breaking news
Hyderabad
-
మండలాల వారీగా లైసెన్స్డ్ సర్వేయర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాల వారీగా లైసెన్సుడు సర్వేయర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ పూర్తి చేసుకున్న 7 వేల మందికి పైగా సిబ్బందిని మండలాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి రెవెన్యూ మండలంలోని గ్రామాలను బట్టి ఆయా మండలాలకు 4–6 మందిని లైసెన్సుడు సర్వేయర్లుగా నియమించనున్నట్టు సమాచారం.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారని, ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. గత మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో ఏడువేల మందికి పరీక్షలు నిర్వహించారు. అదే నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో వారికి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు ఇచ్చే అప్రెంటీస్ శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇక, రెండోదశ శిక్షణను ఆగస్టు 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించారు.తొలిదశ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని అక్టోబర్ రెండో తేదీ నుంచి గ్రామాల్లో నియమించాలని ప్రభుత్వం భావించినా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈలోపు పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాతే నియామకాలు జరపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. కానీ, కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో మళ్లీ పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చేలోపు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాలను పూర్తి చేయాలని ఆ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో లైసెన్సుడు సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను పూర్తి చేయనుంది. -
బీసీ వర్గీకరణ తర్వాతే ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ వర్గీకరణ మే రకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించా లని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దా ఖలైంది. దీన్ని గతంలో దాఖలైన పిటిషన్లకు జత చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అప్పటి నుంచి మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో వర్గీకరణ లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ నోమాడిక్, సెమీనోమాడిక్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్పై జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ‘విద్య, ఉపాధి కల్పనలో సంచార, డీనోటిఫైడ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు అందించడంలో అధికారుల వైఫల్యం రాజ్యాంగ విరుద్ధం. ఉమ్మడిగా 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తే ఆర్థికంగా ఎదిగిన కులాలు మాత్రమే లబ్దిపొందుతాయి. పేద బీసీ కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. జీవో 9ని నిలిపివేసి.. బీసీ వర్గీకరణతో కొత్త జీవో జారీ చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలి’అని నివేదించారు. -
మేడిగడ్డ పునరుద్ధరణకు డిజైన్లు ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్లతోపాటు సమ గ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి పలు ఐఐటీలతోపాటు విదేశీ సంస్థలూ ముందుకొచ్చాయి. రూర్కి, మద్రా స్, హైదరాబాద్ ఐఐటీలతోపాటు నిప్పాన్, ఆర్వీ అసోసియే ట్స్, స్పెయిన్కు చెందిన మరో సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లో పాల్గొంటున్నాయి.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్లు, పునరుద్ధరణ ప్రణాళిక అందించాలని కోరుతూ నీటిపారుదల శాఖ ఈ నెల 1న ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించగా, ఈ నెల 15తో బిడ్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఈ క్రమంలో సోమవారం జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా, పైన పేర్కొన్న సంస్థల ప్రతినిధులు పాల్గొని బిడ్ల దాఖలుకు గడువును 15 రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ గడువును వారం రోజులు పొడిగించే అంశాన్ని నీటిపారుదల శాఖ పరిశీలిస్తోంది. నిబంధనలు సడలించాలి... బరాజ్ల పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు/భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బరాజ్లకు ఉన్న సామర్థ్యంపై మదింపు, గేట్లు/పియర్లు/సిలి్టంగ్ బేసిన్/కటాఫ్ వాల్స్ వంటి కీలక విభాగాలను పటిష్టం చేసేందుకు డిజైన్లు అందించాలని ఈఓఐలో నీటిపారుదల శాఖ కోరింది. బరాజ్ల ప్రస్తుత డిజైన్లతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించాలని కోరింది. ఈ క్రమంలో అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి జియోటెక్నికల్, జియోఫిజికల్ వంటి పరీక్షలు నిర్వహించాలని సూచించింది.ఈ పరీక్షల ద్వారా బరాజ్లలో ఉన్న అన్ని రకాల లోపాలను గుర్తించాలని కోరింది. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ బరాజ్లోని కుంగిన 7వ బ్లాకును సుస్థిరం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం జరిపి తగిన పరిష్కారాలను సూచించాలని తెలిపింది. పక్కనే ఉన్న ఇతర బ్లాక్లకు ఎ లాంటి నష్టం కలిగించకుండా 7వ బ్లాక్ను తొలగించేలా పరిష్కారాలు ఉండాలని షరతు విధించింది. ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్కి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం పొందాలి. ఆసక్తి గల సంస్థ గత 15 ఏళ్ల లో కనీసం ఒకటి రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఇ లాంటి పనులు చేసి ఉండాలని అర్హతలను నిర్దేశించింది.14 మీటర్ల ఎత్తుతో బరాజ్ల నిర్మాణంలో అనుభవం కలిగి ఉండాలని మరో అర్హతగా పేర్కొంది. ఈ నిబంధనను సడలించి ఎత్తును 7.5 మీటర్లకు కుదించాలని ప్రీబిడ్ సమావేశంలో కొన్ని సంస్థలు కోరినట్టు తెలిసింది. మరికొన్ని నిబంధనల విషయంలో సైతం సడలింపులు కల్పించాలని ఔత్సాహిక బిడ్డర్లు కోరినట్టు తెలిసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం దీనిపై శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐఐటీ రూర్కీ వద్దు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణానికి ఐఐటీ రూర్కీ సాంకేతిక సహకారం అందించింది. ఆ బరాజ్లలో లోపాలు బయటపడిన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ సహకారం మళ్లీ తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది. -
సంక్షేమ వసతి గృహాల్లోనూ ఎఫ్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరు కూ డా ఇదే విధానంలో స్వీకరించాలన్నారు. ఈమేరకు హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలన్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఆహారంతో విద్యార్థులకు లభించే కేలరీలను తెలుసుకోవాలని చెప్పారు. హాస్టళ్ల సమాచారం డాష్బోర్డులో... హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలన్నారు. ‘హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను సంక్షేమ హాస్టళ్లతో అనుసంధానించాలి.హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించాలి’అని రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్íÙప్లు, సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ను సీఎం ఆదేశించారు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయండి హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నిధుల విడుదల కోసం ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, అవసరమైన యాప్లను రూపొందించాలని నిర్దేశించారు.ముఖ్యమంత్రి సహాయనిధి కింద సంక్షేమ విద్యాసంస్థలకు రూ.60 కోట్లు ప్రత్యేకంగా కేటాయించగా... ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందించారు. ఈ నిధులను హాస్టళ్లలో మరమ్మతులు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రవాణా వాహనాలకు ‘కేంద్రీకృత వ్యవస్థ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక వెలికితీత, విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇసుక వెలికితీత, రవాణాలో ఉపయోగించే వాహనాల జీపీఎస్ సమాచారాన్ని ఏకీకృతం చేసి పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆయా వాహనాలు జీపీఎస్ వ్యవస్థను అమర్చుకోవడాన్ని టీజీఎండీసీ ఇదివరకే తప్పనిసరి చేసింది. వేర్వేరు జీపీఎస్ ప్రొవైడర్ల ద్వారా ఈ వాహనాల్లో జీపీఎస్ పరికరాలను అమర్చారు. అయితే ఈ ప్రొవైడర్ల వద్ద ఉన్న వాహనాల కదలికల సమాచారం టీజీఎండీసీ వద్ద ఏకీకృతంగా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా, వెలికితీతలో నిమగ్నమైన వాహనాల వివరాలను తమ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయాలని జీపీఎస్ ప్రొవైడర్లను టీజీఎండీసీ ఆదేశించింది. రియల్ డేటాను పంచుకోవాలి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకం, నిలువ, విక్రయాల్లో సుమారు 40వేలకు పైగా యంత్రాలు, రవాణా వాహనాలు నిమగ్నమై ఉన్నాయి. వీటిలో 70శాతానికి పైగా వాహనాల్లో వివిధ జీపీఎస్ ప్రొవైడర్ల ద్వారా పరికరాలను అమర్చారు. టీజీఎండీసీ రూపొందించిన ఏపీఐతో అనుసంధానం చేయడం ద్వారా వాహనాల కదలికల (రియల్ టైమ్ డేటా) సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా కేంద్రీకృత వాహన పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలవుతుంది. అయితే ఇప్పటివరకు 8 వేల వాహనాల జీపీఎస్ డేటా మాత్రమే ఏపీఐతో అనుసంధానమైంది. ఈ నేపథ్యంలో మిగతా వాహనాల జీపీఎస్ సమాచారాన్ని కూడా ఏపీఐతో అనుసంధానం చేసేందుకు జీపీఎస్ ప్రొవైడర్లతో టీజీఎండీసీ సంప్రదింపులు జరుపుతోంది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది. జీపీఎస్ లేని వాహనాల గుర్తింపు జీపీఎస్ వాహన పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇసుక రవాణాలో జీపీఎస్ పరికరాలను లేకుండా పాల్గొంటున్న వాహనాలను గుర్తించడం సాధ్యమవుతుందని టీజీఎండీసీ భావిస్తోంది. జీపీఎస్ డేటా ఏకీకృతం కాకపోవడంతో జరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీఐతో అనుసంధానమయ్యే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, కో ఆర్డినేట్లు (అక్షాంశాలు, రేఖాంశాలు) తదితరాలను జీపీఎస్ ప్రొవైడర్లు అందజేయాల్సి ఉంటుంది. -
సిటీ పోలీసుల ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’
సాక్షి, సిటీబ్యూరో: ‘సహాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పకు. అతడిని ముగ్గురికి సహాయం చేయమని చెప్పి ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చొప్పున సహాయం చేసేలా ప్రోత్సహించు...’ సినీ నటుడు చిరంజీవి కథా నాయకుడిగా నటించిన స్టాలిన్ సినిమాలోని కాన్సెప్ట్ ఇది. నగర కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ దీన్ని పోలిన వినూత్న కార్యక్రమానికి డిజైన్ చేశారు. ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ పేరుతో సోషల్మీడియా కేంద్రంగా సోమవారం ప్రారంభించారు. తొలి దశలో హెల్మెట్, సీట్బెల్ట్ ధారణపై దృష్టి పెట్టిన కమిషనర్ వాటి వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.సోషల్మీడియా, వైరల్... ఇవే ట్రెండ్స్ రహదారి భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పించడానికి కొన్నేళ్లుగా ట్రాఫిక్ విభాగం వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల కాలంలో సోషల్మీడియా ట్రెండ్ నడుస్తోంది. అందులో తమ ఫొటోలు, వీడియోలు వైరల్ కావాలని ఆశించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు. ఈ ధోరణి యువతలో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వాహనచోదకులు.. ప్రధానంగా యువతలో అవగాహన పెంచడానికే సజ్జనర్ ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను డిజైన్ చేశారు. అనునిత్యం ఏదో ఒక ఫొటో, వీడియో, కామెంట్లను పోస్టు చేసే నెట్జనుల దృష్టిని రహదారి భద్రత వైపు మళ్లించడానికి, ఈ అంశాలను ప్రచారం కల్పించడానికి అనువుగా దీన్ని కమిషనర్ రూపొందించారు. ప్రయాణం ప్రారంభానికి ముందు... దీనికి సంబంధించిన విధివిధానాలను కొత్వాల్ సజ్జనర్ సోమవారం తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ ఛాలెంజ్లో భాగంగా వాహనచోదకుడు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు హెల్మెట్ (ద్విచక్ర వాహనం), సీట్బెల్ట్ (తేలికపాటి వాహనం) కచ్చితంగా ధరించాలి. అలా తాను రహదారి భద్రత నిబంధనలు పాటిస్తున్నట్లు చిన్న ఫొటో లేదా వీడియో తీసుకోవాలి. దాన్ని తమ సోషల్మీడియా ఖాతా ద్వారా ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’ అనే హ్యాష్ట్యాగ్ ద్వారా షేర్ చేయాలి. ఆ సమయంలో తమ ఫ్రెండ్స్ లిస్ట్ లేదా ఫాలోవర్స్లో ఉన్న ముగ్గురు స్నేహితులు లేదా బంధువుల్ని ఎంచుకోవాలి. వాళ్లు సైతం ఈ ఛాలెంజ్ను స్వీకరించేలా ట్యాగ్ చేస్తూ ప్రోత్సహించాలి. గత వారమే చిరంజీవితో భేటీ... తొలిదశలో హెల్మెట్, సీట్బెల్ట్ వాడకం పెంచేలా, వీటిపై అవగాహన కలిగేలా, కలిగించేలా నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ చేపట్టిన ఈ ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను కొనసాగించనున్నారు. దశల వారీగా వివిధ రకాలైన రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎన్స్ఫోర్స్మెంట్తో (జరిమానాల విధింపు) పాటు ఎడ్యుకేషన్కు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న కొత్వాల్ ఈ దిశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలోని కాన్సెప్ట్ను పోలి ఉంది. గత శనివారం చిరంజీవితో పాటు ఆయన కుమార్తె సుస్మిత బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో సజ్జనార్ను మర్యాదపూర్వగా కలిసి భేటీ కావడం గమనార్హం. భద్రత అనేది నిత్యనూతన ఫ్యాషన్: విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ రహదారి భద్రత అనేది ఎప్పటికీ పాతబడని, నిత్యనూతనంగా ఉండే ఫ్యాషన్. ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీరు ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచాలనే తీర్మానంతోనే మొదలవ్వాలి. నగరవాసులం అంతా కలిసి 2025లో భద్రతనే ఓ వైరల్ ట్రెండ్గా మారుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్లో ఉత్సాహంగా పాల్గొనాలి. ఈ విధంగా ఒకరి నుంచి మరొకరికి స్ఫూర్తిపొందుతూ, యువతలో ట్రాఫిక్ నియమాలపై గౌరవాన్ని పెంచాలి. సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ఓ అలవాటుగా మార్చా లన్నదే ఈ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యం. ఇది ప్రతి ప్రయాణానికి ముందు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, హెల్మెట్ కచ్చితంగా ధరించడం, ఈ నియమాలను పాటించేలా ఇతరులకూ స్ఫూర్తినివ్వడం... ఈ మూడు ముఖ్యమైన సూత్రాలను గుర్తు చేస్తుంది. ఈ డిజిటల్ ఛాలెంజ్లో ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయడం ద్వారా, నగర రహదారులపై భద్రత, బాధ్యతతో కూడిన సంస్కృతిని నిర్మిద్దాం. -
జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అడ్డదారుల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని 400 పోలింగ్ బూత్లలో 50 చొప్పున 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఆరోపించారు.జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’పై మాట్లాడుతుంటే జూబ్లీహిల్స్లో మాత్రం కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు, ఇతర అవకతవకలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ లిస్టుపై సమగ్ర దర్యాప్తు చేయాలి ‘ఒక్కో వ్యక్తికి మూడు నాలుగు ఓటర్ గుర్తింపు కార్డులున్నాయి. వేర్వేరు అడ్రస్లపై ఒకే వ్యక్తి ఓటు నమోదు, కొద్దిపాటి మార్పులతో ఒకే వ్యక్తి పేరు పలు చోట్ల నమోదు వంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఒక్కో ఇంట్లో వందకు పైగా ఓట్లను నమోదు చేసినట్లుగా వందల ఉదంతాలు ఉన్నాయి. ఇంటి యజమానులకు కూడా తెలియకుండా వారి చిరునామాపై ఓట్లు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానంగా ఉంది. ఓటర్ జాబితా అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అని ఎన్నికల సంఘాన్ని కోరాం’అని కేటీఆర్ తెలిపారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఓటర్ జాబితా అక్రమాలపై నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్రెడ్డి, సు«దీర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, ఏ.వెంకటేశ్వర్రెడ్డి, కిషోర్ తదితరులు ఉన్నారు. -
ఢిల్లీ కాంగ్రెస్కు సెగ తగలాలి: కేటీఆర్
రహమత్నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మేలు కాంక్షించే కారు పార్టీకి మధ్యే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలో, హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్నగర్ డివిజన్ క్వారీ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని ‘హైడ్రా’బాద్గా మార్చి రేవంత్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా ఓట్చోరీ అంటుంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీయే ఓట్చోరీకి పాల్పడిందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో 20 వేల దొంగ ఓట్లను చేర్చిందని ఆరోపించారు. ఇదే మోకా.. బీఆర్ఎస్ కార్యకర్తల కసి, పట్టుదల, తపన పార్టీ విజయానికి నాంది కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు సీఎం రేవంత్రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచి్చంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి. గులాబీ జెండా రెపరెపలాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి’అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వృద్ధులకు రూ.48 వేలు, పెళ్లి అయిన ఆడబిడ్డలకు తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.40 వేల చొప్పున బాకీ ఉందని అన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అందులో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల వరకు అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందని కేటీఆర్ అన్నారు. ‘ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, ప్రజలు తనకే ఓట్లు వేస్తారని సీఎం రేవంత్ అనుకుంటారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని, ఇంత దివాళాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సునీత గెలుపు ఖాయం: హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ‘అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమే. భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గ అభివృద్ధితో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని హరీశ్రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నేతలు వద్దిరాజు రవిచంద్ర, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌషిక్ రెడ్డి, వేములు ప్రశాంత్రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, వివేకానంద్గౌడ్, సుధీర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దాసోజు శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్రావు, రెడ్యానాయక్, శ్రీనివాస్గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీత కంటతడి.. ఓదార్చిన సబిత ఎస్పీఆర్ హిల్స్లో సోమవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నాయకులు మౌనంగా ఉండిపోయారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతను ఓదార్చారు. -
మీ సేవ ద్వారా కొత్త షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: తెలంగాణలో కొత్త షెడ్యూల్ కులాల వర్గీకరణ విధానాన్ని ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా విజయవంతంగా అమలు చేసినట్లు సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సోమవారం వెల్లడించారు. ఈ కొత్త విధానంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది పౌరులు లాభపడనున్నారని ఆయన తెలిపారు.“రాష్ట్రంలోని అన్ని మీ సేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేశాం. ఇకపై పౌరులు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందగలరు,” అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.తెలంగాణ చట్టం నంబర్ 15–2025 మరియు జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9 (షెడ్యూల్ కులాల శాఖ, తేదీ 14–04–2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను మీ సేవలో అమలు చేసినట్లు ఆయన తెలిపారు. “రిజర్వేషన్లను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడంలో ఈ చర్య కీలకమైన ముందడుగు,” అని ఆయన అన్నారు.ఈ మార్పులతో ప్రతి సంవత్సరం మీ సేవ ద్వారా షెడ్యూల్ కుల ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసే నాలుగు లక్షల మంది పౌరులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ కుల ధ్రువపత్రాల పునర్ముద్రణ (రీఇష్యూ) సదుపాయాన్ని కూడా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. “పునర్ముద్రిత ధ్రువపత్రంలో ఆమోదించిన అధికారి, పునర్ముద్రణ తేదీ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇది ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే డిజిటల్ చర్య,” అని ఆయన వివరించారు.ప్రజా సేవల డిజిటల్ రూపాంతరంపై దృష్టి సారిస్తూ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “మీ సేవను ప్రతి పౌరుడికి వేగవంతమైన, న్యాయమైన, ఖచ్చితమైన సేవలు అందించే వేదికగా మేము తీర్చిదిద్దుతున్నాం. ఈ చర్యలు తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, సాంకేతిక సాధికారత పట్ల చూపిస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తాయి,” అని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీ సేవ కేంద్రాలు మరియు అధికారిక మీ సేవ వెబ్సైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. -
డిపార్ట్మెంట్లో లంచం తీసుకుంటే చర్యలు తప్పవు.: డీజీపీ
హైదరాబాద్: ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అనే మరొకసారి స్పష్లం చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ సిబ్బందికి లేఖరాశారాయన. ‘ ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ నా వ్యక్తిగత ప్రయారిటీ. పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులున్నాయి. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తీసుకుంటాం. యూనిఫాం, కరప్షన్ ఒకే దగ్గర ఉండవు. ఒక్కడూ లంచం తీసుకుంటే డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. డిపార్ట్మెంట్లో లంచం తీసుకుంటే కఠినంగా ఉంటాము. బేసిక్ పోలీసింగ్తో పాటు టెక్నాలజీను వాడాలి. పేదవారికి కష్టంలో, ఆపదలో పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండి. ఆపదలో ఆదుకున్న వాళ్ళని పేదవారు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారు’ అని డీజీపీ లేఖలో పేర్కొన్నారు. -
బీజేపీ అభ్యర్థిపై రామచందర్ రావు కీలక ప్రకటన.. హస్తంతో పతంగి ఎగరేస్తారా?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Election) బీజేపీ అభ్యర్థి ప్రకటన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP Party) అభ్యర్థి ప్రకటన ఈరోజు సాయంత్రం కానీ.. రేపు(మంగళవారం) ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జూబ్లీహిల్స్లో ఎంఐఎం పార్టీ గెలవాలని వారి అభ్యర్థిని కాంగ్రెస్లోకి పంపించి పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ(Telangana BJP) బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో హస్తంతోనే పతంగి ఎగిరేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలవాలని.. వారి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి పంపి పోటీ చేయిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. జూబ్లీహిల్స్లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు. విశ్వ నగరం కాదు.. విషాద నగరంగా మార్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు ఓటు వేసినా ఫలితం లేదు. అక్కడ బీఆర్ఎస్ గెలిచినా.. మళ్లీ కాంగ్రెస్లోకే వెళ్తారు. తెలంగాణలో బీజేపీనే అసలైన ప్రతిపక్షం. ప్రజాసమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుంది. ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత -
బాలుడిపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్: బాలసదనంలోని ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి ఆ బాలుడు వెళ్లగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ బాల సదనంలోని ఓ బాలుడిపై కొంత కాలంగా అక్కడే పనిచేస్తున్న గార్డ్ స్టాఫ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు అస్వస్థతకు లోనయ్యాడు. అనుమతి లేకున్నా, షార్ట్ లీవ్ మంజూరు చేశారు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్.. ఆ బాలుడు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలసదనానికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఉద్యోగి (గార్డ్ స్టాఫ్)ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. మరికొందరిపైనా దాడి...: ఈ బాలసదనంలో మొత్తం 77 మంది చిన్నారులున్నారు. లైంగిక దాడి విషయంపై పోలీసులు ఆదివారం కూడా ఆరా తీశారు. మరో నలుగురిపైనా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. వారిని పోలీసులు ప్రత్యేకంగా విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ దాడి వెనుక మరో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. నిత్య వైద్య పరీక్షలేవీ?: వాస్తవానికి విద్యార్థులకు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు అక్కడ శాశ్వత ప్రాతిపదికన డాక్టర్ను నియమించినా, ఆయన బాలసదనానికి చుట్టపుచూపుగా వస్తుంటాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోచోట ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తుండటంతో ఆయన ఇక్కడ విధులకు సకాలంలో హాజరుకారనే ప్రచారం ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. -
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు(Jubilee Hills By Elections ) సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం.. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ర్యాపిడ్ డ్రైవర్, వైద్యుడు మృతి
పంజగుట్ట(హైదరాబాద్): లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. యువ వైద్యుడితో పాటు ర్యాపిడో డ్రైవర్ను బలి తీసుకుంది. ఆదివారం తెల్లవారు జామున బేగంపేట వైట్హౌస్ సమీపంలో లారీ ఢీకొన్న దుర్ఘటనలో ర్యాపిడో డ్రైవర్, బైక్ వెనక కూర్చున్న యువ వైద్యుడు మృతి చెందారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా హవేలీ రూరల్కు చెందిన ముద్దంగల్ నవీన్ (30) నగరంలో జేఎన్టీయూ సమీపంలో నివసిస్తూ ర్యాపిడో బైక్ నడుపుతున్నాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర (35) బేగంపేట కిమ్స్– సన్షైన్ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్ చేస్తూ.. బేగంపేటలోని కుందన్బాగ్లో నివాసం ఉంటాడు. ఆదివారం తెల్లవారు జామున విధులు ముగించుకున్న జగదీష్ చంద్ర ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. నవీన్ తన యాక్టివా బైక్పై బేగంపేట ఫ్లైఓవర్ దిగి క్యాంపు కార్యాలయం ముందు నుంచి యూటర్న్ చేసుకుని గ్రీన్ల్యాండ్స్ వైపు వెళ్తున్నాడు. ఇదే సమయంలో యూసుఫ్గూడ బస్తీ నుంచి భద్రాచలం వెళ్తున్న ఇసుక లారీ బేగంపేట బ్రిడ్జి పైకి వస్తోది. గ్రీన్ల్యాండ్స్ సిగ్నల్ దాటగానే లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న డాక్టర్ జగదీష్ చంద్రను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకోట్టపల్లికి చెందిన లారీ డ్రైవర్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురిలా ఉన్నావంటూనే...
బంజారాహిల్స్: కూతురిలా ఉన్నావని ప్రారంభంలో మర్యాదగా మాట్లాడి.. చనువు పెంచుకుని మెల్లమెల్లగా తన దుర్బుద్ధిని బయటపెట్టిన సీనియర్ అధికారిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైండ్స్పేస్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో హెచ్ఆర్గా పనిచేస్తున్న యువతి (26)కి తన పైఅధికారిగా పనిచేస్తున్న మృణాల్దాస్ (51)తో పరిచయం ఏర్పడింది. తరుచూ ఇద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. తన కుమార్తెలా ఉన్నావంటూ మృణాల్దాస్ మొదట్లో ఆత్మయంగా వ్యవహరించేవాడని బాధిత యువతి పేర్కొంది. ఈ ఏడాది జులై 5వ తేదీన ఆమె మృణాల్దాస్తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–72లో ఉన్న ది స్విఫ్ట్ ఎలిమెంట్ స్పాకు వెళ్లినట్లు తెలిపింది. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులు ఉన్నాయని చెప్పడంతో తాను వెళ్లగా తనకు మసాజ్ చేస్తున్న సమయంలో నిద్రలో ఉండగా ఒక దశలో వెనుక నుంచి వేరొకరి చేతులు తగిలాయని, గమనించి చూసేసరికి మృణాల్దాస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించానంది. తనపై అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తాను అరిచి మందలించానని తెలిపింది. ఆయన గది నుంచి వెళ్లిపోయినప్పటికీ మళ్లీ రావాలని ప్రయత్నించాడని ఆరోపించింది. ఇటీవల ఆయన లండన్కు వెళ్లడం జరిగిందని, అక్కడి నుంచి కూడా వీడియో కాల్ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటనను తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ హెచ్ఆర్ టీమ్కు కూడా తెలియజేశానని పేర్కొంది. తన భద్రత పట్ల భయంగా ఉందని, ఆయన మళ్లీ వేధించే అవకాశం ఉందంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. జూబ్లీహిల్స్ పోలీసులు మృణాల్దాస్పై బీఎన్ఎస్ సెక్షన్ 75 (1) (ఐ) (2), 78 (1)(ఐఐ)(2), 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. 17 జిల్లాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో(Telangana Rains) మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు గంటల్లో యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు..కాగా, ఉత్తర భారత్ నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది. మే నెలాఖరు నాటికి దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు సెప్టెంబరు 20వ తేదీ నాటికి ఉత్తర భారతదేశానికి పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. 24వ తేదీ నుంచి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో, దాదాపు 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.Today's FORECAST ⚠️⛈️ ONGOING MODERATE RAINS and THUNDERSTORMS to continue in Yadadri - Bhongir, Nalgonda, Suryapet, Jangaon, Mahabubabad, Mulugu, Bhadradri - Kothagudem for next 2hrs, later reduce completely Mainly dry weather expected in Telangana thereafter till evening.…— Telangana Weatherman (@balaji25_t) October 13, 2025హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురిసే అవకాశం ఉంది. LAST 24HRS RAINFALL DATA ⛈️⛈️Heavy to Very Heavy Rains was seen across Yadadri & Mahabubabad districts. Moderate to Heavy Rains in Bhadradri, Nalgonda, Suryapet, Warangal, Nagarkurnool, Mulugu, Wanaparthy, Khammam districts(HIGHEST OBSERVED)— Valigonda, Yadadri : 190.8 mm… pic.twitter.com/u3Y1Qx5Kjc— Weatherman Karthikk (@telangana_rains) October 13, 2025 -
Hyderabad: 36 గంటలు.. నీళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్– 3 కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు పంపింగ్ మెయిన్–1కి సంబంధించి 2,375 ఎంఎం డయా పైపులైన్పై భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో ఎయిర్ వాల్్వ, గేట్ వాల్వ్ మార్పు తదితర మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సొమవారం ఉదయం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు.. సుమారు 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే.. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్. ప్రశాసన్ నగర్, ఫిల్మ్నగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్పేట్, హకీంపేట్, కార్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్పూర్, గంధంగూడ, బండ్లగూడ, శా్రస్తిపురం, అల్లబండ, మధుబన్ కాలనీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అలాగే.. ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్నగర్, ఆటోనగర్, సరూర్నగర్, వాసవీనగర్, నాగోల్, ఎనీ్టఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి కాలనీ, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్దఅంబర్పేట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి పేర్కొంది. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది. -
ఠాణాలను సివిల్ పంచాయితీ కార్యాలయాలుగా మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను సివిల్ వివాదాలు తీర్చే పంచాయితీ కార్యాలయాలుగా మార్చొద్దని డీజీపీ బి.శివధర్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘సివిల్ వివాదాలను పోలీస్స్టేషన్లు లేదా పోలీస్ కార్యాలయాల్లో పరిష్కారం చేయరాదు. ఈ విషయాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయనే విషయం తెలిసిందే. పోలీస్స్టేషన్లు లేదా పోలీస్ కార్యాలయాల్లో సివిల్ పంచాయితీలు నిర్వహించడంలో పాల్గొనే అధికారులపై కఠిన చర్యలు తప్పవు’అని డీజీపీ పేర్కొన్నారు. కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తమ అవినీతితో పోలీస్శాఖకు మచ్చ తేవొద్దని హెచ్చరించారు.తాజాగా మొత్తం 9 అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులు, అన్ని పోలీస్ యూనిట్ల ఆఫీసర్లు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, నాన్కేడర్ ఎస్పీలు, ఇతర స్టాఫ్ అధికారులకు డీజీపీ లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందులో పోలీసింగ్ విధానాలు ఎలా ఉండాలన్న దానితోపాటు, అవినీతికి తావు లేదంటూ డీజీపీ అత్యంత స్పష్టంగా పేర్కొన్న అంశాలపై పోలీస్శాఖలో ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివధర్రెడ్డి ఈ నెల 9న అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన తన పంథాను స్పష్టం చేశారు. మీ అవినీతితో పోలీస్శాఖకు మచ్చ తేవొద్దు ‘అవినీతి,అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టేది పోలీస్ సిబ్బంది. కానీ, అవినీతికి పాల్పడే కొందరు పోలీస్శాఖకు అప్రతిష్ట తీసుకొస్తున్నారు. అవినీతికి పాల్పడి పోలీస్శాఖకు మచ్చ తీసుకురావొద్దు. అవినీతికి పాల్పడే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పోలీస్ యూనిఫాం అంటే గౌరవం, బాధ్యత, ప్రజలకు లేదా దేశ సేవకు ప్రతీక. అవినీతి అనేది నమ్మక ద్రోహానికి సంకేతంగా చెప్పొచ్చు. యూనిఫాం, అవినీతి రెండు విరుద్ధమైనవి. అంటే యూనిఫాం ధరించిన వ్యక్తి అవినీతికి పాల్పడితే, యూనిఫాం అసలు అర్థాన్ని చెరిపివేస్తుంది.ప్రజలు పోలీస్శాఖపై ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మన ప్రవర్తన..యూనిఫామ్కు గౌరవం, ప్రభుత్వానికి ప్రతిష్ట, సమాజంలో శాంతిని కల్పించే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’అని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు. పేదవారి, బలహీనవర్గాల సమస్యలు విని న్యాయం చేయాలి..తద్వారా పోలీసుశాఖ పట్ల విశ్వాసం, అధికారులపై అభిమానం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఆదుకునే వారిని పేద ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని తన అభిప్రాయంగా డీజీపీ ఈ లేఖలో పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆలోచింపజేసేలా తన భావాలను వ్యక్తీకరిస్తూ డీజీపీ రాసిన లేఖ గురించి పోలీస్ అధికారులు, సిబ్బందిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. -
బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునే లక్ష్యంతో తెలంగాణ బీసీ ఐక్యకార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) ఏర్పాటైంది. ఆదివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావుల ప్రత్యేక సమావేశం జరిగింది. బీసీ జేఏసీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగగా, సభ్యులంతా ఏకగ్రీవంగా జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్గా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్గా వీజీఆర్ నారగోని, కో చైర్మన్లుగా రాజారామ్యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఈనెల 13న తలపెట్టిన రహదారుల దిగ్బంధం, 14న చేపట్టబోయే రాష్ట్ర బంద్ వాయిదా వేశారు. ప్రస్తుతం జేఏసీ ఏర్పాటు కాగా, అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా జేఏసీ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 18న రాష్ట్ర బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలంటే ప్రతి బీసీ పౌరుడు పోరాడాలని జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే విధించి రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం చేసిందన్నారు. వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60% బీసీలు ఉన్నా... వారంతా ఐక్యంగా లేరన్నారు. అందువల్లే బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు నోటివరకు వచ్చినా, అడ్డుకోగలిగారని చెప్పారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టించేలా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో 40 బీసీ సంఘాలు, 110 బీసీ కుల సంఘాలతోపాటు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
ఆరు జిల్లాల్లో 94.4 శాతం పల్స్ పోలియో పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ఆదివారం చేపట్టిన సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (ఎస్ఎన్ఐటీ) పల్స్ పోలియో కార్యక్రమం మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. బూత్ డే యాక్టివిటీలో భాగంగా మొత్తం 16,35,432 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిర్దేశించుకున్న 17,32,171 మంది పిల్లల లక్ష్యంలో మొదటిరోజే 94.4% పూర్తి చేసినట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ తెలిపారు. భారత్లో పోలియో కేసులు పూర్తిగా లేకుండా పోయినా.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో పోలియో కేసులు ఇంకా నమోదవుతుండటంతో అక్కడి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వలసలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. తొలిరోజే అనూహ్య స్పందన.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,897 పోలియో బూత్లలో 15,91,907 మందికి, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి 138 రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ పాయింట్లలో 22,173 మందికి టీకాలు వేశారు. 259 మొబైల్ టీంల ద్వారా మరో 21,352 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27,588 మంది వ్యాక్సినేటర్లు, 459 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. మిగిలిన చిన్నారులే లక్ష్యంగా ఇంటింటికీ... తొలిరోజు బూత్లకు రాలేకపోయిన చిన్నారులకు టీకా అందించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు. ముఖ్యంగా వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లో నివసించే వారి పిల్లలు ఎవరూ మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే హైదరాబాద్ వంటి నగరాల్లో 15వ తేదీన కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు అందించి, పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని కాపాడాలని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. -
గెస్ట్ లెక్చరర్లకు వేతనాలేవీ?
