా మారింది. మరోవైపు అసెంబ్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను సీఎం రేవంత్రెడ్డితో కలిసి స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సోమవారం ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సెంట్రల్ హాల్లోకి కేవలం ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. -
ఎన్ఐఏకు ఆర్మీ ఆయుధాల చోరీ కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ సైనిక స్థావరంలో ఆయుధాల చోరీ వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా స్థానిక పోలీసులు గానీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు గానీ ఎలాంటి పురోగతి సాధించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, సేకరించిన కీలక ఆధారాలు, అనుమానితుల వివరాలను త్వరలోనే ఎన్ఐఏకు బదిలీ చేయనున్నారు. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. అసలు ఏం జరిగింది? బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ క్యాంపస్లో ఆగస్టు 30 రాత్రి అత్యంత భద్రత ఉండే ఆయుధాగారంలోకి దుండగులు చొరబడ్డారు. చుట్టూ ఉన్న ముళ్లకంచెను ఏవిధంగానూ ధ్వంసం చేయకుండా లోపలికి ప్రవేశించిన దొంగలు, ఆయుధాలు భద్రపరిచే ‘కోట్’, మందుగుండు సామగ్రి ఉండే ‘బెటాలియన్ మేగజైన్’గదుల తాళాలు బద్దలు కొట్టారు. అక్కడ ఉన్న అనేక ఆయుధాలలో నుంచి ఎంచుకుని మరీ 4 ఏకే–203 రైఫిళ్లు, 1 ఇన్సాస్ రైఫిల్, 7 పిస్టళ్లు, 1,800 రౌండ్లకు పైగా మందుగుండు సామగ్రిని దొంగిలించారు. అదే ప్రాంతంలో లైట్ మెషీన్ గన్స్ ఉన్నప్పటికీ దుండగులు వాటిని ముట్టుకోకపోవడం గమనార్హం. సైనిక పహారా ఉన్నా.. చోరీ జరిగిన రెండు గదులు 40 మీటర్ల పరిధిలోనే ఉండగా.. పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నారు. 2 గంటల షిఫ్టుల్లో డ్యూటీ చేసిన గార్డులు.. తాము ఎలాంటి అనుమానాస్పద కదలికలు గానీ, శబ్దాలు గానీ గుర్తించలేదని పోలీసులకు చెప్పారు. ఆ రాత్రి పడిన భారీ వర్షం వల్ల శబ్దాలు వినబడలేదని, ఆ గదులు తమకు నేరుగా కనిపించే కోణంలో లేవని విచారణలో పేర్కొన్నారు. చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి మొత్తం బరువు దాదాపు 40 కిలోలకు పైగానే ఉంటుంది. ఒకే వ్యక్తి అంతటి బరువును మోసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ఇందులో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉండవచ్చని లేదా విడతలవారీగా చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్మీ ప్రాంగణంలో భద్రతా తనిఖీలు ఎప్పుడు నిర్వహించారనే దానిపై సరైన రికార్డులు లేకపోవడంపై దర్యాప్తు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సైనిక స్థావరం భౌగోళిక రూపురేఖలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.దొరికింది చోరీకి గురైంది కాదు..చోరీకి గురైన ఆయుధాల జాడ కోసం పోలీసులు వెతుకుతున్న క్రమంలో ఆర్మీ క్యాంపస్ లోని డ్రైనేజీలో ఇన్సాస్ రైఫిల్ మేగజైన్ ఒకటి పోలీసులకు లభ్యమైంది. అయితే ఆ మేగజైన్ చోరీకి గురైన వాటిల్లోని సీరియల్ నంబర్ మేగజైన్ కాకపోవడంతో పోలీసులు కంగుతిన్నారు. దర్యాప్తులో అధికారులను తప్పుదోవ పట్టించేందుకే వేరే మేగజైన్ను ఉద్దేశపూర్వకంగా ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఉద్యోగుల ఆరోగ్యభద్రత ప్రభుత్వ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యభద్రత విషయంలో ప్రజాప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన ఎంప్లాయీస్ హెల్త్స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలులో ఎలాంటి రాజీ ఉండదని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లకు అనారోగ్య సమయంలో ఆర్థిక, మానసిక ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్య భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దశాబ్దాలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే విధివిధానాలు ఈహెచ్ఎస్ పథక రూపకల్పన, విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే విధివిధానాలు ఖరారు చేశామని భట్టి తెలిపారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే ఈహెచ్ఎస్లో 354 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని, మరికొన్ని ఆస్పత్రులను డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో చేర్చినట్టు వెల్లడించారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి పథకం సజావుగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. పదేళ్లుగా పట్టించుకోని సమస్యకు పరిష్కారం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అత్యంత సీరియస్గా, కమిట్మెంట్తో పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, జీఏడీ స్పెషల్ సీఎస్ మహేశ్దత్ ఎక్కా, ఆరోగ్య, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఈహెచ్ఎస్ సీఈఓ హనుమంతు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నదీ జలాలపై బీఆర్ఎస్ది బోగస్ ప్రచారం
కోదాడ: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలో తెలంగాణ నీటి వాటా కోసం అన్ని వేదికలపై సమర్థంగా పోరాటం చేస్తున్నామని, ఈ విషంలో బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నదీజలాల విషయంలో ఎలాంటి రాజీపడకుండా ట్రిబ్యునల్స్, కేఆర్ఎంబీ, కేంద్రప్రభుత్వం వద్ద తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో నీటిపారుదల శాఖను భ్రష్టు పట్టించిందని, కోటి 81 లక్షల రూపాయలు ఖర్చు చేసి అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. రూ.80 వేల కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్ట్కు రూ.8 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఈ రెండు ప్రాజెక్టులతో ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని ఉత్తమ్ తెలిపారు. గౌరవెల్లి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, తామ చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులను సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పూర్తిచేసి రైతులకు సాగు నీరందిస్తామన్నారు. -
రాజీనామా చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్హౌస్కు పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు వెంటనే తన ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ డిమాండ్ చేశారు. అధికారం, ప్రభుత్వాలు, పదవులు శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు చాలా గౌరవం ఉంటుందని, అలాంటి పదవిని అపహాస్యం చేయవద్దని హితవు పలికారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, వివేక్లతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్ కుమార్యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి అంజన్కుమార్ యాదవ్, పలువురు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్దే అధికారం.. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ‘మేం తప్పు చేస్తే ప్రతిపక్షాలు ఎత్తి చూపొచ్చు. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాం..’ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం అమలు జరుగుతున్నాయని, మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ప్రజలు ఇచ్చే కానుక అని, దాన్ని మేం సది్వనియోగం చేసుకుంటుంటే, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. మంత్రి అజహరుద్దీన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము తింటూ ఫామ్హౌస్లో పడుకుంటున్నాడని విమర్శించారు. అసెంబ్లీకి వస్తావా, రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ రాజీనామా చేయకపోతే స్పీకర్ తగిన చర్యలు తీసుకుని ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ బీఆర్ఎస్ సునామీ!
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం. –కేసీఆర్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా మళ్లీ బీఆర్ఎస్ సునామీ రాబోతోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అయింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరికి బీఫాం ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది. అలా అని పార్టీ నేతలు, కార్యకర్తలు రిలాక్స్ కావొద్దు. ప్రజల్లో ఉంటూ నిరంతరం పోరాడాలి..’ అని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో.. అసెంబ్లీ, మండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. థర్డ్క్లాస్ పాలన..రైజింగ్ కాదు డౌన్ఫాల్ ‘కాంగ్రెస్ది థర్డ్క్లాస్ పాలన. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ఫాల్ వైపు వెళ్లింది. కాంగ్రెస్కు నూకలు చెల్లాయని అర్థమైంది. అందుకే ఆ పార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ఫాల్ వైపు వెళ్లింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని అధికార పక్షం బూతు కూతలకు వేదికగా మార్చింది. పాలన చేతకాక చిల్లర మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ప్రజల గొంతును ఉభయ సభల్లో బలంగా వినిపించే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది. ప్రజల జెండానే బీఆర్ఎస్ ఎజెండాగా ఉండాలి., ప్రతి చర్చలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా పాల్గొనాలి. శాసనమండలి కూడా పాత భవనంలోకి వచ్చిన నేపథ్యంలో రెండు సభల్లో పార్టీ సభ్యులు మరింత సమన్వయంతో వ్యవహరించాలి..’ అని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ చెప్పినా కాళేశ్వరంపై నిర్లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగించుకోవచ్చని కోవచ్చని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మేడిగడ్డ వద్ద అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుంది. అయినా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా తెలంగాణ పంటలకు విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి అంశాలపై అవసరమైతే ఉభయ సభలను స్తంభింపజేయాలి. వీటి విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే సాగునీటి కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి నేనే స్వయంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతా. సాగునీటి కోసం త్వరలో మరో యుద్ధానికి సిద్ధమవుదాం..’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలపై సర్కారును నిలదీయాలి ‘పేద విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీనిపై విద్యార్థుల తరఫున అసెంబ్లీ వేదికగా గళం విప్పాలి. పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసేలా జీవో 97 తీసుకొచ్చిన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలి. ఎన్నికలకు ముందు లక్షలాది ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎందుకు విఫలమైందో నిలదీయాలి. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రయత్నాలు, గురుకులాల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులు, బాలికల మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయాలి. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి అత్యవసర పరిస్థితుల్లోనూ విక్రయించుకోలేని పరిస్థితి కల్పించడంపైనా పోరాడాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.. మిషన్ భగీరథ వ్యవస్థను నిర్వీర్యం చేసి తాగునీటి సమస్యను తీవ్రతరం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ఉచిత విద్యుత్కు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్ వంటి బకాయిలు చెల్లించకపోవడం, పీఆర్సీ పెండింగ్, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం, సింగరేణిలో అవినీతి, ప్రభుత్వ భూముల విక్రయాలు, మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం, గోదావరి–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ఉభయ సభల్లో ప్రశ్నించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మహిళలపై దాడులు పెరగడం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాలపైనా కాంగ్రెస్ను ఎండగట్టాలి..’ అని కేసీఅర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేకపోయిన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకత్వం, కార్యకర్తలను అభినందించారు. తాను అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కేసీఆర్ కోరగా.. ప్రస్తుత సభ గౌరవ సభగా కాకుండా ‘కౌరవ సభ’గా మారిందని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం: మల్లు రవి
హైదరాబాద్: పార్టీకి నష్టం కల్గించారనే కారణాలతో ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. వారిని వారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 6వ తేదీ) క్రమశిక్షణా కమిటీ సమావేశమైన అనంతరం మల్లు రవి ఈ విషయాల్ని వెల్లడించారు. పార్టీకి నష్టం కల్గించేలా వ్యహరించారడంతో ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం తన డిక్లరేషన్లో లేదని తెలిపారు మల్లు రవి. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, తాను ఏదైనా తప్పు చేస్తే ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారిలో ఆదిలాబాద్ ఇంచార్జి కంది శ్రీనివాస్తో పాటు సంజీవ రెడ్డికి, గజ్వేల్ నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డిలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన -
ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ-మెట్రో రైల్ ఉమ్మడి పాస్
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారికి గుడ్న్యూస్. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలనీ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాసులను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి ఛార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాసుల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇదీ చదవండి: ఇక ఈ కవలలకు జీవితాంతం పోలీసు ఉద్యోగం రాదు! -
బీఆర్ఎస్ఎల్పీ భేటీలో ఊహించని మలుపు.. ఆ కీలక ఎమ్మెల్యే హాజరు
సాక్షి,సిద్దిపేట: బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి రెడ్డి హాజరయ్యారు. తనది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎర్రవల్లి ఫామ్హౌస్ కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహం, అనుసరించాల్సిన విధానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్షన్ కోసం ఫామ్హౌస్కు వచ్చాం. పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఈ సమావేశానికి హాజరవుతున్నాం. కేసీఆర్ ఈరోజు ఏ దిశానిర్దేశం చేస్తారో దాని ప్రకారం నడుచుకుంటాం. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ సభ్యుల వైపే కూర్చుంటాను’ అని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై కోర్టు తీర్పు కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.👉ఇదీ చదవండి: నా వల్లే ఇదంతా.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత -
గణేష్ మండపాల వద్ద డీజేలపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి కొద్దిరోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో మండపాల వద్ద శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. డీజేల మోత మోగిస్తే స హించేది లేదని తేలి్చచెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.సౌండ్ పెంచితే సీజ్ ఖాయం.. నగర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల్లో డీజే సిస్టంలపై పోలీసులు సైలెంట్ అటాక్ ప్రారంభించారు. శబ్ద తీవ్రతను కొలిచేందుకు ప్రత్యేకంగా డెసిబుల్ మీటర్లతో ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు, డీజేలు వాడటానికి వీల్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్, పగటిపూట గరిష్టంగా అనుమతించిన స్థాయులనే పాటించాలి. స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నో నాయిస్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో శబ్దం చేస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.హామీ పత్రం ఇస్తేనే అనుమతి ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమరి్పంచాలి. డీజే, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతేడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: అప్పుడు ఓనర్.. ఇప్పుడు డ్రైవర్! -
‘నా వల్లే ఇదంతా’.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖను తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న కోపాన్ని తన తల్లిపై చూపించి బలిచేశారని ఆరోపించారు.మా అమ్మను ఇంతగా అవమానిస్తారని తెలిస్తే నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడేదాన్ని కాదు. నేను మాట్లాడిన దానికి మా అమ్మను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అన్న మాటల్లో తప్పులేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి నాపై ఈ స్థాయిలో పగ పెంచుకుంటారని ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.మా అమ్మ చేసిన ఒక్క తప్పునైనా చూపించగలరా? 'పార్టీలో నేనైనా ఉండాలి, లేదా ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుతారా? అని రేవంత్ రెడ్డి తీరును నిలదీశారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తమ కుటుంబాన్ని ఇప్పుడు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తరుణంలో కొండా సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, ఆమె గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. సీఎం రేవంత్ను శపిస్తున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా, తన వ్యాఖ్యల వల్లే తల్లి పదవికి ముప్పు వచ్చిందనే భావనతో సుష్మిత భావోద్వేగానికి గురవుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బోరున ఏడ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నా వల్లే మా అమ్మకు ఇంత అవమానంనేను మాట్లాడిన మాటలకు మా అమ్మను ఇంతలా అవమానిస్తారా? –కొండా సుష్మిత pic.twitter.com/2njDtBF1G0— Mirror TV (@MirrorTvTelugu) September 6, 2026 -
ఎవరికి వారు ఏకాకులే
సాక్షి, హైదరాబాద్ : వికాస్ (పేరు మార్చాం) ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉన్నతోద్యోగి. రూ.లక్షకు పైగా జీతం. సకల సదుపాయాలతో కూడిన జీవితం. భార్యాపిల్లలతో ఇల్లంతా సందడి. కానీ అతడు మాత్రం ఒంటరి. తనకంటూ ఎవ్వరూ లేని ఏకాకి. ఏమాత్రం తీరిక లభించినా ఏదో ఒక సోషల్ మీడియాలో దూరిపోతాడు. ఇంటిల్లిపాదీ అంతే. ఆత్మీయమైన పలకరింపులు, ప్రేమపూర్వకమైన అనుబంధాలు మచ్చుకైనా లేవు. దీంతో అతడు తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యాడు. వికాస్ మాత్రమే కాదు, నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో కొట్టుకుపోతున్న ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. రిలేషన్స్పై రీల్స్ ఎఫెక్ట్రోష్ని సంస్థకు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ కుటుంబ సంబంధాలే ఉంటున్నట్లు ఆ సంస్థ అదనపు డైరెక్టర్ రత్న తెలిపారు. ‘తల్లిదండ్రులు తమను పట్టించుకోవడం లేదని పిల్లలు బాధపడుతున్నారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. రీల్స్ ప్రభావంతో రియల్ లైఫ్లోని రిలేషన్స్కు దూరమవుతున్నారని’ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించినట్లుగా తాము ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నట్లు చాలామంది బాధపడుతున్నారు. ఇంట్లో అందరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోలేకపోతున్నట్లు రోష్ని ప్రతినిధులు తెలిపారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యల బారిన పడుతున్నవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉండడం గమనార్హం. రోష్నికి రోజుకు 30 నుంచి 45 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో 75 శాతం కుటుంబ బంధాల సమస్యలేనని వెల్లడైంది. సోషల్ మీడియా కోరల్లో జీవితాలు సహజమైన, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని సామాజిక మాధ్యమం కబళిస్తోంది. చాలా మంది ‘తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇంటిల్లిపాదీ తనకు దూరమవుతున్నా’రనే మానసిక ఆందోళనకు, కుంగుబాటుకు గురవుతున్నారు. ఇలాంటి వారు ‘ఇంటిల్లిపాదీ వారి వెంటే ఉన్నప్పటికీ ఏకాకులవుతున్నా’రని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. వివిధ రకాల మానసిక సమస్యలపై ఆ సంస్థ ఏడాది కాలంలో సుమారు 5 వేలకు పైగా కేసులను నమోదు చేసింది.అగాధం పెరుగుతోందిఉద్యోగ, వ్యాపారాల రీత్యా తీరిక లేకుండా గడిపే చాలామంది మగవాళ్లు భార్య నుంచి ప్రేమ, ఆత్మీయత లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉరుకులపరుగుల జీవితంలో కలిసి గడిపేందుకు సమయమే లేనట్లుగా వ్యవహరించడం భార్యాభర్తలిరువురికీ సరైంది కాదు. దంపతు ల మధ్య అనుబంధాలు బలంగా ఉంటేనే పిల్ల లు ఆత్మస్థైర్యంతో ఎదుగుతారు. – రత్న, అదనపు సంచాలకులు, రోష్ని గణాంకాలివి2025లో మానసిక సమస్యలపై వచ్చిన మొత్తం ఫిర్యాదులు: 5,610 పురుషులఫిర్యాదులు 4,003 మహిళల ఫిర్యాదులు 1,497ట్రాన్స్జెండర్స్ నుంచి వచ్చిన ఫిర్యాదులు 110కారణాలు...మానసిక సమస్యలు 2,151రిలేషన్స్ 1,733ఆర్ధికసమస్యలు 987వివాహేతర సమస్యలు 728కుటుంబ సమస్యలు 706అనారోగ్యం వల్ల కుంగుబాటు: 285 -
ప్రజారోగ్యంపై మీథేన్ పడగ..!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చెత్త డంపింగ్ యార్డుల వల్ల తలెత్తుతున్న పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన చెత్త నుంచి విద్యుత్ తయారీ (డబ్ల్యూటీఈ) ప్లాంట్లు ఆ సమస్యను తీర్చకపోగా అందుకు విరుద్ధంగా అత్యధిక స్థాయిలో పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్నట్లు సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ (సీఎఫ్ఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, రాగి తయారీ పరిశ్రమలను మించిన స్థాయిలో డబ్ల్యూటీఈ ప్లాంట్లు కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్లు తేలింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కాలుష్య సూచీ ప్రకారం వీటికి 100కి 100 స్కోరు వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్లోని జవహర్నగర్ డంపింగ్ యార్డులో 48 మెగావాట్ల సామర్థ్యంగల డబ్ల్యూటీఈ ప్లాంటు ఉన్నప్పటికీ ఇది దేశంలోని చెత్త డంపింగ్ యార్డుల్లోకెల్లా అత్యధిక మీథేన్ వాయువు విడుదలకు కారణమవుతోందని.. ప్రపంచంలోనే ఇది నాలుగో అతిపెద్ద మీథేన్ కాలుష్యకారకంగా మారిందని సీఎఫ్ఏ తెలిపింది. జవహర్నగర్ నుంచి గంటకు 5.9 టన్నుల చొప్పున ఏటా సుమారు 49 వేల టన్నుల మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతోందని.. ఇది ఏటా గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తున్న 39.6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానమని అధ్యయనం పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితోపాటు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అధికారిక గణాంకాలను పరిశీలించి రూపొందించిన ఈ నివేదికను సుప్రీంకోర్టుతోపాటు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు సమర్పించినట్లు సీఎఫ్ఏ వెల్లడించింది.హైదరాబాద్కు ప్రజారోగ్యం ముప్పుఈ నివేదిక ప్రకారం.. జవహర్నగర్ డంపింగ్ యార్డు నుంచి విడుదలవుతున్న అత్యంత విషపూరితమైన రసాయన ద్రవాలు (లీచేట్) స్థానిక భూగర్భ జలాలను, చెరువులను పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి నాసా (నాసా జేపీఎల్), కార్బన్ మ్యాపర్ ఉపగ్రహాలు గుర్తించేంత స్థాయిలో ఇక్కడి ఉద్గారాలు ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. దీని ఫలితంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కేన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. భూగర్భ జలాలు భారీగా కాలుష్యం బారిన పడుతున్నాయి.మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని సిద్ధాపూర్లో ఏటా 4 వేల టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబ్ల్యూటీఈ ప్లాంటు వల్ల ఆ ప్రాంతం మరో జవహర్నగర్గా మారుతుందని సీఎఫ్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూటీఈ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు అవసరం లేకుండా ఉండేందుకు 2025లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని డబ్ల్యూటీఈ ప్లాంట్లను రెడ్ కేటగిరీ నుంచి బ్లూ కేటగిరీలోకి మార్చడంపై సీఎఫ్ఏ అభ్యంతరం తెలిపింది. ఈ నిర్ణయం కాలుష్యకారక పరిశ్రమలకు రక్షణ కల్పించడమేనని.. అందువల్ల డబ్ల్యూటీఈ ప్లాంట్లను తిరిగి రెడ్ కేటగిరీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. -
అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు కేవలం బిల్లులు, ప్రశ్నోత్తరాలకే పరిమితం కాకుండా వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై అధికార–ప్రతిపక్షాల మధ్య హోరాహోరీకి వేదికగా మారే అవకాశముంది. ఒకవైపు ప్రభుత్వం తన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు, నియోజకవర్గాల అభివృద్ధిని ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఫీజు బకాయిలు, భూ వివాదాలు, జలవనరుల అంశాలతో సర్కారును ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది తొలిరోజు స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో ఖరారు కానుంది. నాలుగైదు పనిదినాలకే సమావేశాలు పరిమితమయ్యే అవకాశముంది. కాంగ్రెస్ అ్రస్తాలేంటి? అధికార కాంగ్రెస్ ప్రతిపక్షంపై, ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరుకాకపోవడంపై ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడమేకాక.. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. తమ వెయ్యిరోజుల పాలన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై గణాంకాలతో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసురుతోంది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, వాటిని చక్కదిద్దుతున్నామని ఎదురుదాడి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాల పేరిట బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. విపక్షాల అ్రస్తాలివీ... కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను కేంద్రంగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే చార్జిïÙట్ను విడుదల చేశాయి. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ, ఎరువుల కొరత, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుపై బీఆర్ఎస్ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నిలదీస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సంక్షేమ పథకాలు, సాగునీరు, కృష్ణా–గోదావరి జలాల అంశాలను ఆ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసుకుంది. బీజేపీ కూడా 22ఏ జీవో, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుంది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నిరసన, అరెస్టు నేపథ్యంలో ఈ అంశం సభలో మరింత వేడెక్కే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, కల్యాణలక్ష్మి నిధుల విడుదలలో జాప్యం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, యూరియా కొరత, రైతుల ఇబ్బందులు కూడా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్తోపాటు వివిధ రూపాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఏయే బిల్లులంటే... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) బిల్లు ఈ సమావేశాల్లో కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాంతాల పాలనను సమగ్రంగా మార్చే ఉద్దేశంతో ఈ బిల్లును తేనున్నారు. అయితే ఆస్తి పన్ను, భూములు–భవనాల విలువ నిర్ధారణ వంటి అంశాలపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ నిరోధక బిల్లు కూడా చర్చకు రావచ్చు. అలాగే, చట్టసభల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. 22ఏపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా పూర్తి వివరాలతో అధికారపక్షం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. -
