breaking news
Hyderabad
-
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్ప్లస్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు . -
కోల్కత్తా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో కోల్కత్తా స్టేడియంలో జరిగిన పరిస్థితుల దృష్టా ఉప్పల్ స్టేడియంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్చలు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో, ఉప్పల్ స్టేడియం వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది.కోల్కత్తా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తం.కోల్కత్తా ఘటన కారణంగా ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాల మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. మెస్సీ పర్యటన దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. జెడ్ కేటగిరి భద్రతతో పాటు ప్రత్యేక బలగాల మోహరించినట్టు చెప్పారు. కాగా, 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మరోవైపు.. మెస్సీ వస్తున్న నేపథ్యంలో ఫలక్నామా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు.. మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో కోల్కత్తా స్టేడియంకు వచ్చిన మెస్సీ.. అలా వచ్చి.. ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తంచేశారు. దీంతో, కోల్కత్తాలోని స్టేడియంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. Kolkata, West Bengal: Angry fans vandalise the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the eventA fan of star footballer Lionel Messi said, "Absolutely terrible event. He came for just 10 minutes. All the leaders and ministers surrounded him. We couldn't see… pic.twitter.com/a3RsbEFmTi— ANI (@ANI) December 13, 2025 #WATCH | Kolkata, West Bengal: Angry fans resort to vandalism at the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the event. Star footballer Lionel Messi has left the Salt Lake Stadium in Kolkata. A fan of star footballer Lionel Messi said, "Absolutely terrible… pic.twitter.com/TOf2KYeFt9— ANI (@ANI) December 13, 2025 -
మెస్సీతో మేస్త్రీ ఫుట్బాల్.. ఆసుపత్రుల్లో గురుకుల విద్యార్థులు: హరీష్
సాక్షి, కోఠి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్లే సమయం ఉంది కానీ.. గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు.బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ శనివారం ఉదయం విద్యార్థులను పరామర్శించి.. ఫుడ్ పాయిజన్కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో వసతులు, భోజనం కూడా సరిగా లేదు. 90 మంది బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఫుట్బాల్ ఆడటంలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారు. మెస్సీతో మేస్త్రీ ఫుట్బాల్ ఆట కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కబ్జాలు, కమీషన్లకే రేవంత్ రెడ్డి పరిమితం.. పిల్లలను పట్టించుకోవడం లేదు. 61 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. పిల్లలను పరామర్శించరా?. రేవంత్ది విజన్ 2047 కాదు.. పిల్లల పాలిటి పాయిజన్ 2047.మొన్న శామీర్పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మాదాపూర్లో 43 మంది విద్యార్థులు కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని విద్యార్థులు ఉన్నారు. దొడ్డు బియ్యం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఫుట్బాల్ ఆడటంలో రేవంత్ బిజీగా ఉన్నారు. ప్రజల సొమ్ముతో సీఎం సోకులు తీర్చుకుంటున్నారు. కబ్జాలు, కమీషన్లకే టైమ్ సరిపోవడం లేదా?. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు. బాత్ రూమ్లు కడిగే బ్రష్లతో.. వంట సామన్ కడుగుతున్నారట.చలి తీవ్రత పెరిగింది. చల్ల నీళ్లతో అమ్మాయిలు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లలో 116 మంది విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. విద్యా కమిషన్ ఎక్కడికి పోయింది?. పేదల మనసులు చదువుతా అని డైలాగ్స్ కొట్టడం కాదు.. పేద పిల్లల ఆకలి తీర్చండి. రాహుల్ గాంధీ పేదల కోసం రాడు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడు. ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ వస్తారట. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే రాహుల్ ఎందుకు అడగడం లేదు?. కోఠి, నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అడిగి తెలుసుకోవాలని రాహుల్కు విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నారులు.. నేను పోను గురుకుల పాఠశాలకు అన్నట్లుగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాత్రి వరకూ కొనసాగిన విచారణ అనంతరం, రెండో రోజు కూడా కీలక అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్టు సమాచారం.విచారణ పురోగతిని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో, ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలిస్తోంది.గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో, సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. FSL నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా, సింక్ అయిన డేటా వివరాల కోసం యాపిల్, జిమెయిల్ కంపెనీల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రక్రియలో సిట్ ఉంది. క్లౌడ్ సర్వర్లలో ఉన్న డేటా, లాగిన్ వివరాలు, యాక్సెస్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే తన డివైస్ల నుంచి తొలగించింది కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమేనని ప్రభాకర్ రావు వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన వాగ్మూలంలో ఎంతవరకు నిజం ఉందన్నది యాపిల్, జిమెయిల్ సంస్థల నుంచి వచ్చే డేటాతో తేలనుంది.రెండో రోజు విచారణలో పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు?, ఆదేశాలు ఎవరిచ్చారు?, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సమకూర్చే దిశగా సిట్ దర్యాప్తు వేగం పెంచింది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత మంది అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగే అవకాశం ఉంది. -
బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
హైదరాబాద్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమన్నారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ‘ప్రైడ్ ప్లేస్’తో సమస్యల పరిష్కారం: చారుసిన్హా.. ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశామని, సీఐడీ, మహిళా భద్రత విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్ను ఆశ్రయించవచ్చన్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. ట్రాన్స్జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కలి్పంచేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తప్సీర్ ఇకుబాల్, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రత విభాగ డీసీపీ లావన్యనాయక్ జాదవ్, సైబరాబాద డీసీపీ సృజనతో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నేను వస్తున్నానని రోడ్లు వేశారు..