సిరిసిల్లకల్చరల్: రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా గెస్ట్ లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నా, 10 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు ఉండేవారు. పబ్లిక్ సర్వీస్ కమి షన్ నిర్వహించిన లెక్చరర్ల నియామక ప్రక్రియ ఫలితంగా సుమారు 1200 మందిని ఇంటికి పంపించారు. అయితే వీరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇంటర్బోర్డు కమిషనర్ హామీ ఇచ్చారు. వీళ్లకు కూడా నాలుగు నెలల వేతనాలు అందలేదు. విధుల్లో ఉన్న వారికి పది నెలలుగా వేతనాలు అందడం లేదు. పీరియడ్ల ఆధారంగా వేతనం నిర్దిష్ట వేతనంతో పనిలేకుండా పాఠాలు చెప్పే పీరియడ్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జీతాలు చెల్లించేలా ప్రభు త్వం ముందే ఒప్పందం చేసుకుంది. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా అతిథి అధ్యాపకులకు జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం చిన్నచూ పే చూస్తోంది. దీంతో గంటల ప్రాతిపదికన అందాల్సిన అరకొర వేతనాల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కనీస వేతనాల కోసం పోరు ఇంటర్ స్థాయి సైన్స్ సబ్జెక్టులకు థియరీతోపాటు ప్రయోగ తరగతులు కూడా ఉంటాయి. ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులు బోధించే లెక్చరర్ల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్కు రూ.300 చొప్పున వారానికి గరిష్టంగా 72 గంటలు మించకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వండి పీరియడ్ల ఆధారంగా నిర్ణయించిన వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారుతోంది. గెస్ట్ లెక్చరర్లు సైతం మిగిలిన వారితో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వేతనాల విషయంలో ప్రభుత్వం ఉదారత చూపించాలి. పీరియడ్ల వారీగా కాకుండా కనీసం వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలి. – దీపిక, గెస్ట్ లెక్చరర్ల సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ని బలోపేతం చేసే దిశగా సాగుతున్న ప్రక్రియలో గెస్ట్ లెక్చరర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సర్కార్ విద్యపై సామాన్యుల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. విధులకు దూరమైన 1200 మందికి ఇచ్చిన హామీ నిలుపుకోవాలి. మిగిలిన వారికి పది నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. – గెంట్యాల రాజశేఖర్, గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి -
ఎస్సారెస్పీ స్టేజ్–2కు ఆర్డీఆర్ పేరు
తుంగతుర్తి, తిరుమలగిరి: ‘ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చిన ఘనత రాంరెడ్డి దామోద్రెడ్డిది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి ఎస్సారెస్పీ స్టేజ్–2 సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఒప్పించి ఎస్సారెస్పీ స్టేజ్–2 కాలువకు నీళ్లు తెచ్చారు. అందుకే ఎస్సారెస్పీ స్టేజ్–2 కాలువకు ‘ఆర్డీఆర్ ఎస్సారెస్పీ–2 కాలువ’గా నామకరణం చేసున్నాం. దీనికి సంబంధించి 24 గంటల్లోó జీవో విడుదల చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాంరెడ్డి దామోదర్రెడ్డి లేని లోటు తీర్చలేదని, ఎస్సారెస్పీ–2కు ఆర్డీఆర్ పేరు పెట్టడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి సంతాప సభలో రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రేవంత్రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులతో కలిసి హాజరయ్యారు. గోదావరి జలాల కోసం పోరాటం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చారని, నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తేవడానికి దామోదర్రెడ్డి ఎనలేని పోరాటం చేశారని రేవంత్రెడ్డి చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని తీసుకొచ్చి రక్తతర్పణం చేశారని గుర్తుచేశారు. ఐదుసార్లు శాసన సభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలిచారని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్రెడ్డి, నల్లగొండ జిల్లాలో రాంరెడ్డి దామోదర్రెడ్డి జోడెడ్లలాగా పార్టీని తమ భుజాలపై మోసినట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దామోదర్రెడ్డి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్లో దామోదర్రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించి కాపాడుకుంటామని రేవంత్రెడ్డి చెప్పారు. సోనియాగాం««దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జునఖర్గేకు దామోదర్రెడ్డిపై అభిమానం ఉందన్నారు. రాహుల్గాంధీ తన సంతాపాన్ని స్వయంగా లేఖ ద్వారా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డికి పంపారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రాంచందర్నాయక్, ఎంపీ రఘువీర్రెడ్డి, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, పద్మావతి, వేముల వీరేశం, బాలునాయక్, మట్టా రాఘమయి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
వందే భారత్ స్లీపర్ @ కాజీపేట
సాక్షి, హైదరాబాద్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు భావిస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తొలుత కాజీపేటలో సాధారణ రైళ్లకు వినియోగించే ఎల్హెచ్బీ కోచ్లు, ఎంఎంటీఎస్ తరహా రైళ్లకు వినియోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ), సాధారణ వందేభారత్ కోచ్లను తయారు చేయాలని బోర్డు భావించింది. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీలైనన్ని వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన నేపథ్యంలో కాజీపేట కొత్త కోచ్ ఫ్యాక్టరీని అందుకు కేటాయించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ దాదాపు సిద్ధమైనా, ఇప్పటివరకు కోచ్ల తయారీ ఆర్డర్ను ఇవ్వలేదు. వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయిస్తేనే బాగుంటుందన్న భావనతోనే వర్క్ ఆర్డర్ జారీలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 రూట్లలో 76 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో 33 రైళ్లు మాత్రమే 20, 16 కోచ్లతో నడుస్తుండగా మిగతావన్నీ 8 కోచ్లతో కూడిన మినీ వందేభారత్ సర్వీసులుగా సేవలందిస్తున్నాయి. వందేభారత్ రైళ్లు ప్రారంభించిన కొత్తలో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడి అన్ని రాష్ట్రాలు వాటి కోసం పోటీలో నిలిచాయి. కానీ, టికెట్ ధర ఎక్కువగా ఉండటం, అవి కేవలం పగటి పూట మాత్రమే నడుస్తుండటంతో వాటిపై రానురాను ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇదే సమయంలో కేంద్రం వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఒక ప్రోటోటైప్ రైలు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. రెండోది త్వరలో ట్రయల్స్కు సిద్ధమవుతోంది. ఆ వెంటనే వీటిని పట్టాలెక్కించనున్నారు. వీటి గరిష్ట వేగం గంటకు 180 కి.మీ.లు కావటంతోపాటు ఇవి స్లీపర్ మోడ్ రైళ్లు అయినందున రాత్రివేళ తిరుగుతాయి. దూరప్రాంతాల మధ్య తిరిగే రైళ్లలో పగటివేళ ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు. దానివల్ల పనులు చేసుకునే పగటి సమయం వృథా అవుతుండటమే కారణం. దీంతో ఇప్పుడు సాధారణ వందేభారత్ రైళ్లకు బదులు తమకు వందేభారత్ స్లీపర్ సర్వీసులు కేటాయించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో క్రమంగా సాధారణ వందేభారత్ రైళ్ల డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 200 వందేభారత్ స్లీపర్ రైళ్లు... వీలైనంత తొందరలో దేశవ్యాప్తంగా 200 వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. క్రమంగా ప్రస్తుతం తిరుగుతున్న రాజధాని, దురొంతో ప్రీమియం కేటగిరీ సహా సూపర్ ఫాస్ట్ రైళ్ల స్థానంలో వాటిని ప్రవేళపెట్టే యోచనలో ఉంది. ఇది జరగాలంటే తక్కువ సమయంలో వీలైనన్ని రేక్స్ తయారు కావాల్సి ఉంటుంది. – ప్రస్తుతం చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తొలి ప్రోటోటైప్ రైలు తయారు కాగా, అక్కడ మరిన్ని రైళ్లను తయారు చేయనున్నారు. – రష్యాకు చెందిన కినెత్ రైల్వే సొల్యూషన్స్తో కలిసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్గా ఏర్పడి 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూర్లోని మరాటా్వడా కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి. – బెంగళూరులోని భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో రెండో ప్రోటోటైప్ రైలు సిద్ధమవుతుండగా, ఇక్కడ వెంటనే మరిన్నింటి తయారీ కొనసాగనుంది. – కోల్కతా శివారులోని టీటాగర్ రైల్ సొల్యూషన్స్ ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్లోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలను కూడా ఇందుకు వినియోగించనున్నారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండాలంటే మరిన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో కూడా వాటి తయారీ అవసరమని తాజాగా రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో కొత్తగా అందుబాటులోకి వస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇందుకు వినియోగించాలని భావిస్తోంది. ఈమేరకు ఇటీవల అధికారులు కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి వెళ్లారు. ఈ సంవత్సరం చివరి నాటికి అది పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించొచ్చని అధికారులు తేల్చారు. ఆ మేరకు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఢిల్లీలో కూడా సమావేశమై దీనిపై చర్చించినట్టు తెలిసింది. -
స్కూళ్ల తనిఖీకి టీచర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసే అధికారం ఉపాధ్యాయులకు ఇస్తూ విద్యాశాఖ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు 168, ప్రాథమికోన్నత పాఠశాలలకు 35, ఉన్నత పాఠశాలలకు 96 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆయా స్థాయిల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు సభ్యులుగా ఉంటారు. ప్రైమరీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వేసే కమిటీల్లో ముగ్గురు, హైస్కూల్ స్థాయిలో 9 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ప్రతీ మండల పరిధిలో స్కూళ్ల తనిఖీకి కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల విద్యాశాఖాధికారులు పనిచేస్తున్నారు. తాజా కమిటీలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడతాయి. ఏప్రిల్ 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో పాఠశాల తనిఖీలు విస్తృతం చేయాలని, ఇవి నిరంతరంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో తనిఖీలకు ఉపాధ్యాయులనే నియమించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కమిటీలు ఏం చేస్తాయి? పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఏ విధంగా ఉంది? ఎప్పుడు వస్తున్నారు ? బోధన ప్రణాళికను ఎలా అమలు చేస్తున్నారు? విద్యార్థుల హాజరు శాతం? ఇతర ప్రధాన కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారు? అనే అంశాలను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తాయి. జిల్లా అధికారులు ప్రతీ నెలా 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టర్ల సమావేశంలో ప్రతీనెలా ప్రభుత్వం ఈ అంశాలపై చర్చిస్తుంది. కమిటీల్లో ఎంపికయ్యే టీచర్లు ఏడాదిపాటు ఇదే పనిలో ఉంటారు. బోధన చేపట్టాల్సిన అవసరం ఉండదు. – పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసే టీచర్లు కనీసం పదేళ్ల పాటు టీచర్గా ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు, లేదా ఎస్జీటీలను నియమిస్తారు. వీరు ప్రతీ రోజు రెండు స్కూళ్లను విధిగా తనిఖీ చేయాలి. – ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంపిక చేసే టీచర్లు కూడా పదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. వీరు రోజుకు రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి. – ఉన్నత పాఠశాలలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లు అర్హులు. వీరు రోజూ ఒక స్కూల్ను, మూడు నెలల్లో 50 స్కూళ్లను తనిఖీ చేయాలి. కొంతకాలం బ్రేక్ తర్వాత.. మళ్లీ వాస్తవానికి పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులను నియమిస్తూ జూన్ 21వ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్.. గెజిటెడ్ హెచ్ఎం పనిచేసే స్కూల్ను తనిఖీ చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓలతో పాటు అభ్యసన సామర్థ్య పరిశీలనకు ప్రత్యేకంగా ఐదు స్థాయిల అధికారులను నియమించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారని పలు సంఘాలు విద్యాశాఖ కార్యదర్శి వద్ద అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, కొత్త కమిటీల వల్ల ప్రతీ జిల్లాలోనూ రెండు శాతం టీచర్లు తనిఖీ అధికారులుగా వెళతారని తెలిపారు. దీంతో ఇచ్చిన ఉత్తర్వులను మధ్యలో నిలిపివేశారు. తనిఖీలు చేపట్టాల్సిందేనని, టీచర్లే తనిఖీలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు భావించారు. దీంతో మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. -
లోటు.. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆశించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ గత కొన్నేళ్లుగా అతి తక్కువగా వస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించి వార్షిక బడ్జెట్లో ప్రతిపాదిస్తున్న నిధులకు, ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం ఇచ్చే మొత్తానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన మొత్తంలో రూ.లక్ష కోట్లకు పైగా లోటు ఉండడం గమనార్హం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను 2020–21లో చివరిసారి రాష్ట్రం ఆశించిన మేరకు కేంద్రం ఇచ్చింది. ఆ ఏడాదిలో రూ.10 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేస్తే రూ.15 వేల కోట్ల వరకు ఇచ్చింది. దీంతో మరుసటి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.38 వేల కోట్లు వస్తాయని అంచనా వేసి వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ.8 వేల కోట్లు మాత్రమే. అప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విషయంలో భారీ అంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినదాంట్లో గరిష్టంగా 30 శాతం నిధులు కూడా ఈ పద్దు కింద రావడం లేదని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి బడ్జెట్లో పెడితే.. తొలి ఐదు నెలల్లో (2025, ఆగస్టు 31 నాటికి) ఇచ్చింది రూ.1,673.43 కోట్లు మాత్రమే. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే...గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సాయం కింద ఇచ్చే మొత్తం అని చెప్పొచ్చు. ఈ గ్రాంట్ను తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తిరిగి చెల్లించే షరతు ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్రం నుంచి ఏదైనా శాఖకు వెళ్లినా, ఎన్జీవోలు, విద్యాసంస్థలైనా ఇదే నిబంధన ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ పద్దు కింద కేంద్రం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా ఇవ్వొచ్చు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ నిధులను మంజూరు చేయవచ్చు. అయితే, ఈ నిధులను ఏ కారణం కోసం అయితే ఇచ్చారో వాటికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల స్వతంత్ర ఆలోచలను దెబ్బతీసే చర్య కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ వైఖరి కారణంగానే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రావడం లేదు. ఈ పద్దు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు వస్తే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక అధికారాల కేంద్రీకరణ మాత్రం ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. సెస్ల రూపంలో కేంద్రమే పన్నులు వసూలు చేసుకుంటోంది. ఆ పన్నుల్లో వాటా ఆశించినంతగా ఇవ్వడం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా మంజూరు చేయడం లేదు. అనేక రకాలుగా కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడే విధంగా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల స్వతంత్ర ఆలోచనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఈ ఆర్థిక అసమతుల్యత గతంలోనూ ఉన్నదే అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. – ప్రొఫెసర్ అందె సత్యం, ఆర్థిక నిపుణులు -
జేఏసీగా బీసీ సంఘాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు అక్టోబర్ 18న బంద్ చేపట్టనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్ 14న బీసీ సంఘాలు బంద్ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఛైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్గా వీజీఆర్ నారగొని,వర్కింగ్ ఛైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్లు ఎన్నికయ్యారు. -
ప్రార్థన మందిరం వద్ద ఎన్నికల ప్రచారం చేశారని..
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ను ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షర, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు అక్షరతో పాటు కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, బీఆర్ఎస్ నేతలు ఆజం అలీ, అంజద్ అలీఖాన్, ఫయీం, షఫీ తదితరులు పార్టీ కండువాలు వేసుకుని వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కరపత్రాలతో కనిపించారు.ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ గమనించి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మాగంటి సునీతతో పాటు ఆమె కూతురు, ఇతర నేతలు చేతుల్లో కార్డులు పట్టుకొని ప్రార్థనలు చేసి వచి్చన వారిని ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని, మతపరమైన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు చేయకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్నట్లు గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అధికారి ఫ్రాన్సిస్ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మీకు తెలుసా?: జూబ్లీహిల్స్లో 80 శాతం బస్తీలే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావన్న సంగతి తెలియదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మైసూర్పాక్లో మైసూర్ లేనట్టే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు. 20 శాతం కాలనీలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80 శాతం బస్తీలే ఉంటాయి. పేద, మధ్యతరగతి వర్గాలే అధికం. కేవలం శ్రీనగర్ కాలనీ, మధురానగర్ కాలనీ ప్రాంతాలు, రాజీవ్నగర్ కాలనీ, సారథినగర్ సొసైటీ, కళ్యాణ్నగర్, మోతీనగర్లో కొంత ప్రాంతం కాలనీలు ఉండగా, బ్రిగేడ్ గేటెడ్ కమ్యూనిటీ, కల్పతరు, వాసవి బృందావన్, జనప్రియ అపార్ట్మెంట్స్ లాంటి కమ్యూనిటీలు ఉన్నాయి. అధికంగా మైనారిటీలు మెజారిటీ ఉండగా తదుపరి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలు ఉన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, రహమత్నగర్, షేక్పేట, యూసుఫ్గూడ, వెంగళరావునగర్ ప్రధానంగా ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డి గూడ, శ్రీనగర్ కాలనీ ఉంటాయి. జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్ లేనట్లు నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉండటం కూడా ఓ విచిత్రమే. – శ్రీనగర్కాలనీ -
సంక్రాంతి ప్రయాణం కష్టమే..
సాక్షి, హైదరాబాద్ : వందల్లో రైళ్లు. వేలల్లో బెర్తులు. అయినా తప్పని నిరీక్షణ. పండుగలు, పెళ్లిళ్లు, వరుస సెలవులు, శుభకార్యాలు, అయ్యప్ప భక్తుల శబరి పర్యటనల రద్దీతో రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. సాధారణ రోజుల్లో కంటే ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రద్దీ సహజంగానే రెట్టింపవుతోంది. ఇందుకనుగుణంగా వివిధ మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. అదనంగా సుమారు 150 రైళ్లు.. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి పండుగలు, వరుస సెలవుల దృష్ట్యా అన్ని రెగ్యులర్ రైళ్లలో భారీ డిమాండ్ నెలకొంది. సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కోల్కతా, చెన్నై, శబరి, దానాపూర్, పటా్న, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల జాబితా గణనీయంగా పెరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు ఈ డిమాండ్ అధికమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక రైళ్ల నిర్వహణకు ప్రణాళికలను రూపొందించారు. వివిధ మార్గాల్లో సుమారు 150 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి ప్రయాణం కష్టమే.. సంక్రాంతికి 25 లక్షల నుంచి 30 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. రైళ్లు, ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ ఎక్కువ మంది బయలుదేరుతారు. కాగా.. ఇప్పటికే కొన్ని రూట్లలో డిమాండ్ మేరకు అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అయినా రోజురోజుకూ ప్రయాణికుల డిమాండ్ పెరుగుతూనే ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే విశాఖ, ఫలక్నుమా, కోణా ర్క్, నాందేడ్ సూపర్ఫాస్ట్, ఈస్ట్కోస్ట్, గరీబ్రథ్, దురంతో తదితర రైళ్లలో 100 నుంచి 150 వరకు వెయిటింగ్ లిస్ట్ నమోదు కావడం గమనార్హం. కాకినాడ వైపు వెళ్లే గౌతమి, నర్సాపూర్ తదితర రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 100 వరకు నమోదైంది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు వెళ్లే ఎక్స్ప్రెస్కు దీపావళ్లి రద్దీ పోటెత్తింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి ముజఫర్నగర్కు కొత్తగా అమృత్భారత్ను ప్రవేశపెట్టినప్పటికీ దానాపూర్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. దీపావళి వేడుకల కోసం నగరం నుంచి యూపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు రైళ్ల కోసం ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకూ దానాపూర్ ఎక్స్ప్రెస్కు రద్దీ భారీగానే ఉండనుందని అధికారులు భావిస్తున్నారు. విమాన చార్జీల మోత.. మరోవైపు దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ఎయిర్లైన్స్ చార్జీలను రెట్టింపు చేశాయి. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ, జైపూర్, కోల్కతా, నాగ్పూర్ తదితర నగరాలకు చార్జీలు అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.6000 వరకు చార్జీలు ఉంటే ఈ నెల 18, 19, 20 తేదీల్లో రూ.9000 నుంచి రూ.12000 వరకు పెంచారు. జైపూర్ రూ.7000 నుంచి ఏకంగా రూ.15000 వరకు చార్జీలు పెరిగాయి. కోల్కతాకు రూ.5000 నుంచి రూ.7000 వరకు ఉంటుంది. దీపావళి దృష్ట్యా ప్రస్తుతం రూ.12000 వరకు పెరిగినట్లు ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు చెప్పారు. -
ఎల్బీనగర్లో థార్ బీభత్సం.. పల్టీలు కొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో(LBnagar) థార్ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. బీఎన్రెడ్డినగర్(BNReddy Nagar) సమీపంలోని గుర్రంగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం(Thar Road Accident) అదుపు తప్పింది. అనంతరం, మొదట రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ సందర్భంగా ఆ బైక్పై ప్రయాణిస్తున్న విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు విద్యార్థిని సిరిసిల్లకు చెందినట్టు తెలిసింది. దీంతో, వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: జూబ్లీహిల్స్ బరిలో ఎవరు.. ఇద్దరిలో అవకాశం ఎవరికి?ఇక, వాహనం ఎక్కువ వేగంతో ఉండటంతో డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత వాహనం గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో థార్ వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు యజమాని అనిరుధ్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, రెండో కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. దీంతో, వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
‘ఇందిరమ్మ’కు ఏఐ అండ
సాక్షి, హైదరాబాద్: ఒకరి ఖాతాల్లోకి చేరాల్సిన ఇందిరమ్మ ఆర్థిక సాయం, మరొకరి ఖాతాల్లోకి చేరుతుండటాన్ని గృహ నిర్మాణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానించే సమయంలో బ్యాంకర్లు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని వివరిస్తూ శనివారం సాక్షి పత్రికలో ‘‘ఆధార్ ఒకరిది... ఖాతా మరొకరిది’’అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇందిరమ్మ లబ్దిదారుల ఆధార్ నంబర్ ఇతరుల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావటంతో, ఇందిరమ్మ లబ్దిదారుల ఖాతాల్లోకి జమ కావాల్సిన మొత్తం ఇతరుల ఖాతాల్లోకి జమ అవుతున్న తీరును సాక్షి సోదాహరణంగా వెలుగులోకి తెచి్చంది. లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు అందటంతో గృహనిర్మాణ శాఖ దీనిపై దృష్టి సారించింది. చెల్లింపు విధానం మార్పు ప్రస్తుతం ఇందిరమ్మ లబ్దిదారులకు ఆర్థిక సాయాన్ని వారి ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లిస్తున్నారు. ఆ ఆధార్ నంబర్ ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతాలోకి ఆటోమేటిక్గా నిధులు జమ అవుతాయి. అలా జరిగేలా ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్ను అనుసంధానించే సమయంలో చాలా బ్యాంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకరి ఖాతాకు మరొకరి ఆధార్ నంబర్ను అనుసంధానించారు. దీంతో లబ్ధిదారులకు బదులు ఇతరుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. ఇది బహిర్గతం కావడంతో చెల్లింపు విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. సాంకేతిక వ్యవస్థలో మార్పులు ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపు జరిగే సమయంలో లబ్దిదారు పేరును పరిశీలించేలా ఏఐ టెక్నాలజీతో అప్డేట్ చేస్తున్నారు. లబ్దిదారు జాబితాలో ఉన్న పేరుతో అక్షరం అక్షరం సరిపోలేలా సాఫ్ట్వేర్ను ఫీడ్ చేస్తున్నారు. పేరులో ఏమాత్రం తేడా ఉన్నా ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమ కాకుండా నిలిచిపోతుంది. లబ్దిదారు పేరు, ఆధా ర్ నంబర్ జత అయిన మరో వ్యక్తి పేరు ఒకటే అయినప్పుడు.. ఇంటి పేరుతో సరిపోల్చి చూడనున్నారు. ఇంటి పేరు ఒకటే అయినప్పుడు ఇంటి నంబరుతో సరిపోల్చి చూసేలా కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఆర్థిక సాయం మొత్తం తప్పు డు ఖాతాలో జమ కాకుండా ఉండటమే కాకుండా, అధికారులకు కూడా ఆ విషయాన్ని తెలిపేలా సాంకేతిక వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. -
గ్లోబల్ మొబిలిటీ హబ్గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం త్వర లో దేశ మొబి లిటీ హబ్గా అవతరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘ఫార్ములా ఈ’రేస్ రూ.700 కోట్ల ఆర్థిక కా ర్యకలాపాలను సృష్టించడం ద్వారా అంతర్జాతీ య దృష్టిని ఆకర్షించిందన్నారు. ‘ఫార్ములా ఈ’ కేవలం ఒక క్రీడా కార్య క్రమం కాదని, ఆవిష్కర ణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికత కు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టేందుకు ఒక ప్రతీకగా నిలిచిందని అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం జరిగిన 10వ ‘ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్స్పోర్ట్స్ పోటీలు – 2025’కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.యువత రేసు కారులా దూసుకెళ్లాలి..‘మోటార్స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదు, అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడం, ఎంత దూరం వెళ్లగలమో తెలుసు కోవడం. జీవితంలో యువత కూడా రేసు కారు మాదిరి దూసుకుపోవాలి. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాటిని మీరే సృష్టించుకోవాలి. పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు’అని కేటీఆర్ ఉద్బోధించారు. రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదనే సందేహాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ సాకారమై, 11 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచింది’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
మీ బీ12 బాగుందా?