ఎమ్మెల్సీ పేర్లు ‘అధిష్టానానికి’!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహుల జాబితా ఢిల్లీకి చేరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్–రంగారెడ్డి–పాలమూరు ఉమ్మడి జిల్లాల నియోజకవర్గానికి ఆరుపేర్లు, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గానికి ఏడు పేర్ల చొప్పున అధిష్టానానికి వెళ్లాయని, ఈ పేర్లపై పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల అభిప్రాయం మేరకు.. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉమ్మడి జిల్లా ఉన్న ఓ నియోజకవర్గం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్టున్న మూడు జిల్లాల్లో రెండో నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో ఈ రెండు చోట్ల గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల కసరత్తును టీపీసీసీ నిర్వహించింది. ఇందులో ఆయా జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రుల అభిప్రాయం కీలకంగా తీసుకుంది. పాలమూరు స్థానంలో నేతల అభిప్రాయాలు సేకరించే బాధ్యతలు మంత్రి దామోదరకు, నల్లగొండ స్థానంలో మంత్రి ఉత్తమ్కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ ఇరువురు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి వారి అభిప్రాయం మేరకు ఆరు పేర్లతో షార్ట్ లిస్టు చేసినట్టు తెలుస్తోంది. నల్లగొండ స్థానం నుంచి తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, మాజీ మంత్రి దామోదర్రెడ్డి కుమారుడు సరోత్తంరెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్నేత, యువ నాయకుడు డాక్టర్ లోకేశ్యాదవ్, చనగాని దయాకర్ల పేర్లను పంపినట్టు తెలుస్తోంది. ఓ ఆర్టీఐ కమిషనర్ పేరును కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. పాలమూరు స్థానం నుంచి టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, విద్యావేత్త గౌరి సతీశ్, టీïపీసీసీ నేత సామా రామ్మోహన్రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి భీంభరత్ల పేర్లను పంపినట్టు సమాచారం. ఈ పేర్ల నుంచి ఎవరో ఒకరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశాలున్నాయని, ఢిల్లీలో జరిగే సమావేశంలోపు ఇతర పేర్ల ప్రతిపాదనలు ఏవైనా వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ పెద్దలతో సీఎంతో పాటు పార్టీ ముఖ్య నేతలు కలిసిన సందర్భంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై కూడా చర్చ జరుగుతుందని, వీలున్నంత త్వరలోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈలోపే అభ్యర్థిత్వాలు ఖరారవుతాయని అంటున్నాయి. -
22ఏపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చిన భూములపై వెంటనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, అధికారుల ప్రమేయంతో జరిగిన మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయి అవినీతికి, భూమాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రైవేట్, ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగా 22ఏ జాబితాలో పెట్టి, రెవెన్యూ శాఖను వ్యాపార సంస్థగా మార్చేశారని మండిపడ్డారు. తన కుటుంబ సంస్థల పేరిట ఉన్న రూ. 15 వేల కోట్ల ఆస్తులపై తన ప్రశ్నలకు బదులు ఇవ్వలేక పారిపోయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద... భూభారతి– 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ‘భూభారతి, 22ఏపై మహాధర్నా’ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ప్రారంభించారు. ఏలేటి, ఎంపీ ఈటల రాజేందర్, ఇతరనేతలు ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భూ భారతి పేరుతో గతంలోని దోపిడీ, అవినీతి కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను 22ఏలో పెట్టి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిగ్గు లేకుండా మంత్రులే ఆదివారం ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటున్నారని ఎద్దేవాచేశారు. బీజేపీ రెండురోజుల ధర్నాకు పరి్మషన్ ఇవ్వకుండా ఆదివారం ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పిక్నిక్, దావత్ చేసుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలోని భూదందాలతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన ధరణి, కాళేశ్వరం, ఫార్ములా ఈ–రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ తదితర కుంభకోణాలపై సమగ్ర విచారణకు వెంటనే సీబీఐకి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ను దింపే దాకా విశ్రమించంప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ను గద్దె దింపేవరకు విశ్రమించేది లేద ని శపథం చేస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. ‘రేవంత్ నీకు కేసీఆర్ కంటే దుర్మార్గమైన గతి పడుతుంది. రాహుల్, సోనియా గాంధీలకు రేవంత్ నెలకు 400 కోట్లు పంపిస్తున్నారు’అని ఆరోపించారు. 22ఏ సమస్యతో నష్టపోయిన ఒక బాధిత రైతు చేతుల మీదుగా నిమ్మరసం తాగి మహేశ్వర్ రెడ్డి, ఈటల తమ దీక్షను విరమించారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ రియల్ ఎస్టేట్గా...: కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణను రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ’గా (ఆర్ఆర్ రియల్ ఎస్టేట్)గా మార్చేశారని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. 22ఏ జాబితా, భూముల అమ్మకాలు, ప్రైవేట్ సెటిల్మెంట్ల ద్వారా దోచుకున్న వేలకోట్లు ఢిల్లీకి కప్పం కడుతున్నారన్నారు. 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన రైతులు, ప్రజల భూములను బేషరతుగా తొలగించాలని డిమాండ్చేశారు. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ... రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే అని అన్నారు. ఈ జాబితా పేరుతో ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తప్పు జరిగిందని సీఎం, మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనన్నారు. -
సెంటర్ అ‘టెన్షన్’
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వ హించే పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. నీట్ పేపర్ లీక్, తాజాగా జైపూర్లో పీజీ నీట్ కేంద్రంలో గందరగోళం, పలు కేంద్రాల్లో తరచూ సాంకేతిక అంతరాయాలు విమర్శలకు దారి తీస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల ఎంపికపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా 14 వేల విద్యా కేంద్రాల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సహకరించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని కోరింది.కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణకు అనువుగా మౌలిక వసతులున్న విద్యా సంస్థలను గుర్తించి, తమకు జాబితా పంపాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఏఐసీటీఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు తాజాగా లేఖలు రాసింది. ఈ నెల 15వ తేదీలోగా సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఏఐసీటీఈ పాలసీ అండ్ ప్లానింగ్ అకాడమీ బ్యూరో సలహాదారు ఎన్హెచ్ సిద్ధ లింగస్వామి ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. ఇవీ ఏఐసీటీఈ కోరిన వివరాలు పరీక్ష ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే కేంద్రాలనే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఎంపిక చేయాలని ఎన్టీఏ భావించింది. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న సమస్యలను ఈ సంస్థ విశ్లేషించింది. వీటి ఆధారంగా మొత్తం పది మౌలిక వసతుల కల్పన ఉన్న సంస్థలనే గుర్తించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 14 వేల కాలేజీలు, వర్సిటీలకు పది అంశాలతో కూడిన సమాచార సేకరణ ప్రతులు అందాయి. ఇందులో ముఖ్యమైన సమాచారం ఈ విధంగా ఉంది. » సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ల సంఖ్య » ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ మౌలిక వసతులు » కంప్యూటర్ సిస్టమ్స్ వివరాలు » నెట్వర్కింగ్ సదుపాయాల పరిస్థితి » ఇంటర్నెట్ కనెక్టివిటీ సామర్థ్యం » విద్యుత్ బ్యాకప్ సదుపాయాలు » సీసీ కెమెరాలు, ఇతర అనుబంధ భద్రతా సౌకర్యాలు » ఖాళీగా లేదా ప్రస్తుతం వినియోగంలో లేని స్థలం » ఆ స్థలాన్ని ప్రత్యేక సీబీటీ పరీక్షా కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఏ మేర ఉంది తరచూ ఎదురయ్యే సమస్యలు ఈ మధ్య ఎన్టీఏ నిర్వహించిన పలు జాతీయ స్థాయి పరీక్షల్లో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయాలు, సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్ లోపాలు వంటి కారణాలతో పరీక్షలు వాయిదా పడటం లేదా కొందరు అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. » ఆగస్టు 22న జైపూర్లో జరిగిన పీజీ నీట్లో విద్యుత్ వైఫల్యం కారణంగా 49 మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. వీరికి రీటెస్ట్ నిర్వహించాల్సి వచ్చింది. » సీయూఈటీ–యూజీ 2026లో సాఫ్ట్వేర్ సాంకేతిక లోపం కారణంగా 3,765 మంది విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. వారికి కూడా మళ్లీ పరీక్ష నిర్వహించారు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా నిరంతర విద్యుత్, నెట్వర్క్ సామర్థ్యం, ఇంటర్నెట్ వేగం, పర్యవేక్షణ వ్యవస్థలు అందుబాటులో లేకపోవడమే ఇలాంటి పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. -
విద్యా వ్యవస్థను పదేళ్లు విధ్వంసం చేశారు
వికారాబాద్: ‘పదేళ్లు ఓ కుటుంబం విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది. రెండేళ్లు డెడికేటెడ్గా పనిచేసి వికాసం వైపు నడిపించి, దేశానికే దిక్సూచిగా తీర్చిదిద్దుకుందాం’అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో రేవంత్రెడ్డి మాట్లా డారు. ‘నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. విద్యాశాఖ మంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్థిక వెసులుబాటును బట్టి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా.. రెండేళ్ల తర్వాత మీరు ఆశించిన ఫలితం రాకపోతే ఎన్నికల పరీక్షలో వంద మార్కులేస్తారో.. సున్నా మార్కులేస్తారో మీ ఇష్టం.మీ ఉద్యోగులు ఒక్కసారి పరీక్ష రాస్తే 35 ఏళ్లు ఉంటుంది.. మా సర్వీస్ ఐదేళ్లే. ప్రతీ ఐదేళ్లకోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది.. మా పనితీరును బట్టి ఆ పరీక్షలో పాస్ చేస్తారో.. ఫెయిల్ చేస్తారో మీ ఇష్టం’అని రేవంత్ అన్నారు. ప్రతిపక్షాల మాయలో పడి ఉపా«ధ్యాయులు రోడ్ల మీదకు రావద్దని, మీ సమస్యలు పరిష్కరించడానికి విద్యా కమిషన్ వేశామని, కేశవరావును సలహాదారుగా నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రేవంత్రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అవార్డులు అందజేశారు. 28 నుంచి 17వ స్థానానికి... ప్రభుత్వ బడుల్లో చదివే వారిలో ఎక్కువ శాతం పేద విద్యార్థులేనని, వీరికి అత్యున్నత విద్యను అందించాల్సిన బాధ్యత ఉపా ధ్యాయులపైనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. విద్యాభివృద్ధిలో 2023లో తెలంగాణ 28వ స్థానంలో ఉండగా, ప్రజా ప్రభు త్వం కొలువుదీరాక ప్రస్తుతం 17వ స్థానానికి వచ్చామన్నారు. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని కొని యాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో పాలిటెక్నిక్లో 95శాతం అడ్మిషన్లు నమోదయ్యాయని తెలిపారు. సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా దూసుకుపోతోందన్నారు. ఐటీఐలలో ఇంతకుముందు అంబాసిడర్ కారు ఉంచి మెకానిక్ నేర్చుకోమనే వారని, తాను సందర్శనకు వెళ్లినప్పుడు ఇది చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపారు. అంబాసిడర్ రిపేర్ నేర్చుకుని ప్రస్తుతం ఉన్న కార్లను ఎలా రిపేర్ చేస్తామని ఓ విద్యార్థి చెప్పగా.. రూ.4 వేల కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు) ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను వీటికి అనుసంధానం చేసి, విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అప్పుల కుప్ప చేశారు.. గత ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్లు అప్పు చేసి పోయిందని సీఎం రేవంత్రెడ్డి దుయ్య బట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా సర్వీస్ను 60 ఏళ్లకు పెంచారని, బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టి ఆయన (కేసీఆర్) ఫామ్ హౌస్లో పడుకుంటే ప్రజా ప్రభుత్వం వచ్చి న 90 రోజుల్లోనే రూ.6 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఖజానాలో ఎన్ని సమస్యలున్నా బకాయిల కోసం ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, కలెక్టర్ దీపక్తివారీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర: సీఎం కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందు కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కొడంగల్లోని తన నివాసంలో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. నోటీసులు ఇచ్చిన వారికి అండగా ఉండి, ఓట్లను రక్షించుకోకపోతే ఆగమైతామన్నారు. గత ఎన్నికల్లో మనం గెలిచింది.. రెండు శాతం ఓట్లతోనేనని, ప్రస్తుతం ఎస్ఐఆర్ అస్త్రం వాడి పది శాతం ఓట్లను బీజేపీ తొలగిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అనుకూల పేదలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలే టార్గెట్గా ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. గతంలో ఈడీ, సీబీఐ పేరుతో భయపెట్టించిన బీజేపీ.. ఇప్పుడు ఎస్ఐఆర్ తెచ్చి తడిగుడ్డతో గొంతు కోస్తోందని మండిపడ్డారు. బిహా ర్, పశ్చిమబెంగాల్లో ఇలాంటి వ్యూహంతోనే ఆపార్టీ గెలిచిందన్నారు. ఓటర్లకు అవసరమైన సర్టిఫికెట్లను వెంటనే ఇవ్వాలని కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. -
అప్పుడు ఓనర్.. ఇప్పుడు డ్రైవర్!
ఐదు లారీల యజమానిని. పిల్లలను ప్రైవేటు స్కూళ్లో చదివించాను. మంచిగా బతికాం. కాలం గిర్రున తిరిగింది. లోడింగ్, అన్లోడింగ్, డీజిల్, టైర్లు, బీమా రేట్లు పెరిగాయి. కానీ బండి కిరాయి మాత్రం పెరగలేదు. క్రమంగా నష్టాలు మొదలయ్యాయి. చదువు మానేసి నా కొడుకు డ్రైవర్గా మారాడు. నేనూ డ్రైవింగ్ చేశాను. ఆదాయం లేక ఈఎంఐలు కట్టలేదు. ఫైనాన్స్ ఏజెంట్లు లారీలు తీసుకెళ్లిపోయారు. అప్పులు కట్టేందుకు బంగారం, ఊర్లో భూమి, హైదరాబాద్లో స్థలం అమ్మేశాను. రూ.80 లక్షల నష్టం వచ్చింది. అప్పుల భారంతో ఆత్మహత్యకు యత్నించాను. నా పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఉండి చదువుతున్నారు. డ్రైవర్గా పనిచేస్తూనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తున్నాను. మా ఊర్లో 14 మంది లారీలు అమ్ముకుని రోడ్డుపాలయ్యారు.’’ – ఇది ఒక పేర్ల భద్రాచలం వ్యథ మాత్రమే కాదు. ఆయనలాంటి లారీ యజమానులు ఎందరో... నూగూరి మహేందర్సొంతంగా ఒక లారీ కొనుక్కొని, దాన్నే నమ్ముకుని జీవిస్తున్న సింగిల్ లారీ ఓనర్ల వ్యవస్థ కనుమరుగవుతోంది. ఆటోమొబైల్ తయారీ సంస్థలు అనుసరిస్తున్న వ్యాపార వ్యూహాలు, ప్రతి 3–4 సంవత్సరాలకే కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం సామాన్య లారీ యజమానులకు మోయలేని ఆర్థిక భారంగా మారుతోంది. మారుతున్న మార్కెట్, కస్టమర్ల డిమాండ్లతో పాత బండ్లను పక్కనపెట్టి, భారీ అప్పులు చేసి మరీ కొత్త మోడళ్లను కొనాల్సిన పరిస్థితి. పాత బండి అప్పు తీరకముందే, మరో కొత్త వాహనాన్ని కొనాల్సి రావడం ఒంటరి లారీ యజమానులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దీంతో చేసేదేమీలేక వేలాది మంది యజమానులు తమ వాహనాలను విక్రయించి డ్రైవర్లుగా మిగిలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో ఇలాంటి వారి సంఖ్య ఈ రెండున్నర దశాబ్దాల్లో 50,000 మందికిపైమాటే. రాష్ట్రంలో ఏటా 2–3 వేల మంది తమ వాహనాలను అమ్ముతున్నట్టు సమాచారం. సరుకు రవాణా వాహనాలు తెలంగాణలో 1.80 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల లారీలు ఉంటాయి. 1 లేదా 2 లారీలు ఉన్న యజమానులు 60 శాతం ఉంటారు. మూడు దశాబ్దాల క్రితం మార్కెట్ అంతా 6 టైర్ల లారీలదే. ఇప్పుడు అధిక వాటా 16 టైర్లున్న లారీలది. క్రెడిట్ స్కోర్ లేక.. వాహన యజమానులు, డ్రైవర్లలో మెరుగైన క్రెడిట్ స్కోర్ లేనివారు 70 శాతంపైనే ఉండడం వారి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. క్రెడిట్ స్కోర్ లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చేసేదీమీ లేక 24–36 శాతం అధిక వడ్డీ అయినా, ఎన్బీఎఫ్సీలను ఆశ్రయిస్తున్నారు. ఎన్బీఎఫ్సీల నుంచి రుణం తీసుకునేవారి సంఖ్య సగం ఉంటోంది. వాటికే మొదటి ప్రాధాన్యం మార్కెట్ అంతా పెద్ద పెద్ద కార్పొరేట్ లాజిస్టిక్స్ కంపెనీల చేతుల్లోకి వెళ్తోంది. ఈ కంపెనీలు, సరుకు రవాణా చేసే క్లయింట్లు ఎప్పుడూ కొత్త మోడల్, ఎక్కువ మైలేజ్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు , అధిక బరువు మోయగలిగే వాహనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 16కుపైగా చక్రాలు ఉన్న వాహనాలకే సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా గిరాకీ ఉంటోంది. 14, 12, 10, 6 టైర్ల లారీలు తక్కువ దూరాలు, లేదా ఒకట్రెండు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి. ఈఎంఐ తీరకముందే.. వాహనానికి సంబంధించిన నెలవారీ వాయిదాలు చెల్లించి, అది పూర్తిగా సొంతం కావడానికి కనీసం 4–5 ఏళ్ల సమయం పడుతుంది. కానీ ట్రక్కుల తయారీ కంపెనీలు ప్రతి 3–4 ఏళ్లకే మెరుగైన మైలేజీ ఇచ్చే నూతన మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. పాత బండి లోన్ పూర్తిగా తీరకముందే, మార్కెట్లో పోటీ తట్టుకోవడానికి పాత వాహనాన్ని తక్కువ ధరకు అమ్ముకొని, మళ్లీ కొత్త మోడల్ కోసం అప్పుల ఊబిలోకి కూరుకుపోవాల్సి వస్తోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్గ్రేడేషన్కు రాయితీలు.. ఒకవైపు డీజిల్ ధరల పెరుగుదల, టోల్ ప్లాజా చార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియం భారం ఉండగా, మరోవైపు కంపెనీల కొత్త మోడళ్ల ఒత్తిడి తోడైంది. పాత బండ్లకు రీసేల్ వాల్యూ (అమ్మకం ధర) దారుణంగా పడిపోతోంది. కంపెనీలు క్రమం తప్పకుండా మోడళ్లను మార్చడం వల్ల స్పేర్ పార్ట్స్ కొరత కూడా తలెత్తుతోంది. ఈ వ్యూహాత్మక మార్కెట్ మాయాజాలంలో కార్పొరేట్ ఫ్లీట్ ఆపరేటర్లు తట్టుకోగలుగుతున్నా, కేవలం ఒకటో రెండో బండ్లు ఉన్న సాధారణ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లు కావలెను.. సరుకు రవాణా రంగాన్ని డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తోంది. వాహనాల సంఖ్యతో పోలిస్తే 40 శాతం డ్రైవర్ల కొరత ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10 ఏళ్ల క్రితం డ్రైవర్ బత్తా నెలకు రూ.25 వేలు. ఇప్పుడు రూ.50 వేలు దాటింది. అయినా డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకోవడానికి యువత ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం రేట్ ఫిక్స్ చేస్తేనే.. వాహన సామర్థ్యం, కిలోమీటర్ను బట్టి ప్రభుత్వమే కిరాయి నిర్ణయించాలి. అప్పుడే సింగిల్ లారీ ఓనర్లు బతుకుతారు. డ్రైవర్లు, సింగిల్ లారీ యజమానుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు కావాలి. బీమా, పెన్షన్, పిల్లలకు ఉచిత విద్య, సంక్షేమ పథకాల్లో భాగం చేయాలి. ప్రభుత్వానికి భారీ ఆదాయం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ఇది. ఒక వాహనంతో 6–10 మందికి ఉపాధి లభిస్తుంది. అయినా మాపట్ల ఎవరికీ గౌరవం లేదు. అందుకే ఈ రంగం వ్యవస్థీకృతం కావాలి – మంచిరెడ్డి రాజేందర్రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్. నిలదొక్కుకునేది ఎప్పుడు? 12 చక్రాల లారీ ఖరీదు 2014లో రూ.23 లక్షలు. ఇప్పుడు రూ.33 లక్షలు. వాయిదాల్లో వాహనం కొంటే వడ్డీ రూ.8–10 లక్షలు అదనం. 1.5 లక్షల కిలోమీటర్లు తిరిగి, మంచి కండీషన్లో ఉంటే 5 ఏళ్ల పాత లారీకి రీసేల్ ధర రూ.15 లక్షలు వస్తోంది. నాలాంటి సింగిల్ లారీ ఓనర్లు ఈఎంఐలు తీరిపోయి జీవితంలో నిలదొక్కుకోవచ్చు అనుకునే సమయానికి కొత్త బండి కొనాల్సిన పరిస్థితి. లేదంటే ఈ రంగం నుంచి తప్పుకోవాల్సిందే. – పోరెడ్డి మల్లారెడ్డి, బాలాపూర్, హైదరాబాద్ -
రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ రూ.70 వేల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం హైపర్వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కలిపి దేశంలోనే అతిపెద్ద భారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రం నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో టీసీఎస్ ఎండీ, సీఈవో కృతివాసన్– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఒక గిగావాట్ సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సంస్థ 250 ఎకరాల భూమిని సేకరించింది. ఏఐలో ముందు వరుసలో: సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో ఈస్థాయిలో భారీ పెట్టుబడి రావడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ. .‘నా కల నెరవేరింది. ఫ్యూచర్ సిటీలో రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుండటం గర్వకారణం. నేను టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ను దావోస్లో కలిసి తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని కోరాను. అప్పుడు ఆయన నవ్వుతూ సరేనన్నారు. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఈ డేటా సెంటర్ ద్వారా 7000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే టాటా సంస్థ తరపున రాష్ట్రంలో 85 వేల మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏడువేలతో అది 92 వేలకు చేరుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్సిటీ వరకు నిర్మిస్తున్న మొత్తం 50 కి.మీ. రహదారికి భారతరత్న రతన్టాటా పేరు పెడుతున్నాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను నిలపాలన్న స్వప్నం సాకారం కావాలంటే ఫారŠూచ్యన్ 500 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. 2047 నాటికి మూడు ట్రిలియన్ ఎకానమీని సాధించాలి. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తోంది. దానిని పది శాతానికి పెంచాలన్నది నా తాపత్రయం. ప్రపంచ ఏఐ విప్లవంలో హైదరాబాద్ ఇప్పుడు ముందు వరసలో నిలిచింది’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య విధానాల్లో భిన్నాభిప్రాయాల్లో ఉండవచ్చు కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి విషయంలో మాత్రం అలాంటివేమీ ఉండవని స్పష్టం చేశారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భావన ఉందని, ఇందులో ఇంజనీరింగ్ టెకీలకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేనని, కానీ బ్లూకాలర్ జాబ్స్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని రేవంత్రెడ్డి చెప్పారు. మావి మాటలు కాదు...పెట్టుబడులు :శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఫ్యూచర్సిటీలో పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెపప్పారు. తాము కేవలం మాటలు చెప్పడం లేదని. పెట్టుబడుల రాక నిజమని వ్యాఖ్యానించారు. టీసీఎస్ ఆతిథ్య, పర్యాటక, పరిశ్రమలు, సేవారంగం,అటవీ రంగాల్లో పెట్టుబుడులు పెడుతోందన్నారు. తెలంగాణవైపు దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నాయన్నారు. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని టీసీఎస్ ఎండీ, సీఈవో కె.కృతివాసన్, చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రతిపాదించిన పెట్టుబడులపై ఇస్తున్న సహకారానికి హైపర్వాల్ట్ ప్రెసిడెంట్ రాజన్న, సీఈఓ దీపేష్ కిరణ్ నందాలు కృతజ్ఞతలు తెలిపారు. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఇది ఒకటిగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనగా, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’
హైదరాబాద్: ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతుంది అనే డైలమా కొనసాగుతున్న తరుణంలోనే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు తమ స్వరం పెంచాయి. కొండా సురేఖ ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాకుండానే బీఆర్ఎస్, బీజేపీలు నేరుగానే దాడి ప్రారంభించాయి. కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేట్ను కూడా ఆమె తాకలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా దాదాపు అదే స్వరం వినిస్తుంది. కొండా సురేఖ తమ పార్టీలోకి కూడా వద్దంటూ బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు తేల్చిచెప్పేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం తర్వాత బీజేపీలోకి చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీదర్రావు సంచలన ట్వీట్ చేశారు. BJP అంటే BIN అనుకుంటున్నారా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి బహిష్కృతం అయిన నేతలను తీసుకునే రాజకీయ డంపింగ్ గ్రౌండ్గా బీజేపీ ఉండదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం కనిపిస్తున్న సమయంలోనే ప్రతి ఊహాగానానికి బీజేపీని లింక్ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీని చర్చలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్లోని అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే లోపే బీజేపీ పేరును తెరపైకి తెచ్చి రాజకీయ నరేటివ్ను ముందుగానే మార్చే ప్రయత్నం జరుగుతోందా?, తెలంగాణ బీజేపీ లక్ష్యం కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు ఆశ్రయం కల్పించడం కాదు.కాంగ్రెస్, బీఆర్ఎస్లకు విశ్వసనీయ సొంతంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి, వ్యక్తిత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానాల్లో కనిపించాలి. బీజేపీకి కార్యకర్తల బలం, కేడర్ కమిట్మెంట్ కీలకం. పార్టీని కేవలం నేతల చేరికలతో బలోపేతం చేయడం కాదు. ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యం. అందుకే “BJP = BIN” అనే రాజకీయ నరేటివ్ను నమ్మొద్దు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాల వెనుక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో కూడా చూడాలి. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం.. మరో పార్టీకి పేరు మార్చిన రూపం కాదు’ అని స్పష్టం చేశారు.BJP is NOT a BIN.Why is the media so eager to drag BJP into every speculative political story—just when the Congress crisis appears to be unfolding?Is this an attempt to prematurely stop the game, divert the narrative, and help Congress nip its troubles in the bud?BJP…— P Muralidhar Rao (@PMuralidharRao) September 5, 2026 ఇవీ చదవండి: సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’ -
