breaking news
Hyderabad
-
ఠాణాలో టోకెన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటిపోతోందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు.. ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల రైతులను అదుపు చేసేందుకు సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండటం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచిచూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు. తరుముతున్న కాలం.. రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్టదశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కకు బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం అత్యవసరం. అదును తప్పితే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. దీంతో రైతులు సొసైటీ ఆఫీసులు, యూరియా దుకాణాల ముందు రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు. రాష్ట్రంలోని 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. దీంతో ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల ప్రజలంతా ఉదయాన్నే రైతు వేదికల వద్దకు వచ్చి లైన్లల్లో నిలబడుతున్న దృశ్యాలు దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరినాట్లు ముందుగా పడే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మలిదశ యూరియా వాడకం కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ‘అదును తప్పుతోంది.. ఒక్క బస్తా అయినా ఇప్పించండి’అని కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల మొదలైన జిల్లాల రైతులు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి తెప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రోజూ ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్నది 23 వేల మెట్రిక్ టన్నులే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న యూరియా ఏ రోజుకు ఆరోజే అన్నట్లుగా అయిపోతోంది. నిల్వ లేకుండా డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ అధికారులు యూరియాను ఆయా జిల్లాల్లో డిమాండ్ అధికంగా ఉన్న మండలాలకు పంపిస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులకు తగ్గకుండా యూరియాను కేంద్రం నుంచి తెప్పిస్తున్నా.. అది ఏమూలకు సరిపోవడం లేదు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందులో సొసైటీల వద్ద 6 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఈ నిల్వల్లో 70 శాతం వరకు పంపిణీ చేసి, మిగతా నిల్వను మరుసటి రోజు కోసం దాచిపెడుతున్నారు. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న 10 వేల మెట్రిక్ టన్నులను ఆచితూచి పంపిస్తున్నారు. వీటికి తోడు ఆ రోజు వచ్చే రైల్వే వ్యాగన్ల లోడ్ మీదనే వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఆధారపడుతోంది. సరఫరా చేసింది 7 లక్షల టన్నులు.. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు సరఫరా చేసిన యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఈ సీజన్లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఒక లక్ష ఎకరాలు తక్కువగా అంచనాలో 98 శాతం మేర సాగయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం ఉన్నది ఈ సీజన్లోనే. ఇందులో యూరియా అత్యధికంగా వినియోగించే వరి ఏకంగా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 104 శాతం సాగైంది. 65.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 122 శాతం.. అంటే 6.36 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా యూరియా వినియోగం అధికంగా ఉండడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం కన్నా దాదాపు 10 లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం పెరగ్గా, యూరియా కేటాయింపులు మాత్రం తగ్గాయి. ఈ నెలాఖరు వరకు 9.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 7 లక్షల మెట్రిక్ టన్నులే. కనీసం మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు వెంటనే వస్తే తప్ప రైతులకు బాధలు తప్పవు. అదును తప్పిపోయిన తరువాత యూరియా వచ్చినా ఉపయోగం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే యూరియా విక్రయంలో రేషన్ పద్ధతి పాటించేలా చేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్య చిన్న, సన్నకారు రైతులు ఒక్కో యూరియా బస్తా కోసం పడిగాపులు పడుతున్నారు. -
‘నాకు టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలి’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
పానీపూరీ తిని నెల రోజులు ఆస్పత్రిపాలైన సాఫ్ట్వేర్ ఇంజినీర్
హైదరాబాద్: రోడ్డుపక్కన పానీపూరీ బండి కనపడగానే నోరు ఊరుతుంది. కానీ, అందులో వాడే నీళ్ల నాణ్యత గానీ, అమ్మే వ్యక్తి పాటించే పరిశుభ్రత గానీ పట్టించుకోకుండా తినడానికి వెళ్తే ఒక్కోసారి పెనుముప్పు వాటిల్లుతుంది. నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ విషయంలో ఇలాగే జరిగింది. పానీపూరీ తిని, తీవ్రమైన హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఆ యువకుడు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. దాంతో అన్నాళ్లూ ఉద్యోగానికి దూరం కావడమే కాక, చికిత్స ఖర్చు భారం కూడా అతడి మీద పడింది. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. కలువల హర్ష తేజ తెలిపారు. “కళ్లు, చర్మం పసుపుపచ్చగా అయిపోవడం (కామెర్లు), కడుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, నీరసం, మూత్రం బాగా ముదురు రంగులో ఉండడం లాంటి సమస్యలతో ఆ యువకుడు ఆస్పత్రికి వచ్చాడు. ఏం జరిగిందని లోతుగా ప్రశ్నిస్తే, తాను రెండు వారాల క్రితం రోడ్డుపక్కన పానీపూరీ తిని, అక్కడ డబ్బాలో మంచినీళ్లు తాగానని చెప్పాడు. రక్తపరీక్షలు చేయడా హెపటైటిస్ ఎ తీవ్రంగా ఉందని, దాంతోపాటే కాలేయంలోని ఎంజైమ్లు పెరిగాయని, యాంటీ-హెచ్ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది.చాలామంది యువతలో హెపటైటిట్ ఎ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, నిర్లక్ష్యం చేస్తే అది చాలా ఇబ్బంది, సమస్యలు తెస్తుంది. వీధుల్లో అపరిశుభ్రంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎంత తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్లు వస్తాయో ఈ కేసు వల్ల తెలుస్తుంది. ఆ యువకుడికి ముందుగా హైడ్రేషన్ ఇచ్చి, కాలేయాన్ని కాపాడే మందులు, ఇతర చికిత్సలతో 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేశాం. కాలేయం క్రమంగా మెరుగుపడింది. నాలుగు వారాలకు అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో రక్షణ కోసం హెపటైటిస్ ఎ టీకా తీసుకోవాలని సూచించాం" అని తెలిపారు.మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే రోజువారీ పనుల్లో జాగ్రత్తలు పాటిస్తే మన కాలేయం భద్రంగా ఉంటుందని, పాటించకపోతే ముప్పులో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. తగిన అవగాహన, నిరోధక టీకాలు అందించడం ద్వారా ఇలాంటి నిరోధించగల వ్యాధుల నుంచి సమాజాన్ని రక్షించవచ్చు.-డాక్టర్. కలువల హర్ష తేజ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ విషయంలో కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాహుల్పై మాట్లాడే అర్హత కేటీఆర్కు ఉందా?. ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?. ఓట్ చోరీ గురించి రాహుల్ ఆధారాలతో నిరూపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదు.బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారు. ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కూడా ఎందుకు స్పందించడం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు మానసికంగా ఒక్కటే కానీ.. భౌతికంగా ఒక్కటి కావాల్సి ఉంది. అందుకే రాహుల్పై కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ను కలిసిన మాజీ మేయర్ కావ్య
హైదరాబాద్: ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను శుక్రవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో జవహర్నగర్ మాజీ మేయర్ కావ్య కలిశారు. జవహర్నగర్ కార్పొరేషన్ను మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే సమగ్రంగా నివేదికను రెడీ చేసింది. ఇక, తాజాగా ఆ రిపోర్టు తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. దీంతో, ఈ కేసులో ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. కాగా, మరో రెండు రోజుల్లో ఫైల్పై విజిలెన్స్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం, ప్రభుత్వానికి ఫార్ములా ఈ-రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. ఒకవేళ, అక్కడ ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై చార్జిషీటు దాఖలు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది.ఇక, ఫార్ములా ఈ-రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు A4, A5 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది. -
తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక, అంతకుముందు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.LOCALISED HEAVY THUNDERSTORMS ALERT TODAY ⚠️⛈️ Today, the Upper air circulation (UAC) centre is falling right on Telangana Scattered SEVERE THUNDERSTORMS expected in North, West, Central TG districts like Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Karimnagar, Jagitial,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2025 Today’s Forecast (Sept 13, 2025) ⛈️⛈️Heavy to Very Heavy Rains likely across North, West, Central TG at few places. Moderate Rains in South, East TG‼️Hyderabad : Intense Spell at few places— Weatherman Karthikk (@telangana_rains) September 13, 2025 -
రేణు అగర్వాల్ కేసు.. పోలీసులు అదుపులో నిందితులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను స్పెషల్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఢిల్లీలో, మరో ఇద్దరిని జార్ఖండ్లో పట్టుకున్నారు. దీంతో, వారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాకేష్, రేణు అగర్వాల్కు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్, శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు.ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలించారు. తాజాగా నిందితులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. -
శ్మశానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మాధవి..!
హైదరాబాద్: శ్మశానవాటికలో అయితే ఎలాంటి అనుమానం రాదనుకున్నదో ఏమో..ఓ మహిళ ఆ ప్రాంతాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చింది. యువతులను తీసుకువచ్చి విటులను ఆహా్వనించి ఆమె కొనసాగిస్తున్న వ్యభిచార గృహం గుట్టురట్టయ్యింది. నిర్వాహకురాలితో పాటు ఓ మహిళ, విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బేగంపేట శ్యాంలాల్బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉండడాన్ని గుర్తించారు. మారీ మాధవి (39) అనే మహిళ ఇక్కడి గదిని వ్యభిచార గృహంగా మార్చినట్లు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను తీసుకువచ్చి విటులకు సమాచారం అందించి రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో మాధవి ఒప్పుకుంది. దీంతో నిర్వాహకురాలు మాధవితో పాటు గదిలో ఉన్న మహిళ, విటుడిగా వచ్చిన బాలానగర్కు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ జనహిత పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తర్వాత జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం నల్లగొండ, మహబూబ్నగర్లో ఈసారి యాత్ర జరగనుంది.ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల నేతలకు ఇప్పటికే టీపీసీసీ ఆదేశాలి్చంది. ఈ నెల 16న హైదరాబాద్కు రానున్న మీనాక్షి వారం పాటు ఇక్కడే ఉంటారని సమాచారం. జనహిత పాదయాత్రలో పాల్గొనడంతోపాటు ఈ దఫా పర్యటనలో ఆమె కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పార్టీ నాయకత్వానికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఈసారి క్లియర్ అవుతుందని సమాచారం. అందుకోసం ఆమె మరోమారు సీఎం రేవంత్రెడ్డితో సమావేశమవుతారని తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చేవారంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటివరకు బస్తీలు, వార్డులవారీ సమావేశాలకు పరిమితమైనా వచ్చే వారంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద సభను నిర్వహించాలని, ఈ సభకు సీఎం రేవంత్తోపాటు మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్థానిక నేతలతో పాటు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా మీనాక్షి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని గాం«దీభవన్ వర్గాల సమాచారం.కాగా, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ పదవి చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీల సమరభేరి సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచన కారణంగా సభను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలపై చర్చించేందుకు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం భేటీ కానుంది. -
బొగ్గు వేలం ఎక్కడున్నా వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: ఇకపై దేశంలో ఎక్కడ బొగ్గు గనుల వేలం జరిగినా సింగరేణి సంస్థ పాల్గొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి పరిధిలో ఉన్న ప్రస్తుత గనులు తరిగిపోతున్నాయని, మరో పదేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ ఉనికికి కూడా ప్రమాదం పొంచి ఉందని, ఈ ప్రమాదం బారి నుంచి సింగరేణిని కాపాడుకొని నిలబెట్టుకునేందుకే ఈ నిర్ణ యం తీసుకున్నామని చెప్పారు.శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే కె.విజయరమణారావు, సింగరేణి సీఎండీ బలరాం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మిక సంఘాలతోపాటు బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించే వేలంలో పాల్గొనకుండా గత పాలకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సత్తుపల్లి, కోయగూడెం మైనింగ్ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు దారాధత్తమయ్యాయి.తద్వారా రాష్ట్రానికి రూ.60వేల కోట్ల రెవెన్యూ నష్టం వచ్చింది. సింగరేణి సంస్థకు రూ.15వేల కోట్లు నష్టం కలిగింది. బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే అటు సింగరేణితోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. సింగరేణికి కొత్త బ్లాకులు వస్తాయి. రాష్ట్రానికి రాయల్టీ రూపంలో ఆదాయం వస్తుంది. సింగరేణి మనుగడ దృష్ట్యా ఇకపై ఎక్కడ బొగ్గు గనుల వేలం జరిగినా పాల్గొనాలని నిర్ణయించాం.’అని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే కలిగే లాభాలు, పాల్గొనకపోవడం కారణంగా జరిగే నష్టాలు, ఇతర రాష్ట్రాల్లో గనుల వేలం జరిగిన తీరును గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. త్వరలోనే బంగారం అన్వేషణ సింగరేణి వ్యాపార విస్తరణలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో రాగి, బంగారం తవ్వకాల లైసెన్స్ను సింగరేణి సంస్థ సాధించిందని భట్టి చెప్పారు. రాయచూర్, దేవదుర్గ్ బెల్టు లో రాగి, బంగారం బ్లాకులను వేలంలో దక్కించుకున్నా మని తెలిపారు. త్వరలోనే అన్వేషణ పనులు ప్రారంభిస్తా మన్నారు. ఈ ప్రాంతంలో భవిష్యత్లో జరిగే రాగి, బంగారం తవ్వకాలకు 37.75 శాతం రాయల్టీ వస్తుందని, ఇది సింగరేణి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు. సింగరేణి గ్లోబల్ పేరుతో ఖనిజ రంగంలోకి థర్మల్, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై సింగరేణి దృష్టి సారించిందని భట్టి అన్నారు. దేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడ విలువైన ఖనిజాల వేలం జరిగినా పాల్గొనాలని, ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు ఓ కన్సల్టెంట్ కమిటీని నియమించినట్టు ఆయన చెప్పారు. గ్రీన్హైడ్రోజన్ పై కూడా దృష్టి సారించి సింగరేణి పనిచేస్తుందని, సింగరేణి గ్లోబల్ పేరుతో విలువైన ఖనిజాల రంగంలోకి ప్రవేశిస్తామని ఆయన వెల్లడించారు. ⇒ సింగరేణి సీఎండీ బలరాం మాట్లాడుతూ భవిష్యత్లో జరిగే వేలంలో పాల్గొని కొత్త బ్లాకులు సాధించడం ద్వారా సంస్థ మనుగడకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ దిశలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ సీఐఐ అవార్డుల ప్రదానంలో డిప్యూటీ సీఎం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి.. లైఫ్ సైన్సెస్ వరకు అధునాతన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాదు సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం సాయంత్రం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సౌత్ రీజియన్ నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ లీడర్షిప్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో భట్టి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎఫ్వో కీలక భూమిక పోషించాలని కోరారు. కార్యక్రమంలో సీఐఐ దక్షిణ ప్రాంత డైరెక్టర్ దేవ్జ్యోతి, సీఐఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, సైయంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఫీజు’కు ఎంత కోత పెట్టొచ్చు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమబద్ధికరించే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ముఖ ఆధారిత హాజరు విధానం అమలుపై దృష్టిపెట్టారు. ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందుతున్న విద్యా ర్థులు ఎంత మంది? వారిలో నిత్యం కాలేజీలకు హాజరయ్యే వారు ఎందరు? 75 శాతం లోబడి విద్యార్థుల హాజరున్న కాలేజీలు ఎన్ని? ఎందరు విద్యార్థులు ఈ విభాగం కిందకు వస్తారు? అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వర్సిటీల స్థాయి లో ఇప్పటికే ముఖ ఆధారిత హాజరు విధానం అమ లు చేస్తున్నారని.. వర్సిటీల అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రం ఇది అమలు కావట్లే దని వీసీలు తెలిపారు. దీన్ని కచి్చతంగా అమలు చేసేలా చూడాలని చైర్మన్ సూచించినట్లు తెలిసింది. కోతకు లెక్కలేంటి? కాలేజీకి సరిగా రాని విద్యార్థులకు, రెగ్యులర్గా కాలేజీకి వచ్చి చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఒకే విధంగా ఉండటం ఏమిటనే ప్రశ్న ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు ఎందరు ఉంటారో చెప్పాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఇటీవల అడిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ను ఏ మేరకు కుదించే వీలుందో పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని వీసీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది? కాలేజీకి హాజరవ్వని విద్యార్థులు ఎందరు? ఈ దిశగా సమగ్ర సమాచారం సేకరించాలని వీసీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరినట్లు తెలిసింది. ఆ వివరాల ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ లెక్కలను తయారు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. డిజీ లాకర్ విధానం పూర్తిగా డిజిటల్ విధానంలోకి యూనివర్సిటీలు వెళ్ళాలని బాలకిష్టారెడ్డి వీసీలకు సూచించారు. సర్టి్టఫికెట్లను ఆన్లైన్ విధానంలోనూ అందుబాటులోకి తేవాలని.. దీనివల్ల తప్పుడు ధ్రువీకరణ పత్రాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. డిజీ లాకర్ విధానంతోపాటు ప్రతి విద్యార్థికీ యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రతి వర్సిటీ నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ దిశగా బోధన ప్రణాళికలో సమూల మార్పులు తేవాలని.. తద్వారా సమీకృత బోధన విధానం అమలుకు కృషి చేయొచ్చన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సుల్లో క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్లు పురుషోత్తం, మహ్మద్, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ప్రైవేటు కాలేజీలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సాధించుకునే దిశగా ఆందోళన చేపట్టాలని రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డిని కలిసి సమ్మె చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా తెలిపాయి. ఈ నెల 30లోగా ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. బంద్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,500కుపైగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలు మూతపడతాయని.. దీనివల్ల సుమారు 10 లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని సంఘం నేతలు పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్లకు చేరిన బకాయిలు.. సుమారు రూ. 10 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో సర్కారు విఫలమైందంటూ కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్ల బకాయిల సాధన కోసం ‘ఫతి’పేరిట ఏర్పడి పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరితోనూ సమావేశమయ్యాయి. అయినా సర్కారు ఒక్క రూపాయి కూడా బకాయిలు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను యాజమాన్యాలు సర్కారు ముందుంచాయి.రూ. లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. రూ. లక్ష కోట్ల డిపాజిట్ల సొమ్ముతో ప్రభుత్వ వాటా పరిమితమేనని.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్), కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారా ఈ నిధులను సేకరించవచ్చని సూచించాయి. ఈ డిపాజిట్లపై వచ్చే 7 శాతం వడ్డీ (సుమారు రూ. 3 వేల కోట్లు)తో ఫీజు రీయింబర్స్చేయవచ్చని ప్రతిపాదించాయి. అయితే అందుకు కూడా ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో విసిగిపోయిన కాలేజీల యాజమాన్యాలు.. రాష్ట్రంలోని అన్ని రకాల వృత్తివిద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమావేశం అనంతరం ఈనెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు ‘ఫతి’పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయనందుకు ఇంజనీర్స్డేను బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించాయి. 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా..‘ఫతి’బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం(టీపీడీపీఎంఏ) కూడా కాలే జీల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరెడ్డి, యా ద రామకృష్ణలు ప్రకటించారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.దసరా జరుపుకోలేని పరిస్థితులున్నాయి ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యకు తొలి ప్రాధాన్యత లభిస్తుందనుకున్నాం. కానీ అసలు ప్రాధాన్యతే లేకుండా పోయింది. రూ. 10 వేల కోట్ల బకాయిల విడుదల కోసం 6 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం. ప్రత్యామ్నాయ ప్రణాళికను సర్కారు ముందుంచాం. దసరా పండుగను సంతోషంగా జరుపుకోలేని పరిస్థితులున్నాయి. జీతాలు ఇవ్వకపోతే సోమవారం నుంచి విధులకు హాజరుకాబోమని సిబ్బంది తేలి్చచెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాం. ఈ నెల 30లోగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి. – రమేశ్, ‘ఫతి’చైర్మన్6 నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం ప్రైవేటు కాలేజీల సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. యజమానులుగా మధ్యాహ్నం పూట కాలేజీకి వెళ్లలేకపోతున్నాం. సాయంత్రం, రాత్రిపూట వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్నాం. బకాయిల విడుదల కోసం ఉప ముఖ్య మంత్రి భట్టిను నాలుగుసార్లు కలిశాం. ఇంజనీర్స్డేను బ్లాక్డేగా పాటించి, బంద్ను పాటించబోతున్నాం. ఆగస్టు 31 వరకు మాకు రావాల్సిన పూర్తి బకాయిలను విడుదల చేయాలి. – కేవీ రవికుమార్, ‘ఫతి’నాయకుడు -
విశ్వపరిశోధనాలయాలు
భారత్లో ఆవిష్కరణల వేగం పుంజుకొంది. దానికి తగ్గట్టుగా మేధో సంపత్తి హక్కుల (ఐపీ) కోసం దరఖాస్తులూ వెల్లువెత్తుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం దేశంలో దాఖలైన పేటెంట్లలో భారతీయ సంస్థల వాటా 20% కంటే తక్కువ. 2023కి వచ్చేసరికి ముఖచిత్రం మారిపోయింది. మొత్తం పేటెంట్ ఫైలింగ్స్లో ఏకంగా 57 శాతం వాటాతో మన సంస్థలు సత్తా చాటాయి. దరఖాస్తుల్లో దేశీయ యూనివర్సిటీలు ముందంజలో ఉండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుండి సృష్టికర్తగా మారడానికి మనదేశం క్రమంగా అడుగులేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–15లో భారతీయుల నుంచి వచ్చిన పేటెంట్ దరఖాస్తులు 12,071 కాగా, 2023–24 నాటికి ఇది 51,574కు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అలాగే, అప్పట్లో పేటెంట్ల మంజూరు కేవలం 684 కాగా, పదేళ్లలో 25,082కు పెరిగింది. పేటెంట్ నియమాలకు సవరణలతో నిర్దిష్ట గ్రూప్స్నకు వేగంగా పరీక్షలు, గడువు కాలాన్ని సరళీకృతం చేయడం.. విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు దరఖాస్తు రుసుములను 80% తగ్గించడం.. ఫైలింగ్, సమాచారం పూర్తిగా డిజిటలైజేషన్ వంటి సంస్కరణలకు దారితీశాయి.యూనివర్సిటీల సత్తాపేటెంట్ దాఖలు, టెక్నాలజీ బదిలీ, మేధోసంపత్తి హక్కు ల (ఐపీ) ద్వారా ఆదాయ సముపార్జన వంటి అంశాల్లో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేక ఐపీ సెల్స్ను, చట్టపరమైన సహాయ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా విశ్వవిద్యాల యాలు కూడా ముందంజలో ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలలో మేధోసంపత్తి హక్కులపై అవగాహన కోసం ప్రభుత్వం 2020లో ‘కపిల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. 2021 సెప్టెంబరు నుంచి పేటెంట్ దరఖాస్తు రుసుము గణనీయంగా తగ్గడం యూనివర్సిటీల్లో జోష్ నింపింది. ఐఐటీ మద్రాస్ 2022లో 156 పేటెంట్లను అందుకోగా.. ఏడాదిలో ఈ సంఖ్య 300కి చేరింది. ఐఐటీ బాంబే 2023–24లో 421 పేటెంట్లతో దేశంలో అగ్రస్థానంలో ఉంది.⇒ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 2020లో 48వ స్థానం నుంచి 2024లో 39వ స్థానానికి ఎగబాకింది. ⇒ భారత్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి చేస్తున్న వ్యయం ప్రస్తుతం జీడీపీలో 0.67% మాత్రమే. ఇది యూఎస్లో 3.5%, చైనాలో 2.5%. ⇒ విద్యా సంస్థల పేటెంట్ అప్లికేషన్స్సంవత్సరం భారత్ విదేశీ2021–22 7,405 962022–23 19,155 2752023–24 23,306 237పెరిగిన వేగంరెండేళ్లలో దాఖలైన దాదాపు 80% పేటెంట్లు ఇప్పటికీ నమోదు కోసం వేచి ఉన్నాయి. అయితే 2000ల ప్రారంభంలో ఒక్కో పేటెంట్ మంజూరుకు 8–10 సంవత్సరాలు పట్టింది. 2020లో చాలావరకు 2–3 ఏళ్లలోపే అయిపోయాయి. కొన్ని దరఖాస్తు చేసిన ఏడాదిలోనే మంజూరయ్యాయి.వ్యక్తులూ.. విద్యాసంస్థలూ..2000లో వచ్చిన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో కంపెనీలవి 43 శాతం కాగా, 2023 నాటికి ఇది 17 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వ్యక్తుల దరఖాస్తులు 10 నుంచి 32 శాతానికి పెరిగాయి. 2010లో 20 శాతంలోపే ఉన్న విద్యాసంస్థల వాటా.. ఇప్పుడు ఏకంగా 43 శాతానికి ఎగబాకింది. 2023–24లో దేశీయ సంస్థలు, వ్యక్తుల వంటి వారు పెట్టుకున్న మొత్తం పేటెంట్ దరఖాస్తులు 51,574 కాగా మంజూరైనవి 25,079. ఇందులో..⇒ 2010 నుంచి 2025 సెప్టెంబరు 11 వరకు ఫైల్చేసిన పేటెంట్లు 9,32,693⇒ వీటిలో భారతీయులు దరఖాస్తు చేసినవి 3,83,073⇒ మొత్తం దరఖాస్తుల్లో మంజూరైనవి 3,20,807⇒ వీటిలో భారతీయులవి 70,088 -
పైసలకు కటకట.. పాలన వెలవెల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక సిబ్బందికి నెలల తరబడి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం కేటాయించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. వివిధ శాఖల నుంచి రావాల్సిన సెస్సులు, గ్రాంట్లు రాకపోవడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత మూడు దఫాలుగా 20 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక గ్రాంట్లు ఇస్తే తప్ప ఈ మున్సిపాలిటీలు మనుగడ సాగించే పరిస్థితి లేదని స్థానికులు అంటున్నారు. సిబ్బంది, మౌలిక వసతుల లేమి.. కొత్త మున్సిపాలిటీల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థిర, చరాస్తులు.. భవనాలు, లే ఔట్ అనుమతులు, పన్నుల వసూలుకు సంబంధించిన ఫైళ్లను కమిషనర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్ వంటి ఒకటిరెండు మిన హా మిగతా పోస్టుల్లో సమీప మున్సిపాలిటీలకు చెందిన అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్ప గించారు. దీంతో వారు కొత్త మున్సిపాలిటీలకు అరుదుగా వచ్చి వెళ్తున్నారు.మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులు భర్తీ కాకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇన్చార్జిలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు మున్సిపల్ కార్యాలయాలుగా బోర్డులు మార్చినా ఫరి్నచర్ కొరత వేధిస్తోంది. రికార్డులను భద్రపరచడం సమస్యగా మారింది. మున్సిపల్ కార్యాలయాలకు వచ్చే వారు కనీసం కూర్చునే పరిస్థితి లేదు. ఆదాయానికి, ఖర్చుకు కుదరని లంకె.. కొత్త మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయానికి, ఖర్చుకు పొంతన కుదరక ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో రెండేళ్లవరకు పన్నులను సమీక్షించి పెంచే అవకాశం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు వస్తున్న ఆదాయంతోనే పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ శివార్లలోని ఇస్నాపూర్, ఇంద్రేశం వంటివాటికి మినహా మిగతా చోట్ల ఆర్థిక పరిపుష్ట లేక సమస్యలు ఎదురవుతున్నాయి.గ్రామ పంచాయతీలకు సాధారణంగా ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, వాణిజ్య లైసెన్సుల జారీ, వాటి రెన్యూవల్, తైబజార్ వేలం, పశువుల సంత తదితరాల ద్వారా జనరల్ ఫండ్ సమకూరుతోంది. పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల విడుదల నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్, ఇతర విభాగాల నుంచి సెస్సుల విడుదల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ డీజిల్ వంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో కొత్త మున్సిపాలిటీలు ఉన్నాయి. కమిషనర్ వేతనం కూడా జీఎఫ్ నుంచే.. కమిషనర్, అధికారులు, ఇతర ఉద్యోగుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయకపోవడంతో వేతనాల చెల్లింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి 010 పద్దు కింద వేతనాలు చెల్లించే వెసులుబాటు లేకపోవడంతో జనరల్ ఫండ్ (జీఎఫ్) నుంచే కమిషనర్, సిబ్బంది వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. విలీన గ్రామపంచాయతీల కార్యదర్శులు పట్టణంలో పనిచేస్తూ పంచాయతీరాజ్ విభాగం నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో పనిచేసే కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీల్లో రూ.9,500 వేతనం పొందే వారు. మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో వారికి ప్రతి నెలా రూ.15,600 వేతనం చెల్లించాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల పాత వేతనాలే ఇస్తున్నారు. వాటిని కూడా నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఇవే.. కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం (సంగారెడ్డి).. కేసముద్రం (మహబూబాబాద్).. స్టేషన్ ఘన్పూర్ (జనగాం).. మద్దూర్ (నారాయణపేట).. ఎదులాపురం, కల్లూరు (ఖమ్మం).. అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం).. చేవెళ్ల, మొయినాబాద్ (రంగారెడ్డి).. ములుగు (ములుగు).. అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ (మేడ్చల్–మల్కాజ్గిరి).. బిచ్కుంద (కామారెడ్డి). జిల్లా కేంద్రమే అయినా.. ములుగు జిల్లా కేంద్రం ఈ ఏడాది 29న గ్రామ పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయ్యి 20 వార్డులతో కొత్త మున్సిపాలిటీగా ఏర్పడింది. పొరుగునే ఉన్న బండారుపల్లి, జీవింతరావుపల్లి పంచాయతీలు ఇందులో విలీనం అయ్యాయి. ఇప్పటివరకు కమిషనర్, మేనేజర్ మాత్రమే బదిలీపై వచ్చారు. పురపాలనలో అత్యంత కీలకమైన ఏఈ, టీపీఎస్, అకౌంట్స్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలో ప్రస్తుతం 130 మంది మల్టీ పర్పస్ వర్కర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో 80 మంది పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నవారే. మున్సిపాలిటీ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలుగా కాగా, ఏటా రూ.3.27 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వస్తోంది. దీంతోపాటు మరో రూ.1.20 కోట్లు కార్యాలయ నిర్వహణ, వాహనాలు, ఇంధనం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. నాలుగు నెలలుగా జీతాల్లేవు.. కల్లూరు గ్రామ పంచాయతీలో గడిచిన 23 ఏళ్లుగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నా. నాతోపాటు మరో 93 మంది మల్టీ పర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసిన కాలంలో నెలకు రూ.9,500 వేతనం ఇచ్చేవారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎంత వేతనం వస్తుందో తెలియదు. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. జీఓ 60ని అనుసరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, జీవిత బీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సయ్యద్ వజీర్ మియా, ఎలక్ట్రీషియన్, కల్లూరు మున్సిపాలిటీ -
ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీని వీడిన పలువురు కాంగ్రెస్లో చేరారని బీఆర్ఎస్ అంటుంటే, వారు తమ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ అంటోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చోరీకి పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాహుల్ ఫోటోలు దిగారని, ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఏంటని ప్రశ్నించారు. ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు కేటీఆర్.ఇక తాము కాంగ్రెస్లో చేరలేదని ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ను కలిశామని అంటున్నారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. -
కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి..హైదరాబాద్లో దారిదోపిడీ..
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.హైదరాబాద్కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్.. తన కారు డ్రైవర్..వ్యాపార భాగస్వామిని వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్,పార్టనర్ ఇద్దరు కలిసి వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్ వాహనం ఢీకొట్టింది.వెంటనే మెరుపు వేగంతో రాకేష్ అగర్వాల్ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్ డమ్మీదని గుర్తించారు. నెంబర్ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయిందని.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జల మండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్కార్ నడుపుతున్నరా?సర్కస్ నడుపుతున్నరా?ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోనిమూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు… pic.twitter.com/y4AgJyiXir— KTR (@KTRBRS) September 12, 2025 -
వీధిలో చెత్త వేశారో.. మీ ఇంటికి పోలీసులొస్తారు
● 2024 అక్టోబర్ 11: మాసబ్ట్యాంక్ ప్రాంతంలో అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్తకుప్ప నుంచి ఓ వీఽధికుక్క మాంసం తీసుకువెళ్తుండగా... ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయిందని తేలింది. ● 2025 ఫిబ్రవరి 12: టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ దేవాలయంలోనూ మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయం కొద్దిసేపట్లోనే దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అవాంఛనీయ ఘటలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మాంసం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి చుట్టు పక్కల సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చెత్త కుప్పలో పడేసిన వ్యర్థాల నుంచి ఓ పిల్లి తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు వెలుగులోకి వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో నగరంలో తరచూ చోటుచేసుకుంటున్న ఇలాంటి ఉదంతాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎవరి ప్రమేయం, ఎలాంటి దురుద్దేశం, కుట్ర లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈ తరహా ఘటనలు శాంతిభద్రతల సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. గణేష్, దుర్గా నవరాత్రుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఇలా జరిగితే పరిస్థితులు చేతులు దాటిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, మాంసం ఆహార వ్యర్థాలు వేయడమే వీటికి మూలమనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిషేధం ఉన్నా పట్టించుకోని ప్రజలు... బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంపై ఏళ్లుగా నిషేధం ఉంది. ఇలా చేసిన వారికి జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణీత మొత్తం జరిమానా విధించే అవకాశమూ ఉంది. గతంలో బల్దియా అధికారులు ఇంటింటికీ చెత్త డబ్బాలు కూడా పంచి పెట్టారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే విధానమూ అమలులో ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తున్నారు. గార్బేజ్ల వద్దే కాకుండా కాస్త ఖాళీ కనిపిస్తే చాలు అక్కడ డంప్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకువచ్చి పడేసే ఈ చెత్తలో ఆహార వ్యర్థాలు, మాంసం కూడా ఉంటున్నాయి. ఇలా బహిరంగ ప్రదేశాల్లో పారేసే చెత్తను క్లియర్ చేయడం, అలా వేయకుండా నియంత్రించడంలో జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగానే ఎన్ని స్వచ్ఛ అవార్డులు గెల్చుకున్న నగరమైనా ఇప్పటికీ ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తుంటాయి. రంగంలోకి దిగిన పోలీసు విభాగం.. ఈ చెత్త వల్ల ఉత్పన్నం అవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం నియంత్రించాలని నిర్ణయించింది. దీనికోసం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను వినియోగించుకుంటోంది. ప్రతి ప్రాంతంలోనూ కాకపోయినా.. కొన్ని సున్నిత, కీలక ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. ప్రధానంగా రెండు వర్గా లు, ప్రార్థన స్థలాలు ఉన్న చోట్ల ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చెత్త వేస్తున్న వారిని స్థానిక పోలీసులు గుర్తించనున్నారు. ఆపై వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి సిఫార్సు చేయడమో, సిటీ పోలీసు చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవమో చేయనున్నారు. ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ చర్య ల వల్ల అవాంఛిత ఘటనలు నిరోధించడంతో పా టు స్వచ్ఛ హైదరాబాద్ను సాధించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తీవ్ర ఇబ్బందులు తెస్తున్న ఆహార, మాంస వ్యర్థాలు కొన్నిసార్లు శాంతిభద్రతల సమస్యల వరకు.. నిఘా వేసి ఉంచాలని నగర పోలీసుల నిర్ణయం సీసీ కెమెరాలను సైతం వినియోగిస్తున్న కాప్స్ -
రూ.1000 కోట్ల మోసం..
ఇద్దరు నిందితుల అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నెట్వర్క్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్రేక్ చేశారు. కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడుల పేరిట సుమారు రూ.1,000 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఘరానా కేటుగాళ్లను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డం వేణుగోపాల్, కర్ణాకటకు చెందిన శ్రేయాస్ పాల్ ఇరువురు కలిసి సైబరాబాద్ కేంద్రంగా నకిలీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఐఐటీ క్యాపిటల్ టెక్నాలజీస్, ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ అనలిటిక్స్, ట్రేడ్ బుల్స్ టెక్నాలజీస్ వంటి రకరకాల పేర్లతో ఆన్లైన్లో నకిలీ కంపెనీలను నిర్వహిస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నకిలీ సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రిజిస్ట్రేషన్లను సైతం సృష్టించారు. మధ్యతరగతి ఇన్వెస్టర్లను, ఐటీ నిపుణులు, రిటైర్డు ఉద్యోగులను నమ్మించేందుకు ప్రీమియం ఆఫీసులు, హోటళ్లలో సెమినార్లలో నిర్వహించేవారు. పెట్టుబడులపై ఏటా 84 శాతం రాబడిని అందిస్తామని మాయమాటలు చెప్పారు. స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్, కల్పిత ట్రేడింగ్ డాష్బోర్డ్ల ముసుగులో 2022 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు 3 వేలకు పైగా బాధితుల నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులను వసూలు చేశారు. ఇన్వెస్టర్ల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును 21 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. ఆయా సొమ్ముతో ప్రాపర్టీలు, లగ్జరీ వాహనాలు, బంగారం కొనుగోలు చేశారు. ఈమేరకు పలువురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులు గడ్డం వేణుగోపాల్, శ్రేయాస్ పాల్లను అరెస్టు చేశారు. 20 మందికి పైగా ఏజెంట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ డెవలపర్లు, వెబ్సైట్ నిర్వాహకులు ఈ నెట్వర్క్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
● ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం ● నాలా ప్రాంతాల్లోనూ అశ్రద్ధే.. ప్రాణాలు పోతున్నా అంతేనా వర్షాలు కురుస్తున్నా తెరిచి ఉంచుతున్న మ్యాన్హోళ్ల మూతలు సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయా ప్రభుత్వ విభాగాలు చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గురువారం ఐదేళ్ల బాలిక మ్యాన్హోల్ గుంతలో పడటమే ఇందుకు నిదర్శనం. సకాలంలో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రతియేటా వర్షాకాలానికి ముందే వానలతో ప్రమాదాలు సంభవించకుండా నాలా ప్రాంతాల్లో భద్రత చర్యలు పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కప్పులు వేయడం, మెష్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆపనులు సవ్యంగా జరగడం లేదు. దాంతో పిల్లలు, పాదచారులు, కార్మికులు నాలాల్లో పడి మరణిస్తున్నారు. భద్రత కరువు తగిన రక్షణ ఏర్పాట్లు, భద్రత చర్యలు లేకపోవడంతోనే ఏడాది క్రితం కవాడిగూడ నాలాలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఓల్డ్బోయిన్పల్లిలో ఆనంద్సాయి, నేరేడ్మెట్లో సుమేధ, యాకుత్పురాలో జకీర్ అబ్బాస్ తదితర బాలలు నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. హైడ్రా నిర్వాకం గురువారం ఉదయం రెయిన్బజార్ డివిజన్ మౌలాకాచిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక స్కూల్కు వెళ్తూ మూత లేకుండా ఉన్న మ్యాన్హోల్లో పడిపోయింది. బాలిక నానమ్మ, స్థానికులు గుర్తించి వెంటనే.. పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. జీహెచ్ఎంసీ నిర్వాకం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ మ్యాన్హోల్ పనులు తాము చేయడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. హైడ్రా సిబ్బంది మ్యాన్హోల్ను శుభ్రం చేసేందుకు బుధవారం మూత తెరిచారు. తిరిగి దాన్ని మూసివేయకుండా అలాగే వదిలేసి వెళ్లారు. సమన్వయ లేమి.. వరుస వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మ్యాన్హోళ్లు, నాలాల్లో పూడికతీత తదితర పనుల్ని జీహెచ్ఎంసీ చేసేది. రోడ్లపై నిల్వ నీటిని తోడిపోసేది. చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలో హైడ్రాకు మంచి పేరు రావడంతో వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతల్ని కూడా జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించారు. దీంతో జీహెచ్ఎంసీ కేవలం రోడ్లపై గుంతల్ని మాత్రమే పూడస్తోంది. మిగతా పనులు చేయడం లేదు. నాలాలు, మ్యాన్హోల్స్, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైడ్రాకు సరైన అవగాహన లేదు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినప్పటికీ, విభాగాల మధ్య అధికారుల మధ్య అది సాధ్యమవుతున్నట్లు లేదు. హైడ్రా సిబ్బంది మిగతా విభాగాల కంటే తామే గొప్ప అనేవిధంగా పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
మ్యాన్హోల్లో పడిన చిన్నారి..