హైదరాబాద్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేసే 33 ఏళ్ల యువకుడు దాదాపు నాలుగేళ్లుగా మతిమరుపు, చిరాకు, కాళ్లు, చేతుల తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య తీవ్రత పెరగడంతో ఓ న్యూరాలజిస్ట్ను సంప్రదించాడు. అతని ఆహార అలవాట్ల గురించి డాక్టర్ అడగ్గా పూర్తి శాకాహారినని చెప్పాడు. దీంతో డాక్టర్ వెంటనే రోగి రక్తంలో విటమిన్ బీ12 స్థాయి ఎంత ఉందో పరీక్షించగా సాధారణంతో పోలిస్తే అతితక్కువగా ఉన్నట్లు తేలింది. వెంటనే విటమిన్ బీ12 ఇంజెక్షన్లతో చికిత్స ప్రారంభించడంతో పాటు పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాలను అధికంగా తీసుకోవాలని సూచించడంతో కొన్ని వారాల్లోనే ఆ యువకుడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడింది. తిమ్మిర్ల సమస్య సైతం దూరమైంది.సాక్షి, హైదరాబాద్: చాలాసార్లు సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించేవే తీవ్ర అనారోగ్య లక్షణాలకు సూచికలుగా మారొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ మతిమరుపు, విసుగు, తిమ్మిర్ల వంటివి ఇబ్బంది పెడుతుంటే వాటిని పని ఒత్తిళ్ల వల్ల ఎదురవుతున్న సమస్యలుగా భావించొద్దని.. అవి శరీరంలో విటమిన్ బీ12 లోపానికి సంకేతం కావొచ్చని అంటున్నారు. ఈ తరహా లక్షణాలపట్ల అవగాహన పెంచుకొని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు ముఖ్యంగా శాకాహారులు ఇలాంటి లక్షణాలతో సతమతమవుతుంటే తప్పనిసరిగా రక్తంలో విటమిన్ బీ12 స్థాయిలు తెలుసుకోవాలని చెబుతున్నారు. లక్షణాలను బట్టి వెంటనే మందులు వాడటం ద్వారా మెదడు, నరాలకు శాశ్వత నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటి స్థితిని అధిగమించేందుకు విటమిన్ బీ12 సమృద్ధిగా ఉండే లేదా బీ12ను జోడించిన ఆహారాలను తరచూ తీసుకోవడం లేదా వైద్యులు సూచించే సప్లిమెంట్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఏమిటీ బీ12?విటమిన్ బీ12 అనేది శరీరం తయారు చేసుకోలేని ఓ పోషకం. ఇది ప్రధానంగా మాంసాహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటి నుంచి లేదా వైద్యపరంగా సప్లిమెంట్ల రూపంలో లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బీ12 కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని కాలేయం ఐదేళ్ల వరకు నిల్వ చేసుకోగలదు. కానీ శరీరంలో తగినంత బీ12 నిల్వలు లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ విటమిన్లో కోబాల్ట్ అనే ఖనిజం ఉంటుంది కాబట్టి దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. రక్త పరీక్ష ద్వారా బీ12 స్థాయిలు సాధారణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. రక్తంలో విటమిన్ బీ12 స్థాయి 70 పీఎంవోఎల్/ఎల్ (పికోమోల్స్ పర్ లీటర్)గా ఉంటే సాధారణం కింద లెక్క.బీ12 లోపం వల్ల తలెత్తే లక్షణాలు...» జ్ఞాపకశక్తి తగ్గుదల, అయోమయ భావన» ఏకాగ్రత లోపం, స్పష్టమైన ఆలోచన కొరవడటం» కుంగుబాటు భావన, చికాకు, అలసట, బడలిక, బలహీనంగా ఉన్న అనుభూతి కలగడం» చేతులు, కాళ్లు మొద్దుబారినట్లు, తిమ్మిరిగా, దురదగా ఉండటం» కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నాడి దెబ్బతినడం.బీ 12 ప్రయోజనాలు...» డీఎన్ఏ, ఎర్ర రక్త కణాల తయారీలో దోహదం.» జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.» కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నెముక) అభివృద్ధికి కీలకం.» ఆరోగ్యకరమైన ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల తయారీకి బీ 12 అవసరం» కొత్త ఎర్రరక్త కణాల పెరుగుదల, అభివృద్ధికి అవసరం. -
పీజీ మెడికల్ అడ్మిషన్ల గడువు 14 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్లైన్ నమోదు గడువు ను పొడిగించింది. ముందుగా ఈనెల 11 వరకు దరఖాస్తులకు సమయం ఉండగా, ఇప్పుడు ఈనెల 14 (సాయంత్రం 5 గంటల దాకా) వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం నీట్–పీజీ– 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవా లని సూచించింది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్ ఠీఠీఠీ.జుnటuజిట.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీnలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపింది. -
సర్కారు వారి పబ్లిక్ స్కూల్
పబ్లిక్ స్కూల్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ చదువుతోపాటు ఆటపాటలు, సరికొత్త ఆలోచనలతో కూడిన బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇలాంటి పాఠశాలను ఏకంగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకేముంది.. పేద, మధ్యతరగతి పిల్లలంతా పరుగెత్తి అందులో చేరిపోతారు. అలాంటిదే ఇక్కడా జరిగింది.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మార్గనిర్దేశంలో ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది.ఒకవైపు మౌలిక వసతుల కల్పన కొనసాగుతుండగానే... వందల మంది విద్యార్థులతో ఇప్పుడు ఈ పాఠశాల కళకళలాడుతోంది. పూర్వ ప్రాథమికం నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రహరీలో బోధన సాగుతోంది. సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ విధానంలో కాకుండా డే స్కాలర్ పద్ధతిలో మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)పై కొన్ని సూచనలు చేశారు. దీంతో రాష్ట్రంలో నాలుగు చోట్ల టీపీఎస్లు ఏర్పాటయ్యాయి. ఒకే ప్రాంగణంలోకి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జతచేయడంతోపాటు అక్కడే పూర్వప్రాథమిక పాఠశాలతోపాటు జూనియర్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాల, నాగర్కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లిలో వీటిని ఏర్పాటు చేశారు. ఆరుట్ల టీపీఎస్లో ఇప్పటికే వివిధ మౌలిక వసతుల కల్పన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.నాలుగు చోట్ల ఇలా... ⇒ ఆరుట్ల టీపీఎస్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలతోపాటు తెలంగాణ మోడల్ స్కూల్ను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ⇒ మంచాల టీపీఎస్: ప్రాథమిక పాఠశాలతో పాటు జెడ్పీహెచ్ఎస్(బాలికలు), జెడ్పీహెచ్ఎస్(బాలురు)లను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు ఉంది. ⇒ వంగూరు టీపీఎస్: ఎంపీపీఎస్ వంగూరు, జెడ్పీహెచ్ఎస్(బాలికలు), జెడ్పీహెచ్ఎస్(బాలురు), కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతాయి. ⇒ పోల్కంపల్లి టీపీఎస్: ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఒకే చోటకు చేర్చాలని ఆదేశించింది. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు బోధన జరుగుతోంది. ఎస్డీఎంసీ కీలకం... తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ (ఎస్డీఎంసీ)లే కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల పరిధిలో ఎలాంటి పనులైనా టెండర్లు లేకుండా కేవలం ఎస్డీఎంసీల ఆమోదం, పర్యవేక్షణలోనే నిర్వహించాలి. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్లో ఇదే తరహాలో అబివృద్ధి పనులు సాగుతున్నాయి. ఎస్డీఎంసీలో 23 మంది సభ్యులున్నారు. ⇒ ఇప్పటికే బాస్కెట్బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్ , కోకో గ్రౌండ్ పూర్తయ్యాయి. ⇒ గ్రంథాలయం, డైనింగ్ హాళ్లు, సీసీరోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ⇒ క్లాస్రూమ్లు కూడా రంగురంగుల్లో అత్యాధునిక ఫర్నిచర్తో ఏర్పాటు చేశారు. ⇒ వివిధ రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉండడంతో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా బడికి వస్తున్నారు. అప్పుడు 700 మంది.. ఇప్పుడు 1,629 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్ పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రెండేసి సెక్షన్లున్నాయి. మొత్తం ఆరు సెక్షన్ల పరిధిలో 126 మంది చిన్నారులున్నారు. ⇒ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ ముందు నుంచే కొనసాగుతున్నాయి. ఈ మూడింటిలో 700 మంది ఉండగా... టీపీఎస్ తర్వాత విద్యార్థుల సంఖ్య 1,629కు చేరింది. ⇒ ప్రాథమిక పాఠశాలలో ఇదివరకు 90 మంది విద్యార్థులుండగా... ఇప్పుడా సంఖ్య 514కు చేరింది. ⇒ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 250 నుంచి 360కి పెరిగారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 350 నుంచి 629కి చేరింది. ⇒ ప్రీప్రైమరీ టీచర్లను కమిటీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఒక్కో టీచర్కు రూ.15 వేలు, ఆయాకు రూ.10 వేలు వేతనాలిస్తున్నారు. బస్సుల నిర్వహణకు రాయితీ బస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఒక్కో బస్సుపై గరిష్టంగా రూ.12.5 లక్షలు రాయితీ ఉంది. ఆరుట్లలో మూడు బస్సులు నడుపుతూ 200 మంది విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రోజూ స్కూల్కు చేర్చుతున్నారు. బస్సు నిర్వహణ కోసం వాటిల్లో వచ్చే విద్యార్థుల నుంచి నామమాత్రంగా ఫీజులు తీసుకుంటున్నారు. సీఎస్ఆర్ కింద రూ.3 కోట్లు వచ్చాయిపాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా సీఎస్ఆర్ నిధులు కూడా దాదాపు రూ. 3 కోట్ల వరకు రాగా, అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం. పనులను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. –ఎస్.గిరిధర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు టీచర్ల పిల్లలూ ఇక్కడే... మా పాఠశాలలో దాదాపు 20 మంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ టీచర్లుగా పనిచేస్తున్నారు. ప్రతి శనివారం ఎస్డీఎంసీ సమావేశం జరుగుతుంది. కమిటీ సభ్యులు తప్పకుండా హాజరవుతారు. ఆ సమావేశంలో చర్చలు జరిపి అవసరాలకు అనుగుణంగా తీర్మానం చేసి కార్యాచరణ మొదలు పెడతాం. – కంబాలపల్లి భాస్కర్, ఎస్డీఎంసీ సభ్యుడు -
జూబ్లీహిల్స్ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, ఆలపాటి లక్ష్మీనారాయణ పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఢిల్లీలో పార్టీ పెద్దలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్కు ఆ జాబితాను అందచేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ కుల, బల సమీకరణాల ఆధా రంగా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తిరెడ్డి, లంకల దీపక్రెడ్డిలు పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం రెండు రోజుల్లో ప్రకటించనుంది. -
జేఏసీగా బీసీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాలు, మేధావుల నుంచి జేఏసీ ఏర్పాటు డిమాండ్ విన్పిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓపై హైకోర్టు స్టే ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు బ్రేక్ పడడం లాంటి పరిణామాలను బీసీలు జీర్ణించుకోలేక పోతున్నారు.జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో చేతికి అందివచ్చిన అవకాశాన్ని. .తాజా పరిణామాలు లాగేసుకున్నట్టు చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ వర్గాలు నిర్ణయించాయి.భవిష్యత్ కార్యాచరణపై చర్చశనివారం రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన బీసీ కుల సంఘాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆదివారం కాచిగూడ లో రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొనను న్నట్లు సమాచారం.ఈ సమావేశం అనంతరం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచ రణ సమితిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ నెల 14న రాష్ట్ర బంద్కు కృష్ణయ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 30 బీసీ అనుబంధ సంఘాలు ఈ బంద్లో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. -
అక్టోబర్ చివరినాటికి ‘ప్రాణహిత’ కొత్త డీపీఆర్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి/సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీని వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖపై సచివాలయంలో మంత్రి శనివారం సమీక్షించా రు. ఇటీవల తుమ్మిడిహెట్టి, సుందిళ్లను సందర్శించిన అధికారులు సమరి్పంచిన క్షేత్ర పరిశీలనల నివేదికలను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గతంలో నిర్మించిన ప్రధాన కాలువ, ఇతర నిర్మాణాలు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని, స్వల్ప మరమ్మతుల తర్వాత ఉపయోగించుకోవచ్చని అధికారులు వివరించారు. 71 కి.మీ.లు విస్త రించి ఉన్న ప్రధాన కాలువ నెట్వర్క్ ఉపయోగించదగిన స్థితిలో ఉందని, రెండు ప్రధాన అక్విడక్ట్లు 70 శాతం పూర్తయ్యాయని అధికారులు నివేదించారు.తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి అక్కడి నుంచి సుందిళ్ల బరాజ్ వరకు నీటిని గ్రావిటీతో తరలించొచ్చని ఇంజనీర్లు చేసిన సూచనను ఆయన స్వాగతించారు. దీనితో కొత్త పంప్హౌస్ నిర్మించి బహుళ దశల్లో లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు వివరించారు. సుందిళ్ల బరాజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని అధికారులు మంత్రికి తెలియజేశారు.తుమ్మిడిహెట్టి నుంచి 71 కి.మీ. ప్రధాన కాల్వలో 45 కి.మీ. కాల్వ తవ్వకం పూర్తయిందని, ఇతర పనులూ పాక్షికంగా పూర్తయ్యాయని క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పిస్తే నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. వచ్చే వారం మళ్లీ సమీక్షిస్తానని, అక్టోబర్ చివరి నాటికి సవరించిన డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థలాల్లో సౌర ప్లాంట్లు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన సాగునీటి ప్రాజెక్టుల భూములను గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఉత్పత్తి చేసే విద్యుత్ను సాగునీటి పథకాలు, పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు ఉపయోగిస్తే పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలను ఆదా చేయొచ్చని చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నరు బీఆర్ఎస్ నేత హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే బద్నాం చేస్తున్నాడని, తమ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు, ఆల్మట్టి ఎత్తు పెంపునకు పూర్తిగా వ్యతిరేకమని మంత్రి ఉత్త మ్ స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. గోదావరి, కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని పునరుద్ఘాటించారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ అరుదైన రికార్డుధాన్యం దిగుబడిలో తెలంగాణ అరుదైన రికార్డు నమోదు చేసుకోనుందని మంత్రి ఎన్.ఉత్తమ్ చెప్పారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా కోటీ 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై శనివారం సాయంత్రం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, అందులో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లా కేంద్రాలలో ఇప్పటికే 1,205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు వెల్లడించారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఈనెల 16న హైదరాబాద్లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు నీటిని ఎత్తిపోయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు వాడకున్నా, తెలంగాణ వరిసాగులో రికార్డు సృష్టించిందన్నారు. నర్సంపేట ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డికి మాతృవియోగం జరగ్గా.. ఆయనను పరామర్శించేందుకు మంత్రి ఉత్తమ్ శనివారం హనుమకొండకు వచ్చారు. అనంతరం మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులతో కలిసి మీడియాతో మాట్లాడారు. -
కోటాపై ముందుకే!
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలకు సంబంధించిన జీవోలు 9, 41, 42లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న ఈ అంశంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటి షన్ వేయనుంది. హైకోర్టు తీర్పు దరిమిలా తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్చించాక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ ఇచ్చిన జీవో నంబర్ 9తో పాటు దాని ఆధారంగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 9 నుంచి అయిదు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ కూడా రద్దయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సుప్రీంను ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. 16న కేబినెట్లో చర్చ.. ఈ నెల 16వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, ఏపీ చేపడుతున్న ‘బనకచర్ల’, ఆలమట్టి ఎత్తు పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఎలాంటి తీర్పు వెలువడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ జీవోలు, స్థానిక ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ శాఖల మంత్రులు కూడా ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను ఇప్పటికే వెల్లడించారు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లతో ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు అదనంగా కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఆన్ రిజర్వ్డ్ (జనరల్)గా పరిగణించి, పెంచిన రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో..బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి చేసిన కసరత్తు, ఆ దిశలో కొన్ని నెలలుగా సాగించిన కృషిని తుదకంటా కొనసాగించాలనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. తద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అంటున్నారు. సుప్రీంలో సమర్థ వాదనలు వినిపించాలి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, ఎంపిరికల్ డేటా విశ్లేషణ అనంతర నివేదికల ఆధారంగా శాసనసభలో బిల్లులు ఆమోదం, వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపించిన తీరును సుప్రీంకోర్టుకు సవివరంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను, న్యాయ నిపుణులను కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు, స్థానిక సంస్థల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుకు మొదట ఆర్డినెన్స్ ఆ తర్వాత బిల్లుల ఆమోదం వంటి కీలక అంశాలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని, రిజర్వేషన్లకు సంబంధించిన ట్రిపుల్ టెస్ట్ను పకడ్బందీగా నిర్వహించిన విషయం వివరించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద 90 రోజుల పరిమితికి మించి బిల్లులు పెండింగ్లో ఉంటే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను గురించి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. లక్షల మందికి పైగా ఉద్యోగులతో చేసిన సర్వే వివరాలను సుప్రీంకోర్టు ముందుంచాలని నిర్ణయించినట్లు సమాచారం. -
రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లకు తీపికబురు
హైదరాబాద్: రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లకు తీపికబురు చెప్పింది తెలంగాణ సర్కార్. సర్వీస్ కరమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు శనివారం(అక్టోబర్ 11వ తేదీ) సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వారి సర్వీస్ క్రమబద్ధీకరణపై కలెక్టర్లు మార్గదర్శకాలు జారీ చేసింది. -
హైదరాబాద్లో పెరుగుతున్న కొత్త షాపింగ్ మాల్స్
సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా హైదరాబాద్లో ప్రత్యేకంగా వస్తువులు, సేవలను విక్రయించే వాణిజ్య స్థలం(రిటైల్ స్పేస్) పెరుగుతోంది. దీంతో నగరంలో తలసరి రిటైల్ స్పేస్ 3.6 లక్షల చ.అ.లకు చేరింది. ప్రస్తుతం భాగ్యనగరంలో గ్రేడ్–ఏ, బీ షాపింగ్ మాల్స్ స్టాక్ 35.1 లక్షల చ.అ.లుగా ఉండగా.. ఇందులో వేకెన్సీ 1.85 శాతంగా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ∙నగరంలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 5.1 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 9.3 శాతం ఎక్కువ. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నగరంలో 20.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా పరిమితంగా కారణంగా ఈ త్రైమాసికంలో ఎక్కువ లీజులు హైస్ట్రీట్ ప్రాంతాలలో జరిగాయి.మొత్తం లీజులలో 42 శాతం కొంపల్లి, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి సబర్బన్ కారిడార్లలో జరిగాయి. బంజారాహిల్స్, పంజగుట్ట, హిమాయత్నగర్ వంటి కోర్ సిటీలో 32 శాతం, సుచిత్ర, బోడుప్పల్ వంటి శివార్లలో 26 శాతం లీజులు జరిగాయి. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బేవరేజెస్, యాక్ససరీస్ కేటగిరీల్లో రిటైల్ స్పేస్ లీజులు అధికంగా జరిగాయి. లైఫ్ స్టయిల్ విభాగం 16 శాతం, ఫరీ్నచర్ 10 శాతం, హెల్త్ కేటగిరీలో 10 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం లీజుల్లో దేశీయ బ్రాండ్లు 88 శాతం, అంతర్జాతీయ బ్రాండ్లు 12 శాతం వాటాలున్నాయి.కొత్త మాల్స్.. ప్రస్తుతం నగరంలో 28 లక్షల చ.అ. కొత్త షాపింగ్ మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నాల్గో త్రైమాసికం నాటికి 17 లక్షల చ.అ. గ్రేడ్–ఏ మాల్స్ స్థలం డెలివరీ అవుతుంది. కొంపల్లి, శంషాబాద్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో నివాసితులు వినోద అవసరాలను తీర్చేందుకు ఈ మాల్స్, రిటైల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొంపల్లి, ఎంజీ రోడ్, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, అబిడ్స్, హిమాయత్నగర్, అమీర్పేట, మాదాపూర్, నల్లగండ్ల, హబ్సిగూడ, కోకాపేట, మణికొండ వంటి ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దె నెలకు చ.అ.కు రూ.135–250 వరకు ఉన్నాయి. -
బిహార్లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.గత ఎన్నికల్లో..నిజానికి 2015 నుంచే బిహార్పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.నాలుగో బలమైన శక్తిగా..బిహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్తోపాటు.. తేజస్వీ యాదవ్ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్లో తృతీయ ఫ్రంట్కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.ఓట్లు చీలుతాయా?మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్లో పర్యటించారు. సీమాంచల్పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.విమర్శలు మొదలు..మజ్లిస్పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం. -
వరంగల్, నల్గొండలో ఇంక్యూబేషన్ కేంద్రాలు...
తెలంగాణను "ఇన్నోవేషన్ హబ్" గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా మాత్రమే కాకుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గానూ మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. రీసెర్చ్ ను మార్కెట్కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.డాక్టర్ల కంటే వేగంగా రోగాలను నిర్థారించినా, అనుభూతి చెందే మనసును మాత్రం ఏ యంత్రం భర్తీ చేయలేదన్నారు. దేశంలో తమ అనుభవాన్ని ‘నాలెడ్జ్ ఇన్వెస్ట్ మెంట్’గా పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాసీ భారతీయ నిపుణులకు విజ్ఞప్తి చేశారు. పేటెంట్లను కాకుండా మీ ఆవిష్కరణ వల్ల ఎంత మందికి మేలు జరిగిందన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుందని యువ ఇన్నోవేటర్స్ కు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, డా.బి.ప్రభా శంకర్, రాంప్రసాద్ రెడ్డి, ప్రద్యుమ్న, డా.తామర విజయ్ కుమార్, ప్రొఫెసర్ భాస్కర్ ఆర్.జాస్తి, రాజేశ్వర్ తోట, ప్రొఫెసర్ జె. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: టీ స్క్వేర్ భవనం అనేది ఐకానిక్ బిల్డింగ్లా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. దీనికి సంబంధించి నవంబర్ నెల చివరి నుంచి పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఈరోజు(శనివారం, అక్టోబర్ 11వ తేదీ) ఐసీసీలో ఏఐ హబ్ టీ సక్వేర్పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజేఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ండీ వేణు ప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటి సెక్రటరీ భవేష్ మిశ్రా , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. టీ స్క్వేర్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలి. టీ స్క్వేర్ 24 గంటల పాటు పని చేయాలి. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో భవనాలను పరిశీలించాలి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఏఐ హబ్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి*అని సూచించారు. -
భారతీయ యోగ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
హైదరాబాద్: ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా అవలంభించి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత యోగా శిక్షణ ఇస్తుంది బారతీయ యోగా సంస్థ.. దీనిలో భాగంగా అక్టోబర్ 12వ తేదీ, ఆదివారం నాడు ఈ సంస్థ 59వ వార్షిక వేడుకల్ని పురస్కరించుకుని ఒక రోజు ఉచిత యోగా శిక్షణను నిర్వహిస్తోంది.. హైదరాబాద్లోని ఆటోనగర్ సమీపంలోని హరిణి వనస్థలి పార్కు ఇందుకు వేదిక కానున్నట్లు డిస్ట్రిక్ట్ 2 అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి ఆర్. యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ , మోటివేషన్ స్పీకర్ వెంకటరెడ్డి, భారతీయ యోగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ కులకర్ణి,, కార్యదర్శి సదానంద చారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు జోనల్ సెక్రటరీలు సెంటర్ ఇంచార్జులు సహా సుమారు 400 మందిచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేపు(ఆదివారం) ఉదయం గం. 5.30 ని.ల నుంచి ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. -
నికర జలాలు పోయేట్లు ఉన్నాయ్.. బనకచర్లపై హరీష్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?.. రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?. చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదుకేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఆ కండిషన్తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట! -
Konda Surekha: రేవంత్కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
దుబాయి ఎయిర్పోర్టులో తెలంగాణ వాసికి అస్వస్థత
లక్డీకాపూల్: ముంబై నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరిన నిజామాబాద్ వాసి ఒకరు దుబాయ్ ఎయిర్పోర్టులో అస్వస్థతకు గురయ్యారు. అతన్ని ఆదుకోవాలంటూ భార్య సీఎం ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ పట్టణం మహబూబ్ బాగ్కు చెందిన సయ్యద్ బాబా(38) అనే వ్యక్తి గల్ఫ్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న ముంబై నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో దుబాయ్ ఎయిర్పోర్టులో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది అతన్ని రషీద్ హాస్పిటల్లో చేర్పించి మానవత్వం ప్రదర్శించారు. కాగా అతన్ని ఇండియాకు తిరిగి రప్పించాలని బాబా భార్య సమీనా బేగం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి సోదరుడు చోటుతో కలిసి వచ్చిన ఆమె ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. సయ్యద్ బాబా అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నారు. దుబాయిలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నయీమ్, కొట్టాల సత్యం, నారా గౌడ్లు రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
బాలిక సాహసం..ఉడాయించిన దొంగ
సాక్షి, సిటీబ్యూరో: తమ పొరుగింట్లో చోరీకి యత్నించిన దొంగను ఓ బాలిక తరిమికొట్టింది. దొంగతనాన్ని నివారించి అందరి ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..చింతల్, భగత్సింగ్ నగర్, రోడ్ నంబర్ 12లోని ఓ ఇంట్లో కావలి భవానీ అనే 13 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. తమ కింద పోర్షన్లో ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్ దంపతులు నివసిస్తుండగా..వారు గురువారం రాత్రి బయటకు వెళ్లడం చూసి ఓ 20 ఏళ్ల యువకుడు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించాడు. కిందింట్లో అలికిడి గమనించిన భవానీ అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు అని నిలదీయడంతో యువకుడు బయటకు పరుగెత్తాడు. భవాని అంతటితో వదిలి పెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివర ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు తరుముతూ వెళ్లింది. సీసీ కెమెరా రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతోపాటు కాలనీ వాసులు భవానిని ప్రశంసించారు. -
‘బ్రిలియంట్’లో రూ.1.07 కోట్ల చోరీ
అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.1.07 కోట్లు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థకు చెందిన మూడు కాలేజీల్లో సిబ్బంది నాలుగు రోజులుగా ఫీజు డబ్బులు వసూలు చేశారు. అకౌంటెంట్ సెలవులో ఉండటంతో రూ.1.07 కోట్ల నగదును గురువారం కాలేజీ ఆవరణలోని ఆఫీసు బీరువాలో భద్రపర్చి, ఎప్పటిలాగే తాళాలు వేసి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు వచ్చిచూడగా మెయిన్ డోర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఆఫీసు రూమ్ వద్దకు వెళ్లగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని డబ్బు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కళాశాల ఏఓ కేశినేని కుమార్తో పాటు పీఎస్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు మెయిన్ డోర్ను ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్ బాక్స్ను సైతం ఎత్తుకెళ్లారు. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ అశోక్రెడ్డి కాలేజీకి చేరుకుని పలువురు సిబ్బందిని విచారించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బు చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ఫీజు డబ్బులను కాలేజీ ఆఫీసులోభద్రపర్చిన సిబ్బంది బీరువా తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు -
ప్రభాకర్ పనేనా..?
సాక్షి, సిటీబ్యూరో: అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ చోరీ వెనక ‘కాలేజీ దొంగ’ బత్తుల ప్రభాకర్ పాత్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అవకాశాన్ని కొట్టపారేయలేమని చెప్తున్న రాచకొండ పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంతరాష్ట్ర ఘరానా దొంగ గత నెల 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇళ్లతో పాటు కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 86 కేసులు ఉన్నాయి. ప్రభాకర్ ఎస్కేప్పై అక్కడి దేవరపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇతగాడి కోసం ఏపీ పోలీసులు దాదాపు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభాకర్ సుదీర్ఘకాలం హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖరీదైన నివాసాల్లో జీవించాడు. ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అనేక మందితో సన్నిహితంగా మెలిగాడు. కాలేజీలను టార్గెట్గా చేసుకుని వరుసపెట్టి చోరీ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ఇతడి కదలికలు పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులపై కాల్పులకు కూడా తెగపడ్డాడు. ఏపీలోనూ ఇతడిపై కేసులు ఉండటంతో పీటీ వారెంట్పై అక్కడి పోలీసులు తీసుకువెళ్లారు. గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న ఇతగాడు నగరానికి వచ్చి మళ్లీ కాలేజీలను టార్గెట్ చేశాడా? అనే కోణంలో రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో గచ్చిబౌలి ప్రాంతంలో అరెస్టు గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ -
రక్షణ రంగం సాంకేతికతతో పురోగమిస్తున్న భారత్
మణికొండ: రక్షణ రంగంలో మన దేశం సాంకేతికతను విరివిగా వినియోగించి రాణిస్తున్నదని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్, మెటీరియల్స్) అన్నారు. గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కళాశాలలో శుక్రవారం చైతన్య ఆస్ట్రా, సీబీఐటీ ఏరోస్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కాస్మోకాన్–2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతను రక్షణరంగం పూర్తి స్థాయిలో వినియోగిస్తుందన్నారు. డీఆర్డీఓ లాంటి సంస్థలలో అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. భవిష్యత్తు ఇంజనీర్లు మరింత ఉన్నత సాంకేతికతను కనుగొనేందుకు పరిశోధన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలు, ఆలోచనలు, వృత్తి జీవితానుభవాలను పంచుకున్నారు. విద్యార్థుల ఆసక్తిని పరీక్షించేలా వారికి పలు ప్రశ్నలను సందించి సమాధానాలను రాబట్టారు. అంతకు ముందు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ వర్చువల్గా తన సందేశాన్ని ఇచ్చారు. ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు మాట్లాడుతూ... పరిశోధన, నవీనత పట్ల సీబీఐటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాస్మోకాన్ కన్వీనర్ ఆకాశ్ కోటి, ఆస్ట్రా అధ్యక్షుడు టి.జై సాయి దిపేష్, ఉపాధ్యక్షుడు హర్షిత్ వర్మ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్లు ఇప్పటి వరకు కొనసాగించిన పరిశోధనలు, సాధించిన విజయాలను వివరించారు. డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్వీ హరప్రసాద్ -
మిగతా ఐదు చెరువులకూ పునరుజ్జీవం తేవాలి
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మకుంటను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పుడు మిగిలిన ఐదు చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధి, పునరుజ్జీవం నవంబర్ నాటికి పూర్తి కావాలంటూ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో రెండు చెరువుల వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు, కూకట్పల్లిలోని నల్లచెరువుల వద్దకు వెళ్లిన ఆయన పలు సూచనలు చేశారు. ఈ రెండు చెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి తమ్మిడికుంటలోకి వచ్చే ఇన్లెట్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్, బయట వైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని... చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. వేలాది నివాసాల మధ్య ఉన్న కూకట్పల్లి నల్లచెరువు వద్ద స్థానికులు సేదతీరేలా అభివృద్ధి చేయాలని రంగనాథ్ సూచించారు. మురుగునీటిని డైవర్ట్ చేసేందుకు నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జలమండలి అధికారులను కోరారు. గతంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు ఆక్రమణలను తొలగించిన తర్వాత 27 ఎకరాలకు పెరిగిందని వివరించారు. సిబ్బందికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు తమ్మిడికుంట, నల్లకుంట చెరువు పనుల పరిశీలన -
బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ కన్ను
రూ.18 లక్షల సరుకు స్వాధీనం చేసుకున్న టీమ్ సాక్షి, సిటీబ్యూరో: దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ అధికారులు కన్నేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ బృందానికి రూ.18 లక్షల విలువైన సరుకు చిక్కినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. బొగ్గులకుంటకు చెందిన శ్యామ్ కుమార్ సుగంధి సిద్ధ అంబర్బజార్లో ఓ గోదాం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా అందులో భారీగా బాణాసంచా నిల్వ ఉంచారు. జనావాసాల మధ్య ఈ గోదాం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నగర వ్యాప్తంగా ఉన్న బాణాసంచ అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్జోన్ బృందానికి శ్యామ్ కుమార్ గోదాంపై సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి, పి.నాగార్జున తమ బృందాలతో దాడి చేసి శ్యామ్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.18 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకుని కేసును అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 అమలుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా.. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.ఇదీ చదవండి: ‘అలాగైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’.. : తెలంగాణ హైకోర్టు -
ఎయిర్పోర్టులో కార్గో ‘సింహం’
హైదరాబాద్: ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘అంటనోవ్–124 రస్లాన్’ శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో తొలిసారి అడుగుపెట్టింది. రస్లాన్ అంటే తుర్కీ భాషలో సింహం అని అర్థం. ఇది అత్యధిక సరుకు సామర్థ్యం కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు పెట్టారు. అబుదాబి నుంచి భారీ సరుకుతో బయలుదేరిన ఈ విమా నం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై అడుగు పెట్టింది. ఇక్కడ సరుకులు దించిన తర్వా త తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు టేకాఫ్ తీసుకుని దుబాయ్ బయలుదేరింది. అంటనోవ్– 124 రస్లాన్ విమానాలు ప్రస్తుతం క్రియాశీలకంగా 26 మాత్రమే పని చేస్తున్నాయని సమాచారం. ఈ ఫ్లైట్ ప్రత్యేకతలివీ.. ఈ విమానానికి నాలుగు అతిపెద్ద టర్బో ఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. 150 టన్నుల కార్గోని మోసుకెళ్లడం దీని ప్రత్యేకత. మలీ్టలెగ్ ల్యాండింగ్ గేర్ కలిగి ఉంటుంది. రెక్కల వైశాల్యం 6760 చదరపు అడుగులు. ఖాళీ విమానం బరువు 1,81,000 కిలోలు. గతంలో.. శంషాబాద్ విమానాశ్రయంలో 2016 మే 13 అంటనోవ్– 225 మ్రియా విమానం చెక్ రిపబ్లిక్ నుంచి బయలుదేరి ఆ్రస్టేలియాలోని పెర్త్కు భారీ జనరేటర్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో విశ్రాంతి కోసం శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండయింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానం. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 2022 ఫిబ్రవరి ఇది పూర్తిగా ధ్వంసమైంది. దీని తర్వాత అతి పెద్ద విమానాల్లో ఒకటైన బెలుగా విమానం 2022, 2023, 2024లలో నాలుగు విదేశాలకు బయలుదేరుతూ ఇక్కడ ల్యాండై బయలుదేరాయి. తాజాగా అంటనోవ్–124 రస్లాన్ ఎయిర్పోర్టులో సరుకులు దించి ఇక్కడి నుంచి దుబాయ్కు వెళ్లింది. -
Banjara Hills: ఎవరిదా స్థలం.. ఎందుకీ వివాదం?