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఓ భర్త...భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్కు చెందిన లాలుతో 2023లో చెంగిచెర్లకు చెందిన రత్నావత్ అనిత (21)కు ప్రేమవివాహం జరిగింది.వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. రెండు నెలలుగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అనిత నెలరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2న లాలు వచ్చి కుమార్తెను తీసుకెళ్లాడు. మళ్లీ 3న చెంగిచెర్లకు వచ్చాడు. అయితే కూతురిని తీసుకురాలేదు.మనవరాలు ఎక్కడ ఉందని అనిత తండ్రి లాలుని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న పెట్రోల్ను అనితపై పోసి నిప్పంటించాడు. కుమార్తెను రక్షించేందుకు అనిత తల్లి ప్రయత్నించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న అనిత తండ్రి కేకలు విని వెంటనే వచ్చి మంటలను ఆర్పి, అనంతరం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఇవి కూడా చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు -
తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. హాస్టల్ గదుల్లో దాక్కున్న విద్యార్థులను తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి దాడి చేశారు. బుధవారం రాత్రి తీజ్ వేడుకల్లో మధ్య తలెత్తిన వివాదంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పడంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. వీరికి మిగతా విద్యార్థులు సర్ది చెప్పి పంపించారు.ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా గౌతమి, మంజీరా హాస్టళ్ల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ వేరే హాస్టళ్ల గదులకు వెళ్లిపోయారు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి చెప్పారు. విచారణ చేస్తున్నాం: డీసీపీ జేఎన్టీయూహెచ్లో గొడవకు కారణమైన ఇరువర్గాల విద్యార్థులపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. శుక్రవారం ఏసీపీ రవికిరణ్రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయ్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. వర్సిటీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ నిర్వాహకులను, ఇతర సిబ్బందితో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ర్యాగింగ్ కారణంగా గొడవ జరిగిందనే విషయం వాస్తవం కాదన్నారు.కేసులు ఇలా.. కాట్రావత్ నవీన్ నాయక్ ఫిర్యాదు మేరకు రాజు, ఆనంద్, వసంత్, దుర్గా ప్రసాద్, ఆదిత్య, సాగర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే విధంగా వసంత్నాయక్ ఫిర్యాదు మేరకు నవీన్ నాయక్, ప్రశాంత్, సందీప్, ఇస్మాయిల్, వెంకట్, చక్రి, సాత్విక్, ప్రకాష్లపై కేసులు నమోద య్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, సందీప్, పూజిత్, రాజే‹Ù, సన్నీ, ఇస్మాయిల్, ఇమ్మాన్యుయేల్లపై కేసులు నమోదు చేశారు. -
సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం, కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారం జరుగుతుందని తెలిపారు.మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. ఢిల్లీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపై మాత్రమే చర్చ జరిగింది. కేబినెట్ విస్తరణపై హై కమాండ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం. నాకు మంత్రి పదవి అనే ప్రచారంపై నాకు మాత్రం సమాచారం లేదు. అవన్నీ ఊహాగానాలే. అలాగే, కొండా సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. సురేఖ విషయంలో అందరం మా వంతు ప్రయత్నం చేశాం. సురేఖ విషయంలో ఏఐసీసీ ఒప్పుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ నెరవేర్చారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశాం. రాబోయే వంద రోజులు దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తాం. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు.మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్ బీసీల అంశంపై స్పందించాలి. అడిగితే పదవులు పోతాయని బీజేపీ బీసీ నేతలు భయపడుతున్నారా?. తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా తేల్చుకోండి. కుల గణనలో దేశానికి రోల్ మోడల్గా ఉన్నాం. తెలంగాణ చేసిన కులగణనలో అన్ని విషయాలు పొందుపరిచాం. మేం పంపిన ఫైల్పై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఓబీసీల జనాభాను ఎందుకు లెక్కించడం లేదు? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: తెలంగాణలోనూ అలాగే గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్ -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులపై అథ్లెట్ ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్పై ఆరోపణలు చేసిన అంతర్జాతీయ అథ్లెట్ తక్కళ్లపల్లి ప్రతిభ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ గౌడ్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తూ, కించపరిచేలా పోస్టులు, సందేశాలు పెడుతున్నారని ఆరోపించారు. తనను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరించే ధోరణిలోనూ సందేశాలు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల శ్రీనివాస్ గౌడ్పై తాను చేసిన ఆరోపణల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారని ప్రతిభ ఆరోపించారు. చదవండి: తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్ -
మినిమం చార్జీ రూ.30
సాక్షి, హైదరాబాద్: ఆటోరిక్షా మీటర్ చార్జీ లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస చార్జీ రూ.20 నుంచి రూ.30కి, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు నమోదయ్యే మొత్తాన్ని రూ.11 నుంచి రూ.14కు పెంచాలని ఆటో చార్జీల పునఃసమీక్ష కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు రెండు రోజుల క్రితం నివేదిక అందజేసింది. దాన్ని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని రెండుమూడు రోజుల్లో కొత్త చార్జీలను అధికారికంగా వెల్లడించి అమలులోకి తేనుంది. 2014 ఫిబ్రవరి 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన చార్జీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో వాటిని సవరించాలని, అవి తమకు సరిపోవడం లేదని ఆటోరిక్షా సంఘాలు కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ను ప్రభు త్వం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. వెరసి పుష్కర కాలం తర్వా త ఆటో చార్జీలు పెరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల సంఘాల విజ్ఞప్తుల మేరకు 2022లో ఏర్పాటు చేసిన కమిటీ తొలి 1.6 కిలోమీటర్లకు రూ.26, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు రూ.15 చొప్పున చార్జీలు పెంచాలని సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగులో ఉంచింది. ఇటీవల ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సంఘాలు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచి్చన నేపథ్యంలో ప్రభుత్వం ఆటో చార్జీల అంశంపై మరోసారి దృష్టి సారించింది. చార్జీల పెంపుపై 15 రోజుల్లో ప్రతిపాదన పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో సంఘాలు సమ్మెను విరమించాయి. కనీస చార్జి రూ.30 నుంచి రూ.50 మధ్యలో పెంచాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సెపె్టంబర్ 3న తన నివేదికను సమరి్పంచింది. వాహన కొనుగోలు, రుణా లు, తరుగుదల, ఇంధన ధరలు, ఆటోరిక్షాల మరమ్మతులు, బీమా, పన్నులు, నిర్వహణ వ్యయం, డ్రైవర్ ఆదాయం, ట్రాఫిక్ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఆటోరిక్షా నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ.13.53గా లెక్కించింది. దీనిని రౌండ్ఆఫ్ చేసి రూ.14గా పరిగణించాలని సూచించింది. కమిటీ సిఫారసులు ఇవే.. ⇒ తొలి 1.6 కిలోమీటర్లకు కనీస చార్జీ: రూ.30 ⇒ ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు: రూ.14 ⇒ వెయిటింగ్ చార్జీ: నిమిషానికి 75 పైసలు ⇒ ప్రయాణికుడితో పాటు తీసుకెళ్లే సామానుకు అదనపు చార్జీలు వర్తింపు ⇒ 60+40 సెం.మీ. కంటే తక్కువ పరిమాణంలోని బ్రీఫ్కేస్, హ్యాండ్బ్యాగ్ తది తరాలకు మినహాయింపు. గరిష్ఠంగా 100 కిలోల సామాను ⇒ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీకి ఒకటిన్నర రెట్లు వసూలు చేసుకోవచ్చు. ప్రతి ఆటోలో టారిఫ్ కార్డు కమిటీ సిఫారసులను పరిశీలించి, 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67(1) ప్రకారం కొత్త ఆటో చార్జీలను నోటిఫై చేయాలని రవాణా శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. 2014లో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 20ను రద్దు చేసి కొత్త చార్జీలను అమలు చేయాలని కోరింది. కొత్త చార్జీలు అమల్లోకి వచి్చన అనంతరం డిజిటల్ ఆటో మీటర్లను కొత్త టారిఫ్కు రీసెట్ చేసేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. ఈ వ్యవధిలో పాత, కొత్త చార్జీల వివరాలతో కూడిన టారిఫ్ కార్డును ప్రతి ఆటోలో ప్రదర్శించాలని సూచించింది. ఇతర నగరాలతో పోలిస్తే.. ఇతర నగరాల కంటే తెలంగాణలో కొత్త కనీస చార్జీ ప్రతిపాదన రూ.30గా ఉన్నప్పటికీ, బెంగళూరుతో పోలిస్తే తక్కువగా ఉండగా, కేరళం, ఢిల్లీతో సమానంగా ఉంది. అయితే ప్రతి అదనపు కిలోమీటర్కు రూ.14గా ప్రతి పాదించిన చార్జీ కేరళ (రూ.15), ముంబయి (రూ.17.14), బెంగళూరు (రూ.18) కంటే తక్కువగా ఉంది. ఎంతెంత అదనం? ⇒ ప్రారంభ ప్రయాణంపై రూ.10 అదనపు భారం కనిపిస్తుంది. ⇒ 3 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రస్తుతం రూ.35.40 అవుతుండగా, కొత్త చార్జీ అమల్లోకి వస్తే రూ.49.60 అవుతుంది. ⇒ 5 కిలోమీటర్ల ప్రయాణానికి పాత చార్జీ రూ.57.40, కొత్త చార్జీ రూ.77.60. ⇒ 10 కి.మీ. దూరానికి ప్రస్తుతం రూ.112.40 ఉంటే, కొత్త చార్జీ రూ.147.60. ⇒ 15 కి.మీ.కు ప్రస్తుతం రూ.167.40గాఉన్న చార్జీ రూ.217.60గా మారుతుంది. అసలు మీటర్లు ఏవి?ఛార్జీలు పెంచాలని ఆటో సంఘాలు కోరినా, నగరంలో ఎక్కడా ఆటోల్లో మీటర్ల వినియోగం లేదు. ఉబర్, ఓలా, ర్యాపిడోలతో అనుసంధానమైన వారు ఈ చార్జీలతో ప్రమేయం లేకుండా అగ్రిగేటర్ల సొంతచార్జీలనే వసూలు చేస్తున్నారు. వాటి కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే క్రమంలో, సొంత ఆటో వాలాలు మీటర్ల కనెక్షన్లు తొలగించి తోచిన మొత్తం వసూలు చేసుకుంటు న్నారు. తమ పరిధిలోకి రానందున అగ్రిగేటర్ ఆటోలపై రవాణాశాఖ చర్యలు తీసుకోవడం లేదు. సాధారణ ఆటోలను పట్టించుకోవటం ఎప్పుడో వదిలేసింది. వెరసి, ప్రభు త్వం నిర్ధారించే చార్జీలతో ప్రమేయం లేకుండా ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు చార్జీల పెంపు పేరు తో అటు అగ్రిగేటర్ యాప్లు కూడా ఛార్జీలను మరింత పెంచబోతున్నాయి. -
కృష్ణా జలాల పంపిణీపై ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నిల్వ ఉన్న నీటి పంపిణీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం నీటి పంపిణీపై జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రీసభ్య కమిటీ రెండో సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్య కుదరలేదు. కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్కంబోజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) రమేశ్బాబు, ఏపీ ఈఎన్సీ(ఇరిగేషన్) నరసింహమూర్తి పాల్గొన్నారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం జరగ్గా.. నీటి పంపిణీపై సయోధ్య కుదరకపోవడంతో సెపె్టంబరు మూడో వారంలో జరగనున్న బోర్డు సమావేశంలోనే చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదీ తెలంగాణ వాదన ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి 200 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టింది. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న జలాలను 50:50 శాతం నిష్పత్తితో పంచాలని డిమాండ్ చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య 66: 34 నిష్పత్తిలో నీళ్ల పంపిణీకి ఏపీ పట్టుబట్టగా, తెలంగాణ అంగీకరించబోమని స్పష్టం చేసింది. ⇒ పెన్నా బేసిన్లో 80 టీఎంసీలకు పైగా నిల్వలున్నాయని, పోతిరెడ్డిపాడు నుంచి 19 టీఎంసీలు, చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు కలుపుకొని 34 టీఎంసీలు మాత్రమే తరలించాల్సి ఉండగా, ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు నుంచి 25.91 టీఎంసీలను ఏపీ తరలించిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఏపీ, తెలంగాణ మధ్య 50.50 నిష్పత్తిలో నీటి పంపిణీ ఆధారంగా, ఏపీకి ఇంకా 36.37 టీఎంసీల వాటా మాత్రమే మిగిలి ఉందని తేల్చి చెప్పింది. కృష్ణా పరీవాహకం వెంట 2 కోట్ల మంది జనాభా తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉందని, 2027 మే 31 దాకా 200 టీఎంసీలను తాగు నీటికి కేటాయించాలని పట్టుబట్టింది. సాగర్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గానే శ్రీశైలం ఉందని గుర్తు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదీ ఏపీ వాదన... తాగునీటి అవసరాలు లేనప్పటికీ సాగర్ ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ ప్రత్యారోపణలు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాటాకు లోబడి నీటిని తరలిస్తున్నామని, అంతకు మించి తరలించడం లేదని తెలిపింది. తమ తాగునీటి అవసరాల కోసం 2027 ఆగస్టు దాకా 104 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ పట్టుబట్టింది. తెలంగాణ ఏ విధంగా 200 టీఎంసీల నీటిని కావాలని కోరుతుందో లెక్కలను తెలపాలని కోరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస నీటిమట్టంపైన 139.28 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని, ఆ జలాలను 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు కేటాయించాలని కోరింది. తెలంగాణ 39.49 శాతం, ఏపీ 60.51 శాతం వినియోగం ఇప్పటివరకు 111.96 టీఎంసీల కృష్ణా జలాల వినియోగం జరగ్గా, అందులో తెలంగాణ 39.49 శాతం (44.216 టీఎంసీలు).. ఏపీ 60.51 శాతం (67.75 టీఎంసీల) నీటిని వాడుకున్నట్టు కృష్ణా బోర్డు తెలిపింది. ఈనెల 3వ తేదీ దాకా శ్రీశైలం నుంచి 29.91 టీఎంసీలను ఏపీ తరలించగా, తెలంగాణ 8.71 టీఎంసీలను తరలించింది. సాగర్ నుంచి తెలంగాణ 13.877 టీఎంసీలు తరలించగా, ఏపీ 11.36 టీఎంసీలు తరలించింది. -
రైతు బీమా బంద్!
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో చనిపోయాడు. ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు. కుటుంబపెద్ద మరణంతో రాంచందర్ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలిశారు. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచి పోయిందని, బీమా క్లెయిమ్ కాదని చెప్పడంతో రాంచందర్ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. అసలే పేద కుటుంబం..ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబానికి ఆసరాగా నిలిచిన ‘రైతు బీమా’పథకానికి బ్రేక్ పడింది. రైతు సహజంగా మరణించినా.. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షలు అందేలా అమలు చేసిన ఈ పథకం గత నెల 14వ తేదీ నుంచి నిలిచిపోయింది. రైతులపై ఒక్క రూపాయి భారం లేకుండా మొత్తం ప్రీమియం చెల్లించి, అమలు చేసిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడంతో బాధిత రైతు కుటుంబాలు దిక్కులేనివిగా మారాయి. 2025–26 బీమా కాలపరిమితి ఆగస్టు 14తో ముగియగా, 2026–27 సంవత్సరానికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. దీంతో రైతు బీమా పథకం పునరుద్ధరణ నిలిచిపోయింది. 2018లో శ్రీకారం చుట్టిన కేసీఆర్ రాష్ట్రంలో 2018 ఆగస్టు 15న రైతు బీమా పథకం ప్రారంభమైంది. రైతు పేరిట గుంట వ్యవసాయ భూమి ఉన్నా, ఈ పథకం వర్తింపజేసేలా రైతుబీమాను రూపొందించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న పట్టాదారు రైతులను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. రైతు మరణానికి కారణంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం దీని ప్రత్యేకత. ప్రభుత్వమే బీమా సంస్థకు ప్రీమియం చెల్లించడంతో రైతు కుటుంబాలపై ఎలాంటి ఆర్థిక భారం పడలేదు. సాధారణంగా బీమా క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ కూడా వేగంగా జరిగేలా వ్యవస్థను రూపొందించారు.దీంతో రైతు మరణించిన వారం నుంచి పది రోజుల్లోనే రూ. 5లక్షల బీమా సొమ్ము నామినీ పేరిట ఉన్న బ్యాంకు అకౌంట్లోకి బదిలీ అయ్యేది. రాష్ట్ర వ్యాప్తంగా 2018–19 నుంచి 2025–26 వరకు 1,86,363 మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు మొత్తం రూ.9,107.80 కోట్లు పరిహారంగా అందింది. ప్రతి మరణానికి రూ.5 లక్షల చొప్పున చెల్లింపులు జరిగాయి. రూ.9,653.74 కోట్ల ప్రీమియం చెల్లింపు రైతుబీమా పథకానికి ప్రభుత్వం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించింది. 2018–19 నుంచి 2025–26 వరకు మొత్తం రూ.9,653.74 కోట్ల ప్రీమియం చెల్లించినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. పథకం ఆగిపోయే నాటికి రైతు బీమా పథకం పరిధిలో సుమారు 42.16 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి కోసం ఏటా సగటున రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేది. కాగా ఈ సంవత్సరం బడ్జెట్లో రైతుబీమాకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఈ ఆగస్టు 14 నాటికి 2026–27 సంవత్సరానికి గాను ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించక పోవడంతో రైతుబీమా పథకం అధికారికంగానే ఆగిపోయింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కోసమే రద్దు..? రాష్ట్రంలో రైతులకు మాత్రమే అమలవుతున్న రైతుబీమా పథకం బదులు ఆహార భద్రత కార్డు (రేషన్కార్డు) కలిగిన 1.15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు గత మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’పేరుతో అమలయ్యే ఈ పథకానికి రూ.4వేల కోట్లను బడ్జెట్లో కేటాయించినట్టు చెప్పారు. కుటుంబంలోని ప్రధాన సంపాదనదారు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము అందేలా పథకాన్ని రూపొందిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించినా, ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.ఆగస్టు 14–నవంబర్ 19 మధ్య మరణిస్తే?రైతు బీమా గడువు ఆగస్టు 14న ముగియగా, కొత్త బీమా పథకం ఇంకా అమల్లోకి రాలేదు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’అమలు చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా, ఈ మధ్యలో మరణించే రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఉంటుందా? లేదా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో బీజేపీ చీఫ్?
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పోటీ చేయనున్నారా? ఈ ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్, ఉమ్మడి వరంగల్–నల్లగొండ–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు బీజేపీ జాతీయ ,రాష్ట్ర నాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సెపె్టంబర్ నెలలోనే కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ఓటరు నమోదుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో ఆశావహులు, నేతలు ఈ రెండు సీట్లలో పోటీ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.కొత్త పట్టభద్ర ఓటర్లను చేర్చుకునే ప్రయత్నాలు మొదలు, మిగతా వారి వివరాలు, సమాచారం సేకరణ ఇలా ముందస్తు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానం నుంచి పార్టీ టికెట్ కోసం పోటీలో ఇప్పటికే 26 మంది గట్టి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈసారి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ గెలిచేందుకు అన్ని అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వానికి సైతం నివేదిక చేరిందట. అదీగాకుండా గతంలోనూ హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి రాంచందర్రావు గెలిచిన సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి చేతుల్లో ఓడిపోయారు. ప్రస్తుతం మారిన రాజకీయ వాతావరణం, గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్ కైవసం, గతంతో పోలి్చతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఇలా అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం పక్కా అనే అభిప్రాయం పార్టీనేతల్లో వ్యక్తమవుతోంది.దీంతో రాంచందర్రావునే బరిలో నిలిపితే సరిపోతుందనే అభిప్రాయానికి బీజేపీ అగ్రనేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా చట్టసభల్లో ప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)కూడా ఉండడంతో ఇక్కడ కూడా రాంచందర్రావునే అభ్యర్ధిగా ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేయవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైతే తాను రేసులో లేనని, పోటీ చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తే మాత్రం దానిని శిరసా వహించక తప్పని పరిస్థితి ఉంటుందని రాంచందర్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. -
కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని..అయితే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని శబరి బ్లాక్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై హైకమాండ్ సమానంగా చర్యలు తీసుకుందని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. ‘కూతురు సుస్మిత తెలిసి చేసినా తెలియక చేసినా.. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాల్సింది. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండేది. అలా చేయలేదు కాబట్టే ఏఐసీసీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది’అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బ్లాక్మెయిల్ చేసే అవసరం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కొండా సురేఖపై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సర్దిచెప్పానని మహేశ్గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపట్ల అంత కఠినంగా కూడా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మహేశ్గౌడ్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలను పంచుకోవాలని, ప్రతిపక్ష నేతగా తన వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకోవడం సహజమే అయినా అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నో సమీకరణాలు ఉంటాయని చెప్పారు. -
రేపు ఎర్రవల్లిలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎర్రవల్లి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ కార్యాలయం సమాచారం పంపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే పాలక పక్షం వైఫల్యాలపై బీఆర్ఎస్ చార్జ్షిట్ విడుదల చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 2వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలు, పార్టీ సభ్యుల నడుమ సమన్వయంపై కేసీఆర్ మార్గదర్శనం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్, సీఎం లక్ష్యంగా కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన ఆరోపణలను అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ సభ్యులు దూకుడుగా వ్యవహరించాలని కేసీఆర్ చెప్పే అవకాశముంది. 22ఏ జాబితాలో ప్రైవేట్ భూములు చేర్చడం, కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపైనా వ్యూహం ఖరారు చేయనున్నట్టు సమాచారం. -
కాంగ్రెస్లో కుతకుత
సాక్షి, హైదరాబాద్: అసలే కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్తో అతలాకుతలమవుతున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త కుతకుతలు మొదలయ్యాయి. చిన్నారెడ్డి స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా గద్వాల విజయలక్ష్మి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్గా గుండు సుధారాణిల నియామకాలు దేనికి సంకేతాలనే చర్చ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రచ్చకు కారణమవుతోంది. పార్టీలో చర్చించి నియామకాలు చేపట్టాల్సి ఉండగా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ నియామకాలు చేపట్టడంపై అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్న ఓ కీలక నేత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోస్టుల భర్తీ విషయంలో పార్టీలో చర్చించి, టీపీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాల్సి ఉండగా, ఏకపక్షంగా పదవులు ప్రకటించడాన్ని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్య నేత గుర్రు.. సురేఖకు ఉద్వాసన పలకగానే సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటూ ముగ్గురు మహిళలకు కీలక పదవులిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన హైదరాబాద్ నగర మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించారు. ఆమెకు కేబినెట్ హోదా కల్పించడమే కాకుండా గతంలో చిన్నారెడ్డి తరహాలోనే మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనకూ కేబినెట్ హోదా ఉంది. మళ్లీ ఇప్పుడు కుమార్తెకు ఎందుకు పదవి ఇవ్వాల్సి వచ్చిందని, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా ఇస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న ఆమెను అక్కడి నుంచి తొలగించి మరీ కేబినెట్ హోదా గల పదవిలో ఎందుకు నియమించారని, కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మహిళా నేతల్లో ఆ పదవి నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్న వారు లేరా అనే ఆవేదన వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డిలకు ఎందుకు కేబినెట్లో అవకాశం ఇవ్వరనే వాదనా వినపడుతోంది. ఉత్తమ్ పద్మావతికి మంత్రి పదవి, భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ అడిగినప్పుడు ఈ కుటుంబ నిబంధన ఎలా అడ్డువచ్చిందని కొందరు బాహాటంగానే ప్రశి్నస్తున్నారు. మరోవైపు వరంగల్ మాజీ మేయర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని ప్రాధాన్యం గల పోస్టులో నియమించారు. ఈ ఇద్దరూ కష్టకాలంలో పార్టీలో లేరని, అధికారం వచ్చాక పార్టీలోకి వచ్చిన వీరికి క్లిష్ట సమయంలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా మున్నూరుకాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు ఏదో అవకాశం కల్పించామని చెప్పుకునేందుకు చేసే ప్రయత్నాలు సఫలం కావనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పెనం మీద నుంచి పొయ్యిలోకి... తాజా పరిణామాలపై పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మనసుకు బాధ అనిపిస్తుంది. సురేఖ కుమార్తె చేసిన దానికి ఆమెను బలిచేశారు. పార్టీలో కనీసం మూడేళ్లు పనిచేసి ఉంటేనే మండల పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్నప్పుడు ఎన్నేళ్లు పనిచేశారని గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా, కేబినెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించారు? తన మేయర్ పదవిని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సుధారాణి పార్టీ అభివృద్ధి కోసం ఏం కష్టపడ్డారని కుడా చైర్మన్ ఇచ్చారో అర్థం కావడం లేదు.అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడింది ఇందుకేనా? పంతాలకు పోయి పార్టీని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతల ప్రస్తుత మానసిక స్థితికి అద్దం పడుతోంది. గుండు సుధారాణికి కుడా చైర్మన్ ఇవ్వడం పట్ల వరంగల్ కాంగ్రెస్ నేతలు, ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సురేఖ పోయి సుధారాణి వచ్చిందని, తద్వారా తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విధేయ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి లాంటి వారు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా... భవిష్యత్ ఓరుగల్లు రాజకీయాలు మరింత రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
మందు గోలీ.. ఖాళీ!