తప్పిన ప్రాణాపాయం యాకుత్పురా: పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారి ప్రమాదశాత్తు డ్రైనేజీ మ్యాన్హోల్లో పడి స్వల్ప గాయాల పాలైన ఘటన గురువారం యాకుత్పురాలో జరిగింది. యాకుత్పురా గంగానగర్ నాలా మౌలా కా చీల్లా ప్రాంతానికి చెందిన సల్మాన్ కుతూరు జైనాబ్ ఫాతిమా (5) స్థానిక పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. గురువారం ఉదయం నానమ్మతో కలిసి పాఠశాలకు బయలుదేరింది. రోడ్డుపై ఉన్న మ్యాన్హోల్ పైకప్పు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. దీంతో ఆమె నానమ్మ, స్థానికులు వెంటనే చిన్నారి ఫాతిమాను పైకి లాగి కాపాడారు. స్వల్ప గాయాల పాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జలమండలి, హైడ్రా విభాగాల అధికారులు సిబ్బందితో మౌలాకా చీల్లా ప్రాంతాంలో డ్రైనేజీ మ్యాన్హోళ్ల పూడికతీత పనులు చేపట్టి పైకప్పు వేయకుండా వదిలేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తర్గట్టీ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ డిమాండ్ చేశారు. మ్యాన్హోల్లో పడిపోతున్న చిన్నారి ఫాతిమా -
పని మనుషులే ప్రాణాంతకులై..
కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది మూసాపేట: కూకట్పల్లిలోని స్వాన్లేక్ అపార్టుమెంట్లో గృహిణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి పని మనుషులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి.. స్వాన్లేక్ అపార్టుమెంట్ 13వ అంతస్తులోని 1,311 బ్లాక్లో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు నివాసముంటున్నారు. బాలానగర్, జీడిమెట్లలో స్టీల్ సామాను వ్యాపారాన్ని రాకేష్ అగర్వాల్, తన కుమారుడు శుభంతో నిర్వహిస్తు న్నారు. రాకేష్ భార్య రేణు (50) ఇంట్లోనే ఒక్కరే ఉండేవారు. వీరి కూతురు తమన్నా అహ్మదాబాద్లో ఎంబీఏ చదువుతోంది. కొన్ని నెలల క్రితం రేణు అగర్వాల్కు అనారోగ్యంగా ఉండటంతో బరువు పనులు చేసుకోలేకపోతున్నారు. దీంతో పని మనిషిని నియమించుకోవాల్సి వచ్చింది. వీరు నివసించే పై అంతస్తులో ఉండే బంధువుల ఇంటిలో పని చేస్తున్న రోషన్కు తెలిసిన వ్యక్తి హర్ష్ (20)ని 11 రోజుల క్రితం రేణు ఇంటితో పా టు మరో ఇంట్లో పనిలో కుదిర్చాడు. వీరు రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉండేవారు. రేణు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఆమెను హత్య చేయాలని పథకం రచించారు. ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఇదే అపార్ట్మెంట్లోని 14వ అంతస్తులో బంధువుల ఇంటిలో రోషన్ 11 నెలలుగా పని మనిషిగా చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు ఉండటం, రేణు ఇంటిలో ముగ్గురు కుటుంబ సభ్యులే ఉండటాన్ని గమనించాడు. రేణు భర్త రాకేష్, కుమారుడు శుభం ఉదయమే బయటకు వెళ్లేవారు. దీంతో రేణు ఒక్కరే ఇంట్లో ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఇద్దరూ కలిసి రేణు హత్యకు పథకం పన్నారు. బుధవారం రేణు భర్త, కుమారుడు బయటికి వెళ్లిన అనంతరం అదను చూసుకున్న నిందితులు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది.. లాకర్ కోడ్ చెప్పాలంటూ హింసించారు. రెండు చేతులపై కత్తి గాట్లు, కడుపులో పొడిచిన గాట్లు, మెడను అత్యంత కిరాతకంగా కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. రేణు హత్య అనంతరం అనుమానితులిద్దరూ అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంటికి తాళం వేసి లిఫ్ట్ నుంచి సెల్లార్లోకి వెళ్లారు. ఇంటి యజమాని స్కూటీపై బ్యాగ్తో పాటు ఇద్దరు పరారయ్యారు. లాకర్ ఓపెన్ చేసి డబ్బులు ఎంత మొత్తం దొంగిలించారో తెలియడంలేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం వెల్లడించలేదు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సుమారు 2 గంటల పాటు చక్కర్లు కొట్టి, స్కూటీని హఫీజ్పేటలో వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. స్నానం చేసి మరీ నింపాదిగా వెళ్లటంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం.. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్, ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు, బాచుపల్లి డీఐ, కూకట్పల్లి డీఐ, కేపీహెచ్బీ డీఐలు టీములుగా ఏర్పడి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. స్కూటీపై పరారవుతున్న అనుమానితులు కూకట్పల్లి పరిధిలో గృహిణి దారుణ హత్య మర్డర్ అనంతరం స్నానం చేసి బ్యాగ్తో పరారీ 5 టీంలతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు -
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
జూబ్లీహిల్స్ టికెట్పై ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆదర్శనగర్లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి’ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. స్పందిస్తూ.. అవన్నీ ఊహాగానాలు కావచ్చన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, టికెట్ ఎవరికి వచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేస్తామన్నారు. ప్రసుత్త పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎంతో అవసరమన్నారు. కొంతకాలంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దానం నాగేందర్ నిలిచే అవకాశం ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం అండదండ ఉండడంతో పాటు మైనార్టీ వర్గాల్లో సైతం ఆయనకు మంచి పరపతి ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దానం నాగేందర్కు సుమారు 85,000 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన జూబ్లీహిల్స్లో సులభంగా గెలిచే అవకాశం ఉందంటూ పార్టీ పెద్దలు సైతం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలోఅసాధారణ వృద్ధి
● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాలాపేట: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం అసాధారణ వృద్ధిని సాధిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. ఈ మేరకు సీఎస్ఐఆర్–ఐఐసీటీలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ 6వ ప్రాంతీయ సదస్సులో రెండో రోజు గురువారం గవర్నర్ పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో పరిశోధనలు, పేటెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. స్థిరమైన, నైపుణ్యంతో కూడిన సమానమైన ఆర్థికాభివృద్ది కోసం నూతన ఆవిష్కరణలు పెరగాలన్నారు. పరిశోధన, అభివృద్ధిని సులభతరం చేయడానికి విద్యా వ్యవస్థను సంస్థాగతంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, పద్మ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్, నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ వి.కె సారస్వత్, నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వివేక్ కుమార్ సింగ్, పలువురు శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. గురువారం రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో స్వామి వివేకానంద హ్యుమన్ ఎక్స్లెన్సీ సిల్వర్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా సంప్రీతి దివస్ పేరిట యూత్ కన్వెన్షన్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్కుమార్ యాదవ్ మాట్లాడారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగం ప్రపంచాన్నే ఆకర్షించిందన్నారు. ఆయన స్ఫూర్తితో రామకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశంలోని ఆధ్యాత్మికత, సహనం, ఐక్యత వంటి అంశాలను తన ప్రసంగం ద్వారా వివేకానందుడు ప్రపంచానికి చాటారని తెలిపారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొన దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో హాజరుకాలేక పోయారని, భవిష్యత్తులో సీఎంను తీసుకొచ్చే బాధ్యత తనదే అని అనిల్కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కలకత్తా రామకృష్ణ మఠం అధ్యక్షులు నిత్య ముక్తానంద స్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎంపీ అనిల్కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ -
‘జూబ్లీహిల్స్ లయన్స్’ సేవలు భేష్
మాదాపూర్: విద్యార్థుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ సేవాతత్పరతను చాటుకుంది. ఈ మేరకు మాదాపూర్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం ఐరన్ షెడ్ నిర్మించారు. శనివారం ఈ షెడ్ను లయన్స్ జిల్లా గవర్నర్ 320డి లయన్ అమర్నాథ్రావు ప్రారంభించారు. ఈ నిర్మాణానికి లయన్ గిరిజారెడ్డి, డాక్టర్ పి.సీత, జయశ్రీ మూర్తి, జ్వాలా వైష్ణవి, మండవ శిల్ప విరాళాలు అందించారు. విద్యార్థుల సౌకర్యం కోసం నిర్మించిన ఈ షెడ్..విద్యాభివృద్ధికి లయన్స్క్లబ్ చూపుతున్న అంకితభావానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు లయన్ కోనేరు రామసుందరి, కార్యదర్శి లయన్ రిందా దేవి, హెడ్మాస్టర్ మోహన్రావు, నరసింహరాజు, రామమోహన్, సౌభాగ్య, మర్రి ప్రవీణ్, ఈవీ రమణ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన... మాదాపూర్లోని మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి అధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ నాగరాజు, నరసింహరాజు, పద్మావతి త్రిపురనేనిలు మానసిక ఆరోగ్యంపై మార్గనిర్దేశం చేయగా, తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అంబర్పేట్ నిపుణులు విద్యార్థులకు సైబర్క్రైమ్స్, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్, కెరీర్ ప్రోగ్రెస్పై సుశ్మిత, సైబర్ ముప్పు, హ్యాకింగ్పై రాహుల్ వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడు కోనేరు రామ సుందరి, హెడ్మాస్టర్ బసవలిగం తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ స్కూల్లో ఐరన్ షెడ్ ఏర్పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన -
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
బహదూర్ పురా: అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్లైన్ అధికారులకు ఏటా రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తామన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. గురువారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఆవరణలోని అమరవీరుల విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర అటవీ ప్రధాన అధికారిణి డాక్టర్ సువర్ణలతో కలసి పాల్గొన్నారు. స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 1984 సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పచ్చదనం పెంపులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘వన మహోత్సవం’ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నమన్నారు. వనమహోత్సవం ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటికే నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేనిచోట, దట్టమైన అడవుల్లో వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అడవులను కాపాడుతున్నారన్నారని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాలన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ..అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాటిని కాపాడటమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి డాక్టర్ సువర్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, పీసీపీఎఫ్ జౌహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, అడిషనల్ పీసీపీఎఫ్లు సి.శరవనణ్, , ప్రియాంక వర్గీస్, జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్, క్యురేటర్ జె.వసంత, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డాక్టర్ జి. రామలింగం, జీహెచ్ఎంసీ అర్బన్ ఫారెసీ్ట్ర డైరెక్టర్ సుభద్రాదేవి, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) డా.ఎం.ఎ. హకీమ్, డిప్యూటీ క్యురేటర్ బర్నోబా, అసిస్టెంట్ డైరెక్టర్ (వెట్) శ్రీనివాస్ , మాజీ క్యూరేటర్లు ఎ.శంకరన్, రాజశేఖర్, మాజీ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, అసిస్టెంట్ క్యురేటర్లు నాజియా తబుసుమ్, ఎన్.లక్ష్మణ్, ఈపీఆర్ఓ హనీఫుల్లా, జూ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
హెచ్సీఎస్సీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్–2025 నిర్వహించాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. ఈ నెల 18, 19 తేదీల్లో జల విహార్ కేంద్రంగా జరుగనుంది. దీనికి సంబంధించిన లోగోను నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ జోయల్ డెవిస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్లో వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులతో పాటు సాధారణ ప్రజలు సైతం పాల్గొనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షిత నగరాన్ని సాకారం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి కీలక సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. ప్రైవేటు బస్సులో కీచక డ్రైవర్ శివాజీనగర (బెంగళూరు): బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక డ్రైవర్కు బాలిక కుటుంబీకులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున బెంగళూరులో బసవేశ్వర సర్కిల్లో జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేటు స్లీపర్ బస్సు బయల్దేరింది. అందులో ఓ బాలిక (15) బెంగళూరుకు వస్తోంది. మొబైల్ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ చేయాలని డ్రైవర్ను కోరింది. కొంతసేపటి తరువాత బాలిక మొబైల్ ఇవ్వాలని అడిగితే, ముద్దివ్వాలని డ్రైవర్ ఆరిఫ్ (41) బాలికను ఒత్తిడి చేశాడు. తరువాత బాలిక తన సీటు వద్దకు వెళ్లి నిద్రపోయింది. డ్రైవర్ బాలిక వద్దకు వెళ్లి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తట్టుకోలేక బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బస్సు సిటీకి రాగానే బాలిక తల్లి, సోదరుడు బస్సు నిలిపి డ్రైవర్ ఆరిఫ్ను ప్రశ్నించారు. డ్రైవర్ తప్పయిపోయిందంటూ చేతులెత్తి మొక్కి వేడుకున్నాడు. బాలిక కుటుంబీకులు అతన్ని చితకబాదారు. ఇంతలో పోలీసులు చేరుకొని డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ● ఒంటరి బాలికపై లైంగిక వేధింపులు ● చితకబాదిన కుటుంబీకులు ● హైదరాబాద్ టు బెంగళూరు బస్సులో ఘటన -
14.9 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు సికింద్రాబాద్: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.18.47 లక్షల విలువచేసే 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు సాయీశ్వర్గౌడ్, సారస్వత్లు వెల్లడించిన వివరాల ప్రకారం..ఢిల్లీ చాందినీ చౌక్కు చెందిన చంద్రప్రకాశ్ అనే ఫుట్పాత్ వస్త్రవ్యాపారి, అదేప్రాంతానికి చెందిన జమీలాఖాతూన్లు స్నేహితులు. చంద్రప్రకాశ్ మాదకద్రవ్యాల వినియోగానికి బానిస అవగా, జమీలాఖాతూన్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీరిరువురు గంజాయి రవాణా వ్యాపారం చేసి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రప్రకాశ్కు ఫేస్బుక్ ద్వారా ఫరాన్ఖాన్ అనే గంజాయి వ్యాపారి పరిచయం అయ్యాడు. అతని ద్వారా విజయనగరం వెళ్లిన వీరిద్దరు 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు సేకరించి విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఢిల్లీ రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో వేచిచూస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ఇరువుర్ని రిమాండ్కు తరలించి గంజాయి విక్రయించిన ఫరాన్ఖాన్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
జింక కొమ్ముల విక్రయానికి యత్నం
సాక్షి, సిటీబ్యూరో: అరుదైన యాంటిలోప్ సెర్వికాప్రా జాతికి చెందిన జింక కొమ్ములు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రెండు కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ సలీం వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చిన ఇతగాడు షహీన్నగర్లో ఓ పాన్షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సదాశివపేటకు రాకపోకలు సాగిస్తూ మేసీ్త్ర పని కూడా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడ ఓ ఇంటి కూల్చివేత పనులు చేస్తుండగా ఇతడికి జింక కొమ్ములు దొరికాయి. వీటిని సొంతం చేసుకుని సలీం నల్లరంగు కవర్లో చుట్టి నగరానికి తీసుకువచ్చాడు. తొలినాళ్లల్లో ఆ కొమ్ముల నుంచి చిన్న ముక్కలు వేరుచేసి పొడి చేసేవాడు. దీన్ని వినియోగిస్తే ఎముకలు పటిష్టం కావడంతో పాటు కొన్ని రోగాలు తగ్గుతామని నమ్మబలికి విక్రయించే వాడు. ఇటీవల రెండు కొమ్ముల్నీ విక్రయించాలని భావించిన సలీం ఖరీదు చేసే వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. దీనిపై తూర్పు మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎ.నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి తమ బృందాలతో వలపన్ని సలీంను పట్టుకున్నారు. అతడి నుంచి రెండు జింక కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ -
‘విజయ్ శంకర్లాల్ జ్యువెలరీ’ నగలు దొరికాయి
● రూ.1.50 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం లక్డీకాపూల్: బషీర్బాగ్లోని విజయ్ శంకర్లాల్ జ్యువెలరీలో ఈ నెల 5న చోరీకి గురైన రూ.1.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొరికాయని, ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబైకి చెందిన రోనక్ చడ్వా గత ఏప్రిల్లో జ్యువెలరీ షాపులో పనికి చేరాడు. తనతో పాటు బెట్టింగ్లో నష్టపోయిన మహ్మద్ హస్నైన్ హబియాతో కలిసి కుట్రపన్ని ఈ నెల 5న జ్యువెలరీ షాపులో దొంగతనం చేశారు. దీనిపై 7న బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్తో కలిసి సైఫాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆభరణాలను రోనక్, మహ్మద్ హస్నైన్ హబియా దొంగిలించినట్లు గుర్తించి అరెస్టు చేశామని, నేరస్తులను ఏసీజేఎం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఆభరణాలన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నగరంలో నగల దుకాణాల్లో పనిచేసే వారిని సమగ్రంగా విచారించిన తర్వాతే నియమించుకోవాలని డీసీపీ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ బీ.ఆనంద్ ,సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ కే. రాఘవేందర్, డీఐ ఎన్. రాజేందర్, డీఐ సైఫాబాద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
శ్లాబ్ ఎక్కడిదాకా అయింది.. బిల్లులు వస్తున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ‘హలో... నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచి్చన ఇల్లు వచి్చందా.. దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా.. ఇంటి శ్లాబ్ ఎక్కడి వరకు వచ్చింది..అధికారులు మీకు సహకరిస్తున్నారా’అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. గురువారం మంత్రి హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్డెస్్క, ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడారు.ముందుగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం లబ్ధిదారుతో మాట్లాడారు. ‘బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తయింది. కానీ ఇంకా బిల్లు రాలేదు’అని ఆమె చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ బేస్మెంట్ పూర్తయి ఎన్ని రోజులైంది, దాని ఫొటోలు అప్లోడ్ చేశారా అని అడిగారు. అప్పుడు అక్కడే ఆధార్ నంబర్తో అన్నీ పరిశీలించారు. రూ.లక్ష వచ్చే సోమవారం మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయని పొంగులేటి చెప్పారు. మరో వ్యక్తి ఫోన్ చేసి గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు ఇళ్లు ఇస్తారని అడగ్గా, పొంగులేటి స్పందిస్తూ నగరంలో స్థల సమస్య ఉందని, త్వరలోనే పరిష్కారం కనుగొని అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు టోల్ఫ్రీ కాల్ సెంటర్ ఫోన్ 1800 599 5991 రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిఅగీత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకూ ఆ వివరాలను తెలియచేస్తారని పొంగులేటి చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లలో దేశానికే తెలంగాణ ఆదర్శం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం తన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/మెదక్ మున్సిపాలిటీ/తాండూరు రూరల్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్తోపాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యా ర్థులు అవస్థలు పడ్డారు. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజధానిలో... హైదరాబాద్లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం మూడు తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్నగర్లో 11.2 సెం.మీ., డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్దుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం వరకు ఉన్న ఇన్నర్ రింగ్రోడ్డు సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వాగులో ఒకరి గల్లంతు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్తంపల్లి మొగులప్ప(40) ఆవుల కాపరిగా పని చేస్తున్నాడు. గురువారం అతను ఊరి శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వృథాగా పడేసిన టార్ఫాలిన్, ప్లాస్టిక్ కవర్ల కోసం దిడ్డివాగు దాటి వెళ్లాడు. ఎగువ ప్రాంతంలో కరిసిన వర్షానికి వరద ఉధృతమైంది. అవతలి ఒడ్డున ఉన్న గ్రామస్తులు వద్దని వారిస్తున్నా వినకుండా కవర్ల మూటను నెత్తిపై పెట్టుకుని వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అతని భార్య లలితమ్మ, ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మొగులప్ప ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించింది. రెండ్రోజులు మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5 కి.మీ. ఎత్తువరకు కొనసాగుతోంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటివరకు సగటున 64.05 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 78.52 సెం.మీ. నమోదైంది. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
రాయ్పూర్ (ఛత్తీస్గఢ్)/ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు గురువారం పోలీసులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ (60) ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ బాలన్న, అలియాస్ రామచందర్, అలియాస్ భాస్కర్పై మొత్తం రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా హర్షం వ్యక్తం చేశారు. వచ్చే మార్చి 31లోగా నక్సలైట్ల ఏరివేత పూర్తి కావడం ఖాయమని పేర్కొన్నారు. మెయిన్పూర్ అటవీ ప్రాంతంలో.. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా ఎన్కౌంటర్ జరిగినట్లు రాయిపూర్ రేంజ్ ఐజీపీ అమ్రేశ్ మిశ్రా తెలిపారు. ఛత్తీస్గఢ్ పోలీస్కు చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్, జిల్లా పోలీసు విభాగానికి చెందిన ‘ఈ–30’, సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళాలు ఎన్కౌంటర్లో పాల్గొన్నాయని ఆయన చెప్పారు. సీనియర్ నేతలతో పాటు మొత్తం 10 మంది నక్సలైట్లు మృతి చెందారని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని అన్నారు. బాలకృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్లో చదువుతూ ఉద్యమ బాట మోడెం వెంకటయ్య, మల్లమ్మ దంపతులకు బాలకృష్ణ జన్మించారు. వెంకటయ్యకు పోస్టుమ్యాన్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్లోని చాదర్ఘాట్ ఏరియాకు సుమారు 50 ఏళ్ల కిందటే మకాం మార్చారు. బాలకృష్ణకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 1983లో మావోయిస్టు (పీపుల్స్వార్) పార్టీ పట్ల ఆకర్షితుడైన బాలకృష్ణ.. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పోరుబాట పట్టారు. కొంతకాలం రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ) జంట నగరాల బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు. 1993లో అరెస్టు.. 1999 వరకు జైల్లో.. పీపుల్స్వార్ పార్టీ పనిలో భాగంగా అడవినుంచి బయటకు వచ్చిన బాలకృష్ణను అప్పటి యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు 1993లో అరెస్టు చేశారు. పోలీసు డీఐజీ కేఎస్ వ్యాస్ హత్య, ఎమ్మెల్యే కిడ్నాప్లతో పాటు బెంగళూరు ఆయుధాల స్వా«దీనం, కుట్ర కేసులలో ఆయన సుమారు ఆరేళ్ల పాటు ముషీరాబాద్ జైల్లోనే ఉన్నారు. 1999లో బెయిల్పై విడుదలైన ఐదు రోజులకే కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా తిరిగి అడవిబాట పట్టారు. సుమారు 26 సంవత్సరాలు ఏవోబీలో వివిధ కేడర్లలో పని చేశారు.ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులకు మోస్ట్వాంటెడ్గా మారారు. ఆయనపై మూడు రాష్ట్రాలతో పాటు ఎన్ఐఏ ప్రకటించిన దానితో కలిపి రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ పేరిట గత కొంతకాలంగా ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఇతర నాయకులు, దళాలతో కలిసి బాలకృష్ణ ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో సంచరిస్తున్నట్లు కేంద్ర బలగాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. -
పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను విఘాతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల గళాన్ని వినిపిస్తున్న పత్రికలపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు ధోరణిపై ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడమే ప్రతిపక్ష పార్టీల కర్తవ్యమని, పత్రికలు, మీడియా బాధ్యత కూడా ఇదేనన్నారు. కానీ ప్రజా సమస్యలను వినిపించుకోకుండా ఏకపక్షంగా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదని హెచ్చరించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్మీట్ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికా సంప్రదాయాలు, విలువలు కాపాడేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించాలి. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి? విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడ న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, అందులో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ... అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ధనంజయరెడ్డిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. తన విధిని నిర్వర్తిస్తున్న సంపాదకునిపై కేసులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. కానీ తరచుగా పత్రికలు, జర్నలిస్టులపై, చివరకు ఎడిటర్లపైనా దూషణలతోపాటు భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం కూడా ఇలాంటి కోవలోనికి వస్తుంది. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసినఅ∙వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యనే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపైన నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుఇది కక్షసాధింపు ధోరణే తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణఅచివేయడం వారి స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్ష పార్టీల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపైన దాడి చేయడమే. ఇది పూర్తిగా అక్రమం. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు సరికాకపోతే వాస్తవాలను వెల్లడించి రాజకీయ పోరాటం చేయాలి కానీ కేసులు పెట్టకూడదు. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథ -
రాష్ట్రానికి పాలనా పక్షవాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పరిపాలనా పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలిసిస్) పట్టి పీడిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. దాదాపు 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రూరల్..అర్బన్ సెక్టార్లలోనే కాదు.. అన్ని సెక్టార్లలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా ప్రారంభించలేదని, జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందన్నారు. హైడ్రా చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు కూల్చారు..సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీగా ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి పైగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.ఫార్ములా ఈ–కార్ రేస్ అవకతవకలపై ఏసీబీ విచారణలో వెల్లడైన అంశాలను ప్రభుత్వం బయటపెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారన్నారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఓయూ ఉద్యోగులకు ఈసారి నెల జీతమే ఆలస్యంగా వచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రకటిస్తారు కానీ.. దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగితే కాంగ్రెస్ హయాంలో ‘హోప్ బ్రేకేజ్’జరుగుతోందన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లపై కాకుండా నాణ్యత, అవినీతి, నిర్వహణ తదితర అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తం ప్రాజెక్టుపైనే సీబీఐ విచారణ జరిపించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. వందరోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి..రెండేళ్లు కావొస్తున్నా ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండునెలల్లో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలంటున్న కాంగ్రెస్ నేతలు, మంత్రులు మరి స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నోటీసులపై కాలపరిమితితో చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.కాంగ్రెస్ సర్కార్ ‘మిస్ మేనేజ్మెంట్’కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ప్రతిస్పందించారు. పార్టీలో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్ర కమిటీలో పరిమితంగా పోస్టులున్నందున అందరిని సంతృప్తి పరచలేమన్నారు. ఈ కమిటీలో చోటుదక్కని వారు ఎవరూ బాధపడొద్దని పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీ ముఖ్యనేతలపై చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని కేవలం ప్రధానమంత్రి మోదీ మాత్రం ఉన్నారని చెప్పారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, జర్నలిస్టులు, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
కొండలను చీలుస్తూ.. లోయలను దాటుతూ..
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు. వంతెనలు, సొరంగాలు... ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.అంటే మొత్తం రైలు కారిడార్లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. ఐజోల్కు భాగ్యం ⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ⇒ ఐజోల్కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది. ⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు వేగవంతమైన, రైలు–రోడ్డు–పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కోరారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు. వివరాలు సీఎం మాటల్లోనే.... పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అవసరమైన నిధులను సమకూర్చటంతోపాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలి. దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉంది. – రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. దానికి అనుగుణంగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి. రైల్వే విభాగ పరిశీలనలో ఉన్న అన్లైన్మెంట్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. హైవే వెంట రైలుమార్గం ఉండాలి, హైవేకు ఇరువైపులా కిలోమీటరన్నర దూరం వరకు ఇండ్రస్టియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయి. – కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలి. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతోపాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలి. – వికారాబాద్– కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలి. గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా పనులు చేపట్టాలి. వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి. భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలి. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తోపాటు వరంగల్ను అభివృద్ధి చేయాలి. అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి’అని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ చుట్టూరా రీజనల్ రింగ్ రైల్ హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైల్వే అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ మహానగర భవిష్యత్ స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ఇండ్రస్టియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రెటరీ వికాస్రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
ఈ మెట్రో నడపలేం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాణసంస్థ ఎల్అండ్టీ తేల్చిచెప్పింది. నగరంలోని మూడు కారిడార్లలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రోరైల్ నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మెట్రో రెండో దశ డీపీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం వివరణ కోరిన సంగతి తెలిసిందే. టికెట్ చార్జీల పంపకాలు, విద్యుత్ చార్జీల చెల్లింపులు, అసంపూర్తిగా ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు తదితర అంశాలపై ఎల్అండ్టీతో ఏ రకమైన అవగాహన ఏర్పాటు చేసుకున్నారో తెలియజేయాలని చెప్పింది. ఈ సంప్రదింపుల క్రమంలోనే ఎల్అండ్టీ సంస్థ కేంద్ర గృహనిర్మాణశాఖ సంయుక్త కార్యదర్శి జైదీప్కు లేఖ రాసింది. దేశంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన మొదటి మెట్రో ఇదే కావడం గమనార్హం. బకాయిలు రూ.5,000 కోట్లకు పైనే..హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. సుమారు రూ.22 వేల కోట్లతో 69 కి.మీ.పొడవున నిర్మించారు. ఈ మొదటి దశకు సంబంధించిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ. కారిడార్ మాత్రం పెండింగ్లో ఉండగా, ప్రస్తుతం దీన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి రెండో దశలో కలిపేశారు. మొదటి కారిడార్ పూర్తయిన 2017 నాటికి, ఎల్ అండ్ టీకి ప్రభుత్వం రూ. 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 ఫిబ్రవరి నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగాయి. మరోవైపు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఇవ్వాల్సిన రూ.254 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదని ఎల్అండ్టీ పేర్కొంది. ప్రస్తుతం మెట్రోలో రోజూ వారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.చాలని టికెట్ ఆదాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలకపోవడం వంటి కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు ఎల్అండ్టీ వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, విద్యుత్చార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చులు పెనుభారంగా మారినట్లు పేర్కొంది. మెట్రో మొదటిదశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది.మెట్రో రెండో దశ ప్రతిపాదనలివీ.. » ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, నాగోల్–ఎల్బీనగర్–శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఎల్బీనగర్–హయత్నగర్, రాయదుర్గం–అమెరికన్ కాన్సులేట్–హైకోర్టు భవనం, మియాపూర్–బీహెచ్ఈఎల్ తదితర మార్గాల్లో ‘ఏ’విభాగం కింద మొత్తం 5 కారిడార్లలో 76.5 కి.మీ. మేర నిర్మించనున్నారు. » సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు (23 కి.మీ.) ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు (22 కి.మీ,), ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ వరకు 39.6 కి.మీ నిర్మించాలని ప్రతిపాదించారు. » ఏ, బీ విభాగాల్లోని మొత్తం 8 కారిడార్ల నిర్మాణానికి రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చుకానున్నట్లు అంచనా. -
అంగట్లో గ్రూప్ –1 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు గ్రూప్–1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు, సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్–1 పరీక్షను అక్రమాలకు తావులేకుండా తాజా నోటిఫికేషన్ వేసి మళ్లీ నిర్వహించాలన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో పాటు ఆ పార్టీ నేతల కాసుల కక్కుర్తి వల్లే గ్రూప్–1 పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్కు ‘గ్రీన్ లీడర్షిప్’అవార్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెపె్టంబర్ 24న న్యూయార్క్లో జరగనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటంమాజీ మంత్రి హరీశ్రావుసాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. డైవర్షన్ రాజకీయాలతో గ్రూప్–1 పరీక్షలో అవినీతి, అవకతవకలను కప్పిపుచ్చాలనే ప్రభుత్వ ఆటలు సాగవు. గ్రూప్–1 పరీక్షలో జరిగిన అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చి, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన విమర్శించారు. గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి బీఆర్ఎస్వీ నేతల డిమాండ్ చిక్కడపల్లి (హైదరాబాద్): గ్రూప్–1 పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం ముందు గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులతో కలసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న వారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టుచేసి అబిడ్స్, ముషీరాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేయాలని, తప్పుచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుంగబాలు మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందున, నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సంస్కరణలకు వేదిక జైలు వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ‘జైలు వ్యవస్థ కేవలం భద్రతకే పరిమితం కాకుండా..సంస్కరణలు, పునరావాసానికి వేదికగా మారుతోంది’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చి వారిని మళ్లీ సమాజంలో పంపడమే జైళ్లశాఖ అసలు విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 9 నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ జైళ్లశాఖ, బీపీఆర్అండ్డీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 7వ ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్–2025 గురువారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి బండి సంజయ్, విశిష్ట అతిథి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా, బీపీఆర్అండ్డీ అడిషనల్ డీజీ రవిజోసెఫ్ లోకూర్, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్గార్గ్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషబిస్త్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్లో అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్లశాఖ జాతీయస్థాయిలో కీర్తి చాటిందన్నారు. జాతీయస్థాయి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని సౌమ్యామిశ్రాను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ జైళ్లశాఖను రోల్మోడల్గా తీసుకోవాలి : పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో అంశాల్లో సంస్కరణలతో ముందుకు వెళుతున్న తెలంగాణ జైళ్ల శాఖను దేశవ్యాప్తంగా రోల్మోడల్గా తీసుకోవాలన్నారు. జాతీయస్థాయిలో డ్యూటీ మీట్ను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ జైళ్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నట్టు తెలిపారు. – తెలంగాణ జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ మూడు రోజుల డ్యూటీమీట్లో 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,300 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ జైళ్లశాఖ మూడు రోజులుగా తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన డ్యూటీ మీట్లో ఓవరాల్ చాంపియన్గా తెలంగాణ జైళ్ల శాఖ సత్తా చాటింది. అన్ని అంశాల్లో కలిపి మొత్తం 28 పతకాలు సాధించగా..అందులో 21 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. తమిళనాడు 17 పతకాలతో రెండో స్థానం, 16 పతకాలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి. -
గ్లాస్గో నుంచి డాక్టర్ రఘురాంకు అరుదైన గుర్తింపు
కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (RCPSG) వారు ఆయనకు గౌరవప్రదమైన ఎఫ్ఆర్సీఎస్(గ్లాస్గో) ను ప్రదానం చేశారు. ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇది మాత్రమే కాకుండా డాక్టర్ రఘురామ్ 1997లో ఇదే కాలేజ్ నుంచి ఎస్ఆర్సీఎస్ ద్వారా (గ్లాస్గో) పరీక్ష ద్వారా అర్హత పొందారు. ఇప్పుడు అదే కాలేజ్ నుంచి గౌరవ ఫెలోషిప్ పొందిన ప్రపంచంలో ఏకైక శస్త్రవైద్యుడు అయారు.ఈ అత్యున్నత గౌరవం 425 ఏళ్ల పురాతనమైన గ్లాస్గో రాయల్ కాలేజ్ తరఫున, 2025 సెప్టెంబర్ 10న, గ్లాస్గోలోని చారిత్రాత్మక కాలేజ్ హాల్లో జరిగిన ప్రత్యేక్ష కార్యక్రమంలో, కాలేజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి అధికారికంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా మాట్లాడుతూ..డాక్టర్ పిల్లరిశెట్టికి మా కాలేజ్ తరఫున అత్యున్నత గౌరవమైన హానరరీ ఫెలోషిప్ అందించడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా, ఆయన తన సమస్త జీవనాన్ని రొమ్ము క్యాన్సర్తో పోరాటంలో ప్రజలకు ఆశనిస్తూ, సేవలో నిమగ్నమయ్యారు. బ్రిటన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శస్త్రవైద్యుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర అస్తాధారణం. శస్త్రచికిత్సలో నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం అభివృద్ధి పరంగా మేము తీసుకుంటున్న మిషన్లో ఆయన ఓ ముఖ్య భాగస్వామిగా మారారు. మా కాలేజ్ కుటుంబంలో ఆయనను ఆహ్వానించడంపై మాకు ఎంతో గర్వంగా ఉంది. భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ కలయిక పనిచేస్తుందని మా విశ్వాసమని పేర్కొన్నారు.గౌరవ ఫెలోషిప్ ప్రదానోత్సవ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ రిజిస్ట్రార్, ట్రస్టీ ప్రొఫెసర్ అభయ్ రేన్ చదివారు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో డాక్టర్. రఘురామ్ చేసిన విప్లవాత్మక మార్పులు అమూల్యమైనవని ప్రశంసించారు. హైదరాబాద్లో నిర్వహించిన 12 అంతర్జాతీయ ఎస్ఆర్సిఎస్/ఎంఆర్సిఎస్ ప్రిపరేటరీ కోర్సులకు ఆయనే ముందుండి నాయకత్వం వహించారని, వాటి ద్వారా దక్షిణాసియాలోని 2,000 మందికి పైగా వైద్య విద్యార్థులు ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయవంతం అయ్యే అవకాశం పొందారన్నారు. అంతేకాకుండా, భారతదేశంలో కాలేజ్ చేపట్టిన విద్యా కార్యక్రమాలకు డాక్టర్ రఘురామ్ అందించిన వ్యూహాత్మక మార్గనిర్దేశనం ఎంతో కీలకమైందని, అది కాలేజ్ విద్యా ప్రమాణాల బలోపేతానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి మాట్లాడుతూ 'ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసినందుకు ఆర్సిపి ఎన్జీ అధ్యక్షుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రత్యేక గుర్తింపును నా కుటుంబం, నా రోగులు, నా తల్లితండడ్రులకు ఈ నేలకి అంకితం చేస్తున్నాను.1599లో స్థాపించబడిన గ్లాసో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఇప్పటివరకు 425 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. బ్రిటిష్ దీవుల్లో ఏకైక బహుళ శాఖా వైద్య కళాశాలగా ఇది ఉన్నది. ప్రపంచంలోని 97 దేశాల నుంచి వచ్చిన 15,000కి పైగా శస్త్రవైద్యులు, దంతవైద్యులు, పొడియాట్రీ మరియు ట్రావెల్ మెడిసిన్ రంగాల్లో పని చేసే నిపుణులను ఇది ప్రతినిధ్యం వహిస్తోంది. తర్వాత, కాలేజ్ అధ్యక్షుడు ప్రఖ్యాత ‘ఎంఆర్సీఎస్’, ఎఫ్ఆర్సీఎస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి. ఇవి ఇంటర్కలేజియేట్ పరీక్షలో ఉత్తీరులు అయిన,శిక్షణ అవసరాలను పూర్తి చేసిన వైద్యులకు మాత్రమే ఇస్తారు.డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మరో 7 శస్త్రచికిత్స కళాశాలల నుండి హానర్జరీ ఫెలోషిప్లు ప్రదానం చేయబడ్డాయి. పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన, బ్రిటన్లోని మూడు శస్త్రచికిత్స రాయల్ కాలేజ్ నుండి, బ్రిటిష్ ప్రభుత్వ నుండి అత్యున్నత గౌరవాలు అందుకున్న ఏకైక శస్త్రవైద్యుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన వ్యక్తిడాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి లభించిన ప్రధాన గౌరవాలు ఇవీ:బ్రిటిష్ సామ్రాజ్య గౌరవ విధాన అధికారి (ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2020) నైట్హుడ్ను తప్పిస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండో స్థాయి అత్యున్నత అవార్డు.హానరరీ ఎస్ఆర్సీఎస్ (ఇంగ్లాండ్), 2022- రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లు ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క అత్యున్నత గౌరవం.హానరరీ ఎస్ఆర్సీఎస్ (గ్లాస్గో), 2025 - రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో అత్యున్నత గౌరవం. యూకే వెలుపల ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ (ఆర్సీఎస్ ఎడిన్బర్), 2013 నివసిస్తున్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ల ఎడిన్బర్గ్ ఫెలోకు లభించే అత్యున్నత గౌరవం. డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి గత 18 సంవత్సరాలలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన దక్షిణాసియాలోని మొదటి సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్ ని స్థాపించి, దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంపొందించడానికి ఓ చారిటబుల్ ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద జనాభాపరమైన స్క్రీనింగ్ కార్యక్కరమాలు ఆయన అమలు చేశారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించబడుతోంది. భారతదేశంలో రొమ్ము శస్త్రచికిత్స చేసే శస్త్రవైద్యులను ప్రతినిధ్యం వహించే దక్షిణాసియాలోని మొదటి మరియు ఏకైక సంస్థ, "అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా" ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. తన తల్లిప్రేము మరియు సామాజిక సేవా పట్ల ఉన్న అభిమానం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. తెలంగాణలోని ఒక దూర ప్రాంత గ్రామమైన ఇబ్రాహింపూర్ను ఆయన దత్తత తీసుకుని, వ్యక్తిగత దాతృత్వం ద్వారా అక్కడ జీవనోపాధి మార్పులు తేవడమైన పరికరాలు, సౌకర్యాలు అందించారు. ఈ సేవలకు స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో గౌరవాలు లభించాయి.చారిత్రాత్మక ఈ కాలేజ్ తో సన్నిహితంగా సంబంధం కలిగిన కొన్ని ప్రముఖ శస్త్రవైద్యుల్లో ప్రొఫెసర్ పీటర్ లోని ఉన్నారు. ఆయన ఆర్సీపిఎస్టీ స్థాపకుడు కాగా, 1597లో ఇంగ్లీష్ లో తొలి శస్త్రచికిత్స పుస్తకాన్ని ప్రచురించారు. సర్ విలియమ్ మేస్వాన్, 'న్యూరో శస్త్రచికిత్స తండ్రి"గా ప్రసిద్ధి పొందిన ఆయన, మొదటి మెదడు కణితిని తొలగించిన శస్త్రవైద్యుడిగా గుర్తింపు పొందారు. ప్రొఫెసర్ జోసెఫ్ లిస్టర్ శస్త్రచికిత్సలో శుద్ధి పద్దతుల పితామహుడిగా పేరుగాంచారు. ప్రొఫెసర్ సర్ గ్రీమ్ టీస్ డేల్ మరియు ప్రొఫెసర్ బ్రయాన్ బెనెట్ గ్లాస్గో కోమా స్కేల్ను స్థాపించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రసిద్ధ పరికరం, అలాగే, ప్రొఫెసర్ జమిని సేన్ భారతీయ శస్త్రవైద్యురాలు మరియు 1912లో ఈ కాలేజ్లో తొలి మహిళా ఫెలోగా ఎంపికైన వ్యక్తి -
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, శామీర్పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
మద్యం అక్రమ కేసు.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లొ సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలోనూ కూడా సునీల్ పని చేయలేదు. మరో భేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.కుట్రలు.. పన్నాగాలు.. బెదిరింపులు.. వేధింపుల మధ్య.. అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మద్యం అక్రమ కేసును నడిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కక్ష సాధింపే లక్ష్యంగా.. దెబ్బతీయడమే ఉద్దేశంగా.. అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లుతోంది.కాగా, మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు సర్కార్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది. -
అన్ని పార్టీలకూ సవాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలూ సవాల్గా తీసుకోవడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహ్మత్నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ముఖ్య నాయకులతో పాటు మాగంటి గోపీనాథ్ భార్య సునీత కూడా పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయినందునే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. గోపీనాథ్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎవరికే ఆపద వచ్చినా అండగా ఉండేవారని, ఆయన మరణంతో అనుకోకుండా వచి్చన ఈ ఎన్నికలో మాగంటి కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని కేటీఆర్ పిలువపునివ్వడంతో పాటు, తనకు అండగా నిలవాలని సునీత కూడా కోరడంతో ఇక ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీనాథ్ మరణం వల్ల సానుభూతి పవనాలు బీఆర్ఎస్కు ఉపకరించగలవా అనే చర్చలు జరుగుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ గెలవడంతో, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఇప్పుడు గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికలో ఘన విజయంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని, తిరిగి జైత్రయాత్ర ప్రారంభించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు, హైడ్రా కూల్చివేతలవంటివి అస్త్రాలుగా మలచుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్కు రెఫరెండం ఇక ఈ ఎన్నికలో గెలుపు కాంగ్రెస్కు రెఫరెండంగా పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇతర ప్రతిపక్ష పారీ్టలు సైతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం ద్వారా రాబోయే రోజుల్లో గెలిచేది తామేనని చెప్పేందుకు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. పార్టీల వ్యూహం ఇలా.. కాంగ్రెస్: ఈ ఎన్నికలో గెలుపు ద్వారా తమ పాలన కు ప్రజల రెఫరెండం అని బలంగా చెప్పవచ్చని భా విస్తూ ఇప్పటికే కొన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీఅధ్యక్షుడు మహేశ్గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జిమీనాక్షి నటరాజన్ వంటి నేతలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లకు నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించి, బూత్ స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, పేదలకు సన్నబియ్యం సహా ఇతర హామీల అమలు వంటి అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. బీజేపీ: ఈ ఎన్నికలో గెలవడం ద్వారా పజ్రలు తమవైపు మొగ్గుచూపుతున్నారని చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని బీజేపీ చెప్పాలనుకుంటోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దాకా నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లతోనూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి బూత్స్థాయిలో సమన్వయం చేస్తోంది. బీఆర్ఎస్: సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేస్తోంది. గోపీనాథ్ మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ఉపకరిస్తుందనే మాగంటి సునీత తమ అభ్యర్థి అనే సంకేతాలిచ్చింది. మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన నేపథ్యం ఉంది. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభల ద్వారా పార్టీ ఐక్యతను చాటుతోంది. సునీత ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించి, తన భర్త చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలతో మమేకమవుతోంది. తాజాగా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ స్వయంగా పాల్గొనడం, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వారిని గుర్తించి తమవైపు తిప్పుకోవాలనే యోచనలో ఉంది. మజ్లిస్: జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉండటంతో, మజ్లిస్ మద్దతు పెను ప్రభావం చూపనుంది. మజ్లిస్ పోటీ చేస్తుందా, కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుందా చూడాల్సి ఉంది. -
కూకట్పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు. రాకేష్,రేణు అగర్వాల్కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకూకట్పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు. -
ఉదయంలోగా చచ్చిపో.... లేదంటే చంపేస్తాం....