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని అత్యంత ఖరీదైన ప్రాంతం.. రోడ్డు నెం.10లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు (టీజీఐసీసీసీ) కూతవేటు దూరం.. రూ.వందల కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం.. ఏళ్లుగా ఓ సొసైటీకి–ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదం.. దీన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్రాలతో సగం స్థలంలో తిష్ట వేసిన వైనం.. హైడ్రా అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్న పది ఎకరాల స్థలం వెనుక ఉన్న కథ ఇది. కొన్నేళ్లుగా రెవెన్యూ, జలమండలి, పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ కబ్జా బాగోతం హైడ్రా జోక్యంతో కొలిక్కిరావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు దశాబ్ధాల క్రితం మొదలై.. సదరు స్థలాన్ని శ్రీ రా«ధిక కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1981లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఖరీదు చేసింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ద రఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును తిరస్కరించిన ప్రభుత్వం అది సర్కారు భూమిగా పేర్కొంది. ఆపై ఈ పది ఎకరాలతో పాటు మొత్తం 30 ఎకరాలను బసవతారకం కేన్సర్ హాస్పిటల్తో పాటు మరో రెండు సొసైటీలకు కేయించింది. తమ స్థలం కేటాయింపును రాధిక సొసైటీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఆ 10 ఎకరాల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. మ్యుటేషన్ చేయాలన్న సింగిల్ బెంచ్.. అదే సందర్భంలో ఆ పది ఎకరాలను రాధిక సొసైటీకి మ్యుటేషన్ చేయాలంటూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచి్చంది. దీన్ని ప్రభుత్వం అప్పీల్ చేయడంతో విచారించిన ఇరువురు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫుల్ బెంచ్కు నివేదించారు. వివాదాన్ని సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలంటూ అభిప్రాయపడ్డారు. అప్పటికే ఈ వివాదం మొదలై 20 ఏళ్ల కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ఫుల్ బెంచ్ విచారణకు మరింత కాలయాపన సరికాదని అభిప్రాయపడుతూ గతంలో సొసైటీలకు ఇచి్చన రేటుకే రెగ్యులరైజ్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరింది. దీనికి అప్పట్లో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కూడా సమ్మతి తెలిపారు. సుప్రీం కోర్టు నుంచి మళ్లీ హైకోర్టుకు.. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అక్కడి పిటిషన్, రివ్యూ, క్యూరేటివ్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాధిక సొసైటీకే రెగ్యులరైజ్ చేయాలంటూ స్పష్టం చేసింది. 2017లో ప్రభుత్వం మరోసారి అది ప్రభుత్వ భూమి అంటూ మెమో జారీ చేయడంతో వివాదం మొదటికి వచ్చింది. దీన్ని కొట్టేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ సుప్రీం ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల్ని సర్కారు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీంతో ఈ పది ఎకరాల వివాదం ప్రస్తుతం మళ్లీ హైకోర్టు పరిధిలోకి చేరింది. ఈ స్థలం నుంచే గతంలో జలమండలికి ఎకరం, ఆపై మరో ఎకరం కేటాయించింది.జాగిలాలు.. చుట్టూ సీసీ కెమెరాలతో... ఈ స్థలంలోని ఐదు ఎకరాలపై కన్నేసిన పార్థసారథి, తన కుమారుడు విజయ్ భార్గవ్ చుట్టూ షీట్లు వేశారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ అది తమదే అంటూ రంగంలోకి దిగారు. అందులో 10 వేట కుక్కలు, 25 మంది తమ మనుషులు, పది మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారు. స్థలం చుట్టూ దాదాపు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ అధీనంలో ఉంచుకున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్ ఠాణాలో నాలుగు కేసులు నమోదు కాగా... 2021లో అరెస్టు కూడా అయ్యారు. వీరిపై శంకర్పల్లిలోనూ మూడు ఎకరాలు కబ్జాకు ప్రయత్నించిన ఆరోపణలు ఉన్నాయి. జలమండలి, రెవెన్యూ, పోలీసులను ధిక్కరిస్తూ తమ ఆధిపత్యం చూపించిన వీరి వ్యవహారాలకు హెడ్రా ఎంట్రీతో చెక్ పడింది. -
ఏమి‘టీ’ విచిత్రం! చాయ్ రూ.5.. కాఫీ రూ.6..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులు చేసే ఖర్చు రూ.కోట్లలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల నిబంధనల మేరకు మాత్రం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 40 లక్షలు మించరాదు. అభ్యర్థులు తాము ఎంతమొత్తంలో ఖర్చు చేసినా లెక్క మాత్రం అంతకు లోబడే ఉండాలి. అందుకుగాను అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలకు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారికి , ప్రజలను ఆకట్టుకునేందుకు చాటుమాటుగా పంచే నగదు, కానుకలకు ఎలాగూ లెక్కలుండవు. కానీ.. ప్రచారంలో పాల్గొనే వారికి ఇచ్చే టీ, కాఫీలు, భోజనాలు, ప్రచారంలో వినియోగించేందుకు కొనుగోలు చేసే, అద్దెకు తీసుకునే వస్తువులు, సరుకులు మాత్రం దాచలేరు. వ్యయపరిమితి మించకుండా ఉండేందుకు అభ్యర్థులు ఎలాగూ తక్కువ ఖర్చు చూపిస్తారు కాబట్టి, కనీసం టీ, కాఫీల వంటివాటికైనా వారు ఎక్కువ తిప్పలు పడి ఖర్చులు దాచనవసరం లేకుండా తక్కువ వ్యయాన్నే ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. అన్నింటి ధరలు కాదు గానీ కొన్నింటికి మాత్రం ఏడేళ్ల నాటి ధరలే ఇంకా ఉండటం విశేషం. అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి గతంలో రూ. 28 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని రూ.40 లక్షలకు పెంచారు. అయినప్పటికీ కొన్నింటి ధరలు మాత్రం అలాగే ఖరారు చేయడం విచిత్రం. అంటే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ.. తక్కువగా చూపించేందుకు అవకాశం ఇచ్చారన్న మాట! 2018 నాటి ధరలే.. గ్రేటర్ నగరంలో ఎక్కడైనా రూ.5కే కప్పు టీ దొరుకుతుందా? ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకునే ధరల పట్టికలో మాత్రం టీ (చిన్నకప్పు) ధర రూ. 5గానే ఖరారు చేశారు. కాఫీ చిన్న కప్పు ధర రూ.6గా ఖరారు చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం ఇవే ధరలున్నాయి. నగరంలో రోడ్డు పక్క చాయ్వాలా వద్ద కూడా ఇంత తక్కువ ధర ఉండదు. 200 మి.లీ. వాటర్ బాటిల్ ధర 2018లో, 2023లో, ఇప్పుడు కూడా రూ.6గానే చూపారు. నాలుగు ఇడ్లీల ధరలు, రెండు వడల ధరలు సైతం అప్పుడు, ఇప్పుడు రూ.20గానే ఉన్నాయి. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు, అభిమానులకు ఆహార పదార్థాలు అందజేయాల్సి ఉంటుంది కాబట్టి వాటివల్లే ఎక్కువ వ్యయం కాకుండా ఉండేందుకు వీటి ధరలు పెంచలేదేమో ? ఆహార పదార్థాలతోపాటు కొనుగోలు చేసే ఆయా ఐటమ్లలోనూ, అద్దెలకు తీసుకునే సామాన్లు, వాహనాలు, టెంట్లు , తదితరమైన వాటిల్లోనూ పాత ధరలకు, ప్రస్తుత ధరలకు కొన్నింట్లో తేడాలున్నా, కొన్ని అలాగే ఉన్నాయి. చిన్న క్లాత్ బ్యానర్ గతంలో రూ.30 మాత్రమే ఉండగా, వాస్తవ ధరలకనుగుణంగా ప్రస్తుతం రూ.140 ఖరారు చేశారు. అలాగే.. పెద్ద బ్యానర్ గతంలో రూ. 55– 71 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.180కి పెరిగింది. ప్రస్తుత ధరలుప్రస్తుతం కండువా రూ. 25, పులిహోర రూ.40, చికెన్ బిర్యానీ రూ.170, ఫొటో గ్రాఫర్కు రోజుకు రూ.1500, వీడియోగ్రాఫర్కు రూ.1800, చిన్న పూల దండ రూ.100, పెద్ద పూలదండ రూ.250, ఆరు సీట్ల వరకు మోటార్ క్యాబ్ అద్దె రోజుకు రూ.1430గా ఉన్నాయి. మొత్తం 80 రకాల వస్తువులు, సామగ్రి, ఆహార పదార్థాలకు హాళ్లు, వాహనాల అద్దెలకు రేట్లు ఖరారు చేశారు. జాబితాలో లేని వాటికి అభ్యర్థులు సమరి్పంచే ఓచర్లను సంబంధిత అధికారులు çపరిశీలిస్తారు. -
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల బాదుడు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు లేబొరేటరీ, లైబ్రరీ ఫీజులు భారీగా పెంచాయి. ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని కొంతమంది విద్యార్థులు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆధారాలు లేకుండా కాలేజీలను తామూ కట్టడి చేయలేమని అధికారులు అంటున్నారు. అదనంగా కట్టించుకునే ఫీజులకు కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. అదనపు ఫీజులు కట్టకపోతే క్లాసుకు హాజరైనా అటెండెన్స్ ఉండదని, ఫలితంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని బెదిరిస్తున్నట్టు విద్యార్థులు వాపోతున్నారు. అసలు కన్నా...కొసరే ఎక్కువలైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద అదనంగా ఏటా రూ.12 వేల వరకూ తీసుకోవాలని ప్రభుత్వం గతంలో జీఓ ద్వారా పేర్కొంది. కొన్నేళ్లుగా ఈ ఫీజులో ఎలాంటి మార్పూ లేదు. కానీ కొన్ని కాలేజీలు లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద గతేడాది రూ.20 వేల వరకూ వసూలు చేశాయి. ఈ ఏడాది నుంచి ఈ ఫీజును ఏకంగా రూ. 30 నుంచి రూ. 50 వేల వరకూ పెంచారు. క్యాంపస్ నియామకాలకు శిక్షణ ఇచ్చేందుకు కాలేజీలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాయి.ఏటా రూ.30 నుంచి రూ.60 వేల వరకూ విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థికి స్కిల్ నేర్పించడం కాలేజీల బాధ్యత. అవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.కఠినచర్యలు తప్పవునిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆధారాలతో తమకు ఫిర్యాదు చేస్తే, ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగం కోసం శిక్షణ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని ఇటీవల జేబీఐటీ కాలేజీలపై ఎస్టీ కమిషన్కు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఆ కాలేజీకి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. – డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ -
3 ట్రిలియన్ ఎకానమీ సాధించేదెలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి కోణం ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047 పేరుతో మొత్తం 8 అంశాలపై ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే 25వ తేదీ వరకు కొనసాగనుంది.ప్రజలు తమ విలువైన అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణలోని ప్రతి పౌరుని జీవన ప్రమాణాలను మెరుగుç³ర్చడమే ఎజెండాగా ఈ రైజింగ్ కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళుతోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, జిల్లా, పట్టణం, నగరాల్లోని ప్రజల స్వరం, కలలు, ఆలోచనల ఆసరాగా భవిష్యత్ తెలంగాణ కోసం రూపొందిస్తోన్న ఈ విజన్ సాధ్యమని భావిస్తోంది. అందులో భాగంగానే 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. సర్వేలో భాగంగా 8 ప్రశ్నలను రూపొందించింది. ప్రతి ప్రశ్నకు కొన్ని సమాధానాలిచ్చి వాటిలో ఎలా వెళితే బాగుంటుందో సూచించాలని కోరింది. https://www. telangana.gov. in/ telanganarising/ అనే వెబ్సైట్లో ఈ సర్వేను పొందుపరిచింది.సర్వేలోని అంశాలివేత్రీ ట్రిలియన్ ఎకానమీ: 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకనామీ సాధించడంలో భాగంగా ఉద్యోగాలకు అవసరమైన రంగాల్లో కోర్సులు, స్టార్టప్లకు ప్రోత్సాహం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వాతావరణం కల్పనలో భాగంగా విధానాల్లో సంస్కరణల అమలు, యువత నాయకత్వంలో వ్యాపారాలు.మీ ఆలోచన మేరకు ఈ విజన్: వీలున్నంత సమీపంలో మంచి పాఠశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు, మీమీ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కల్పన, మహిళల రక్షణ, మరిన్ని అవకాశాల కల్పన, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆధునిక సేవలు.అభివృద్ధి రంగాలు..: ఐటీ–ఏఐ–సైబర్ సెక్యూరిటీ, ఫుడ్ ప్రాసెసింగ్–అగ్రిటెక్–కోల్డ్ స్టోరేజి, ఫార్మా– బయోటెక్–ఆరోగ్య ఆవిష్కరణలు, ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ల తయారీ, పర్యాటకం–సాంస్కృతిక–సినీ–సృజనాత్మకత, డ్రోన్స్–అంతరిక్ష శాస్త్రం–రక్షణ.మెరుగైన జీవితం..: అందరికీ స్వచ్ఛమైన గాలి, నీటి లభ్యత, మెరుగైన పారిశుధ్యం, చివరి మైలు వరకు బస్సు, రైలు మార్గాల అనుసంధానం, రక్షిత, సరసమైన గృహ సదుపాయం.ఆరోగ్యం, శ్రేయస్సు...: ప్రతి మండలానికి ఆస్పత్రి, మొబైల్ ఆరోగ్య వాహనం ఏర్పాటు, తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు, మందులు, టెలీమెడిసిన్ లభ్యత, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, వ్యాధి నియంత్రణ, సరసమైన ధరలకు మానసిక ఆరోగ్య కౌన్సెలర్ల లభ్యత, ఆరోగ్య బీమా.విద్య, నైపుణ్యాలు..: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వాతావరణ, పారిశ్రామిక రంగాలపై బోధన, ఆధునిక శిక్షణ పరికరాలు, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు, కళాశాలలు, ఐటీఐలలో నైపుణ్య ఆధారిత కోర్సులు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సానుకూలత కల్పించడం, సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి.పాలన–పౌర సేవలు..: అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఒకటే పోర్టల్. ప్రజలకు అందుబాటులో ప్రతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారం, తగినన్ని నిధులు, అధికారాలతో స్థానిక సంస్థల బలోపేతం.2047లో తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారు?..: (పైన పేర్కొన్న ఏడు అంశాలపై ప్రజల నుంచి ఆప్షన్లను కోరిన ప్రభుత్వం 8వ అంశానికి సంబంధించి తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారో తమ ఆలోచనను అక్షర లేదా స్వర రూపంలో ఇవ్వాలని సర్వేలో కోరింది.)కేవలం విధాన పత్రం కాదు.. ఉమ్మడి స్వప్నంతెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనేది కేవలం విధాన పత్రమే కాదు. తెలంగాణ ప్రజల ఉమ్మడి స్వప్నం కావాలి. రాష్ట్ర భవిష్యత్ నిర్మాతలు ప్రజలే. ప్రజలందరూ కొంత సమయాన్ని వెచ్చించి ఈ చారిత్రక కసరత్తులో భాగస్వాములై మీ విలువైన అభిప్రాయాలను అందించాలి. –జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలంటే లెక్కలేదా అంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని గైరాన్ సర్కారీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తాము ఆదేశించామని, ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జూన్లో తాము ఆదేశించామని.. 4 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని నిలదీసింది.ఆ భూముల వద్దకు వెళ్లి నిర్మాణాలు జరుగుతున్నాయా.. లేదా..పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఏం ఇబ్బందని అడిగింది. కలెక్టర్ నుంచి ఇంత నిర్లక్ష్యాన్ని ఊహించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది న్యాయస్థానం ఉత్తర్వుల ధిక్కరణే అవుతుందని స్పష్టం చేసింది. చివరి అవకాశం ఇస్తున్నామంటూ.. వారంలోగా నివేదిక అందజేయాలని, అందులో ఆలస్యానికి కారణాలను వెల్లడించాలని తెలియచెప్పింది.ఇదీ కేసు..: నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని బిర్లా మల్లేశ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం గానీ, బదిలీ చేయడం గానీ, నిర్మాణాలు చేపట్టడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రతివాదులకు తేల్చిచెప్పింది. ఈ విధంగా న్యాయస్థానం ఉత్తర్వులున్నా వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మల్లేశ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.జూన్లో ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానమిస్తూ నివేదిక అందజేయాలని కలెక్టర్ను ఆదేశించింది. అయినా కలెక్టర్ నివేదిక దాఖలు చేయకపోవడంతో మహేశ్ మరో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు వారం గడువిస్తూ తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారు. -
వచ్చే నెల 15కల్లా ఇందిరా మహిళాశక్తి చీరలు
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరా మహిళాశక్తి(Indira Mahila Shakti) చీరలను వచ్చే నెల 15 నాటికి పంపిణీ చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) ఆధ్వర్యంలో 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోదాములకు సరఫరా చేసినట్టు వెల్లడించారు.సచివాలయంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్తోపాటు ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల శుక్రవారం సమీక్షించారు. చీరల కోసం అవసరమైన వస్త్రోత్పత్తిలో 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉపాధి దక్కిందన్నారు. చీరల ఉత్పత్తిని పూర్తి చేసి నవంబర్ 15లోగా జిల్లా స్థాయి గోదాముల నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రుణమాఫీ ప్రక్రియ వేగవంతం: చేనేత కార్మికుల రుణమాఫీని వేగవంతం చేసి, త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని తద్వారా 6,780 మందికి రూ.లక్ష వరకు రుణ విముక్తి లభిస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. తెలంగాణ చేనేత లేబుల్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన వ్రస్తోత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 13,371 మంది నమోదు చేసుకోగా మరో 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో తాత్కాలికంగా నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్)ను పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్లోకి మార్చేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
కింకర్తవ్యం..!?
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42% కోటా జీవోపై హైకోర్టు స్టే విధించడంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందు కెళ్లాలనేదానిపై ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అటు రాజకీయ వర్గాలు, ఇటు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.హైకోర్టు తీర్పు దరిమిలా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేది కూడా శుక్రవారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటి కాగా.. జీవో అమలుపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఆరు వారాల పాటు వేచి ఉండటం రెండో ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఆ సమయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపిన బిల్లులకు కూడా మూడు నెలల సమయం పూర్తవుతుందని, అప్పుడు అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల జీవోకు అనుకూల నిర్ణయాన్ని కోర్టుల నుంచి ఆశించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు. -
అంతా గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై హై కోర్టు స్టే విధించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువ డిన నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. ఇప్పుడు అసలు ఎప్పుడు ఎన్నికలు జరు గుతాయో, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అర్థం కాక కింది స్థాయి కేడర్ అయోమయంలో పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవు తున్నా అటు పార్టీ పదవులు కానీ, ఇటు నామినేటెడ్ పదవు లు కానీ లేకపోవడంతో నిరాశా నిస్పృహలు నెలకొన్నా యని, ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సైతం బ్రేకులు పడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. కేడర్కు దిశానిర్దేశం ఏదీ?: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఏ మేరకు అమలవుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ కేడర్కు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకు మాత్రమే చేరగా, సాధారణ కార్యకర్తల్లో మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ‘రిజర్వేషన్ల గురించి మాకు అవగాహన ఉంది. ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎన్ని కలు జరిగే అవకాశం కూడా లేదనే స్పష్టత మాకుంది.కానీ, గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలకు ఈ అవగాహన లేదు. ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. నోటిఫికే షన్ కూడా రావడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని నామినే షన్లకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు స్టే విధించడం గందరగోళానికి తెరతీసింది.’ అని ఓ మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల సంగతి ఎలా ఉన్నా ఏదో రూపంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మేలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకత్వంలో వ్యక్తమవుతోంది.రిజర్వేషన్లపై ముందుకే..రిజర్వేషన్ల విషయంలో ముందుకే వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్గౌడ్తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్లు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికల కు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఏఐసీసీ ఆలోచన కూడా ఇదే తరహాలో ఉందని తెలుస్తోంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు వెళితే ఇతర రాష్ట్రాల్లో కూడా మార్గదర్శకంగా ఉంటామని, తాము బీసీలకు న్యాయం చేస్తామని తెలంగాణను చూపించి దేశ వ్యాప్తంగా చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని ఏఐసీసీ భావిస్తోంది.పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించడం కన్నా కోర్టులు, రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ముందుకు వెళ్లడమే మేలనే భావనలో టీపీసీసీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు మాత్రమే కోర్టు స్టే విధిస్తే, ఆ స్టేను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ పరంగా కూడా అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. -
50 శాతంతో ఓకే!
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని హైకోర్టు సీజే ధర్మాసనం నిలిపివేసింది. దీంతో పాటు మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించి పంచాయతీ రాజ్ చట్టం–2018లో రిజర్వేషన్లను మారుస్తూ సెపె్టంబర్ 26న జారీ చేసిన జీవో నంబర్ 41, 42పై కూడా స్టే విధించింది. ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో మెరిట్స్లోకి వెళ్లడం లేదని తెలిపింది.వికాస్ కిషన్రావ్ గవాలీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని నిర్దేశించిందని, దీన్ని పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ ఇచ్చిన జీవోలను ఈ కోర్టు నిలిపివేసినందున, రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచిన 17 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి తీర్పు కాపీని విడుదల చేసింది. ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయండి..ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దన్న వాదనలు తమ ముందుకు వచ్చాయని.. వాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నందున.. గతంలో రాహుల్ రమేశ్వాఘ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడుతున్నామని చెప్పింది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ట్రిపుల్ టెస్ట్ను పాటించపోతే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి లేకుండా, పెంచిన దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని, స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఈ కోర్టు భావించడం లేదని చెప్పింది. రిజర్వేషన్ల పెంపు జీవోను నిలిపివేసినందున ఆ మేరకు మార్పు మాత్రమే సూచిస్తున్నామని స్పష్టం చేసింది. కింకర్తవ్యం..!? ⇒ జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు ⇒ న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సంప్రదింపులు ⇒ అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు..రాజుకుంటున్న రాజకీయ వేడి సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42% కోటా జీవోపై హైకోర్టు స్టే విధించడంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అసలు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా? జరిగితే ఎప్పుడు, ఎలా జరుగుతాయి? ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది అసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందు కెళ్లాలనేదానిపై ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అటు రాజకీయ వర్గాలు, ఇటు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు దరిమిలా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేది కూడా శుక్రవారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. రెండే ప్రత్యామ్నాయాలు? రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటి కాగా.. జీవో అమలుపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఆరు వారాల పాటు వేచి ఉండటం రెండో ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఆ సమయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపిన బిల్లులకు కూడా మూడు నెలల సమయం పూర్తవుతుందని, అప్పుడు అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల జీవోకు అనుకూల నిర్ణయాన్ని కోర్టుల నుంచి ఆశించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు. ప్రతిపక్షాలకు అస్త్రంగా.. హైకోర్టు స్టే నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో ఇరుకున పెట్టే వ్యూహంతో ప్రతిపక్ష పారీ్టలు ముందుకెళుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుదల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాన రాజకీయ పారీ్టల నేతలు విమర్శిస్తున్నారు. హైకోర్టు స్టే విధించడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిదేనని ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైన, శాస్త్రీయమైన ప్రక్రియతోనే సాధ్యమని తెలిసీ, కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా అపహాస్యం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన బీసీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్గౌడ్ తదితరులు.. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పారీ్ట.. వీరి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.తమకు చిత్తశుద్ధి లేకపోతే అసలు ఇంత దూరం ఎందుకు తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో మద్దతిచ్చిన బీఆర్ఎస్ కోర్టు కేసులో ఇంప్లీడ్ కాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపజేస్తే అసలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరమే రాదని, ఈ విషయంలో బీజేపీ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద హైకోర్టు స్టే రాష్ట్రంలో రాజకీయ వేడిని రగులుస్తుండగా.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. -
చలో బస్భవన్.. ఉద్రిక్తత
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఉదయం 8గంటల నుంచే పోలీసులు భారీ ఎత్తున మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్భవన్ నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అటు వీఎస్టీ నుంచి, ఇటు చిక్కడపల్లి, సికింద్రాబాద్, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల నుంచి ఆందోళనకారులు బస్భవన్ వైపు రాకుండా చర్యలు చేపట్టారు. దీంతో సాధారణ ప్రజల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 10.30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు ఆర్టీసీ క్రాస్రోడ్స్కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను, బారికేడ్లను దాటుకొని బస్భవన్ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్, హరీష్రావులతో చిక్కడపల్లి ఏసీపీ రమేష్, గాంధీనగర్ ఏసీపీ యాదగిరిలు మాట్లాడి బస్భవన్లో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేసేందుకు లోపలికి పంపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి!
గ్రేటర్ పరిధిలో త్వరలో రోడ్డెక్కనున్న 275 అద్దె బస్సులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో దశలవారీగా రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ సిబ్బంది మనుగడకు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కాలుష్యరహిత, పర్యావరణహితమైన, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)లు వేలాదిమంది సిబ్బంది మెడపై కత్తిగా వేలాడనున్నాయి. ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. త్వరలో మరో 275 వరకు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో 2,800 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సుల కోసం కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. మరోవైపు రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ బస్సుల చార్జింగ్ పేరిట ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికులపై చార్జీల భారాన్ని మోపింది. ఈ క్రమంలోనే దశలవారీగా సిబ్బందికి సైతం ఉద్వాసన పలికే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ– బస్సులతో గ్రేటర్ హైదరాబాద్లోని 25 డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సు ల పేరిట జరిగే ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకించేందుకు కార్మిక సంఘాలు ఆందోళనకు సన్నద్ధమవుతున్నాయి. ఒక బస్సుతో ఐదుగురికి నష్టం.. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ (పీఎం ఈ– డ్రైవ్) పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ సంస్థలకు చెందిన డ్రైవర్లే ఈ బస్సులను నడుపుతారు. దీంతో ఆర్టీసీకి ప్రత్యేకంగా డ్రైవర్ల అవసరం ఉండదు. మెకానిక్లు, టెక్నీషియన్లు తదితర సిబ్బంది అవసరం కూడా ఉండదు. కండక్టర్ల అవసరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఒక బస్సుకు ఐదుగురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్, ఒక కండక్టర్తో పాటు మెకానిక్, టెక్నీషియన్, సూపర్వైజర్లు ఉన్నారు. ఈ లెక్కన నగరంలోని అన్ని డిపోల్లో 15,000 మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు 6,000 మంది డ్రైవర్లే. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పెద్ద సంఖ్యలో నష్టపోయేది కూడా డ్రైవర్లే కావడం గమనార్హం. ఆ తరువాత మెకానిక్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలకు కూడా ప్రమాదం పొంచి ఉండనుంది. ● ఈ క్రమంలో హైదరాబాద్లో పని చేసే సిబ్బందిని జిల్లాల్లో సర్దుబాటు చేయడంతో పాటు, ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారిని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఒత్తిడి చేసేలా ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ డిపోలు కూడా ప్రైవేట్ బస్సుల నిర్వహణకు పరిమితం కానున్నాయి. ప్రస్తుతం హెచ్సీయూ డిపోను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం వినియోగిస్తున్నారు. కంటోన్మెంట్, రాణిగంజ్, కూకట్పల్లి, హయత్నగర్ తదితర డిపోల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలో అన్ని డిపోల్లోనూ హైటెన్షన్ విద్యుత్ సదుపాయం కలిగిన చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ డిపోలన్నీ ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్, పార్కింగ్ అవసరాలకు వినియోగిస్తారు. అప్పుడు వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది అవసరం ఉండదు. కేంద్రం సబ్సిడీ ప్రైవేటుకేనా? ● ప్రజారవాణా రంగంలో ఈవీలను ప్రోత్సహించేందుకు ఈవీ బస్సులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. పీఎం –ఈ డ్రైవ్లో భాగంగా ఒక్కో బస్సుపై సుమారు రూ.35 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. రూ.కోటికిపైగా ఖరీదైన ఈ– బస్సులను కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలకే రాయితీ లభిస్తుందని, దీనివల్ల ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం ఉండబోదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ● ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీయే చార్జింగ్, పార్కింగ్ సదుపాయాన్ని అందజేస్తోంది. ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో మాత్రం కిలోమీటర్కు సుమారు రూ.57 చొప్పున ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగానూ ఆర్టీసీకి లాభదాయకం కాదని, అద్దె ప్రాతిపదికన నడపడం కంటే సొంతంగా ఈవీలను సమకూర్చుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. మరోవైపు ప్రస్తుతం నగరంలో సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.వీరిలో 16 లక్షల మంది వరకు మహిళలే ఉన్నారు. వారి ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్మెంటే ఆర్టీసీకి ప్రధాన ఆదాయం. నగదు రూపంలో లభించేది తక్కువే. ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వ చెల్లింపులు నిలిచిపోయినా, ఆలస్యమైనా ఆర్టీసీ దారుణంగా నష్టపోతుంది. ప్రభుత్వ కుట్రలను సహించబోం.. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని నమ్ముకొని బతుకుతున్న కార్మికులను బయటకు పంపించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ఈ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతాం. – ఈదరి వెంకన్న, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులకు ప్రణాళికలు ప్రశ్నార్థకంగా 15,000 మంది ఉద్యోగుల భవిష్యత్ దశలవారీగా ఆర్టీసీ సొంత బస్సులకు ఉద్వాసన ఎలక్ట్రిక్ వాహనాల కోసమే ఏర్పడనున్న కొత్త డిపోలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ -
జలమండలి ఖాతాలో మరో పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డులు అందుకున్న జలమండలి.. మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్టీఐ కేసుల్లో ఉత్తమ సేవలకు తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగేనా! అంతర్గత పోరు
సాక్షి, సిటీబ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. యువనేత నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ.. పార్టీ కొత్త, పాత శ్రేణుల్లో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెను సవాల్గా మారాయి. ఈ పరిస్థితితో పార్టీ నేతలతో పాటు కేడర్ స్థాయిలోనూ గందరగోళం నెలకొంది. రెండు నెలలుగా మంత్రులు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరిట సుడిగాలి పర్యటనలు చేసినప్పటికీ.. పాత, కొత్త కేడర్ను ఏకతాటిపై తేచ్చేందుకు ప్రయత్నించకపోవడంతో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారోనని రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.ఎడమొహం.. పెడమొహమే..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమై.. రాజకీయ వాతావరణం వేడేక్కి మూడు, నాలుగు మాసాలు కావస్తునప్పటికీ.. కాంగ్రెస్లోని కొత్త, పాత కేడర్లో సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో చాలెంజ్గా తీసుకొని ముందస్తుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొత్త, పాత క్యాడర్ మధ్య ఆధిపత్య పోరు కోసం అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి ఘటనలు కొనసాగాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహులు సైతం మంత్రుల పర్యటన కార్యక్రమాలకు పరిమితమై కనీసం పలకరింపు కూడా లేకుండా ఎవరికి వారే యమునా తీరే విధంగా వ్యవహారించడం విస్మయానికి గురిచేసింది. అభ్యర్థిత్వం ఖరారు అనంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.ఆశావహుల్లో అసంతృప్తి..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. వీరిలో కాంగ్రెస్లో కొత్తగా చేరిన నేతలతో పాటు దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న నేతలు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి , విద్యావేత్త భవానీ శంకర్ తదితరుల టికెట్ ఆశించి విఫలమయ్యారు. వీరి అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా తయారైందన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
వైద్యం ముసుగులో గంజాయి దందా
సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసమంటూ మెడికల్ వీసాపై వచ్చిన ఓ నైజీరియన్ గంజాయి దందా ప్రారంభించాడు. వీసా గడువు ముగిసినా, పాస్పోర్టు ఎక్స్పైర్ అయినా ఇక్కడే తిష్ట వేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యం లభించకపోవడంతో డిపోర్టేషన్ విధానంలో బలవంతంగా తిప్పి పంపినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓనురా సోలమన్ చిబుజ్ కొన్నాళ్లు తన స్వస్థలంలో చిరు వ్యాపారిగా బతికాడు. 2014 ఆగస్టు 14న మెడికల్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 23 వరకే వీసా గడువు ఉంది. పాస్పోర్టు సైతం 2016 జనవరి 16న ఎక్స్పైర్ అయిపోయింది. అయినప్పటికీ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో మూడేళ్ల పాటు పని చేశాడు. గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ వచ్చి అత్తాపూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పుణె, ముంబైల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసుకుని వచ్చేవాడు. ఆ సరుకును నగరంలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.ఇటీవల టోలిచౌకి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోలమన్ను హెచ్–న్యూ అదుపులోకి తీసుకుంది. ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు నేతృత్వంలోని బృందం విచారించింది. వీసా, పాస్పోర్టు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకారంతో డిపోర్టేషన్ చేసింది. -
మధురం..56 ఏళ్ల జ్ఞాపకం
గురువును సత్కరించిన పూర్వ విద్యార్థులు అంబర్పేట: విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఆత్మీయంగా సత్కరించారు. 56 ఏళ్లు గడిచినా విద్య నేర్పిన గురువును వారు విస్మరించలేదు. 1969లో కేశవ్ మెమోరియల్ స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టారు కె.యాదవరెడ్డి (ప్రముఖ కవి నిఖిలేశ్వర్)ని శిష్యులు సత్కరించి ఆత్మీయతను పంచారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు శివంరోడ్ లోని ఓ హోటల్ వేదికై ంది. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో 1969 బ్యాచ్ విద్యార్థులు ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, డాక్టర్ భగవత్ రెడ్డి, సత్యనారాయణ, డి.ఎస్.ఎన్ మూర్తి, మల్లాది రాఘవ, జగన్రావుతో పాటు మరో 25 మంది పాల్గొన్నారు. -
సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించాలి
బన్సీలాల్పేట్: భారత దేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అసలైన దేశ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ సుప్రసిద్ధమైన స్కందగిరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు గురువారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయన్నారు. సనాతన ధర్మం వేదంతో ముడిపడి ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు దశాబ్ధాలుగా ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిందని దానికి వేదమే ప్రమాణికమన్నారు. ఇతర దేశస్తులు మన సంపదను దోచుకొని పొయారు గాని మన జీవన ప్రమాణానికి ఆధారమైన వేదజ్ఞానాన్ని మన నుంచి విడదీయలేకపొయారన్నారు. వేద పాఠశాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ను అభినందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వేదాలు, శాస్త్రాలను గౌరవిస్తూ విద్యార్ధులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షతన వహించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ట్రస్ట్ రజతోత్సవాల సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మెన్ తూములూరి శాయినాథ్ శర్మ, ప్రధాన కార్యదర్శులు పసుమర్తి బ్రహ్మానంద శర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
ఆత్మస్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మ స్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చునని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అపోలో కేన్సర్ సెంటర్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ, డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి కేన్సర్పై రాసిన ‘ఐ యామ్ సర్వైవర్’(నేను కేన్సర్ను జయించాను) అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. హిందీ అనువాద ‘మైనే కేన్సర్ కో జీతా హూ’ పుస్తకావిష్కరణ సభ బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్(ఢిల్లీ) శివకుమార్ పట్టాభిరామన్, విజయ్ ఆనంద్ రెడ్డిలతో కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో 30 ఏళ్ల అనుభవాన్ని ఈ పుస్తక రూపంలో ప్రజలకు తెలపడం అభినందనీయమన్నారు. కేన్సర్ పేరు చెబితే భయపడే పరిస్థితుల నుంచి, వ్యాధిని ఎలా జయించొచ్చు అనే విషయాలను పుస్తకంలో స్పష్టంగా వివరించడం మంచి పరిణామన్నారు. ఆత్మ స్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చు అనే నిజాన్ని ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తెలిపినందుకు అభినందనలు అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేన్సర్ మహమ్మారిపై దండయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ పుస్తకం ద్వారా ప్రతి రోగి ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. ఈ పుస్తకంలో కేన్సర్ను జయించిన 108 మంది విజయగాథలను, వారి అనుభవాలను పొందుపరిచినట్లు పుస్తక రచయిత డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. రోగుల జీవితంపై ప్రేమను ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ‘ఐ యామ్ సర్వైవర్’ పుస్తకావిష్కరణ -
అపార్ట్మెంట్ రెండో అంతస్తులో కొండ చిలువ
నిజాంపేట్: బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో భారీ కొండ చిలువు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ నెల 8న రెండో అంతస్తులోని ఓ గదిలో కొండ చిలువును గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు స్నేక్ టీమ్కు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి కొండ చిలువను బంధించారు. అనంతరం దానిని సమీపంలోని అడవిలో వదిలేశారు. నిందితుడిపై కేసు నమోదు సైదాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...ఐఎస్సదన్ డివిజన్ పరిధిలో ఓ బాలిక కుటుంబంతో సహా నివాసం ఉంటోంది. వారి ఇంటి సమీపంలో ఓ యువకుడు (24) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా బాలిక తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉంది. అదే అదనుగా భావించిన సదరు యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్: పరిమితికి మించి బంగారం, వెండి ఆభరణాలతో పట్టుబడిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన బిన్సన్ డేవిస్ అనే ప్రయాణికుడి కదలికలను గమనించిన సీఐఎస్ఎఫ్ అధికారులు చేతి సంచి క్షుణ్ణంగా పరిశీలించడంతో అందులో 2.80 కేజీల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు గుర్తించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఐటీ అధికారులు ఎయిర్పోర్టుకు చేరుకుని వారిని విచారిస్తున్నారు. కుత్బుల్లాపూర్: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లా, చింతపల్లికి చెందిన వినయ్దుర్గ (19) మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ వర్సిటీ హాస్టల్లోనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ వార్డెన్ రాజేంద్ర గదులను తనిఖీ చేస్తుండగా 010 గది లోపల నుంచి గడియపెట్టినట్లు గుర్తించాడు. దీంతో గది తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా వినయ్ దుర్గ టవల్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు బద్దల కొట్టి వినయ్దుర్గను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ..