(చిలుకూరి అయ్యప్ప) ఈఎస్ఐ డిస్పెన్సరీలతో పాటు ఈఎస్ఐ ప్రాంతీయ ఆస్పత్రులు కూడా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్నపాటి జబ్బులకు కూడా సరైన మందులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు కూడా మందులు కరువయ్యాయి. కొన్ని డిస్పెన్సరీల్లో జ్వరం, దగ్గు మందులు కూడా లేవు. అనారోగ్యంతో వెళ్లే రోగులకు సాధారణ పరిశీలన నిర్వహించి మందు బిళ్లలు రాసిస్తున్నారు. మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కార్మీకుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం ద్వారా అమలు చేస్తున్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) స్ఫూర్తి దెబ్బతింటోంది. నిధుల కొరత, క్షేత్రస్థాయి డిమాండ్పై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణమవుతున్నాయి. ఆర్నెల్లుగా సమస్య జఠిలం గత ఆర్నెల్లుగా సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉంది. ప్రస్తుతం ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ ఈ సమస్య తీవ్రమైంది. కొన్ని డిస్పెన్సరీల్లో పారాసిటమల్ మాత్రలు కూడా నిండుకున్నాయి. మందులు ఇవ్వకపోవడంపై కొన్నిచోట్ల రోగులు, వైద్య సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ప్రాంతీయ ఆస్పత్రుల్లో సర్జరీలు చేయించుకున్న రోగులకు కేవలం రెండ్రోజులకు సరిపడా మందులు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వాటిని డిస్పెన్సరీల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు. అక్కడ స్టాక్ లేకపోవడంతో మందులు వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డిమాండ్ తెలిస్తేనే కొనుగోలు.. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందుల అంశం ఇప్పుడు అధికారులు, సిబ్బంది మధ్య దుమారం రేపుతోంది. ఉన్నతాధికారులకు ఈ అంశంపై ఫిర్యాదులు, వినతులు అందుతున్నాయి. సాధారణంగా మందుల కొనుగోలు ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. దీంతో వారు ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో మందుల కొనుగోలుకు అనుమతి వచి్చనట్లు సమాచారం. కాగా ఈ అంశంపై నాచారం ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ స్పందిస్తూ.. ‘మందుల కొనుగోలుకు పది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో డిస్పెన్సరీల నుంచి డిమాండ్ రిపోర్టును తెప్పించుకుంటున్నాం. ఈ నెల ఐదో తేదీ కల్లా సమరి్పంచాలని ఆదేశించాం. అక్కడ్నుంచి నివేదికలు అందిన తర్వాత వాటిని క్రోడీకరించి కొనుగోలు ప్రక్రియ చేపడతాం’అని ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు పద్ధతి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎస్ఎంఐడీసీ) నేరుగా మందులు కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. ఈఎస్ఐ ఆస్పత్రులకు మాత్రం సూపరింటెండెంట్లు.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంట్రాక్టర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. వాటిని తమ పరిధిలోని డిస్పెన్సరీలకు సరఫరా చేయాలి. బిల్లుల చెల్లింపులు మాత్రం సూపరింటెండెంట్ స్థాయిలోనే ఉంటుంది. రాష్ట్రంలో ఈఎస్ఐ స్వరూపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈఎస్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. ఒక్కో చందాదారు నెలకు తన వేతనంలో 0.75 శాతం చందా ఇస్తుండగా, యాజమాన్యం 3.25 శాతం చొప్పున చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్ఐ కార్పొరేషన్కు జమ అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డైరెక్టర్ ఎంప్లాయిస్ సేŠట్ట్ ఇన్సూరెన్స్ విభాగానికి నిధులు విడుదల చేస్తుంది. ఏటా సగటున రూ.650 కోట్ల మేర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర విభాగానికి నిధులు అందుతాయి. దీంతో పాటు ఆస్పత్రుల నిర్వహణ కూడా కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. ⇒ రాష్ట్రంలో నాలుగు ఈఎస్ఐ ప్రాంతీయ ఆస్పత్రులున్నాయి. నాచారం, రామచంద్రాపురం, వరంగల్, సిర్పూర్ కాగజ్నగర్లో ఇవి నడుస్తున్నాయి. ⇒ వీటి పరిధిలో 71 డిస్పెన్సరీలు కొనసాగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ రీజియన్ పరిధిలో 53 డిస్పెన్సరీలుండగా, వరంగల్ రీజియన్ పరిధిలో 18 ఉన్నాయి. ⇒ అదేవిధంగా రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు నిజామాబాద్, జీడిమెట్లలో ఉన్నాయి. ⇒ 21 లక్షల ఈఎస్ఐ చందాదారులకు సంబంధించి మొత్తం 90 లక్షల నుంచి కోటి మంది సభ్యులున్నట్లు అంచనా. ఒక్కో కార్డుదారు కుటుంబంలో తల్లిదండ్రులు, ఇతర సభ్యులు కూడా ఉంటారు. దీంతో సేవలు అందుకునే వారి సంఖ్య కోటికి చేరువలో ఉంది. ⇒ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఓపీ సేవలు అందిస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు సర్జరీలు, ఇన్పేషంట్ సేవలు, స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ సేవలు అందించాలి. సేవలు అందుబాటులో లేకుంటే రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. ఈ కేసులకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విడుదల చేస్తారు. అదేవిధంగా కొత్త డిస్పెన్సరీల ఏర్పాటు బాధ్యత ఇన్సూరెన్స్ మెడికల్ స ర్వీసెస్ డైరెక్టరేట్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి ఈఎస్ఐసీ రేట్ కాంట్రాక్ట్ ప్రకారం1,200ల రకాల మందులు కొనుగోలు చేయాలి. కానీ ఆస్పత్రులలో కేవలం 200లోపు రకాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి ప్రాణాలు కాపాడే అత్యవసర మందులు 365 రోజులు అందుబాటులో ఉండాలి. కానీ ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్ మందులు లేకపోవడం బాధాకరం. కనీసం టీటీ ఇంజక్షన్ కూడా లేదనడం దారుణమైన విషయం. కార్మీకుల నుంచి ప్రతి నెలా చందా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేషన్.. మందులను కూడా సకాలంలో కొనుగోలు చేసి పంపించాలి. అలాకాకుండా క్షేత్రస్థాయిలో మందులు కొనుగోలు చేసుకోవాలని చెప్పడం విచారకరం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మందుల సమస్యను పరిష్కరించాలి. – బి.అర్జున్, సీఐటీయూ నాయకులు, సంగారెడ్డి సేవలు అధ్వానం షుగర్ కిట్లు అందుబాటులో లేవు. ఆర్నెల్లుగా వీటి జాడ లేదు. చాలావరకు టెస్టులు బయటే చేయిస్తున్నారు. నా మిత్రుడు అత్యవసర పరిస్థితిలో సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేందుకు ప్రయత్నిస్తే అక్కడి సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు. ఈఎస్ఐ సేవలు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. – గంగాధర్రావు బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వట్లేదు మా తల్లిదండ్రులకు బీపీ, షుగర్ ఉంది. దీంతో ప్రతి నెలా మాత్రల కోసం ఈఎస్ఐ ఆర్సీపురం ఆస్పత్రికి వెళ్తాను. గత నాలుగు నెలలుగా ఈ మాత్రలు లభించడం లేదు. ఇద్దరికీ బీపీ, షుగర్ మాత్రలకు రూ.వెయ్యి ఖర్చు అవుతోంది. నెలవారీ చందా చెల్లిస్తున్నా నాకు పెద్దగా ఉపయోగం కలగడంలేదు. – బి.విష్ణు, పటాన్చెరుఇంజక్షన్ కోసం ఇబ్బందులు మా బాబుకు హిమోఫిలియా అనే జన్యుపరమైన వ్యాధి ఉంది. దీనికి ప్రత్యేక ఇంజక్షన్ అవసరం. ఆర్సీపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో సంప్రదించా. అక్కడ స్టాక్ లేదని చెప్పారు. నాచా రం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి ఆ ఇంజక్షన్ తెచ్చుకునేందుకు వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. – అశోక్ ముదిరాజ్, ఆర్సీపురం -
డ్రైనేజీలో ఆయుధాలు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారం సైనిక స్థావరంలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గత నెల 30న సాయంత్రం 6 గంటలకు అత్యున్నత రక్షణ వలయంలో ఉండే మిలిటరీ ఏరియాలోని 20 మద్రాస్ బెటాలియన్ ఆయుధాగారం (కోట్) తాళాలు పగులగొట్టి నాలుగు ఏకే–203 అసాల్ట్ రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, సివిల్ 6.35 బోర్ పిస్టల్, ప్యాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్తోపాటు మందుగుండు సామగ్రిని అపహరించిన సంగతి తెలిసిందే. చోరీకి గురైన 1,876 తూటాల మందుగుండు సామగ్రిలో ఒక మేగజైన్ తూటా ఆర్మీ క్యాంపస్లోని డ్రైనేజీలో పోలీసులకు లభ్యమైనట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో ఇంత భారీస్థాయిలో ఆయుధాలు బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే జరిగే ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీకి గురైన 12 ఆయుధాలు, మిగిలిన తూటాల కోసం ఆర్మీ క్యాంపస్లోని ప్రతీ అంగుళం పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ వింగ్ జల్లెడ పడుతున్నాయి. సైనిక స్థావరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ వాటర్ ట్యాంకర్లు, తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ఎలాంటి క్లూ దొరకకపోవడంతోనే... చోరీ జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఎలాంటి వేలి, పాదముద్రలు లభ్యం కాలేదు. దీంతో సాంకేతిక ఆధారాలపైనే దర్యాప్తు ప్రారంభించారు. సెల్ఫోన్ సిగ్నల్స్, టవర్ డంప్స్ లొకేషన్స్ను పరిశీలించిన పోలీసులకు ఏ ఆధారమూ లభ్యం కాలేదు. దీంతో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు. ఆర్మీ క్యాంపస్, పరిసర ప్రాంతాల్లోని వందలాది సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.వాటిల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గానీ, వాహనాల రాకపోకలు గానీ నమోదు కాలేదు. దీంతో చోరీకి గురైన ఆయుధాలు సైనిక స్థావరం దాటి బయటకు పోలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ చోరీలో బయటి వ్యక్తులు కాకుండా, సైనిక స్థావరంలోని లోపలి వ్యక్తుల ప్రమేయం ఉంటుందని భావించారు. దీంతో బొల్లారం ఆర్మీ క్యాంపస్లోని ఉద్యోగులు, శిక్షణ అభ్యర్థులు, స్వీపర్లను ఒక్కొక్కరికీ విచారిస్తున్నారు. క్యాంపస్లోని ప్రతీ అంగుళం అడుగడుగునా జల్లెడ పడుతున్న క్రమంలో ఆర్మీ ప్రాంగణంలోని మురుగు నీటి కాలువ అడుగు భాగంలో ఒక మేగజైన్ తూటా లభ్యమైంది. పైఅధికారుల టార్చర్ తట్టుకోలేకనే.. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద సైనిక కేంద్రాల్లో బొల్లారం ఆర్మీ సైనిక స్థావరం ఒకటి. ఇందులో మద్రాస్ రెజిమెంట్, ఆర్మీ ఆర్డినెన్స్ కోర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇతర సపోరి్టంగ్ యూనిట్లున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో ఉండే కంటోన్మెంట్ బోర్డులో.. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆర్మీ క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ ఆర్మీలో కొత్తగా చేరే అగ్నివీర్, సాంకేతిక నిపుణులు, యుద్ధ వస్తువులు, ఆయుధ సామగ్రి రవాణా, సైనిక సరుకుల లాజిస్టిక్స్పై శిక్షణ ఇస్తుంటారు. శిక్షణకు వచ్చే ఆర్మీ సిబ్బందికి సెలవులు ఉండకపోవడం, కుటుంబ సభ్యులను కలవడం గానీ, కనీసం ఫోన్లో మాట్లాడటం గానీ ఉండవు. అత్యంత కఠోర శిక్షణ ఉంటుంది. పైఅధికారుల టార్చర్ తట్టుకోలేని కొందరు శిక్షణా అభ్యర్థులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చోరీ ఘటన రోజున ఈ బెటాలియన్కు చెందిన ప్రధాన సైనిక విభాగాలు, కమాండింగ్ ఆఫీసర్, ఇతర సీనియర్ అధికారులు ఫీల్డ్ ఫైరింగ్ కోసం రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లారు. క్యాంప్లో ప్రధాన సైన్యం లేని తరుణాన్ని అవకాశంగా భావించిన పలువురు శిక్షణ అభ్యర్థులే ఈ చోరీ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
తొలగింపుపై తాపత్రయం
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం అధికార కాంగ్రెస్లో కొత్త కోణం తెరపైకి వస్తోంది. ఈ విషయంలో అధిష్టానానికి నచ్చజెప్పి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభీష్టానికి అనుగుణంగా హైకమాండ్ను ఒప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతల సహకారం ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడిన ఓ నాయకుడు, ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీకి అధికారాలు కావాలని పోరాట బాటపట్టిన మరో నాయకుడు ఏకాభిప్రాయంతో ఈ ఎపిసోడ్లో కీలకపాత్ర పోషించారని.. ఇందులో స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మరో విషయం ఏమిటంటే సురేఖకు ఖర్గే అపాయింట్మెంట్ ఇప్పించడంలో తెరవెనుక పాత్ర పోషించిన అధిష్టాన దూత ఒకరు.. ఈ వ్యవహారం ఢిల్లీకి మారాక మౌనం దాల్చారని.. ఆయన మౌనముద్రతోనే జరగాల్సిందంతా సజావుగా జరిగిందనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. మొదటి నుంచీ ఆయన చుట్టూనే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సీఎం రేవంత్కు ఢిల్లీ వేదికగా సహకరించిన కీలక నేత ఒకరి చుట్టూనే రాజకీయమంతా తిరిగింది. ఒకదశలో సురేఖ ఎపిసోడ్పై కమిటీ వేస్తారని.. ఈ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన క్యాంపు కార్యాలయంలోనే కీలక నేతల సమావేశాలు, తర్జనభర్జనలు జరిగాయి. ఆ సమయంలోనే ఆయన తన వైఖరిని సురేఖ శిబిరానికి కుండబద్దలు కొట్టి చెప్పారని సమాచారం. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా తన వైఖరిని వెల్లడించారని.. ఓ దఫా ఆయనకు ఆశించిన సమ్మతి లభించకపోయినా ఎపిసోడ్ ఢిల్లీకి బదిలీ అయ్యాక ఏఐసీసీలో ఉండే మరో ముఖ్యుడి సహకారంతో ఆయన అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పగలిగారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ కీలక నేత మంతనాల నేపథ్యంలో సురేఖ తొలుత బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపించిందని అంటున్నాయి. ఇక పార్టీలోని ఓ ముఖ్య నేత సహకారం ఈసారి సీఎం రేవంత్కు లభించిందని తెలుస్తోంది. ఇటీవల పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంలో రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆ నాయకుడు సురేఖ వ్యవహారంలో మాత్రం రేవంత్ అనుకూల శిబిరంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన కూడా సీఎం నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తలూపారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కలిసి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను నియంత్రించాలంటే నిర్ణయం తప్పనిసరిని చెప్పి అధిష్టానానికి నచ్చజెప్పారని తెలుస్తోంది. ఆ ఇరువురి సహకారానికి తోడు అధిష్టాన దూత ప్రేక్షకపాత్ర పోషించడం, సీఎం సైతం ఒత్తిడి తేవడం వెరసి అధిష్టానం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సురేఖ పక్షం వహించిన మరో ముఖ్య నేత వాదనకు ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. అయితే తనకు సహకరించిన ఆ ఇద్దరు నేతల విషయంలో సీఎం రేవంత్ భవిష్యత్ వైఖరి ఎలా ఉంటుంది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఉంటుందా? శాఖల మార్పుపై ప్రభావం చూపుతుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ‘అనుబంధం’కొనసాగుతుందా? అనేది వేచిచూడాల్సిందే! అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక హస్తినకు మరోసారి సీఎం! సురేఖ ఉద్వాసన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల మార్పు గురించి చర్చించేందుకు వీలైనంత త్వరగా కబురు చేస్తామని ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక సీఎం రేవంత్తోపాటు పార్టీలోని ఇతర ముఖ్యులు హస్తినకు వెళ్లి కేబినెట్ ప్రక్షాళనపై హైకమాండ్తో చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
అమెరికన్ క్రీడా వ్యవస్థపై ఉన్నతస్థాయి సదస్సు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో “అమెరికన్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్” అంశంపై ఉన్నతస్థాయి పబ్లిక్ లెక్చర్, ఇంటరాక్టివ్ వర్క్షాప్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అమెరికా జాతీయ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (NCAA) మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పాలసీ అండ్ గవర్నెన్స్) శ్రీ కెవిన్ లెన్నన్ పాల్గొని అమెరికా కాలేజియేట్ క్రీడా వ్యవస్థ, క్రీడా పాలన, అథ్లెట్ అభివృద్ధి, స్కాలర్షిప్లు, క్రీడా-విద్య సమతుల్యత, క్రీడా శాస్త్రం, హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ తదితర అంశాలపై తన అనుభవాలను పంచుకున్నారు.భారత్–అమెరికా క్రీడా వ్యవస్థల మధ్య జ్ఞాన మార్పిడిలో భాగంగా విశ్వవిద్యాలయ క్రీడల నిర్మాణం, ప్రతిభా గుర్తింపు, కోచింగ్, పరిశోధన, క్రీడా సాంకేతికత, క్రీడాకారుల సంక్షేమం, వాణిజ్య భాగస్వామ్యాలు మరియు అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై విస్తృతంగా చర్చించారు.ప్రపంచ స్థాయి, క్రీడాకారుల కేంద్రిత క్రీడా విద్యా వ్యవస్థను తెలంగాణలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, అధ్యాపకులు–విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉమ్మడి పరిశోధన, కోచ్ల శిక్షణ, క్రీడా శాస్త్రం, సాంకేతికత మరియు ఆవిష్కరణలకు sports university ప్రాధాన్యం ఇస్తోందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి వైపెసు వైస్ చాన్సలర్ డాక్టర్ కిశోర్ గోపీనాథన్ అధ్యక్షత వహించగా, అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ప్రతినిధులు శ్రీమతి ఎమీలియా స్మిత్, శ్రీ టి. సెంథిల్ కుమార్, మాజీ ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ చిన్నప్ప రెడ్డి, , ఓఎస్డీ డాక్టర్ కె. నరసయ్య, క్రీడా నిపుణులు, విద్యావేత్తలు, క్రీడాకారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.క్రీడలు విద్య, పరిశోధన, సాంకేతికత, ఆరోగ్యం, ఉపాధి మరియు మానవ వనరుల అభివృద్ధితో అనుసంధానమైన సమగ్ర వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ ఉత్తమ విధానాలను తెలంగాణ క్రీడా రంగ అభివృద్ధికి అనుసంధానించేందుకు వైపెసు కట్టుబడి ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. -
తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు వినియోగించాలన్న కేఆర్ఎంబీ.. పునర్విభజన చట్ట ప్రకారమే నీటిని వినియోగించాలని స్పష్టం చేసింది. కాగా, ఈ రోజు(శుక్రవారం, సెప్టెంబర్ 4వ తేదీ) హైదరాబాద్లోని జలసౌధ వేదికగా జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం అసంతృప్తిగానే ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ భేటీని అసంతృప్తిగానే ముగించాల్సి వచ్చింది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, తాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదీ చదవండి:‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా దాటనివ్వం’ -
‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ రాజకీయ భవిష్యత్పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి స్పందించారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖను బీఆర్ఎస్లోకి ఆహ్వానించే ప్రసక్తే లేదన్నారు. కొండా సురేఖను కనీసం తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమన్నారు జగదీష్రెడ్డి. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దని తప్ప ఎవరినీ తీసుకోమన్నారు. ఎమ్మెల్యేల క్యారకర్ట్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటామన్నారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోము. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే’ అని పేర్కొన్నారు. కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు -
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు: ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్ చేతబడి చేస్తున్నాడనే మూఢనమ్మకంతో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటనలో ఏడుగురు సభ్యుల ముఠాను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ జోన్, ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహ్మద్ మహబూబ్ అలీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు గుట్టును పోలీసులు విప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఒక మైనర్ను (సిసిఎల్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, ఆరు కత్తులు/బాకులు మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం.. ఫలక్నుమా, వట్టేపల్లిలోని ఫాతిమా నగర్కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (53) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఆగస్టు 30, 2026 రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో వట్టేపల్లిలోని ఆల్మాస్ హోటల్ ఎదురుగా అతనిపై కొంతమంది దుండగులు కత్తులతో ఘోరంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహబూబ్ అలీని వెంటనే ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.మృతుని కుమారుడు మహ్మద్ షానవాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 439/2026 కింద బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 103(1), 61(2) r/w 3(5) మరియు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27(2) ప్రకారం కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా లభించిన పక్కా సమాచారంతో సెప్టెంబర్ 3, 2026న ఫలక్నుమా పోలీసులు ఆరుగురు నిందితులను మరియు ఒక మైనర్ను అరెస్ట్ చేశారు.హత్యకు గల కారణాలుజ..ప్రధాన నిందితుడు A1 మీర్జా మోహిన్ బైగ్, మృతుడు మహ్మద్ మహబూబ్ అలీ తన తల్లి తాహిరా బేగంపై చేతబడి చేశాడని, అందుకే ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని బలంగా నమ్మాడు. అంతేకాకుండా, తన మేనమామ మహ్మద్ ఖలీల్ మరణానికి కూడా మహబూబ్ అలీ చేసిన చేతబడే కారణమని అనుమానించాడు.ఈ క్రమంలో బైగ్ తన బావమరిది A2 మహ్మద్ ఇమ్రాన్ అహ్మద్తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇమ్రాన్ అతనికి సహకరిస్తానని, హత్య చేసిన తర్వాత బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం నిందితులందరూ కలిసి మహబూబ్ అలీని అంతమొందించేందుకు కుట్ర పన్నారు.ఆగస్టు 30న మహబూబ్ అలీ ఆల్మాస్ హోటల్ వద్ద ఉన్నాడనే సమాచారం అందడంతో, నిందితులంతా అయాన్ దర్బార్ హోటల్ వద్ద సమావేశమై ఆరు కత్తులు, బాకులు సమకూర్చుకున్నారు. రెండు యాక్టివా వాహనాలపై వచ్చి, ఆల్మాస్ హోటల్ ఎదురుగా మహబూబ్ అలీని అడ్డుకుని తల, ఛాతీ, చేతులపై తీవ్రంగా నరికి చంపారు. అరెస్టయిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.ప్రజలకు విజ్ఞప్తి..చేతబడులు అనేవి కేవలం మూఢనమ్మకాలని, వాటికి ఎలాంటి వైజ్ఞానిక ఆధారాలు లేవని రాజేంద్రనగర్ జోన్ డిసిపి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాలతో హింసకు పాల్పడటం విచారకరమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి నమ్మకాలను నమ్మవద్దని, శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోకుండా ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఎం. అప్పల నాయుడు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ మరియు క్రైమ్ టీమ్ను రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్, ఫలక్నుమా ఎసిపి ఎం.ఎ. జావీద్ అభినందించారు. -
‘కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగాలని కోరుకుంటున్నాం’
సాక్షి,న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండా సురేఖ తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించి ఉండాల్సింది. అలా ఖండించకపోవడం వల్లే ఈ అంశాన్ని ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము బలంగా కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం గానీ, పరిస్థితి గానీ లేదని మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు. -
నిజంగా అర్హులేనా..!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల లక్కీడ్రాలో ఎంపికైన లబ్ధిదారుల అర్హతను నిర్ధారించే ప్రక్రియ మొదలైంది. లాటరీలో ఎంపికైన వారి దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు వాస్తవమేనా? నిబంధనల ప్రకారం వారు అర్హులేనా? అనే అంశాలను తేల్చేందుకు హౌసింగ్ బోర్డు, కార్పొరేషన్కు చెందిన సుమారు 80 మంది అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు.లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తూ.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. కోర్ సిటీ పరిధిలోని 16 ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్లో ఎల్ఐజీ ఇళ్లను కేటాయించేందుకు కంటోన్మెంట్లో 120, మిగిలిన నియోజకవర్గాల్లో 480 మంది చొప్పున లలబ్ధిదారులతో పాటు వెయిటింగ్ లిస్ట్ కోసం మరికొంత మందిని కూడా లాటరీ ద్వారా ఎంపిక చేశారు.గురువారం లలబ్ధిదారుల అర్హతను నిర్ధారించే క్షేత్రస్థాయి పరిశీలనను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో లక్కీడ్రాలో ఎంపికైన బషీర్బాగ్ షేర్గేట్ సమీపంలో నివసిస్తున్న లబ్ధిదారుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాలను స్వయంగా యాప్లో అప్లోడ్ చేశారు. దరఖాస్తు వివరాలతో పోల్చి.. ఇళ్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో లలబ్ధిదారుల నుంచి ఎలాంటి ధ్రువపత్రాలను తీసుకోలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న వివరాలను అప్పట్లో దరఖాస్తులో పొందుపరిచిన సమాచారంతో అనుసంధానించి పరిశీలిస్తున్నారు. లలబ్ధిదారులు పదేళ్లుగా అదే నివాసంలో ఉంటున్నారా? అంతకుముందు ఎక్కడ నివసించారు? ఇంటి నిర్మాణ పరిస్థితి? కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.ఇంటి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. మరోవైపు లక్కీడ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన అంశాలతో సమగ్రంగా పరిశీలించి.. అర్హులైన వారి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.10 వరకు ఎల్ఐజీ ఇళ్ల దరఖాస్తుల గడువు పెంపు ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల కోసం ముషీరాబాద్, గోషామహల్, ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం తెలిపారు. ఈ నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకొని మరో వారం వరకు పెంచినట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో ఇండ్లు పొందేందుకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఇవి కూడా చదవండి: కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ -
కిరాణా కొట్టు నుంచి కోట్ల అక్రమ సామ్రాజ్యం! ఎవరీ నీతుబాయి?