హైదరాబాద్: ఇరవై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే నన్ను తీసి రోడ్డుపై వేశారని.. తాను మొండిదానినని ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ‘జాగృతి జనం బాట’కార్యక్రమం మూడో రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, నాగమయ్యకుంట బస్తీలలో పర్యటించి అనంతరం రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అడిగే వారు ఉంటే ఏ సమస్యకైనా ముందడుగు పడుతుందన్నారు. అందులో భాగంగానే సమస్యలపై నిలదీసేందుకు తాను ముందుకు వచ్చానని తెలిపారు. నేను వస్తున్నానని అంబర్పేటలో రోడ్లు వేశారు.. తెలంగాణ రాకముందు హైదరాబాద్ బస్తీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేరుకు హైదరాబాద్లో ఉన్నామే తప్ప గ్రామాల్లో ఉన్న దానికంటే ఘోర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి అంబర్పేటలో రాత్రికి రాత్రి రోడ్లు వేశారని, యాకత్పురాలో మంచినీటి కాలుష్య సమస్యను పరిష్కరించారని చెప్పుకోచ్చారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచి్చన ఏ హామీని పరిష్కరించలేదన్నారు. అంతకు ముందు బోనాలతో, గుర్రపు బగ్గీలతో కవితకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహేందర్, శివారెడ్డి, మనోజ్గౌడ్, డేవిడ్, మీనా తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలి కాచిగూడ: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనం భాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ముసారాంబగ్ బ్రిడ్జి పనులపై ఆరా..అంబర్పేట: అంబర్పేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జనంబాట కార్యక్రమంలో శుక్రవారం అంబర్పేట నియోజకవర్గంలో పలు సమస్యలను పరిశీలించారు. అంబర్పేట ఫ్లైఓవర్ సరీ్వసు రోడ్డు, అలీకేఫ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ముసారాంబగ్ బ్రిడ్జి పనులను ఆమె జాగృతి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం అంబర్పేట మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట పలువురు జాగృతి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. -
Lionel Messi: భారీ బందోబస్తు
ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్కు భారీ బందోబస్తు కల్పించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టేడియం బయటా లోపలా కలిపి 450 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలను అమర్చి పర్యవేక్షణ కోసం మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఆయన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మాట్లాడారు. మెస్సికి జెడ్ కేటగిరీ బందోబస్తు ఉంటుందని సీపీ వెల్లడించారు. ఆయన ప్రయాణానికి ఆటంకం ఏర్పడకుండా ప్రత్యేక గ్రీన్ చానల్ రూట్మ్యాప్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియం వద్ద టికెట్ విక్రయాల్లేవ్.. స్టేడియం ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో టికెట్లను, పాస్లను విక్రయించడం లేదని సీపీ స్పష్టం చేశారు. టికెట్ లేనివారు స్టేడియం వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నారు. మ్యాచ్ను టీవీల్లో వీక్షించాలని సూచించారు. 3 గంటల ముందే అనుమతి... టికెట్లు, పాస్లున్న వారిని స్టేడియంలోకి 3 గంటల ముందే అనుమతించనున్నట్లు సీపీ తెలిపారు. ఆట ప్రారంభమయ్యే సమయానికి వచ్చి ఆందోళన పడవద్దని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మెట్రో రైల్, ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలన్నారు మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరీ్ణత స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలని సీపీ సూచించారు. టికెట్ ఒకసారి స్కాన్ అయిందంటే.. మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విషయంలో నిర్వాహకులు అనంత్ మాట్లాడుతూ.. టికెట్ మొబైల్లో సాఫ్ట్ కాపీ రూపంలోనే ఇస్తారని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రవేశం ఉంటుందన్నారు. ఒకసారి స్కాన్ అయితే మళ్లీ వినియోగించే అవకాశం ఉండదన్నారు. పాస్ హోల్డర్లు బార్ కోడ్ ఉన్న ఫిజికల్ పాసులు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు, జిరాక్స్, స్క్రీన్ షాట్లను అనుమతించబోమన్నారు. -