కంటోన్మెంట్: శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి కంసాలి బజార్లో బి. ప్రవీణ్ కమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసంఉంటున్నాడు. బంధువుల ఇంట్లో బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 6న కుటుంబంతో కలిసి మహబూబ్నగర్కు వెళ్లారు. బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉన్నాయి. 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేలు విలువ చేసే పంచలోహ విగ్రహం, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. -
స్థిరమైన, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యం
రాయదుర్గం: రాష్ట్రంలో స్థిరమైన, సమగ్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి క్రాంతి అన్నారు. ‘టూరిస్ట్ పోలీస్ ఓరియంటేషన్ అండ్ సెన్సిటైజేషన్’ అంశంపై వారం రోజుల పాటు గచ్చిబౌలిలోని ‘నిథమ్’ క్యాంపస్లో టూరిజమ్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా టూరిజమ్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిథమ్ ప్రిన్సిపల్ ఎంకెగణేష్, నిథమ్ ఫ్యాకల్టీడాక్టర్ నీరజ్గోయల్, మిషెల్లీ జే ఫ్రాన్సిస్, యాదగిరి, ఇతర అధికారులు, టీఎస్టీడీసీ అధికారులు, శిక్షణ పొందిన టూరిజమ్ పోలీసులు పాల్గొన్నారు. -
TG: డీజీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు సీనియర్ మావోయిస్టు లీడర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.లొంగిపోయిన వారిలో 36 సంవత్సరాలుగా అండర్గ్రౌండ్లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్; 35 సంవత్సరాలుగా అండర్గ్రౌండ్లో ఉన్న మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ రాజు; 21 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో ఉన్న తోడెం గంగా అలియాస్ సోనీ ఉన్నారు.సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటయ్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కింద దక్షిణ బస్తర్ డివిజన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా , కార్యదర్శిగా పనిచేశారు. అతని భార్య కోడి మంజుల అలియాస్ నిర్మల ఏడాది క్రితం వరంగల్లో లొంగిపోయారు.వారి లొంగిపోవడం మావోయిస్టు నెట్వర్క్ను బలహీనపరచడంతో పాటు ఇతర మావోయిస్టులు జీవన స్రవంతిలోకి తిరిగి రావడానికి దోహదపడటంలో మరో అడుగు అని పోలీసు అధికారులు తెలిపారు. -
చౌమహల్లా ప్యాలెస్ చూసొద్దాం రండి..!
చార్మినార్: ఆసఫ్ జాహీల రాచరిక పాలనకు అద్దంపట్టే విధంగా ఉన్న పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్లో 8వ ఆసఫ్ ఝా, మాజీ హైదరాబాద్ నిజాం ముకర్రం ఝా బహదూర్ జయంతిని పురస్కరించుకుని అరుదైన ఛాయా చిత్రాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 6న ఈ ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన కుమారుడైన 9వ నిజాం అజ్మత్ ఝా బహదూర్ ప్రారంభించగా..7న నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫొటో ఎగ్జిబిషన్తో పాటు చౌమహల్లా ప్యాలెస్ భవనం, అందులోని నిజాం కాలం నాటి వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Mustafa Ameen (@asafjahidynasty)యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం.. చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌదం. ఇది నాలుగు ప్యాలెస్ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్లో నాలుగు ప్యాలెస్ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్లోని షా ప్యాలెస్ను పోలిన ఆర్కిటెక్చర్లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అప్జల్ మహల్ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయమానంగా మారింది. నిజాం ప్రభువుల నివాస గృహంగా.. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. 1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటుచేశారు. మ్యూజియంలో చూడదగ్గవి.. ఈ ఛాయా చిత్ర ప్రదర్శనతో పాటు నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్లోని నాలుగు ప్యాలెస్లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది. ఎక్కడ: యూరోపియన్ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా పాలరాతి వలే నిర్మితమైన చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ కట్టడానికి దగ్గరలోని ఖిల్వత్లో ఉంది. ఎలా వెళ్లాలి: చార్మినార్ కట్టడం నుంచి లాడ్బజార్, ఖిల్వత్ చౌరస్తా ద్వారా ముందుకెళితే చౌమహల్లా ప్యాలెస్ భవనం కనిపిస్తుంది. ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్! -
బసవతారకం ఆసుపత్రి వద్ద హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad City) సిటీలో హైడ్రా(HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్లో(Banjara Hills) శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఆక్రమణకు గురైన ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు.. స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు.. అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కాగా, వీఆర్ ఇన్ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్ భార్గవా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది.షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10లో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసార్థి కోర్టుకెక్కారు. అనంతరం, చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టారు. కాగా, కోర్టులో వివాదం ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకున్నారు.వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. తరువాత 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. -
ప్రేమ పేరుతో ‘కోచ్’ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, అడ్డగుట్ట: ప్రేమ పేరుతో కోచ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్న ప్రమోద్కుమార్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.వారి పెద్ద కుమార్తె మౌలిక(19) అలియాస్ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో మాణికేశ్వర్ నగర్కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం వాలీబాల్ కోచ్గా జాయిన్ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన మౌలిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి సెల్ఫోన్లో డేటా పూర్తిగా డిలీట్ చేసి ఉందని, డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
65 రోజుల్లో రూ. 7.88 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం 65 రోజుల్లో రూ. 7.88 కోట్లు కొల్లగొట్టిన భారీ మోసం కేసు ఇది. హైదరాబాద్లోని కేపీహెచ్బీకి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త ఒక నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టి రూ. 7.88 కోట్లు కోల్పోయాడు. అతను కొంతమంది తెలియని వ్యక్తుల ద్వారా సులభమైన లాభాల కోసం ఒక వెబ్సైట్లో పెట్టుబడి పెట్టారు. భారీ లాభాలు వచి్చనట్టు చూపినా.. నగదు విత్డ్రా చేసుకునేందుకు వీలు కాకపోవడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వివరాలు ఇలా.. జూలై 25న కేపీహెచ్బీకి చెందిన వ్యాపారి పి.నాగేశ్వరరావుకు సత్యనారాయణ, వైశాలి అనే పేర్లతో గుర్తు తెలియని వ్యక్తులు ‘ఫినాల్టో ఇండస్’ అనే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్కు సంబంధించిన వాట్సాప్ లింక్ పంపి అతన్ని అందులో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. తాము యూకే స్టాక్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లతో సంబంధం కలిగి ఉన్నట్లు నమ్మించారు. మొదట జూలై 25న, అతను యూపీఐ ద్వారా రూ. 45,000 పెట్టుబడి పెట్టాడు. దీంతో అతని ట్రేడింగ్ ఖాతా 15% లాభాన్ని చూపించింది. గణనీయమైన లాభాలను సంపాదించాలంటే, రొటీన్ ట్రేడింగ్, ఐపీఓ కోసం భారీ మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలని వారు ఒత్తిడి చేశారు. మొదట్లో, అతను తన నమ్మకాన్ని బలపరచడానికి రూ. 8,600 విత్డ్రా చేశాడు.వారిని ఒప్పించడంతో, అతను 65 రోజుల వ్యవధిలో మొత్తం రూ. 7,88,18,233 పెట్టుబడి పెట్టాడు. ఈ కాలంలో, ఖాతా సుమారు రూ. 11 కోట్ల లాభాన్ని చూపించారు. సెపె్టంబర్ 30న, అతను తన నిధులను విత్డ్రా చేయడానికి యత్నించినప్పుడు, 30% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయిన రూ. 3 కోట్లు చెల్లించాలని వారు తెలిపారు. దీంతో ట్యాక్స్, విత్డ్రాయల్ నిబంధనల చట్టబద్ధతపై అతనికి అనుమానాలు కలిగాయి. అప్పుడు, అతను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. అధికారులు కేసును నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు
సాక్షి, సిద్దిపేట: పండించిన పంటలను విక్రయించే సమయంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ డ్రయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 డ్రయర్లు పంపించారు. ఇవి ఇప్పటికే ఆయా జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్లకు చేరుకున్నాయి.ప్యాడీ డ్రయర్ మెషీన్ 40 క్వింటాళ్ల ధాన్యాన్ని గంటకు 6 శాతం చొప్పున తేమను తగ్గిస్తుంది. తేమ 30 శాతం ఉన్నా కూడా అందులో పోస్తే ఆరబెడుతుంది. దీంతో ధాన్యం నాణ్యత మెరుగుపడుతుంది. గంటకు 40 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెట్టేందుకు దాదాపు రూ.500 వరకు ఖర్చవుతుంది. దీంతో రైతుల ఇబ్బందులు తప్పనున్నాయి.జిల్లాకు రెండు వచ్చాయి..కొనుగోలు కేంద్రాలకు తొలిసారిగా ప్యాడీ డ్రయర్లను అందుబాటులోకి తెచ్చాం. సిద్దిపేట జిల్లాకు రెండు కేటాయించారు. ఇది గంట సమయంలో దాదాపు 6% తేమను తగ్గిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
ఫెయిర్.. ఫర్మ్.. ఫ్రెండ్లీ పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: ఫెయిర్.. ఫర్మ్..ఫ్రెండ్లీ (ఎఫ్–3) అనేవి తెలంగాణ పోలీస్ మూల సూత్రాలని డీజీపీ బి.శివధర్రెడ్డి స్పష్టం చేశారు. నిష్పాక్షికమైన, దృఢమైన, స్నేహపూర్వక, ప్రొఫెషనల్ పోలీసింగ్ ప్రజలకు అందించేందుకు పోలీస్శాఖలోని ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శివధర్రెడ్డి తొలిసారి రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, డీసీపీలతో జరిగిన సమావేశంలో డీజీపీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఫెయిర్ (న్యాయమైన) పోలీసింగ్ అంటే ప్రతి పౌరుడిని చట్టం ముందు సమానంగా చూస్తూ నిష్పక్షపాతంగా న్యాయం అందించడం. ఫర్మ్ (దృఢమైన) పోలీసింగ్.. అంటే భయం లేదా పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేస్తూ శాంతి భద్రతలను నెలకొల్పడం. ఫ్రెండ్లీ (స్నేహపూర్వక) పోలీసింగ్ అంటే పౌరులలో విశ్వాసం, సానుభూతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. అలాగే ప్రొఫెషనల్ (వృత్తిపరమైన) పోలీసింగ్ అంటే.. సామర్థ్యం, నీతి, క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నాలుగు సూత్రాలు ఆధునిక పోలీసింగ్ స్ఫూర్తిని నిర్వచిస్తాయి. మానవీయ కోణంలో పనిచేస్తూ.. నీతి, సామర్థ్యంలో రాజీపడకుండా పనిచేయాలి’ అని దిశానిర్దేశం చేశారు. బేసిక్ పోలీసింగ్ మరవొద్దు బేసిక్ పోలీసింగ్ తెలంగాణ పోలీసుల ఆపరేషనల్ వెన్నెముకగా ఉండాలని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. బేసిక్ పోలీసింగ్లో కీలకమైన బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇంటెలిజెన్స్ సేకరణ, అత్యవసర స్పందన, నేర నివారణ, గుర్తింపు, ప్రజా శాంతిభద్రతల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ తప్పక ఉండాలని చెప్పారు. కేవలం నేరగణాంకాల్లో తగ్గుదలే బేసిక్ పోలీసింగ్ విజయానికి కొలమానం కాదని, పోలీసులపై ప్రజల విశ్వాసం, నమ్మకం, సంతృప్తి ద్వారా కొలవాలని ఆయన నొక్కిచెప్పారు. బేసిక్ పోలీసింగ్ను ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేయడం ద్వారా పోలీసుల సామర్థ్యాన్ని పెంచవచ్చని అభిప్రాయ పడ్డారు.కొత్తగా ఎంపికైన డీఎస్పీల శిక్షణ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందని అదనపు డీజీ (ట్రైనింగ్) వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, రాచకొండ సీపీ సుధీర్బాబు, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారం
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ప్రజాస్వా మ్యానికి బలమైన ఆధారమని, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం అయ్యే శక్తిని ఇస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కుచట్టం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం తీసుకువస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం కొద్దిమంది చేతుల్లో కాకుండా ప్రజల చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు.సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్కోషి మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టం పౌరులను శక్తివంతం చేస్తుందన్నారు. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఈ పద్ధతి సరికాదని సూచించారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీఐ పనితీరు పురస్కారాలను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి మహేశ్దత్తు, సమాచార హక్కుచట్టం కమిషనర్లు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చేలా చూడాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక–2035’ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. వచ్చే పదేళ్లలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంపట్ల విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ డి. రాజి రెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునందిని సీఎం అభినందించారు.రూపాయి పెట్టుబడికి రూ. 4 లాభంగా...వచ్చే ఐదేళ్లలో రూ.921.40 కోట్లను సాగు పెట్టుబడిగా యూ నివర్సిటీ ఈ ప్రణాళికలో పేర్కొంది. అలాగే రూ. 942.50 కోట్లను బిందుసేద్యం కోసం పెట్టుబడిగా కేటాయించాలని నిర్దేశించింది. తద్వారా రూపాయి పెట్టుబడికి 4 రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. తా ము రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత పంటల విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల మేర ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ఖర్జూరం అంజీర్, నేరేడు, ఉసిరి, సీతాఫలం మొదలైన పండ్ల పంటలను 1.32 లక్షల ఎకరాల్లో 2030 వరకు ఎంపిక చేసిన జిల్లాల్లో సాగు చేయవచ్చని పేర్కొంది.అలాగే 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయలను పండించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన జిల్లాల్లో టమాటా, వంగ, క్యారెట్, క్యాబేజ్, దోస, కాలిఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర, చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలని పేర్కొంది. ఆఫ్ సీజన్ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలు పరచాలని, సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్య తకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధ తులను అవలంబించాలని ఈ ప్రణాళిక స్పష్టం చేసింది. -
సుంకాలు, నిబంధనలు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్లో గేమ్–ఛేంజర్ ప్రాజెక్టులుగా భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్రోడ్, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చరింగ్ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ – చైన్నై, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీలు రావాలి30 వేల ఎకరాల్లో హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో–9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసిన నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు కీలక భేటీ నిర్వహించారు. తాజ పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ లోపలా, బయటా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినా జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపైనా ఈ భేటీలో కేసీఆర్ సమీక్షించారు. ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పాటైన వార్ రూమ్ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం, అభ్యర్థి బలాబలాలను విశ్లేషించి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్ను కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు కేటీఆర్, హరీశ్రావు ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారని సమాచారం. -
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆ నోటిఫికేషన్ను రద్దుచేసింది. గురువారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, సాయంత్రానికి హైకోర్టు దానిని నిలిపేయటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గత నెల 29 నుంచి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కూడా తొలగిపోయింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల పూర్తిపాఠం అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో ఎస్ఈసీ జారీచేసిన షెడ్యూల్కు అనుగుణంగా గురువారం మొదటి విడత మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు జిల్లాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీచేశారు. గురు, శుక్ర, శనివారాల్లో నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా.. కేసు విచారణ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది. తొలి రోజు మొత్తం 16 జెడ్పీటీసీ, 103 ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు మకరందు తెలియజేశారు. గత నెల 29న జారీచేసిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్లను తదుపరి నోటిఫికేషన్ వచ్చేవరకు తక్షణం నిలుపుదల చేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఓటర్లకు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల పూర్తి పాఠం అందాకే...స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు నుంచి పూర్తి ఆదేశాలతో కూడిన ‘సైన్డ్ కాపీ’అందాకే తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది. తీర్పు కాపీలో ఎలాంటి కారణాలు పేర్కొన్నారో పరిశీలించిన తరువాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల పెంపు, పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న విషయం విదితమే. సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో ఈ అంశాలన్ని వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ప్రభుత్వపరంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకే అసెంబ్లీలో, బయటా, ఆర్డినెన్స్లు, బిల్లులు తేవడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు సాగించినందున వాటిని సాధించేవరకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్లాన్ ‘బీ’లేనట్టే ?కొన్నాళ్లుగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఇటు ప్రభుత్వంలో, అటు రాజకీయ పార్టీల్లో పెద్ద కోలాహలమే కొనసాగింది. నోటిఫికేషన్ కూడా రావటంతో ఇక ఎన్నికలు జరగటమే తరువాయి అనుకున్నారు. కానీ, చివరకు ఊరించి ఉసూరుమనిపించినట్లు హైకోర్టు తీర్పుతో అంతా చల్లబడ్డారు. నిజానికి బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేస్తే.. ప్లాన్ బీ కింద పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెంటనే వెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, హైకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాల్లో రిజర్వేషన్ల కోసం జారీచేసిన జీవో 9ను కాకుండా, ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, నోటిఫికేషన్పై స్టేకు గల అన్ని కారణాలను ఉత్తర్వుల్లో పొందుపరుస్తామని ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కావడంతో.. రిజర్వేషన్లను మార్చి పాత విధానంలో ఎన్నికలకు కూడా వెళ్లలేని స్థితిలో ప్రభుత్వం పడిపోయింది. హైకోర్టు స్టేను తొలగించాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని తీర్పు కాపీ వచ్చిన తరువాతే పరిశీలించాలని భావిస్తోంది. -
బీఆర్ఎస్, బీజేపీలే అడ్డుకున్నాయి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అడ్డుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో గురువారం గాం«దీభవన్లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2018లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ 50 శాతం మించకుండా చట్టం చేసిందని, అదే ఉరితాడుగా తయారైందని అన్నారు. 2019లో ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కులగణన చేసి జీవో ఇచ్చేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ఎంపిరికల్ డాటా అవసరమని హైకోర్టు చేసిన సూచనతోనే ప్రభుత్వం సైంటిఫిక్గా అధ్యయనం చేసి జీవో 9 తీసుకొచ్చిందన్నారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపితే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం దానిని చట్టం కాకుండా నిలిపివేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని బీసీల నోటికాడి ముద్దను దూరం చేశాయన్నారు.రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన: మహేశ్గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను గౌరవిస్తుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత పరిశీలించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ కుటిలయత్నాలు చేస్తున్నాయని, అడుగడుగునా బీసీలను అణగదొక్కిన పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం పొన్నం, జూపల్లి, వాకిటి శ్రీహరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. చట్టపరంగా, న్యాయపరంగా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి.. బీసీ బిల్లుకు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్కు పంపించామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం బాధాకరమని జూపల్లి అన్నారు. బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్ద లాగేసినట్లు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణలోని బీసీలంతా ఆలోచించాలని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. -
భగ్గుమన్న బీసీ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు నోటివరకు అందిన కూడును లాగేశారంటూ మండిపడ్డాయి. స్టే విధిస్తూ తీర్పు ఇచి్చన వెంటనే హైకోర్టు ప్రాంగణంలో బీసీ సంఘాల నేతలు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. ప్రధాన పార్టీలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బంద్ నిర్వహిస్తాం: ఆర్.కృష్ణయ్య ఈరోజు రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. జీవో ఇచి్చన వెంటనే కోర్టులో పిటిషన్ వేసినప్పుడు అదేరోజు స్టే ఇవ్వాల్సింది. కానీ అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత... చివరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు సమరి్పంచిన తర్వాత స్టే ఇవ్వడం దారుణం. ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వ వైఖరిని బట్టి భవిష్యత్ ప్రణాళిక చేపడతాం. రాష్ట్ర బంద్ నిర్వహించి జనజీవనాన్ని స్తంభింపజేస్తాం. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: జాజుల బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయి. శుక్రవారం హైదరాబాదులో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. చీకటి రోజు: జూలూరి గౌరీశంకర్రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకుండా జీవో 9ని ఇచ్చి అన్యాయం చేసింది. 42 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసగించింది. మరో మండల్ ఉద్యమం బీసీల రిజర్వేషన్ల కోసం మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని, అందరం కలిసి నేటి బంద్ను విజయవంతం చేద్దామని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు వ్యాఖ్యానించారు. అగ్రకుల పాలకుల మీద ఆధారపడకుండా స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం గురువారం రాత్రిలోగా నిర్ణయం ప్రకటించకుంటే బంద్ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలిపారు.హైకోర్టు వద్ద ఉద్రిక్తత చార్మినార్ (హైదరాబాద్): స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. హైకోర్టు ప్రాంగణం నుంచి రోడ్డుపైకి వచి్చన నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. స్పందించిన పోలీసు లు వారిని రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నినాదాలతో హైకో ర్టు పరిసరాలు మారుమోగాయి. బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కై తమ నోటికాడి ముద్దను లాక్కున్నాయంటూ కొందరు నేతలు నినాదాలు చేశారు. హైకోర్టులోనే ఉన్న మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, వి.హనుమంతరావు తదితరులు తీర్పు అనంతరం హైకోర్టు ప్రాంగణం నుంచి బయటికి వచ్చి బీఆర్ఎస్–బీజేపీ కుట్ర పన్నాయంటూ ధ్వజమెత్తారు. -
బియ్యం నిల్వలకు చోటేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోదాముల కొరత తీవ్రమ వు తోంది. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏయేటికాయేడు పెరుగు తూ, దేశానికి అత్యధిక మొత్తంలో బియ్యం అందిస్తున్న తెలంగాణలో వాటిని నిల్వ చేసేందుకు సరిపడా గోదాము లు లేకుండా పోయాయి. బియ్యంతోపాటు ఇతర ఆహార ధాన్యాలు, కేంద్రం నుంచి వచ్చే ఎరువుల నిల్వలకు కూడా గోదాములు లేని పరిస్థితి. కొత్తగా గోదాముల నిర్మా ణానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు నత్తన డకన సాగుతున్నాయి. వానాకాలం ధాన్యం, ఇతర పంటలు మా ర్కెట్లోకి వస్తే వాటి నిల్వ కోసం తిప్పలే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేయించేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ఆహా ర శాఖకు లేఖ రాశారు. ప్రత్యేక రైల్వే ర్యాక్స్ ఏర్పాటు చేసి గోదాముల్లో నిల్వ ఉన్న ఎఫ్సీఐ బియ్యాన్ని అవస రమైన రాష్ట్ర్లాలకు పంపించాలని కోరారు. దీనిపై కేంద్రం సాను కూలంగా స్పందించిందని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పి నప్పటికీ, కేంద్రం నుంచి ఇంకా రైల్వే ర్యాకులు రాలేదు. ఎక్కడ నిల్వ చేయాలి? రాష్ట్రంలోని అన్ని గోదాముల సామర్థ్యం కలిపి 66.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ). వీటిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థవి, అద్దెకు తీసుకున్నవి కలిపి మొత్తం సామర్థ్యం 29.50 ఎల్ఎంటీలు. ఎఫ్సీఐ అధీనంలో 22.61 ఎల్ఎంటీల నిల్వ సామర్థ్యం గల గోదాములు ఉండగా, వాటిలో 21.72 ఎల్ఎంటీ మేర బియ్యం ఉన్నాయి. రాష్ట్ర గిడ్డంగుల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేసే సన్న బియ్యం ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పర్యవేక్షణలో ఉన్న వాటిలో కూడా ఖాళీ లేదు. ప్రస్తుతం 6 ఎల్ఎంటీలు మాత్రమే ఖాళీగా ఉంది. ప్రైవేటు వ్యాపారులకు మరో 5 లక్షల టన్నుల ఎరువుల నిల్వకు గోదాములు కావాలి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లకు వచ్చే ధాన్యం, దాన్ని మరపట్టిస్తే వచ్చే బియ్యం, మొక్కజొన్నలు, శనగలు, వేరుశనగలు ఎక్కడ నిల్వ చేయాలనేది సమస్యగా మారింది. 80 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ లక్ష్యంరాష్ట్రంలో వరికోతలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోప్రారంభం కాగా, వచ్చే వారానికల్లా మరిన్ని జిల్లాల్లో మొదలుకానున్నాయి. ఈసారి రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 148.30 ఎల్ఎంటీల ధాన్యం దిగుబడి అవుతుందని, అందులో 80 ఎల్ఎంటీ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి నేరుగా రైస్మిల్లులకు పంపించి, మరాడించిన బియ్యం (సీఎంఆర్)ను ఎఫ్సీఐతోపాటు సీడబ్ల్యూసీ, ఇతర గోడౌన్లకు పంపిస్తారు. 80 ఎల్ఎంటీ ధాన్యాన్ని సీఎంఆర్గా మిల్లింగ్ చేస్తే 54 ఎల్ఎంటీ బియ్యం వస్తుంది. ప్రస్తుతం రైస్ మిల్లుల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ప్రక్రియ సాగుతోంది. తద్వారా 20 ఎల్ఎంటీల బియ్యం రానున్నాయి. వీటిని నిల్వ చేసేందుకు గోదాములు అవసరం. కాగా ప్రస్తుతం ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఉన్న 21 ఎల్ఎంటీల బియ్యం నిల్వలను ఖాళీ చేస్తే తప్ప మిల్లుల నుంచి వచ్చే బియ్యాన్ని నిల్వ చేసే అవకాశం ఉండదు. -
స్థానిక ఎన్నికలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్ను గురువారం సాయంత్రం హైకోర్టు నిలిపివేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండురోజులపాటు ఇరుపక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నోటిఫికేషన్ నిలిపివేయటానికి గల కారణాలతో కాపీ వెలువరిస్తామని పేర్కొంది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను విచారణకు అనుమతిస్తున్నామని ధర్మాసనం చెప్పింది. జీవో 9ని కొట్టివేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ పిటిషన్లలో తమ వాదనలూ వినాలని కోరుతూ కాంగ్రెస్ సహా కొందరు బీసీ నాయకులు దాదాపు 30 మంది ఇంప్లీడయ్యారు. ఈ పిటిషన్లపై సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది. తిరిగి గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ చేపట్టింది. అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. అందులో 98 శాతం మంది పాల్గొన్నారు. సర్వే తర్వాత 57.6 శాతం బీసీ జనాభా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. దీనిపై నియామకమైన వన్మ్యాన్ కమిటీ పూర్తిగా పరిశీలించి ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసి, అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చిలో ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కలి్పంచేందుకు వీలుగా.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 265(ఏ) సవరణకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను జూలైలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బిల్లును కూడా గవర్నర్కు పంపగా.. ఇవన్నీ అక్కడ పెండింగ్లో ఉన్నాయి. గడువులోగా గవర్నర్ ఆమోదం తెలపకుంటే చట్టంగా భావించాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. సర్వే, రిజర్వేషన్ల పెంపు, బిల్లుపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు’అని వివరించారు. సర్వేలో బీసీల శాతమేనా.. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతాన్ని కూడా తేల్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, అన్ని వర్గాలకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసిందని తెలిపారు. వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకే.. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందని ఏజీ తెలిపారు. ‘అధిక జనాభా ఉన్న వర్గాలకు పల్లెల్లో అధికారమిస్తే వారు లబ్ధిపొంది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదు. విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించి మాత్రమే ఆ తీర్పు అమలవుతుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆర్టీనెన్స్ జారీచేసిన తర్వాత మళ్లీ నోటీఫై చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉంది. ప్రజామోదం మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవద్దు. ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేసింది (నోటిఫికేషన్ ప్రతులను సమర్పించారు). ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అడ్డుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఈసీ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరికాదు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దు’అని విజ్ఞప్తి చేశారు. 15 శాతం కులాలకు 33 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది... ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును ప్రస్తావించారు. ‘పిటిషనర్లకు రిజర్వేషన్లను సవాల్ చేస్తే ప్రాథమిక హక్కు లేదు. ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50 శాతం సీలింగ్ లేదు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారు. ఈ 85 శాతం జనాభాకు 67 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. 15 శాతం ఉన్న ఇతర కులాలకు 33 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది. ఈ రిజర్వేషన్లతో ఫార్వర్డ్ కులాలకు వచ్చే నష్టం లేదు. పిటిషనర్లకు పిటిషన్లు వేసే అర్హత లేదు. వాటిని కొట్టివేయాలి’అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ జారీచేసిన నోటిఫికేషన్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, హైకోర్టు ధర్మాసనం ఇన్ప్యూన్డ్ నోటిఫికేషన్పై స్టే అని చెప్పడటంతో దేన్ని నిలిపివేశారనేదానిపై సందిగ్ధం నెలకొంది. అధికారిక ఉత్తర్వుల కాపీ వస్తేగానీ కోర్టు ఆదేశాలపై స్పష్టత రానుంది. -
‘బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించింది’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్పై కాంగ్రెస్ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం... తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేసేలా మా కార్యాచరణ ఉంటుంది.ఢిల్లీలో మేమంతా ధర్నా చేసిన రోజు బిఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కు చట్టబద్ధంగా చేయవలసిన పక్రియ అంతా ప్రభుత్వం చేసింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థ ల ఎన్నికల పక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బిఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంటె ఎందుకు కులగణన చేయలేదు. బీసీలు అమాయకులు కాదు...బీసీ రిజర్వేషన్ల పెంపు ఎంత కఠినమైనదో తెలుసు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియ చేపట్టాం’ అని తెలిపారు.పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసింది. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని నిలదీశారు.రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైంది కేటీఆర్బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం తేటతెలలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారని, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారని, కేంద్రంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిందన్నారు. అందుకే ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం కోర్టు ఆపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక… ఎన్నికల వాయిదా కోసం బిసి రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని విమర్శించారు కేటీఆర్. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
హైదరాబాద్లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.. డ్రగ్స్ మూలాలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. తాజాగా హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటమే ఇందుకు ఉదాహరణ. సుమారు 10 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఒక అపార్ట్మెంట్ వేదికగా ఐదురుగు కలిసి డ్రగ్స్ తయారీ చేస్తున్న సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. ఈ మేరకు సోదాలు నిర్వహించింది.జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయి దత్తా రెసిడెన్సీలో 220 కేజీల డ్రగ్స్ను ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని అరెస్ట్ చేయగా, ఒకరు పరారయ్యారు. ఈ డ్రగ్స్ విలువ స్థానిక మార్కెట్లో రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అదే అంతర్జాతీయ మార్కెట్లో అయితే రూ. 70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అపార్ట్మెంట్ వేదికగా డ్రగ్స్ తయారు చేస్తున్న వారిలో వాస్తవాయి శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్, మద్దు వెంకట కృష్ణ, ఎం ప్రసాద్, ముసిని దొరబాబులు ఉన్నారు. వీరంతా కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు కాగా, హైదరాబాద్లో ఉంటూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రైతుల న్యాయ పోరాటానికి కోర్టు అండ.. ఆర్డీవో కార్యాలయం జప్తు
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు. -
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత
సాక్షి,హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గురువారం(అక్టోబర్ 9వ తేదీ) హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘ 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్ రెడ్డి. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం’ అని వివరించారు. ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంంగంలో ఎక్కడా లేదన్నారు. ‘ తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతం మాత్రమే. ఆ 15 శాతం మందికి 33 శాతం సీట్లు ఇస్తున్నాం’ అని హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.ఇది కూడా చదవండి:తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట -
తెలంగాణ: నామినేషన్లు షురూ.. ఎస్ఈసీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయ్యింది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అందులో పేర్కొంది. ఆ వెంటనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో.. నామినేషన్లు వేయాలనుకునేవాళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక సూచనలు చేసింది.జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలి. జడ్పీటీసీ నామినేషన్ వేయాలనుకున్న జనరల్ కేటగిరీ అభర్థి.. రూ.5 వేలు, అదే రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి.ఎన్నికల నియమావలికి అనుగుణంగా నామినేషన్ సందర్బంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గం. వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలి. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది. 15వ తేదీ మధ్యాహ్నాం 3గం.లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే.. ప్రచార నిబంధనలు, ఆచరణ నియమావళి త్వరలో విడుదల అవుతుంది.ఇదీ చదవండి: తెలంగాణ ఈ ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి! -
బీఆర్ఎస్కు మా బలమేంటో చూపిస్తాం: నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు. -
‘పోస్ట్’ చేసే ముందు ఒక్క క్షణం!