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గుడుంబా విక్రయం.. ఆ తర్వాత గంజాయి వ్యాపారం.. చిన్న స్థాయిలో మొదలైన దందా క్రమంగా భారీ నెట్వర్క్గా మారింది. అనేక ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి విక్రేతలు, వినియోగదారులకు ఆమె కేంద్రంగా మారింది. అంచెలంచెలుగా ఎదిగింది. ధూల్పేట్లో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలను ప్రారంభించిన నీతుబాయి.. రూ.కోట్లలో అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి డాన్గా మారింది.ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ సిబ్బంది లక్ష్యంగా సామ్రాజ్యాన్ని విస్తరించింది. వరుసగా కేసులు నమోదైనా, పలుమార్లు అరెస్టయినా.. పీడీ యాక్ట్ కింద నిర్బంధించినా.. ఆమె దందా మాత్రం కొనసాగడం గమనార్హం. గంజాయి విక్రయాలతో ప్రారంభించి హవాలా వ్యాపారం దిశగా సాగింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. నీతుబాయి స్వస్థలం ధూల్పేట్ అయినప్పటికీ, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్లను లక్ష్యంగా చేసుకోవడానికి నానక్రామ్గూడలోని లోథాబస్తీలో చిన్న కిరాణా దుకాణం ప్రారంభించింది.అంగూరిబాయి (అరుణాబాయి)తో పాటు ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా గంజాయి దిగుమతి చేసుకునేది. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న పొట్లాలుగా మార్చి, ఒక్కో పొట్లాన్ని రూ.500 కి విక్రయించేది. ఈ లెక్కన కిలోపై రూ. 50 వేల వరకు నికర లాభం ఆర్జించేది. ఆమె కుటుంబం మొత్తం కూడా ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములే.రోజుకు సగటున రూ.10 లక్షల విక్రయాలు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్మకాలు జరిగేవని ఎక్సైజ్ అధికారుల దాడుల్లో తేలింది. నీతుబాయిపై 18కి పైగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2024లో 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు.నీతుబాయి నేరపూరిత సంపాదనపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, నానక్రామ్గూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యాపారాన్ని విస్తరించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇక్కడి నైట్లైఫ్ కూడా ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు.ఇవీ చదవండి: రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన -
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీజ్ వేడుకల్లో విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గౌతమి, మంజీరా హాస్టల్ విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పరస్పరం దాడులకు దిగడంతో జేఎన్టీయూలో టెన్షన్ వాతావరణ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సురేఖ బర్తరఫ్.. విపక్షాలకు కొత్త అస్త్రం?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు కొండా సురేఖ బర్తరఫ్ అంశం కొత్త అస్త్రాన్ని అందించింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఇకపై కాంగ్రెస్పై విమర్శల దాడికి మరింత పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు లక్ష్యంగా కొండా సురేఖ కూతురు చేసిన విమర్శలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపలా, బయటా నిలదీసే అవకాశముంది. ఇన్నాళ్లూ కేబినెట్లో ఉన్న కొండా సురేఖ నుంచి వచ్చే ప్రతీ విమర్శ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ముందుకు ప్రభుత్వ వైఫల్యాలుసురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత గొడవలను కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా విచారణ కోసం బీఆర్ఎస్ పట్టు పట్టే అవకాశముంది. సీఎం సోదరుడికి రూ.200 కోట్ల విలువైన భూ కేటాయింపుపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇన్నాళ్లూ మాజీ మంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్పై ఎదురుదాడికి దిగేందుకు సురేఖ, ఆమె కుమార్తె చేసిన విమర్శలను అ్రస్తాలుగా మలుచుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సురేఖ అడుగులు ఎటు?కొండా సురేఖ బర్తరఫ్ అంశాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అయితే సీఎం, ఆయన సోదరులు లక్ష్యంగా వస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర తిప్పికొడతారనే అంశంపై కాంగ్రెస్ శిబిరంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర స్వేచ్ఛగా ఉన్నారో అందరికీ తెలుసంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. విపక్షాల నుంచి అసెంబ్లీ వేదికగా ఒత్తిడి వస్తే ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతోంది. సీఎంను తప్పుపడుతూ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎంత మేర ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంలోనూ కాంగ్రెస్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ వేసే భవిష్యత్తు రాజకీయ అడుగులపైనా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్లో కొనసాగుతూ అధిష్టానంతో రాజీ ధోరణితో వ్యవహరిస్తారా లేక సీఎం లక్ష్యంగా విమర్శలకు పదును పెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు దూరమైతే గతంలో బీఆర్ఎస్తోనూ అనుబంధం ఉన్న సురేఖ భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీ దిశగా అడుగులు వేస్తారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. -
మంత్రిగా ఎవరికీ ఛాన్స్ ?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్తో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. సురేఖ స్థానంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు బెర్తులు కలిపి మొత్తం మూడు స్థానాలపై ఇప్పుడు ఆశావహుల కన్ను పడింది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..? లేక సమావేశాల తరువాత ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే శనివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి గురువారం రాత్రి లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తోంది. కాగా సురేఖను తొలగించిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో చేపట్టిన మార్పులు కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, ప్రేమ్సాగర్రావు, రామచంద్రునాయక్, గడ్డం ప్రసాద్కుమార్, మహిళా కోటాలో విజయశాంతి తదితరుల పేర్లు వివిధ దశల్లో ప్రచారంలోకి వచ్చినప్పటికీ... సాకారం కాలేదు. ఇప్పుడు మూడో బెర్తు చేరడంతో పోటీ మరింత పెరగనుంది. మున్నూరుకాపు, పద్మశాలి లెక్క? సురేఖ పద్మశాలి కాగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. సురేఖకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రెండు వర్గాలకు న్యాయం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు సురేఖకు ఉద్వాసన పలకడంతో ఆమె స్థానంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన మహిళా నేతలకు పట్టం కట్టారు. ఆది శ్రీనివాస్ ఆశలపై నీళ్లు? కాంగ్రెస్ తరపున మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (వేములవాడ) ఒక్కరే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరుకాపు నుంచి ఆయన పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే కొండా సురేఖ బర్తరఫ్కు ముందే మున్నూరుకాపు వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఆది శ్రీనివాస్కు చెక్ పెట్టినట్లయింది. అసమ్మతి గళం వినిపించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేరు కూడా మరోసారి మంత్రివర్గ విస్తరణలో చర్చలోకి వస్తోంది. తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చలేదని ఆయన బాహాటంగానే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి కోసం ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఓవైపు సీఎంపై విమర్శల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోతున్న సురేఖ స్థానంలో రాజగోపాల్రెడ్డికి అవకాశం కల్పిస్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలాకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా విస్తరణలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలకు చెందిన ప్రేంసాగర్ రావు, జెన్జీ ఉద్యమాల నేపథ్యంలో యువ ఎమ్మెల్యేల నుంచి ఒకరికి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా వస్తోంది. -
సురేఖ చేరికపై బీజేపీ ఆచితూచి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యనేతలు మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతూ... మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ను చేశారంటూ బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. అయితే కొండా ఫ్యామిలీ బీజేపీవైపు వస్తుందా? వస్తే ఏం చేయాలి? చేర్చుకోవాలా వద్దా? అన్న దానిపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఒకవేళ కొండా మురళి, సురేఖ, సుస్మిత బీజేపీలో చేరితే పార్టీకి ప్రయోజనమెంత? లాంటి అంశాలను విశ్లేషిస్తుతున్నారు. కేబినెట్ నుంచి సురేఖ ఉద్వాసనకు గురైన నేపథ్యంలో... కొండా ఫ్యామిలీ జాయినింగ్పై పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పదవిని వదులుకున్నాక ఆమె బీజేపీ వైపు వస్తారా? రావాలనుకుంటే పార్టీలో ఎవరితో చర్చలు జరుపుతారు? పార్టీలో చేరతానంటే చేర్చుకుంటే మంచిదా? కాదా? అన్న రకరకాల చర్చలు బీజేపీలో సాగుతున్నాయి. వారి ముందున్న మార్గాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ వ్యవహారశైలి, ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు తదితరాలు చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎదుట ఉన్న మార్గాలేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొండా ఫ్యామిలీ జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొండాసురేఖ, బీజేపీ చీఫ్ రాంచందర్రావు ఎదురుపడినపుడు మర్యాదపూర్వకంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సురేఖ రాజీనామా చేశాక అప్పుడు ఆలోచిస్తామంటూ ఊహాగానాలకు తెరలేపారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు బీజేపీ వైపు నుంచి గానీ, అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచి గానీ ఎలాంటి సమాలోచనలు మొదలుకాలేదనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి పదవి పోయినా సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ, పార్టీకి కూడా రాజీనామా చేయబోనని ప్రకటించిన విషయం విదితమే. ఇతర పార్టీల నేతలు చేరాలంటే ఆ పార్టీ సభ్యత్యానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాకే రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం కండిషన్ పెట్టిన విషయాన్ని రాష్ట్ర పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అందువల్ల సురేఖ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుంటే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రాజీనామాకు సురేఖ సుముఖంగా లేకపోగా... పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కండిషన్ అడ్డుగా నిలుస్తోందని చెబుతున్నారు. బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవని... ప్రత్యేక సందర్భాల్లోనే ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల బీజేపీలో కొండా ఫ్యామిలీ చేరడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ పోటీకి క్లెయిమ్ చేస్తున్న సీట్లలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఓటింగ్నే సాధించారని అంటున్నారు. అందువల్ల వారి చేరికతో పార్టీకి, నేతలకు కొత్త తలనొప్పి మొదలవుతుందనే గుసగుసలు కూడా బీజేపీలో వినిపిస్తున్నాయి. -
అగ్రనేతల ఆమోదంతోనే...
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులుగా తర్జనభర్జనలు.. సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి. సోనియా, రాహుల్కు కేసీ సమాచారం బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు. కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’ ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు. -
ప్రేమ పేరుతో మైనర్పై లైంగిక దాడి
అల్వాల్ (హైదరాబాద్): మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్లో నివసించే ఓ మహిళ తన కూతురును (17) అల్వాల్లోని ఆశాజ్యోతి ఆశ్రమంలో చేర్పించి చదివించింది. ఇదిలాఉండగా దూరపు బంధువు ఎల్లేష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించగా.. గతంలో ఇంటర్మీడియెట్ చదువుకునే సమయంలో (2025) రాఘవేందర్ రెడ్డి, 9వ తరగతి చదువుకునే సమయంలో (2023) రేంజు అనే వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి, బాధితురాలిని గురువారం సాయంత్రం భరోసా కేంద్రానికి తరలించారు. -
రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని కొండా సురేఖ ఆరోపించారు. పార్టీ అధిష్టానానికి తనను తప్పించాలన్న ఆలోచన లేదని.. అయితే తనను తప్పించకపోతే..తాను వెళ్లిపోతానని సీఎం అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎవరితోనూ సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా కమ్యూనికేషన్ చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలతో, నేతలతో వైఎస్సార్ ఉన్నట్లు రేవంత్రెడ్డి లేడన్నారు. తాము వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించనంతగా..రేవంత్రెడ్డిని అభిమానించామని చెప్పారు. రేవంత్రెడ్డిని నిందించిన వారంతా ఇప్పుడు మంచిగానే ఉన్నారని, కానీ తనను మాత్రమే రేవంత్రెడ్డి టార్గెట్ చేసుకున్నారని సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం సోదరులు కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డి మరికొందరు కుట్రపన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పార్టీ హైకమాండ్కు ఇటీవల తాను రాసిన లేఖలను సురేఖ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై పశ్చాత్తాపం లేదు.. ‘తమవైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు ఆయన వైపే చూపిస్తాయన్న అంశాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యమంత్రిని నేను ఏనాడూ విమర్శించలేదు.. పార్టీని దూషించలేదు. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పదవుల కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. కొణిజేటి రోశయ్య, జైపాల్రెడ్డిలు ఇందిరాగాం«దీని నిందించిన వారే. జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే ఎలాంటి చర్యలు లేవు. నా కూతురు చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని నన్ను శిక్షించడం సరికాదు. ఉరి శిక్షపడిన ఖైదీని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ అధిష్టానం నా అభిప్రాయాలను తెలుసుకోకుండా సీఎం బ్లాక్మెయిల్కు లొంగి బర్తరఫ్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చెప్పండి. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఏ పనులు జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నా. ప్రభుత్వంలో తప్పులు సరిదిద్దుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఆలోగా మనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. హామీలను అమలు చేసి చూపించాలి. కాంగ్రెస్లోనే ఉంటా... కాంగ్రెస్లోనే ఉంటా. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే. అది లేనంత మాత్రాన మాకు నష్టం లేదు. రెండు మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులం మాట్లాడుకుంటాం. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతా. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బర్తరఫ్ చేశారన్న సమాచారం ఇప్పుడే తెలిసింది. నా కూతురు ఇంగ్లండ్లో ఉంది. ఆమెతో, నా భర్తతోనూ ఇంకా చర్చించలేదు. నా కూతురు గౌరవం కోసమే ఆమె వ్యాఖ్యలపై నేను స్పందించలేదు. సుమంత్పై కేసులు విత్డ్రా చేసుకోవాలి నా ఓఎస్డీ సుమంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయనను వెంటాడుతున్నారు. సుమంత్ ఎవరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి వెంటనే బెయిల్ ఇచ్చి.. 15 రోజుల తరువాత అదే వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. సుమంత్పై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని హోం శాఖను కోరుతున్నా. పరకాలలో సీఎం అక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారు? 70 ఏళ్ల వృద్ధుడు.. వచ్చే ఎన్నికల నాటికి నడుస్తారో..మంచంపై ఉంటారో తెలియదు. నన్ను తొలగించిన నేపథ్యంలో బ్యాలెన్స్ చేయడానికి ముగ్గురు మహిళలకు పదవులు రావడం అభినందనీయం. వారికి నా శుభాకాంక్షలు. చిన్నారెడ్డిని నా కోసం శిక్షించడం సరికాదు..’అని సురేఖ అన్నారు.పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇచ్చారన్న వారిని సన్మానించారు.. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికోసం రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించిన వారికి సీఎం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సన్మానించారు. డీఎస్ కుటుంబంలో ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో లేరా? పదేళ్లుగా నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించలేకపోయాం. అదే మొన్న పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ పదవి తెప్పించుకున్నారు. నా భర్తకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇప్పించుకోలేదని నా కూతురు అన్నది. నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. వాటిని ఖండించాల్సిన లేదా సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. మేము నిబద్ధతతో రాజకీయాలు సాగిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదు. రాజీనామాలు చేసే ఇతర పార్టీలోకి వెళ్లాం. -
సీఎం సలహా మేరకు.. కొండా సురేఖ బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రిమండలి నుంచి బర్తరఫ్కు గురయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి సైతం ఉద్వాసనకు గురయ్యారు. తక్షణమే వీరిద్దరిని ఆయా పదవుల నుంచి తొలగించాలని సీఎం ఎ.రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు సీఎం రేవంత్ సిఫారసు చేశారని తెలిపింది. అయితే దీనిపై లోక్భవన్ గురువారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగింది. కానీ సీఎం..మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్తో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ వెంటనే లోక్భవన్ నుంచి బులెటిన్ జారీ అయింది. సీఎం రేవంత్ సలహా మేరకు కొండా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు బులెటిన్ వెల్లడించింది. కాగా చిన్నారెడ్డి తొలగింపు నేపథ్యంలో ఆ పదవిని భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం మరోరెండు కీలక నియామకాలు కూడా చేపట్టింది. రెండు వారాలుగా రాజకీయ దుమారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరు ప్రకాశ్రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. దీనిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డికి సీఎం కాగానే కళ్లు నెత్తికెక్కాయని, వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే పరకాలలో ఆయన తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని వనపర్తి టికెట్ను ఇచ్చారని జి.చిన్నారెడ్డి సైతం వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణ కమిటీ వీరిద్దరికి ఉద్వాసన పలకాలని సిఫారసు చేస్తూ అధిష్టానానికి నివేదిక సమర్పించింది. ఈ పర్యావసానాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా కొందరు పెద్దల్ని కలవడంతో సురేఖతో పాటు జి.చిన్నారెడ్డిపై వేటు పడడం ఖాయమనే ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు సురేఖ కూడా మంగళవారం నాడే ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఖర్గే తదితరులతో సమావేశమై అదే రోజు రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. కాగా రేవంత్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి బయలుదేరడానికి ముందు..సురేఖ, చిన్నారెడ్డి విషయంలో సీఎంఓ కార్యాలయంనుంచి ప్రకటన వెలువడింది. అంతకుముందే వీరిద్దరి ఉద్వాసనకు పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. గజిట్ జారీ చేసిన ప్రభుత్వం సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రధాన సలహాదారు కె.రామకృష్ణారావు గురువారం సాయంత్రం లోక్భవన్కు వెళ్లి సీల్డ్ కవర్లో మంత్రిమండలి నుంచి కొండా సురేఖ తొలగింపు ప్రతిపాదనను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చిన సీఎం.. వెంటనే చంచల్గూడ – సంతోష్నగర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, ఆ తర్వాత లోక్భవన్కు చేరుకుని గవర్నర్ శుక్లాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సురేఖ తొలగింపుపై లోక్భవన్ బులెటిన్ జారీ చేసింది. సీఎం వెంట ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రఘువీర్రెడ్డి ఉన్నారు. కాగా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గజిట్ వెలువరించింది. సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కొండా సురేఖ కార్యాలయాన్ని సీజ్ చేశారు. అంతకు ముందే కీలకమైన ఫైళ్లన్నీ సీఎస్ కార్యాలయంలో అప్పగించాలని ఆమె పీఎస్ను ఆదేశించారు. సురేఖను మంత్రిమండలి నుంచి తొలగించడంతో ఆమె వద్ద ఉన్న పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖలూ సీఎం పర్యవేక్షణ కిందికి వెళ్లాయి. వ్యూహాత్మకంగా మూడు నియామకాలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి జి.చిన్నారెడ్డిని తొలగించిన ముఖ్యమంత్రి తక్షణమే ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మీ (మున్నూరుకాపు)ని నియమించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా) చైర్మన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి (పద్మశాలి)ని రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తూ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద (గౌడ) నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే జారీ అయ్యాయి. కొండా సురేఖ ఇటీవల బీసీ అస్త్రాన్ని ఉపయోగించి సీఎం రేవంత్పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు, బీసీ వర్గాలకు న్యాయం చేశారనే సందేశాన్ని ఇవ్వడానికే వ్యూహాత్మకంగా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఉద్వాసనకు గురైన మూడోమంత్రి సురేఖ తెలంగాణ రాష్ట్రంలో ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా కొండా సురేఖ చరిత్రకెక్కారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్యను అనూహ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ 2015 జనవరి 25న నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖలో అవినీతి, స్వైన్ ఫ్లూ నివారణలో వైఫల్యాల నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈటల రాజేందర్ను వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమించారు. అయితే అసైన్డ్ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2021 మే నెలలో ఈటలకు ఉద్వాసన పలికారు. రేవంత్ మంత్రివర్గంలో 1,002 రోజుల పాటు మంత్రిగా కొనసాగిన సురేఖపై తాజాగా వేటు పడింది. -
బీజేపీ సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు నేతృత్వంలో చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మెయిన్ గేటు వద్ద రాంచందర్రావుతో పాటు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్.గౌతంరావు, బండారు విజయలక్ష్మి, బీజైవైఎం అధ్యక్షుడు గణేష్ కుండే తదితరులను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, పార్టీకార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొన్నిరోజుల క్రితం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో విద్యార్థుల వినతిపత్రాల సమర్పణకు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ను రాంచందర్రావు కోరారు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చలో సెక్రటేరియట్కు బయలుదేరారు. సెక్రటేరియల్ మెయిన్గేట్ వద్దకు వారు చేరుకోగానే పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రాంచందర్రావు, ఇతరనేతలు, కార్యకర్తలను తోపులాట మధ్య పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన సందర్భంగా రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ ఫీజు బకాయిలు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని మండిపడ్డారు. తాను ఇప్పటికే, ఈ అంశంపై రెండురోజుల నిరాహార దీక్ష చేశానని, సీఎంకు లేఖలు రాశానని గుర్తుచేశారు. విద్యార్థుల సహనం నశించడంతోనే వారి గొంతు కగా మారి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఫీజు బకాయిలన్నీ విడుదల చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని రాంచందర్రావు స్పష్టం చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేసి,గద్దె దిగాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న తనను పోలీసులు అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేశారని మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఫీజు పోరుపై బీజేపీ సచివాలయ మెరుపు ము ట్టడి అద్భుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ నాయకుల అరెస్ట్ను పార్టీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్ గౌడ్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్విసుభాష్ ఖండించారు. -
ఎన్నికల నాటికి మెట్రోలోనే వస్తా!