హైదరాబాద్: ఒరేయ్ తలుపులు తీయరా.. నీ అంతు చూస్తాం.. ఉదయంలోగా చచ్చిపో.. లేకుంటే మా చేతిలో చస్తావు అంటూ ముగ్గురు కిలాడీ లేడీలు మారణాయాధాలతో ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి అర్ధరాత్రి మూడుసార్లు హల్చల్ చేశారు. దీంతో సదరు వ్యక్తి భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధి కైసర్నగర్ డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కైసర్ నగర్ డబల్ బెడ్ రూమ్ సముదాయంలో 6వ బ్లాక్ ప్లాట్ నెంబర్ 302 లో బియ్యం పల్లి రాజు (55), జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రాజు బాలానగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా 2వ బ్లాక్లో నివాసం ఉంటున్న నౌసీమ్ అనే మహిళ అతడిని అనుసరిస్తూ వచ్చింది. అతడి జేబులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయతి్నంచగా నివారించేందుకు రాజు సదరు మహిళా చేయి పట్టుకున్నాడు. దీంతో సదరు మహిళతో పాటు ఆమె తల్లి షహజాన్, 4వ బ్లాక్లో ఉండే అంజుమా అక్కడికి చేరుకుని రాజును దుర్భాషలాడారు. దీంతో సొసైటీ సభ్యులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత మళ్లీ రాజు ఇంటికి వచ్చి గొడవ చేయగా స్థానికుడు సతీష్ చెప్పడంతో వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి మారణాయుధాలతో అతడి ఇంటికి వచ్చి ఒరేయ్ బయటికి రారా.. నీవు చచ్చిపోతావా.. మమ్మల్ని చంపమంటావా, ఉదయంలోగా చచ్చిపోవాలి లేకుంటే నీ అంతు చూస్తాం అంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన రాజు ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా మరో బెడ్ రూమ్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం దీనిని గుర్తించిన అతడి భార్య జ్యోతి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. దీంతో ఆగ్రహానికి లోనైన స్థానికులు రాజు మృతికి కారణమైన వారి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందడంతో సూరారం సీఐ సు«దీర్ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజు కారణమైన మహిళలపై పోలీసులు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన అంజుమా ఈ గొడవకు ముందు మరో వ్యక్తితో గొడవ పెట్టుకొని రభస చేసింది. వీరు ముగ్గురూ నిత్యం అమాయకులను టార్గెట్ చేసుకొని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
Kukatpally: కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో 1311 ప్లాట్లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమే..: కేటీఆర్
శ్రీనగర్కాలనీ (హైదరాబాద్): ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఓటువేస్తే మీ ఇళ్లను కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని స్థానిక ప్రజలను హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. బుధవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బున్న పెద్దల జోలికెళ్లదు.. ‘కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చేశారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హైడ్రా ఇల్లు కూలగొడుతుందన్న భయంతో కూకట్పల్లిలోని బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకుంది. డబ్బున్న పెద్దల జోలికి ఈ ప్రభుత్వం పోదు. దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము అధికారులకు ఉందా? ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోంది. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపివేస్తామంటూ ప్రజలను బెదిరిస్తోంది. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఓటేస్తే మోదీకి వేసినట్లే.. ‘ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్న బీజేపీ సీఎం రేవంత్రెడ్డి అన్న సత్యాన్ని మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి. రాహుల్గాంధీని తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ పార్టీని రేవంత్రెడ్డి తన పార్టీగా భావిస్తున్నారని, కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రజలు గమనించాలి. తెలంగాణాలో కాంగ్రెస్కు ఓటువేస్తే పీఎం నరేంద్ర మోదీ, బీజేపీకి ఓటు వేసినట్లే. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మైనార్టీ మంత్రి ప్రభుత్వంలో లేరంటే.. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఏమిటో గుర్తించాలి. మాగంటి కుటుంబానికి అండగా నిలవాలి బీఆర్ఎస్ మైనార్టీలకు సముచిత స్థానం ఇచ్చింది. బీఆర్ఎస్తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యం. ప్రజలు అన్నీ గమనించి, ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిన దివంగత మాగంటి గోపీనాథ్కు నివాళిగా..సంక్షేమాన్ని చేతల్లో చూపించిన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అండగా నిలబడే వాడు. ఆయన కుటుంబానికి ప్రజలు అండగా నిలవాలి. కారు గుర్తుకు ఓటువేసి హస్తానికి తగు బుద్ధి చెబుతూ రేవంత్రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో అన్ని సీట్లను బీఆర్ఎస్కు అందించారని, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్లో గెలిపించి, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, మాగంటి చేసిన పనులను, ఆయన సేవలను ఓటర్లకు గుర్తు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పి.విష్ణువర్ధన్రెడ్డి, కోరుకంటి చందర్, మాగంటి సతీమణి సునీత, రహమత్నగర్ ఇన్చార్జి టి.రవీందర్రావు పాల్గొన్నారు. -
దసరా తర్వాత ‘వైన్స్కు’ దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి వైన్షాపుల నిర్వహణ కోసం దసరా పండుగ తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత షాపులకు గడువు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీ తర్వాత కొత్త పాలసీ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఆ శాఖ అధికారులున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం ద్వారా ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న ఆలోచనతోనే దసరా ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న ట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో 2,620 వైన్షాపులుండగా ఆ సంఖ్యను పెంచుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంత జనాభాకు ఒక వైన్షాపు ఉండా లో 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించా రు. ఆ తర్వాత జనగణన జరగక పోవడంతో ఇప్పటికీ ఆ సంఖ్యనే కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి షాపుల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. గత పాలసీతో రూ.2,920 కోట్ల ఆదాయం గత రెండేళ్ల పాలసీ ప్రకారం వైన్షాపుల నిర్వహ ణకు ఆహ్వానించిన దరఖాస్తుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,920 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఈసారి ఆదాయం రూ.3,500 కోట్లు దాటుతుందనే అంచనాలో ఎక్సైజ్ శాఖ ఉంది. దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచి, తగిన స మయం కూడా ఇస్తే ఈ ఆదాయం మరింత పెరు గుతుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి దరఖాస్తుల స్వీకరణకు నెలన్నర రోజులు గడువు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఆదాయార్జిత శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ ఇప్పుడప్పుడే స్థానచలనం అవసరం లేదనే భావనలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఈసారి వైన్షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసి, కొత్త షాపులు ప్రారంభమైన తర్వాత బదిలీలతో పాటు పెండింగ్లో ఉన్న పదోన్నతులను కూడా చేపట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
సరైన చర్యలతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట
సాక్షి,హైదరాబాద్: సరైన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించ వచ్చని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అన్నారు. ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు నిర్ణీత కాలవ్యవధి (టైమ్ బౌండ్) పెట్టుకొని సంబంధిత శాఖలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విధంగా చేస్తే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ‘రోల్ మోడల్’గా నిలిచే అవకాశం ఉందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం, సమాజం ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణలో రోడ్డు భద్రతపై ఉన్నతాధికారులతో మనోహర్ సప్రే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రోజుకు 500 మంది, గంటకు 25 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినెలా కనీసం ఒకసారి క్రమం తప్పకుండా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ‘బ్లాక్స్పాట్స్’ను సరిచేయాలని, రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చాలని, చెల్లుబాటయ్యే డ్రైవింగ్, వాహన బీమా ఉండేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, వాహన యజమానులకు డ్రైవింగ్, వాహన బీమా గడువుతీరిపోవడానికి సంబంధించిన అలర్ట్లు పంపించాలని సప్రే తెలిపారు. రోడ్డు భద్రతకు టెక్నాలజీ వినియోగం రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీ, చట్టాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాల సమీక్షతో పాటు ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అంశాల్లో మార్గనిర్దేశం చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలో చేపట్టిన చర్యలను సీఎస్ రామకృష్ణారావు, హోం సెక్రటరీ రవిగుప్తా వివరించారు. ట్రాఫిక్ నియంత్రణలో కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ వినియోగిస్తున్నట్లు డీజీపీ జితేంద్ర తెలిపారు. వాహనాల రిజి్రస్టేషన్లు, ప్రమాదాలు, మరణాలు, గాయాల వార్షిక గణాంకాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ తెలియజేశారు.పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నట్లు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భద్రతా చర్యలు గురించి హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలలో జాగ్రత్తలతో పాటు రోడ్లపై గుంతలు పూడ్చటం, లేన్మార్కింగ్, సిగ్నేజీల ఏర్పాటు వంటి ఇంజనీరింగ్ చర్యలను గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పరంగా తెలంగాణ 8వ స్థానంలో, మరణాల పరంగా 10వ స్థానంలో ఉందని వివిధ శాఖల అధికారులు వెల్లడించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం లేకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడకం, అతివేగం ప్రధాన కారణాలని తెలియజేశారు. దీంతో వీటిపై మరింత లోతైన అవగాహన కార్యక్రమాలు అవసరమని జస్టిస్ సప్రే సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, హెల్త్ కమిషనర్ డా.సంగీత తదితరులు పాల్గొన్నారు. -
సీతారామకు ‘క్లియరెన్స్’!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు పథకానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) దరఖాస్తు చేయనుంది. ప్రాజెక్టు అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) కార్యాలయానికి సమర్పించారు. సీతారామ ఎత్తిపోతలు పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు జారీ చేస్తూ సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) గత ఏప్రిల్లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ను సాధిస్తే ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోతలు పథకానికి ఇప్పటికే పర్యావరణ అనుమతులుండగా, సీతమ్మసాగర్కు ఇంకా రావాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే సీతారామ ప్రాజెక్టుకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రెండు ప్రాజెక్టులు ఒకే ప్రాజెక్టుగా ఉండేవి. సీతారామ–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. అయితే ఇప్పుడవి వేర్వేరు ప్రాజెక్టులుగా మారాయి. ప్రతిపాదనలు పరిశీలించి సిఫారసు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీ పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర జలవనరుల శాఖకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుల ఆధారంగా ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ విషయంలో జలవనరుల శాఖ నిర్ణయం తీసుకోనుంది. అంతకుముందు ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఇప్పటివరకు చేసిన ఖర్చు ఎంత? చేయాల్సిన ఖర్చు ఎంత? రాష్ట్ర బడ్జెట్లో ఏటా కేటాయించిన నిధులు ఎంత? వంటి అంశాలను సీడబ్ల్యూసీ పరిశీలించనుంది. ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమేనా? అనే అంశాలనూ సమీక్షించనుంది. మొత్తం 4 ప్రాజెక్టులపై దృష్టి సీతారామతో పాటు మోడికుంటవాగు, చనాకా–కొరాటా, చిన్నకాళేశ్వరం.. మొత్తం 4 ప్రాజెక్టులకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్లు సాధించి పీఎంకేఎస్వై కింద కేంద్ర నిధులు రాబట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 57 శాతం పనులు పూర్తి గత ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 18వ తేదీన రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాలను తరలించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 7.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 757 మెగావాట్ల సామర్థ్యంతో 11 పంప్హౌస్లు, 36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బరాజ్ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తైతే సాగర్, పాలేరు, వైరా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కొరత తీరుతుంది. ఇప్పటివరకు రూ.11,320 కోట్ల వ్యయంతో 57 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పథకాన్ని 2026 నాటికి పూర్తి చేసి రబీ పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లభిస్తే పీఎంకేఎస్వై కింద కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టుకుని మిగులు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
జెన్కోకు జీఎస్టీ షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు జీఎస్టీ షాక్ తగలబోతోంది. వస్తు సేవల పన్నుకు సంబంధించి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై ప్రభావం చూపుతోంది. జెన్కో వాడే బొగ్గు ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉంది. కొత్త శ్లాబులు అమలులోకి వస్తే ఇది 18 శాతానికి పెరుగుతుంది. అదనంగా 13 శాతం భారం పడుతుంది. దీనివల్ల ప్రతి టన్ను బొగ్గుపై అదనంగా రూ.630 భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో కాకుండా, పలు ప్రైవేటు సంస్థలతో విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇవి కూడా దేశీయ, విదేశీ బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. వీటిపై పడే జీఎస్టీ భారాన్ని విద్యుత్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. పెరిగే భారం ఎంత అనేది అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ఈ మొత్తానికి చార్జీలు పెంచుకునేందుకు విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత పెరిగిన బొగ్గు విలువను వార్షిక ఆదాయ, అవసర నివేదికలో పొందుపరుస్తారు. దీన్ని ఈఆర్సీ ఆమోదించిన తర్వాత వచ్చే ఏడాది కొత్త టారిఫ్లలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. భారం రూ.300 కోట్లపైనే..! టీజీ జెన్కో ప్లాంట్లకు ఏడాదికి 29 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. అయితే, పవన, సౌర విద్యుత్తోపాటు, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తుండటంతో విద్యుత్ సంస్థలు వాటిని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో జెన్కో ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. ఏడాది పొడవున గరిష్టంగా 65%ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో పనిచేస్తున్నాయి. దీంతో ఏటా 15 మిలియన్ టన్ను ల వరకు బొగ్గు అవసరం ఉంటోంది. ప్రతి టన్ను బొగ్గును సింగరేణి నుంచి సగటున రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జీఎస్టీ పెరగడం వల్ల అదనంగా టన్నుకు రూ.630 చెల్లించాలి. 15 మిలియన్ టన్నులకు రూ.945 కోట్ల వరకు భారం పడుతుంది. అయితే, బొగ్గుపై కొంత రాయితీ ఇవ్వాలన్నది కేంద్రం నిర్ణయం. ఇది తీసివేసినా ఏడాదికి రూ.300 కోట్ల పైనే భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు. పీపీఏలున్న ప్రైవేటు సంస్థలపై పడే జీఎస్టీ భారం మరో రూ.125 కోట్లు ఉండొచ్చని అంచనా. మొత్తంగా రూ.425 కోట్ల మేర భారం ఉండొచ్చని చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం జీఎస్టీ శ్లాబులు మారడం వల్ల బొగ్గుపై వ్యయం పెరుగుతుంది. ఇది జెన్కోకు ఏమేర భారం కలిగిస్తుందనేది పరిశీలిస్తున్నాం. అధికారికంగా శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత పెరిగే భారాన్ని విద్యుత్ నియంత్రణ కమిటీకి వివరిస్తాం. కమిషన్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – హరీశ్, టీజీ జెన్కో సీఎండీ ప్రజలకు ఇది భారమే పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీని తగ్గించారు. కొత్తగా వచ్చే వాటికే ఇవి వర్తిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదు. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాడే బొగ్గుపై జీఎస్టీ పెంచారు. సెస్ తగ్గించినా జీఎస్టీ భారమే ఎక్కువ. ఈ భారం మొత్తం ప్రజలపైనే పడుతుంది. రాబోయే కాలంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. - ఎం వేణుగోపాలరావు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ -
ఇష్టమొచ్చినట్లు ఎఫ్ఐఆర్లా?
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో, సోషల్ మీడియాలో చేసిన విమర్శలు ఆధారంగా చేసుకుని ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసినా.. సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తారా అని నిలదీసింది. కనీస చట్టాలు పట్టించుకోరా?.. సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించింది. కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సూచనలు తీసుకోవాలని సూచించింది. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మరిచిపోవద్దని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులను రీ పోస్టు చేసిన దుర్గం శశిధర్గౌడ్ అలియాస్ నల్లబాలుపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాలు.. సోషల్ మీడియా (ఎక్స్)లో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లబాలుపై పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ‘నో విజన్.. నో మిషన్, ఓన్లీ ట్వంటీ పర్సంట్..’, ‘రాష్ట్రానికి తెగులు–కాంగ్రెస్ కీడు’, ‘సీఎం రేవంత్రెడ్డిది 20 పర్సంట్ కమీషన్ పాలన’, ‘ప్రభుత్వానికి విజన్ లేదు–మిష¯న్ లేదు..’ వంటి పోస్టులకు సంబంధించి ఈ మూడు కేసులు పెట్టారు. నల్ల బాలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన 20 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం, కరీంనగర్, గోదావరిఖని–1 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ నల్ల బాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టారు. రాజకీయ విమర్శలపై కేసులా?: పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు. ‘నల్ల బాలువి క్రిమినల్ చర్యలు కావు. రాజకీయ విమర్శలు. దీనికే హింస, దురుద్దేశం, అల్లర్లు సృష్టించే పోస్టులంటూ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టించింది. పోలీసులు బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టంలోని సెక్షన్లు 192, 352, 353 కింద కేసులు నమోదు చేయడం చెల్లదు. ఒకవేళ పిటిషనర్ పెట్టిన పోస్టులతో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటే నేరుగా సీఎం లేదా ఆయన పార్టీ ఫిర్యాదు చేయాలి తప్ప ఇతరులు కాదు. థర్డ్ పార్టీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం చట్ట విరుద్ధం..’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘నల్ల బాలు ఇలాంటి ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. కావాలని సీఎంను కించపరుస్తూ, ప్రజల్లో సీఎంపై ఆగ్రహం కలిగించేలా పోస్టులు పెట్టారు. కేసుల విచారణను కొనసాగించాలి..’ అని కోరారు. కేసుల కొట్టివేత..పోలీసులకు సూచనలు వాదనల అనంతరం నల్ల బాలుపై రామగుండం సీసీపీఎస్, కరీంనగర్ సీసీపీఎస్, రామగుండం జీడీకే–1 స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయమూర్తి కొట్టేశారు. ఈ సందర్భంగానే పోలీసుల తీరును ఆయన ప్రశ్నించారు. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. – పరువు నష్టం కేసులు నమోదు చేసే ముందు ఫిర్యాదుదారుడు చట్టపరంగా బాధిత వ్యక్తేనా?.. అనేది పోలీసులు ధ్రువీకరించుకోవాలి. – కాగ్నిజబుల్ (అరెస్టు చేయదగిన) నేరాల్లో తప్ప ఇతర కేసుల్లో సంబంధం లేని మూడో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే అది చెల్లదు. – కాగ్నిజబుల్ కేసుల విషయంలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయో.. లేదో దర్యాప్తు చేయాలి. – హింస, ద్వేషం, ప్రజల్లో అశాంతిని ప్రేరేపించడానికి సంబంధించి ప్రాథమిక అంశాలు లేనట్లయితే.. ప్రజా శాంతికి ముప్పు, దేశద్రోహం వంటి కేసులను నమోదు చేయవద్దు. – కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు, శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న సూత్రాలను పాటించాలి – కఠినమైన, అభ్యంతరకరమైన, విమర్శనాత్మక రాజకీయ ప్రసంగానికి సంబంధించిన కేసులను పోలీసులు యాంత్రికంగా నమోదు చేయవద్దు. – ప్రసంగం హింసను ప్రేరేపించేలా లేదా ప్రజా శాంతికి తక్షణ ముప్పుగా ఉన్నప్పుడు మాత్రమే క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించాలి. – రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద.. రాజకీయ విమర్శకు రక్షణ ఉంది. – పరువు నష్టం అనేది నాన్ కాగ్నిజబుల్ నేరంగా పరిగణించినప్పుడు పోలీసులు నేరుగా క్రిమినల్ కేసు నమోదు చేయలేరు. – ఫిర్యాదుదారుడిని మెజిస్ట్రేట్ను సంప్రదించమని చెప్పాలి. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 174(2) కింద మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు మాత్రమే పోలీసు చర్య తీసుకోవాలి. – ఇష్టారాజ్యంగా, ఆటోమెటిక్గా, మెకానికల్గా అరెస్టులు అనుమతించబడవు. – అర్నేశ్కుమార్ వర్సెస్ బిహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే. – ఫిర్యాదు అనవరమైనది, రాజకీయ ప్రేరేపితం అని తేలితే.. దర్యాప్తునకు తగిన కారణాలు లేవంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 176(1) కింద పోలీసులు దాన్ని మూసివేయాలి. చెంపపెట్టు లాంటి తీర్పు: కేటీఆర్ ‘బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లను రీట్వీట్ చేసినందుకు శశిధర్ గౌడ్పై అక్రమ కేసులు నమోదు చేయించిన ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో ప్రభుత్వాలు అడ్డగోలుగా కేసులు పెడుతున్నాయి. గత 21 నెలలుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టి కాంగ్రెస్ వేధిస్తోంది. ఈ వేధింపులు ఇకనైనా ఆపి.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలి. బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలకు, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
కాలేజీకి వస్తేనే ఫీజు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేసే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం.. చడీచప్పుడు లేకుండా ఆ పథకంలో కోతలు వేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గత నెల 21వ తేదీన ‘సాక్షి’కథనం ప్రచురించగా, ప్రభుత్వం స్పందించి ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. నిరాధార వార్త’అంటూ కొట్టిపారేసింది. కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ గుర్తింపు హాజరును ఫీజు రీయింబర్స్మెంట్కు ఎలా లింక్ చేయాలి, ఎలా తప్పనిసరి చేయాలి? అనే అంశాన్ని భేటీ ఎజెండాలో ప్రధానంగా చేర్చారు. కొత్తగా కాలేజీలకు డిజీ లాకర్ను తీసుకొస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థుల హాజరు శాతం నమోదు అవుతుంది. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగానే వీసీల సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోతపై వ్యూహ రచన చేయబోతున్నట్టు సమాచారం. ముందు హాజరు.. తర్వాత మార్కులు ప్రస్తుతానికి ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ను ఫిల్టర్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత దశలకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సుల్లో ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలన్న కొత్త నిబంధన తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి సూచనగా చెబుతున్నారు. సాంకేతిక విద్యలో కోర్సులోని ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకుంటేనే రీయింబర్స్మెంట్ అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు సీఎస్ఈ ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. అదే విధంగా బీకాంలో కామర్స్ సబ్జెక్టులో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అధికారుల అంతర్మథనం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు ఉన్నత చదువులకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వాలు ఈ పథకంలో మార్పులు తెచ్చేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో పథకంలో కోతకు అడుగులు వేయాల్సి రావడంపై అధికారులు మథనపడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల కోట్ల వరకు పేరుకు పోయాయి. వీటిని రాబట్టుకునేందుకు కాలేజీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. భారీగానే కోతరాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్లు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్గా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం ఫీజు చెల్లిస్తారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు అసౌకర్యం తప్పదని అధికారులే చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లో కోత వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. -
బోధన్లో ఉగ్రకలకలం
సాక్షి,బోధన్: నిజామాబాద్లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్ను అరెస్ట్ చేశాయి. అయితే డ్యానిష్ ఇచ్చిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా బోధన్లో ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, యామన్.. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు ఎన్ఐఏ సోదాల్లో తేలింది. -
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో కొంత మంది తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేశానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అందుకే పార్టీకి రాజీనామా ఇచ్చానన్న రాజాసింగ్.. కొన్నిసార్లు తనను ఢిల్లీ పిలిచి వార్నింగ్ కూడా ఇప్పించారన్నారు. ‘‘బీజేపీ స్టేట్ కమిటీలో 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పదవులు ఇచ్చారు. జిల్లాలో ఉండే కార్యకర్తకు పదవులు ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. బీజేపీ రాష్ట్ర కమిటీ రామచందర్ రావు వేశారా? కిషన్ రెడ్డి వేశారా?. బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.‘‘బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీని సర్వ నాశనం చేసేందుకు కమిటీ వేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కమిటీపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. రామచందర్ రావు మంచి మనిషి.. కానీ రబ్బర్ స్టాంప్’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.‘‘బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశోక్ మాట్లాడిన తీరు బాగాలేదు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ డబ్బులు వసూలు చేశారు. బీజేపీ కార్యకర్తలే నాలుగో సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. నా కార్యకర్తల కోసం మాట్లాడుతున్నా. బీజేపీనీ పండబెట్టారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. నేను రాజీనామా చేయను.. పీక్కొండి’’ అంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు పార్టీలో మర్యాద దక్కలేదు. కార్యకర్తల్లో పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నికల్లో పార్టీ సపోర్ట్ చేయలేదు. కార్యకర్తలకు అనుకూలంగా నేను మాట్లాడతా. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు 15 మందిని తీసుకువస్తే వాళ్లను దాచిపెట్టారు. వెనక ఉన్న వాళ్ళు బయటకు రండి. తెలంగాణలో ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి రాదు’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, షేక్పేటలో కుండపోత వర్షం కురిసింది.తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసింది. సెప్టెంబర్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు.తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంచార్జ్లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు. -
రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ చిక్కిన మణిహారిక
మణికొండ (హైదరాబాద్): ఓపెన్ ప్లాట్కు ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఓ అధికారిణి ఏసీబీ వలకు చిక్కారు. రూ.5 లక్షలు డిమాండ్ చేసి రూ. 4 లక్షలు తీసుకుంటూ మంగళవారం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో టీపీవోగా పనిచేస్తున్న మణిహారిక మంచిరేవులలోని వినోద్కు చెందిన ఓపెన్ ప్లాట్కు ఎల్ఆర్ఎస్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 4 లక్షలకు బేరం కుదిరింది. ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తే ఉచితంగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేయటంతో వినోద్ తమను వారం రోజుల క్రితం సంప్రదించాడని శ్రీధర్ తెలిపారు. తమ సూచన మేరకు తను ఇస్తానన్న డబ్బును మంగళవారం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి ఆమెకు ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగి డబ్బును స్వా«దీనం చేసుకుని మణిహారికను అరెస్టు చేశామన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధి అలకాపూర్ టౌన్షిప్లోని ఆమె నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
నైపుణ్య శిక్షణతో విదేశాల్లోను ఉపాధి కల్పిస్తున్నాం
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ పథకం కింద శిక్షణ పొందిన 18 మంది ఎలక్ట్రీషియన్లు జర్మనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారని కార్మిక, ఉపాధికల్పన శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం సచివాలయంలో జర్మనీలో ఉద్యోగం చేయడానికి ఎంపికైన 18 మంది ఎలక్ట్రీషియన్లకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండో యూరో సింక్రనైజేషన్(ఐఈఎస్) సంస్థ వీరికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారని ఈ శిక్షణ పూర్తి చేసుకొని అన్ని పరీక్షల్లో నెగ్గిన వీరు జర్మనీలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర దేశాల్లో సైతం మన యువత పనిచేసేలా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నదని అన్నారు. వీరు నెలకు రూ. 2.6 లక్షల వేతన ప్యాకేజీని పొందనున్నారని తెలిపారు ఈ పథకం ద్వారా ఇక్కడి వారి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. త్వరలోనే ఇండో యూరో సింక్రనైజ్ సంస్థ కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని గ్రామీణ ప్రాంతల్లో యువతకు నైపుణ్య శిక్షణ పెంచేందుకు పలు కార్యక్రమాలు క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఇండో యూరో సింక్రనైజేషన్ సీఈవో డాక్టర్ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. -
సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్కు!