● మనోభావాలను దెబ్బతీయొద్దని హితవు ● తప్పుడు సమాచార ప్రచారం వద్దని హెచ్చరిక డిజిటల్ అవేర్నెస్ చేపడుతున్న కొత్త కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా డిజిటల్ అవేర్నెస్కు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి హ్యాష్ట్యాగ్ పాస్ బిషోర్ పోస్టు (పోస్టు చేసే ముందు ఒక్కక్షణం) అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన బుధవారం కీలక సందేశాన్ని పోస్టు చేశారు. సోషల్మీడియా ప్రతి ఒక్కరినీ శక్తిమంతుల్ని చేసిందని, సమాచారాన్ని పంచుకోవడానికి, ఎదుటి వారిని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ విషయాన్ని లేదా సమాచారాన్ని సెండ్ (పంపడం)... షేర్ చేయడానికి ముందు ఒక్క క్షణం ఆగి మూడు విషయాలను ఆలోచించాలని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ పోస్టు ఎవరినైనా బాధ పెడుతుందా..? ఇందులోని సమాచారం నిజమైనదేనా? సోషల్మీడియాలో ఓ వ్యక్తిని ఉద్దేశించి పెట్టే సమాచారం ఆయన ఎదురుగానూ వ్యాఖ్యానించగలవా? అనేవి సరి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా షేర్ చేసిన కొన్ని అంశాలు ఎదుటి వారి కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయనే విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ రెస్పాన్స్బుల్గా ఉండాలని, ఏదైనా షేర్ చేసేముందు కచ్చితంగా ఆలోచించాలని సజ్జనర్ స్పష్టం చేశారు. వారంలో 85 లక్షల వ్యూస్.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే సజ్జనర్ తన ఖాతాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. యువతకు సైతం దగ్గర కావాలనే ఉద్దేశంతో ‘ఎక్స్’తో పాటు ఇన్స్ట్రాగాంలోనూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో హ్యాష్ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఓ ఉద్యమాన్నే నడిపి ప్రత్యేక చట్టం కావడానికి తన వంతు కృషి చేశారు. యువతను ఈయన సొంత ఇన్స్ట్రాగాం ఖాతాను గడిచిన వారం రోజుల్లో 85 లక్షల మంది వీక్షించారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ఫొటోకు ఇన్స్ట్రాగాంలో 12 లక్షలు, ‘ఎక్స్’లో 2 లక్షల వ్యూస్ వచ్చాయి. సజ్జనర్ ‘ఎక్స్’ ఖాతాకు వారం రోజుల్లో 15 లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సోషల్మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని నగర పోలీసు అధికారిక హ్యాండిల్స్కు ట్యాగ్ చేస్తున్న ఆయన ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్ వద్ద ఓ విదేశీ మహిళను వేధించిన వీడియో ఇటీవల వైరల్గా మారింది. దీన్ని క్షేత్రస్థాయి అధికారులకు పంపిన సజ్జనర్ పూర్తి స్థాయి విచారణ చేయించి మూడేళ్ల క్రితం నాటిదిగా నిర్ధారించారు. -
ఎన్నికల ప్రవర్తన నియమావళి.. ‘జూబ్లీహిల్స్’ వరకే
షేక్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఆర్ఓ కార్యాలయం సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తన నియమావళి)పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రవర్తన నియమావళికి లోబడే ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. నియమావళి ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రాపర్టీలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ లపై ప్రచార ప్రకటనలు పెడితే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే తొలగించిన ప్రదేశాలలో అనుమతి లేకుండా మళ్లీ ప్రచార ప్రకటనలు పెడితే బాధ్యులపై కేసులతో పాటు వాటిని తొలగించేందుకయ్యే ఖర్చును కూడా బాధ్యుల పార్టీ ఖాతాల్లో వేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే .. ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితో పాటు మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నందున కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. షేక్పేట తహసీల్దార్ ఆఫీస్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వ రావు, రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, రాజకీయ పార్టీల తరఫున కె.నందేశ్ కుమార్ (బీఎస్పీ), కొల్లూరు పవన్ కుమార్, ఎల్.దీపక్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐఎం), పి.రాజేశ్ కుమార్, మహ్మద్ వాజీద్ హుస్సేన్, ఎ.రాఘవేందర్ (కాంగ్రెస్), ఎ. శ్రీనివాస్ గుప్తా, కె. మాధవ్, కిషోర్ గౌడ్ (బీఆర్ఎస్), ప్రశాంత్ రాజ్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఎంఐఎం) పాల్గొన్నారు. 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో రాజకీయ ప్రచార ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ,జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
తుపాకీ విక్రయానికి పండ్ల వ్యాపారుల యత్నం
పట్టుకున్న సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ సాక్షి, సిటీబ్యూరో: ఝార్ఖండ్ నుంచి వలస వచ్చి నగరంలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తుపాకీ విక్రయానికి యత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ అతడితో పాటు మరొకరిని పట్టుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఝార్ఖండ్కు చెందిన విజయ్ యాదవ్ నగరానికి వలసవచ్చి లింగంపల్లిలో నివసిస్తున్నాడు. వివిధ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పండ్లు విక్రయిస్తూ జీవస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు నాటు తుపాకుల్ని తీసుకువచ్చి విక్రయించాలని భావించాడు. మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి అక్కడి సోను కుమార్ నుంచి రూ.58 వేలకు 0.7 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్ ఖరీదు చేసుకువచ్చాడు. దీన్ని నగరంలోని అసాంఘిక శక్తులకు అమ్మడానికి సహకరించాల్సిందిగా సంతోష్నగర్లో ఉంటున్న తోటి పండ్ల వ్యాపారి బుంటి కుమార్ యాదవ్ను కోరారు. కొన్ని రోజులుగా ఇతగాడు ఆ అక్రమ ఆయుధం అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏసీపీ జి.వెంకటేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఫలక్నుమా ప్రాంతంలో వలపన్ని బుంటి కుమార్ను పట్టుకుంది. విజయ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించింది. -
ఆగాలి కాలుష్యం
నగరంలో ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరింది. ఫలితంగా కన్ను, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్నిరకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ గాలి నాణ్యతను పెంచడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలమవుతోంది. నగర దారులపై పాదచారులు, మోటారు సైకిల్, బస్సుల్లో ప్రయాణించే వారికి నరకప్రాయంగా మారుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిర్మాణ, పారిశ్రామిక ప్రాంతాల్లో అవస్థలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం సమయంలో కాస్త ఎండ కాయడంతో తడారిపోయి వాహనాలు వెళ్లినపుడు ఇసుక, మట్టి, ధూళి కణాలు సాధారణ ప్రయాణికుల కళ్లలో పడుతున్నాయి. ఎల్బీనగర్, కోకాపేట్, ఉప్పల్, మాదాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం వంటి పారిశ్రామిక వాడల్లోనూ వాయు కాలుష్యం గరిష్ట స్థాయిలను సూచిస్తోంది. సాధారణంగా పీఎం10 ధూళి కణాలు 0 నుంచి 50 ఉండాల్సి ఉండగా, నగరంలోని కోకాపేట్ ప్రాంతంలో బుధవారం 232గా నమోదయ్యింది. పీఎం2.5 సోమాజిగూడలో 200గా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్మాణ రంగం వృద్ధిలో ఉన్న ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో లారీలు మట్టి, ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇతరాలు తరలించే క్రమంలో కనీస నిబంధనలు పాటించడంలేదు. దీనిపై అటు జీహెచ్ఎంసీ, ఇటు కాలుష్య నియంత్రణ మండలి ఎవరూ పట్టించుకోవడం లేదు. చర్యలు అంతంతే.. వాయు కాలుష్యానికి కారణమవుతున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అడపదడప తనిఖీలు చేపట్టడం, నోటీసులిస్తున్నారు. అరుదైన సందర్భాల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం కొన్నాళ్లకు తిరిగి అదే పరిశ్రమ రీఓపెన్కు ఎన్ఓసీ జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అధికారుల తీరు పై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేయని పరికరాలు.. వాయు నాణ్యత కొలతల కోసం కాలుష్య నియంత్ర ణ మండలి ఏర్పాటు చేసిన పరికరాలు కొన్ని చోట్ల పనిచేయడం లేదు. బుధవారం నాచారం, ఐఐటీహెచ్ కంది ప్రాంతాల్లో గాలి నాణ్యత నివేదికలే అందుబాటులో లేవు. నగరం నడిబొడ్డున ఉన్న సన త్నగర్లో పీఎం 10 వివరాలు నమోదు చేయలేదు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. గాలిలో దూళికణాల సంఖ్య పెరిగినపుడు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకై టిస్, ఆస్తమా జబ్బుల ప్రభావం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి ఎక్కువ ఇబ్బంది. చల్లని కాలం, ఆపై గాలిలో నాణ్యత తగ్గితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సైతం ఈ గాలి ప్రమాదమే. తొలుత జలుబు చేసి, అది న్యుమోనియాగా మారొచ్చు. ధూళి కణాలు కళ్లలో పడినా ఇబ్బందికరమే. మోటారు సైకిల్పై వెళ్లే సమయంలో కళ్లజోడు ధరించడం మంచిది. – ప్రొ.టి. ప్రమోద్ కుమార్, పల్మనాలజిస్టు ఇటీవల వర్షాలతో రోడ్లపై పేరుకుపోయిన ఇసుక, మట్టి కళ్లల్లోకి దుమ్ము, ఇసుక రేణువులు శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు -
కోడ్ కూసింది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్ నియోజక వర్గంలోని ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను బల్దియా సిబ్బంది తొలగిస్తున్నారు. బుధవారం రాజకీయ నేపథ్యమున్న విగ్రహాలను దుస్తులతో మూసివేశారు. ఆయా కూడళ్లలోని పార్టీ జెండాలను సైతం తొలగించారు. ఇప్పటికే బస్టాప్లలో ఉన్న ఫ్లెక్సీలను, బస్తీల్లో ఉన్న రాజకీయ నేతల ఫ్లెక్సీలను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. మరో వైపు గోడలపై రాసిన రాతలను చెరిపేసేందుకు రంగులను తీసుకొచ్చి సిబ్బంది శ్రమిస్తున్నారు– ఫిలింనగర్ జూబ్లీహిల్స్లో.. -
గ్లెండేల్ అకాడమీ విద్యార్థులకు సీఎం అభినందన
బండ్లగూడ: సింగపూర్లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే(జీఈడీ) 2025లో మిడిల్ స్కూల్ విభాగంలో సన్సిటీలోని గ్లెండేల్ అకాడమీ విద్యార్థులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులను అభినందించి సన్మానించారు. గ్రీన్ గ్లెన్ గార్డియన్స్ బృందంలో ఆరాధ్య దుద్దిళ్ల శ్రీపాదరావు(6వ తరగతి), నిగమా పెన్మెట్సా(6వ తరగతి), సయ్యద్ అలిజా జైఆమా(6వ తరగతి), రాహిని సమ్హిత వర్మ దంతులూరి(7వ తరగతి), జేడెన్ డి రోజారియో(7వ తరగతి) ఉన్నారు. ఈ బృందం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులతో పోటీపడ్డారు. ది గుడ్ ఫుడ్ మూవ్మెంట్ అనే తమ ప్రాజెక్టును కై జెన్ (నిరంతర అభివృద్ధి) అనే అంశం కింద ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారు సేంద్రియ వ్యవసాయం, స్ధిరమైన వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల కలిగి హానికర ప్రభావాలు, పర్యావరణపరమైన బాధ్యతాయుత పద్ధతుల అవసరం, పర్యావరణ అవగాహన పెంపు కోసం ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ... తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలతో స్థిరమైన అభివృద్ధి పట్ల కట్టుబాటుతో తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మిను సలూజా తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మధ్యలో ఆగిన బస్సు
గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు నిలిచిపోవడంతో సీవీఆర్ న్యూస్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు జర్నలిస్టు కాలనీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్ నెం. 45 జంక్షన్లోని బారికేడ్లను తొలగించి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళే వాహనాలను ముందుకు పంపించారు. బస్సును టోయింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కదలకపోవడంతో మెకానిక్ను తీసుకొచ్చి బస్సుకు రిపేర్ చేయించి తరలించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ నర్సింగ్రావు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పంపించే వరకు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై ఫిర్యాదు
పహాడీషరీఫ్: ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖాజా పాషా కోరారు. ఈ మేరకు బుధవారం పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కలిసి మెలసి ఉంటున్న ప్రజల నడుమ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎన్నో మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ను కలిసిన వారిలో పార్టీ నాయకులు అబ్దుల్ ఖదీర్, మహ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారంతో పాటు ఇంటి స్థలం
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో టీజీఐఐసీకి భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, టీజీఐఐసీ అధికారుల సమక్షంలో బుధవారం భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని బాధితులు కోరారు. పరిహారం తీసుకున్న వారి జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్మినేడులో వెంచర్ ఏర్పాటు చేసి పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యుడు శ్రావన్, ఎల్మినేడు భూ కమిటీ నాయకులు శ్రీకాంత్రెడ్డి, మహేందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ గేమింగ్ యాప్తో మోసం
● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నకిలీ గేమింగ్ ఫ్లాట్ఫామ్లతో అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్ నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ శోభన్ కుమార్తో కలిసి సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ బుధవారం వివరాలు వెల్లడించారు. నవీన్కుమార్, సందీప్ కుమార్, పృథ్వీ రామరాజు, పవన్ వెంకట నాగభరద్వాజ్, రామాంజనేయులు ముఠాగా ఏర్పడి టెలిట్రాం, వాట్సాప్ గ్రూప్లలో డాడ్జ్ బుక్777 అనే నకిలీ గేమింగ్ ఫ్లాట్ఫామ్ను ఫ్లాట్ఫామ్లను నిర్వహించేవారు. బాధితులను నుంచే కాజేసే సొమ్మును నిర్వహించేందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాల కోసం ఈ ముఠా నకిలీ పేర్లు, చిరునామా, ఆధార్ కార్డ్లతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లలో 120కు పైగా బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. గేమింగ్ ఫ్లాట్ఫామ్లలో నకిలీ లాభాలను చూపించి, బాధితుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసేవారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివిధ ఖాతాలలో ఉన్న రూ.14 లక్షల సొమ్ముతో పాటు రెండు ల్యాప్టాప్లు, 30 సెల్ఫోన్లు, చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్లు, సిమ్కార్డ్లను స్వాధీనం చేసుకున్నారు. -
Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలు క్లిష్టంగా మారాయి. పార్టీ మారామని చెప్పుకోలేని పరిస్థితి ఓవైపు.. కొత్త కండువా వేసుకుని తమ అనుచరులకు మద్దతుగా ప్రచారం చేయలేని పరిస్థితి మరోవైపు వీరిని ఇబ్బంది పెడుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు, స్పీకర్ విచారణ ఇరకాటంలోకి నెట్టాయి. సంస్థాగతంగా పట్టుకోసం తమ అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బరిలోకి దించేందుకు ఇప్పటికే అధిష్టానానికి పలు పేర్లను సిఫార్సు చేసినప్పటికీ.. అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వద్ద వీరిద్దరూ సీఎం సమక్షంలో కండువా కప్పుకొన్న ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వీరు స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్తే న్యాయస్థానంతో పాటు స్పీకర్కు నేరుగా సాక్ష్యం అందించిన వారవుతారనేది అక్షర సత్యం. అభివృద్ధి కోసం అటుఇటు..! చేవెళ్ల నియోజకవర్గంలో మెయినాబాద్, షాబాద్, శంకర్పల్లితో పాటు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాలున్నాయి. జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ, 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయ ప్రస్థానం తన సొంత మండలమైన నవాబుపేట నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంపై పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 2024లో కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కారు దిగి.. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించడం, బంతి స్పీకర్ కోర్టులోకి నెట్టడం, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ సదరు ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. నెత్తిన అనర్హత కత్తి వేలాడుతున్న నేపథ్యంలోనే విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. జెడ్పీ పీఠం కోసం.. ఈసారి జిల్లా పరిషత్ పీఠాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడం తన నియోజకవర్గంలోని షాబాద్ ఎస్సీ మహిళకు, చేవెళ్ల, శంకర్పల్లి మండలాలు ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో షాబాద్ లేదా చేవెళ్ల నుంచి తన కోడలిని నిలబెట్టి జెడ్పీ చైర్పర్సన్ సీటు దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్న ట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ కండువా వేసుకుని నేరుగా ప్రచారం చేయలేని సంకటం ఎదురైంది. ప్రకాశ్గౌడ్దీ ఇదే పరిస్థితి.. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాల్లోని రాజేంద్రనగర్ మండలం పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లింది. గండిపేటలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. కేవలం శంషాబాద్ మండలంలోనే స్థానిక సంస్థలున్నాయి. ఇక్కడ 21 గ్రామ పంచాయతీలు, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సైతం రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఇప్పటి వరకు తనను నమ్ముకుని, వెంట వచి్చన అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఒకవేళ వీరికి అవకాశం వచి్చనా నేరుగా ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. -
ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉద్రిక్తత
బీఆర్ఎస్ నేతల బస్భవన్ అప్డేట్స్.. వినతి పత్రం అందజేత..పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని కోరిన బీఆర్ఎస్ నేతలు. ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?: హరీష్ ఫైర్హరీష్ రావు కామెంట్స్..ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం.ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం.నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు.ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు.భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు.ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు.పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డివాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి.మెట్రో రైలును ఆగం చేసిండు.కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా?ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?ఇది ప్రజా పాలనా లేక ప్రజా పీడననా?రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్లు ఉంది.ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నడు.మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ?టికెట్ ధరల పెంపు పై బస్సులో ప్రయాణించి ఆర్టీసి ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా?తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా పై కఠిన ఆంక్షలు.ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు.ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావు.మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు.ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.అడ్డగోలుగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాంకమీషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చెయ్యినిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు.ఆర్టీసీ ధరలు పెంచితే మెట్రో ఎక్కుతారు అని రేవంత్ ఆలోచన..ఆర్టీసీ అమ్మాలని,ప్రైవేట్ పరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది.ఎలక్ట్రానిక్ బస్ ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది..ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్స్ అమ్మకానికి పెట్టారు.బస్ స్టాండ్ లు కూడబెట్టి 1500 కోట్లు తెచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమేనా కాంగ్రెస్ పనికార్గో ను అమ్మి ప్రైవేట్ చేయాలని చూస్తుందిపేదల నడ్డి విరుస్తున్నారు.రాహుల్ గాంధీ రాజ్యాంగం గూర్చి మాట్లాడుతారు..రేవంత్ రెడ్డి రాజ్యాంగ భక్షణ జరుగుతుంది.ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఆర్టీసీ ధరలు తగ్గించేవరకు బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుంది.కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ "చలో బస్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చినంమహిళలకు ఉచితం అని పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేస్తే.. బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా?పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని… pic.twitter.com/SPcfWGMspW— BRS Party (@BRSparty) October 9, 2025 ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉద్రిక్తతబస్ భవన్కు వెళ్ళే మారాన్ని మూసేసిన పోలీసులుసంధ్య థియేటర్ దగ్గర బారీకేడ్స్ ఏర్పాటుకేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేసిన పోలీసులుఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు అనుమతిపెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి మెమొరాండం ఇవ్వనున్న కేటీఆర్, హరీష్ తోపులాటపోలీసులకు, బీఆర్ఎస్ కేడర్కు తోపులాట, వాగ్వివాదంబారికేడ్స్ తోసేసుకుని బస్ భవన్ వైపు వెళ్తోన్న బీఆర్ఎస్ నేతలు, క్యాడర్సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు 👉బస్ భవన్ బయలుదేరిని కేటీఆర్, హరీష్ రావు👉హైదరాబాద్లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS Chalo Bus Bhavan) గురువారం ‘చలో బస్భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గురువారం ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.👉ఇక, చలో బస్భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఇదేనా ప్రజాపాలన?ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు మీదనిరసన తెలుపకుండా అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/uwMIm6FhN7— BRS Party (@BRSparty) October 9, 2025👉ఈ సందర్భంగా కేటీఆర్ స్పందించారు.‘పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని.. అందుకు కోరాలని అనుకున్నాము. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాము. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు.. మా పార్టీకి కొత్త కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి.. ఎవరీ నవీన్ యాదవ్..?
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయింది. రెండుసార్లు పోటీ ⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. ⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది. మజ్లిస్ మద్దతు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటిస్తున్న కారణంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించడంతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి మంత్రంతో విజయావకాశాలను సుగమం చేసుకున్నా.. అభ్యర్థిత్వం ఖరారులో మాత్రం మజ్లిస్ పార్టీ జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లను కాదని యువనేతకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. -
కిడ్నాప్ చేసి...తుపాకీతో బెదిరించి..
వెంగళరావునగర్: రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఆఫీసుకు తీసుకెళ్లి, అనంతరం కిడ్నాప్ చేసి తుపాకులతో బెదిరించి నగదు డిమాండ్ చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్కుమార్ బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 6న తన స్నేహితుడితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నడిచి వెళుతుండగా వెంకట్స్వరూప్ అనే వ్యక్తి అమీర్పేటలోని తన ప్లాట్కు రమ్మని మనోజ్కుమార్ను కారులో తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్కుమార్పై దాడిచేసి తుపాకులతో బెదిరించి ఎల్లారెడ్డిగూడలోని శివసాయి అపార్ట్మెంట్స్కు తీసుకెళ్ళారు. అక్కడ అతడిని బంధించి తమకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి భార్య, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించాడు. బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టగా వెంకటస్వరూప్ మరోసారి మనోజ్కుమార్ భార్యకు ఫోన్ చేసి మైత్రీవనం 1039 పిల్లర్ వద్దకు నగదు, తీసుకురావాలని చెప్పాడు. ఆమె పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళగా ముగ్గురు నిందితులు బైక్పై పారిపోగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు. -
మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో ఉపసంహరణ ప్రక్రియ పూర్తవు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు వేగంగా ఉండటంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడుల మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రానున్న రెండు రోజులు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుసాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్1 నుంచి)లో రాష్ట్రవ్యాప్తంగా 77.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 102.37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 16 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సీజన్తో పోలిస్తే ఈసారి 4 శాతం అధికవర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి యాచారం/మాడ్గుల: వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన జోగు మనీశ్ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మాడ్గుల మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లికి చెందిన బుచ్చయ్య (56) పశువులకు మేత వేయడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. -
సకుటుంబ సమేతంగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు అందించే కంటెంట్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నేరప్రవృత్తితో కూడిన, అశ్లీల సంబంధ వెబ్ సిరీస్లను రూపొందించి ప్రసారం చేయడం ద్వారా వీక్షకులను ఆకర్షించిన ఓటీటీ ప్లాట్ఫామ్లు.. ఇటీవల కాలంలో మాత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విభిన్న ఇతివృత్తాలతో ముందుకొస్తున్నాయి.సబ్స్క్రైబర్లను పెంచుకోవడంపై తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదితో పాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలపై ఓటీటీలు ప్రత్యేక దృష్టిపెట్టి ఈ మేరకు మార్పుచేర్పులకు శ్రీకారం చుడు తున్నాయి. ఇందులో భాగంగా దక్షిణాది భాషలకు సంబంధించిన కంటెంట్కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు కుటుంబ, స్నేహపూర్వక డ్రామాలు, ప్రేమకథలు, కామెడీలతో కూడిన కంటెంట్ను అందించడంపై దృష్టిపెట్టాయి. స్థానిక భాషల కంటెంట్కు డిమాండ్... ఓటీటీల్లో గతంలో ప్రసారమైన సినిమాలు, వెబ్సిరీస్లు ఆంగ్లం లేదా హిందీకే పరిమితమవగా ఇటీవల కాలంలో స్థానిక భాషల్లో కంటెంట్ను వీక్షించేందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తమ సొంత సంస్కృతి, భాషను ప్రతిబింబించే షోలు, సినిమాలను వీక్షించాలని సబ్స్క్రైబర్లు కోరుకుంటున్నారు. దీంతో తెలుగు, తమిళం, మరాఠీ,బెంగాలీ సహా ఇతర భాషల్లో భిన్నమైన కంటెంట్ను అందించడానికి ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం కంటెంట్ సృష్టికర్తలతో జతకడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, ఆభా, హోయిచాయ్ వంటి ప్లాట్ఫామ్లు ప్రాంతీయ భాషల్లో స్థానిక కంటెంట్తో షోలు, సినిమాలను అందించడంలో ముందువరసలో నిలుస్తున్నాయి. బెంగాలీ షోలకు ప్రసిద్ధి చెందిన హోయిచోయ్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన బెంగాలీలను కూడా తన సరికొత్త కంటెంట్తో వీక్షకులను ఆకర్షించడం ద్వారా సబ్స్రై్కబర్ల సంఖ్యను పెంచుకుంది. చౌపాల్ పంజాబీ, హర్యాన్వి, భోజ్పురి ప్రేక్షకులకు ప్రాంతీయ అభిరుచులతో లోతుగా ప్రతిధ్వనించే కథలను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ స్థానిక భాషల్లో సినిమాలను నిర్మించడంతోపాటు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, టాక్ షోలను అందిస్తున్నాయి. ఈటీవీ విన్, సన్ నెక్ట్స్æ, ఆహా వంటి ఓటీటీలు తెలుగు, తమిళ కంటెంట్ను రూపొందించి విడుదల చేయడంపై దృష్టిపెడుతున్నాయి. ఇక జియో హాట్స్టార్, సోని లివ్ తదితర ఓటీటీలు సినిమాలు, డ్రామాలు, వెబ్ సిరీస్లతోపాటు క్రికెట్ సహా వివిధ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.వచ్చే 12–18 నెలల్లో దక్షిణాది భాషల్లో ఒరిజినల్ స్ట్రీమింగ్ టైమింగ్ను జియో హాట్స్టార్ డబుల్ చేయనుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సైతం దక్షిణాది సంబంధ కంటెంట్ను మరింతగా అందించడంపై దృష్టిసారిస్తోంది. బిగ్బాస్ సౌత్ ఓటీటీని నాలుగు దక్షిణాది భాషల్లో ప్రజలు 400 కోట్ల గంటలకుపైగా వీక్షించారంటే ప్రాంతీయ భాషల్లో షోలకు ఎంత ఆదరణ లభిస్తోందో స్పష్టమవుతోంది.ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే... ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మీడియా ప్రసార మాధ్యమం. ఇందులో ఇంటర్నెట్ ద్వారా కంటెంట్ను అందిస్తారు. వీక్షకులు సంబంధిత యాప్లను నిర్ణీతరుసుము చెల్లించి సబ్స్రై్కబ్ చేసుకొని వాటిల్లోని సినిమాలు, సిరీస్లు సహాఆయా యాప్లలో ఉండే కంటెంట్ను ఎన్ని సార్లయినా చూడొచ్చు. -
జూబ్లీహిల్స్ కోసం బీఆర్ఎస్ వార్ రూమ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార వ్యూహం అమలు, పార్టీ నేతలు, ప్రచార బృందాల నడుమ సమన్వయం తదితరాల కోసం ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వార్ రూమ్ ఇన్చార్జిలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వ్యవహరిస్తారు. ఈ నెల 12 నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పండితుల సూచనల మేరకు మంచి ముహూర్తం చూసుకుని మాగంటి సునీతా గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ నేత రావుల శ్రీధర్రెడ్డి తదితరులతో పాటు మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా హాజరయ్యారు. నేడు, రేపు బూత్ కమిటీలతో భేటీలుబీఆర్ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్ షోలు, రోజూ వారీ ప్రచార షెడ్యూలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. వార్ రూమ్ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార వ్యూహానికి పదు ను పెట్టాలని నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో బూత్ కమిటీలతో డివిజన్ ఇన్చార్జిలుగా వ్యవహరి స్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలు నిర్వ హించి ప్రచార వ్యూహాన్ని వివరిస్తారు. ఈ నెల 10 వ తేదీలోగా బూత్కమిటీల సమావేశాలు పూర్తి చేసి 12వ తేదీ నుంచి ప్రచార పర్వంలో అడుగు పెట్టా లని కేటీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని పక్షంలో ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కూడా ఉప ఎన్నిక ప్రచారంలో భాగస్వాములను చేస్తారు. ప్రచారం ముగింపులో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
అభ్యర్థులు స్థానిక ఓటరులై ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తొలిదశ స్థానిక ఎన్ని కలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానుండగా, వెనువెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్ల దాఖలు విషయంలో అభ్య ర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.» ఫారం–4 (అనుబంధం–3)లో ఉన్న నమూనాలో నామినేషన్ పత్రం ఉండాలి» ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారు సంబంధిత ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి» పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరి పేర్లు మండల, జిల్లా పరిషత్ ఓటర్ల జాబితాల్లో ఉండాలి» ఒక స్థానానికి ఒక అభ్యర్థిని వివిధ వ్యక్తులు ప్రతిపాదించవచ్చు» ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేయొచ్చు కాని ఒక దాంట్లోనే పోటీ చేయాలి.» ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయొచ్చు» రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ప్రదేశంలో నామినేషన్లు అందజేయాలి» గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ లేదా రిజర్వ్డ్ చిహ్నం కలిగి రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేస్తున్న అభ్యర్థి, నోటిఫికేషన్ ఫారమ్–2లో ఆ పార్టీ పేరు నమోదు చేయాలి. రాజకీయ పార్టీ నుంచి పొందిన అభ్యర్థిత్వ ధ్రువీకరణ ఫారమ్–బీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ సాయంత్రం 3 గంటల లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి» రిజర్వ్ గుర్తు లేని రిజస్టర్డ్ రాజకీయ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎస్ఈసీ సూచించిన రిజర్వ్ కాని (ఫ్రీ) చిహ్నాల జాబితా నుంచి ప్రాధాన్యతా క్రమంలో మూడు చిహ్నాలను ఎంపిక చేసుకుని నామినేషన్ పత్రంలో సూచించాలి నామినేషన్ ఫారానికి జత చేయాల్సిన డిక్లరేషన్లు» ఎస్సీ, ఎస్టీ, బీసీ హోదాకు సంబంధించిన డిక్లరేషన్లు» ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రిజర్వ్ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారం (అనుబంధం–3తో సంబంధిత కులం, తెగ, తరగతికి చెందినవారిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.» ఎస్సీ, ఎస్టీ, బీసీఅభ్యర్థులు పోటీకి డిపాజిట్ చేసే మొత్తంలో రాయితీకి అర్హులు» రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు తాను స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఫారమ్–5లో ప్రచురించాలి. -
జూబ్లీహిల్స్కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ శాసనసభ నియో జకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తన అభ్య ర్థిగా నవీన్యాదవ్ పేరును ప్రకటించింది. కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపించినా చివరకు యువ నాయకుడు నవీన్ యాద వ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక అభ్యర్థిపై గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్రస్థాయిలో మంతనాలు జరి గాయి. పలువురు ఆశా వహులు ఢిల్లీ స్థాయిలో గట్టి లాబీయింగ్ నడిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు సర్వేలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.యువత, సామాజికవర్గం ఓట్లే లక్ష్యంగా..నియోజకవర్గంలో యువ నాయకుడిగా, స్థాని కంగా మంచి పట్టున్న నేతగా నవీన్ యాదవ్కు పేరుంది. ఆయన తండ్రి బంజారాహిల్స్ కార్పొ రేటర్గా పనిచేయడం, నియోజకవర్గంలోని ఓటర్లతో తన కుటుంబానికి సత్సంబంధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా పార్టీ అధిష్టానం భావించింది. యాదవ సామా జికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, యువతలో మంచి ఆదరణ ఉండటంతో గెలుపు అవకాశా లు మెరుగ్గా ఉంటాయని హైకమాండ్ అంచనా వేసింది. ఈ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసు కున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. -