సాక్షి, హైదరాబాద్/చంచల్గూడ/చార్మినార్: ఓల్డ్ సిటీ (ఒరిజినల్ సిటీ) సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మెట్రో మార్గం పనులను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ మార్గాన్ని పూర్తిచేసి మెట్రోలోనే వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ క్రాస్రోడ్స్–ఒవైసీ జంక్షన్ వరకు రూ. 620 కోట్లతో సిగ్నల్ ఫ్రీగా జీహెచ్ఎంసీ నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించారు. అనంతరం చంచల్గూడ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. హిందూ, ముస్లింలు కలిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం చాంద్రాయణగుట్ట మెట్రో కోసం భూసేకరణ దాదాపు పూర్తయిందని.. మెట్రో పనులను వేగంగా చేపట్టి తదుపరి ఎన్నికల్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ వంతెనకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టడం తప్ప రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేసిందన్నారు. నాగోలు నుంచి ఎల్బీనగర్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. ఉభయులూ కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. మూసీ రివర్ఫ్రంట్, నైట్ ఎకానమీ వంటి ప్రాజెక్టుల ద్వారా పేద ముస్లింలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. మిగతా సమయంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు, వర్గాలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. ఓల్డ్ సిటీని ఒరిజినల్ సిటీగా మరోమారు పేర్కొన్న సీఎం రేవంత్రెడ్డి.. ఇక్కడి ప్రతి వీధి, సందు తనకు తెలుసన్నారు. గత 70 ఏళ్లలో 18 మంది సీఎంలు పనిచేసినా చంచల్గూడకు రాలేదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ఎవరి ధమ్కీలకూ బెదరను.. ప్రేమకే లొంగుతా.. ‘నేను బెదిరిస్తే భయపడను. ఎవరి ధమ్కీలకూ బెదరను. ప్రేమకే లొంగుతా. స్నేహంతోనే నన్ను గెలవగలరు. నేను దోస్తీకి మాత్రమే గులామ్ను. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. గెలుపోటములు సహజం’అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమని కొందరు దుషŠప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఆపరేషన్న్సిందూర్ సమయంలో దేశం పక్షాన నిలిచిన అసదుద్దీ¯న్Œ ఒవైసీని అభినందించారు. ఈ అంశంలో అసద్.. మోదీ, అమిత్ షాల కంటే తక్కువేమీ కాదన్నారు. మీరాలం చెరువు వద్ద 3 కి.మీ. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. మెట్రో రెండో దశలో నాగోల్ నుంచి ఎల్బీ నగర్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని అభివృద్ధి ప్రతిపాదనలు తెచ్చినా మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, రాజ్యసభ ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్కుమార్ యాదవ్, దానం నాగేందర్, జాఫర్ మెరాజ్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీకి కాదు.. రేవంత్కే మా మద్దతు: అసదుద్దీన్ ఒవైసీ ‘ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ నాయకుల అందరి ముందు చెబుతున్నా. మా పార్టీ మద్దతు కాంగ్రెస్కు కాదు.. కేవలం రేవంత్రెడ్డికే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బీఆర్ఎస్కు మద్దతిచ్చిన మాట వాస్తవం. కానీ ప్రజావ్యతిరేక పనులను ఆపాలని.. లేకపోతే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని చెప్పా.. అలాగే జరిగింది. ప్రస్తుతం రేవంత్ సైతం ప్రజల్లోకి రావట్లేదు. అందుకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలియదు’అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం వెలుపల ఏదైనా మాట్లాడొచ్చని.. కానీ రాష్ట్రంలో మాత్రం తమకు వ్యతిరేకంగా మాట్లాడవద్దన్నారు. కాగా, చంచల్గూడ మైదానంలో ఉన్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సీఎంకు వినతిపత్రం ఇవ్వగా రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. -
బాలల రక్షణకు సమష్టి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: జువెనైల్ జస్టిస్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే న్యాయవ్యవస్థ, పోలీసు, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ సూచించారు. ఇది ఏ ఒక్క శాఖ బాధ్యతగా కాకుండా.. బాలల భవిష్యత్కు సంబంధించిన సామాజిక బాధ్యతగా చూడాలన్నారు. పోక్సో చట్టం కూడా బాలల న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున అన్ని భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం మరింత అనివార్యమన్నారు. గురువారం జువెనైల్ జస్టిస్పై జ్యుడీషియల్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఏకే సింగ్ మాట్లాడుతూ.. ‘బాలల సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే గుర్తించి నివారించడమే సమర్థ బాలల న్యాయ వ్యవస్థకు పునాది. బాలల సంరక్షణ గృహాలు భోజనం పెట్టే కేంద్రాలుగా ఉండకూడదు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, సంస్కరణ కేంద్రాలుగా పనిచేయాలి’అని వివరించారు. స్వయంగా ఎదిగేలా చర్యలు చేపట్టాలి.. జస్టిస్ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ.. రక్షణ, పునరావాసంతోపాటు పిల్లలు భవిష్యత్తులో స్వయం ఆధారితులుగా, సమర్థవంతమైన వ్యక్తులుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారుల గౌరవాన్ని కాపాడటం, వారి అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత ముఖ్యమన్నారు. న్యాయ ప్రక్రియ.. బాధితులకు మరోసారి మానసిక గాయం కలిగించేలా ఉండకూడదని చెప్పారు. అవసరమైన చోట గోప్యంగా ప్రశ్నించడం, సింగిల్ రిఫ్లెక్టింగ్ మిర్ర ర్ల వంటి సదుపాయాలతో నిందితుడిని నేరుగా చూడకుండా సాక్ష్యమిచ్చే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. 16–18 ఏళ్ల వారు ఘోర నేరానికి పాల్పడినప్పుడు అతడిని బాల నిందితుడిగానే పరిగణించాలా? లేక వయోజనుడిగా విచారించాలా? అనే అంశంపై జాతీయ స్థాయిలో మరోసారి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ సూరేపల్లి నందా,జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు, జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్రావు, జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఆయుధాల చోరీ మాజీ ఉద్యోగుల పనే!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధశాల (ఆర్మీ)లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన సైనిక స్థావరం నుంచి ఆయుధాలను దొంగిలించడం వెనక ఆర్మీ మాజీ ఉద్యోగుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఈ చోరీ చేసి ఉండొచ్చని అలాగే ఆయుధాలు భద్రపరిచే గది, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో సిబ్బంది సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారి ప్రమేయంతోనే జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్లో ఇటీవల పదవీ విరమణ పొందిన వ్యక్తులు, గతంలో ఇక్కడ పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది వివరాలను సేకరించారు. పోలీసు, రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలతోపాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగాలు రంగంలోకి దిగి పది మంది ఆర్మీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నాయి. కానీ ఈ చోరీ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ఒకరోజు జరిగింది కాదు ఈ దొంగతనంలో నాలుగు ఏకే–203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఏడు పిస్టల్స్తోపాటు భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి మాయమైంది. ఈ ఆయుధాలను రవాణా చేయడానికి నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుందని, కాబట్టి ఈ చోరీ విడతల వారీగా కొంతకాలంగా జరిగి ఉంటుందని, ఎక్కువ మంది పాల్గొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆయుధాలను భద్ర పరిచే ప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించే నెపంతో కొన్ని నెలలుగా రోజూ రాత్రి ఆయుధశాలలోని సీసీటీవీ కెమెరాలను నిలిపివేస్తున్నారు. పైగా అక్కడ అలారం వ్యవస్థ కూడా లేదు. నిందితులు ఆయుధాలను కాంపౌండ్ వాల్ అవతలికి విసిరేసి, తరలించి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. -
లయ తప్పిన గుండెకు 3డీ రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స
లక్డీకాపూల్: గుండె లయ తప్పుతుండటం వల్ల రెండేళ్లుగా ఛాతీ నొప్పి, ఆయాసంతో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల రోజువారీ కూలీకి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అత్యాధునిక, అత్యంత క్లిష్టమైన వైద్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా గుండె తిరిగి లయబద్ధంగా కొట్టుకొనేలా చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో రోగితో కలిసి నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఒ.సాయి సతీశ్ ఈ వివరాలు వివరించారు. రోగి వివిధ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోగా అతని ఈసీజీలో తరచూ వెంట్రిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని.. మందులు వాడినా ఫలితం లేకపోగా, గుండె సంకోచ సామర్థ్యం కూడా పడిపోయిందని చెప్పారు. దీంతో అతను నిమ్స్ను ఆశ్రయించినట్లు డాక్టర్ సాయి సతీశ్ చెప్పారు. దీంతో రోగికి హోల్టర్ మానిటరింగ్ పరీక్ష నిర్వహించగా అతని గుండెలో 57 శాతం అసాధారణ విపరీత స్పందనలు ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో గత నెల 24న అతనికి 3డీ మ్యాపింగ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియను నిర్వహించామన్నారు. రోగి గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాల కేంద్రం బృహద్ధమని కవాటంలోని ఎడమ కరోనరీ కస్ప్ కింద భాగంలో, ఎడమ కరోనరీ ధమనికి అత్యంత సమీపంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వాస్తవానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని.. చికిత్సలో ఏమాత్రం తేడా వచ్చినా ఎడమ కరోనరీ ధమనికి గాయమయ్యే ప్రమాదం ఉంటుందని సతీశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో తమ వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యకు కారణమైన అసాధారణ విద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా అబ్లేట్ చేయడంతో గుండె లయ సాధారణ స్థితికి వచ్చిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ ఖర్చుతో కూడుకున్న ఆధునిక ఈపీఎస్, ఆర్ఎఫ్ఏ చికిత్సను ఆరోగ్యశ్రీ కింద రోగికి ఉచితంగా అందించామన్నారు. -
గాల్లోనే ఆహుతి చేస్తుంది
భారత రక్షణ రంగ సాంకేతికతలో హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త చరిత్ర లిఖించింది. శత్రువుల డ్రోన్ దాడులను గగనతలంలోనే అత్యంత వేగంగా తిప్పికొట్టే ’ఆహుతి మార్క్–2’ ఎలక్ట్రిక్ మల్టీరోటర్ డ్రోన్ ఇంటర్సెప్టర్ను అపొలియాన్ డైనమిక్స్(డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ)తయారు చేసింది. ఈ డ్రోన్ గంటకు 498 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును అధికారికంగా నమోదు చేసుకుంది. తద్వారా దక్షిణ ఆసియాలోనే అత్యధిక వేగ పరిమితిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఈ స్టార్టప్ 2025లో ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి నేతృత్వంలో ఈ సాంకేతికత రూపుదిద్దుకుంది. అమన్ విరానీ, మానస్ విచారే, ఇషాన్ సూరిలతో కూడిన ప్రతిభావంతమైన బృందం ఈ రికార్డు స్థాయి డ్రోన్ను రాత్రింబగళ్లు కష్టపడి అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హై–స్పీడ్ డ్రోన్ పైలట్ అయిన అమన్ విరానీ ఈ డ్రోన్ ప్రయోగాత్మక పరీక్షల్లో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.పాత రికార్డులు బద్దలు.. గతంలో భారతదేశంలో మల్టీరోటర్ డ్రోన్ల గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా నమోదైంది. అయితే ఆహుతి మార్క్–2 ఆ పాత రికార్డును భారీ వ్యత్యాసంతో అధిగమించింది. 2025లో రూపొందించిన మొదటి తరం ’ఆహుతి’ డ్రోన్ గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగింది. కేవలం ఒకే సంవత్సరంలో ఈ బృందం పాత నమూనాను పూర్తిగా ప్రక్షాళన చేసి, సరికొత్త సాంకేతికతతో పునర్నిర్మించింది. దీనివల్ల డ్రోన్ వేగం ఏకంగా 66 శాతం పెరిగి గంటకు 498 కిలోమీటర్లకు చేరుకుంది. దక్షిణ ఆసియాలోనే ఇంతటి వేగవంతమైన మల్టీరోటర్ డ్రోన్ మరొకటి లేదని కంపెనీ చెబుతోంది. డ్రోన్ ఇంటర్సెప్టర్ అంటే శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి, వాటిని అడ్డుకుని, నాశనం చేసే ఒక అధునాతన రక్షణ వ్యవస్థ. సరళంగా> చెప్పాలంటే డ్రోన్లను వేటాడే మరో డ్రోన్ లేదా మిస్సైల్ అన్నమాట.యుద్ధ వ్యూహాలలో మార్పులు..ప్రస్తుత ఆధునిక యుద్ధాలలో తక్కువ ఖర్చుతో కూడిన ‘షాహెద్’రకానికి చెందిన డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇటువంటి చౌకబారు శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు లక్షల రూపాయల విలువైన ఖరీదైన క్షిపణులను ఉపయోగించడం ఆర్థికంగా భారం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే అపొలియాన్ డైనమిక్స్ ఈ అత్యాధునిక ఇంటర్సెప్టర్ను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో వేగమే అత్యంత కీలకమని, గంటకు 498 కిలోమీటర్ల వేగంతో తాము ఏ రకమైన వైమానిక ముప్పునైనా సమర్థవంతంగా అడ్డుకోగలమని సంస్థ వ్యవస్థాపకులు ధీమా వ్యక్తం చేశారు. సైన్యానికి సరఫరా..ఈ అసాధారణ వేగాన్ని అందుకోవడానికి డ్రోన్ ఫ్రేమ్, ప్రొపల్షన్ వ్యవస్థ, మోటార్ల అమరికను సుమారు పది సార్లు పునఃసమీక్షించి మార్పులు చేశారు. ఈ డ్రోన్ ప్రయాణించే సమయంలో ఒకేసారి 400 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని గ్రహిస్తుంది. ఇదే దీని వేగానికి ప్రధాన కారణం. భారత సైన్యం సహకారంతో బాబినా, గోపాల్పూర్ వంటి సైనిక ఫైరింగ్ కేంద్రాలలో ఈ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటికే ఈ సంస్థ భారత సైన్యానికి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కామికేజ్ డ్రోన్లను సరఫరా చేసింది.క్రూజ్ క్షిపణి లక్ష్యంగా..ప్రమాదకర సరిహద్దు ప్రాంతాలలో మానవ రహిత వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా సైనికుల ప్రాణాలను కాపాడటమే కంపెనీ ముఖ్య ఉద్దేశం. అగ్ని క్షిపణి కార్యక్రమానికి మాజీ ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎం.రామ మనోహర బాబు ప్రస్తుతం ఈ సంస్థ సలహా మండలిలో సేవలందిస్తున్నారు. ఈ సంస్థ 2032 నాటికి వేలాది కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల భారీ పవర్ క్రూజ్ క్షిపణి ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ భర్త మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు ఇదేం కొత్త కాదన్న మురళి.. ఇవాళ మేము.. రేపు ఎవరో? అంటూ వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేం ప్రతిదానికి స్పందించకపోవచ్చు.. కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు’’ అంటూ కొండా మురళి ట్వీట్ చేశారు. అంతకుముందు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా ముందు కొచ్చిన కొండా మురళి.. మీసం మెలేశారు.హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు లోక్భవన్కు పలువురు క్యాబినెట్ మంత్రులు వెళ్లారు. కొండా సురేఖ బర్తరఫ్, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై గవర్నర్కు సీఎం వివరించారు. గవర్నర్తో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం తెలిపారు.ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్టు, కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడుతే ఎవ్వరు తట్టుకోరు! ఇవ్వాళ మేము, రేపు ఎవ్వరో.పదవులు ఉన్నా లేకున్న మా గౌరవం మాకు ఉంటుంది.మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు కానీ ప్రతీ ఒక్కటి గమనిస్తూనే ఉంటాం. pic.twitter.com/xj9EUYl6rQ— Konda Murali (@TeamKonda) September 3, 2026 -
హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
హైదరాబాద్: అబిడ్స్లోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఆ ఆలయ యాజమాన్యం నిర్వహించనున్న "శ్రీ కృష్ణాష్టమి మహోత్సవం" సందర్భంగా.. భక్తుల రద్దీ, రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబరు 4 తెల్లవారుజామున 4 గంటల నుంచి సెప్టెంబరు 5 అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయి.ఈ దారుల్లో వెళ్లొద్దుయూసుఫ్ & కంపెనీ, జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, అబిడ్స్ సర్కిల్, పాత హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్, చిరాగ్ అలీ లేన్, నాంపల్లి స్టేషన్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు వీలైనంత వరకు ఈ దారుల్లో వెళ్లొద్దు.ట్రాఫిక్ మళ్లింపులుభక్తుల రాకపోకలు, అప్పటి ట్రాఫిక్ పరిస్థితులను బట్టి అబిడ్స్ ఇస్కాన్ ఆలయ సమీపంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. గన్ఫౌండ్రీ, తిలక్ రోడ్ జంక్షన్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ను జిపిఓ (GPO) జంక్షన్ వద్ద 'హాట్ అండ్ గో' పద్ధతిలో నియంత్రిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. జాంబాగ్ రోడ్ , ఎస్.ఎ. బజార్ మసీదు నుండి జిపిఓ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను కూడా 'హాట్ అండ్ గో' పద్ధతిలోనే నియంత్రిస్తారు. రద్దీ పెరిగితే జిపిఓ జంక్షన్ వైపు అనుమతించకుండా ఎంజే మార్కెట్ వద్ద గాంధీ భవన్, చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు. నాంపల్లి తాజ్ ఐలాండ్ నుండి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ను సాధారణ మార్గమైన భారత్ పెట్రోల్ పంప్ వద్ద ఎడమ మలుపు తీసుకుని, సమాచార హక్కు భవన్ (పాత ఎసిబి లేన్), యూసుఫ్ & కంపెనీ, ట్రూప్ బజార్ మీదుగా కోటి బ్యాంక్ స్ట్రీట్ వైపు అనుమతిస్తారు. అలాగే బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చే ట్రాఫిక్ను పాత హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వైపు అనుమతించకుండా, ఎంజే మార్కెట్ రోడ్ వైపు మళ్లిస్తారు.ఆర్టీసీ (RTC) బస్సుల మళ్లింపులుఇస్కాన్ ఆలయ పరిసర మార్గాల గుండా వెళ్లే ఆర్టీసీ బస్సులను భక్తుల రద్దీ ఆధారంగా మళ్లిస్తారు. రంగమహల్ , జాంబాగ్ రోడ్ నుండి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద కుడివైపు ఉన్న జిపిఓ జంక్షన్ లేదా అబిడ్స్ సర్కిల్ వైపు వెళ్లనివ్వకుండా, గాంధీ భవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ జాంబాగ్ వద్ద ఆర్టీసీ కంట్రోలర్ విధి నిర్వహణలో ఉంటారు). ఎస్.ఎ. బజార్ మసీదు లేదా అఫ్జల్గంజ్ నుండి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద నేరుగా జిపిఓ జంక్షన్ వైపు వెళ్లనివ్వకుండా, గాంధీ భవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ ఎస్.ఎ. బజార్ వద్ద కంట్రోలర్ ఉంటారు). లిబర్టీ, బషీర్బాగ్ నుండి వచ్చే బస్సులను బిజేఆర్ సర్కిల్ వద్ద జిపిఓ జంక్షన్ వైపు అనుమతించకుండా, ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ బిజేఆర్ సర్కిల్ వద్ద కంట్రోలర్ ఉంటారు). రవీంద్ర భారతి లేదా హెచ్టిపి జంక్షన్ నుండి వచ్చే బస్సులను ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద ఎడమవైపు బిజేఆర్ సర్కిల్ వైపు వెళ్లనివ్వకుండా, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద కంట్రోలర్ విధి నిర్వహణలో ఉంటారు).పార్కింగ్ ఏర్పాట్లు, సూచనలుఅబిడ్స్ ఇస్కాన్ ఆలయానికి విచ్చేసే భక్తుల వాహనాల కోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీకి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626కు ఫోన్ చేయొచ్చు. -
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతలు తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో ఉనికిని కాపాడుకోవడానికే ఒకరిని మించి ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నిజంగా తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నేతలపై ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు ఏ విధంగా మంజూరవుతున్నాయో తెలంగాణ విషయంలో ఎందుకు అదే విధానం అమలు కావడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే తమ ఉనికిని కాపాడుకోగలమని, పార్టీ అధిష్టానం తమను గుర్తిస్తుందని భావించడం సరికాదన్నారు.ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన బీజేపీ నేతలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ, పాత బకాయిలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన అనేక హామీలు, నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని మంత్రి అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం కేంద్రానికి వెళ్తున్నప్పటికీ, తిరిగి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.తెలంగాణకు పెండింగ్లో ఉన్న మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు, రీజినల్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశాలు సహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద రాష్ట్ర హక్కులను సాధించడంలో బీజేపీ నేతలు ముందుకు రావాలని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ తీసుకురావాలని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ప్రశ్నించండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే దమ్ము చూపించండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. -
తెలంగాణ సీఈఓ సుదర్శన్రెడ్డికి ‘సర్’ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్ రెడ్డికి కూడా ‘సర్’ నోటీసులు వచ్చాయి. నేమ్ అనమాలీస్ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. 2002- 2026కు ఇంటి పేరు సరిపోలలేదు. నోటీసులను అందుకున్న సీఈవో సుదర్శన్.. ఎన్నికల అధికారులకు వివరాలు ఇవ్వనున్నారు.ఇప్పటికే దాదాపు 93 లక్షల మంది నోటీసులు అందుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులు కొత్త ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాన్ని అన్ని వివరాలతో భర్తీ చేసినా నోటీసులు రావడంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారు.నో మ్యాపింగ్, అనామలిస్ కారణంగా హైదరాబాద్లో ఈ కేటగిరీల్లోని వారు దాదాపు 12.55 లక్షల మంది ఓటర్లున్నారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు అందాలి. కానీ.. దాదాపు లక్ష మందికి మాత్రమే అందాయి. ఓటరు పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు లేదా చిరునామాలో చిన్నపాటి తప్పులున్నా, ఒక్క అక్షర దోషమున్నా, అధికారుల ముందు విచారణకు నిర్ణీత తేదీన హాజరు కావాలనడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతమాత్రం దానికి కొత్తగా నమోదు చేసుకుంటే సరిపోతుందిగా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మీసం మెలేసిన కొండా మురళి