పాతబస్తీకి చెందిన మహమూద్కు కొత్త రేషన్ కార్డు మంజూరైంది. సెప్టెంబర్ నెలవారీ రేషన్ కోటా విడుదలైంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుండటంతో కోటా డ్రా చేసి తెచ్చుకునేందుకు డీలర్ వద్దకు హుషారుగా వెళ్లాడు. కార్డు నెంబర్ చెప్పి ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ పెట్టాడు. కార్డులో నలుగురు సభ్యులు ఉండటంతో 24 కిలోల బియ్యంపై తీసుకొవచ్చని భావించాడు. కానీ, డీలరు అందరి మాదిరిగానే నగదు కావాలా? బియ్యం కావాలా? అడిగాడు. అలోచిస్తున్న లోపే ‘బియ్యం వండుకొని తినలేరు. ముద్దముద్ద అవుతుంది. వృథా ఎందుకు? నగదు తీసుకోండి’అంటూ కిలోకు రూ.12ల చొప్పున లెక్కకట్టి రూ.288 చేతిలో పెట్టాడు. నెలవారీ కోటా డ్రా కోసం వచ్చిన మిగతా కార్డుదారుల్లో మెజార్టీ పరిస్థితి ఇదే. చేసేదేమీ లేక చేతిలో పెట్టిన నగదును జేబులో పెట్టుకొని ఇంటిముఖం పట్టక తప్పడంలేదు. ఇలాంటి ఉదంతాలు ప్రతిరేషన్ షాపులో నిత్యకృత్యం.సాక్షి, హైదరబాద్: ఇది రేషన్ బియ్యం కథ.. బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత సన్న బియ్యం’నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీల్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలో ఒక్కంటికి రూ.12ల చొప్పున లెక్క కట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. సన్నబియ్యంపై కూడా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబి్ధదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక యూనిట్ బియ్యమే... కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యమే తీసుకొని మిగతా యూనిట్ల కోటాను డీలర్ల వద్ద నగదు రూపంలో బదిలీ చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శించి డ్రా చేయని లబి్ధదారుల సబ్సిడీ సరుకులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ– పాస్ అమలుతో లబ్ధిదారులు బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ తప్పనిసరి కావడంతో డీలర్లు లబి్ధదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడపాదడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల దాడుల్లో పీడీఎస్ బియ్యం క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. స్పెషల్ డ్రెవ్ సమయంలో బియ్యం వ్యాపారులు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్గా.. మౌనం దాల్చుతున్నారు. అ తర్వాత తిరిగి దందాను కొనసాగించడం సర్వసాధారణంగా మారింది. -
అభివృద్ధికి కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్గడ్కరీ, నిర్మలా సీతారామన్ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్లో ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రేవంత్రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
లాభాలుండవ్.. లాసే
హైదరాబాద్కు చెందిన ఒకరు వాట్సాప్ ద్వారా ‘బజాజ్ ఫైనాన్షియల్సెక్యూరిటీస్ లిమిటెడ్’అనే పేరుతో ఉన్న నకిలీ గ్రూప్లో చేరాడు. ఈ గ్రూప్ మార్కెట్ ట్రెండ్స్, బ్లాక్ ట్రేడ్స్, ఐపీఓలపై అప్డేట్స్ ఇచ్చేది. గ్రూప్ అడ్మిన్ పురవ్ ఝవేరి, అతని సహాయకురాలు ప్రిషాసింగ్ బాధితుడిని ఒక నకిలీ యాప్లో ఇన్వెస్ట్ చేయమని ప్రోత్సహించారు. దీంతో బాధితుడు మే 30 నుంచి జూలై 9, 2025 మధ్య రూ.3.24 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు విత్డ్రాకు వీలుకాకపోవడంతో టీజీసీఎస్బీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో టీజీసీఎస్బీకి అధికారులు మహ్మద్ రజియుద్దీన్, మహ్మద్ వలియుల్లా, మహ్మద్ జుబైర్ఖాన్లను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన 49 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్టెలిగ్రామ్ గ్రూప్లో చేరగా, ఒక మహిళ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సలహాలు ఇవ్వగా, ఒక నకిలీ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు రూ.3.30 కోట్లు అందులో పెట్టాడు. విత్డ్రా చేయడానికి ప్రయతి్నంచగా, 10 శాతం కమీషన్, ట్యాక్స్ చెల్లించమని కోరడంతో ఇది స్కామ్ అని గుర్తించి టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశాడు. తాజాగా ఆదివారం (సెప్టెంబర్ 7) నమోదైన కేసులో యూసుఫ్గూడకు చెందిన వ్యక్తి రూ.28.76 లక్షలు ఈ తరహా మోసంలో పోగొట్టుకున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సలహాలతో ఓ వాట్సాప్ గ్రూప్లో చేరాడు. ట్రేడింగ్ ఐపీఓల పేరిట పెట్టుబడి పెట్టేలా చేశారు. మొదట లాభాలు వచి్చనట్టు చూపి తర్వాత డబ్బులు విత్డ్రాకు అవకాశం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశే కొందరి కొంప ముంచుతోంది. ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. పెట్టిన పెట్టుబడికి పదుల రెట్లలో లాభాలు వస్తాయని ఆశపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణానికి భిన్నంగా తక్కు వ సమయంలోనే అనూహ్య లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే అవి పక్కా మోసమే అన్న చిన్న లాజిక్ మిస్సవుతున్న ఎంతోమంది సైబర్ నేరగాళ్లకు రూ.కోట్లు సమర్పించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ తరహా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు పెరిగినట్టు టీజీ సైబ ర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ ఏడాది లో ఆగస్టు 31 వరకు చూస్తే ఈ తరహా కేసులు 17,169 నమోదైనట్టు టీజీసీఎస్బీ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మోసం చేస్తున్నారు... సైబర్ కేటుగాళ్లు అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్లు వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వేదికల్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, తద్వారా భారీ లాభాలు పొందే అవకాశాల గురించి మెసేజ్లు పంపుతారు. అందులో లింక్లపై ఎవరైనా క్లిక్ చేస్తే వారికి ఆన్లైన్ పెట్టుబడుల అంశాలపై సలహాలు ఇస్తూ...నమ్మకం పెంచుతారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ కల్పిస్తారు. అవతలి వ్యక్తి తమను నమ్ముతున్నట్టు గుర్తిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేయడం..తాము సూచించిన యాప్లలో పెట్టుబడి పెట్టాలని క్రమంగా ఒత్తి్తడి చేస్తారు. తొలుత లాభాలు వచ్చినట్టుగా నకిలీ మెసేజ్లు చూపుతారు. ఇలా రూ.లక్షల నుంచి మొదలై రూ.కోట్ల వరకు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి » తక్కువ సమయంలో అధిక లాభాలు అంటూఊదరగొడుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. » వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చే ఎస్ఎంఎస్లలో ఉండే లింక్లపైక్లిక్ చేసి వారిచ్చిన యాప్లలో పెట్టుబడి పెట్టొద్దు. » మీరు పెట్టుబడి పెట్టే ముందు చట్టబద్ధత ఉందా లేదానిర్ధారించుకోవాలి. షేర్లలో పెట్టుబడి డీమాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుందని మరవొద్దు. అధిక లాభాల ప్రకటనలతోజాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి టిప్స్,లింక్లను నమ్మి తెలియని యాప్లు లేదావెబ్సైట్లలో పెట్టుబడి పెట్టి మోసపోవొద్దు. అధిక లాభాల ప్రకటనలతో జాగ్రత్తగా ఉండండి.మీ డబ్బులు సురక్షితంగా ఉంచుకోండి – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్బీ -
గ్రూప్1 అర్హుల గుండె చెదిరింది!
సాక్షి, హైదరాబాద్/చిక్కడపల్లి: రాష్ట్ర ప్రభుత్వశాఖ ల్లో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఆనందం ఆవిరైంది. తుది జాబితాలో అర్హత సాధించి ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేసుకుని నియామక పత్రాలు తీసుకోవల్సిన సమయంలో.. అర్హుల జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి శరాఘాతంలా తగిలింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. రీవాల్యుయేషన్ తర్వాత తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రీవాల్యూయేషన్కు హైకోర్టు 8 నెలల గడువు ఇవ్వడంతో కింకర్తవ్యం ఏమిటనే దానిపై టీజీపీఎస్సీ ఆలోచనలో పడింది. ఇలావుండగా..పరీక్షలు బాగా రాసినప్పటికీ ఆశించినవిధంగా ఫలితాలు రాలేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. ఎన్నెన్నో అడ్డంకులు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2022 ఏప్రిల్ 26న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం గ్రూప్–1 నియామకాల ప్రక్రియలో ఉన్న ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఆశావహులు అప్పటివరకు తాము చేస్తున్న చిన్నపాటి ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. అదే ఏడాది చివర్లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. » 2023 ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతకు ఉపక్రమించారు. ఇంతలో టీజీపీఎస్సీలో పలు అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో భాగంగా గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని విచారణలో తేలడంతో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. » 2023 జూన్ 11న టీజీపీఎస్సీ మరోమారు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. అయితే ఈ పరీక్షల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. » టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొ త్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, టీజీపీఎస్సీ ప్రక్షాళన, కొత్త కమిషన్ ఏర్పాటు, కొత్తగా మ రో 60 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలను గుర్తింపు చ కచకా జరిగిపోయాయి. 2022 ఏప్రిల్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన టీజీపీఎస్సీ.. 2024 ఫిబ్రవరిలో 563 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. » 2024 జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను జూలై 7న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 31,383 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరితో పాటు మరో 20 మందిని కోర్టు ఉత్తర్వుల ద్వారా అనుమతించారు. » అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 31,403 మంది అభ్యర్థుల్లో 21093 మంది మాత్రమే అన్ని పరీక్షలూ రాశారు. 2025 మార్చి 10వ తేదీన అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది. » ఏప్రిల్ 10వ తేదీన 563 గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా చేపట్టింది. అయితే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వివిధ కేటగిరీలకు చెందిన పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నియామకాలకు బ్రేక్ పడింది. రీవాల్యుయేషనా? మళ్లీ పరీక్షలా? తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంపికైన అభ్యర్థులతో పాటు నిరుద్యోగ వర్గాల్లో చర్చోపచర్చలకు తెర లేపింది. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం మళ్లీ జరుపుతారా? లేక తిరిగి పరీక్షలు నిర్వహిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నియామక పత్రాలు అందుకోవాల్సి ఉండగా.. రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్షలంటూ తీర్పు రావడంతో మూడున్నరేళ్లు పడిన శ్రమను తలచుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన అభ్యర్ధులు హైకోర్టు తీర్పుతో ఆందోళనకు గురవుతుంటే.. మెయిన్స్లో విఫలమైన కొంతమంది న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నారు. మంగళవారం అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, పలు శిక్షణా కేంద్రాల్లో హైకోర్టు తీర్పు చర్చనీయాంశం అయ్యింది. ఆర్థికంగా పెను భారం కోచింగ్లు, మెటీరియల్, తదితర ఖర్చులు ఇప్పటికే తడిసి మోపెడయ్యాయి.మరోసారి పరీక్షలు రాయవలసి వస్తే మాత్రం ప్రతి పేద అభ్యర్థిపై పెను భారం పడుతుంది. – వై.క్రాంతికుమార్, గ్రూప్–1 అభ్యర్థి మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిందే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రభు త్వం మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు గతంలో ఎంతో నష్టం జరిగింది. మరోసారి పరీక్షలు నిర్వహించడం వల్ల వీరికి న్యాయం జరిగే అవకాశం ఉంది. – సలీమ్, గ్రూప్–1 అభ్యర్థికోచింగ్ కేంద్రాల దోపిడీకి మళ్లీ అవకాశం కోచింగ్ సెంటర్లు మరోసారి దోపిడీకి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అశోక్నగర్ కోచింగ్ కేంద్రాల మాఫియాకు అడ్డాగా మారింది. హాస్టళ్లు, మెస్లు, స్టడీ హాళ్లు, కోచింగ్ కేంద్రాలు అభ్యర్థులను పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. – బి.చంద్రకాంత్, రాష్ట్ర సహ కనీ్వనర్, లా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా -
పీసీసీ అధ్యక్షుడే అప్రూవర్గా మారారు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ లో చేరారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మొన్న టీవీల్లో చెప్పారు. ఆయనే అప్రూవర్గా మారి.. నేరాంగీకారం తెలిపిన తర్వాత విచారణ ఎందుకు? చర్చ ఎందుకు? వారిపై వేటు వేసేందుకు స్పీకర్కు మొహమాటం ఎందుకు?’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన వారు ఏ పార్టీ లో ఉన్నారో చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారన్నారు. స్పీకర్ నిర్ణయంలో తేడా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడింది సుప్రీంకోర్టు ముందు పెడతామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసమే ‘మేడిగడ్డ’.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు కావాలనే దు్రష్పచారం చేస్తున్నారని.. రాజకీయ కక్షతో కేసీఆర్పై కేసు పెట్టేందుకు యత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్ట్కు ఖర్చు చేసిందే రూ.94 వేల కోట్లు అని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ మామ పద్మారెడ్డి క్లియర్గా చెప్పారని.. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మేడిగడ్డలో 85 పిల్లర్లలో రెండు కుంగిపోతే అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి.. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘ఫార్ములా– ఈ’ ఓ లొట్టపీసు కేసు.. ‘నేను మళ్లీ చెప్తున్నా.. ఫార్ములా–ఈ ఒక లొట్టపీసు కేసు. ఈ అంశంలో ఎవరైనా వచ్చి నన్ను లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చు’అని కేటీఆర్ సవాలు చేశారు. హైదరాబాద్కి ఫార్ములా– ఈ రేసును తీసుకురావడానికి తాను ప్రయత్నాలు చేశానని చెప్పారు. రేసు నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, డబ్బులు కూడా నిర్దేశిత ఖాతాలోకే చేరాయన్నారు. మంగళవారం నందినగర్ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రాసిక్యూషన్ చేసినా, చార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఫార్ములా ఈ– కారు రేసుపై ఏసీబీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ–కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిధుల బదలాయింపులో తీవ్ర ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, హెచ్ఎండీఏ నిధులు దురి్వనియోగం అయ్యాయని అవినీతి నిరోధక శాఖ తేల్చినట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా, సంబంధం లేని విభాగం నుంచి నిధులను ఫార్ములా ఈ– కారు రేసుకు బదిలీ చేయడం వెనుక క్విడ్ ప్రో కో జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. రూ.55 కోట్ల హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ తుది నివేదిక అందించింది. ఈ కేసులో విధానపరమైన లోపాలు ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్లో తొలిసారి 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ–కారు రేసు సంస్థ రేసును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్పాన్సర్లతో తొలి రేసు నిర్వహించినా, అందుకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. తొలిసారి స్పాన్సర్లుగా వ్యవహరించిన సంస్థలకు ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో... 2024లో నిర్వహించాల్సిన రెండో రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకున్నారు. రేసు నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఫార్ములా ఈ– కారు రేసు నిర్వాహకులు వెంటనే నిధులు ఇస్తే తప్ప.. 2024 ఫిబ్రవరిలో రేసు కేటాయించడం సాధ్యం కాదంటూ ఒత్తిడి తేవడం, స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో అప్పట్లో హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ–కారు రేసు సంస్థకు విదేశీ కరెన్సీలోనే నిధులు చెల్లించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా తీసుకోలేదని, ఆర్థికశాఖ నుంచి కూడా అనుమతి తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారం మారడంతో...ఫార్ములా ఈ– కారు రేసును రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో హెచ్ఎండీఏ నుంచి నిధులు విదేశాలకు తరలివెళ్లాయని తెలియడంతో.. అప్పటి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఈ నిధులు మళ్లింపుపై విచారణ చేయాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ తర్వాత ఎసీబీ అధికారులు అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను రెండుసార్లు, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను మూడుసార్లు, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిలను మూడుసార్లు ప్రశ్నించింది. ఎస్ నెక్స్ట్ జెన్తోపాటు ఫార్ములా ఈ–కారు రేసు ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసిన ఏసీబీ అందులో ప్రధానంగా మాజీమంత్రి కేటీఆర్, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్కుమార్లను ముద్దాయిలుగా పేర్కొన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. వారిపై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. -
కొత్త దళపతి.. తిరుపతి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కోరుట్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతాదళాలతో జరిగిన కాల్పుల్లో మే 21వ తేదీన మరణించారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మే 21 తర్వాత పొలిట్బ్యూరో, కేంద్ర మిలటరీ కమిషన్ సంయుక్త సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు. తీవ్ర నిర్బంధం ఉన్నా, ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తిరుపతి కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. తిరుపతి ఎన్నికతో రెండోసారి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లభించినట్టు అయ్యింది. పీపుల్స్వార్ నుంచి కొండపల్లి సీతారామయ్యను తప్పించిన తర్వాత కరీంనగర్ జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.వృద్ధాప్యం పైబడడంతో ఆయన ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళికి చెందిన నంబాళ్ల కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్గా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతికి ముప్పాళ్ల లక్ష్మణ్రావుకు ప్రియశిష్యునిగా పార్టీలో పేరుంది. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి ఈ బాధ్యతలు అప్పగించడమే సముచితంగా ఉంటుందని పార్టీ భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి.పార్టీ ప్రధాన నాయకులే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యకతను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కాగా, మడావి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. కమలేశ్ విచారణలో విజయవాడలోని పోరంకికి చెందిన నాగరాజు అలియాస్ కమలేశ్ ఆలియాస్ రామకృష్ణ మావోయిస్టు పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జూలై 26న ఏపీ పోలీసుల ముందు లొంగిపోయాడు. వారి విచారణలో మావోయిస్టు కొత్త సారథిగా తిరుపతిని ఎన్నుకున్నట్టు కమలేశ్ వెల్లడించాడని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంజినీర్ కావాలనుకొని.. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిప్పరి వెంకటనర్సయ్య–గంగుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడైన తిరుపతి చిన్నప్పటి నుంచి చదువులో రాణించేవాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. 1980లో పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేరాడు. అప్పటికే కాలేజీలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. ఈ ప్రభావానికి గురైన తిరుపతితోపాటు పలువురు విద్యార్థులపై పోలీసుల నిర్బంధం సాగింది. అయినా, ఇంటర్ పూర్తి చేసి 1982లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడా విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. దీంతో డిగ్రీ పూర్తి కాకముందే మల్లోజుల కోటేశ్వర్రావు ముఖ్య అనుచరుడు మెట్పల్లి మండలంలోని కొండ్రికర్లకు చెందిన సాయిని ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతితోపాటు మరికొందరు అడవి బాట పట్టినట్టు సమాచారం.1984లో బస్తర్కు వెళ్లి అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. బస్తర్ బాధ్యతలు హిడ్మాకు కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన తొలి ఛత్తీస్గఢ్ మావోయిస్టుగా పేరున్న మడ్వి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. గెరిల్లా దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మాకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల దూకుడుకు బ్రేకులు వేసేపని అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకునే సుక్మా, బీజాపూర్ జిల్లాలతో కూడిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైంది. ఒకప్పుడు ఐదువేల మందికి పైగా సాయుధ మావోయిస్టులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో అత్యధిక సాయుధులు ఈ కమిటీలోనే ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో దండకారణ్యం దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. దండకారణ్యం బాధ్యతలు ఇప్పటివరకు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ చూస్తుండగా, ఇక్కడే ఉన్న జనతన సర్కార్ బాధ్యతలు మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా నిర్వర్తిస్తున్నారు. కొత్తగా హిడ్మా ఈ పోస్టులోకి రావడంతో ఆ ఇద్దరికి ఏ విధులు అప్పగిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. మిలిటరీ బాధ్యతల్లో మిసిర్ బెహ్రా: కేంద్ర కమిటీలో ముగ్గురు పొలిట్బ్యూరో సభ్యులు ఉన్నారు. వీరిలో తిప్పిరి తిరుపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికవడంతో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు జార్ఖండ్కు చెందిన మిసిర్ బెహ్రాకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా అలియాస్ అభయ్ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు. -
మళ్లీ దిద్దాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు తేల్చిచెప్పింది. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా(జీఆర్ఎల్)ను రద్దు చేసింది. గ్రూప్–1 మెయిన్స్కు సంబంధించిన అన్ని సమాధాన పత్రాలను మాన్యువల్గా తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. సంజయ్సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలహాబాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మోడరేషన్ పద్ధతిని వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది సాధ్యంకాని పక్షంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష రద్దు చేసి ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియంతా మంగళవారం నాటి ఉత్తర్వుల కాపీ అందిన రోజు నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలంటూ కీలక తీర్పు వెలువరించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు సుదీర్ఘ వాదనల అనంతరం.. జూలై 7న తుది తీర్పు రిజర్వు చేశారు. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం సమస్యను విధానపరమైన, మూల్యాంకన విధానం అనే రెండు కేటగిరీలుగా విభజించవచ్చునని న్యాయమూర్తి తెలిపారు. ఒక్కో కేటగిరీలోని అంశాల వారీగా తీర్పు ఇచ్చారు. 1) విధానపరమైన అంశాలు.. రెండు హాల్ టికెట్ల జారీ: 2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో రెండు హాల్టికెట్ల ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కమిషన్ వివరణ కూడా అస్పష్టంగా ఉంది. యూపీఎస్సీనే ఒక హాల్టికెట్ ఇస్తున్నప్పుడు.. ఇక్కడ రెండు ఎందుకనే దానిపై వివరణ నమ్మశక్యంగా లేదు. 2011లో ఇదే విధానం అనుసరించినట్లు కమిషన్ పేర్కొన్నా.. ఆ డాక్యుమెంట్లను సమర్పించలేదు. నోటిఫికేషన్ లేదా నిబంధనల మేరకు పరీక్ష జరగలేదని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. కేంద్రాల కేటాయింపు: 18, 19 పరీక్షా కేంద్రాల్లో మహిళా అభ్యర్థులకే ప్రాధాన్యత ఎలా ఇచ్చారు. రాండమైజేషన్ విధానమే అయితే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను రెండు కేంద్రాలకే ఎలా కేటాయించారు? మహిళా అభ్యర్థులనే కేటాయించాలని కళాశాల అధికారులు చెప్పినట్లు కమిషన్ పేర్కొన్నా ఆధారాలను సమర్పించలేదు. అసలు అలా కేటాయింపులో ప్రాధాన్యత ఎందుకో కమిషన్ చెప్పలేదు. నోటిఫికేషన్లో పేర్కొనలేదు. మరోవైపు శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నగరానికి దూరంగా 2వ, 3వ అంతస్తుల భవనాలను కేటాయించింది. ఇది కేంద్రాలను కేటాయించడంలో వివక్షను ప్రతిబింబిస్తోంది. హాజరులో అసమానత: మెయిన్స్కు హాజరైన అభ్యర్థుల సంఖ్యను.. 21,093, 21,085, 21,110, 20,161గా ఇలా ఒక్కోసారి ఒక్కోలా పేర్కొంది. అభ్యర్థుల హాజరు నమోదులో కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాజ్యాంగ సంస్థ ఇలా చేయడం ప్రశంసించలేం. తుది మార్కుల జాబితా విడుదల సమయంలో 21,085 మందిగా పేర్కొంది. సంఖ్యలో మార్పునకు ఎటువంటి వివరణ లేదు. బహుళ మూల్యాంకనం: జవాబు పత్రాల తొలి రెండు మూల్యాంకనాల్లో మార్చి 13 నాటి వెబ్ నోట్ ప్రకారం బార్కోడ్, బబ్లింగ్లున్నాయి. మూడో మూల్యాంకనంలో ఇవి లేవు. ఏపీలో నిర్వహించినట్లు ఇక్కడా చేశామని కమిషన్ చెప్పినా మూడో మూల్యాంకనం భిన్నంగా ఉండటంతో మార్కులను మార్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్లో మూడో మూల్యాంకనంపై వివరాలు లేవు. కమిషన్ చర్యలు గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశాయి. మూల్యాంకన ప్రక్రియ పిటిషనర్ల వాదనలకు బలాన్ని చేకూర్చింది. వారి వాదన తోసిపుచ్చలేం. మార్కుల జాబితా ప్రచురణ: నిబంధనల ప్రకారం అభ్యర్థుల మార్కులను సబ్జెక్టుల వారీగా ప్రచురించాలి. అలా చేయకుండా కమిషన్ వ్యక్తిగత లాగిన్లకు సబ్జెక్టుల వారీగా పంపింది. అంటే ఎవరి మార్కులు వారికే కనిపిస్తాయి తప్ప.. ఇతరుల మార్కులు తెలియవు. ఇది సరికాదు. అందరి అభ్యర్థుల మార్కులతో జాబితాను ప్రచురించకపోవడం పారదర్శకతను దెబ్బతీస్తోంది. దీనిపై కమిషన్ను ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు ఉంది. అర్హత సాధించని అభ్యర్థుల పేపర్లు మూల్యాంకనం: ఇంగ్లిష్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతే ఇతర పేపర్లు మూల్యాంకనం చేశామని కమిషన్ చెప్పింది. అయితే జనరల్ ఇంగ్లిష్లో అర్హత సాధించని వారి పేపర్లూ మూల్యాంకనం చేసినట్లు 12 మంది పేర్లు పరిశీలిస్తే తెలుస్తోంది. పరీక్ష నిర్వహణలో అసమగ్రతను ఇది స్పష్టం చేస్తోంది. దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది అశనిపాతం లాంటిది. ఖాళీలు పెంచడం: రెండో నోటిఫికేషన్ ద్వారా ఖాళీల సంఖ్య పెంచారు. మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అంతకుముందు దరఖాస్తు చేసుకోని వాళ్లు కూడా కొత్తగా రావడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అయితే దీనిపై ఇప్పటికే ఇదే హైకోర్టు తీర్పునిచ్చింది. అందుకే ఈ అంశంపై విచారణకు నిరాకరించాం. 2) మూల్యాంకన విధానం.. మూల్యాంకనదారుల ఎంపిక: రెగ్యులర్ అధ్యాపకులు, ఇద్దరు రిటైర్డ్ అధ్యాపక సభ్యులను మెయిన్స్ మూల్యాంకనానికి నియమించినట్లు కమిషన్ పేర్కొంది. వీరి పేర్లను రహస్యంగా ఉంచామని, పిటిషనర్లు బహిర్గతం చేసినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకునే హక్కు ఉందని వాదించింది. అలాంటప్పుడు ఆ వివరాలిచ్చిన కమిషన్ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే తీసుకోవాలన్నది పిటిషర్ల వాదన. ప్రైవేట్ ట్యూటర్గా పనిచేసిన డాక్టర్ ఎం.ఎ.మాలిక్ను కూడా తీసుకున్నారని వారు తెలిపారు. ఇతను 22 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలకు పోటీ పరీక్షల కథనాలను అందిస్తున్నానని పేర్కొన్నారు. దీనిని అంగీకరించని కమిషన్ పిటిషనర్లపై కేసులు నమోదు చేస్తామని బెదిరించింది. అలాగే కమిషన్ రెగ్యులర్ ఫ్యాకల్టీ అనే దానికి అర్థాన్ని మార్చింది. పత్రాలు దిద్దిన విధానం: సమాధాన పత్రాల మూల్యాంకనానికి ఏదైనా విధానం ఉందా? కీ ఉందా? అని కమిషన్ను ప్రశ్నించాం. ఎటువంటి కీ లేదని, మూల్యాంకనదారులు సబ్జెక్ట్ నిపుణులని పేర్కొంది. తర్వాత కీ ఉందని సీల్డ్ కవర్లో సమర్పించింది. కీ విషయంలో కమిషన్ తన వాదనను ఎప్పటికప్పుడు మార్చింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాలపై ఏదైనా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలనుకుంటే సర్కార్ను సంప్రదించాలి. కానీ అలా జరగలేదని తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన కీలోనూ లోపాలున్నాయి. ‘తెలుగు’ అభ్యర్థుల విషయంలో నిర్లక్ష్యం: తెలుగు మాధ్యమంలో మెయిన్స్ రాసిన వారి పత్రాలను సరైన పద్ధతిలో మూల్యాంకనం చేయలేదనేది ప్రధాన ఆరోపణ. కాగా భాషల వారీగా ఎంతమంది మూల్యాంకనదారులను నియమించారన్నది స్పష్టత లేదు. టీచర్లంతా ఇంగ్లిష్, తెలుగులో ప్రావీణ్యం కలిగినవారే అని చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లిష్ మీడియంలో 506 మంది (మొత్తం రాసిన వారిలో 89.88 శాతం), తెలుగు మీడియంలో 56 (9.95 శాతం), ఉర్దూలో ఒకరు అర్హత సాధించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని స్పష్టమవుతోంది. నిర్దిష్ట కేంద్రాల్లో అత్యధికులు అర్హత సాధించడం: 18, 19 కేంద్రాల నుంచి 35.5 శాతం మహిళలు అర్హత సాధించగా, ఇతర కేంద్రాల నుంచి 5.35 మాత్రమే అర్హత పొందారు. ఇది చాలా వ్యత్యాసాన్ని చూపిస్తోంది. ఆమోదయోగ్యంగా లేదు. కొందరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఇవ్వడం: మెయిన్స్ రాసిన చాలామంది అభ్యర్థులకు ఒకే విధంగా మార్కులొచ్చాయి. 719 మందికి ఈ విధంగా మార్కులొచ్చాయని కమిషన్ అంగీకరించింది. అయితే పోటీ పరీక్షలో సమాన మార్కులు వచ్చే అవకాశమున్నా.. పక్కపక్క హాల్టికెట్ల వ్యక్తులకు అలా రావడం అనుమానాలకు తావిస్తోంది. సమాన మార్కులు వచ్చిన వారి విషయంలోనూ కమిషన్ అనుసరించిన ర్యాంక్ల విధానం చట్టవిరుద్ధం.. లోపభూయిష్టం. -
‘సీఎం రేవంత్ నోరు విప్పితే గోబెల్ ప్రచారం’
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి నోరు విప్పితే గోబెల్ ప్రచారమేనని, మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్నారని విమర్శించారు హరీష్. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తెలంగాణ భవన్లో హరీష్ మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టం అంటున్నావు.. కత్తెర పట్టుకొని కేసీఆర్ కట్టినవి కట్ చేస్తున్నావ్.. పేర్లు మార్చుడు, కత్తెర పట్టుకొని కేసీఆర్ తిరగలేదు. ఎల్లంపల్లి కోసం 2వేల కోట్లు ఖర్చు పెట్టాము. రేవంత్ ప్రారంభోత్సవం చేసిన ఫ్లై ఓవర్లు, డ్యాములు కేసీఆర్ హాయంలోనివే. ఎల్లంపల్లి ద్వారా 20టిఎంసి హైదరాబాద్కు ఎలా తెస్తావ్?, సీఎం కుర్చీకి గౌరవం పోగొడుతున్నావ్. కాళేశ్వరం మోటర్లతోనే నీళ్లు ప్రాజెక్టులకు వస్తున్నాయి. కేసీఆర్ ముందుచూపుతో మల్లన్నసాగర్ నిర్మించారు. గండిపేట, హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం లో 12రిజర్వాయర్లు.. అందులో భాగమే మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటే నీళ్లు ఎక్కడివి..?, కాళేశ్వరం నీళ్లే మల్లన్న సాగర్కి వస్తాయి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపడితే... రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం.. మల్లన్నసాగర్. కాళేశ్వరంను తిడుతావ్ అక్కడి నుండే నీళ్లు వచ్చేవి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చారు. -
నేను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. రేవంత్ సిద్ధమా? కేటీఆర్
హైదరాబాద్: తనపై పెట్టిన ఫార్మాలా ఈ-కార్ రేసు ఒక లొట్టపీస్ కేసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఆనాడు ఈ-కార్ రేస్ నిర్వహించామన్నారు. లొట్టపీస్ కేసులో ఎటువంటి చార్జ్షీటైనా వేసుకోమనండి, అందులో అవినీతే జరగలేదన్నారు. ఈరోజు(మంగళవారం, పెప్టెంబర్ 9వ తేదీ) ఫార్మాలా ఈ-కార్ రేస్ చార్జ్షీటు దాఖలుపై కేటీఆర్ స్పందించారు. ‘ ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతే జరగలేదు. ేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం , రేవంత్ రెడ్డి సిద్ధమా?, దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. రేవంత్ వస్తారా.. ఏసీబీ డీజీ వస్తారా.. లై డిటెక్టర్ సిద్ధం. ూ. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది నేనే. ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదు. ప్రాసిక్యూషన్, చార్జిషీట్, జైలు.. ఏదైనా చేసుకోండి.. నేను సిద్ధం’ అని కేటీఆర్ సవాల్ చేశారు. కాగా, అంతకుముందు ప్రెస్మీట్లో మాట్లాడిన కేటీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. -
‘గ్రూప్-1’ తీర్పు.. రేవంత్కో గుణపాఠం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్.. ఇన్ని రోజుల పాటు గ్రూప్-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్ సమాధానం ఏంటి?: హరీష్హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్రెడ్డిపై హరీష్రావు మండిపడ్డారు.గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న…— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2025 -
రైలుకిందపడి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: రైలు కింద పడి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ డేవిడ్రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఘట్కేసర్–బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా మృతురాలిని ఘట్కేసర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐ అండ్ డీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దుంపటి హితవర్షిణి(20)గా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన అంజన్న కుమార్తె హిత వర్షిణి ఘట్కేసర్లోని కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతోంది. సెలవుల కారణంగా మూడు రోజుల క్రితం ఆర్మూర్కు వెళ్లిన ఆమె ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్కు చేరుకుంది. అక్కడి నుంచి మెట్రో రైలు ఎక్కి ఉప్పల్ స్టేషన్లో దిగింది. ఉప్పల్ నుంచి ఆటోలో ఘట్కేసర్ చేరుకున్న హితవర్షిణి సమీపంలోని ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు పట్టారు. ప్రేమ వ్యవహారమే కారణమా..? లక్సెట్టి పేటలో యువకుడి ఆత్మహత్య కాగా హిత వర్షిణి (20) వినయ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. హితవర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే వినయ్ సోమవారం మధ్యాహ్నం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. -
నేత్రదానం మహాదానం: సజ్జనార్
గోల్కొండ: నేత్రదానంపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ వి.సి.సజ్జనార్ అన్నారు. 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సోమవారం మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సుధీర్ఘకాలంగా నేత్రదానంపై సరోజినీదేవి ఆసుపత్రి వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నేత్రదానం వల్ల మరొకరికి కంటి చూపు ప్రసాదించవచ్చన్నారు. తమ వంతు కృషిగా బస్టాండ్లు, బస్డిపోల వద్ద నేత్రదాన ఆవశ్యకతపై పోస్టర్లు అతికించామని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా వైద్యకళాశాల సూపరిండెంటెంట్ డాక్టర్ రాజారావు, సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత, ఎంపీసీడీ సభ్యురాలు డాక్టర్ కళావతి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో మహా విస్తరణ
2050 నాటికి 31 రూట్లు, 662 కి.మీ. సాక్షి, సిటీబ్యూరో: వచ్చే ఇరవై ఐదేళ్లలో మెట్రో మహా విస్తరణకు ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర అవసరాలకు అనుగుణంగా 31 కారిడార్లలో 662 కి.మీ. వరకు పొడిగించే అవకాశం ఉంది. మాస్టర్ప్లాన్–2050లో భాగంగా హెచ్ఎండీఏ కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్(సీఎంపీ) కోసం లీ అసోసియేట్స్కు ముసాయిదా ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ ముసాయిదా నివేదికను రూపొందించింది. త్వరలోనే తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పుడున్న మూడు కారిడార్లు, రెండోదశలో నిర్మించనున్న 8 కారిడార్లతో కలిపి 2050 నాటికి 31 కారిడార్లలో మెట్రో సదుపాయం అవసరమని పేర్కొంది. మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా, మెట్రో విస్తరణ ఎంతో కీలకమని తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 86 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలో ఈ సంఖ్య కోటికి చేరనుంది. ప్రజారవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా మాత్రమే వ్యక్తిగత వాహనాలను ని యంత్రించవచ్చని లీ అసోసియేట్స్ స్పష్టం చేసింది. దశలవారీగా విస్తరణ... కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం 2024వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుతం నగర జనాభా 1.55 కోట్లు ఉన్నట్లు ఉంటుందని అంచనా. 2050 నాటికి 2.71 కోట్ల నుంచి 3.90 కోట్లకు చేరుకోవచ్చనే అంచనాల మేరకు 7,250 చ.కి.మీ.పరిధిలో మెట్రో విస్తరణకు ఈ సంస్థ ప్రణాళికలను రూపొందించింది. ట్రాఫిక్ సర్వే విశ్లేషణలు, జనాభా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాల డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా మెట్రో విస్తరించవలసి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కి.మీ. వరకు మెట్రో సదుపాయం ఉంది. కొత్తగా ప్రతిపాదించిన రెండోదశ పూర్తయితే మరో 8 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి రానుంది. దీంతో సుమారు 200 కి.మీ. వరకు మెట్రో సేవలు విస్తరిస్తాయి. ప్రస్తుతం 5 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నారు. రెండో దశ పూర్తయితే మరో 10 లక్షల మందికి ఈ సదుపాయం లభించనుంది. 2040 నాటికి మెట్రో మూడోదశలో 340 కి.మీ.లు చేపట్టాలని లీ అసోసియేట్స్ సూచించింది. అప్పటివరకు మరో 15 లక్షల మందికిపైగా కొత్తగా వచ్చి చేరే అవకాశం ఉంది. 2050 నాటికి 662 కి.మీ. పూర్తి చేస్తే 75 లక్షల మందికిపైగా ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. హెచ్ఎంఏ డెవలప్మెంట్ ప్లాన్... ● హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ● జాతీయ పట్టణ రవాణా పాలసీకి అనుగుణంగా భవిష్యత్తులో ప్రజారవాణా సదుపాయాలు, రహదారులు, మెట్రో వంటి ప్రాజెక్టుల విస్తరణ లక్ష్యంగా కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లాన్(సీఎంపీ)ని సిద్ధం చేస్తున్నారు. ● ఈ మేరకు 2050 నాటికి మెట్రోరైలుకు ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉండనుందనే అంశంపై ఆధారపడి మెట్రో విస్తరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మొదటి, రెండు దశలు కాకుండా లీ అసోసియేట్స్ ప్రతిపాదించిన రూట్లు (కి.మీ) ఇవే.. 75 లక్షల మందికి పైగా ప్రయాణికులు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్–2050 ప్రణాళికలు 2030 నుంచి 2050 నాటికి దశలవారీగా విస్తరణ 7,257 చ.కి.మీ.పరిఽధిలో మెట్రో అవసరం లీ అసోసియేట్స్ నివేదికలో వెల్లడి ఈసీఐఎల్–కీసర: 12.6 ఆరాంఘర్–రేతిబౌలి: 10 ఓఆర్ఆర్ శంషాబాద్–కొత్తూర్–షాద్నగర్: 26 నానక్రాంగూడ జంక్షన్–నార్సింగ్–శంషాబాద్: 25.4 శంషాబాద్ ఓఆర్ఆర్–తుక్కుగూడ –పెద్దఅంబర్పేట్: 40 పెద్దఅంబర్పేట్– ఘట్కేసర్ –మేడ్చల్ జంక్షన్: 45 మేడ్చల్ ఓఆర్ఆర్–దుండిగల్–పటాన్చెరు: 30 పటాన్చెరు ఓఆర్ఆర్–కోకాపేట్–నార్సింగ్ ఓఆర్ఆర్: 37.4 బీహెచ్ఈఎల్–బాచుపల్లి–కొంపల్లి–దమ్మాయిగూడ: 37.4 మెట్టుగూడ–మల్కాజిగిరి–ఈసీఐఎల్: 8.0 బోయిన్పల్లి–బాలానగర్–హైటెక్సిటీ: 14 విప్రో సర్కిల్–గోపన్పల్లి–బీహెచ్ఈఎల్: 11.2 పటాన్చెరు–ఇస్నాపూర్ (ఓఆర్ఆర్): 6.0 హయత్నగర్–పెద్దఅంబర్పేట్: 15 ఎంజీబీఎస్– అంబర్పేట్–ఘట్కేసర్: 35 అమీర్పేట్–బాలానగర్–దుండిగల్: 20 హబ్సిగూడ–నాచారం–ఓఆర్ఆర్ ఘట్కేసర్: 17.7 లక్డీకాఫూల్–గచ్చిబౌలి–మియాపూర్: 25 నానల్నగర్–లంగర్హౌస్–మొయినాబాద్: 21 మలక్పేట్ మెట్రో–ఐఎస్సదన్–ఒవైసీ హాస్పిటల్: 4.5 -
వదల బొమ్మాళీ.. వదల!
రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినా కదలని ఇన్చార్జ్సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర తూనికలు, కొలత శాఖ లెక్క తప్పింది. తూకాలు, మోసాలపై పర్యవేక్షణేమో గానీ, పరిపాలనపరమైన వ్యవహారాల్లో సైతం జవాబుదారీతనం కొరవడింది. సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ నెలరోజుల క్రితం వరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అధికారి మాత్రం చాంబర్ను వదలా.. కదలా.. అంటూ యధావిధిగా ఫైళ్లను పరిశీలిస్తుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీంశంగా మారింది. ఇటీవల తూనికల, కొలతల శాఖలో పలువురికి పద్నోతులు కల్పిస్తూ రాష్ట్ర కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్–1 డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్(డీఐ)కి అసిస్టెంట్ కంట్రోలర్(ఏసీ)గా పదోన్నతి కల్పించి ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో హెడ్క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్గా రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. జూలై 31న పదోన్నతి పొందిన సదరు అధికారిణి తక్షణమే రిపోర్టు చేసి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్గా విధులు నిర్వహించిన వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఎసీ)ల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ, రెగ్యులర్ అధికారిణి డ్యూటీలో చేరినప్పటికి 25 రోజులుగా సదరు అధికారి మాత్రం కార్యాలయానికి త్వరగా వచ్చి ప్రధాన సీటుపై కూర్చుంటూ ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు హెడ్ క్వార్టర్ ఏసీగా వ్యవహరించిన సదరు అధికారి సీనియర్ కావడం, మరోవైపు పలువురు ఉద్యోగుల పదోన్నతి ఫైళ్ల వ్యవహారం ఉండటంతో ఆయన అనుభవం తనకు సహకారంగా ఉంటుందని సదరు అధికారిణి కూడా మిన్నుకుండినట్లు సమాచారం. అయితే వారం రోజుల క్రితం పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో రెగ్యులర్ అధికారిణి ఆఫీస్కు ఆయన కంటే ముందుగానే వచ్చి ప్రధాన కుర్చీలో కూర్చుంటున్నారు. అయినా సదరు అధికారి మరో సాధారణ కుర్చీలో కూర్చొని ఫైళ్లు పరిశీస్తూ చాంబర్ను వదలక పోవడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర కంట్రోలర్ కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. హాజరెట్లెట్టా..? ప్రధాన కార్యాలయంలో హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యతలను నుంచి నుంచి తప్పుకున్నా వరంగల్లోని రెగ్యులర్ ఏసీ విధులకు హాజరు కాకుండా హెడ్ క్వార్టర్లోనే ఉండిపోవడంతో హాజరు నమోదుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పోస్టింగ్లో కాకుండా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తే, న్ఆన్ డ్యూటీ హెడ్ ఆఫీస్ (ఓడీహెచ్) అని హాజరు పట్టికలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులైతే మాత్రం ఆ శాఖాధిపతి అనుమతి తప్పనిసరి. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి ఫైళ్లు తిరగేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఇటీవల జరిగిన ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో కూడా చేతివాటం ప్రదిర్శంచినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదనపు బాధ్యతల మాటున తప్పిదాలెన్నో.. సదరు అధికారి పలు నిబంధనలు సైతం తుంగలో తొక్కి పదోన్నతులు, కొత్త పోస్టింగ్ల్లో పలు జిమ్మిక్కులు చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. పదోన్నతులతో కొత్త స్థానాల్లో చేరినవారు కొద్ది నెలలకే తాము కోరుకున్న చోటుకు బదిలీ చేయడం గమనార్హం. వాస్తవంగా బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. అయినా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 20న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్లు కేటాయించారు. పదోన్నతుల ద్వారా పోస్టింగ్లో చేరి శిక్షణ పూర్తి చేసిన తర్వాత కొందరికి పోస్టింగ్ మార్చి కోరుకున్న స్థానాల్లో బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఇలా.... ● పదోన్నతి ద్వారా హైదరాబాద్ సీసీ–1 ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ లభించిన ఉద్యోగికి జనగామాకు, హెడ్ క్వార్టర్ హైదరాబాద్–1 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా పోస్టింగ్లో చేరిన మరో ఉద్యోగికి రంగారెడ్డి జిల్లా ఆఫీస్కు బదిలీ చేశారు. ● మేడ్చల్–మల్కాజిగిరి డీఐ పోస్టు సస్పెన్షన్తో ఖాళీ కాగా, ఆ స్థానంలో నల్లగొండ డీఐకి బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవంగా బదిలీలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టుకు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ, నేరుగా బదిలీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ● నిబంధనల ప్రకారం నిషేధిత కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేయాలంటే కూడా ప్రభుత్వం ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ, తూనికలు, కొలతల శాఖ పరిపాలనా విభాగం నిబంధనలను తుంగలోకి తొక్కి సిఫార్సులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరగడంతో ట్రెజరీ అండ్ అకౌంట్ విభాగం వారి వేతనాల చెల్లింపు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అదే చాంబర్లో నెలరోజులుగా విధులు సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలో నిబంధనలు తూచ్ గతంలో పోస్టింగ్, పదోన్నతుల్లో చేతివాటం ఆరోపణలు పట్టని తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర కంట్రోలర్ -
అన్నదాతలప్రయోజనాలే ముఖ్యం
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సాక్షి, సిటీబ్యూరో: రైతుల ప్రయోజనాల కోసం మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్ను సందర్శించిన ఆయన బత్తాయి రైతులతో ముచ్చటించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్ర భుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమ లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల పనితీరును కమిషన్ సమీక్షిస్తుందని చెప్పారు. కోహెడలో త్వరలోనే మార్కెట్ నిర్మా ణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కమిషన్కు విన్నపం కొత్తపేట నుంచి పండ్ల మార్కెట్ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారానికి మార్చినప్పటికీ, వ్యాపారానికి అనువైన వాతావరణం లేదని కమిషన్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, మార్కెట్ యార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు సునీల్రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, సభ్యులు అంజయ్య, మధుసూదన్రావు, రఘుపతిరెడ్డి, లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, నర్సింహ, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతోపాటు మార్కెట్ ఈఈ ప్రసాద్ రావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, ఫ్రూట్ ట్రేడర్స్ అఽధ్యక్షుడు మహ్మద్ తాజ్, ఉపాధ్యక్షుడు అచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ పోలీసులకు క్రికెట్ స్టేడియం!
● నాలుగు ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదన ● పోలీసులకు ఉచితంగా, ఇతరులకు అద్దెకు.. అంబర్పేట లేదా ఆరాంఘర్ చౌరస్తాలో ఏర్పాటుకు యోచన సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీసులకు సొంతంగా ఓ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని పోలీసు శాఖ భావిస్తోంది. అంబర్పేటలోగానీ, ఆరాంఘర్ చౌరస్తాలోగానీ నిర్మించే ఈ స్టేడియాన్ని పోలీసు విభాగం అధికారులు, సిబ్బంది ఉచితంగా, సాధారణ పౌరులు అద్దెకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టేడియం క్రీడావసరాలకు మాత్రమే వినియోగించనున్నారు. గతంలో స్టేడియం ఉన్నప్పటికీ... సిటీ పోలీసు విభాగం కొన్ని దశాబ్దాల క్రితం గోషామహల్లో శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం నిర్మించింది. అయితే ఇందులో అసరమైన వసతులు లేకపోవడంతో పోలీసు శిక్షణలు, డ్రిల్స్తోపాటు కొన్ని క్రీడలు, కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే వినియోగించేవారు. అయితే అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని ఈ ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంది. మొత్తం 43 ఎకరాల 37 గంటలు ఉన్న ఈ స్టేడియం స్థలం నుంచి 31 ఎకరాల 39 గుంటలు ఆసుపత్రికి సేకరించి... 11 ఎకరాల 38 గుంటలు పోలీసు అవసరాలకు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి కోసం గోషామహల్ స్టేడియం ప్రాంగణం నుంచి స్థలం తీసుకుంటున్నందున, దీనికి ప్రతిగా ఆరాంఘర్ ప్రాంతంలో 12 ఎకరాలను పోలీసు విభాగానికి కేటాయించింది. పరిశీలనలో ఆ రెండు ప్రాంతాలు... గోషామహల్ వద్ద పోలీసు విభాగానికి కేటాయించిన స్థలంలో ట్రాక్తోపాటు అశ్వాల కోసం స్టేబుల్స్, పోలీసు జాగిలాల కోసం కెన్నల్స్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అంబర్పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ(పీటీసీ) ప్రాంగణంలో చాలా భాగం ఖాళీగా ఉంది. అయితే అక్కడకు రాకపోకలు సాగించడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. గోషామహల్ స్టేడియం స్థలానికి ప్రతిగా ఆరాంఘర్ చౌరస్తాలో ప్రభుత్వం కేటాయించిన 12 ఎకరాల స్థలంలో రాష్ట్రస్థాయి బ్యారెక్స్, ప్లేగ్రౌండ్, డ్రిల్ ఏరియా నిర్మించాలని డీజీపీ కార్యాలయం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందులో నుంచి నాలుగు ఎకరాలను క్రికెట్ స్టేడియం కోసం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం విమానాశ్రయం, ఇన్నర్ రింగ్రోడ్, ఔటర్ రింగ్రోడ్ నుంచి రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది. వినియోగం.. ఆదాయం.. ఈ క్రికెట్ స్టేడియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, శుభకార్యాలకు ఇవ్వరు. క్రికెట్ ఆడటానికి, శిక్షణ ఇవ్వడానికి అనువుగా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్టేడియంలో పోలీసు స్పోర్ట్స్ మీట్స్తోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది వారాంతాలు, ఇతర సమయాల్లో క్రికెట్, ఇతర క్రీడలు ఆడుకోవడానికి ఉచితంగా అందిస్తారు. ఔత్సాహికులైన యువకులు, క్రీడాకారులు ఈ గ్రౌండ్ను అద్దెకు తీసుకోవచ్చు. ఇప్పటికే పెట్రోల్ బంకులు తదితరాల ద్వారా పోలీసు వెల్ఫేర్ ఫండ్కు ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఈ స్టేడియాన్ని క్రీడావసరాలకు అద్దెకు ఇవ్వడం ద్వారానూ ఆదాయం పొందవచ్చని పోలీసు విభాగం యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దీని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
ఆటో దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్
బంజారాహిల్స్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురికాగా, ఈ వైనాన్ని సదరు ఆటోడ్రైవర్ తమ ప్రాంతానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. దీంతో గ్రూప్ సభ్యులు ఈ విషయాన్ని షేర్ చేయడంతో గంటన్నర వ్యవధిలోనే ఆల్వాల్లో దొంగతనానికి గురైన ఈ ఆటో బంజారాహిల్స్లో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం రిసాలబజార్లో నివసించే ఝార్ఖండ్కు చెందిన బిపిన్రాజ్యాదవ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆటోను తన ఇంటి ముందు పార్క్ చేశాడు. సోమవారం ఉదయం బయటికి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీపి పరిశీంచగా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోను చోరీ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని ఝార్ఖండ్కు చెందిన తమవారందరితో కలిసి ఉన్న ‘ఝార్ఖండ్ ఏక్ తా సమాజ్’ వాట్సాప్ గ్రూపులో చోరీకి గురైన ఆటోతో పాటు సీసీ ఫుటేజీని కూడా పోస్ట్ చేశాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దీపక్కుమార్ అనే ఝార్ఖండ్ వాసి మరిన్ని గ్రూపుల్లో దీనిని పోస్ట్ చేశాడు. బొల్లారంలో ఉంటున్న ఝార్ఖండ్కు చెందిన కల్లుకుమార్ అనే ఆటోడ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుని బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లో స్టార్ ఆస్పత్రికి వచ్చాడు. అదే రోడ్డులో బిపిన్ పోగొట్టుకున్న ఆటో పక్కన పార్కింగ్ చేసి కనిపించడంతో పాటు ఓ వ్యక్తి ఆటోకు అంటించిన స్టిక్కర్లను తొలగిస్తూ కనిపించాడు. దీనిని గుర్తించిన కల్లుకుమార్ వీడియో తీసి మళ్లీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. చోరీకి గురైన తన ఆటో ఇదేనంటూ, వెంటనే అక్కడికి వెళ్లాలంటూ వాట్సప్లో రిక్వెస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన బంజారాహిల్స్లో నివసిస్తున్న ఝార్ఖండ్ వాసులు రోడ్డునెంబర్–10లోని ఆటో వద్దకు చేరుకున్నారు. ఆటోపై స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆటోతో పాటు దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఆల్వాల్ పోలీసులకు నిందితుడి అప్పగింత.. నిందితుడిని పట్టుకున్న ఝార్ఖండ్ వాసు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించగా వారు అతడిని ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. విచారణలో దొంగతనం చేసిన యువకుడు జీడిమెట్ల పరిధిలోని రొడామిస్ట్రీకాాలనీకి చెందిన రోహిత్గా గుర్తించారు. సదరు ఆటోను అతను తన స్నేహితుడు రఘురామ్కు ఇవ్వగా రఘురామ్ తన బంధువులకు ఎక్కించుకుని బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి వచ్చి ఝార్ఖండ్వాసులకు చిక్కాడు. ఇలా ఒక వాట్సాప్ గ్రూప్ గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టించగా, పోలీసులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. ఝార్ఖండ్ వాసుల వాట్సాప్ గ్రూప్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. దొంగను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగింత.. బంజారాహిల్స్లో ఘటన.. -
కోకాపేటలో చకచకా
ప్రారంభోత్సవాలు.. ఆవిష్కరణ.. వీక్షణలతో సీఎం రేవంత్రెడ్డి సందడి చేశారు. ముందుగా ఆయన సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కోకాపేటలో టోల్గేట్ను ప్రారంభించారు. 4.55 గంటలకు గండిపేటకు చేరుకుని గోదావరి జలాల తరలింపుపై జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. నగర వ్యాప్తంగా గతంలో నిర్మించిన 12 రిజర్వాయర్లను ప్రారంభించారు. అనంతరం గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం సభా వేదికపైకి వచ్చిన ఆయన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. సభ అనంతరం ముఖ్యమంత్రి 5.30 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. కొత్తగా ప్రారంభించిన కోకాపేట టోల్గేట్ ద్వారా ఔటర్ రోడ్డు మీదుగా వెళ్లారు. – మణికొండ -
నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు
బంజారాహిల్స్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన భవనానికి ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో సినీ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన 8–2–293/82/775/ఏ లో 996 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్ ఉంది. సదరు స్థలంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ కార్యాలయం కొనసాగుతోంది. ఈ భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్ 4 అనుమతులు పొందారు. అయితే అనుమతులకు విరుద్ధంగా ఒక అంతస్తును అక్రమంగా నిర్మించారు. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ పేర్కొన్నారు. ప్లాన్కు విరుద్ధంగా అక్రమ అంతస్తు ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. -
సవ్యమైన జాబితాకు సహకరించండి!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పార్టీల ప్రతినిధుల సమావేశంలో కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓటర్ల తుది జాబితాను సవ్యంగా సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఈ నెల 2వ తేదీన ప్రచురించామన్నారు. ఆ మేరకు నియోజకవర్గంలోని 139 లొకేషన్లలో 407 పోలింగ్స్టేషన్ల పరిధిలో 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ వివరాలతో కూడిన జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ), జీహెచ్ఎంసీ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లను నియమించాలి ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ను నియమించి, జాబితా సవరణ పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు భాగస్వాములు కావాలని పార్టీల ప్రతినిధులను కోరారు. ఓటరుగా నమోదు చేసుకోండి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఉందని, ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, అర్హులైన పౌరులు ఆ తేదీలోగా తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాజకీయ పార్టీలను కర్ణన్ కోరారు. జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాలనుకున్నా అదే తేదీ(సెప్టెంబర్ 17)లోపు దరఖాస్తు ఫారాలు సమర్పించాలన్నారు. ఈ నెల 30న తుది జాబితా ఇప్పటివరకు ఫారం–6, 6ఎ, 7, 8ల ద్వారా వచ్చిన 2,855 దరఖాస్తులు, అభ్యంతరాల్లో 246 (8.62 శాతం) దరఖాస్తులను పరిష్కరించామని కర్ణన్ తెలిపారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయ్వంశీ, అదనపు కమిషనర్(ఎలక్షన్స్) మంగతాయారు హాజరయ్యారు. నందేశ్ కుమార్(బహుజన్ సమాజ్ పార్టీ), పి.వెంకటరమణ, పవన్ కుమార్(భారతీయ జనతా పార్టీ), విజయ్ మల్లంగి (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం.శ్రీనివాసరావు (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా–మార్క్సిస్టు), రాజేశ్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), వై.జయసింహ, కె.మాధవ్ (భారత్ రాష్ట్ర సమితి), కె.జోగేందర్ సింగ్, ప్రశాంత్ యాదవ్ (తెలుగుదేశం పార్టీ), సయ్యద్ ముస్తాక్ (ఎఐఎంఐఎం) తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు హైదరాబాద్ జిల్లాలో జీఐఎస్ ఆధారిత నజరి నక్ష తయారీ కార్యాచరణ ప్రణాళికపై కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. -
రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం
● నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ ● మరికొందరి కోసం కొనసాగుతున్న గాలింపు సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘకాలం తర్వాత నగరంలో మరోసారి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు పట్టుబడ్డాయి. 2016లో డీమానిటైజేషన్ తర్వాత దాదాపు రెండున్నరేళ్ల పాటు ఈ కేసులు నమోదైనా... ఆ తర్వాత తగ్గిపోయాయి. తాజాగా సోమవారం రాత్రి నలుగురిని అదుపులోకి తీసుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.1.92 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో సూత్రధారులతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. డీమానిటైజేషన్ సమయంలో ప్రభుత్వం పాత కరెన్సీ మార్పిడికి అవకాశం ఇచ్చింది. బ్యాంకులతో పాటు కొన్ని పోస్టాఫీసుల్లోనూ ఆధార్ సహా ఇతర ఆధారాలు సమర్పించి నగదు మార్పిడి చేసుకోవడానికి, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే బ్లాక్ కరెన్సీ కలిగిన అనేక మంది అప్పట్లో మార్పిడి, డిపాజిట్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వారికోసం పని చేసిన కొన్ని ముఠాలు కమీషన్ ప్రాతిపదికన వీటిని మార్పిడి చేశాయి. మరికొందరు మార్పిడి పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని ఉడాయించారు. కొందరు సూడో పోలీసులు, ఖాకీలు సైతం ఈ దందాలు నడిపారు. 2016–18 మధ్య ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. అయితే కరోనా ప్రభావంతో అమలులోకి వచ్చిన లాక్డౌన్ తర్వాత ఇలాంటి మోసాలు, వ్యవహారాలు, కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఓ ఉదంతమే సోమవారం బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు కమీషన్ తీసుకుని పాత కరెన్సీని మార్చి, కొత్త రూ.500, రూ.200, రూ.100 నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మిన కొందరు తమ వద్ద ఉన్న నగదును ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి పంపారు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో వలపన్నారు. శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వీరిచ్చిన సమాచారంతో వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా... అందులో రూ.1.92 కోట్ల పాత కరెన్సీ లభించింది. ఇందులో అత్యధికం రూ.1000 నోట్లే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి విచారణ నేపథ్యంలో ఈ కరెన్సీని మార్పిడి కోసం ఇచ్చిన వారు, మారుస్తామంటూ ఒప్పందం చేసుకున్న వారు మరి కొందరు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్లోని ఓ ఇంట్లో మరికొందరు అనుమానితులు ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించింది. దీంతో వారితో పాటు ఇతర నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఈ కరెన్సీ మూలాలు, మొత్తం ఎంత ఉందనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ నలుగురు నిందితులను అధికారులు టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. -
ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఇష్టారాజ్యంసాక్షి, రంగారెడ్డిజిల్లా: ౖఫెర్సేఫ్టీ సహా అనుమతి లేని ఇరుకైన భవనాల్లో ఏర్పాటు చేసిన పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగుల సేవలో తరించాల్సిన కొంత మంది వైద్యాధికారులు ఆస్పత్రుల తనిఖీల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లకు అనుమతుల జారీ సహా పాత ఆస్పత్రులకు లైసెన్సుల పునరుద్ధరణ పేరుతో ఇలా నోటీసులు జారీ చేసి, అలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపించి, ఆస్పత్రి, పడకలు, స్కానింగ్ మిషన్లు, లేబోరేటరీల నిష్పత్తిని బట్టి వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిని మళ్లీ సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అర్హత, అనుభవం లేకపోయినా గుట్టుగా అవయవమార్పిడి, సంతాన సాఫల్యం వంటి ఖరీదైన చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరుపై నిఘా పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది. భారీగా ముడుపులు జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్హోమ్లు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మూడు వేలకుపైగా ఉన్నట్లు అంచనా. వీటిలో 2,500 వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అను మతులు పొందాయి. మరో 400 వరకు ఎలాంటి అనుమతులు లేని క్లినిక్లు ఉన్నట్లు అంచనా. అర్హతలు, అనుమతులు లేకుండా చికిత్స చేస్తున్న ఆస్ప త్రులు, వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద, యునానీ కోర్సులు చేసిన వారు అల్లో పతి వైద్యులుగా.. ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యు లుగా చలామణి అవుతున్నారు. ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన చోట ఇన్పేషంట్లకు చికిత్స లు అందిస్తున్నారు. అబార్షన్లతో పాటు కుటుంబ నియంత్రణ, సున్తీ వంటి చికిత్సలు చేస్తున్నారు. అధిక రక్తస్రావం సహా ఇతర కారణాలతో ఆయా బాధితులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులను, ఆస్పత్రులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు గుర్తించి, కేసులకు సిఫార్సు చేస్తోంది. ఆ బాధ్యతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగిస్తోంది. ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నారు. ఆస్పత్రు ల లైసెన్సులు రద్దు చేయక పోగా, కొద్ది రోజులకే వాటిని తిరిగి తెరిపిస్తున్నారు. ఇందుకు ఒక్కో ఆస్ప త్రి నుంచి భారీగా ముడుపులు ముడుతున్నట్లు తెలిసింది. కందుకూరు, షాద్నగర్ డివిజన్ల పరిధిలో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటేషన్లపై అడ్డదారిలో వచ్చిన ఓ వైద్యురాలు.. గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే డిప్యూటీ డీఎంహెచ్ఓగా కొనసాగుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకరి పేరున.. మరొకరు నిజానికి ఏ వ్యక్తి పేరునైతే ఫార్మసీ, ల్యాబ్లకు లైసెన్స్ పొందుతారో ఆ వ్యక్తి విధిగా అందుబాటులో ఉండాలి. కానీ మెజార్టీ కేంద్రాల్లో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండటం లేదు. కనీస అర్హత లేని వారితో రక్త, మూత్ర వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే అటెండర్లు మందులు ఇచ్చేస్తున్నారు. కీలకమైన స్కానింగ్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. రేడియాలజిస్టుకు బదులు ఎక్సరే టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులతో పరీక్షలు చేయిస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడో మగో ముందే చెబుతూ పరోక్షంగా అబార్షన్లకు కారణమవుతున్నారు. జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, వీటిలో మెజార్టీ సెంటర్లలో కనీస అర్హత ఉన్నవారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మూడు నెలలకోసారి మెడికల్ షాపుల నుంచి అసోసియేషన్ ప్రతినిధులే వసూలు చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ముడుపులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది. -
‘ఇదే రిపీట్ అయితే మళ్లీ పరీక్షకు ఆదేశిస్తాం..’ గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను రద్దు చేస్తూ.. మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్కు ఆదేశించింది. ఒకవేళ రీవాల్యూయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయ్యింది. గ్రూప్-1 వాల్యూయేషన్లో(మూల్యాంకనం) అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని ఒక్కటిగా విచారించిన హైకోర్టు.. జులై 7న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో.. ‘‘సంజయ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇచ్చిన తీర్పులోని మాన్యువల్ ప్రకారం రీవాల్యూయేషన్ జరగాలి. అవకతవకలకు తావు లేకుండా వాల్యుయేషన్ చేయాలి. ఆ తర్వాతే 563 మందిని ఎంపిక చేసి పోస్టింగులు ఇవ్వాలి. మరోసారి అవకతకవలు జరిగితే మళ్లీ పరీక్షలకు ఆదేశిస్తాం’’ అని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు వెల్లడించారుఇప్పటికే గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోపు.. రీవాల్యూయేషన్కు ఆదేశిస్తూ రిక్రూట్మెంట్ బోర్డు(TGPSC)ను హైకోర్టు ఆదేశించింది. రీవాల్యూయేషన్ జరిపించిన తర్వాతే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.తీర్పుపై సవాల్గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్కు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇవాళ ఇచ్చిన తీర్పును సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నిరాశలో ఉన్న అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు.కిందటి ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు టీజీపీఎస్సీ తరఫున నోటిఫికేషన్ వెలువడింది. మే/జూన్లో ప్రిలిమ్స్, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో మెయిన్స్ ఫలితాలు, ఏప్రిల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ పోస్టింగులకు బ్రేకులు వేసింది. -
అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రూ.1,100 కోట్లతో అంచనాలను రూపొందించగా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం దాన్ని రూ.7,390 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుందని.. దీంతో రూటు మార్చిన రేవంత్రెడ్డి విడతల వారీగా జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాల తరలింపు పనులు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ పోరాటం చేస్తాం.. ‘సము‘ద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా రావల్కోల్ చెరువుకు, అక్కడి నుంచి 540 మీటర్ల ఎత్తున ఉన్న గండిపేటకు తరలించడం ద్వారా మూసీతో అనుసంధానం చేసే వీలుంది. అయినా 560 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా ప్రతిపాదనలు మార్చి నీటి శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్లు ఎవరి లాభం కోసం కడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు దండుకునేందుకే సీఎం ఈ పనులు చేపడుతున్నారా? హైదరాబాద్కు గోదా వరి జలాల తరలింపులో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. కుర్చీ కాపాడుకునేందుకే.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును విఫల పథకంగా ప్రచారం చేసిన రేవంత్, కాంగ్రెస్ నేతలు ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్రెడ్డి.. అదే ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే కాళేశ్వరంపై చెప్పిన అబద్ధాలను కప్పి పుచ్చుకునేందుకు మల్లన్నసాగర్కు బదులుగా గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టు చేసిన కాంట్రాక్టు కంపెనీకి. రేవంత్ తాను నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో అంతర్భాగమైన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు నుంచి రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కురీ్చని కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారు..’అని మాజీమంత్రి ఆరోపించారు. యూరియా కొరతపై స్పందించని బీజేపీ, కాంగ్రెస్ ‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరూ మంచి అభ్యర్థులే. అయితే మేము రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న యూరియా కొరతపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా స్పందించక పోవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం కానీ, ఆ అవకాశం లేనందున ఓటింగ్కు దూరంగా ఉంటున్నాం. కవిత విషయంలో అవసరమైన నిర్ణయం తీసుకున్నాం.. ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ వేదికపై, అంతర్గతంగా చర్చించి అవసరమైన నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఓ టీవీ చర్చలో అంగీకరించి అప్రూవర్గా మారాడు. నేరాంగీకారం తర్వాత ఇంకా విచారణ ఎందుకు? వేటు వేయాల్సిందే. మహారాష్ట్ర పోలీసులు ఫ్యాక్టరీ కార్మీకులుగా అవతారం ఎత్తి తెలంగాణలో రూ.12 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయి? డ్రగ్స్ వ్యవహారంలో సీఎం రేవంత్కు ముడుపులు ముట్టినందునే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారా?..’అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశంలో పాల్గొన్నారు. -
22 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. 22 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీలో పదాధికారులుగా 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సంయుక్త కోశాధికారి, ఒక ప్రధాన అధికార ప్రతినిధిని నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ⇒ ప్రధాన కార్యదర్శులుగా డా.ఎన్.గౌతమ్రావు, టి.వీరేందర్గౌడ్, వేముల అశోక్ ⇒ ఉపాధ్యక్షులుగా డా.బూర నర్సయ్యగౌడ్, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ,, కొల్లి మాధవి, మాజీమేయర్ బండా కార్తీకరెడ్డి, డా.జె.గోపి(కల్యాణ్నాయక్), రఘునాథరావు ⇒ కార్యదర్శులుగా డా.ఓ.శ్రీనివాస్రెడ్డి, కొప్పుబాషా, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి స్రవంతిరెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్రెడ్డి, డా.టి.రవికుమార్, కోశాధికారిగా దేవకి వాసుదేవ్ ⇒ సంయుక్త కోశాధికారిగా విజయ్ సురానా జైన్, ప్రధాన అధికార ప్రతినిధిగా ఎనీ్వ.సుభాష్ నియమితులయ్యారు. వివిధ మోర్చాలకు వీరే... మహిళామోర్చా అధ్యక్షురాలిగా డా.మేకల శిల్పారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గంథమళ్ల ఆనంద్గౌడ్ను మళ్లీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ⇒ యువమోర్చా అధ్యక్షుడిగా గణేశ్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బి.లక్ష్మీనరసయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నేనావత్ రవినాయక్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగన్మోహన్సింగ్లను నియమించారు. రాంచందర్రావు టీమ్లో ఐదుగురే పాతవారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్రావు తన టీమ్ను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా అన్ని సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేశారు. కొత్త కార్యవర్గంలో కేవలం ఐదుగురు పాతవారికే అవకాశం దక్కింది. వారిలో డా.కాసం వెంకటేశ్వర్లుయాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ,, కొల్లి మాధవి, టి.వీరేందర్గౌడ్ ఉన్నారు. అయితే అందరూ ఊహించిన విధంగా కాకుండా కొత్త వారికి ఆఫీస్ బేరర్ల లిస్ట్లో చోటు దొరికింది. గత రెండుమూడు కమిటీల్లో కొనసాగుతూ వచ్చిన చాలామందికి ఈసారి అవకాశం లభించలేదు. అయితే మొత్తానికి మొత్తం ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తవారినే నియమించడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రులదే ముద్ర ? రాష్ట్ర పదాధికారుల ఎంపికలో కేంద్ర మంత్రులు జి,కిషన్రెడ్డి, బండిసంజయ్ కీలకపాత్ర పోషించారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. తమ అనుయాయులకు పెద్దపీట వేసేలా వారు పైచేయి సాధించారనే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. అయితే రాష్ట్ర కమిటీ కూర్పు విషయంలో ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల సిఫార్సులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బలపడేందుకు తమ అనుచరులకు రాష్ట్ర కమిటీతోపాటు జిల్లా కార్యవర్గాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలనే విజ్ఞప్తులను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోలేదనే వారు వాపోతున్నారు. -
రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమవుతోంది. వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాల కేసును మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మత్తు పదార్థాల కట్టడిలో దేశవ్యాప్తంగా కీలక ఏజెన్సీ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించింది.చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలోనూ ఎన్సీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఎండీ డ్రగ్స్ పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జాతీయ, అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్లు ఇందులో ఉన్నట్టుగా దర్యాప్తు ఏజెన్సీలు భావిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్సీబీ అధికారుల దర్యాప్తు సైతం కీలకంగా మారనుంది.కీలక నిందితుడు శ్రీనివాస్ విజయ్ పదేళ్లుగా ఎండీ డ్రగ్ తయారు చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. విదేశీ ఏజెంట్లు సైతం శ్రీనివాస్ విజయ్తో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగే అవకాశముంది. ఇందులో కొంత హవాలా రూపంలో కూడా నగదు మార్పిడి జరిగే అవకాశం ఉన్నందున మనీలాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. నిందితులను కస్టడీకి తీసుకుంటేనే.... డ్రగ్స్ తయారీ, చేరవేతలో శ్రీనివాస్విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పటా్వరీ ఎంతో పక్కాగా వ్యవహరించేవారిని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కోసం ముంబై నుంచి తరచూ ఫజల్, ముస్తాఫా చర్లపల్లికి వచ్చేవారని తెలిసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను మహారాష్ట్ర పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన 13 మంది నిందితులు జ్యుడీíÙయల్ రిమాండ్లో ఉన్నారు. ఈనెల 15 వరకు జ్యుడీíÙయల్ రిమాండ్ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకోనున్నారు. వారిని విచారిస్తే మరికొన్ని కొత్తకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బాక్స్ ఐటమ్ ముంబైలో తెలంగాణ ‘ఈగల్’ఆపరేషన్ ? ముంబైలో తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) పోలీసులు ఇటీవల సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల పట్టుబడిన నైజీరియన్ డ్రగ్స్ సప్లయర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచి్చన డబ్బును ముంబై మీదుగా నైజీరియా సహా విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే డబ్బు తరలిస్తున్న 24 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇందులో పూణే సహా నైజీరియన్లు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు సమాచారం. అయితే ముంబైలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ను ఈగల్ అధికారులు ధ్రువీకరించలేదు. -
అంతటా అపరిశుభ్రత, దుర్గంధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కస్తూర్బా బాలికల విద్యాలయాలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కేజీబీవీ ప్రాంగణాలు బురదమయం కావడంతో పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. వర్షాలకు గదుల గోడల్లోకి చెమ్మ చేరింది. కప్పుకునే దుప్పట్లే కాదు... వేసుకునే దుస్తులు కూడా తడిసిపోయి వాసన వస్తున్నాయి. అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాపిస్తుండటం వల్ల విద్యారి్థనులు దోమకాట్లతో అస్వస్థతకు గురవుతున్నారు. అధికారులు జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు పరిస్థితి మెరుగవ్వడం కష్టంగా కనిపిస్తోంది. పరిశుభ్రత లోపించి అనారోగ్యం.. రాష్ట్రంలో 495 కేజీబీవీ పాఠశాలలు ఉండగా 403 కేజీబీవీలను ఇంటర్ వరకూ ఉన్నతీకరించారు. కేజీబీవీల్లో 1,24,153 మంది విద్యార్థులు చదువుతున్నారు. టెన్త్ వరకూ దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉన్నారు. సమగ్ర శిక్ష పర్యవేక్షణలో సాగే కేజీబీవీల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కరీంనగర్ ప్రాంతంలోని ఓ కేజీబీవీలో విద్యార్థులు దగ్గు, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. సమీపంలోనే డంపింగ్ యార్డ్ ఉండటం, ఇటీవల వర్షాలకు ఇది దుర్గంధం వెదజల్లడం కారణమని గుర్తించారు.కొన్ని నెలలుగా మహబూబ్బాద్ జిల్లాల్లో 36 మంది, నిజామాబాద్ జిల్లాల్లో 90 మంది, వనపర్తిలో 50 మంది విషాహారంతో అస్వస్థతకు గురైన ఘటనలు నమోదయ్యాయి. పరిసరాల పరిశుభ్రత లోపించడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తించారు. ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతంలోని కేజీబీవీల్లో వర్షపు నీరు చేరి ప్రాంగణమంతా బురదగా మారింది. భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు పెరిగాయి. వ్యాధుల బారిన పడుతున్నారు. అర్వపల్లిలో అరణ్య రోదన... సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కేజీబీవీ చినుకుపడితే జలమయమవుతోంది. ఇక్కడ 300 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం సమీపంలో చేపట్టిన కాల్వ నిర్మాణం వల్ల నీరు కేజీబీవీ వద్దే నిలిచిపోతోంది. కాస్త పెద్ద వర్షం పడితే విద్యాలయానికి సెలవు ప్రకటించాల్సిందే. వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్న మొర వినిపించుకొనే నాథుడే లేడని స్థానికులు అంటున్నారు. మంగపేట మూగ వేదన.. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని కేజీబీవీలో 170 మంది చదువుతున్నారు. ఇక్కడ కొత్త భవనమే ఉన్నా ప్రహరీ లేదు. పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి. భోజన వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. పందుల వల్ల దోమలు పెరుగుతున్నాయి. మురుగునీరు బయటకు వెళ్లలేక దుర్వాసన వస్తోంది. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని కేజీబీవీ ఆవరణలో పిచి్చమొక్కలు పెరిగాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగాయి. గండీడ్లో ఘోష మహబూబ్నగర్ జిల్లా గండీడ్లో కొత్తగా ఏర్పాటైన కేజీబీవీ అద్దె భవనంలో నడుస్తోంది. 188 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఇటీవల వర్షాలకు నీరు నిలిచి ప్రాంగణమంతా బురదమయమైంది. దీంతో దోమలు వ్యాపించి సుమారు 40 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడి ఇళ్లకు వెళ్లిపోయారు. అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. రాజన్నా... సమస్యలేంటన్నా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కేజీబీవీలన్నీ పట్టణాలకు దూరంగా ఉన్నాయి. దీంతో రక్షణ కరువైందని విద్యారి్థనులు అంటున్నారు. ఇల్లంతకుంట మండలంలోని కేజీబీవీకి వెళ్లే రోడ్డు సరిగ్గా లేక రాకపోకలకు వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం కురిస్తే ట్రాక్టర్పై వెళ్లాల్సి వస్తోంది. అనారోగ్య సమస్యలు వస్తే తక్షణ వైద్య సదుపాయానికి నరకయాతన పడాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
‘గ్రూప్–1’ తీర్పు నేడు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. రెండు నెలలుగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న విషయం విదితమే. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. లక్షలాది మంది భవిష్యత్కు సంబంధించిన అంశం కావడంతో మూడు నెలలపాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు నమోదు చేసుకుంది. అందరి వాదనలు ముగిసిన తర్వాత జూలై 7న తీర్పు రిజర్వు చేసింది. నేడు తీర్పు వెల్లడించేందుకు పిటిషన్లను లిస్ట్ చేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారు. -