జేఈఈ సిలబస్ మార్చాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) సిలబస్లో మార్పులు తేవాలని కేంద్ర విద్యా శాఖకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏటా చేపట్టే ఈ పరీక్ష విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నాయి. పరీక్షా విధానం విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోందని తెలిపాయి. అనేక మంది కుంగు బాటుకు లోనవుతున్నారని స్పష్టం చేశాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్ వరకూ బట్టీ విధానంలో బోధన జరుగుతోందని, విద్యార్థులకు 90% పైగానే మార్కులు వస్తున్నాయని పలు రాష్ట్రాలు తెలిపాయి. అయినప్పటికీ జేఈ ఈలో చాలామంది అర్హత సాధించలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఎన్టీఏ పరీక్షకు, అకడమిక్ విద్యకు పొంతన లేని విధంగా ఉందని తెలిపాయి. ఇది పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యానికి, ఫీజులు దండుకోవడానికి దారితీస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. జేఈఈ నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మార్పులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.. రాష్ట్రాల నుంచి తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి. ఇలా అయితే కష్టం: ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది జేఈఈ ర్యాంకుల్లో వెనుకబడుతున్నారు. సరైన అధ్యాపకులు లేకపోవడం, మౌలిక వసతులు ఉండని పరిస్థితి కాలేజీల్లో నెలకొంది. దీంతో ప్రైవేటు కాలేజీలకు వెళ్తేనే ర్యాంకులొస్తాయనే ఆలోచనల్లోకి విద్యార్థులు వెళ్తున్నారు. ఫలితంగా గత కొన్నేళ్ళుగా జేఈఈ పరీక్షను సీరియస్గా రాసే వారి సంఖ్య తగ్గుతోంది. గతంలో 16 లక్షల మంది దరఖాస్తు చేస్తే, 15.9 లక్షల మంది పరీక్ష రాసేవారు. మూడేళ్ళుగా 12 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నా, పరీక్ష రాసేవారి సంఖ్య 11 లక్షలకు మించడం లేదు. ప్రశ్నలు తికమకగా ఉంటున్నాయని, సుదీర్ఘంగా ఇస్తున్నారనే అభిప్రాయం విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. అడ్వాన్స్డ్ సాధించాలంటే తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తోంది. ఈ దిశగా కాలేజీలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని, ఐఐటీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారని రాష్ట్రాలు తెలిపాయి. సబ్జెక్టుల ప్రశ్నల్లో మార్పులు చేయాలిఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్లో కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చే ప్రశ్నలను సరళతరం చేయాలని రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుని, సులభంగా జవాబు ఇచ్చేలా ప్రశ్నలు ఉండాలని తెలిపాయి. మోడ్రన్ ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డీ బ్రోగ్లై వేవ్లెంత్, అటమిక్ మోడల్స్ను మార్చాలని సూచించాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమెట్స్ను సరళతరం చేయాలని పేర్కొన్నాయి. ఫిజికల్ కెమెస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ నైటిక్స్, థర్మోడైనమిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కో–ఆర్డినేషన్ కాంపౌండ్స్, పిరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి సరళంగా ప్రశ్నలివ్వాలని సూచించాయి. ఆర్గానిక్ కెమెస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, నేమ్ రియాక్షన్, స్టీరియో కెమిస్ట్రీ చాప్టర్లలో ప్రశ్నలను పరిశీలించాలని తెలిపాయి. మేథ్స్కు సంబంధించి కూడా ప్రశ్నలు విద్యార్థులు తేలికగా రాయగలిగేలా ఉండాలని రాష్ట్రాలు కోరాయి. -
ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ)ను చేపడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా ప్రక్రియ కాలంలో జేపీ అసోసియేట్స్ కంపెనీ వ్యవహారాల పర్యవేక్షణకు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) అనే థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎన్సీఎల్టీ నియమించింది. సొరంగం–1 నిర్మాణ విషయంలో కంపెనీ పనితీరుపై ఆర్పీ హామీ ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, హామీ ఇచ్చే పరిస్థితిలో లేకున్నా.. ఎన్సీఎల్టీ అనుమతితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మిగిలిన పనుల పూర్తికి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఎస్ఎల్ఎస్సీ సిఫారసు చేసింది. పనితీరుపై ఆర్పీ రాతపూర్వకంగా హామీ ఇస్తే పలు షరతులతో జయ ప్రకాశ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలోనే మిగిలిన పనులు జరిపించాలని మరో ప్రత్యామ్నాయాన్ని ఎస్ఎల్ఎస్సీ సూచించింది. సొరంగాల నిర్మాణం పనులను ముందుకు తీసుకెళ్లే అంశంపై నల్లగొండ సీఈ చేసిన పలు ప్రతిపాదనలపై గత నెల 12న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అధ్యక్షతన సమావేశమైన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు రెండు ప్రత్యామ్నాయాలను సర్కారుకు సూచించింది. ఒక వేళ ఒప్పందాన్ని రద్దు చేస్తే కొత్త నిర్మాణ సంస్థతో పనులు చేయిస్తే తీవ్ర జాప్యంతోపాటు పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆర్థిక భారం సైతం పడనుందని తేల్చి చెప్పింది. అర్ధంతరంగా నిలిచిపోయిన సొరంగం నిర్మాణ పనులను చేపట్టే విషయంలో సాంకేతిక సమస్యలూ ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసులను త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ అంచనాలను పెంచొద్దు ఒకవేళ జేపీ అసోసియేట్స్తోనే ఒకటో సొరంగం పనులు కొనసాగిస్తే రెండోసారి సవరించి అంచనాల మేరకు మిగుల పనుల వ్యయం రూ.1157.42 కోట్లకు మించకుండా సీలింగ్ విధించాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. నవీకరించిన పనుల షెడ్యూల్ ప్రకారం పనులను గడువును 2028 జూన్ 30కి పెంచేందుకు ఓకే చెప్పింది. సీఈ, రిజాల్యూషన్ ప్రొఫెషనల్ పేరుతో సంయుక్తంగా నిర్వహించే ఎస్క్రో అకౌంట్కే బిల్లులు చెల్లించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీతో పనులు చేస్తాం..: జేపీ అసోసియేట్స్ ⇒ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలను తవ్వాల్సి ఉండగా, 7.13 కి.మీ.ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి కాగా, 2.8 కి.మీల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ⇒ 43.93 కి.మీ.ల తొలి సొరంగం పనులకుగాను రెండు వైపుల నుంచి మొత్తం 34.38 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. మధ్యలో 9.541 కి.మీ.ల సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ⇒ గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలి కారి్మకులు మృతిచెందడంతో పనులు నిలిచిపోయాయి. ⇒ రెండోసారి సవరించిన అంచనాల ప్రకారం ఒకటో సొరంగానికి సంబంధించి రూ.1157.42 కోట్లు, రెండో సొరంగానికి సంబంధించి రూ.57.08 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉంది. ⇒ ఇప్పటి వరకు టన్నెల్ బోరింగ్ మెషిన్ల(టీబీఎం)తో సొరంగాల తవ్వకాలు జరగగా, ఇటీవల జరిగిన ప్రమాద నేపథ్యంలో ఇతర అత్యాధునిక పద్ధతుల్లో ఇదే వ్యయంతో పనులు చేసేందుకు జేసీ అసోసియేట్స్ పలు షరతులతో సంసిద్ధత వ్యక్తం చేసింది. ⇒ 2028 ఆగస్టు 30 వరకు గడువు పొడిగించడంతో పాటు బిల్లుల చెల్లింపు షెడ్యూల్లో మార్పులు చేయాలని, బిల్లులను సమరి్పంచిన 24 గంటల్లోనే గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరపాలని, రూ.35.14 కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.104 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించాలనే షరతులను విధించింది. -
నేడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత జరిగే మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీపై అప్పటికప్పుడు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో గురువారం.. తొలిదశలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మొత్తం 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహాయించి) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల వివరాలతో అధికారులు ఇప్పటికే గెజిట్ విడుదల చేశారు. ఒక్కో దశకు ఆయా తేదీలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రిటరి్నంగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నోటీసులు జారీ చేసిన రోజు కలిపితే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడురోజుల పాటు అవకాశం ఉంటుంది. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ గురించి జిల్లా కలెకర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, గురువారం ఉదయం నుంచి నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేసిన సన్నాహాల గురించి ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ శిక్షణ కూడా పూర్తిచేశామన్నారు. 5 దశల్లో స్థానిక సమరం మొత్తం అయిదు దశల్లో జరిగే మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు గాను..తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న) జరగనున్నాయి. ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు..సర్పంచ్, వార్డు సభ్యులకు (మొదటి దశ అక్టోబర్ 31న, రెండోదశ నవంబర్ 4న, మూడోదశ నవంబర్ 8న ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 29న విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న మొదటి దశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ నవంబర్ 11న (రెండు దఫాలకు కలిపి) జరగనుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఎప్పటికప్పుడు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులకారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలరే, వీటిలోని 16 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. నోటిఫికేషన్లకు ఏర్పాట్లు పూర్తి 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ల జారీకి జిల్లా ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ల జారీ, నామినేషన్లు స్వీకరణ, ఎన్నికల కోడ్ అమలు, భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు.. జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
‘42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం’
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొన్నం ప్రబాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పై ప్రభుత్వం తరపున మా వాదనలు బలంగా వినిపించాం. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నాం. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృశ్య రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలి. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానం పై జరిగింది. కోర్టులో అఫిడవిట్లు ఉండవు ఇంప్లీడ్ కావాలని కోరాం..ఎంపైరికల్ డేటా కు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. రాజకీయాలు పక్కన పెట్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి’అని పొన్నం కోరారు. ఇదీ చదవండి:బీసీ రిజర్వేషన్లు: ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం -
గట్టు వామన్ రావు దంపతుల కేసులో సీబీఐ దూకుడు
సాక్షి,హైదరాబాద్: అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు జంట హత్యల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ వామన్ రావు అనుచరులు బొల్లంపల్లి సంతోష్, ఇనుముల సతీష్ను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వామన్ రావుతో సాన్నిహిత్యం, ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో పలు రకాల అంశాలపై ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రెండో ఫ్లోర్లో విచారణ చేపట్టిన అధికారులు.. విచారణ కోసం ముందస్తు నోటీసులు అందించారు. గత 20 రోజుల నుంచి కొనసాగుతున్న సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇక తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 130మందిని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్రావు 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు అదే ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది.చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామన్రావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును విచారిస్తున్నారు. -
అయ్యే.. ఇన్ని కేసులు మూసేశారా?
కేసు.. నో క్లూస్.. అందుకే క్లోజ్.. ఇదీ చాలా కేసుల పరిస్థితి. నేరం జరిగిందనే విషయం బాధితులతోపాటు పోలీసులకూ స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిందితులను పట్టుకోవడానికి, వారిపై న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి పక్కా ఆధారాలు మాత్రం లభించలేదు. ఈ కారణంగా కేసును మూసివేసినట్లు పోలీసుల ద్వారా బాధితుడికి సమాచారం వెళ్తుంది. అప్పుడు బాధితుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించడం... సరిగ్గా ఇలాంటి ఫీలింగ్నే 2023లో నగరానికి చెందిన 34.98 శాతం మంది బాధితులు అనుభవించారు. - సాక్షి, సిటీబ్యూరోనేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2023కు సంబంధించిన ‘క్రైమ్ ఇన్ ఇండియా’గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’అంటూ కేసును మూసేస్తున్నట్లు పేర్కొంటారు. ఆర్థిక నేరాల్లోనే అత్యధికం... హైదరాబాద్ నగర పోలీసు (Hyderabad Police) విభాగం 2023లో దర్యాప్తు చేసిన కేసుల్లో కొన్ని పాత కేసులూ ఉంటాయి. సరాసరిన చూస్తే 2023లో ఐపీసీ, లోకల్ యాక్ట్స్, ఐటీ చట్టాల కింద మొత్తం 30,604 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,706 కేసుల్ని పైన చెప్పిన ‘నో క్లూ’కారణాలతో మూతపడ్డాయి. ఇలా మూతపడిన కేసుల్లో అత్యధికం ఐపీసీ చట్టాల కింద నమోదైన నేరాలకు సంబంధించినవే ఉన్నాయి. కేసులు ఇలా మూతపడటంలో బాధితుల పాత్ర సైతం ఉంటోందని పోలీసులు చెప్తున్నారు. బాధితులుగా మారిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి కేసు నమోదు చేయిస్తుంటారని, ఆ తర్వాత కొన్నాళ్ళకు నిందితులు రాజీకి వస్తే అంగీకరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తు, విచారణ వంటివి జాప్యాలుగా భావిస్తున్న బాధితులు తక్షణం నష్టం పూడుతోందనే ఉద్దేశంలో ఇలా చేస్తుంటారని వివరిస్తున్నారు. ఫలితంగా దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులకు పూర్తిస్థాయిలో అందించరు. దీంతో ఈ తరహా కేసుల్ని ‘ట్రూ బట్ ఇన్సఫీషియంట్ ఎవిడెన్స్’ తదితర కారణాల కింద మూసేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. సాక్ష్యాధారాలు ఉండాల్సిందే... ఏదైనా నేరానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసి, నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రాథమిక ఆధారాలు ఉంటే సరిపోతుంది. అయితే దర్యాప్తు పూర్తియిన తర్వాత పోలీసులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు కేసు విచారణను న్యాయస్థానం చేపడుతుంది. దీనికి పక్కా సాక్ష్యాధారాలు ఉండాల్సిందే. అలా లేని పక్షంలో కోర్టు నుంచి పోలీసులకు అక్షింతలు తప్పవు. అవకతవకలకు, వేధింపులకు ఆస్కారం లేకుండా, బెదిరింపులు, ప్రలోభాలకు తావు లేకుండా ఉండటంతోపాటు నిరపరాధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి కేసులోనూ సరైన సాక్ష్యాధారాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. పక్కా ఆధారాలు లేనప్పుడు పోలీసులు న్యాయనిపుణుల సలహా మేరకు ‘ట్రూ బట్ ఇన్సఫీషియంట్ ఎవిడెన్స్’లేదా ‘అన్ ట్రేస్డ్’లేదా ‘నో క్లూ’కారణంగా కేసుల్ని మూసేస్తుంటారు. మరికొన్ని కారణాలతోనూ... దర్యాప్తు చేస్తున్న కేసుల్ని మరికొన్ని కారణాలతోనూ పోలీసులు మూసేస్తున్నట్లు ఎన్సీఆర్బీ (NCRB) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది నగర పోలీసు విభాగానికి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులుగా తేలుతున్నాయి. వ్యక్తిగత, ఆర్థిక కారణాలు, ఈర్షా్యద్వేషాలు, అహం కారణంగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అకారణంగా ఆరోపణలు చేస్తూ పోలీసుల వద్దకు తీసుకువస్తున్నారని స్పష్టమవుతోంది. దర్యాప్తులో అవి తప్పుడు ఫిర్యాదులని తేలడంతో ‘పాల్స్’ అనే కారణంగా కేసులు మూతపడుతున్నాయి. ‘ఆ తరహా నేరం కాని’కేసులూ మూతపడుతున్నాయి. కేసు నమోదు సందర్భంలో ఆ నేరం ఫలానా తరహాకు చెందినది భావిస్తున్నారు. చివరకు దర్యాప్తు పూర్తయ్యే సరికి దాని స్వరూప స్వభావాలు మారిపోవడంతోపాటు బాధితుల నుంచి సహకారం లేకపోవడంతో కేసు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నగదు లావాదేవీలతో ఇబ్బంది... ఏటా నమోదవుతున్న ఆర్థిక నేరాల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి అనేకం ఉంటున్నాయి. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ రూ.లక్షలు, రూ.కోట్లలో ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. పెట్టుబడులు, చిట్టీలు, భాగస్వామ్యం కోసం వెచ్చింపు, రుణాలు ఇప్పిస్తానంటూ కమీషన్లు... ఇలా అనేక చోట్ల నగదు లావాదేవీలే నడుస్తున్నాయి. చదవండి: నీ చొక్కా చాలా బాగుంది.. నాకు ఇవ్వన్నా..ఆద్యంతం ఇవన్నీ సజావుగా జరిగిపోతే అవి రికార్డుల్లోకి ఎక్కవు. ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు బాధితులుగా మారిన వాళ్లు పోలీసుల వద్దకు వస్తున్నారు. ఆన్లైన్ లేదా చెక్కుల రూపంలో జరిగిన వాటికి పక్కా ఆధారాలు ఉంటాయి. నగదు రూపంలో చేసిన లావాదేవీలను నిరూపించడం చాలా అరుదు. ఈ కారణంగానూ కొన్ని కేసులు ‘ట్రూ బట్...’ అంటూ మూసేయాల్సి వస్తోందని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం అరుదు.. ఠాణాల్లో నమోదైన కేసులు ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్’కింద మూతపడటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ అంశంలో పోలీసుల నిర్లక్ష్యం అనేది అత్యంత అరుదు. బాధితులు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేయడం ఓ ప్రధాన కారణం. దీనికితోడు అనుమానితులు, నిందితులపై వివరాలు చెప్పకపోవడం, సరైన ఆధారాలు అందించకపోవడంతో కేసులు మూతపడుతున్నాయి. సైబర్ నేరాల విషయంలో కేటుగాళ్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వనరుల లేమి కారణంగా ఆధారాలు లభించట్లేదు. – నగర పోలీసు ఉన్నతాధికారి -
రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందా? కాదా? అన్న ఉత్కంఠతకు తెరపడింది. గురువారం (అక్టోబర్9) రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రేపు ఉదయం 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి తొలివిడుత నామినేషన్లుఅక్టోబర్ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు అక్టోబర్ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్ -
తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దగ్గు మందులపై నిషేధం విధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్ కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.కాగా, రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. -
సోషల్ వార్.. పొలిటికల్ పోరు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి.ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెస్ర్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనా్రస్తాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి.ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పారీ్టకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిరి్వరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పారీ్టలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15వరకు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ:తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాడివేడిగా కొనసాగాయి తెలంగాణ ప్రభుత్వం తరుఫును అభిషేక్ సింఘ్వి వాదనలురిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందిఇప్పటి వరకూ రిజర్వేషన్ బిల్లును ఎవరూ ఛాలెంజ్ చేయలేదురిజర్వేషన్లు 50శాతం మించకూడదని కచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదుకచ్చితమైన ప్రాదమిక,సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండొచ్చురిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదనుకుంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్ధం లేదు’ అంటూ వాదనతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం సింఘ్వి వాదానాల అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షంబీసీ రిజ్వర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్విహించారు?ట్రిపుల్ టెస్టు విధానాన్ని అనుసరించారా?ప్రజల అభ్యంతరాలను తీసుకున్నారు?గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉందికమిషన్ రిపోర్టు పబ్లిష్ చేశారా? షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని ఏజిని ప్రశ్నించిన హైకోర్టుఅందుకు ఇంకా వాదనలు ఉన్నాయి.. విచారణ రేపటికి వాయిదా వేయాలన్న ఏజీ ఇంక వాదనలు అవసరం లేదు.. విచారణ ముగిస్తున్నాం’అంటూ వ్యాఖ్యానించిన హైకోర్టుహైకోర్టు ప్రశ్నలు:అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పాస్ ఎప్పుడైంది?.ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా?.బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?.గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా?. రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?.పిటిషనర్ తరఫున వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ...నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ తెలిపారు. 42 శాతం బిల్లు పాస్ అయింది కానీ.. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని పిటిషనర్ తరఫు లాయర్లు చెప్పారు. ట్రిపుల్ టెస్టు పాస్ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు అని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యింది కానీ, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంపిరికల్ డేటా కూడా సరిగా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలు విడదలయ్యాయి. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచవచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.అంతకుముందు.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు తెలిపారు. అలాగే, రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ నెలకొంది. -
వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదు
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో బండమైసమ్మ కమ్యూనిటీ హాల్ లో కిరాణా షాప్ ఓనర్లకు "వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019", "ఆహార భద్రత చట్టం 2006", "తూనికలు కొలతల చట్టం 2011", ప్రకారం కొనుగోలు విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులను, షాపు నిర్వాహకులు వాటిని ఉల్లంఘిస్తే విధించే శిక్షలు మరియు జరిమానాలు గురించి కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ బస్తీలలో, కాలనీలలోనీ కిరాణా షాప్ యజమానులకు ప్రభుత్వ అధికారులు ఏరియా ఫుడ్ సేఫ్టీ అధికారి GHMC నుంచి సాహితీ గారు, తూనికలు కొలతల శాఖ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, FSSAI నుంచి డిప్యూటీ ఫుడ్ కంట్రోలర Rtd T.విజయ్ కుమార్ గార్ల సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.చిన్న పిల్లలు తినే తిను పదార్థాలు నుంచి వంట సరుకుల వరకు నాసిరకం ఉత్పత్తి మరియు వాటి అమ్మకాలు ఎక్కువైనందున కిరాణా షాప్ యజమానులకు షాప్ లో అమ్ముతున్నటువంటి సరుకుల అమ్మకాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతలు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు గారు మాట్లాడుతూ చుట్టుపక్కల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు వినియోగదారుల ఆరోగ్యం కోసం ఆలోచించాలని కోరారు.పిల్లలు క్రమం తప్పకుండా నాసిరకం లేదా తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకుంటే, తగినంత పోషకాహారం లేకపోవడం మరియు హానికరమైన పదార్థాల కారణంగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఆది వారి శారీరక మరియు మానసిక అభివృద్ధి పై ప్రభావం చూపుతూ తక్షణ సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధులు గా మారతాయి అని తెలిపారు, గత నెల నుంచి మేము నిర్వహించిన సర్వేలో నాసిరకం అమ్మకాలు ప్రతి షాప్ లో జరుగుతున్నాయని తేలింది, ముఖ్యంగా యజమానులకు అవగాహన లేకపోవడం కారణంగా భావించి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం ఏ షాప్ లో అయినా సరే ఫుడ్ సేఫ్టీ (FSSAI) లైసెన్స్ లేని తిను పదార్థాలు, వంట సర్కులు, లేబుల్(Declaration) లేని ప్యాక్ చేసిన తిను పదార్థాలు, వంట సర్కులు, తయారీదారుని పూర్తి వివరాలు లేని తిను పదార్థాలు, వంట సర్కులు అమ్మడం కనిపిస్తే సంస్థ తరపున మేమే కంప్లైంట్ చేసి శిక్ష పడేలా చేస్తామని అనరు, అలాగే వయింగ్ మిషన్లో హెచ్చుతగ్గులు ఉండడం కొన్న వస్తువులకు వినియోగదారుడు బిల్లు అడిగితే ఇవ్వకపోవడం లాంటివి చేయదని కోరారు, ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యుడు ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ యుద్దీన్ నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సంస్థ సబ్యులు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రాయదుర్గం ‘రియల్’ సంచలనం.. సొంతింటి కల దూరమేనా?
సాక్షి, సిటీబ్యూరో: ఎకరం రూ.177 కోట్లు.. దుర్గం చెరువు పక్కనే ఉన్న కొండపై ఉన్న భూమి ధర ఇదీ. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేటలోని నియోపొలిస్ వేలంలో ఎకరా రూ.100.75 కోట్లు పలికిన ధరే అందర్నీ షాక్కు గురి చేయగా.. సోమవారం టీజీఐసీసీ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టించింది. పశ్చిమ హైదరాబాద్లోని బహుళ అంతస్తుల భవనాలే కాదు.. అక్కడి భూముల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని రియల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో భూమి బంగారం కంటే ఖరీదైపోయింది. కొండలే కోట్లకు కోట్లు ధర పలుకుతున్నాయి. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ (టీజీఐఐసీ) నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబరు 83/1 ప్లాట్ నంబరు–19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు–15ఏ/2లో 7.67 ఎకరాలు మొత్తం 18.67 ఎకరాలను వేలం వేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.3,135 కోట్ల ఆదాయం సమకూరింది. స్థానిక బిల్డర్లతో పాటు జాతీయ నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ధర రికార్డు స్థాయిని దాటేలా చేశారు. ఈ పరిణామాలు మార్కెట్లో సంచలనంగా మారాయి. హైదరాబాద్ మార్కెట్కు ఇంకా భవిష్యత్తు ఉందని, డిమాండ్ తగ్గలేదని మార్కెట్ పడిపోలేదు అనడానికి ఈ వేలమే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సొంతింటి కల దూరమేనా..? భూముల వేలంలో వేలంవెర్రిగా ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల ప్రభావం చుట్టుపక్కల భూములు, అపార్ట్మెంట్లపై ఉంటుంది. దీంతో హైదరాబాద్కు ఉన్న అఫర్డబులిటీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్ అనగానే సరసమైన ఇళ్లకు కేంద్రమని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా చెబు తూ వస్తున్నాయి. వేలంలో రికార్డ్ ధరలు పలుకుతుండటంతో భూముల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతంలోని అపార్ట్మెంట్ల ధరలు పెరగక తప్పని పరిస్థితి. సామాన్యుడికి ఇంటి కల దూరమవుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎకరం భూమి రూ.177 కోట్లు పలకడంతో సంపన్నులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకింత ధర? రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. ఐటీ కారిడార్లో ఉండటంతో గృహ నిర్మాణం, కార్యాలయాలకు అనువుగా ఉంది. భవనం ఎత్తుపై ఆంక్షలు లేకుండా అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు అవకాశం ఉండటంతో బిల్డర్లు ధరకు వెనకాడలేదు. వీటి దృష్ట్యా వేలంలో కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. 470 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలున్నాయి.బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్రోడ్డు, మెట్రో, విమానాశ్రయాలతో నగరం నలువైపులా సులువైన కనెక్టివిటీ ఉంది. రాయదుర్గం మెట్రో స్టేషన్కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్/విప్రో జంక్షన్కు, హెచ్ఐసీసీ/హైటెక్స్కు 15 నిమిషాలు, ఎయిర్పోర్ట్కు 40 నిమిషాలు ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. -
మహా అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్థమైంది. హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన దృష్ట్యా అందుకనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కోసం జోనల్ వ్యవస్థను విస్తరించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ సేవలను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో సంస్థాగతమైన పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టారు. ఈమేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీ నియామకం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు. హెచ్ఎండీఏ పరిధిని 7,257 చ.కి.మీ. నుంచి 10,526 చ.కి.మీ. వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలు హెచ్ఎండీఏలో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రణాళికాబద్ధమైన మహానగరం నిర్మాణం, అభివృద్ధి దృష్ట్యా కార్యకలాపాలను వికేంద్రీకరించనున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2, మేడ్చల్–1, మేడ్చల్–2 జోన్ల పరిధిలో హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం సేవలను అందజేస్తోంది. కొత్తగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కూడా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకనుగుణంగా అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. లక్ష్యాలు ఇలా.. ● అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్ఎండీఏను సంస్థాగతంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ● జోనల్ వ్యవస్థలను విస్తరించడంతో పాటు జోనల్స్థాయి కమిషనర్లను కూడా నియమించనున్నారు. తద్వారా అన్ని రకాల నిర్మాణరంగ అనుమతులు, లే అవుట్లు జోనల్ స్థాయిలోనే అందజేస్తారు. దీంతో మెట్రోపాలిటన్ కమిషనర్ వ్యూహాత్మక ప్రణాళిక, విధాన రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుంది. ● హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. మహానగర అభివృద్ధే ధ్యేయం.. పునర్వ్యవస్థీకరణ, జోనల్ స్థాయిలో సేవల వికేంద్రీకరణ ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ గ్రీన్ఫీల్డ్ రోడ్లు,ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధివంటి ప్రధానమైన కార్యకలాపాలపై కమిషనర్ దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోవైపు సమర్థ ల్యాండ్పూలింగ్ పథకాన్ని అమలు చేయడంతో పాటు, ఏకీకృత బిల్డింగ్, డెవలప్మెంట్ కోడ్ను రూపొందించడం, మాస్టర్ప్లాన్–2050 రూపకల్పన, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి లక్ష్యాల దిశగా కార్యాచరణ చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం ట్రిపుల్ ఆర్ వరకు జోనల్ వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కన్సల్టెన్సీ సాంకేతిక, ఆర్థిక బిడ్లపై దరఖాస్తులకు ఆహ్వానం కన్సల్టెంట్ల ఎంపిక ఇలా.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించారు. కన్సల్టెంట్ ఎంపిక క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో 80:20 నిష్పత్తిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్పీలో పేర్కొన్న అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత సాధించిన బిడ్డర్ల ఫైనాన్షియల్ బిడ్లను మాత్రమే తెరిచి తుది ఎంపిక చేపడతారు. -
‘సోషల్’ వార్.. పొలిటికల్ పోరు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీపె విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి. ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెరస్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనాస్త్రాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి. ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పార్టీలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీల తొందర నామినేషన్లు ప్రారంభం కాకున్నా,అభ్యర్థులెవరో తెలియకున్నా.. క్షేత్రస్థాయి కంటే సోషల్ మీడియాలో ముమ్మరం రాజకీయ వ్యూహంలో రీల్స్, పెయిడ్ క్యాంపెయిన్లు దూసుకుపోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ -
యాక్ట్..బిగ్ బాస్కెట్!
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్..నిత్యావసరాల డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్ పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేశారు. మొత్తం రూ.3.06 లక్షలు కోల్పోయిన బాధితులు సోమ, మంగళవారాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బహదూర్పురకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన వైఫై సేవల కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. అందులో యాక్ట్ ఫైబర్ కస్టమర్ కేర్ పేరుతో కనిపించిన నెంబర్కు ఫోన్ చేశాడు. దీన్ని అందుకున్న వ్యక్తి మరో నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేయమని చెప్పారు. యువకుడు ఫోన్ చేయడానికి ముందే ఆ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. యాక్ట్ ఫైబర్ ప్రతినిధిగా మాట్లాడిన అవతలి వ్యక్తి వైఫై రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ పే ద్వారా రూ.2 చెల్లించాలని కోరాడు. ఆపై రిజిస్ట్రేషన్ను ఖరారు చేయడానికి 90500, 8500 కోడ్స్ టైప్ చేయాలని సూచించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు అలానే చేయగా..గూగుల్ పే ద్వారా అతడి ఖాతా నుంచి రూ.90,500, రూ.8,500 సైబర్ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీనిపై ఫోన్ ద్వారా బాధితుడు అవతలి వ్యక్తిని ప్రశ్నించాడు. అది పొరపాటున జరిగి ఉంటుందని, 24 గంటల్లో రీఫండ్ కావడానికి పేస్యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. బాధితుడు అలా చేయగానే..దాని ద్వారా సైబర్ నేరగాడు మరో రూ.10 వేలు స్వాహా చేశాడు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయించి, సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా... యూసుఫ్గూడకు చెందిన మరో వ్యక్తికి (36) గత నెల 30న ఓ వెబ్సైట్లో అతి తక్కవ ధరలకు నిత్యావసరాల సరఫరా పేరుతో ఉన్న ప్రకటన చూశాడు. దాని ద్వారా తనకు అవసరమైన కొన్ని సరుకులు ఆర్డర్ చేశాడు. ఈ నెల 2న బాధితుడికి ఓ ఫోన్కాల్ వచ్చింది. నిత్యావసరాల సరఫరా సంస్థ బిగ్ బాస్కెట్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆర్డర్ చేసిన వస్తువులు పంపడానికి నగదు చెల్లించాలని సూచించాడు. దీనికోసం ఏపీకే ఫైల్ను వాట్సాప్ ద్వారా పంపి క్లిక్ చేయమని కోరారు. బాధితుడు అలా చేయడంతో ఆ ఫైల్ అతడి ఫోనులో నిక్షిప్తమై, దాని యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతికి వెళ్లిపోయింది. ఆపై బాధితుడు నిత్యావసరాల నిమిత్తం చెల్లించాల్సిన రూ.360 ఆన్లైన్లో పే చేశాడు. ఫోన్ యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతిలో ఉండటంతో ఈ ఓటీపీలు, పిన్ నెంబర్లు అతడు సంగ్రహించగలిగాడు. ఆ వివరాలను వినియోగించుకున్న సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.97 లక్షల కాజేశాడు. ఈ రెండు ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.ఈ పేర్లతో ఇరువురిని మోసం చేసిన నేరగాళ్లు ఇద్దరు బాధితుల నుంచి రూ.3.06 లక్షలు స్వాహా సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా కేసులు నమోదు -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ–వీల్చైర్
శంషాబాద్: శారీరక ఇబ్బందులతో నడవలేని ప్రయాణికుల కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ–(ఎలక్ట్రానిక్) వీల్చైర్ను మంగళవారం నుంచి ఎయిర్పోర్టు నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రెస్టో ఎయిర్సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ–వీల్చైర్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిపార్చుర్ ఫోర్కోర్ట్ నుంచి ఎస్హెచ్ఏ వద్ద నున్న డీఎఫ్ఎండీ పాయింట్ వరకు వీటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తనిఖీల అనంతరం అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులకు వీటి సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. -
సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే...