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఎపిసోడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మారింది. రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం..మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉఠ్కంత కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని తన నివాసం ముందు కొచ్చిన కొండా సురేఖ భర్త కొండా మురళి.. మీసం మెలేయడం ఆసక్తికరంగా మారింది.మరోవైపు, తన నివాసంలో మీడియ సమావేశంలో మాట్లాడిన కొండా సురేఖ.. తన బిడ్డ వ్యాఖ్యలకు తనను టార్గెట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. నాకు పదవులపై వ్యామోహం లేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయం చేశారు. అధిష్టానానికి నన్ను తొలగించే ఆలోచన లేదు. రేవంత్ బ్లాక్మెయిల్ చేయడంతోనే నన్ను తొలగించారు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని బెదిరించారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. కావాలని నన్ను ఇబ్బందిపెడుతున్నారు’’ అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్కే నష్టం : కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్: తన మీద కుట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయని కొండా సురేఖ ఆరోపించారు. ఉరితీసే ఖైదీని కూడా మీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు?. కానీ కనీసం అలా నన్ను అడగకుండా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వర్గం నుంచి తనని బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘సంతకం లేని ఒక ఫేక్ లెటర్ సర్క్యూలేట్ అవుతుంది. నన్ను బర్తరఫ్ చేస్తున్నట్లు , చిన్నారెడ్డిని తొలగించినట్లు అడ్రస్ లేని లెటర్ బయటకొచ్చింది. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. నన్ను తొలగిస్తున్నామని ఒక మాట అడగాల్సి ఉండేది. అడిగి ఉంటే..ఎందుకు అనే ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కేది.నా అభిప్రాయం తీసుకోకుండా తొలగించారు. నన్ను తొలగించడం ఏఐసీసీకి ఇష్టం లేదు. సీఎం రేవంత్రెడ్డి పట్టుబట్టి తొలగించారు. మీరు తొలగిస్తారా.. నన్ను వెళ్లమంటారా అని సీఎం బెదిరించారు. మా మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబాన్ని బెదిరించారు. మా ప్రభుత్వంలో మా మనిషిని ఇబ్బంది పెట్టడం అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు కాదా. ఇకనైనా ప్రభుత్వం సుమంత్ను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా. మల్లు రవి గతంలో కాంగ్రెస్ను తిట్టలేదా.. రోశయ్య ఇంధిరా గాంధీని తిట్టలేదా. జైపాల్ రెడ్డి, ఇంధిరా గాంధీని దూషించలేదా. అలాంటి వారిపై చర్యలు తీసుకోలేదు.. కానీ నా కూతురు చేసిన వాఖ్యలకు నన్ను భాధ్యురాలిని చేస్తారా.. నా మంత్రి పదవి పోయినందుకు నాకు ఎటువంటి బాధలేదు.మా కాళ్ళు మొక్కి మమ్మల్ని గెలిపించాలని అడిగిన వారు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారా? మాకు ప్రజాబలం ఉంది.. మమ్మల్ని ఏం చేయలేరు. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే.. అది లేనంత మాత్రానా మాకు నష్టం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఈ రోజు నాకు వచ్చింది.. రేపు మీకు వస్తుంది. బయటకు వచ్చి మాట్లాడండి. ఈ ప్రభుత్వంలో పనులు అవ్వడం లేదు. పిటీషన్లు తీసుకోవడం తప్ప.. మేము చేసిందేమీ లేదు. సర్వేలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలని నేను అడగను. యాదాద్రి టెంపుల్ కమిటీ విషయం నిర్ణయం అందరితో చర్చించలేదు. నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. నా కూతురు గౌరవం కోసమే.. ఆమె వాఖ్యలపై నేను స్పందించలేదు. నేను తప్పు చేయలేదు..నాకు అవమానం ఎందుకు. ప్రజలతో,నేతలతో వెఎస్సార్ మమేకమైనట్లు సీఎం రేవంత్రెడ్డి లేరు’ అని వ్యాఖ్యానించారు. 👉ఇదీ చదవండి: మీసం మెలేసిన కొండా మురళి -
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ హై కమాండ్ వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డిని తొలగించింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు సీఎం రేవంత్ బలమైన సంకేతం పంపినట్లయింది.రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం వారితో చర్చించిన సంగతి తెలిసిందే.తన పైన కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవటం, అనంతరం ఆమె స్వయంగా చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఉన్న రేవంత్.. సురేఖ చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతో పాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని సీఎం చెప్పినట్లుగా తెలిసింది. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నట్లు సమాచారం. రేవంత్ పట్టుతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా.. కొండా ఫ్యామిలీ ఏం పార్టీలో చేరబోతుంది?. తెలంగాణ రాజకీయాల్లో తరువాత ఏం జరగనుంది?. కొండా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?. కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?. ఆమె కాంగ్రెస్లో కొనసాగే అవకాశముందా?’’ అనే చర్చ నడుస్తోంది. -
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డి తొలగింపు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. చిన్నారెడ్డిపైనా వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డిని తొలగించింది. ఈ మేరకు జీవో 1287 ద్వారా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది. ఆమె నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్పై ఉత్కంఠకు తెరపడింది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది.అయితే చిన్నారెడ్డి గోపాల్పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. చిన్నారెడ్డిపై కాంగ్రెస్ హై కమాండ్ చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: బర్తరఫ్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు -
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. ఈ మేరకు ఆమెను తక్షణమే తొలగిస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ బర్తరఫ్కు సంబంధించిన అధికారిక సిఫార్సును రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు పంపారు. కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు.దీనితో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం మార్పులు, నియామకాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నిర్ణయించారు. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షురాలిగా నియమించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నెరేళ్ల శారదను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. అలాగే, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ బర్తరఫ్కు ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. కొండా సురేఖ వ్యవహార శైలిపై పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పదే పదే పార్టీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదనే కఠినమైన సంకేతాలు శ్రేణులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీలో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం రేవంత్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. మొత్తం మీద అధిష్టానం కఠిన చర్యలతో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.👉ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు -
హైదరాబాద్లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నిరక్షరాస్యులైన ముగ్గురు వ్యక్తులు బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారారు. స్మార్ట్ఫోన్లో రీల్స్ చూసి నకిలీ నోట్ల తయారీ విధానం తెలుసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో దొరికిన ఫోన్ నంబర్లో సంప్రదించి ముడిసరుకు, ఉపకరణాలు పొందారు. వాటర్ మార్కు కోసం ర్యాపింగ్ కవర్లను నైపుణ్యంతో కత్తిరించి వాడారు. ఇలా రూపొందిన నకిలీ నోట్లను రాత్రి వేళల్లో వైన్, పాన్షాపుల వద్ద మారి్పడి చేస్తూ శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను బుధవారం రాజేంద్రనగర్లోని కార్యాలయంలో అదనపు డీసీపీ కేఎస్ రావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా వాడిపట్ల చింతల్ తండాకు చెందిన సమీప బంధువులు రమావత్ రాము అలియాస్ మహమ్మద్, రమావత్ మోతిలాల్ గిగ్ వర్కర్లు కాగా, రమావత్ గాంధీ ఆటోడ్రైవర్. బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి బాలాపూర్లో నివసిస్తున్నారు. ఈ త్రయం తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే రాము తన స్మార్ట్ఫోన్లో ఓ ఇన్స్టా్రగామ్ రీల్ చూశాడు. నాగోల్ బండ్లగూడకు చెందిన చెర్ల సు«దీర్ పోస్టు చేసిన రీల్లో నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో ఉంది. దీంతో రాము.. ఈ విషయం మోతీలాల్, గాం«దీలకు చెప్పాడు. వాళ్లూ అంగీకరించడంతో ఇన్స్టాలోనే దొరికిన ఫోన్ నంబర్లో సంప్రదించి స్కానర్, కలర్ ప్రింటర్లతో పాటు కట్టర్, బాండ్ పేపర్లు కొన్ని రసాయనాలు ఖరీదు చేశాడు. వాటర్ మార్క్ సైతం ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.200 నోట్లను స్కాన్ చేసిన ఈ ముగ్గురూ కలర్ ప్రింటర్ ద్వారా బాండ్ పేపర్పై ప్రింట్ తీశారు. వీటిని కత్తిరించడంతో పాటు వాటర్ మార్క్ కోసం ర్యాపింగ్ కవర్లు కత్తిరించి, చాకచక్యంగా అతికించి అసలైన నోటుగా చేసి బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లోని వైన్, పాన్ షాపుల్లో రాత్రి సమయంలో మార్చారు. రూ.లక్ష అసలు కరెన్సీ ఇస్తే రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ పరిచయస్తులకు సమాచారం అందించారు. మరోపక్క ఓ పాన్షాప్ నిర్వాహకుడు నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా వాటిలో నకిలీ నోట్లు ఉన్నట్లు తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం బాలాపూర్లో రాము, మోతిలాల్, గాంధీలను పట్టుకున్నారు. రూ.2.91 లక్షల నకిలీ కరెన్సీతో పాటు సామగ్రి, ప్రింటర్, స్కానర్ స్వా«దీనం చేసుకున్నారు. మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం! -
కొండా సురేఖ ఎపిసోడ్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు ఘటన నుంచే అసలు కథ మొదలైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచే మంత్రి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. తాజాగా డబ్బుల వాటాకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లిందని ఆయన విమర్శలు గుప్పించారు.మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై రాజాసింగ్ తాజాగా స్పందిస్తూ..‘కొండా సురేఖను సస్పెండ్ చేయాలని పెద్ద నేతలు ఢిల్లీలో కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోంది. మంత్రులు, పెద్ద నేతలు, చిన్న నేతలు, అధికారులనే తేడా లేకుండా అవినీతి నడుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి ఆగడం లేదు. గతంలో కేసీఆర్ అప్పులు చేసి పాలించి ఫాంహౌస్లో కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కేవలం పేపర్లో మాత్రమే నిధులు ఇస్తున్నట్టు చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జీరో.దీంతో మంత్రులకు, నేతలకు అర్థమైంది.కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ పడిపోతుందో చెప్పలేమనే అనుమానం వారికి వచ్చేసింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. పోతుందో.. అని డిసైడ్ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం షురూ చేశారు. ఏదీ ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తున్నారు. ఇదంతా డబ్బుల వ్యవహారం అయింది. ఇదంతా ఢిల్లీకి చేరింది. ఆ డబ్బుల గొడవే కొండా సురేఖ రాజీనామా వరకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ ప్రెస్ మీట్లో ఏం చెబుతారో చూడాలి. బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పిందట.. దీనిపై ఆమె ఏం అంటారో తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే! -
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రి పదవి నుంచి తప్పించే దిశగా సీఎం రేవంత్రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉదయం బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై నిర్ణయం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరి కాసేపట్లో కొండా సురేఖ మీడియా ముందుకు రానుండటం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇస్తారా? లేక రాజీనామాపై ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఏం మాట్లాడతారు? అనే ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన చేయకపోతే.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్కు సీఎం లేఖ రాసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖ మంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో తప్పుకుంటారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కీలకంగా మారిన ఈ పరిణామాలపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మృతదేహంపై గాయాలున్నా.. గుండెపోటు అంటారేం?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన ల్యాదెల్ల రాజు మృతదేహంపై గాయాల గుర్తులున్నా, గుండెపోటుతో సహజ మరణంగా కేసును మూసివేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి ఫోరెన్సిక్ అభిప్రాయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతికి పోలీసులు లేఖ రాయాలని ఆదేశించింది. పోస్టుమార్టం నివేదిక, మృతదేహం ఫొటోలు, గతంలో ఇచ్చిన ఫోరెన్సిక్ అభిప్రాయాలతో పాటు సంబంధిత రికార్డులన్నింటినీ పంపించాలని స్పష్టం చేసింది. తాజా ఫోరెన్సిక్ అభిప్రాయం అందిన అనంతరం పోలీసులు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొత్తగా ఇచ్చే అభిప్రాయం కాపీని పిటిషనర్కు కూడా అందించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధిస్తూ.. విచారణ ముగించింది. తన భర్త రాజు మృతి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదంటూ ప్రియాంక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పిటిషన్పై జస్టిస్ తంగిరాల మాధవీ దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. మరో సారి అన్ని పరీక్షలు నిర్వహించి, నివేదికలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
కవితపై అనుచిత వ్యాఖ్యలు..కానిస్టేబుల్ సస్పెన్షన్
జీడిమెట్ల: సామాజిక మాధ్యమాలలో టీఅర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ అధ్యక్షురాలు కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై వేటు పడింది. 2018 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కే అనిల్ ప్రస్తుతం సైబరాబాద్ సీఏఆర్ నుంచి ఆర్డర్ టు సర్వ్లో భాగంగా హైదరాబాద్ సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కవితనుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అధికారుల దృష్టికి వచి్చంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ రమేష్.. కానిస్టేబుల్ అనిల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో కూడా పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. -
సారీ రాధికా.. గుడ్బై
హైదరాబాద్: భార్య పుట్టినరోజు నాడే ఓ ఐటీ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ (40), రాధిక దంపతులు కూకట్పల్లి దేవి నగర్లోని భాస్కర ప్యాలెస్లో నివాసముంటున్నారు. రమేష్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 1న భార్య రాధిక పుట్టినరోజు కావడంతో ఆమె అక్క, తమ్ముడు ఇంటికి వచ్చారు. అందరూ కలిసి ట్యాంక్ బండ్కు వెళదామని రమేష్ను కోరగా.. తాను రానని చెప్పడంతో వారు వెళ్లారు. ఇంట్లో ఉన్న రమేష్ అర్ధరాత్రి భార్యకు ‘పొరపాటు జరిగింది సారీ గుడ్ బై’ అని మెసేజ్ పంపాడు. కంగారుపడిన భార్య వెంటనే ఇంటికి వచ్చి చూడగా, అప్పటికే రమేష్ చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవుడిగా పడి ఉన్నాడు. భార్య పుట్టినరోజే భర్త ఇలా ప్రాణం తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య -
HYD: ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్ల కలకలం..
సాక్షి, మల్కాజ్గిరి: హైదరాబాద్లోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్లు కలకలం రేపాయి. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఓ ప్లాస్టిక్ బకెట్లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా, ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఉన్న బకెట్లో మొత్తం 8 బండిల్స్లో 160 డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి 33A సైజు కమర్షియల్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లుగా అధికారులు గుర్తించారు. ఆర్మీ సిబ్బంది సమాచారంతో బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిటోనేటర్లను పరిశీలించేందుకు మల్కాజ్గిరి బాంబ్ డిస్పోజల్ టీమ్కు సమాచారం అందించారు. డిస్పోజల్ టీమ్ సూచనల మేరకు డిటోనేటర్లను ఆర్మీ సిబ్బంది సురక్షితంగా భద్రపరిచారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో ఆర్మీ క్యాంప్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్కు ఎండ్ కార్డు? -
కొండా సురేఖ ఎపిసోడ్కు నేడు ఎండ్కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్కు ఎండ్కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
హైదరాబాద్లో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్: నగరంలోనే అతిపెద్దదైన నల్లగొండ ఎక్స్రోడ్ స్టీల్ బ్రిడ్జి (సైదాబాద్) ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ స్టీల్ వంతెనను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. మొదట మలక్పేట అక్బర్బాగ్లోని ఫైర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం బ్రిడ్జి మీదుగా సీఎం కాన్వాయ్ సంతోష్నగర్–యాదిగిరి «థియేటర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి అదే బ్రిడ్జి మీదుగా వచ్చి నల్లగొండ క్రాస్రోడ్ వద్ద యూటర్న్ తీసుకుని మలక్పేట ఫైర్ స్టేషన్, చంచల్గూడ జైలు రోడ్ మీదుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణకు చేరుకుంటుంది. ఇక్కడ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. కాగా రూ.620 కోట్ల వ్యయంతో 3.23 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నగరంలోనే అతి పెద్దది. ఇంతకు ముందు ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి 2.3 కి.మీ ఉండగా..సైదాబాద్ స్టీల్బ్రిడ్జి దీనిని అధిగమించనుంది. స్టీల్బ్రిడ్జ్ నిర్మాణం కింది భాగంలో ఇరువైపులా రహదారులను సైతం అధికారులు పూర్తిగా ఆధునీకరించారు. పచ్చదనం పెంపునకు కూడా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ప్రాజెక్టు అధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు. సౌత్ రేంజ్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అడిషనల్ డీసీపీ ఎంఏ మాజీద్ తదితరులు సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు. చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో నిర్వహించనున్న బహిరంగ సభ వద్ద ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మలక్పేట, సైదాబాద్ ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్లు బ్రహ్మమురారి, వెంకట్రెడ్డి ఉన్నారు.చదవండి: అనుమానంతో భార్యను చంపిన భర్త -
లక్ష మందితో ‘చలో హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: లక్ష మందితో ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధనకు టీజీఈజేఏసీ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో చలో హైదరాబాద్ వాల్పోస్టర్ను టీజీఈజేఏసీ ప్రతినిధులతో కలిసి చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా పోరాటం ఆగదు : మారం జగదీశ్వర్ ‘మా పోరాటం రాజ్యాంగబద్ధం. ఉచితాలు అడగడం లేదు. చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించిన తర్వాత సీఎం ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చాయ్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సంఘ భవనాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అది కూడా అమలు చేయడం లేదు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై చర్చించడానికి కార్యదర్శి సమయం ఇవ్వరు. మంత్రులను కలిస్తే తర్వాత మాట్లాడుదాం అంటారు. ఇక ఎవరిని అడగాలి. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కొట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని ఉద్యోగులంతా ఏకమయ్యారు. ఇక్కడ యూనియన్లు, రాజకీయాలు లేవు. అందరూ జేఏసీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలి. చలో హైదరాబాద్ను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల జేఏసీలతో సమావేశం నిర్వహించాం. ఈ జిల్లాల నుంచి 50 వేల మంది వస్తారని వారంతా చెప్పారు. ఉద్యోగులే కాకుండా భార్య/భర్త, పిల్లలతో కలిసి రావాలని పిలుపునిచ్చాం. వెంట టిఫిన్/స్నాక్స్ తెచ్చకోవాలి. జేఏసీ ఏమీ ప్రొవైడ్ చేయదు’అని జగదీశ్వర్ వ్యాఖ్యానించారు. అనుమతి కోసం చివరి వరకు నాన్చొద్దు : ఏలూరి శ్రీనివాసరావు ‘చలో హైదరాబాద్లో భాగంగా ఉద్యోగులంతా ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి. అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు అనుమతి రాలేదు. నాలుగుచోట్ల సభ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఎల్బీ స్టేడియం, ఎనీ్టఆర్ గ్రౌండ్స్, నిజాం కాలేజీ గ్రౌండ్స్, సరూర్నగర్ స్టేడియం వద్ద సభ నిర్వహించుకునేందుకు దరఖాస్తు సమరి్పంచాం. ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాటుకు అనుమతి వస్తుందని, ఈ అనుమతి అంశాన్ని తక్షణమే తేల్చాలని, చివరి నిమిషం వరకు నాన్చొద్దు. మూడేళ్లుగా మా డిమాండ్లపై పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సరైన పరిష్కారం లభించకపోవడంతోనే ఉద్యమిస్తున్నాం. మా సమస్యలపై సీఎం సుముఖంగా ఉన్నా, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగుల ఆవేదనను సీఎం అర్థం చేసుకుని ప్రత్యేక చొరవ తీసుకోవాలి’అని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు బి.శ్యామ్, ముజీబ్, జి.సదానంద్ గౌడ్, చావ రవి, ఎం.మోహన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేపీహెచ్బీలో గజం భూమి రూ. 2.70 లక్షలు
కూకట్పల్లి: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు మరోసారి భారీ ధర పలికింది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కేపీహెచ్బీ ప్రాంతంలోని ప్లాట్లు బహిరంగంగా వేలంలో రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ప్లాట్లకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించగా, ఒక చదరపు గజం భూమిని 2.70 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ల బహిరంగ వేలం కోసం ఆగస్టు 10న హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. చదరపు గజానికి కనీస ధర 1.60 లక్షలుగా నిర్ధారించగా, రూ.2.70 లక్షలకు అమ్ముడు పోయిందని, మరో ప్లాట్ను చదరపు గజం 2.36 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి గౌతం తెలిపారు. ఇంకో రెండు ప్లాట్లను గజం 2.06 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేశారని తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో ప్లాట్లను దక్కించుకోవడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు పోటీపడ్డారు. బుధవారం బహిరంగ వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు 1.79 లక్షలు పలికిందని వివరించారు. బహిరంగవేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు 47.14 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. -
బైనాక్యులర్ ఎందుకు ఎత్తుకెళ్లారు?