15 నుంచి ఎంబీబీఎస్,బీడీఎస్ స్టేట్ కోటా కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి గత కొన్నినెలలుగా కొనసాగిన అనిశ్చితికి తెర పడింది. ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు రెండోవారం నుంచే ప్రారంభం కాగా, తెలంగాణ స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు కారణంగా రాష్ట్రంలో స్టేట్ కోటా కౌన్సెలింగ్ మొదలు కాలేదు. అయితే స్థానిక అభ్యర్థుల నిర్వచనంపై సుప్రీంకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచి్చన 33 జీవోకు సవరణలతో జీవో(నంబరు:15)ను సోమవారం విడుదల చేసింది.ఈ ప్రభుత్వ ఉత్తర్వులతో స్టేట్ కోటా అడ్మిషన్లకు అడ్డంకులు తొలగి, కౌన్సెలింగ్కు మార్గం సుగమమైంది. ఈ మేరకు వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 9 నుంచి 12వ తరగతి వరకు వరుసగా తెలంగాణలో చదవలేకపోయిన నాలుగు కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సంబంధించి మంగళవారం నుంచి రిజి్రస్టేషన్లు ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎంబీబీఎస్ స్థానిక కోటా అడ్మిషన్లకు అర్హులైన వారు ఈ నెల 11వ తేదీ వరకు యూనివర్సిటీకి వచ్చి రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. అనంతరం ర్యాంకర్ల జాబితాను విడుదల చేసి, ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన అనంతరం ప్రభుత్వం రాష్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతోపాటు ప్రైవేటు కళాశాలల్లోని కనీ్వనర్ కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేసే విధంగా గత సంవత్సరం జీవో 33ను తీసుకొచి్చంది. ఈ జీవో ప్రకారం 9,10 తరగతులతో పాటు ఇంటర్ (11,12) వరుసగా నాలుగేళ్లు ఇక్కడ చదివితేనే స్థానికులుగా పరిగణించబడతారు.వారికే స్టేట్ కోటా కింద ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లోని కనీ్వనర్ కోటాలోని 50 శాతం సీట్లు కేటాయిస్తారు. అయితే ఈ జీవోపై 2024లో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారికి స్థానిక కోటా కింద సీట్లు కేటాయించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచి్చంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 1న తీర్పు చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. అదే సమయంలో తెలంగాణ స్థానికత గల నాలుగు కేటగిరీల్లోని ప్రభుత్వ ఉద్యోగుల సంతానానికి సంబంధించి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. కొత్త జీవో ప్రకారం... ⇒ 4 కేటగిరీల్లోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కనీసం నాలుగు సంవత్సరాలు తెలంగాణలోని విద్యా సంస్థల్లో చదివి ఉండాలి. ఒకవేళ చదవకపోయినా నాలుగు సంవత్సరాలు తెలంగాణలో నివసించి, రాష్ట్రంలోనే క్వాలిఫైయింగ్ పరీక్ష రాసి ఉండాలి. ⇒ కొత్త సవరణలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి. స్థానిక అభ్యర్థి అర్హత నిరూపణకు తల్లిదండ్రుల ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచడం తప్పనిసరి. వీరి పిల్లలకే ఈ అవకాశం ⇒ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు : ఇతర రాష్ట్రాలలో విధులు నిర్వర్తించిన కాలంలో. ⇒ ఆల్ ఇండియా సర్వీసెస్ (ఐఏఎస్/ ఐపీఎస్/ ఐఎఫ్ఎస్ మొదలైన) తెలంగాణ కేడర్ అధికారుల పిల్లలు. ⇒ తెలంగాణను స్వస్థలంగా ప్రకటించిన రక్షణ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది పిల్లలు. ⇒ తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు -
42% రిజర్వేషన్లు ఇచ్చాకే ‘స్థానికం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్కు పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో రిజర్వేషన్ల కల్పనే ప్రధానమని పార్టీ యోచిస్తోందని చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో మీనాక్షి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమన్వయంతో పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు 90 శాతం మంది ప్రజలకు అందుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై వచ్చే నెల నుంచి పార్టీ దృష్టి సారిస్తుందని.. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారంలో డీసీసీ కమిటీలు పూర్తవుతాయని.. గ్రామ శాఖ అధ్యక్షుల ఎంపికను 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీల సమరభేరి సభను విజయవంతం చేయాలని మీనాక్షి పిలుపునిచ్చారు. చేరికలను ఆహ్వానించాలి: భట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ను అజేయంగా నిలపడం కోసం పీసీసీ చీఫ్ చేసే ప్రతి పనికీ సీఎం రేవంత్తోపాటు మంత్రివర్గమతా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సమాచారం తమ వద్ద ఉందని.. అందరికీ ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతుందని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై గ్రామ, మండల స్థాయి నుంచి వస్తున్న వివిధ పార్టీల నేతలను ఉద్యమంలాగా పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. మళ్లీ మనమే గెలుస్తాం: టీపీసీసీ చీఫ్ ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నేతలు, కార్యకర్తలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సూచించారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖతమై రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్చార్జీలు, జై బాపు–జై భీం కార్యక్రమాల కమిటీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బూత్స్థాయి వరకు నెట్వర్క్: మంత్రి పొన్నం టీపీసీసీ సమావేశం అనంతరం విప్ ఆది శ్రీనివాస్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులతో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించామని చెప్పారు. పీసీసీ చీఫ్గా మహేశ్గౌడ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పార్టీ నాయకత్వం అభినందనలు తెలిపిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, 15న కామారెడ్డిలో బహిరంగ సభ, జనహిత పాదయాత్ర, ఓట్ చోరీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీపక్షాన హైదరాబాద్ నుంచి పోలింగ్ బూత్స్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పొన్నం వెల్లడించారు. వివిధ కారణాలతో పార్టీ వీడిన నేతలను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని భట్టి చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరతను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ, నిరసన రూపంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించిన మీదటే మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ‘యూరియా సమస్యను పరిష్కరించాలని మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు కోరాం. కానీ, రెండు ప్రభుత్వా లూ రైతుల గోడును పట్టించుకోకుండా పూర్తిగా విఫలమయ్యాయి. ప్రభుత్వాల ఈ రైతు వ్యతిరేక వైఖరికి నిరసన తెలిపేందుకే ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించాం’అని సురేశ్రెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్పై నోటాకు అవకాశం లేనందున, తమ నిరసనను తెలిపేందుకు ఎన్నికకు దూరంగా ఉండటమే సరైన మార్గమని భావించామన్నారు. అభ్యర్థులను గౌరవిస్తాం...కానీ రైతుల సమస్యే ముఖ్యం ‘పోటీలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డిలను మేము గౌరవిస్తాం. సుదర్శన్రెడ్డి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయినా, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్న ప్రస్తుత తరుణంలో మా నిరసనను బలంగా వినిపించడమే మా కర్తవ్యం’అని సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తోందని, ఇలాంటి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్/సాక్షినెట్వర్క్: రైతు వేదికల వద్ద కూడా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ఈపాస్ మెన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేసి 500 రైతు వేదికల వద్ద సోమవారం యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి పర్యవేక్షిస్తున్నారు. ఇంకా తప్పని కష్టాలుమహబూబాబాద్ జిల్లా కురవి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులుతీరారు. దంతాలపల్లి మండలంలో గంటల తరబడి రైతులు క్యూలో నిల్చున్నారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డకు చెందిన రైతులు మండల కేంద్రానికి ఆదివారం రాత్రి 1 గంటకు వచ్చి బారులుతీరారు. ఖానాపురంలో ఆయా గ్రామాలకు ఇవ్వడం లేదని, కొత్తూరు, మనుబోతులగడ్డ సొసైటీ గోదాంకు వస్తుందని తెలియడంతో అక్కడకు వెళ్లి లైన్లో నిల్చున్నారు. ఈ క్రమంలో క్యూలో నిల్చున్న రైతు లావుడ్య యాకూబ్ ఫిట్స్తో కిందపడిపోయాడు. » హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. » ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోజురోజు యూరియా కష్టాలు ఎక్కువవుతున్నాయి. దేవరకద్రలో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. హన్వాడలో తెల్లవారుజాము 3 గంటల నుంచి క్యూలైన్లో ఉంటే యూరియా లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఒక్కసారిగా పోలీసులను తోసుకుంటూ బారికేడ్లను ధ్వంసం చేశారు. అనంతరం చించోళీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మహమ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డి పల్లి గేట్ వద్ద జాతీయ రహదారిపై ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. » వనపర్తి జిల్లాలో ఖిల్లాఘనపురంలో రైతులు వనపర్తి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. » నారాయణపేట జిల్లాలోని ధన్వాడ పీఏసీఎస్కు రైతులు తెల్లవారుజామునే చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. పీఏసీఎస్ గేటు తెరిచే సమయంలో రైతులందరూ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకురావడంతో పోలీసులు కిందపడ్డారు. -
సత్వరమే తుమ్మిడిహెట్టికి డీపీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సత్వరమే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం, వార్ధా ప్రాజెక్టులుగా విభజించగా, వార్ధా ప్రాజెక్టును పక్కనపెట్టి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించాలనే అంశంపై త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖపై సోమవారం ఆయన జలసౌధలో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. డిసెంబర్లోగా ఫలితాలు కనిపించాలి నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగిరం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. డిసెంబర్తో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకునే నాటికి గుర్తించదగని ఫలితాలను ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు. » సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులతోపాటు టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) క్లియరెన్స్కు ఈ నెల 23న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించను న్న సమావేశానికి సర్వం సిద్ధం కావాలని సూచించారు. సమ్మక్కసాగర్తో ఛత్తీస్గఢ్లో ఏర్పడనున్న ముంపుపై ఇ ప్పటికే అధ్యయన నివేదిక అందిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సత్వరమే ఎన్ఓసీ సాధించాలని సూచించారు. » సీతమ్మసాగర్, మోడికుంటవాగు ప్రాజెక్టులతోపాటు చనాకా–కొరాటా, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ వ్య వస్థలకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద కేంద్ర నిధులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ల ను వారం రోజుల్లోగా సీడబ్ల్యూసీ నుంచి పొందాలని ఆదేశించారు. » ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పున:పంపిణీ అంశంపై కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఈ నెల 23–25 తేదీల్లో రాష్ట్రం తరఫున వినిపించనున్న తుది వాదనలకు తాను స్వయంగా హాజరవుతానని, సమయం లభిస్తే సీఎం రేవంత్ సైతం హాజరవుతారని తెలిపారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్తో మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు. డిజైన్ల తయారీ బాధ్యత సీడీఓదే... నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమి టీ సిఫారసులను కచ్చితంగా అనుసరిస్తూ మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్లను రూపొందించే బాధ్యత శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీ ఓ)దేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. విఫలమైన బరాజ్లలోని లోపాలను సరిదిద్ది పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లు రూపొందించే నైపుణ్యం తమకు లేదని సీడీఓ చీ ఫ్ ఇంజనీర్ నిస్సహాయత వ్యక్తం చేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజైన్ల తయారీకి ఐఐటీ రూర్కీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను నియమించుకోవాలని ఆదేశించారు. కొడంగల్ తొలి ప్రాధాన్యం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని భూసేకరణను పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీ మా, కోయిల్సాగర్ను అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులుగా పరిగణించి సత్వరం పూర్తి చేయాలన్నారు. వీటితో పాటు డిండి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టుల మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలన్నారు. జూ రాల ప్రాజెక్టుపై ప్రత్యామ్నా య బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.10న ఛత్తీస్గఢ్కు మంత్రి ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ నెల 10న ఛత్తీస్గఢ్ రాజధాని న్యూ రాయ్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం విష్ణుదేవ్ సాయితో సమావేశం అవుతారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో ఈ నెల 23న కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆలోగా ప్రాజెక్టుకి ఎన్వోసీ జారీ చే యాలని ఛత్తీస్గఢ్ సీఎంకు ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు. పూడిక తొలగింపుతో ఏటా రూ.500 కోట్లుమిడ్మానేరు, కడెం ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపునకు చర్యలు ప్రారంభించడం ద్వారా పూడిక తొలగింపుపై జాతీయ పాలసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. జూరాల, సాగర్, శ్రీరాంసాగర్, హుస్సేన్సాగర్, ఇతర ప్రాజెక్టుల్లో సైతం పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పూడిక తొలగింపుతో ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల అదనపు ఆదాయం రానుందని, అన్ని జలాశయాల్లో చేపడితే రూ.3,000–4,000 కోట్లకు ఆదాయం పెరుగుతుందన్నారు. » ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాల పునరుద్ధరణలో భాగంగా హెలికాప్టర్లతో నిర్వహించతలపెట్టిన ఏరియల్ మా గ్నటిక్ సర్వేకు డీజీసీఏ నుంచి సత్వరంగా అనుమతులు తీసుకొని సర్వేను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. » మూడు దశాబ్దాల తర్వాత శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు జలసౌధలో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు ఏర్పాట్లు చేయాలన్నారు. -
ఆ రెండు శాఖల్లోనే ఆదాయం పెరిగిందా!
సాక్షి, హైదరాబాద్: ‘వాణిజ్య పన్నుల్లో 4.7 శాతం, గనుల శాఖలో 18.6 శాతం మేరకు ఆదాయం పెరుగుదల కనిపిస్తోంది. మరి ఇతర ఆదాయార్జన శాఖల మాటేమిటి? ఎందుకు ఆయా శాఖలు ఆదాయ సమీకరణలో వెనుకబడ్డాయి?’అని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ప్రశ్నించింది. మిగిలిన శాఖల్లో కూడా ఆదాయం పెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది.సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రాజెక్టుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు.పైలట్ ప్రాజెక్టు కింద ఓ ప్రాజెక్టులో పూడికతీతను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను గిరిజన ఏజెన్సీల ద్వారానే నిర్వహించాలని, వారికి యంత్ర సామగ్రి అందుబాటులో ఉండదు కనుక, ఐటీడీఏల్లోని ఇంజనీరింగ్ విభాగం ద్వారా సమకూర్చాలని సూచించారు. ఔటర్ రింగురోడ్డు లోపలి భాగంలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సందీప్కుమార్ సుల్తానియా, వికాస్రాజ్, లోకేశ్ కుమార్, శ్రీధర్, శశాంక, రాజీవ్గాంధీ హనుమంతు, సురేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్డీపీ రూ.14.56 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏటేటా గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రూ.10 లక్షల కోట్లకు పైగా స్థూల ఉత్పత్తి నమోదు కాగా, తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14.56 లక్షల కోట్లకు చేరింది. అంటే గత నాలుగేళ్లలోనే దాదాపు 50% పెరిగిందన్నమాట. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల వెలువరించిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్ ఆన్ ఇండియన్ ఎకానమీ లో ఈ గణాంకాలను పొందుపరిచింది. ఈ కరదీపిక ప్రకారం 2023–24లో తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ.13,22, 808 కోట్లు కాగా, ఏడాది కాలంలో 1.3 లక్షల కోట్లు పెరిగి రూ.14,56,837 కోట్లుగా నమోదైంది. తలసరి ఉత్పత్తి రూ.3 లక్షల పైమాటే: ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ తలసరి స్థూల ఉత్పత్తి రూ.3.79 లక్షలకు చేరింది. 2024–25లో రూ.3,79,751గా తలసరి స్థూల ఉత్పత్తి నమోదైందని, ఇది 2023–24తో పోలిస్తే రూ.33 వేలు పెరిగిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన ఏడాది 2014–15లో తలసరి స్థూల ఉత్పత్తి రూ.1,24,104 కాగా, ఇప్పుడు మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. పదేళ్ల కాలంలో 2.55 లక్షలు పెరిగింది. ఇక, రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణాంకాలు కూడా ఇదే నిష్పత్తిలో పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటైన ఏడాది తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ.4,56,280 కోట్లు కాగా, పదేళ్ల తర్వాత ఏకంగా రూ.10 లక్షల కోట్లు పెరిగింది. » ఆర్బీఐ వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు స్థూల ఉత్పత్తి నమోదులో పురోగతిని కనబరుస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ (రూ.14,22,998 కోట్లు), కర్ణాటక (రూ. 26,03,948 కోట్లు), తమిళనాడు (రూ. 27,64,755 కోట్లు)లు కూడా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలిచాయి. » తెలంగాణ విషయానికి వస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు సేవల రంగం విస్తృతి కారణంగా భారీ స్థాయిలో జీఎస్డీపీ నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
రాజకీయ యుద్ధాలకు కోర్టును వాడుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాజకీయ యుద్ధాలకు ఈ కోర్టును ఉపయోగించుకోవద్దని పదేపదే చెబుతున్నాం’అంటూ సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోదలచుకోలేదని తేల్చిచెప్పారు.రాజ కీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తట్టుకొనే శక్తి ఉండాలని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. అయినా రంజిత్ కుమార్ వాదనలు కొనసాగించేందుకు ప్రయతి్నంచడంతో సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మేం ఇప్పటికే పిటిషన్ను కొట్టేశాం. ఇంకా వాదనలు దేనికి? మళ్లీ ఇలాంటి పిటిషన్తో కోర్టుకు వస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తాం’అంటూ హెచ్చరించారు. ఇదీ నేపథ్యం.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ పార్టీకి రాజకీయంగా పరువునష్టం కలిగించాయంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ట్రయల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించి ఐపీసీ సెక్షన్ 499, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద విచారణకు ఆదేశించింది.ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ‘రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండి ఉంటాయి. వాటిని పరువునష్టంగా పరిగణించడం సరికాదు’అని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ రేవంత్కు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిõÙక్ మను సింఘ్వీ, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. -
జస్టిస్ సుదర్శన్రెడ్డి గెలుపే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యరి్థ, తెలుగుబిడ్డ జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రేవంత్రెడ్డి క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా, ఇది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి, దీనిని ఇండియా కూటమికి అనుకూలంగా ఎలా మలచుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. మిగతా పారీ్టల ఎంపీలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని కోరుతూ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అనే అంశాలపై సీఎం ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్రెడ్డికి ఓటు వేయడం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలకు కూడా నొక్కిచెప్పాలని సూచించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేలా ఎంపీలందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం జరిగే పోలింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు.రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మంగళవారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీలును బట్టి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ను అడిగినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశముందని సమాచారం. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీల సమర భేరి సభకు ఏఐసీసీ పెద్దలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. -
చుక్క నీరు తేలేదు! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్కు తరలించలేదు. గత పాలకులు నగర ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు..’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. సోమవారం గోదావరి రెండు, మూడో దశ తాగునీటి సరఫరా, మూసీ నది పునరుజ్జీవం పథకాలకు గండిపేట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నిజాం దూరదృష్టి వల్లే నగరానికి తాగునీళ్లు ‘శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్కు తరలిస్తున్నాం. కానీ ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్ చొరవతోనే కృష్టా, గోదావరి జలాలు హైదరాబాద్కు వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరోసారి గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతోందంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టే కారణం. నగరానికి ప్రతి ఏటా 3 శాతం చొప్పున వలసలు పెరుగుతున్నాయి. జనాభా కోటిన్నర దాటడంతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం..’ అని సీఎం పేర్కొన్నారు. ‘తుమ్మిడిహెట్టి’పై మహారాష్ట్రను ఒప్పిస్తాం ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. దివంగత వైఎస్సార్ తుమ్మిడిహెట్టి వద్దే దీనిని ప్రారంభించారు. అయితే గత బీఆర్ఎస్ పాలకులు కాసుల కక్కుర్తితో తలను తొలగించి చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకుండా చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించి ఒప్పిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరతాం.. ‘మూసీ మురికికూపంగా మారి విషం చిమ్ముతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయి. పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఎలాగైనా సరే మూసీని పునరుజ్జీవింపజేయాలని స్థానికులు కోరారు. వారికిచ్చిన మాట ప్రకారం మూసీ ప్రక్షాళన చేసి తీరతాం. గోదావరి జలాల తరలింపు ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించడం ద్వారా ఆ సమస్య నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం. ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రిస్తాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల ‘వందేళ్లకు సరిపడా ప్రణాళికతో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసి తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. రాబోయే పదేళ్లలో హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిరావాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం కోకాపేట వద్ద నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ను సోమవారం సీఎం ప్రారంభించారు. అదేవిధంగా గండిపేట వద్ద హెదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 రిజర్వాయర్లను కూడా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
రండి.. హైదరాబాద్ను అభివృద్ధి చేద్దాం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామన్నారు సీఎం రేవంత్. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు సీఎం రేవంత్. ఇది ఇందిరమ్మ రాజ్యమని, ఈ రాజ్యంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. గోదావరి ఫేజ్ 2&3 శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లడారు. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చని, కానీ తాము మూసీని ప్రక్షాళన చయొద్దా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదని నిలదీశారు. ‘1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించబోతున్నాం. ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా?, చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా?, తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు వెల్లడించారు. 22 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడిగా గణేష్, బిసి మోర్చా అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మీ నర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా రవి నాయక్లను నియమించారు. అదే సమయంలో ఎనిమిది మంది వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఏడుగురు సెక్రటరీలు.ట్రెజరరి, జాయింట్ ట్రెజరరీ, చీఫ్ స్పొక్స్ పర్సన్స్ను నియమించారు. ప్రధాన కార్యదర్శలుగా వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు, వేముల అశోక్లను నియమించారు. ఇక కార్యదర్శలుగా ఓ శ్రీనివాస్రెడ్డి, కొప్పు భాషా, బండారు విజయలక్ష్మి, స్రవంత్రెడ్డి, పరిణిత, బద్ధం మహిపాల్ను, ఉపాధ్యక్షులుగా బూరి నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి, జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రఘునాథరావు, బండ కార్తీకరెడ్డిలను ఎంపిక చేశారు. కోశాధికారిగా వాసుదేవ్ను నియమించారు. -
కవిత ఎపిసోడ్పై కుండబద్ధలు కొట్టిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సోదరి, పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి పెదవి విప్పారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్రావు, సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు.తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కవిత ఆరోపణలపై ప్రశ్న ఎదురైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించిన తర్వాతనే అధినేత నిర్ణయం తీసుకున్నారని, ఇంక ఆమెపై స్పందించడానికి ఏం లేదు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన. తాజాగా కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తనను అక్రమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తానెప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. తనపైపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనిది తెలంగాణ భవన్లో మహిళా నేతలు స్పందించడమే తనకు కొంత ఊరట కలిగించిందని వ్యంగ్యంగా మాట్లాడారామె. -
అదే ‘కూలేశ్వరం’ నీళ్లను హైదరాబాద్కు తెస్తున్నారు.. రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కక్షగట్టారని, కమిషన్ పేరుతో టైంపాస్ చేశారని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అలాంటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టారు. కాంగ్రెస్ కాళేశ్వరంపై ఎన్నికల ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. కానీ, ఆయన విమర్శించే సీబీఐకే రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారు. ఇవాళేమో మూసీ పునరుజ్జీవం(జలాల అనుసంధానం) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తోంది. మల్లన్న సాగర్ వద్ద కాకుండా తలాతోకా లేకుండా గండిపేట వద్ద శంకు స్థాపన చేస్తున్నారు. కాళేశ్వరం కూళేశ్వరం అయ్యింది అని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అదే ప్రాజెక్టు నీళ్లను హైదరాబాద్కు తెస్తున్నారు. అదే కాళేశ్వరం ద్వారా గంధమల్ల రిజర్వాయర్కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ తెస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి అవునో.. కాదా ఆయన సమాధానం చెప్పాలి..కాళేశ్వరం ప్రాజెక్టుకు 94 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది?. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేస్తున్న వారు ముక్కు నేలకు రాయాలి. ఎల్లకాలం మోసం చేయలేమని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో.. విడతల వారిగా భారీ అవినీతికి ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారాయన. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన సంస్థనే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందుకు వస్తే.. ప్రభుత్వం అడ్డుకుంటోంది. కొండ పోచమ్మ ద్వారా రూ.1,100 కోట్లతో హైదరాబాద్కి నీళ్లు తేవోచ్చు. కానీ, ఈ రోజు రూ. 7,700 కోట్లకు వ్యయం.. అంటే 7 రెట్లు ఎలా పెరిగింది?. కేవలం కమిషన్ ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిశాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే రూ.7,400 కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు?. వారిపైన చర్యలు తీసుకోక పోగా వారికే మళ్ళీ కాంట్రాక్ట్ లు ఎలా ఇస్తున్నారు?. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యింది అని కేటీఆర్ ప్రశ్నించారు.ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంభిస్తోందని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రజాస్వామాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని అన్నారాయన. ‘‘బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నాం అని టీపీసీసీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఇంక విచారణ దేనికి?. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి’’.. కేటీఆర్ డిమాండ్ చేశారు. -
బర్డ్ ‘హిట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆకాశం ఈ పేరు చెప్పగానే మేఘాలతో పాటు విమానాలు, పక్షులు గుర్తుకు వస్తాయి. రైట్ సోదరులు సైతం పక్షులను చూసి స్ఫూర్తి పొందే విమానాన్ని కనిపెట్టారు. అయితే ఇప్పుడు ఆ పక్షుల పేరు చెబితే విమానయాన సంస్థలు హడలిపోతున్నాయి. బర్డ్ హిట్స్ గణనీయంగా పెరిగిపోవడం, ఈ విహంగాల వల్ల విమానాలను ఎనలేని నష్టం జరుగుతుండటమే దీనికి కారణం. విమానం ఎగిరే, కిందికి దిగే సమయంలో దాని ఇంజన్ లేదా ఇతర భాగాలను పక్షులు ఢీకొట్టడాన్ని బర్డ్ హిట్ అంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశ వ్యాప్తంగా 2807 బర్డ్ హిట్స్ నమోదు కాగా.. వీటిలో 207 హైదరాబాద్కు సంబంధించినవే. 695 ఉదంతాలతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రథమ స్థానంలో ఉండగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదో స్థానంలో ఉంది. సాధారణ వ్యక్తులకు చిన్న విషయంగా కనిపించే, వినిపించే బర్డ్ హిట్ విమానాలకు అపారమైన నష్టం కలిగిస్తుంది. ప్రధానంగా గద్దలు, రాబందులు తదితరాలే విమానాలకు తగులుతూ ఉంటాయి. ఇంజిన్లోకి పక్షి చొచ్చుకుపోవడం వల్ల అది ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ముందు భాగంలో ఉండే నాసెల్ (నోస్ కోన్), వింగ్స్, విండ్ ల్డ్స్కు తాకితే ఆయా భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. బర్డ్ హిట్ వల్ల ఇంజిన్ బ్లేడ్స్ విరిగిపోతే పెను ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. అనేక సందర్భాల్లో బర్డ్ హిట్ వల్ల పరిస్థితులు అత్యవసర ల్యాండింగ్ వరకు వెళ్లాయి. ఈ కారణాల వల్లే విమానయాన రంగంలో బర్డ్ హిట్ను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి ఉదంతాన్నీ కచి్చతంగా నమోదు చేస్తుంటారు. ప్రాణనష్టం లేనప్పటికీ బర్డ్ హిట్ వల్ల నష్టం జరిగితే ఆ విమానాల మరమ్మతు కోసం భారీ మొత్తం వెచి్చంచాల్సి వస్తుంది. టేకాఫ్ సమయంలో ఇలాంటి జరిగితే వెంటనే ల్యాండింగ్ చేయడంతో పాటు ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేయడం తదితరాల వల్ల, విమాన సేవలకు అంతరాయం, ఆలస్యంతో పాటు విలువైన పని గంటలు వృథా అవుతుంటాయి. విమానాశ్రయం చుట్టూ జనావాసాలు పెరిగిపోడం ఈ బర్డ్ హిట్స్ చోటు చేసుకోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పడేసే ఆహార వ్యర్థాల వల్లా ఈ ఉదంతాలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పక్షుల కదలికల్ని గుర్తించడానికి విమానాశ్రయాల్లో ప్రత్యేక రాడార్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయాల వద్ద, రన్వేల పైనా బర్డ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా బర్డ్ కంట్రోల్ టీమ్స్ పేరుతో ఉద్యోగులను నియమిస్తుంటారు. వీళ్లు టపాసులు, ఫ్లాషింగ్ లైట్లు తదితరాలు వాడుతూ పక్షులను ఆ ప్రాంతాల నుంచి వీలైనంత దూరం తరిమేస్తుంటారు. విమానాశ్రయంతో పాటు ఆ చుట్టు పక్కల ఉన్న పక్షి గూళ్లను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. విమానాల్లోనూ యాంటీ బర్డ్ హిట్ టెక్నాలజీని, ఈ బర్డ్ హిట్స్ను తట్టుకునే సామర్థ్యాన్నీ అభివృద్ధి చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. -
Hyderabad: 3 లక్షల 3 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీస్, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ అభినందనలు తెలిపారు. పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యంతోపాటు టాయిలెట్లు, సరిపడా క్రేన్ల ఏర్పాటు తదితర అంశాల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. నిమజ్జనం మార్గం పొడవునా ఏర్పాటు చేసిన గణేశ్ యాక్షన్ టీమ్స్ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఫలితం కనిపించింది. రోడ్డు సేఫ్టీ డ్రైవ్లో నగరంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ప్రధానంగా నగరంలో ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్లతో సహా నిమజ్జన శోభాయాత్ర జరిగే 303 కిలోమీటర్ల మేర మార్గం మరమ్మతులు చేపట్టడంతో ఊరేగింపు సాఫీగా, సురక్షితంగా, వేగంగా జరిగిందని పేర్కొన్నాన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ 15 వేల మంది సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టులో విధులు నిర్వర్తించడంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు కనిపించలేదన్నారు. 72 కృత్రిమ కొలనులతో ప్రధాన చెరువులపై ఒత్తిడి లేకుండా, ట్రాఫిక్ జామ్లు లేకుండా, భక్తులు స్థానికంగానే నిమజ్జనం అయ్యేలా చూడగలిగామన్నారు. జీహెచ్ఎంసీ కల్పించిన ఉచిత భోజన సౌకర్యం భక్తులు, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కారి్మకుల సేవలను మేయర్, కమిషనర్ ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రÔ¶ ంసించారు.. వారి నిరంతర సేవల వల్లే ఇప్పటి వరకూ 20 వేల అధిక టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. ఈ వ్యర్థాలను జవ జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్కు పంపామన్నారు. గణేష్ ఉత్సవసమితి సభ్యులు, మీడియా, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు వినాయక చవితి ఉత్సవం, మహా నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా యంత్రాంగానికి తమవంతు సహకారం అందించిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, మీడియా, ప్రజలకు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీ యంత్రాగం, ప్రభుత్వ శాఖలు చేసిన ఏర్పాట్లను, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా క్రియాశీలంగా వ్యవహరించిందని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. -
కాంగి‘రేసు’ మల్లగుల్లాలు!
సాక్షి, హైదరబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిత్వం ఖరారుపై మల్లగుల్లాలు పడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో సీరియస్గా తీసుకొని ప్రతి అడుగూ ఆచితూచి వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూ వారి ఊహలకు అందని విధంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదేస్థానంలో పోటీ చేసి ఓటమి పాలైన భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ అజారుద్దీన్న్ తిరిగి బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబర్చారు. అయితే మైనారిటీ అభ్యరి్థని బరిలోకి దింపితే హిందూత్వ ఎజెండాతో బీజేపీ బలపడే ప్రమాదం ఉందని భావించి టికెట్ రేసు నుంచి ఆయనను తప్పించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసింది.మైనారిటీయేతర అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ‘స్థానిక’అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అయితే తాజాగా పారీ్టలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, కొత్త, పాత కేడర్ మధ్య ఆధిపత్య పోరు, అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి వ్యవహారాలు గుదిబండగా తయారయ్యాయి. టికెట్ రేసులో ఉన్న స్థానిక ఆశావహులు కూడా కేవలం మంత్రుల పర్యటన కార్యక్రమాలకే పరిమితమై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు కనిపిస్తోంది. దీంతో అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో స్థానికత అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిత్వం వైపు మొగ్గు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీసుకున్న బీసీ రిజర్వేషన్ పెంపు నిర్ణయం పార్టీకి కలిసి వచ్చి ఉపఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా బీసీ అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో విజయబావుట ఎగరవేయడమే లక్ష్యంగా గెలుపుగుర్రం అన్వేషణలో పడింది. ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఏకరవు పెడుతూ అన్నివర్గాల ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువనేత నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యా దవ్, విద్యావేత్త భవానీశంకర్ తదితరులు ఆసక్తి కనబర్చుతున్నారు. వారి ఆరి్థక బలాబలాలు, రాజకీయ, కుటుంబ నేపథ్యం, ప్రజల్లో వారిపై గల పలుకుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. అందరికీ అమోదయోగ్యంగా.. అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన అభ్యర్థి పేరును పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో గెలుపు, ఓటములకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, నివసించే పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు కీలకమే. ఈ ప్రాంతాల ఓటర్లు సైతం ఆమోదించే అభ్యరి్థని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ అధిష్టానం ఈ ప్రాంతాల్లో పలువురి అభ్యరి్థత్వాలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆశల పల్లకిలో... అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన నవయువ నిర్మాణ సంస్థ వ్యవస్థాపక చైర్మన్, యువనేత నవీన్ యాదవ్ టికెట్ తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అగ్రనేతల నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పోటీ చేసిన అనుభవం, స్థానిక పరిచయాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం బీసీ అభ్యర్థత్వాన్ని పరిశీలిస్తుండటంతో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లపాటు మేయర్గా సమర్థవంతంగా అందించిన సేవలు, నియోజకవర్గంలోని అన్ని వర్గాలతో ఉన్న పరిచయాలు తన అభ్యరి్థత్వం పరిశీలనకు బలం చేకూర్చవచ్చని ఆయన భావిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. రెండు పర్యాయాలు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్లోని పరిచయాలు, పదేళ్లపాటు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అభ్యరి్థత్వం పరిశీలనకు కలిసి రావచ్చని ఆయన ఆశలు పెట్టుకున్నారు. దివంగత నేత పీజేఆర్ శిష్యుడు, విద్యావేత్త భవానీశంకర్ కాంగ్రెస్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాల కాలంగా పారీ్టకి అంకితభావంతో సేవలందిస్తున్నందున స్థానికులకు టికెట్ ఇవ్వదల్చుకుంటే తన పేరు పరిశీలించవచ్చని భావిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో పట్టు, కేబుల్ నెట్వర్క్, విద్యాసంస్థల కారణంగా పరిచయాలు మరింత కలిసి వచ్చే అంశాలుగా ఆయన భావిస్తున్నారు. -
గ్రహణం రోజు.. గుప్త నిధులు తీస్తా..