మెస్సీ మేనియా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లో వేచిన సాయంత్రం.. ఈ రోజే సాకారం.. నగరమంతా మంత్రముగ్ధం.. ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల కోలాహలం.. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మెస్మరైజ్లో మునిగితేలే అపూర్వ ఘట్టం.. భాగ్య నగరం క్రీడా స్ఫూర్తితో ఓలలాడే అరుదైన సమయం.. శనివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదిక కానుంది. అర్జెంటీనా సూపర్స్టార్ లియోనెల్ మెస్సీ పాల్గొనే ప్రత్యేక మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి 20 నిమిషాల పాటు మ్యాచ్లో పాల్గొననుండటం మరో విశేషం. భావి ఫుట్బాల్కు నాంది.. ప్రస్తుతం హైదరాబాద్లో క్రికెట్, టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్ వంటి క్రీడలకు మంచి అభిమాన వలయం ఉన్నప్పటికీ, ఫుట్బాల్ అంతగా పెద్ద స్థానాన్ని సంపాదించలేదు. అయితే.. మెస్సీ వంటి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, అంతర్జాతీయ ప్రమాణం ఉన్న ఈవెంట్ ఇంతకుముందు లేకపోవడంతో ఈ మ్యాచ్ నగరానికి భవిష్యత్ ఫుట్బాల్ అభివృద్ధికి నాందిగా మారుతుందనే విశ్లేషణ నగర క్రీడాభిమానుల్లో వినిపిస్తోంది. అంబరాన్నంటే అతిపెద్ద సంబరం.. ⇒ మ్యాచ్లో మెస్సీతో పాటు లూయిస్ సూయారేజ్, రోడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. ఈ మ్యాచ్తో నగరంలో ఫుట్బాల్ పట్ల ఆసక్తిని పెంచే ప్రేరణగా భావిస్తూ, పాఠశాలలు, యూనివర్సిటీలలో ఫుట్బాల్ క్లబ్లు, ట్రైనింగ్ సెషన్ల పట్ల అభిరుచిని పెంచే అవకాశాలు పెరగనున్నాయి. హైదరాబాద్లో ఇప్పటి వరకు బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రధానంగా ఉండగా.. ఫుట్బాల్కు పెద్ద సంబరంగా ఈ ఈవెంట్ నిలుస్తోంది. ⇒ మెస్సీ వంటి ప్రపంచ విజేత కావడంతో ఫుట్బాల్ అంటే అభిమానమున్న యువతకు ఆదర్శంగా మారనుంది. మెస్సీ కొత్త క్రీడా దశదిశలను నిర్దేశించనున్నారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లలో ఫుట్బాల్ శిక్షణ, స్థానిక క్లబ్లు, క్రీడా స్థాయి పెంచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, మెస్సీ ఫుట్బాల్ క్లినిక్ ద్వారా చిన్న పిల్లలు, యువతకు అవకాశం ఇస్తున్నందున, స్థానిక క్రీడా సంబంధిత ప్రమాణాలు పెరిగేందుకు ఇది పెద్ద ప్రేరణగా ఉండనుందని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా.. నగరంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, ఇక్కడి క్రీడా సంప్రదాయానికి కొత్త చైతన్యం తీసుకొచ్చే అవకాశం వంటిదేనని చెప్పుకోవచ్చు. -
నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శని వారం హైదరాబాద్కి వస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీ వర్సెస్ రేవంత్ టీంల ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు రాహుల్ రానున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం రాత్రి ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు. రాహుల్ టూర్ ఇలా! కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయ ల్దేరనున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్తారు.అక్కడ రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ రాత్రి 7:15 గంటలకు బయల్దేరి 7:55 నిమిషాలకు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంకు చేరుకుంటారు. మెస్సీ టీంతో రేవంత్ టీం ఆడే ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షిస్తారు. ఆ తర్వాత రాత్రి 9:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరుతారు. 10:30 గంటలకు ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్తారు. -
హార్డ్డిస్క్ల కోణంలో..