ఇక కఠిన చర్యలు తప్పవు సాక్షి, సిటీబ్యూరో: సెల్ఫోన్ డ్రైవింగ్ కారణంగా 2023లో 23 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... ముగ్గురు అసువులు బాశారు. మరో 26 మంది క్షతగాత్రులయ్యారు. ఒకప్పుడు కేవలం సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే డ్రైవర్లు మాత్రమే రోడ్లపై కనిపించే వాళ్లు. అయితే ప్రసుత్తం మారిన పరిస్థితుల నేపథ్యంలో సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్యా పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన నగర కొత్వాల్ సజ్జనర్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూసే, ఇయర్ ఫోన్లు వినియోగించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులకు స్పష్టం చేశారు. తప్పనిసరిగా మారిపోయిన సెల్ఫోన్... మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్ వినియోగించడం తీవ్రమైన ఉల్లంఘన. ఒకప్పుడు ఈ ఉల్లంఘనలను గుర్తించడం, బాధ్యుతలపై చర్యలు తీసుకోవడం ట్రాఫిక్ పోలీసులకు తేలిగ్గా సాధ్యమయ్యేది. అయితే ఇటీవల కాలంలో యాప్ ఆధారంగా నడిచే బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, గిగ్ వర్కర్లు వచ్చిన తరవాత పరిస్థితులు మారిపోయాయి. వీరి కార్యకలాపాలకు సంబంధించి బుకింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు, పికప్ దగ్గర నుంచి డ్రాపింగ్ వరకు అంతా యాప్ ఆధారంగానే సాగుతుంది. దీంతో ఈ రంగంలో ఉన్న ప్రతి డ్రైవర్ సెల్ఫోన్ను చూడటం, మాట్లాడటం అనివార్యంగా మారిపోయింది. దూరప్రాంతాల సర్వీసుల్లో వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లు సైతం తమ ప్రయాణికులతో సంప్రదింపులు జరపడానికి సెల్ఫోన్ వినియోగించాల్సి వస్తోంది. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సైతం చాలా సందర్బాల్లో సెల్ఫోన్ డ్రైవింగ్ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ‘ఇయర్’తో ఇంకో సమస్య వస్తోంది... నగర వ్యాప్తంగా ఇయర్ ఫోన్ డ్రైవింగ్ సైతం సాధారణ అంశంగా మారిపోయింది. ప్రధానంగా యువతే ఈ రకంగా వాహనాలు నడుపుతున్నారు. ఇయర్ ఫోన్లు, బ్లూటూత్, బడ్స్, పోర్డ్స్ చెవిలో పెట్టుకుని ముందుకుసాగుతుంటారు. బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, గిగ్ వర్కర్లు కూడా ఇది తప్పనిసరిగా మారిపోయింది. సెల్ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇలాంటి ఇయర్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చార్జ్షీట్లు సైతం దాఖలు చేసినా... ఒకప్పుడు సెల్ఫోన్ డ్రైవింగ్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన వారికి ట్రాఫిక్ పోలీసుల కేవలం జరిమానా మాత్రమే విధించే వారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా పరిగణించేవి, వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ముప్పు తీసుకువచ్చేవి. సెల్/ఇయర్ ఫోన్ డ్రైవింగ్కు ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కేటగిరీలోకి చేర్చారు. ఈ ఉల్లంఘనులకు కేవలం జరిమానా విధించడం కాకుండా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని 2018లో నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ కంటే ప్రమాదకరమైంది కావడంతో తొలిదశలో ఇయర్ ఫోన్ డ్రైవింగ్పై దృష్టి పెట్టారు. కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేయడానికి అనువుగా దీనికంటూ ఎంవీ యాక్ట్లో ప్రత్యేక సెక్షన్ లేదు. దీంతో ప్రమాదకరంగా వాహనం నడపటం (సెక్షన్ 184) కింద అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో ఆ విధానం అటకెక్కడంతో మళ్లీ జరిమానాలకే పరిమితం అయ్యారు. సిటీలో సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు ఇలా.. ఏడాది నమోదైన కేసులు 2014 13,008 2015 27,333 2023 58,056 2024 78,108 ‘బ్లూటూత్’ను ఎలా గుర్తిస్తారో? అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు ‘ఇయర్ ఫోన్’ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం చార్జ్షీట్ దాఖలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆరుగురిని రెండు రోజుల చొప్పున జైలు శిక్ష కూడా విధించింది. ద్విచక్ర వాహన చోదకుడు ఇయర్ఫోన్/సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే గుర్తించడం తేలికే. వీరితో పాటు కార్లలో వెళ్తున్న వారు బ్లూటూత్స్, బర్డ్స్ వాడుతున్న వారిని పట్టుకోవడం ఎలా అన్నదే ప్రధాన సమస్య. మరోపక్క బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, ఆటోలు, గిగ్ వర్కర్లకు ఈ సెల్ఫోన్ అనివార్యమైన సాధనంగా మారిపోయింది. ఇలాంటి వాళ్లు ఆ ఫోన్ను తమ వృత్తికోసమే వాడుతున్నారా? వీడియోలు చూస్తున్నారా? అనేది గుర్తించడం కష్టసాధ్యం. ఇటీవల కాలంలో కార్లలో బ్లూటూత్స్ వినియోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా పట్టుకుంటారు? ఇలాంటి వాహనాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున మ్యూజిక్ వినే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది కీలకంగా మారింది. -
జిల్లా ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు: ఆర్వీ కర్ణన్
లక్డీకాపూల్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఫిర్యాదుల కమిటీనీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లా పరిధిలో ప్రయాణం చేసే పౌరులు పరిమిత మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలని ఆయన సూచించారు. నగరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు (ఎస్ఎస్టీ) నిరంతరం తనిఖీలు చేపడుతూ.., అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుంటాయన్నారు. సరైన ఆధారాలు చూపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నగదు జప్తుకు సంబంధించి జిల్లా ఫిర్యాదుల కమిటీకి తగిన ఆధారాలు పౌరులు చూపితే ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించి జప్తు చేసిన నగదును తిరిగి అందజేస్తామన్నారు. జిల్లా ఫిర్యాదుల కమిటీ సభ్యులు, వారి మొబైల్ నంబర్లు ఇలా ఉన్నాయి.. కేఏ మంగతాయారు, అదనపు కమిషనర్ (ఎస్టేట్స్), జీహెచ్ఎంసీ, 91776 08271, (కమిటీ చైర్ పర్సన్), ఎస్.వెంకటేశ్వర్రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఎన్నికల వ్యయం పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్ 91212 40116, (కమిటీ కన్వీనర్), వసుంధర, డిప్యూటీ డైరెక్టర్, డీటీఓ, 98490 44893, (సభ్యురాలు). జిల్లా ఫిర్యాదుల కమిటీ కార్యాల యం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం (3వ అంతస్తు, ట్యాంక్ బండ్)లోని అదనపు కమిషనర్ (ఎస్టేట్స్) చాంబర్లో ఉంటుందని, ఫిర్యాదుదారులు, పౌరులు ఈ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్వీ కర్ణన్ సూచించారు. -
హీటెక్కిన జూబ్లీహిల్స్
ఉప ఎన్నికల నేపథ్యంలో గరం.. గరం ● ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ● అంతర్గత కుమ్ములాటలతో సతమతం ● తుది దశకు చేరుకున్న అభ్యర్థుల ఎంపికసాక్షి, సిటీబ్యూరో: ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ హీటెక్కింది. ఈ నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. మరోవైపు సొంత పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు కేడర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరి బలహీనతలను మరొకరు బయట పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పక్షాలు రంగంలోకి దిగి ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పాడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా? అన్న విధంగా పోరు కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ చేతిలో బీసీ కార్డు.. అధికార కాంగ్రెస్ ఉప ఎన్నికలో బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమా ర్ గౌడ్ ప్రకటించారు. మరోవైపు అధిష్టానానికి పంపిన షార్ట్ లిస్ట్లో ముగ్గురు బీసీలు, ఒకరు ఓసీ ఉన్నారు. బీసీ అభ్యర్థిత్వం ప్రాధాన్య క్రమంలో ఓసీ అభ్యర్థి బరి నుంచి తప్పించినట్లయింది. ము గ్గురు బీసీల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం తాను టికెట్ రేసులో లేనంటూనే.. అధి ష్టానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రచార దూకుడు.. అభ్యర్థి ఎంపికలో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రచారానికి దిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని రంగంలోకి దిగారు. అధికార కాంగ్రెస్పై వ్యతిరేకత. మాగంటి గోపీనాథ్ సేవలు, మహిళా సానుభూతి పవనాలు గెట్టేక్కిస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో చేజారకుండా ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంది. బలోపేతానికి బీజేపీ కసరత్తు.. భారతీయ జనతాపార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో ఆ పార్టీకి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ.. రాష్ట్రంలో పెరిగిన బలంతో ఈసారి కాంగ్రెస్సే తమకు పోటీ అని భావిస్తోంది. ఇప్పటికే కమలనాథులు రంగంలోకి దిగి సుడిగాలిలా పర్యటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆర్.రామకృష్ణ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరా రు కోసం ఆ పార్టీ అభిప్రాయ సేకరణ చేస్తోంది. -
బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బలంగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. పదు నెక్కిన తీర్మానాలు రచించాలి. ఇదేదో ఒక్కరిద్దరి కోసం కాదు. యావత్తు తెలంగాణ బీసీల భవిష్యత్ అని గుర్తించా లి. ప్రతి ఒక్కరు యుద్ధవీరులు కావాలి. ఇప్పటి వరకు ఇతరుల కోసం పోరాటాలు చేశాం. ఇప్పుడు మన కోసం పోరాటాలు చేయక తప్పదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరు కదలివస్తేనే మన హక్కులను సాధించుకుంటాం. భూకంపం సృష్టిస్తేనే.. ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇవ్వా ల్సిన బీజేపీ ఇవ్వడం లేదు.పోరాడాల్సిన కాంగ్రెస్ పోరాటం చేయడం లేదు. నిరసనలు చేస్తామన్న బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. కేవలం బీసీల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలు చేస్తున్నాయి. అన్నీ ఉన్న మనం మన రిజర్వేషన్లు ఎందుకు సాధించుకోలేకపోతున్నాం. ఇదే చిట్ట చివరి అవకాశం. ఒక తెలంగాణ కోసం పోరాటం చేస్తేనే ఇన్ని వచ్చాయి. రిజర్వేషన్లు అమలైతే దానికి రెట్టింపు ఫలితాలు పొందుతాం అని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కోరింది. మంగళవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లు– న్యాయ వివాదాలు పరిష్కారం’పై బీసీ సంఘాల సమాలోచన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, జాతీయ ఓబీసీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వ రయ్యగౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ డా.విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్తోపాటు అనేక బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నిరాహారదీక్ష చేయడానిౖనా సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పరంగా మద్దతు ఇస్తామని చెప్పారు. ⇒ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు పోరాటం చేయాలన్నారు. యుద్ధం ఆపేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి బీసీ జాతిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. క్రెడిట్ అంతా మాకే రావాలని రెండు బిల్లులు చేసి పంపిన కాంగ్రెస్.. దాని అమలు కోసం చిత్తశుద్ధి ఏది అని ప్రశ్నించారు. హైకోర్టు జడ్జిమెంట్ రాక ముందే ప్లాన్ఆప్ యాక్షన్ చేసుకోవాలని హితవు పలికారు. ⇒ చిరంజీవులు మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్న బీఆర్ఎస్ ఏమీ చేయడం లేదని, బీసీల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఒక్కరిద్దరు మాత్రమే రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్టుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలన్నారు. ⇒ విశారదన్ మాట్లాడుతూ రేవంత్ తన గెలుపు కోసం 420 హామీలు ఇచ్చారని, అందులో బీసీ రిజర్వేషన్లు అనే ఒక ఆయుధంతో బీసీలను ఆటాడిస్తున్నారన్నారు. తనకు ఇష్టం వచ్చినట్టు ఆ ఆయుధాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మీదే ఉందని, అవి అమలు కాకపోతే వారిద్దరని సంఘ బహిష్కరణ చేయాలన్నారు. -
కాకి లెక్కలతోనే క్రాప్ బుకింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రతి సీజన్లో అనుసరించే క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) విధానం లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జియో ట్యాగింగ్ ద్వారా పంటలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించినప్పటికీ..ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. క్రాప్ బుకింగ్తో పాటు వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెక్టార్ల వారీగా నియమించిన వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఇచ్చే నివేదికల పైనే ప్రభుత్వం ఆధారపడుతోంది.రైతు పంటలు వేసినప్పుడే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తే, కచ్చితమైన సాగు విస్తీర్ణం, సాగైన పంటల వివరాలు తెలుస్తాయి. తదనుగుణంగా ఎరువుల పంపిణీ, మద్దతు ధరకు కొనుగోళ్లు, అందుకయ్యే నిధులు సమకూర్చుకోవడం వంటి ప్రక్రియ సజావుగా జరిగే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అంతా కాకి లెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలుకొని పంటల సేకరణ వరకు అంతా లోపభూయిష్టంగానే సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ సీజన్లో 60శాతం మించని క్రాప్ బుకింగ్రాష్ట్రంలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ గత నెల 30వ తారీఖుతో పూర్తయింది. ఆనాటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఇవి కాకుండా ఎర్ర మిర్చి, పసుపు 1.34 లక్షల ఎకరాల్లో సాగయినట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా పంటల నమోదు మాత్రం సెప్టెంబర్ 30 నాటికి 70 లక్షల ఎకరాల (53 శాతం) మేరకే పూర్తయింది. సెప్టెంబర్ 30 నుంచి ఈనెల 7 వరకు వారం రోజుల్లో మరో ఏడు శాతం క్రాప్ బుకింగ్ అయిందనుకున్నా, 60 శాతం మించలేదు. ఒకవైపు వరి కోతలు ప్రారంభం కాగా, మరోవైపు పత్తి ఏరడం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు వరి క్రాప్ బుకింగ్ 53 శాతం, పత్తి పంట నమోదు 57 శాతం మాత్రమే పూర్తయింది.చేతులు దులుపుకొంటున్నారా?ఒక గ్రామంలో ఒక ఖరీఫ్ సీజన్లో సాగైన పంటల విస్తీ ర్ణం ఆధారంగా మరుసటి సంవత్సరం పంట నమోదును కొంత అటు ఇటుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యవసాయ శాఖలోనే ఉన్నా యి. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా కొరత అత్యంత తీవ్ర రూపం దాల్చడానికి సరైన క్రాప్ బుకింగ్ డేటా లేకపోవడమే కారణమ నే అభి ప్రాయం వ్యక్తమైంది. రైతులు పంటలు సాగు చేసి నప్పుడే ఆయా పంటలను కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే, ఏ గ్రామానికి ఏ పంటలకు ఎంత యూరియా, ఇతర ఎరువులు అవ సరమవుతాయనే అంచనాలకు అవకాశం ఉంటుంది. కానీ అది జర గడం లేదు. అలాగే వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.పత్తి, జొన్నలు విక్రయించే సమయాల్లో వేసే లెక్కలకు పొంతన ఉండడం లేదు. పంటల నమోదు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో ఉంటే ఈ పరిణామాలు ఉత్పన్నం కావని వ్యవసాయ, మార్కెటింగ్అధికారులు చెపుతున్నారు. వ్యవ సా య విస్తరణాధికారులకు జిల్లా, మండల స్థాయిలో చేయాల్సిన వ్యవసాయ పనులు అప్పగించడం వల్ల పంట నమోదు కాకుండా ఇతర పనులపైనే ఎక్కు వ సమయం గడిపే పరిస్థితి ఉందంటున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అదే సీజన్లో నమోదు చేసిన పంటలకు కొంత ఎక్కువ, తక్కు వగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
32 అడుగుల ఎత్తు.. 45 కి.మీ. నిడివి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే మార్గంలో సుమారు 32 అడుగుల ఎత్తు, 45 కి.మీ. నిడివితో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దాదాపు ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించగా అందులో వన్యప్రాణులు సంచరించే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి మిగతా భాగాన్ని దానికి అప్రోచ్ రోడ్డుగా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 7,690 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా అందులో సగం వ్యయం భరిస్తామని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సవరించిన అంచనాలను తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ. 8 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అందులో రూ. 4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. విస్తరణ జరగక పెరిగిన ట్రాఫిక్.. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రోడ్డును గతంలో మన్ననూరు వరకు విస్తరించగా అక్కడి నుంచి దట్టమైన అడవి ఉండటం.. అదే మార్గంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం కూడా ఉండటంతో రోడ్డు విస్తరణకు కేంద్రం అనుమతించలేదు. దీంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సాధారణ రోడ్డే కొనసాగుతోంది. దీనికితోడు వన్యప్రాణుల కదలికల దృష్ట్యా నిత్యం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల ఉదయం వేళల్లో ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీంతో రోడ్డు విస్తరణ తప్పనిసరైంది. అయితే భూఉపరితలంలో విస్తరణ సాధ్యం కానందున వన్యప్రాణులకు అంతరాయం కలగని రీతిలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన ఏడాదిన్నర క్రితం తెరపైకి వ చ్చింది. కానీ దాని బదులు కేబుల్ కార్ నిర్మిస్తే రూ. 2,270 కోట్లు ఖర్చవుతుందన్న ఉద్దేశంతో ఆ మేరకు ప్రతిపాదన సమర్పించా లని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. అలాగే సొరంగ మార్గం ప్రతిపాదన కూడా తెరపైకి వ చ్చింది. ఎట్టకేలకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇ చ్చింది. కారిడార్కు ఇరువైపులా ఇనుపకంచెలు, నాయిస్ బ్యారియర్లు.. వన్యప్రాణులకు ఆటంకం కలగని విధంగా ఎలివేటెడ్ కారిడార్ను చేస్తున్నారు. వాహనాల చప్పుడు ఎక్కువ వినిపించకుండా ఉండేందుకు, జంతువులు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు 32 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించనున్నారు. వాహనాలు కింద పడకుండా.. వాహనదారులు కింద ఉండే అటవీ ప్రాంతంలోకి చెత్త విసరకుండా రోడ్డుకు ఇరువైపులా ఎత్తయిన ఇనుప కంచెలు ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో వాహనాల శబ్దంతో జంతువులు ఇబ్బంది పడకుండా రోడ్డుకు ఇరువైపులా నాయిస్ బ్యారియర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
బూత్ల వారీగా ప్రచార బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ పరంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బుధవారం హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బూత్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ప్రతికూలంగా స్పందిస్తే ఇతర ప్రాంత నేతలకు కూడా జూబ్లీహిల్స్లో పార్టీ తరపున బాధ్యతలు అప్పగించే అవకాశముంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చిన రీతిలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇతర జిల్లాలకు చెందిన పార్టీ నేతలను ప్రచార పర్వంలో మోహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.నేడు మరోమారు భేటీజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు బుధవారం బీఆర్ఎస్ కీలక నేతలు మరోమారు భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితోపాటు ఒకరిద్దరు కీలక నేతలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందున ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, హాల్ మీటింగ్స్ ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్పై చర్చిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశముంది.ఆర్టీసీ ప్రైవేటీకరణకు యత్నంఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ టికెట్ ఇస్తూ భర్త నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అలాగే పిల్లల బస్పాస్ల రేట్లు పెంచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చార్జీల పెంపు ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటోందని విమర్శించారు. చార్జీల పెంపుతో ఒక్కో కుటుంబంపై 20 శాతం మేర అదనపు భారం పడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తోందన్నారు. హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కనందునే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు చార్జీలు పెంచిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చార్జీల పెంపునకు కాంగ్రెస్ పార్టీ ప్రతిఫలాన్ని అనుభవిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
ఏడాదిలో మేడిగడ్డ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ను ఏడాదిలోగా పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్ల రూపకల్పనతోపాటు ఇతర సాంకేతిక అంశాల్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు సహకారం అందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించామన్నారు. ఐఐటీ లేదా ఇతర ప్రతిష్టాత్మక సంస్థను కన్సల్టెంట్గా నియమించి.. డిజైన్ల రూపకల్పన, బరాజ్లకు జియోఫిజికల్, జియోటెక్నికల్ వంటి పరీక్షలతో పాటు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తామని చెప్పారు. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ 7వ నంబర్ బ్లాక్కు మరమ్మతులు నిర్వహించాలా? దానిని పూర్తిగా తొలగించి కొత్త బ్లాక్ను పునర్నిర్మించాలా? అనే అంశంపై సైతం కన్సల్టెన్సీ సహకారం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖపై మంగళవారం ఉత్తమ్ సచివాలయంలో సమీక్షించారు. 6 నెలల్లో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ పూర్తి ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఆధారంగా జస్టిస్ బ్రిజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్వహిస్తున్న విచారణ మరో ఆరు నెలల్లో పూర్తికావొచ్చని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ వాదనలు పూర్తయిన తర్వాత రిజాయిండర్ వాదనలు వినిపించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహితకు రెండు అలైన్మెంట్లు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి తీరుతామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కి.మీ.ల గ్రావిటీ ద్వారా మైలారానికి నీటిని తీసుకొచి్చ, అక్కడి నుంచి 14 కి.మీ.ల సొరంగ మార్గం ద్వారా సుందిళ్ల బరాజ్కు నీటిని తరలించాలనే ఓ ప్రతిపాదన ఉందని చెప్పారు. మైలారం వద్ద పంప్హౌస్ నిర్మించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్లోకి నీటిని ఎత్తిపోయాలనే మరో ప్రతిపాదనను సైతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ రెండు అలైన్మెంట్లలో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసి ఈ నెల 22లోగా సిఫారసు చేయాలని నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్ నేతృత్వంలోని కమిటీని ఆదేశించారు. త్వరలో ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. వర్షాలు ముగిసిన వెంటనే పనులు ప్రారంభించాలని, ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తామన్నారు. సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలోని స్థితిగతులను తెలుసుకోవడానికి నిర్వహించనున్న హెలికాప్టర్ ఆధారిత సర్వేకు త్వరలో పౌర విమానయాన శాఖ డీజీ (డీజీసీఏ) నుంచి అనుమతులు వస్తాయన్నారు. సమ్మక్కపై సీడబ్ల్యూసీ అనుమానాలను నివృత్తి చేయాలి సమ్మక్క–సారక్క ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అనుమానాలను సత్వరంగా నివృత్తి చేసి ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను పొందా లని అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకే జీ–6 అంచనాల పెంపుతోపాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతించామని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకుగాను తక్షణమే భూసేకరణకు రూ.33 కోట్లు విడుదల చేయాలన్నారు. సమీక్షలో శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్, ఈ ఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్లు, శ్రామిక పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి బుధవారం (అక్టోబర్ 8 ) ఉదయం 8 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుతోపాటు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్లో (నిర్దిష్ట గ్రూప్ అంటే గ్రూప్– ఐ /గ్రూప్– ఐఐ / గ్రూప్– ఐఐఐ యొక్క ఉప–వర్గీకరణతో) ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్ను పొందలేకపోతే, వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవచ్చని సూచించారు. అయితే, ఆయా అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్ను సమర్పించాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని వెల్లడించారు. కాగా, టీజీఎస్ ఆర్టీసీలోని మొత్తం వెయ్యి డ్రైవర్ పోస్టులకు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో డ్రైవర్పోస్టుకు పేస్కేల్ రూ.20,960 నుంచి రూ.60,080 కాగా, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030గా ఉన్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వివరాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఠీఠీఠీ.్టజpటb. జీnలో చూడాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
మూడంచెల వ్యూహం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని, బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథా విధిగా ఎన్నికలకు వెళ్లిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి నట్టు తెలిసింది. అదే విధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్లీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. అక్కడ కూడా బలమైన వాదనలను వినిపించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో అమలయ్యేలా చూడటం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం కీలక భేటీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కూడా మాట్లాడారు. హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేందుకు హాజరు కావాలని సింఘ్వీని కోరగా, ఆయన వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన అంశాలపై వివరణ ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అన్ని నిబంధనలను అమలు చేసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చామని తెలిపారు. సుప్రీంతీర్పును ఎక్కడా ఉల్లంఘించడం లేదనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో జీవోను కోర్టు నిలిపివేయకుండా ఉండేలా బలమైన వాదనలు వినిపించాలని, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన ఏజీ సుదర్శన్రెడ్డికి సూచించినట్టు సమాచారం. కాగా బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయంత్రం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ నేతల భేటీ సీఎంతో భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సాయంత్రం మళ్లీ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎంపీ వీహెచ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి్మ, పీసీసీ నేతలు లక్ష్మణ్ యాదవ్, చరణ్కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు తెలిసింది. బుధవారం కోర్టులో జరగనున్న విచారణకు రాష్ట్రంలోని బీసీ మంత్రులు హాజరు కావాలని నిర్ణయించారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల తరఫున అడ్వకేట్లను పెట్టి కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు బదులిచ్చేలా సమర్థ వాదనలు వినిపించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
పొన్నంకు ‘లక్ష్మణ’ రేఖ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రుల మధ్య మాటల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఒక మంత్రి.. మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడం, బాధిత మంత్రి..ఆ వ్యాఖ్యలపై క్షమాపణలకు డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారన్నది ఆరోపణ. కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్కుమార్ స్పందించకపోవడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభా కర్ ఇంకా తప్పు తెలుసుకోకపోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణలు చెప్పకపోతే తదుపరి పరిమాణాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొన్నం తననుద్దేశించి మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న మరో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి పట్టించుకోక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనపై కూడా ఆ వీడియోలో లక్ష్మణ్ ఘాటైన వ్యాఖ్య లు చేశారు. అవసరమైతే రాహుల్గాందీ, సోనియా గాందీని కూడా కలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడిన ఆయన సంయమనం పాటించాలని సూచించారని, వివాదం సమసిపోయినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శామేల్, కాలె యాదయ్య పీసీసీ చీఫ్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా.. తనకు ఫోన్ చేసిన వ్యక్తితో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టుగా రికార్డయిన ఓ వీడియో మంగళవారం ఉదయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో మంత్రులు పొన్నం, వివేక్లనుద్దేశించి అడ్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తప్పు తెలుసుకుంటాడని అనుకున్నా. అక్కడ మా వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ ఉండి ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తే నేను వెళ్లిపోతా అని నన్ను ఉద్దేశించి అనడం ఇంకా అవమానించడమే. ఇద్దరం ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్లం. ఆయన కష్టసుఖాల్లో ఉన్నా. ఆయన కుమారుడు ఎంపీగా నిలబడితే మీదేసుకుని గెలిపించాం. ఆయన తండ్రి సమయం నుంచి మా తండ్రితో స్నేహితం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలుగా ఆ కుటుంబానికి ఓట్లేసి గెలిపించడంలో మా పాత్ర ఉంది. నన్ను అంటుంటే వివేక్ ఒక్క మాట అనడా? తోటి మంత్రి ఆ మాట అంటుంటే మా వాడిని దున్నపోతు అని ఎలా అంటావని వివేక్ ఒక్క మాట అనడా? మైనార్టీలకు సంబంధించి ఆ శాఖ మంత్రిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలి. వక్ఫ్బోర్డు చైర్మన్ నాకు ఫోన్ చేసి మీ కోసం ఇద్దరు మంత్రులు వెయిట్ చేస్తున్నారని అంటే.. వాళ్లు నేను వచ్చేంతవరకు ఆగరు. మీరు కార్యక్రమం ప్రారంభించండి. నేను జాయిన్ అవుతా అని చెప్పా. నేను సామాన్య కార్యకర్తను. డబ్బు ఉన్నవాడిని కాదు. మా తండ్రి కేంద్ర మంత్రి కాడు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చా. కష్టాలు తెలిసిన వ్యక్తిని. పొన్నం అలా మాట్లాడతాడని ఊహించలేదు.. పొన్నం ప్రభాకర్లాగా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కాదు. చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఆయన ఆ విధంగా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ కార్యక్రమానికి నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్లా. వారితో సమానంగా డాక్టర్ వివేక్ పక్కన నేను కూర్చోవడం వారికి ఇష్టం లేదు. మొదటి నుంచి మా వర్గీకరణను ఆయన వ్యతిరేకిస్తారు. ఆ వర్గానికి చెందిన వాడు నా పక్కన కూర్చుంటాడా? వాడి లెక్కంత అనే ఆలోచనతోనే నేను వెళ్లిపోతా అన్నాడు. పొన్నం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు.. పొన్నం నన్ను ఉద్దేశించి ఒక మాట అన్నాడంటే నన్ను కాకపోవచ్చులే అనుకున్నా. అదే విషయాన్ని చెప్పా. ఒక పార్టీ జెండా కింద పనిచేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నాతో కూడా పొరపాట్లు అవుతాయి. కానీ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. నాకు ఫోన్ చేసి.. అన్నా పొరపాటున ఒక మాట అన్నా. మనిద్దరి స్నేహితంతో దాన్ని మనసులో పెట్టుకోకు. ఇద్దరం ఒక్క జిల్లా వాళ్లమంటూ ఒక్క మాట అయినా మాట్లాడతాడని అనుకున్నా. ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసి అడిగినా నేను ఆయన్ను అనలేదు అంటున్నాడు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు.. ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండి మంత్రిగా పనిచేస్తున్నా. ఆవేశపడే విధంగా ఎక్కడా తప్పు చేయడం లేదు. అయినా లక్ష్మణ్కుమార్ను ఏమైనా అనొచ్చు. కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటికైనా వేచి చూస్తా. రేపటి వరకు (బుధవారం) చూస్తా. ఆయనలో మార్పు వస్తే ఫర్వాలేదు. అప్పటికీ నన్ను అనలేదు ఇంకా ఎవరినో అన్నాను అంటే మాత్రం రేపటి నుంచి జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. మాదిగ సామాజికవర్గంలో పుట్టి మంత్రిని కావడం నేను చేసిన పొరపాటా? ఆ సామాజికవర్గంలో పుట్టి ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తోందన్న విషయాన్ని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తా. మీనాక్షి నటరాజన్కు ఇప్పటికే లేఖ రాశా. రాహుల్గాం«దీని కలుస్తా. సోనియాగాంధీని కూడా కలుస్తా..’ అని లక్ష్మణ్ అన్నారు. ఇది మా ఇంటి సమస్య: పీసీసీ చీఫ్ దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది తమ ఇంటి సమస్య’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఇద్దరు మంత్రులతో తాను ఫోన్లో మాట్లా డానని, మరో మంత్రి శ్రీధర్బాబు కూడా మాట్లాడారని, ఇద్దరినీ బుధవారం పిలిపించి మాట్లాడతానని వెల్లడించారు. పీసీసీ చీఫ్కు చెప్పిందే ఫైనల్: మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను మాట్లాడేదేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీసీ చీఫ్ మాట్లాడారని, రహ్మత్నగర్లో ఏం జరిగిందో ఆయనకు వివరించానని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా మహేశ్గౌడ్ ఆదేశాలు తమకు శిరోధార్యమని చెప్పారు. -
‘పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీటిలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ ను ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు , బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిసిద్దుకునే విధంగా వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తప్పు జరిగింది వాస్తవమేనని అంగీకరించి పున్నం గారి చేత క్షమాపణ చెప్పించే విధంగా చూస్తామని తెలిపారని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణను తీసుకోవలసి వస్తుందని అన్నారు మాకు ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు ఆత్మగౌరవ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు అనే విషయం స్పష్టం చేశారు.కార్యక్రమం మైనార్టీ వర్గాలకు చెందిన ఆయనప్పటికీ ఆ శాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉండగా వాటి మీద పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోక్యం ఎందుకు అలాగే కార్మిక శాఖ మంత్రి ఉన్న వివేక్ జోక్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి పరిశీలన చేయాలన్నారు. బీసీ సంక్షేమ శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే పొన్నం సహించగలుగుతాడా అలాగే కార్మిక శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే వివేక వెంకట్ స్వామి సహించగలుగుతారా తెలుసుకోవాలని అన్నారు. లక్ష్మణ్ కుమార్ దూషిస్తున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మౌనంగా ఉండడం ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి అద్దం పడుతుందని అన్నారు నిజంగా వివేక్ లో దళిత సృహ ఉంటే సాటి దళిత మంత్రిని అలా అనకూడదని వెంటనే ఖండించాల్సిన అవసరం ఉండేది కానీ వివేకలో ఆస్పృహ లేదని అర్థమైంది. వివేక్ వెంకటస్వామి మాదిగలను పోర్చుకోలేకపోతున్నాడని అన్నాడు కాక జయంతి వేడుకల్లో అన్ని వర్గాలను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి.. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. వివేక్లో దళిత సోదర సోదర భావం కనుమరుగైందని అన్నారు. ఉమ్మడిగా దళితులకు రావలసిన హక్కులను సాధించడం కోసం అందని కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న వివేక్ సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడని అన్నారు.బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగ జాతి సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతుందని అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యతను కోరుకుంటున్నామని అన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతించినట్లుగానే బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని పిలుపునిచ్చారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అందులో భాగంగానే చెప్పులతో దాడికి తెగబడే పరిస్థితికి వచ్చారని, ఆ స్థానంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్లో నవీన్ వైపే సీఎం రేవంత్రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది. -
అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్ఎస్ కుట్ర: పొన్నం
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?.. .. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్