హైదరాబాద్: పట్టణంలో పట్టపగలే గుప్త నిధుల తవ్వ కాలు కలకలం రేపాయి. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురు ప ట్టుబడగా ప్రధాన మాంత్రి కుడు పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్ఐ నుమాన్అలీ తెలిపి న ప్రకారం.. గ్రామానికి చెందిన యాగ ప్రశాంత్కు పాడుబడిన ఇల్లు ఉంది. 15 ఏళ్లుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇటీవల ఆ ఇంటి నుంచి రాత్రివేళ శబ్దాలు వస్తున్నాయని.. అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. ఈ విషయాన్ని ప్రశాంత్ క్యాద్గిరాకు చెందిన తన స్నేహితుడు పట్నం శ్రీనివాస్కు చెప్పాడు. వీరిద్దరూ బషీరాబాద్కు చెందిన మోహిజ్, మహేశ్, శివకుమార్తో కలిసి గుప్తనిధుల వెలికితీతకు పథకం రచించారు. వారం క్రితం శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాంత్రికుడు మొల్లను కలిసి గుప్తనిధుల విషయం వివరించాడు. దీంతో సదరు మాంత్రికుడు సెప్టెంబర్ 9వ తేదీన ఆదివారం పౌర్ణమితో పాటు గ్రహణం ఉందని, అదే రోజు నిధులు వెలికితీస్తానని, సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ఆదివారం బషీరాబాద్కు వచ్చిన మాంత్రికుడు ఉదయం 10.30 గంటలకు పాడుబడిన ఇంటికి చేరుకున్నాడు. ప్రశాంత్, శ్రీనివాస్, మోహిజ్, మహేశ్, శివకుమార్తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. ఇంట్లో శబ్దాలు బయటకు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికే మాంత్రికుడు అక్కడి నుంచి పరారవ్వగా తవ్వకాలు జరుపుతున్న ప్రశాంత్, శ్రీనివాస్, మోహిజ్, మహేశ్, శివకుమార్ను పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. సాయంత్రం తాండూరు రూరల్ సీఐ నగేశ్ తవ్వకాలు జరిపిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పరారైన వ్యక్తినే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. -
‘గోదావరి’కి నేడు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను 2027 డిసెంబర్ నాటికి తీర్చడంతో పాటు నగరంలో రోజూ నల్లా నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన గోదావరి తాగునీటి పథకం రెండు, మూడో దశ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సోమవారం గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన మరో రెండు ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు రూ.7,360 కోట్ల అంచనాలతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్) విధానంలో గోదావరి తాగునీటి పథకం రెండు, మూడో దశ పనులు చేపట్టనున్నారు. మూసీ నదీ పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెట్టనుండగా, 60 శాతం వాటాను నిర్మాణ సంస్థ భరించనుంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. మల్లన్నసాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీల నీళ్లను తరలించి ఆ నీళ్లతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలను విడుదల చేస్తారు. మిగిలిన 17.50 టీఎంసీల జలాలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. ఓఆర్ఆర్ రెండో దశ ప్రాజెక్టు ప్రారంభం ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) రెండో దశలో భాగంగా రూ.1,200 కోట్లతో జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీలకు తాగునీటి సరఫరా చేసేందుకు నిర్మించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా, ఇటీవల కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను సీఎం ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరూర్నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెరు, బొలారంతో సహా మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. నియో పోలిస్ సెజ్కు తాగునీటి సరఫరా.. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి–నియో పోలిస్ సెజ్కు తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 13 లక్షల మంది జనాభాకు లబ్ధి కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
లేబర్గా చేరి.. లోగుట్టు పట్టి..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో లేబర్గా చేరితేగానీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించలేమని భావించిన మహారాష్ట్ర పోలీసులు పక్కా పథకం వేశారు. దీంతో ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్–4కు చెందిన ఓ ఆఫీసర్ నెలరోజుల ముందే వాగ్దేవి ల్యాబ్స్లో కార్మికుడిగా చేరాడు. కంపెనీలో దిగుమతి అవుతున్న ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీ కేంద్రం, కార్మీకులు, రవాణా ఏర్పాట్లు తదితరాలపై నిఘా పెట్టారు. నెలరోజుల పాటు వివరాలు సేకరించి, పక్కా ఆధారాలు లభించగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్–4 ఇన్స్పెక్టర్ ప్రమోద్ భడక్, తన బృందంతో ఆకస్మికంగా దాడులు చేసి గుట్టు రట్టు చేశారు. ప్రతిసారి 5 కిలోల విక్రయం: భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ వోలేటి బృందం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్ విజయ్ పదేళ్లుగా ఎండీ (మెఫిడ్రోన్) డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫిడ్రోన్ డ్రగ్స్ విక్రయించేవాడని, ఒక్కొక్క కిలో రూ.50 లక్షల చొప్పున ఏజెంట్లకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ యువతి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఏకంగా రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు ఈనెల 5న గుర్తించిన విషయం తెలిసిందే. చర్లపల్లి ఇండ్రస్టియల్ ఏరియాలోని నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్న నిర్వాహకుడు శ్రీనివాస్విజయ్ వోలేటి, అతడితో కలిసి పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పటా్వరీలను మిరా–భయందర్, వసాయ్–విరార్ (ఎంబీవీవీ) పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ సోదాల్లో భాగంగా స్వాదీనం చేసుకున్న 5 కిలోల 968 గ్రాముల ఎండీ (మెఫిడ్రోన్), 35,500 లీటర్ల ఇతర కెమికల్స్, 19 బాక్స్లలోని 950 కిలోల మిౖథెలిన్ డైక్లోరైడ్ (ఎండీసీ) పొడి సహా మెఫిడ్రోన్ (ఎండీ) తయారీకి వాడే ఇతర రసాయనాలు కలిపి మొత్తం 200 డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్ను, నాచారంలోని వాగ్దేవి ఇన్ఫోసైన్స్లో భారీగా నిల్వచేసిన డ్రగ్ పౌడర్ను ఆదివారం రెండు లారీల్లో ముంబైకి తరలించారు. శ్రీనివాస్విజయ్ ఓలేటి, తానాజీ పండరినాథ్ పటా్వరీలను కస్టడీకి తీసుకొని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పట్టుబడిన 11 మంది నిందితుల నుంచి సేకరించిన వివరాలతోపాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. కాగా, డ్రగ్స్ పట్టుబడిన ఫ్యాక్టరీ ప్రాంతంలో స్థానిక పోలీసులు సైతం ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఏడాది క్రితమే ఓలేటిపై డ్రగ్స్ కేసు తాజా డ్రగ్స్ కేసులో పట్టుబడిన శ్రీనివాస్విజయ్ ఓలేటి పాత నేరస్తుడేనని ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్–4 ఇన్స్పెక్టర్ ప్రమోద్ భడక్ ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడని, కేసు నమోదైందని చెప్పారు. ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చి, మళ్లీ హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్టు బంగ్లాదేశ్ యువతి అరెస్టుతో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతోపాటు బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ విజయ్ ఓలేటి హైదరాబాద్ కేంద్రంగా వాగ్దేవి ల్యాబ్స్తో పాటు వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ ప్రై.లి. కంపెనీలను సైతం నిర్వహిస్తున్నాడు. డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలపై ఫోకస్ హైదరాబాద్ శివారులో గుట్టుచప్పుడు కాకుండా ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ను ఒక కెమికల్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో నడుపుతుండడం సంచలనంగా మారింది. దీంతో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు, ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్), హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), డీసీఏ (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) సిబ్బంది అప్రమత్తమైంది. రసాయన ఫ్యాక్టరీలపై నిఘా పెంచాయి. కెమికల్ ఫ్యాక్టరీల పేరిట అనుమతులు తీసుకొని వాటిల్లో ఏం తయారు చేస్తున్నారు? మూతపడిన పరిశ్రమలు, రసాయన గోదాంల ప్రస్తుత పరిస్థితి ఏంటి ? వాటిలో ఏం నిల్వ చేస్తున్నారన్న అంశాలపై దృష్టి పెట్టారు. నగరంలో మత్తుపదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలపై ఇప్పటికే దృష్టి పెట్టామని, గతంలోనూ ఆ్రల్ఫాజోలం, ఎఫిడ్రిన్ సహా ఇతర మత్తు పదార్థాలను గుర్తించిన ఘటనలు ఉన్నాయని ఈగల్కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీల్లో సోదాలు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) పరిధిలోకి వస్తాయని, డీసీఏతో కలిసి ఈగల్ బృందాలు సైతం ఈ రకమైన సోదాల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. -
అమెరికాకు వద్దు బ్రో
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు వెళ్లాలంటేనే భారతీయులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు యువతను మరీ భయపెడుతున్నాయి. ‘అక్కడ పరిస్థితి ఏమిటి?’ అని ప్రవాస భారతీయులకు ఫోన్ చేస్తే ముందుగా వచ్చే మాట ఒక్కటే.. ‘వద్దు బ్రో.. ఇప్పుడు అమెరికాకు రావొద్దు’. గ్రీన్కార్డు ఉన్న వాళ్ల నుంచీ ఇదే మాట వినిపిస్తోంది. పెరుగుతున్న ఖర్చులు, పడిపోతున్న ఆదాయం, వెంటాడుతున్న అప్పులు.. ఇదీ పరిస్థితి అంటున్నారు అమెరికాలోని మనవాళ్లు. కేవలం ఆరు నెలల కాలంలోనే లేబర్ మార్కెట్ నేలబారుకు చేరిందని చెబుతున్నారు. ఐటీ సెక్టార్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం వెళ్లిన విద్యార్థులను ఈ పరిస్థితులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొత్తగా యూఎస్ వెళ్లాలనుకునే వాళ్లు పునరాలోచించాల్సి వస్తోంది. ఆగస్టులో దారుణ పరిస్థితి అమెరికాలో నిరుద్యోగ గణాంకాలను అక్కడి అధికారిక సంస్థ బ్యూరో ఆఫ్ లేబర్ వెల్లడిస్తుంది. జూలై 19వ తేదీ నాటికి అమెరికాలో నిరుద్యోగ జాబితాలో 2.21 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆగస్టు 30 నాటికి ఈ సంఖ్య 23.7 లక్షలకు పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య సగటున వారానికి 8 వేల చొప్పున పెరుగుతోందని బీఎస్ఎస్ తెలిపింది. గడచిన ఆరు వారాల్లో ఐటీ సెక్టార్లోనే దాదాపు 5.8 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ రంగం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు 50,200 మాత్రమే. ముఖ్యంగా ఆగస్టు నెలలో 1.8 లక్షల ఉద్యోగాలు ఊడిపోయినట్టు జాబ్లెస్ డేటా పేర్కొంది. యూఎస్ జాబ్ మార్కెట్లో ఈ పరిస్థితి ఐదేళ్ల క్రితం కూడా లేదని చెబుతున్నారు. ఐటీ ఉద్యోగాల సృష్టి తప్ప, కుదించడం తక్కువేనని.. అది కూడా కొత్త టెక్నాలజీతో మార్పు చేసినట్టు అక్కడి మార్కెట్ వర్గాలు అంటున్నాయి. లేబర్ మార్కెట్ డౌన్ అమెరికా కొన్ని దేశాలకు లేబర్ వీసాలు జారీచేస్తుంది. మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, డెలివరీ విభాగం తదితర చోట్ల శారీరక శ్రమ చేసే కొన్ని రకాల పనులను క్లాస్–4గా విభజించారు. ఈ పనులు చేసేందుకు భారతీయులకు అనుమతి లేదు. లేబర్ వీసాలో భారతీయులను మినహాయించారు. అయితే, మెజారిటీ భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే ఇలాంటి పార్ట్టైం ఉద్యోగాలు చేస్తుంటారు. ట్రంప్ వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్పై ఆంక్షలు ఎక్కువయ్యాయి. పార్ట్టైం ఉద్యోగాలు చేసే వారిపై నిఘా పెట్టి, వారి డేటాను సేకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ పనులు చేసేందుకు భయపడుతున్నారు. ఫలితంగా చాలా రెస్టారెంట్లు పూర్తిస్థాయిలో నడవడం లేదని లేబర్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా రెస్టారెంట్లు, డెలివరీ, మాల్స్లో రోబోటిక్ సర్వీస్ విధానాలను తీసుకొస్తున్నారు. పూర్తి యాంత్రీకరణ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలు వెళ్లాయి. ఫలితంగా లేబర్ పనులకు అవకాశం ఉన్న వారికీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఐటీ అతలాకుతలం ఐటీ రంగం పూర్తిగా సర్వీస్ సెక్టార్పైనే ఆధారపడింది. అమెరికన్ కంపెనీలు భారత్లో ఉండే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అమెరికాలో ఎక్కువ వేతనం ఇచ్చేకన్నా, భారత్లో తక్కువ వేతనంతో రిమోట్ పని విధానం చేయించుకోవచ్చని భావిస్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఐటీ సెక్టార్పై ప్రభావం చూపుతోంది. బిగ్ డేటా సెంటర్స్ ఆవిర్భావం, ప్రత్యేక కోడింగ్ విధానం ఐటీకి సొంతమైంది. ఫలితంగా సాధారణ కోడింగ్తో ఉండే ఉద్యోగాల అవసరం తగ్గుతోంది. ఇదే క్రమంలో ట్రంప్ టారిఫ్ల భారం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఐటీ రంగంపై భారీగా టారిఫ్లు విధించవచ్చనే వార్తలతో ఐటీ సెక్టార్ కొత్త ఉద్యోగ నియామకాలు నిలిపివేసింది. ఏఐ టెక్నాలజీతో అనుసంధానం కాని ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. టారిఫ్లు విధిస్తే ఇండియాలో పనిచేసే ఉద్యోగి వేతనం, ఇంచుమించు అమెరికాలో ఉద్యోగి వేతనంతో సమానం (ఉద్యోగికి ఇచ్చేది కాదు... టారిఫ్లు కలుపుకుని) అవుతుంది. ఫలితంగా కంపెనీలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడ్ రేట్లపై ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాయి. సానుకూల నిర్ణయాలు ఉంటే తప్ప ఐటీ బతకడం కష్టమని ప్రవాస భారతీయలు అంటున్నారు. ఇది కరెక్ట్ సీజన్ కాదు నాకు గ్రీన్ కార్డ్ ఉంది. ఐటీ సంస్థలో పనిచేస్తున్నా. టారిఫ్ల ఫలితంగా లేఆఫ్ ఇచ్చారు. యూఎస్ నిబంధనల ప్రకారం గ్రీన్కార్డు ఉన్నవాళ్లకు ఆరు నెలలు నిరుద్యోగ భృతి ఇస్తారు. జాబ్లెస్ డేటాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జాబ్లు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొత్తవాళ్లు అమెరికాకు రావొద్దు. – కమలాకర్ బుర్రా, అమెరికాలో ఐటీ ఉద్యోగి. యాంత్రీకరణే శరణ్యం రెస్టారెంట్లో భారతీయ విద్యార్థులు పనిచేసినంత కాలం సమస్య ఉండేది కాదు. అనధికారమే కావచ్చు కానీ వాళ్లకు ఆర్థికంగా చేయూత ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత విద్యార్థులు పనిచేయడం లేదు. అమెరికాలో అధికారిక లేబర్ వీసా ఉన్నవాళ్ల కోరికలు మేం తీర్చలేం. దీంతో రోబోటిక్ వైపు వెళ్తున్నాం. భవిష్యత్లో లేబర్ మార్కెట్ స్వరూపం పూర్తిగా మారుతుంది. – పల్లెల మున్షీనాథ్, డల్లాస్లో ఓ రెస్టారెంట్ యజమాని. -
ఏం చేద్దాం.. ఏం చెప్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం విశేషం. వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించడం, సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి తమకు పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పరిష్కారం పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశంలో ఏఏజీ..! ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మహీపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికపూడి గాం«దీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం.. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసామనే రీతిలో సమాధానమివ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కోర్టు కేసుల విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. గతంలోనే కలవాలనుకున్నాం.. సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే ’సాక్షి’తో మాట్లాడుతూ.. అందరం కలిసి సీఎంతో సమావేశం అవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని, సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు. తాజా సీఎం రేవంత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
అసదుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్ ధన్యవాదాలు
హైదరాబాద్: ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్రెడ్డికి ఓవైసీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘ ఉపరాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ఓవైసీకి కృతజ్ఞతలు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మంచి నిర్ణయం తీసుకున్నారు ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీకి హృదయ పూర్వక ధన్యవాదాలు’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు సీఎం రేవంత్. ఓవైసీ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్.Thank you @asadowaisi bhai, Lok Sabha MP and national president of @aimim_national for coming forward in support of Justice Sudarshan Reddy garu as Vice President with a common national interest initiative. https://t.co/tLQ7gBi8z1— Revanth Reddy (@revanth_anumula) September 7, 2025 -
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్కు తప్పిన పెను ప్రమాదం!
సాక్షి,కామారెడ్డి జిల్లా : మంత్రుల కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ సభ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణ మంత్రులు వెళ్లారు.ఈ క్రమంలో కొత్త బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షబ్బీర్ అలీ వాహనం టైర్ పేలింది. ఆ వాహనంలో షబ్బీర్ అలీ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. -
సీఎం విజిట్ మంచిదే.. నిమజ్జనాలపై ఫోకస్ పెట్టాం: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాదులో 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పుకొచ్చారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడానికి పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని తెలిపారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈరోజు సాయంత్రం వరకు 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం నిమజ్జనం త్వరగా చేపట్టడంతో మిగతా గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాం. ఈసారి హైదరాబాదులో ఎక్కువ గణేష్ విగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కొన్ని విగ్రహాలు 40 అడుగుల వరకు ఎత్తులో ఉన్నాయి. గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రశాంతంగా కొనసాగడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, వాటర్ బోర్డ్ అధికారులు బాగా సహకరించారు.గణేష్ విగ్రహాల దగ్గర ఆకతాయిల ఆట కట్టించడానికి ఈసారి షీ టీమ్స్ బాగా పనిచేశాయి. 170 మందిపై కేసులు నమోదు చేశాం. గణేష్ మండపాల దగ్గర అక్కడక్కడ గొడవలు జరిగాయి. ఐదుగురిపై కేసులు నమోదు చేశాం. హై రైజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ను కంట్రోల్ చేయగలిగాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేయడం మంచిదే’ అని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్లో కారు బీభత్సం.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ వాహనాన్ని కియా కారు ఢీకొట్టింది. లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో యువతి కశ్వి(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
బైబై గణేశా..!
నిమజ్జనోత్సాహం వెల్లువెత్తింది. హైదరాబాద్ మహానగరం గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగింది. ఆబాలగోపాలమంతా వినాయకసాగర్ బాటపట్టింది. తొమ్మిది రోజులపాటు వివిధ ప్రాంతాల్లో ఘనమైన పూజలందుకున్న గణనాథుడు జనసంద్రమై తరలివచి్చన భక్తకోటి ఆనందోత్సాహాల నడుమ గంగమ్మ ఒడికి చేరాడు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఉదయం నుంచే నగరం ఆధ్యాతి్మక శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విగ్రహాలు, ఆటపాటలు, నృత్యప్రదర్శనలతో శోభాయమానమైంది. ఉదయమే బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ముగిశాయి. 69 అడుగుల గణనాథుడి విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పరిపూర్ణమైన నిమజ్జనాన్ని కనులారా వీక్షించిన భక్తులు గొప్ప అదృష్టంగా భావించారు. వేలాదిమంది ఆ దృశ్యాన్ని తమ మొబైల్ఫోన్లలో బంధించారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హుస్సేన్సాగర్ మహాజన సాగరమైంది. పోటెత్తిన భక్తజనం... నిమజ్జనోత్సవాలకు తరలి వచ్చిన భారీ భక్తజనసందోహంతో రహదారులు పోటెత్తాయి. ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం తరువాత భక్తులు కొద్దిగా తగ్గుముఖం పట్టారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. బాలాపూర్ వినాయకుడి విగ్రహంతోపాటు నగరం నలువైపుల నుంచి తరలివచి్చన విగ్రహాల నిమజ్జన వేడుకలు అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగాయి. దీంతో ట్యాంక్బండ్, సెక్రటేరియట్, నెక్లెస్రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం, పీపుల్స్ప్లాజా తదితర ప్రాంతాలు భారీగా తరలివచి్చన భక్తజనులతో కిటకిలాడాయి. యువత పెద్ద సంఖ్యలో తరలిచి్చంది. ‘జై బోలో గణపతి మహారాజ్కీ ’నినాదాలతో ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ పరిసరాలు హోరెత్తాయి. మెట్రో కిటకిట..... నిమజ్జనం సందర్భంగా మెట్రో రైళ్లు భక్తులతో కిక్కిరిశాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడింది. నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తుల రద్దీతో ఖైరతాబాద్ స్టేషన్లో ప్రయాణికుల ఎగ్జిట్, ఎంట్రీ గేట్లు సైతం స్తంభించాయి. మియాపూర్, ఎల్బీనగర్ మార్గాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. నాగోల్, అమీర్పేట్, రాయదుర్గం ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడి దృష్ట్యా ఖైరతాబాద్ వద్ద కొద్దిసేపు ప్రవేశద్వారాలను మూసి ఉంచారు. సోషల్ మీడియాలో గణేశుడి హవా వినాయక నిమజ్జన వేడుకలను ఇళ్లళ్లో టీవీల ముందు ఎంత మంది చూశారో.. అంతకు రెట్టింపు జనాలు సోషల్ మీడియాలో ఫాలో అయ్యారు. ట్యాంక్బండ్లో గణేశ్ నిమజ్జన సరిళిని హైదరాబాద్ సిటీ పోలీస్, సరూర్నగర్ ట్యాంక్ రాచకొండ పోలీసులు, ఐడీఎల్ చెరువు, హస్మత్పేట చెరువులలో జరుగుతున్న నిమజ్జనాల సన్నివేశాలను సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేశారు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ వినాయక నిమజ్జనాలు సాగుతున్న తీరును, ప్రయాణ మార్గం, జన సందోహం, పూజలు తదితర ఏర్పాట్ల గురించి పోలీసులు నిరంతరం పోస్ట్లు పెట్టారు. వినూత్న రీతిలో, విభిన్నంగా ఉన్న గణేష్ ప్రతిమలను షేర్ చేశారు. ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం, బాలాపూర్ లడ్డూ వేలం సరళిని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. సమాచారం అందిస్తూ... వినాయక నిమజ్జనం వేడుకలతోపాటు ప్రయాణ మార్గాలు, రోడ్ మళ్లింపులు, పార్కింగ్ ప్లేస్లు, అత్యవసర ఫోన్ నంబర్లు, ఇతరత్రా సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పోలీసులు ప్రత్యేకంగా కటౌట్లను తయారు చేసి పోస్ట్ చేశారు. ‘భగవంతుడి కళ్లు ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి. అలాగే మా సీసీటీవీ కెమెరాలు కూడా గమనిస్తూ ఉంటాయి’అనే తెలుగు, ఇంగ్లి‹Ù, హిందీ మూడు భాషల్లో స్లోగన్తో షీ టీమ్ పోస్ట్లతో అప్రమత్తం చేశారు. పోలీసుల పోస్ట్లను గమనించిన ఫాలోవర్స్ పోలీస్ డ్రెస్తో వినాయక ఫొటోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. డీజేల హోరు.. భక్తుల జోరు.. గ్రేటర్లో వినాయకుడు మోత మోగించేశాడు. నిమజ్జనం వేళ డీజీలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్దరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాలలో ఫిర్యాదు చేసినా పీసీపీ, మున్సి పల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హుస్సేన్సాగర్, అబిడ్స్, బహదూర్పుర, చారి్మనార్, ఖైరతాబాద్, సరూర్నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాలలో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. శబ్ద కాలుష్యంపై నిర్లక్ష్యంపుణే, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రశాంతంగా సామూహిక ఊరేగింపులు గణేష్ ఉత్సవాల్లో తుది, కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం ప్రారంభమైంది. నగర పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్లో టీజీఐసీసీసీ నుంచి ఈ శోభాయాత్రను ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. సామూహిక నిమజ్జన క్రతువు ఆదివారం ఉదయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఈ కీలక ఘట్టం అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా సాగు తోంది. నగరంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. ఆయా మార్గాల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా కెమెరాలు ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరిగే రూట్లో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటూ సీసీ, పీటీజెడ్, వైఫై వంటి ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు అన్నింటినీ ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించింది. ఐసీసీసీలో ఉన్న మల్టీ ఏజెన్సీ ఆపరేషనల్ సెంటర్ను సమర్థంగా వినియోగించారు. ఇక్కడే ఉన్న పోలీసు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సహా అన్ని విభాగాల అధికారులు హుస్సేన్సాగర్, ఎంజే మార్కెట్, చారి్మనార్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఊరేగింపులు పర్యవేక్షించారు. నగర సీపీ పర్యవేక్షణసిటీ సీపీ ఆనంద్, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఏఏ చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయిందే తక్షణం గుర్తిస్తూ విద్యుత్ అధికారులకు తెలిపి తక్షణం పునరుద్ధరించే ఏర్పాట్లు చేశారు. హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు చాంద్రాయణగుట్ట–నాగుల్చింత చౌరస్తా, ఇంజన్»ౌలి–ఎంజే మార్కెట్, కట్టమైసమ్మ–ఫలక్నుమ, ఇంజన్»ౌలి–మదీన, మదీన–నిజాం కాలేజీ మధ్య ఉన్న ప్రాంతాలపై తొమ్మిది డ్రోన్లు వినియోగించిన పోలీసు విభాగం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని గుర్తించి ఐసీసీసీ నుంచి పరిష్కారాలను సూచించింది. 2.54 లక్షల చిన్న విగ్రహాల నిమజ్జనంజీహెచ్ఎంసీలోని పైస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా అందరూ తగిన జాగ్రత్తలతో, సమన్వయంతో పనులు చేయడంతో నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాల నిర్వహణతోపాటు ఐదువేల మందికి ఉచితంగా భోజనాలు అందజేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. హుస్సేన్ సాగర్లో పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా, ఐదడుగుల లోపు చిన్న విగ్రహాలను తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనాలు చేశారు. ఇలాంటి విగ్రహాలు శనివారం రాత్రి 8 గంటల వరకు 2,54,685 నిమజ్జనమైనట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి.నిర్విఘ్నం.. సంపూర్ణం..ఖైరతాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనం నిర్విఘ్నంగా... సంపూర్తంగా సాగర్లో నిమజ్జనం గావించారు. నవరాత్రులు 69 అడుగుల ఎత్తులో విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం 6 గంటల్లో పూర్తిచేశారు. శనివారం ఉదయం 7.41 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర సాగర తీరానికి చేరుకొని ఎనీ్టఆర్ మార్గ్లోని క్రేన్ నెం 4 వద్ద 1.45 నిమిషాలకు సంపూర్ణంగా నిమజ్జనం ముగిసింది. 15 రోజుల ప్రణాళిక మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు సైఫాబాద్ ఏసీపీ సంజయ్కుమార్, హెచ్ఎండీఏ అధికారి గణేష్ జాదవ్ నిమజ్జన ప్రాంతంలో 70 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్లకుపైగా లోతు ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేసి ఆ ప్రాంతంలో రెడ్ఫ్లాగ్ ఏర్పాటు చేసి మార్కింగ్ చేశారు. మహాగణపతి లిఫ్ట్ చేసినప్పటి నుంచి సూపర్ క్రేన్ ఆపరేటర్ అజయ్ శర్మకు ఖచి్చతమైన సూచనలు చేస్తూ సంపూర్ణంగా నిమజ్జనం అయ్యేలా చూశారు. -
ట్యాంక్ బండ్ ఫుల్.. రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రెండో రోజు వినాయక నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ దారులన్నీ గణేశుడి ప్రతిమలతో నిండిపోయాయి. మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్లో రెండు లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగింది.ఇక, ఒక్క హుస్సేన్ సాగర్లో 11 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిమజ్జన పాయింట్లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇక, టాంక్ బండ్ పరిసరాల్లో ఇంకా సందడి కొనసాగుతోంది. గణేష్ ప్రతిమలు బారులు తీరడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాగా, ఎల్బీనగర్ పరిధిలో 35,994, చార్మినార్ 22,304, ఖైరతాబాద్ 63,019, శేరిలింగంపల్లి 41,360, కూకట్ పల్లి 62,405, సికింద్రాబాద్ పరిధిలో 36,251 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరంలో వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎల్బీనగర్ వద్ద మెట్రో స్టేషన్లో ప్రయాణికులు కిక్కిరిసి కనిపించారు. -
అక్షరం తేడా ఉన్నా బిల్లు రాదాయె!
జనగామ జిల్లాకు చెందిన వెంకటమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పదేళ్ల క్రితం పుట్టింటి పేరుతోతీసుకున్న ఆధార్ కార్డునే ప్రస్తుతం వినియోగిస్తోంది. ఇటీవల ఆధార్ నంబర్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించేలా అధికారులు మార్పులు చేశారు. అయితే వెంకటమ్మ ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రంలో అత్తింటివారి పేరు ఉండటంతో ఆధార్ వివరాలతో సరిపోలట్లేదంటూ అధికారులు బిల్లు చెల్లింపు నిలిపేశారు.నల్లగొండకు చెందిన పెదబోయిన ఈశ్వరి పేరును గ్రామ కార్యదర్శి బృందం ఇందిరమ్మ ఇళ్ల రికార్డులో పి.ఈశ్వరిగా పేర్కొంది. కానీ ఆధార్లో ఉన్నట్టుగా పేరు లేకపోవటంతో ఆమెకు ఇందిరమ్మ బిల్లు అందలేదు. అప్పు తెచ్చి పనులు మొదలుపెట్టానని.. బిల్లు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఈశ్వరి వాపోతోంది. సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. తొలుత లబ్ధిదారులు అందించిన వివరాల ఆధారంగా వారి బ్యాంకు ఖాతా లకు నేరుగా బిల్లులు జమ చేస్తూ వచ్చిన అధికారులు.. ఆయా వివరాలు తప్పుగా నమోదవటం వల్ల బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టారు. అయినా సమస్యలు తగ్గకపోగా కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. పొడి అక్షరాలతో పేర్లు... గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలోని బృందాలు ఇందిరమ్మ లబ్ధిదారుల పూర్తి పేర్లను ఆధార్ కార్డుల్లోని వివరాల ప్రకారం నమోదు చేయాల్సి ఉండగా కొంత మంది లబ్ధిదారుల విషయంలో సిబ్బంది పొడి అక్షరాలతో సరిపుచ్చారు. ఇంకొందరి ఇంటిపేర్లను పూర్తిగా రాసినా అర్థమయ్యేలా రాయకపోవడం వల్ల కంప్యూటరీకరించే వేళ అక్కడి సిబ్బంది ఇంటి పేర్లను పొడి అక్షరాల్లోకి మార్చారు. దీంతో ఆధార్ కార్డుల్లోని ఇంటి పేర్లు ఒక రకంగా.. ఇందిరమ్మ లబ్ధిదారుల రికార్డుల్లో మరో రకంగా నమోదయ్యాయి. ఫలితంగా ఆధార్లోని వివరాల ప్రకారం పేర్లు లేకపోవడంతో లబ్ధిదారులు మారిపోయినట్లు భావిస్తూ అధికారులు బిల్లులను నిలిపేస్తున్నారు. పేర్ల స్పెల్లింగ్లలో తేడాల వల్ల.. కొందరు లబ్ధిదారుల పేర్ల స్పెల్లింగ్లలోనూ తేడాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యాయి. ఉదాహరణకు వల్లి అనే పేరును ఆంగ్ల అక్షరాల్లో రాసేటప్పుడు ఆధార్ కార్డులో చివరి అక్షరంగా ‘వై’అని ఉంటే.. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ‘ఐ’అని రాశారు. అలాగే సుమతి పేరును ఆంగ్లంలో టీహెచ్ఐ అని ఒకచోట, టీఐ అని మరోచోట నమోదు చేశారు. ఇలాంటి తేడాలను కూడా లబ్ధిదారులు మారినట్టుగానే భావిస్తూ బిల్లుల చెల్లింపును అధికారులు ఆపేస్తున్నారు. బేస్మెంట్ స్థాయి వరకు పని పూర్తయినట్టు ఇందిరమ్మ యాప్లో ఫొటోతో సహా అప్లోడ్ చేసి 20 రోజులు గడుస్తున్నా బిల్లులు రావట్లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులను సంప్రదిస్తే ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలట్లేదని.. దాన్ని మారిస్తే తప్ప బిల్లు రాదని చెబుతున్నారు. అయితే తమ ప్రమేయం లేకుండా జరిగిన పొరపాట్లు ఇళ్ల నిర్మాణంపై ప్రభావం చూపుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలను మార్చి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. చాలామంది లబ్ధిదారులకు ఈ సమస్య తెలియక బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిర్యాదు చేయని వారి బిల్లుల విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. -
ఇంత జరుగుతున్నా..
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్లో ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడటం తెలంగాణ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. డ్రగ్స్ తయారీ అడ్డాగా తెలంగాణ మారినా పసిగట్టలేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలైన ఈగల్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ)... హైదరాబాద్ నగర పరిసరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారీ సంస్థలను ఎందుకు గుర్తించలేకపోతున్నా యన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.తెలంగాణలో డ్రగ్స్ వాడకానికి తావు లేదని.. డ్రగ్స్ సరఫరా చేసే/వాడే వారి వెన్నులో వణుకు పుట్టిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలుమార్లు, పలు వేదికలపై పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయితే మత్తు ముఠాల పనిపట్టేందుకు... డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవనడానికి తాజా ఉదంతమే ఉదాహర ణగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మూతపడ్డ పరిశ్రమలే కాదు.. నడుస్తున్న పరిశ్రమలూ అడ్డాలే...సాధారణంగా కొన్ని ముఠాలు డ్రగ్స్ తయారీకి నగర శివార్లలోని మూతపడ్డ పరిశ్రమలు, గోదాములను ఎంచుకుంటున్నాయి. వాటిని అద్దెకు తీసుకొని డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సోదాల్లోనూ సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, జహీరాబాద్, జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఈ తరహాలో కొన్ని మూతపడ్డ ఫ్యాక్టరీల్లో అల్ఫ్రాజోలం సహా ఇతర డ్రగ్స్ తయారీని గుర్తించిన ఉదంతాలు ఉన్నాయి. అయితే తాజా ఘటన అంతకుమించి అన్నట్లుగా నిరూపించింది.ఇటీవల కొందరు డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, అందులో కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దేశ, విదేశాలకు మాదకద్రవ్యాల ముడిసరుకును చేరవేస్తున్నారు. డైజోఫాం, ఎంఫిటమైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. వాటి తయారీకి అవసరమైన ముడిసరుకును సేకరించి గుట్టుచప్పుడు కాకుండా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కమీషన్కు ఆశపడే వారిని ఎంచుకొని ఈ తరహా డ్రగ్స్ తయారీకి తెరతీస్తున్నారు.తాజాగా ఒక ల్యాబ్ మాటున మరో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని నడుపుతుండడం.. అందులో రూ. కోట్ల విలువైన డ్రగ్స్ తయారవుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ను తయారు చేసినా వాటిని ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లోని ఏజెంట్లకు చేరవేయక తప్పదు. ప్రైవేటు బస్సులు, కొరియర్ సంస్థల ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ దశలోనూ స్థానిక పోలీసులు లేదా డ్రగ్స్ కేసుల దర్యాప్తు కోసమే వెలిసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలు గుర్తించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటిపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. -
10న రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ ‘యాక్షన్ ప్లాన్’ను ఖరారు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీకి ముందే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు శని, ఆదివారాల్లో నడ్డా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ వరుస భేటీలతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అధికార సాధనే లక్ష్యంగా వ్యూహరచనగత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైనా.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా 8 సీట్లు గెలుచుకోవడం, అనంతరం 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని గెలుచుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, కార్యవర్గ కూర్పుపై సందిగ్ధత, అసంతృప్తులు, సమన్వయ లేమి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరటంతో దీనిని అవకాశంగా మార్చుకోవాలని ఇప్పటికే ముఖ్య నేతలు ఉద్బోధ చేసినట్టు సమాచారం. అంతర్గత, బహిర్గత సమస్యలతో బీఆర్ఎస్ బలహీనపడటంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఇదే మంచి తరుణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని రాష్ట్ర పార్టీకి నాయకత్వం నిర్దేశించినట్టు సమాచారం.ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి మరింత మందిని చేర్చుకునే పనిని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లను అధిక సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్ఎస్లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్ఎస్లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల పర్యటనకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జిల్లాల పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీ రామారావు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దిశగా పార్టీ కేడర్ను సమాయత్తం చేయడంపైనా దృష్టి పెట్టనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ని యోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ను బలోపేతం చేసేలా కార్యక్రమాలను చేప ట్టనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.13న గద్వాల నియోజకవర్గంలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. సుమారు వారం రోజులుగా ఎర్రవల్లి నివాసంలోనే ఉంటున్న కేటీఆర్.. కేసీఆర్తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన సోదరి, ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంతో పార్టీలో నెలకొన్న గంద రగోళానికి తెరపడిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న ఎన్నికలపై కేటీఆర్ దృష్టి కేంద్రీకరించారు.దసరా పండుగ లోపు వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు లక్ష్యంగా ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల వ్యూహానికి పదును పెడుతున్నారు. కాగా, ఈ నెల 13న గద్వాల పర్యటనలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ బీఆర్ఎస్లో చేరనున్నారు.ఎర్రవల్లి నివాసానికి నేతల క్యూ..సీనియర్ నేత హరీశ్రావు లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసిన నేప థ్యంలో శనివారం మధ్యాహ్నం కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. లండన్ నుంచి తిరిగివచ్చిన హరీశ్రావు కూడా వెళ్లారు. ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్కుమార్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు కేటీఆర్తో భేటీ అయ్యారు. వారంతా కేసీఆర్ను కూడా కలిసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్, హరీశ్రావు తదితరులు పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్ను హరీశ్రావు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత అంశం ప్రస్తావనకు రాలేదని తెలిసింది. -
ఆలస్యమైనా.. త్వరగా ముగిశాయి!
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిశాయి. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయం 6.30కి ప్రారంభించాల్సి ఉండగా, 7.30కి ప్రారంభమైంది. ని మజ్జనం మధ్యాహ్నం 1.30కి పూర్తికావాలని టార్గెట్గా పెట్టుకున్నా 1:05 గంటలకే పూర్తి చేయగలిగారు. ఇక, బాలాపూర్ గణపతి శోభాయాత్ర కొన్ని అడ్డంకుల వల్ల రెండు గంటలు ఆలస్యమైనా సాయంత్రం 6:11 గంటలకు నిమజ్జనం పూర్తి చేశారు. నగరంలో మొత్తం 12,030 విగ్రహాలు నమోదు కాగా శుక్రవారం వరకు 7,500, శనివారం సాయంత్రానికి మరో 650 నిమజ్జనమయ్యాయి. పెద్ద విగ్రహాల్లో ఇంకా 4,500 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది. ప్రశాంతంగా నిమజ్జనాలు: డీజీపీ రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వి నాయక విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియను.. శనివారం డీజీపీ తన కార్యాలయంలో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో సమీక్షించారు. అనంతరం శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్ ఎం భగవత్, పీఅండ్ ఎల్ఐజీ ఎం.రమేశ్, శాంతి భద్రతల ఏఐజీ రమణకుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో నిమజ్జనోత్సవాలను సీనియర్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ, డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భద్రత విధుల్లో పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీ, ఆరీ్పఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్లు తదితర శాఖల సిబ్బంది కూడా పాల్గొంటున్నారని చెప్పారు. ఈసారి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిమజ్జనం విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులు సూచిస్తున్న భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ కోరారు. బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలుసొంతం చేసుకున్న దశరథ్గౌడ్ బడంగ్పేట్: ఎంతో ఉత్కంఠగా ఎ దురు చూసిన బా లాపూర్ గణనాథు డి లడ్డూను కర్మన్ ఘాట్కు చెందిన చైతన్య స్టీల్, సి మెంట్ వ్యాపారి లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.5 లక్షలు అధికంగా పలకడం విశేషం. ఈ సందర్భంగా బాలాపూర్ ఉత్సవ సమితి అధ్య క్షుడు కళ్లెం నిరంజన్రెడ్డి.. లడ్డూ గ్రహీతను ఘనంగా సన్మానించారు. -
‘సమ్మక్క సాగర్’ చిక్కులు వీడేనా?