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు శుక్రవారం సిట్ కార్యాలయంలో లొంగి పోయారు. ఉదయం 11 గంటలకు తన కుమారుడితో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఉన్న సిట్ ఆఫీస్కు వచ్చారు. ఈయన్ని అధికారులు వారంపాటు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించనున్నారు. తొలి రోజు సిట్ ఏసీపీ పి.వెంకటగిరితోపాటు సంయుక్త పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రభాకర్రావును ప్రశ్నించారు. ఎస్ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్రావును ప్రశ్నిస్తున్న అధికారులు తొలిరోజు ధ్వంసం చేసిన, రీప్లేస్ చేసిన హార్డ్డిస్క్ల కోణంలో ప్రశ్నించారు. ఆధారాలు మాయం చేయడానికే..: సుదీర్ఘకాలంలో ఎస్ఐబీలో పనిచేసిన ప్రభాకర్రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతోనే 2023 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఆ రోజు రాత్రి ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్–కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లానని, అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను ఆఫ్ చేయించానని మరో నిందితుడు, ఎస్ఓటీ చీఫ్గా వ్యవహరించిన ప్రణీత్రావు వెల్లడించారు. ఈ వార్ రూమ్లో ఉన్న 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 26 హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేయడంతోపాటు మరో ఏడింటిని కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.ధ్వంసం చేసిన హార్డ్డిస్క్ల్ని మూసీ నదిలో పారేసినట్లు ప్రణీత్రావు అంగీకరించారు. ఇదంతా ప్రభాకర్రావు ఆదేశాల మేరకే చేసినట్లు అతడు వెల్లడించిన నేపథ్యంలో ఆ హార్డ్డిస్క్ల కోణంలో సిట్ ప్రశ్నలు సంధించింది. వీటికి ప్రభాకర్రావు స్పందిస్తూ నిర్ణీత కాలం తర్వాత డేటాను ధ్వంసం చేసే నిబంధన ఎస్ఐబీలో ఉందని, తమ వద్ద దేశ భద్రతకు సంబంధించిన, సున్నిత సమాచారం ఉంటుందని, అందుకే అలా చేస్తుంటామని చెప్పారు. అయితే నిబంధనల మేరకు కేవలం డేటాను డిలీట్ చేయాల్సి ఉండగా హార్డ్డిస్క్ల ధ్వంసం, రీప్లేస్ అనేది కేవలం ఆధారాలు మాయం చేయడానికే అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.ఈ కారణంగానే ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతోపాటు ఐక్లౌడ్, క్లౌడ్ల పాస్వర్డ్స్ను మార్చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. దీనికి స్పందించిన ప్రభాకర్రావు తాను ఎలాంటి ఆధారాల ధ్వంసానికీ ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగా అధికారులు మూసీ నది నుంచి, గ్రీన్లాండ్స్లోని ఎస్ఐబీ కార్యాలయం పరిసరాల నుంచీ కొన్ని ఆధారాలు గతంలో సేకరించారు. ఈ వివరాలను ప్రభాకర్రావు ముందు ఉంచి ప్రశ్నించగా, ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారని అధికారులు చెబుతున్నారు.బెదిరింపు వసూళ్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలతోపాటు ఎవరి ఆదేశాల మేరకు ఈ నేరాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలనూ సిద్ధం చేశారు. ప్రతి రెండు గంటలకు కాసేపు విరామం ఇస్తూ విచారించారు. ప్రభాకర్రావు కోరినప్పుడల్లా విశ్రాంతి, మందులు ఇస్తున్నామని, రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆయన నిద్ర కోసం కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. -
‘రింగు’కు హంగులు లేవు..