సాక్షి, హైదరాబాద్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం (కోటే) తాళాలు పగలగొట్టి 12 అత్యాధునిక ఆయుధాలు, 1,800కు పైగా రౌండ్ల తూటాలను దుండగులు అపహరించిన ఘటన దేశ రక్షణ శాఖను కుదిపేస్తోంది. మాయమైన వాటిలో 4 అత్యాధునిక ఏకే–203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, 7 పిస్టళ్లు ఉన్నాయి. అయితే, ఈ భారీ ఆయుధాల సంపదతో పాటు దుండగులు ప్రత్యేకంగా ఒక ‘ప్యాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్’(రాత్రి వేళల్లో చూసేందుకు ఉపయోగపడే అత్యాధునిక పరికరం) కూడా ఎత్తుకెళ్లడం ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు తుపాకులతో పాటు ఈ బైనాక్యులర్ను ఎందుకు టార్గెట్ చేశారు? చీకటి సామ్రాజ్యంలో దీని అవసరం ఏముంటుంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేవలం తుపాకులు, బుల్లెట్లు ఉంటే సరిపోదు, వాటిని అర్ధరాత్రి వేళల్లో శత్రువులపై లేదా లక్ష్యాలపై ఖచి్చతత్వంతో ప్రయోగించాలంటే ’చూపు’ అత్యంత అవసరం. సాధారణంగా నేరగాళ్లు లేదా ఉగ్రవాద మూఠాలు రాత్రి సమయాల్లోనే తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. ఘటనా స్థలంలో దొంగిలించిన ఏకే–203 రైఫిళ్లు రాత్రి వేళల్లో కూడా శత్రువులను తుదముట్టించగల సామర్థ్యం ఉన్నవి. వీటికి తోడుగా ఈ ’ప్యాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్’ ఉంటే చీకట్లో సైతం వందల మీటర్ల దూరంలో ఉన్న కదలికలను స్పష్టంగా గమనించవచ్చు. అంటే, దొంగిలించిన ఆయుధాల శక్తిని రాత్రి పూట వంద శాతం ఉపయోగించుకోవడానికే ఈ పరికరాన్ని పక్కా ప్లాన్తో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలతో పాటు ఆపరేషనల్ సపోర్ట్ ఇచ్చే నైట్ విజన్ పరికరాన్ని కూడా ఎత్తుకెళ్లడం వెనుక తీవ్రమైన కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. రాత్రి వేళల్లో అడవులు లేదా కొండ ప్రాంతాల్లో దాక్కుని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడే ఉగ్రవాద ముఠాలకు లేదా అంతర్రాష్ట్ర నేరగాళ్లకు వీటిని సరఫరా చేసేందుకే ఈ చోరీ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మిస్టరీగా మారిన దోపిడీ.. చోరీ గుట్టును రట్టు చేసేందుకు మల్కాజ్గిరి పోలీస్, ప్రత్యేక ఆపరేషన్ల బృందాలు, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. నిందితుల కోసం మొత్తం ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపును తీవ్రతరం చేశారు. ఈ మిలిటరీ స్థావరం చుట్టూ 15 అడుగుల ఎత్తైన గోడ ఉండటంతో పాటు కొన్ని చోట్ల పాక్షిక ఫెన్సింగ్ ఉంది. ఆయుధాగారం మొత్తం ప్రాంగణానికి మధ్యలో ఉంటూ ఎల్లప్పుడూ సాయుధ బలగాల కాపలాలో ఉంటుంది. ఈ సైనిక స్థావరానికి మూడు ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. ఒక గేట్ నేరుగా రాష్ట్రపతి నిలయం వైపునకు దారితీస్తుంది. మిగిలిన రెండు గేట్లు అల్వాల్, బొల్లారం వైపునకు వెళ్తాయి. ప్రతి గేటు వద్ద రాత్రి వేళల్లో ముగ్గురు సాయుధ సైనికులు, పగటిపూట ఇద్దరు సైనికులు కాపలాగా ఉంటారు. వీటన్నింటికీ అదనంగా, డిఫెన్స్ సెక్యూరిటీ కారŠప్స్ (డీఎస్సీ)కి చెందిన ప్రత్యేక మిలిటరీ యూనిట్ సాయుధ బలగాలు, మిలిటరీ పోలీస్ నిరంతరం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాయి. చోరీ జరిగిన ఘటనా స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక గేట్ కౌకూర్ వైపునకు దారితీస్తుంది. ఇది ఆయుధాల నిల్వ కేంద్రానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇంతటి భద్రత నడుమ సాధారణ పౌరులెవరూ ఇంతటి కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని దాటి లోపలికి వచ్చే సాహసం చేయలేరని, ఈ చోరీ సాధారణ దొంగల పని కాదని ఆయుధాగారంలో ఏ బాక్స్లలో ఏమున్నాయి? ఏ పరికరం దేనికి ఉపయోగపడుతుంది? అనే పూర్తి అవగాహన ఉన్న లోపలి వ్యక్తుల హస్తం ఇందులో ఖచ్చితంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.బెటాలియన్ లేని సమయం చూసి స్కెచ్.. ఈ చోరీ వెనుక ఉన్న పక్కా వ్యూహాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బెటాలియన్కు చెందిన ప్రధాన సైనిక విభాగాలు, కమాండింగ్ ఆఫీసర్, ఇతర సీనియర్ అధికారులు ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లారు. ఆ సమయంలో యూనిట్ బాధ్యతలను సెకండ్ ఇన్ కమాండ్ (లెఫ్టినెంట్ కల్నల్ హోదా అధికారి) చూసుకుంటున్నారు. క్యాంప్లో ప్రధాన సైన్యం లేని తరుణాన్ని చూసి గత నెల 30 (ఆదివారం) మధ్య రాత్రిని సరిగ్గా వాడుకుని ఈ అత్యాధునిక ఆయుధాలను చోరీ చేశారు. చోరీ జరిగిన రోజుతో పాటు, గత కొన్ని వారాలుగా ఆయుధాగార భద్రతలో డ్యూటీ చేసిన ప్రతి ఒక్కరి సైనిక రికార్డులను, వారి విశ్వసనీయతను విచారణ కమిటీ నిశితంగా పరిశీలిస్తోంది. -
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్పో–2026ను ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్రెడ్డి బుధవారం ఉదయం రాజ్నాథ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కర వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను రాజ్నాథ్కు సీఎం వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారిద్దరూ చర్చించారు. డిఫెన్స్ ఎక్స్పోలో లైవ్ డెమోలు... ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సుతోపాటు ఎయిర్ షో, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, భూఉపరితల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన లైవ్ డెమోలు డిఫెన్స్ ఎక్స్పోలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి రాజ్నాథ్కు వివరించారు. ఈ దృష్ట్యా డిఫెన్స్ ఎక్స్పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని, ఆహూతులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఎయిర్ షో నిర్వహణకు గగనతల అనుమతుల మంజూరు చేయాలని.. యుద్ధ విమానాల భాగస్వామ్యంతోపాటు సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల ప్రదర్శనలు ఉండేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా మద్దతు అందించాలన్నారు. త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థల డెమోలను ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ శాఖ కోరినట్లుగా భూసేకరణ... ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ గురించి రాజ్నాథ్ సింగ్, రేవంత్రెడ్డి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించిందని రేవంత్ చెప్పారు. ఈ విమానాశ్రయం కోసం రక్షణ శాఖ మొత్తం 1,500 కోరిందని.. ఆ మేరకు మరో 750 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించనున్నట్లు రాజ్నాథ్కు సీఎం వివరించారు. విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలి... ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయన్ను పార్టీ ఎంపీలు, అధికారులతోపాటు వెళ్లి కలిశారు. మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేసి కేంద్రానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్తోపాటు మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్ (ఎంఆర్వో) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్లో రన్వే విషయంలో తుది నిర్ణయానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో ఆహ్వానిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. హుస్సేన్సాగర్లో సీప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన అధికారులు సీఎంకు తెలియజేశారు. -
జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటిదొంగలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయానికి (జేఎన్టీయూహెచ్) అనుబంధంగా జగిత్యాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఉపకార వేతనాలు లేని విద్యార్థులు నేరుగా హాస్టల్ ఫీజులు చెల్లిస్తారు. ఈ ఫీజు మొత్తంలో నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాలి. జీఎస్టీ అకౌంట్కు వెళ్లాల్సిన ఈ మొత్తం ఆ కాలేజీలో పనిచేసే ఓ ఉద్యోగి అకౌంట్లోకి వెళ్లింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో జేఎన్టీయూహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెల 31వ తేదీన ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్టు తెలియడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని కమిటీ తేల్చడంతో కొడిమ్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని విచారణ కమిటీ గుర్తించినట్టు తెలిసింది. అయితే..కేవలం గత ఏడాది నుంచి జరిగిన అవకతవకల వరకు మాత్రమే విచారణ చేపట్టాలని విచారణ కమిటీపై ఒత్తిడి తేవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్న మరికొంతమంది పాత్ర వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే విచారణ నివేదికను కూడా మార్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జేఎన్టీయూ వీసీ కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి గతంలో జగిత్యాల కాలేజీలో పనిచేశారు. ఆయన కాలం నుంచీ జీఎస్టీ నిధుల గోల్మాల్ జరిగినట్టు కమిటీ గుర్తించినట్టు తెలిసింది. వీసీ అండదండలు పుష్కలంగా ఉన్న కారణంగా ఆయన పాత కథను తెరమరుగు చేసే ప్రయత్నం జరిగిట్టు సమాచారం. కేవలం తాను అక్కడి నుంచి రిలీవ్ అయిన కాలం నుంచే విచారణ చేపట్టాలని కమిటీపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2017 నుంచి కొన్ని లక్షల్లో గోల్మాల్ అయితే, కమిటీ నివేదికను మాత్రం రూ. 5,23,071గా పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
సాగు ప్రాజెక్టుల కార్యసాధకుడు వైఎస్సార్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల కార్యసాధకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డేనని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుల పనులను వైఎస్సారే ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు ఆయన తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రస్తుతం ఆగిపోయాయని.. అయితే ఆయన కలగన్న ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు అంకితమిస్తానని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవార్డు–2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాడు సీఎంగా ఉచిత విద్యుత్పై వైఎస్సార్ తొలి సంతకంవైఎస్సార్ జీవితాంతం ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించారని.. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఎర్రటి ఎండల్లో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన ఆయన నాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని రేవంత్రెడ్డి గుర్తుచేశారు. ముఖ్యంగా కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోతున్న పంటలతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి 2004లో సీఎం అయ్యాక ఆ పథకంపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న మహనీయుడని ప్రశంసించారు. దాదాపు రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే కాకుండా అప్పటికి రైతులపై ఉన్న వేలాది అక్రమ కేసులన్నింటినీ తొలగించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సహా ఆయన కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే వైఎస్సార్కు నిజమైన నివాళి అని చెప్పారు. వైఎస్సార్ పేదల పక్షపాతి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవార్డు–2026ను ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ఖర్గే ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్తోపాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ దేశానికి చేసిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. 17 ఏళ్ల క్రితం వైఎస్సార్ను కోల్పోయినా ఆయన నెలకొల్పిన ఆదర్శాలు నేటికీ సజీవంగా ఉన్నాయన్నారు. ఏ రైతు, ఏ పేద కుటుంబం కనీస అవసరాలకు నోచుకోకుండా మిగిలిపోకూడదన్నదే రాజశేఖరరెడ్డి సిద్ధాంతమని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గూడు, భూమిలేని వారికి భూపంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేశారని ప్రశంసించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేయడంతోపాటు 39 ఎంపీ స్థానాల్లో పార్టీని గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కీలకపాత్ర పోషించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీపీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్, ఎంపీలు సురేశ్ షెట్కార్, నిరంజన్రెడ్డి, అనిల్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, సంపత్ పాల్గొన్నారు.వైఎస్సార్, స్వామినాథన్ మహనీయులు: భట్టి రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు మహనీయుల్లో ఒకరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అయితే, మరొకరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయ రంగానికి శాస్త్ర సాంకేతిక ఫలాలను స్వామినాథన్ అందించారని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసాను వైఎస్సార్ కల్పించారని చెప్పారు. ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభు త్వాలు సైతం విస్మరించలేని విధంగా రైతు సంక్షేమానికి వైఎస్సార్ బాటలు వేశారని చెప్పారు. ఆయన నేర్పిన ఓనమాలతోనే తాను ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగేందుకు దోహదపడ్డాయన్నారు. రచ్చబండ కొనసాగాల్సిందేనని చెప్పి బయలుదేరిన ఆయన.. ఎవరికీ కనబడనంత దూరానికి వెళ్లిపోయారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గొప్ప నాయకుడి వారసుడిగా పార్టీ నేతలు, కార్యకర్తలంతా ముందుకు వెళ్తుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
కాంగ్రెస్ది 420 ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతి విషయంలోనూ మోసం చేసిన ‘420 ప్రభుత్వం’గా మిగిలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని, ఆరు డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ చెల్లింపుల్లో కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, ఏటా 2 లక్షల ఉద్యోగాలు, రూ.4,000 నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్న హామీని నీరుగార్చారని, కుల గణన పేరుతో ముస్లింలను బీసీల్లో చేర్చి అసలైన బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. -
ఆ బరాజ్కు ఫిదా.. ‘కరెంట్’కు ఆదా!
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించి గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల నీళ్లను నేరుగా సుందిళ్ల బరాజ్కు తరలిస్తే ఏటా రూ.385.5 కోట్ల విద్యుత్ బిల్లుల వ్యయం ఆదా కానుంది. ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలు యూనిట్కు రూ.6.30పైసలు కాగా, టీఎంసీ నీళ్లను మేడిగడ్డ గడ్డ బరాజ్ నుంచి తోడేందుకు రూ.2.78 కోట్లు, అన్నారం బరాజ్ నుంచి తోడేందుకు రూ.2.01 కోట్ల విద్యుత్ చార్జీల వ్యయం కానుంది. ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ నుంచి 80 టీఎంసీలను అన్నారం బరాజ్లోకి ఎత్తిపోయడానికి రూ.222.6 కోట్ల విద్యుత్ చార్జీల వ్యయం కానుంది. ఇక అన్నారం బరాజ్ నుంచి 80 టీఎంసీలను సుందిళ్ల బరాజ్కు ఎత్తిపోస్తే మరో రూ.160.90 కోట్ల విద్యుత్ బిల్లుల ఖర్చు కానుంది. దీనికి ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి 80 టీఎంసీల నీళ్లను గ్రావిటీ ద్వారా నేరుగా సుందిళ్ల బరాజ్కు తరలిస్తే పైన పేర్కొన్న రెండు ఖర్చులు కలిపి మొత్తం రూ.385.5 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా కానున్నాయి. ఆదాపై పవర్ పాయింట్ ప్రజంటేషన్..తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి ఇప్పించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో నిర్వహించిన సంప్రదింపులు నిర్వహించారు. తెలంగాణ అధికారులు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఇ చ్చిన సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే తుమ్మిడిహెట్టి బరాజ్తో ఆదా కానున్న విద్యుత్ బిల్లుల వ్యయాన్ని లెక్కలతో సహా వివరించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద వర్ధా, వెయిన్ గంగా నదులు సంగమించే ప్రాంతం వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తేనే 80 టీఎంసీల నీళ్లను తరలించుకోవడానికి వీలుండనుంది. గ్రావిటీతో ఈ మేరకు నీళ్లను తరలిస్తే భారీ పంపులు, మోటార్ల అవసరం లేకుండా విపరీతమైన విద్యుత్ ఖర్చులు మిగులుతాయి. గతంలో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బరాజ్ ఎత్తును 148 మీటర్లకు పరిమితం చేస్తే మళ్లించగలిగే నీళ్లు 43 టీఎంసీలకు పడిపోతాయి. ముంపు ఉండదు.. పునరావాసం అక్కర్లేదుతుమ్మిడిహెట్టి బరాజ్ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 3,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతున్నప్పటికీ, అందులో 2,156 హెక్టార్లు అత్యధిక భాగం నదీ పరిధిలోనే ఉండగా, 545 హెక్టార్లు చాప్రాల అటవీ/ఈకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఇందులో మహారాష్ట్ర 3,086 హెక్టార్లు మహారాష్ట్ర, 789 హెక్టార్లు తెలంగాణ భూభాగంలోకి వస్తా యి. ఇక రెండు రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు. ఇరు రాష్ట్రాల్లో ఏ ఒక్క కుటుంబానికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహెట్టి నుండి సుందిళ్ల బరాజ్కి గ్రావిటీతో నీళ్లను తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎత్తిపోయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి 76.945 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ కాల్వ నిర్మాణం గతంలోనే పూర్తి చేశారు.అక్కడి నుంచి 20.9 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. 8.250 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వను నిర్మించి సొరంగాన్ని సుందిళ్ల బరాజ్తో అనుసంధానిస్తారు. వార్ధా, వెయిన్గంగా నదుల సంగమ స్థలంలో లంబాకారంలో 6.517 కి.మీ.ల పొడవున బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదన ఎంతో అనుకూలమైనదని తెలంగాణ అధికారులు వివరించారు. గేట్ల నిర్వహణ, నీటి ప్రవాహ నియంత్రణ సులువవుతుందని ప్రజెంటేషన్లో తెలిపారు. ఇప్పటికే బరాజ్ నిర్మాణానికి సీడబ్ల్యూ సీ, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ముఖ్యమైన అనుమతు లు లభించగా, అటవీ, పర్యావరణ తుది అనుమతుల ప్రక్రి య పురోగతిలో ఉందని నీటిపారుదల శాఖ వెల్లడించింది. -
జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని, ఏకీకృత కార్యాచరణతోనే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం నిర్వహించిన తొలి ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’సదస్సులో ఉత్తమ్ ప్రసంగించారు. జలభద్రతను కేవలం ఇంజనీరింగ్ పనులుగానో, ప్రభుత్వ శాఖల కార్యక్రమంగానో చూడకూడదన్నారు. తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉపాధి హామీ, పీఎంకేఎస్వై, ఆర్థిక సంఘం నిధులు, కాంపా, సీఎస్ఆర్ తదితర మార్గాల్లో జల సంరక్షణ పనులు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమాల మధ్య సమన్వయం లోపిస్తే ఆశించిన ఫలితాలు రావు అని హెచ్చరించారు. ఎన్ని నిర్మాణాలు చేపట్టామన్నది కాకుండా ఎంత నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది..భూగర్భ జలాలు ఎంత మేర వృద్ధి చెందాయన్న ఫలితాల ఆధారంగా పనితీరును అంచనా వేయాలని సూచించారు. ముందంజలో తెలంగాణజల సంరక్షణలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని ఉత్తమ్ తెలిపారు. 2025 ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’లో రాష్ట్రం బెస్ట్ పెర్ఫార్మర్గా గుర్తింపు పొందిందని, దేశంలోని టాప్–50 జిల్లాల్లో తెలంగాణ నుంచి 13 జిల్లాలు నిలవడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 44,360 చెరువులు, జలవనరులు ఉండగా, అందులో 28,739 వనరుల్లో పనులు చేపట్టామని, ఇప్పటికే 22,428 చోట్ల పునరుద్ధరణ పూర్తయిందని వివరించారు. రాష్ట్రంలోని 74 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 74.51 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం సృష్టించగా, మరో 53.18 లక్షల ఎకరాలను వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. -
ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
సుభాష్ నగర్: పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అందరి ముందు లేకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం ప్రెసిడెంట్ వై. ఈశ్వరప్రసాద్రెడ్డి అన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని గాజులరామారం, మహాదేవపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల, వైఎస్సార్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈశ్వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో పేదలకు చేసిన సేవలను కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో వై.ఎస్. జగన్ నడుస్తున్నారని చెప్పారు. శివరామిరెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి లేకపోయినా సంక్షేమ పథకాల రూపంలో ఆయన నిరంతరం అందరికీ కనిపిస్తున్నారన్నారు.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తండ్రి బాటలో వై.ఎస్. జగన్ నడుస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సేవా సంఘం అధ్యక్షుడు పుట్లూరు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ నాయకులు సాతాల గోపాల్, గంగిరెడ్డి సూర్య ప్రకాశ్రెడ్డి, వెంకటస్వామిరెడ్డి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, వెంకట్రెడ్డి, సురేంద్రరెడ్డి, ప్రవీణ్రెడ్డి, రాంభూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సేవలు చిరస్మరణీయంమంత్రులు పొన్నం, వాకిటి, అడ్లూరి నివాళి పంజగుట్ట (హైదరాబాద్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజగుట్ట కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని మంత్రులు తెలిపారు. వైఎస్సార్ ప్రజలతో మమేకమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన ప్రజానాయకుడని మంత్రులు పేర్కొన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయన్నారు. వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. -
పిల్లల బడిలో పెద్దోళ్ల ఆఫీసు!
‘ఎలా ఉన్నాడో? ఏం చేస్తున్నాడో... అల్లరి చేస్తున్నాడో.... అమ్మ కావాలంటున్నాడో....’బుడి బుడి నడకల బుడ్డోడిని తొలిసారి స్కూల్లో వదిలి వచ్చాక.. ఆ పెద్దోళ్ల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇంటికి వచ్చినా, ఆఫీసుకు వచ్చినా మనసు మాత్రం ఆ బుడ్డోడి స్కూల్లోనే ఉండిపోతుంది. మరింకేం.. మనిషి కూడా మనసున్న చోటే ఉండండి అంటూ పేరెంట్స్ని మనసారా ఆహ్వానిస్తోంది ఓ వినూత్న కాన్సెప్ట్. సాక్షి, హైదరాబాద్: నగరంలోని టెక్ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ కల్చర్కు అలవాటు పడుతున్న వేళ.. ఇష్టం వచ్చిన చోట ఉంటూనే ఆఫీస్ పని చేసుకునే వెసులుబాటున్నప్పుడు...స్కూల్ నుంచి మాత్రం ఎందుకు పని చేసుకోకూడదు? ఈ ఆలోచనతో పిల్లలు స్కూల్లో చదువుకుంటుంటే..తల్లిదండ్రులు అదే ప్రాంగణంలో కూర్చుని తమ ఆఫీస్ పనులు చేసుకునేలా నగరానికి చెందిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూల్లో తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ‘పేరెంట్ కేఫ్–కో–వర్కింగ్ లాంజ్’ఏర్పాటు చేశారు. అంటే.. పిల్లలను స్కూల్లో దింపేసి ఆదరాబాదరా తిరిగి ఇంటికి/ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు.పిల్లలు క్లాస్రూమ్కి వెళ్తే పేరెంట్స్ కేఫ్లో కూర్చుని ప్రశాంతంగా ఆఫీసు పని చేసుకోవచ్చు.. లేదా కాఫీ తాగుతూ కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. తోటి తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు. సుమారు 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ లాంజ్లో పని చేసుకోవడానికి ప్రత్యేక డెస్క్ లు, అందరూ కలిసి కూర్చునే టేబుళ్లు ఏర్పాటు చేశారు. శాండ్విచ్లు, సలాడ్లు, ర్యాప్స్, బౌల్స్ వంటి తేలికపాటి ఆహారం కేఫ్లో లభిస్తుంది. వ్యాయామం చేయాలనుకునేవారి కోసం స్టేషనరీ సైకిల్, పిల్లల పెంపకం, చైల్డ్ డెవలప్మెంట్, విద్యకు సంబంధించిన పుస్తకాలతో నిండిన చిన్న లైబ్రరీ కూడా ఉంది. కేఫ్లో తీసుకునే ఆహారం, పానీయాలకు తప్ప కో–వర్కింగ్ లాంజ్ను ఉపయోగించేందుకు ఎలాంటి రుసుమూ లేకపోవడం విశేషం. ఆందోళన తగ్గింది మా కవల పిల్లలు చాశ్వి, చాసన్లను స్కూల్లో వదిలి వెళ్లాల్సి రావడం వల్ల కలిగే ఆందోళనను ఈ లాంజ్ కొంతవరకు తగ్గిస్తోంది. పిల్లలు బాగా చిన్నవాళ్లు కావడం వల్ల స్కూల్ కొనసాగుతున్న సమయంలోనూ అప్పుడప్పుడు వారిని చూసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాంటప్పుడు ఇంటి నుంచి మళ్లీ స్కూల్కు రావడం కంటే ఇక్కడే ఉండటం సౌకర్యంగా ఉంటుంది. రోజూ రెండు గంటలపాటు పుస్తకం చదవడం, ఇతర తల్లిదండ్రులతో మాట్లాడడం బాగుంది. – ప్రత్యూష దేవరపల్లి, గృహిణి, కోకాపేట కో వర్కింగ్ స్పేస్ల కన్నా విశాలంగా... సాధారణ కో–వర్కింగ్ స్పేస్లలో మూసివేసిన డెస్్కలు, క్యాబిన్లు కొంత ఇరుకుగా అనిపిస్తాయని.. ఇక్కడ మాత్రం విశాలమైన, గాలి బాగా వచ్చే వాతావరణం ఉండటంతో ప్రశాంతంగా పని చేసుకోవచ్చని ఓ స్టార్టప్ నిర్వాహకులు కార్తీక్ చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలను ఆట కోసం బయటకు తీసుకొచ్చే సమయాలు నిర్దిష్టంగా ఉండటంతో లాంజ్లోకి పెద్దగా శబ్దం రాకపోవడం కూడా పనిపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతోందని అంటున్నారు. లండన్.. సింగపూర్ స్ఫూర్తిగా... ఈ వినూత్న ఆలోచనకు బీజం 2022లో పడిందని ప్రీ–నర్సరీ, కిండర్గార్డెన్తో పాటు రెండో తరగతి వరకు తరగతులు నిర్వహించే నానక్రామ్గూడలోని సేజ్బ్రూక్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ రాజు చెబుతున్నారు. తాను లండన్లోని ఓ కిండర్గార్డెన్ సందర్శించినప్పుడు అక్కడ చిన్న చిన్న క్యూబికల్స్తో ఏర్పాటు చేసిన కో–వర్కింగ్ స్పేస్ను చూశానని, పిల్లలు స్కూల్లో ఉండగా తల్లిదండ్రులు ఆ సమీపంలోనే ఉంటూ పని చేసుకునే ఆ విధానం తనకు బాగా నచ్చిందని వివరించారాయన. తర్వాత సింగపూర్లోని ఓ స్కూల్ కూడా ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలుసుకున్నానన్నారు. దీంతో ఈ కాన్సెప్ట్ ను హైదరాబాద్లో అమలు చేయాలనే ఆలోచనకు రూపమిచ్చామన్నారు. గతంతో పోలిస్తే పిల్లల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఇప్పుడు మరింత పెరిగిందని పేర్కొన్నారు. మరోవైపు పిల్లల పెంపకంలో తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అంతా ఒకే ప్రాంగణంలో కలిసి ఉండేలా ‘ఇంటర్జెనరేషనల్ క్యాంపస్’గా తమ స్కూల్ని తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని చెబుతున్నారు. సెపరేషన్ యాంగ్జెటీకి సొల్యూషన్.. పిల్లలను తొలిసారి స్కూల్లో వదిలేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు ‘సెపరేషన్యాంగ్జైటీ’కి గురవుతారని స్కూల్ సహ వ్యవస్థాపకురాలు ఎషితా రాజు అంటున్నారు. భవిష్యత్తులో సెపరేషన్యాంగ్జైటీ, చిన్నారుల సమగ్రాభివృద్ధి, వయసుకు తగ్గ అభ్యాస పద్ధతులు, పిల్లల ఎదుగుదలలో కీలకమైన మైలురాళ్లు వంటి అంశాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించేందుకు కూడా స్కూల్ సిద్ధమవుతోందని, అందుకే ఈ లాంజ్ కేవలం పనిచేసుకునే స్థలం కాదని తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని బలోపేతం చేసే, కొత్త విషయాలు నేర్చుకునే వేదిక అని ఎషితా అంటున్నారు. అదే సమయంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, నగర ట్రాఫిక్.. ఇవన్నీ కలిపి తల్లిదండ్రులపై ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. -
11 నుంచి రైస్మిల్లులు బంద్ చేస్తాం
ఉప్పల్: రాష్ట్రంలోని రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం ఉప్పల్ భగాయత్లోని వంజరి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిధిగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈసీ సభ్యుడు సయ్యద్ రఫీ పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వూట్కూరి వీరేశం, కోశాధికారి విశ్వనాథం వెంకటరమణ పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. «నెలరోజుల్లోపు మిల్లర్ల సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి, ఉన్నతాధికారులు స్పందించకుంటే ఈనెల 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 11వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులను బంద్ చేస్తామని హెచ్చరించారు. -
ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో మాట్లాడక ముందు మంత్రి సురేఖ వారితో ముచ్చటించారు. సీఎం, ఇతర నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రస్తుతం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నా. రాజీనామా చేయాలని ఇప్పటివరకు నాకెవరూ చెప్పలేదు. నేను బీసీని కాబట్టి నాకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? కేబినెట్లో ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు? మంత్రి పొంగులేటి కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు నోటీసులు ఇవ్వరు? సీఎంది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? సీఎం రేవంత్రెడ్డి అనేకసార్లు పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయనే నేరుగా ప్రకటిస్తున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంంఘన కాదా? నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నాపై చర్యలు తీసుకోవాలంటే పార్టీ, ప్రభుత్వంలో ఇంకా చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారు? నా కుమార్తె మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దల, సీఎంకుటుంబ సభ్యుల అవినీతి అందరికీ తెలియదా? నాపై బర్తరఫ్ వంటి లాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను..’ అని సురేఖ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను సైతం తొలగించేందుకు కుట్ర జరగుతోందని, మంత్రి పొన్నంను ఆయన శాఖలో స్వేఛ్చగా పని చేయనీయడం లేదని ఆరోపించారు.