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టు చిక్కుల్లో పడింది. ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు నిరాకరించగా ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు బదులుగా మరోచోట కొత్తగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టు రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును సమ్మక్క–సాగర్ ప్రాజెక్టు కింద స్థిరీకరిస్తామని గత ప్రభుత్వం డీపీఆర్లో ప్రతిపాదించింది. అలాగే ఇదే 4.40 లక్షల ఎకరాల ఆయకట్టునే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద సైతం స్థిరీకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ మదింపు సందర్భంగా కేంద్ర జల సంఘం గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే ఆయకట్టును ఎస్సారెస్పీ–2, కాళేశ్వరం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల కింద ఎలా ప్రతిపాదిస్తారంటూ కేంద్ర జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖ నుంచి వివరణ కోరింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ అంశాలను పునఃపరిశీలించడానికి ఈ నెల 22న ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖకు తెలియజేసింది. రూ. 9,257 కోట్లతో చేపట్టిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు (తుపాకులగూడెం బరాజ్) పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టు ప్రయోజనాలు వ్యయాల (బెన్ఫిట్ కాస్ట్ రేషియా) మధ్య నిష్పత్తిని 1.67:1గా అంటే.. ప్రాజెక్టుపై రూపాయి వెచ్చిస్తే రూ. 1.67 రాబడి వస్తుందని డీపీఆర్లో అంచనా వేశారు. మెరుగైన వ్యయ నిష్పత్తిని చూపేందుకే ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు స్థిరీకరణను సైతం సమ్మక్క ప్రాజెక్టు ఖాతాలో ప్రభుత్వం వేయగా కేంద్ర జల సంఘం పరిశీలనలో దొరికిపోయింది. సమ్మక్క బరాజ్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోసిన నీటిని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించాలంటే కొత్తగా 2 లక్షల ఎకరాల ప్రత్యేక ఆయకట్టును ప్రతిపాదించడంతోపాటు ఛత్తీస్గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. ముంపు ముప్పుపై ఐఐటీ–ఖరగ్పూర్ ద్వారా సర్వే..ఛత్తీస్గఢ్ అభ్యంతరాలను పరిష్కరించి ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చి సమర్పించాలని సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు సూచించింది. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 6–9 మధ్య సమ్మక్క బరాజ్ను ఛత్తీస్గఢ్ అధికారులు పరిశీలించారు. సర్వే ద్వారా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు.బరాజ్ వల్ల కలిగే ముప్పుపై ఐఐటీ ఖరగ్పూర్తో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయించగా బరాజ్ వద్ద 87 మీటర్ల గరిష్ట వరద సంభవిస్తే బీజాపూర్ జిల్లాలోని పోటూరు, కౌటూరు, తుగ్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. తక్కువ ముంపు ఉండనుందని తేలడంతో ఛత్తీస్గఢ్ నిరభ్యంతర పత్రం ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. ఛత్తీస్గఢ్ ససేమిరా అనడంతో...ములుగు జిల్లాలో గోదావరిపై తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ బరాజ్లో పూర్తిస్థాయి నిల్వ మట్టం 83 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్కు పలుమార్లు తెలిపింది. అయితే 2022 జూలై 17, 19వ తేదీల్లో వచ్చిన 88 మీటర్ల గరిష్ట వరదను ప్రామాణికంగా తీసుకొని ఆ మేరకు వరద వస్తే ముంపునకు గురికానున్న భూములన్నింటికీ పరిహారం చెల్లించాలని ఛత్తీస్గఢ్ డిమాండ్ చేస్తోంది. 2021 సెప్టెంబర్లో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి డీపీఆర్ దాఖలు చేసింది. దీంతో దీనిపై అభ్యంతరాలు/అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ సీడబ్ల్యూసీ ఆ డీపీఆర్ను ఛత్తీస్గఢ్ పరిశీలనకు పంపింది. ఫలితంగాసీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్లు అనుమతులిచ్చినా ఛత్తీస్గఢ్ అభ్యంతరాలతో డీపీఆర్ ముందుకు కదల్లేదు. -
జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయం పురోగతి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనరల్ సర్వీస్ గూడ్స్ (జీఎస్టీ) శ్లాబులను ఈనెల 22వ తేదీ నుంచి తగ్గించనున్న నేపథ్యంలో వ్యవసాయరంగం పురోగతికి మార్గం సుగమం అవుతోంది. వ్యవసాయ పరికరాల ధరలు భారీగా తగ్గడం రైతులకు మేలు చేకూర్చేది అయితే.. అదే సమయంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు శ్వేతవిప్లవానికి మరింత ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే పలు పరికరాలపై జీఎస్టీ తగ్గింపు అనుకూలంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ రకాల పరికరాల వినియోగంలో రూ. 5 వేల నుంచి దాదాపు రూ. 1.90 లక్షలు రైతులకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరికరాల తగ్గింపు ఒకటైతే.. రైతులు విక్రయించే పాలతో చేసే ఉత్పత్తులపై కూడా జీఎస్టీ తగ్గింపు వల్ల వీటి వినియోగం పెరగడం, దీని వల్ల ఉత్పత్తులు పెరిగి రైతులకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 10 కోట్ల మంది పాల ఉత్పత్తిదారులకు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది, పాలు, పన్నీర్పై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో పాల ఉత్పత్తిదారులతోపాటు, వినియోగదారులకు కూడా మేలు జరుగనుంది. సహకార సంఘాలు, ఆహారాలను శుద్ధిచేసే పరిశ్రమలు తయారుచేసే చీజ్, పాస్తా, నమ్కీన్, జామ్స్, జెల్లీ, ఫ్రూట్ పల్ప్, ఆహార పానీయాలపై కొత్త జీఎస్టీ విధానంలో ఐదు శాతానికి తగ్గించనున్నారు. ఈ ధరను తగ్గించడం వల్ల కుటుంబంపై నెలసరి భారం కొంతమేరకు తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 1,800 సీసీ ఉండే ట్రాక్టర్లు, అలాగే రైతులు వినియోగించే అమ్మోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్లపై కూడా జీఎస్టీ తగ్గిస్తున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును ఐదు శాతానికి తగ్గించడం వల్ల రైతులపై భారం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయానికి ఆలంబనగా ఉంటుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి ఈ తగ్గింపు కారణంగా ప్రయోజనం చేకూరనుంది. డెయిరీ రంగంలో రైతులు, మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. రైతులు వినియోగించే కొన్ని పరికరాల ధరలు ప్రస్తుతం జీఎస్టీ తగ్గింపు వల్ల ఏ మేరకు తగ్గుతాయో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరలు తగ్గేవాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. -
పదోన్నతి అర్హతలుంటేనే ఇంక్రిమెంట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్ల(డీఎల్స్)కు వేతన ప్రోత్సాహకాల విడుదలకు అధికారులు విచిత్ర నిబంధనలు తీసుకువచ్చారు. పదోన్నతి పొందేందుకు ఉండాల్సిన అర్హతలుంటేనే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఇంక్రిమెంట్ ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ నిబంధన కేవలం 2019 ఆగస్టులో నియమితులైన వారికి మాత్రమే వర్తింపజేస్తున్నట్లు పైఅధికారులు సమాచారం ఇవ్వడంతో వారినుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2017 జూలై నోటిఫికేషన్ ద్వారా నియమితులై 2019 మార్చిలో విధుల్లో చేరిన బ్యాచ్కు ఇంక్రిమెంట్లు విడుదల చేసిన సొసైటీ అధికారులు... 2018 ఆగస్టులో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 2019 ఆగస్టులో విధుల్లో చేరిన వారికి మాత్రం కొత్త నిబంధనలు వర్తింపచేయడం గమనార్హం. గురుకుల విద్యా సంస్థల్లో డిగ్రీ లెక్చరర్లుగా ఎంపికైన వారిని నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్), స్లెట్(స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్) లేదా పీహెచ్డీల్లో ఏదేని ఒకటి అర్హత సాధించడంతో పాటు డిపార్ట్మెంటల్ టెస్ట్ తప్పకుండా పాసవ్వాలి. అలాంటి వారికి పోస్టుల లభ్యత ఆధారంగా పదోన్నతి ఇస్తారు. వీటిలో అర్హత లేనప్పుడు పదోన్నతికి అవకాశం ఉండదు. కానీ తాజాగా తీసుకొచ్చిన నిబంధనతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేమని ప్రిన్స్పల్స్ చెబుతుండటంతో పలువురు డిగ్రీ లెక్చరర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. లిఖితపూర్వక ఆదేశాలు లేవు...డిగ్రీ లెక్చరర్లకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలతో కూడిన ఆదేశాలేవీ సొసైటీ కార్యాలయం నుంచి లిఖితపూర్వకంగా వెలువడలేదు. కేవలం రాష్ట్ర కార్యాలయంలోని ఓ అధికారి చెప్పిన మౌఖిక ఆదేశాలతో వీటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. -
రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శివారులో కొంతకాలంగా భారీ స్థాయిలో సాగుతున్న డ్రగ్స్ తయారీ రాకెట్ గుట్టురట్టయింది. రసాయన కర్మాగారం మాటున డ్రగ్ మాఫియా నడుపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైం బ్రాంచి పోలీసుశాఖ మెరుపుదాడి చేసింది. ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుంది. చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయ కాలనీలో ఉన్న వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం సోదాలు చేపట్టి 5.968 కిలోల నిషేధిత మెఫిడ్రోన్ (ఎండీ) మాదకద్రవ్యంతోపాటు 35,500 లీటర్ల ఇతర రసాయనాలు, 19 పెట్టెల్లోని 950 కిలోల మిౖథెలిన్ డైక్లోరైడ్ (ఎండీసీ) పొడి, ఎండీ తయారీకి వాడే ఇతర రసాయనాలను పట్టుకుంది. అలాగే వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ వోలేటి, అతనితో కలిసి పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పటా్వరీలను అరెస్టు చేసింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన మిరా–భయందర్, వసాయ్–విరార్ (ఎంబీవీవీ) పోలీసు కమిషనరేట్ సీపీ నికేత్ కౌషిక్ శనివారం స్థానిక మీడియాకు వెల్లడించారు. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరితో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒక బంగ్లాదేశీ యువతి సైతం ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 27 మొబైల్ ఫోన్లు, మూడు కార్లు, ఒక టూవీలర్ స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ నెట్వర్క్కు, అంతర్జాతీ యంగా డ్రగ్ నెట్వర్క్లకు సైతం హైదరాబాద్ శివారులో తయారయ్యే ఎండీ డ్రగ్ సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో లింకులతో..హైదరాబాద్లో వెలుగులోకి.. ఈ కేసును థానే జిల్లాలోని ఎంబీవీవీ పోలీసులు చిన్న లింక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మిరా రోడ్ ఈస్ట్లోని నివసించే బంగ్లాదేశీ యువతి ఫాతిమా మురాద్õÙక్ అలియాస్ మొల్లా (23) మెఫిడ్రోన్ (ఎండీ) డ్రగ్ను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 8న కాశీమిరా బస్టాప్ దగ్గర ఫాతిమాను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి 105 గ్రాముల ఎండీ డ్రగ్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ను తాను హైదరాబాద్ నుంచి కొన్నట్లు నిందితురాలు పేర్కొనడంతో ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ నెట్వర్క్లోని మరో 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న అక్కడి పోలీసులు.. హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారవుతున్నట్లు నిర్ధారణకు వచ్చి ఆపరేషన్ చేపట్టారు. కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ తయారీ దందా.. భారీగా డ్రగ్స్ తయారీ దందాకు తెరతీసిన శ్రీనివాస్ విజయ్ వోలేటికి రెండు కంపెనీలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాటిల్లో వాగ్దేవి ల్యాబ్ను నవోదయ కాలనీలో 2020లో ప్రారంభించారు. కోవిడ్ సంబంధిత మందులు ఇందులో తయారవుతున్నాయి. అలాగే 2015లో నాచారంలో వాగ్దేవి ఇన్నోసైన్స్ పేరిట ఆర్ అండ్ డీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ పేరిట బయటికి చూపుతూ లోపల డగ్స్ తయారీ దందాకు నిర్వాహకులు తెరతీసినట్లు తెలిసింది. కట్టెల లోడ్ వాహనాల్లో.. కట్టెల లోడ్ వాహనాల్లో ముడి సరుకుతోపాటు తయారు చేసిన డ్రగ్స్ను శ్రీనివాస్ విజయ్ వోలేటి తరలించే వాడని సమాచారం. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం గోడౌన్ కోసమని చర్లపల్లి, నవోదయనగర్ ప్లాట్ యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకొని వాగ్దేవి ల్యాబ్ను ప్రారంభించారు. కంపెనీలో ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మినహా మరెవరు కనిపించే వారు కాదని.. ఉదయమంతా గేటు మూసేసి ఉండేదని చుట్టుపక్కల కంపెనీల వారు పేర్కొన్నారు. రాత్రిళ్లు డ్రమ్ముల్లో రసాయనాలు, కట్టెల లోడ్ల వాహనాలు వచ్చేవని చెప్పారు. అప్పుడప్పుడూ ఘాటైన వాసనలు వచ్చినా రసాయన సంస్థలో ఇది మామూలే కదా అనుకునేవారమని చెప్పుకొచ్చారు. కాగా, స్థల యజమానికి ఏడాదిగా అద్దె కూడా చెల్లించట్లేదని తెలిసింది. -
‘స్థానికం’పై కాంగ్రెస్లో తండ్లాట
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఎన్నికలకు వెళ్లాలో, వద్దో అర్థం కాని పరిస్థితుల్లో అధికార పార్టీకి చిక్కుకుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించి రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్, గవర్నర్ వద్ద ఉన్న బిల్లుల భవితవ్యం ఎటూ తేలకపోవటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అధికార పార్టీ పడిపోయింది. ఒక దశలో వెంటనే ఎన్నికలకు వెళ్లాలని భావించినా.. తర్వాత ప్రభుత్వం మనసు మార్చుకుంది.గవర్నర్లు, రాష్ట్రపతి వద్దకు వెళ్లే బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు విచారణ తేలేవరకు వేచి ఉందామని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తే తమ ఆర్డినెన్స్ చట్టం అవుతుందని, అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత చేకూరుతుందనే ఆలోచనకు వచ్చింది. దీంతో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), మంత్రివర్గ సమావేశం, పార్టీ అంతర్గత భేటీలు, సీఎం, పీసీసీ చీఫ్, ఇతర సీనియర్ మంత్రుల సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికలకు మరికొంత సమయం వేచి ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.కిందిస్థాయిలో గందరగోళంరాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల ఆలోచన, నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకత్వాన్ని గందరగోళంలోకి నెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లడమేనన్న సంకేతాలు పార్టీ నుంచి వస్తుండగా, ఉన్నట్టుండి ఎన్నికలు వాయిదా పడతాయనే సమాచారంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో స్థానికంగా వస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో ఓ టైమ్లైన్ ఏర్పాటు చేసుకుని వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు.రేపు కార్యవర్గ సమావేశంస్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారి అభిప్రాయాలు సేకరించేందుకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీభవన్లో సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కాను న్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్చార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర నాయకులకు ఈ సమావేశానికి రావాలని ఇప్పటి కే సమాచారం అందింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ కమిటీలు, జైబాపూ–జైభీం–జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
సీఎం రేవంత్ సడన్ ఎంట్రీ.. ట్యాంక్బండ్పై ప్రత్యక్షం
హైదరాబాద్: ఒకవైపు నగరంలో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్న వేళ.. సీఎం రేవంత్రెడ్డి ఉన్న పళంగా ట్యాంక్ బండ్ను సందర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎటువంటి ఆర్భాటం లేకుండా ట్యాంక్ బండ్కు వచ్చారు. పూర్తిస్థాయి భద్రత లేకుండా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు సీఎం రేవంత్. అసలు నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా వచ్చి పరిశీలించారు. అక్కడకు వచ్చిన భక్తులతో సీఎం రేవంత్ మాట్లాడారు. గణేష్ నిమజ్జనంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయో అని అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. -
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయ్యింది. 30 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో తయారు చేస్తున్న డ్రగ్స్ను దేశ, విదేశాలను సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న13 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, ఎక్స్టీసీ మోలీ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.32 వేల లీటర్ల రా మెటీరియల్ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహారాష్ట్ర పోలీసులకు విదేశీయుడు పట్టుబడ్డాడు. విదేశీయుడు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీయుడి నుంచి రూ.25 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్లో క్రైమ్ బ్రాంచ్ దాడులు చేసింది. వెయ్యి కిలోల కెమికల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్లు, మాన్యుఫాక్చరర్లు , డిస్ట్రిబ్యూటర్లు కలిసిన భారీ నెట్వర్క్ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు. -
వెస్ట్ హైదరాబాద్ తప్ప అంతా ‘అందుబాటు’లోనే..
గ్రేటర్లో సామాన్యుల సొంతింటి కల రోజురోజుకూ దూరమవుతున్న నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు వాటిని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి, కార్మికుల వ్యయాల భారమవడం వంటి పలు కారణాలతో నగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికీ పశ్చిమ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలను నిర్మిస్తున్నాయి. తక్కువ ధర అనో, ప్రీలాంచ్లోనో కొనుగోలు చేసి మోసపోకుండా.. కాస్త జాగ్రత్త వహిస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. -సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్ రూములు, కిచెన్, హాల్, టాయిలెట్స్తో 700–800 చ.అ. విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్కు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో హైదరాబాద్లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లకు గిరాకీ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగానే ఉన్నారు. వీరు తమ సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే సొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి కాన్సెప్ట్. దీంతో రూ.60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలకు డిమాండ్ పెరిగింది.బిల్డర్లలో ధరల పోటీ.. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే గృహాల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో రూ.కోట్లు వెచ్చిస్తేగానీ సొంతింటి కల సాకారం కాని పరిస్థితి. మాదాపూర్, నార్సింగి, నానక్రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.60 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి.ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే.. ఇబ్రహీంపట్నం, నాగార్జున్సాగర్ రోడ్, హయత్నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.కొనే ముందు వీటిని పరిశీలించాలిజీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందో లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం బెటర్. -
టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగ కోఆర్డినేటర్గా శశాంక్
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తమ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగంలో కీలక నియామకం చేపట్టింది. ఈ విభాగానికి కోఆర్డినేటర్గా శశాంక్ పసుపులేటి ని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ నియామకాన్ని ధృవీకరిస్తూ టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగం ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఒక లేఖను విడుదల చేశారు. శశాంక్ నియామకంతో న్యాయం, పారదర్శకత, బాధ్యతా సూత్రాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ దృష్టిని ముందుకు తీసుకువెళ్లడంలో శశాంక్ గారి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.శశాంక్ పసుపులేటి మాట్లాడుతూ, మహిళల భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, ఆర్టీఐ అవగాహన పెంపొందించడం కోసం తాను కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ కోట నీలిమ, పొన్నం అశోక్ గౌడ్ తమకు సరైన మార్గదర్శనం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పొన్నం అశోక్ గౌడ్ కూడా శశాంక్ను అంకితభావం కలిగిన యువ నాయకుడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను యువతకు చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ప్రశంసించారు. ఈ నియామకం టీపీసీసీ లీగల్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కన్నుల పండుగగా మహాగణపతి నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. ట్యాంక్ బంక్లో క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనం అయ్యింది. ఈ నిమజ్జనం సందర్భంగా మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఇక, శనివారం ఉదయం ఏడు గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో నిమజ్జనం జరిగింది. -
మెరిసేవన్నీ ఇటాలియన్ మార్బుల్స్ కావు..
అందమైన సొంతింటి కల.. కల కాకూడదంటే ఇంటి నిర్మాణ సమయంలో మనం వేసే అడుగులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఇంటి అందాన్ని తళుక్కుమనిపించే ఇటాలియన్ మార్బుల్స్ విషయంలో తప్పటడుగులు వేసి నిట్టూర్చే కన్నా దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ అందమైన ఇల్లు జిగేల్మంటూ మెరిసిపోవడం ఖాయం. – శంషాబాద్ విదేశీ మార్బుల్ దిగుమతిలో ప్రథమస్థానం ఇటలీ నుంచి వచ్చే ఇటాలియన్ మార్బుల్దే.. ప్రస్తుతం మార్కెట్లో అనేక దేశాల మార్బుల్స్ను ఇటాలియన్ పేరుతో విక్రయిస్తున్నారు. అందుకే ఇటాలియన్లో ఉన్న ప్రధాన రకాల గుర్తించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నవి సత్వారియో ఇందులో(తెలుపు, గ్రే), కరారా, వెనటినో, గ్రేవిలియం వీటితో పాటు పాత రకాలైన డైనా, పర్లాటో, బోటోచినోతో పాటు ఔట్సైడ్ ఎలివేషన్కు మాత్రమే ఉపయోగపడే ట్రావెటైన్ రకాలున్నాయి. నాణ్యత గుర్తించడం ఎలా..? ఇంటికి కచ్చితంగా ప్రీమియం బ్రాండ్ ఎంచుకోవడమే ఉత్తమం.. ప్రీమియం బ్రాండ్లో కొనుగోలు చేసే ముందు తీసుకునే మార్బుల్ కచ్చితంగా స్క్వార్ ఆకారంలోనే ఉండాలి. అంతేకాకుండా 18ఎంఎం–20ఎంఎం మందం ఉండాలి. రాయికి నాలుగు వైపులా వ్యాకూమ్ చేసిన దాన్ని ఎంచుకోవాలి. రాయి ప్రాసెస్లో రెగ్జిన్తో చేసిందా లేదా అపాక్సితో చేసిందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. సాఫ్ట్ రాయి కంటే హార్డ్ ఉన్న రాయినే ఎంచుకోవాలి. రాయిలో కెమికల్ ఫిల్లింగ్ ఉంటే కచ్చితంగా తక్కువ క్వాలిటీదిగా గుర్తించాలి. ఇటాలియన్ మార్బుల్స్లో కనిష్టంగా రూ.300 ఫీట్ మొదలుకొని గరిష్టంగా రూ.5 వేల వరకు హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటీగా ఉన్నవి ఇవే.. మార్కెట్లో ఇటాలియన్తో సమానంగా స్పెయిన్ మార్బుల్స్ పోటీలో ఉన్నాయి. ఇందులో బెల్లాచినో, హర్మానివైట్, గ్రేకార్నికో, స్పానిషన్బెజ్, స్పానిష్ బ్రౌన్, పోర్చుగల్కు చెందిన మెకలాంజిలో మార్బుల్స్ అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రీస్కు చెందిన ఒలకాస్, గోర్టెన్ ఇన్స్పైడర్, థాసోస్వైట్ కూడా ఉన్నాయి. వియత్నాంకు చెందిన వైట్ మార్బుల్స్ కూడా ప్రత్యేకంగా పూజ గదులకు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక బ్రెజిల్కు చెందిన క్వార్టజైట్ రాళ్లు టేబుల్ టాప్, కిచెన్, క్లాడింగ్, ఎలివేషన్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. వీటితో పాటు మార్కెట్లో ఇరాన్, ఇరాక్, తునేషియా సంబంధిత దేశాల మార్బుల్స్ కూడా ఉన్నాయి.చైనా.. టర్కీ.. చైనా వివిధ దేశాల మార్బుల్స్ను దిగుమతి చేసుకుని తిరిగి ప్రాసెస్ చేసి విక్రయించే రకాలు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఇందులో ప్రీమియంతో పాటు మీడియం క్వాలిటీ రకాలు కూడా ఉన్నాయి. టర్కీ నుంచి వచ్చే మార్బుల్స్ కొంత తక్కువ నాణ్యతతో ఉంటున్నాయి. క్రాక్ ఫిల్లింగ్, అధికంగా కెమికల్ ప్రాసెస్ చేసిన మార్బుల్స్ ఉంటాయి. వీటి రీ పాలిష్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో.. సొంతింటిలో మీ అడుగులు అందమైన మార్బుల్స్పై వేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.. ఆల్ ది బెస్ట్..! -
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, శ్రీశైలం దర్శనం కోసం వెళ్లి అనంతరం తిరిగి వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
బియ్యం సరే.. సంచి ఏది?
హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల తర్వాత ఈ నెల కోటా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం లబ్ధిదారుకు బియ్యంతోపాటు సంచి ఇవ్వాలని నిర్ణయించింది. సరిపడా సంచులు జిల్లాకు సరఫరా చేసింది. అయితే సన్నబియ్యం పంపిణీ ప్రారంభమై ఐదురోజులైనా ఎక్కడా సంచులు పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు ఇంటి నుంచి తెచ్చుకు న్న సంచుల్లోనే బియ్యం తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల సంచి కోసం డీలర్లను ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీని సంప్రదించగా సంచుల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. -
గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక వర్క్ స్పేస్
సాక్షి, సిటీబ్యూరో: గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగులకు నిర్మాణ సంస్థలు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నాయి. కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇప్పటికీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.అయితే ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ను ఆఫీస్ కోసం వినియోగిస్తే గృహ కొనుగోలుదారులు ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వచ్చినప్పుడు హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇబ్బందికరంగా ఉంటోందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీల్లోని క్లబ్హౌస్ల్లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంచుతున్నాయి.హై నెట్వర్క్ స్పీడ్తో వైఫై సేవలను అందిస్తున్నాయి. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయాల్లో వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులందరూ ఒకేచోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ అర్బన్ జంగిల్గా మారిపోతుంది. దీంతో ఆ ఉద్యోగులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర వరకూ పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగు మందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతుంది. దీంతో సేంద్రియ, సస్టయినబుల్ గార్డెనింగ్కు ఆదరణ పెరుగుతోంది. సువాసన, అకర్షణీయమైన పువ్వుల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వేలు, డెక్లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్తో బార్బిక్యూ వంటి ఔట్డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది. -
కారు నెమ్మదిగా నడపమన్నందుకు ఇంటిపై దాడి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కారు నెమ్మదిగా నడపమని చెప్పినందుకు ఇంటిపై దాడిచేసిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రం ఇందిరానగర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్ ప్రాంతంలో రోడ్డుపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అధే కాలనీకి చెందిన ఒక యువకుడు కారును వేగంగా నడుపుతూ మండపాన్ని ఢీకొట్టాడు. అక్కడున్న వారు నెమ్మదిగా కారు నడపాలని చిన్న పిల్లలు రోడ్డుపై తిరుగుతుంటారని అతడిపై మండిపడ్డారు. కోపోద్రుక్తుడైన సదరు యువకుడు మరో 20 మంది యువకులను వెంట తీసుకువచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందర చేయడమే కాకుండా అడ్డువచ్చిన మహిళలపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలసుకున్న ఎస్సై ఉపేంద్ర చారి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. 35లక్షలకు ఎవరు కొన్నారంటే?
సాక్షి, బాలాపూర్: బాలాపూర్ లడ్డూకు మరోసారి రికార్డు స్థాయిలో వేలం జరిగింది. ఈ ఏడాది గణేషుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలు పలికింది. ఈరోజు జరిగిన వేలంలో లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం పోటాపోటీగా వేలం జరిగింది. ఈ ఏడాది వేలంలో 38 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇక, ఈసారి వేలంలో లడ్డూ రూ.35 లక్షలు పలికింది. బాలాపూర్ గణేశ్ లడ్డూను కర్మన్ఘాట్కు చెందిన లింగాల దశరథగౌడ్ దక్కించుకున్నారు. అనంతరం, లడ్డూ విజేత లింగాల దశరథగౌడ్ను ఉత్సవ కమిటీ సన్మానించింది. గతేడాది కంటే రూ.4.99 లక్షల ధర అధికంగా పలికింది. ఈ సందర్భంగా దశరథ్ గౌడ్ మాట్లాడుతూ.. లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా చాలా ఉంది. గత ఐదేళ్లుగా లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. 31 ఏళ్లుగా బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట జరుగుతోంది. 1994 నుంచి బాలాపూర్లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాటగతేడాది రికార్డుస్థాయిలో 30.01 లక్షలు ధర పలికింది. 2023లో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ2022లో రూ.24.60 లక్షలు పలికిన లడ్డ2021లో రూ. 18.90 లక్షలు, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ2016లో రూ. 14. 65 లక్షలు, 2017లో రూ. 15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట The highly popular auction which attracts nationwide attention, ''Balapur Ganesh Laddu'' was auctioned at an all-time record of Rs 35 Lakh in an open auction held on Saturday, highest in the last 30 years. The 21-kg famed laddu was bagged by Lingala Dasrath Goud of Karmanghat,… pic.twitter.com/rwz9GxysFm— Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2025 -
చిటికేసినంత సులువుగా ఇల్లు కొనేస్తున్నారు..
సాధారణంగా ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు.. ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత సలువుగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది. –సాక్షి, సిటీబ్యూరోఆర్థికంగా సన్నద్ధమయ్యాకే.. మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కరోనా మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వసతులకే ప్రాధాన్యం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువ సమయం అంటే కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.కోటి –3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు 30 రోజులు సమయం తీసుకుంటున్నారు. -
తేజస్ విమానానికి హైదరాబాదీ కంపెనీ దన్ను!
సాక్షి, హైదరాబాద్: భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ విమానాలను పెద్దస్థాయిలో తయారు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాదీ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ ఇందుకు దన్నుగా నిలుస్తోంది. తేజస్ విమానంలో అత్యంత కీలకమైన సెంట్రల్ ఫ్యూసలాజ్ను ఈ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల క్రితమే తొలి ఫ్యూసలాజ్ను తేజస్ను నిర్మిస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అందించిన వెమ్ టెక్నాలజీస్ శుక్రవారం రెండో యూనిట్ డెలివిరిని పూర్తి చేసింది. అంతేకాదు.. ఆరు నెలల్లోపు మరో మూడు ఫ్యూసలాజ్లను సిద్ధం చేసి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఈ పరిణామం ఎంతో కీలకమైంది. యుద్ధ విమానంలో సెంట్రల్ ఫ్యూసలాజ్ అనేది చాలా కీలకమైన భాగం. తేజస్ మార్క్1ఏలోని ఫ్యూసలాజ్ సుమారు 478 కిలోల బరువు ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో తయారు చేసిన సుమారు 1560 విడిభాగాలతో ఈ ఫ్యూసలాజ్ తయారవుతుంది. యుద్ధ విమానాన్ని నడిపైవారు కూర్చునే కాక్పిట్, విమానపు రెక్కలు, తోకలన్నింటిని కలిపే ఈ ఫ్యూసలాజ్లోనే ల్యాండింగ్ గేర్, ఫ్యూయెల్ ట్యాంక్లు ఉంటాయి.వెమ్ టెక్నాలజీస్కు చెందిన సుమారు 122 మంది ఇంజినీర్లు కొన్ని నెలలపాటు శ్రమించి ఈ ఫ్యూసలాజ్ను తయారు చేశారు ప్రతిదశలోనూ రక్షణ రంగం ప్రమాణాలకు అనుగుణంగా పనిచేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో వెమ్ టెక్నాలజీస్ ఈ సాధనకు ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రక్షణ రంగానికి సంబంధించిన సంక్లిష్టమైన ప్రాజెక్టులను కూడా ప్రైవేట్ రంగం సమర్థంగా చేపట్టగలదని వెమ్ టెక్నాలజీస్ నిరూపిస్తోందని విశ్లేషకుల అంచనా.భారతదేశం పూర్తిగా దేశీయంగా సిద్ధం చేస్తున్న తేజస్ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ నాశిక్లోని ఫ్యాక్టరీలో తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సెంట్రల్ ఫ్యూసలాజ్ల డెలివరీని పూర్తి చేసిన వెమ్ టెక్నాలజీస్ వచ్చే ఏడాది మార్చిలోగా మరో మూడింటిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తేజస్ సెంట్రల్ ఫ్యూసలాజ్తోపాటు వెమ్ టెక్నాలజీస్ అత్యాధునిక మధ్యమశ్రేణి యుద్ధ విమానం (ఏఎంసీఏ) భాగాలను కూడా తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశీ క్షిపణులు, రాకెట్లు, లాంచర్ల తయారీకి సిద్ధమవుతోంది. -
సిటీ పోలీసులోకి ‘లాడెన్ జాగిలాలు’
సాక్షి, సిటీబ్యూరో: పాకిస్థాన్లోని అబోటాబాద్లో దాక్కున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటం కోసం అమెరికన్ నేవీ సీల్స్ 2011లో వినియోగించిన బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు నగర పోలీసు విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. సిటీ పోలీసులు కొత్తగా ఖరీదు చేసిన 12 జాగిలాల పిల్లల్లో ఆరు బెల్జియం మలినాయిస్ జాతివే ఉన్నాయి. దేశంలోనే ఈ తరహా జాగిలాలను నేరుగా ఎంపిక చేసి, అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి పోలీసు విభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ కావడం గమనార్హం. పోలీసు విభాగం సుదీర్ఘకాలం జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ తదితర జాతి జాగిలాలకు శిక్షణ ఇచ్చి వినియోగించింది. అయితే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆరీ్పఎఫ్) కొన్నేళ్ల క్రితం 300 బెల్జియం మలినాయిస్ జాగిలాలను ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించింది. 2015లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన ఆక్టోపస్లో వినియోగించడానికి ప్రయోగాత్మకంగా మూడు (రెండు మగ, ఒక ఆడ) బెల్జియం మలినాయిస్ జాగిలాలను ఖరీదు చేశారు. వీటి పనితీరును అధ్యయనం చేసిన నగర పోలీసు అధికారులతో కూడిన కమిటీ సర్వకాల సర్వావస్థల్లోనూ విసుకు, విరామం లేకుండా ఏకధాటిగా పని చేయడం, పౌరుషం తదితర లక్షణాలను పరిగణలోకి తీసుకుంది. దశల వారీగా నగర పోలీసు విభాగంలో బెల్జియం మలినాయిస్, బీగల్ జాతి జాగిలాల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్జియం మలినాయిస్ జాతి జాగిలం గరిష్టంగా 12 ఏళ్లు జీవిస్తుంది. ఇది 22 నుంచి 26 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంది. 20 నుంచి 30 కేజీల బరువు కలిగి ఉంటుంది. పౌరుషం, సంగ్రహణ శక్తుల్లో ఉత్తమమైన వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా తేలిక.త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తాంగోషామహల్లోని పోలీసుస్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకోగా మిగిలిన 11.5 ఎకరాల్లో త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నాం. వీటిలో ఓపక్క అశ్వకదళం (మౌంటెడ్ పోలీసు) కోసం స్టేబుల్స్, మరోపక్క జాగిలాల కోసం కెన్నెల్ నిరి్మంచనున్నాం. ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో ఉన్న 50 గుర్రాల్లో మూడు తప్ప మిలినవి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. కీలక సందర్భాల్లో క్రౌడ్కంట్రోల్కు ఇవి అత్యంత కీలకం. 2003లో నేను సెంట్రల్ జోన్ డీసీపీగా ఉండగా చేప ప్రసాదం పంపిణీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో తొక్కిసలాట వరకు విషయం వెళ్లినా... అక్కడ ఉన్న మౌంటెడ్ పోలీసు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. – సీవీ ఆనంద్, నగర కొత్వాల్ -
మహాగణపతి నిమజ్జనానికి..
ఖైరతాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనానికి పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకే దర్శనాలు నిలిపివేయడంతో శుక్రవారం ఉదయం నుంచే షెడ్డు తొలగించే పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాగణపతి దర్శనం సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులను ఆపివేశారు. ఆ తరువాత షెడ్డు తొలగించే పనులు ప్రారంభించారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల దాటగానే అనంత చతుర్ధశిలో కలశాన్ని కదిలించి, ఆ తరువాత మహాగణపతిని వాహనంపైకి ఎక్కిస్తా రు. ఇరువైపులా ఉన్న విగ్రహాలను కూడా మరో వా హనంపై ఉంచి శనివారం ఉదయం 6.30 గంటలకు శోభాయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం 1.30 కల్లా నిమజ్జనం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. మహాగణపతి కోసం భారీ వాహనం.. 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న మహాగణపతిని సాగర తీరానికి తీసుకెళ్లేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన భారీ ట్రాయిలర్ వాహనం సిద్ధం చేశారు. 75 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 26 టైర్లు ఉన్న వాహనం బరువు 28 టన్నులు. ఈ వాహనం 100 టన్నుల బరువును మోస్తుంది. రథసార«థి మందాటి వెంకట్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని సాగర తీరానికి చేర్చేందుకు రథసారధిగా ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లాకు చెందిన మందాటి వెంకట్రెడ్డి వచ్చాడు. గతంలో వెంకట్రెడ్డి 2015, 2017, 2022లో మహాగణపతిని నిమజ్జనానికి నిర్విఘ్నంగా తరలించాడు. ఈ సంవత్సరం మరోసారి ఆయనకు అవకాశం దక్కింది. రూట్ మ్యాప్ ఖైరతాబాద్ నుంచి మొదలై రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి ప్లై ఓవర్, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వరకు చేరుకుంటుంది. మహాగణపతిని ఖైరతాబాద్ మంటపం వద్ద అత్యాధునిక సాకేంతిక పరిజ్ఞానంతో రూపొందిన క్రేన్ సాయంతో వాహనంపైకి తరలిస్తారు. నిమజ్జన సమయంలో హైడ్రాలిక్ భారీ సూపర్ క్రేన్ సాయంతో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సొంత వాహనాలొద్దు... హుస్సేన్సాగర్ వద్ద సామూహిక నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులు సొంత వాహనాల్లో కాకుండా సిటీ బస్సులు, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ వంటి ప్రజారవాణా వ్యవస్థల్ని వినియోగించాలి. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. బాలాపూర్ నుంచి చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా హుస్సేన్సాగర్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ మార్గంలో ఇటు నుంచి అటు వెళ్లడానికి కేవలం రాజేష్ మెడికల్ హాల్, బషీర్బాగ్ చౌరస్తాల వద్దే అవకాశం ఉంది. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన వాళ్లు ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్ వే వాడుకోవాలి. ట్రాఫిక్కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 8712660600, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. – జోయల్ డెవిస్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
అర్ధరాత్రి వరకు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు
నిమజ్జన ఘట్టం సందర్భంగా ఆరీ్టసీ, రైల్వే, మెట్రో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధర్రాతి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు .. సికింద్రాబాద్–నాంపల్లి, లింగంపల్లి –సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్నుమా, నాంపల్లి–ఫలక్నుమా స్టేషన్ల మధ్య శనివారం అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.