ఎనిమిది వరుసల రోడ్డు, చమక్కున మెరిసేలా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, రెండు వరుసల సర్విసు రోడ్డు, ఏ చిన్న రోడ్డుకు కూడా క్రాసింగ్ ఇబ్బంది లేకుండా కిలోమీటరుకు ఒక వంతెనతో దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్ప్రెస్వే రింగురోడ్డుగా నిలిచిపోవాల్సిన ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగురోడ్డు) ఇప్పుడు ఏ ప్రత్యేకతలు లేని సాధారణ జాతీయ రహదారిగా నిర్మాణం కాబోతోంది. ఆ రోడ్డు మీద వాహనాల రద్దీ సాధారణంగానే ఉండబోతోందని ట్రాఫిక్ స్టడీ ద్వారా తేల్చి ఎనిమిది వరుసలకు బదులు ఆరు వరుసల రింగురోడ్డే సరిపోతుందని ఇటీవల నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరిన్ని ప్రత్యేకతలపై వేటు వేసింది.సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం (162 కి.మీ. నిడివి)లో మొత్తం 204 వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిల్లో జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్ చేంజ్ వంతెనలు ఉంటాయి. మూసీనది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరానది మీద పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రా నది మీద తూప్రాన్ వద్ద మూడు పెద్ద వంతెనలుంటాయి. వాగులువంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాల్వలు, భవిష్యత్లో నిర్మించబోయే కొన్ని నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులుంటాయి.ప్రతి ముప్పావు కి.మీ.కు ఒకటి చొప్పున ఏదో ఒక నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు వీటిని భారీగా తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఎన్హెచ్ఏఐని ఆదేశించింది. సగటున ప్రతి రెండు కి.మీ.కు ఒకటి చొప్పున నిర్మించేలా డిజైన్ మార్చి వంతెనల సంఖ్యను తగ్గించాలని పేర్కొంది. వెరసి వాటి సంఖ్యను సగానికి సగం తగ్గించి వంద లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి వద్ద ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.మరో పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ భేటీ అయ్యి ట్రిపుల్ఆర్ బడ్జెట్కు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ తరుణంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ముందస్తు సమావేశం నిర్వహించి రింగురోడ్డు బడ్జెట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం, రోడ్డు నిర్మాణ వ్యయం, జీఎస్టీ, ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.21,550 కోట్ల అంచనా వ్యయం ఉంది.రింగురోడ్డు ఒక భాగానికి ఇంత భారీ వ్యయం సరికాదని, దీన్ని భారీగా తగ్గించాలని ఆదేశించారు. వంతెనల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాటిని సగానికి సగం తగ్గించటం ద్వారా ఖర్చును భారీగా తగ్గించొచ్చని తేల్చారు. వంతెనల సంఖ్య తగ్గితే కొన్ని చిన్న రోడ్లకు రింగురోడ్డును దాటేందుకు వీలుండదు. కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదించిన నీటి కాలువలకు కూడా ప్రస్తుతం దారి విడవాల్సిన అవసరం లేదని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ ఔట్... ఔటర్ రింగురోడ్డు తరహాలో రీజినల్ రింగురోడ్డుకు రోడ్డు పొడవునా లైటింగ్ వ్యవస్థ ఖరారైంది. కేంద్ర కార్యదర్శి ఆదేశంతో ఇప్పుడు దాన్ని తొలగించారు. పట్టణాలు, పెద్ద గ్రామాలు ఉన్న చోట మాత్రమే జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన తరహాలో సాధారణ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. మిగతా చోట్ల ఎలాంటి లైట్లు ఉండవు. దీంతో ధగధగలాడాల్సిన రింగురోడ్డు సాధారణ రోడ్డు తరహాలో రాత్రి వేళ చిమ్మ చీకట్లలోనే ఉండనుంది.యాక్సెస్ పాత్ మాయం తొలుత రింగురోడ్డుకు రెండు వరుసల సర్విసు రోడ్డును ప్రతిపాదించారు. నెల రోజుల క్రితం దాన్ని రద్దు చేసి ఆ స్థానంలో సాధారణ యాక్సెస్ పాత్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ యాక్సెస్ పాత్ను కూడా ఉపసంహరించుకున్నారు. ఏడు మీటర్ల సర్విసు రోడ్డుకు బదులు మూడు మీటర్ల యాక్సెస్ పాత్ ఉన్నా కొంత ఉపయోగం ఉండేది. కోట గోడ తరహాలో 5 మీటర్ల ఎత్తుతో ఉండే రింగురోడ్డును అనుకొని ఉండే పొలాలు, ఇతర ప్రైవేటు భూముల్లోకి వెళ్లేందుకు వీలుగా ఆ యాక్సెస్ పాత్ ఉపయోగంగా ఉంటుంది.సర్వీసు రోడ్డు తరహాలో ఫుత్పాత్, మధ్యలో డివైడర్ లాంటివి కాకుండా సాధారణ కచ్చా రోడ్డులాగా అది ఉంటుంది. దాని మీదుగా వెళుతూ పక్కనే ఉన్న ప్రైవేటు భూములోకి చేరుకునే వీలుంటుంది. ఇప్పుడు ఆ యాక్సెస్ పాత్ ఖర్చును కూడా తప్పించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అంటే రింగురోడ్డును ఆనుకొని ఎలాంటి రోడ్డు ఉండదు. కేవలం అంతమేర వదిలిన సాధారణ ఎగుడుదిగుడు ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. అందులో కనీసం కచ్చా రోడ్డు కూడా ఉండదు. వెరసి రింగురోడ్డును ఆనుకొని దిగువ గుండా వాహనాలు ముందుకు వెళ్లే వెసులుబాటు ఉండదు. పది రోజుల్లో కొత్త బడ్జెట్ కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి సూచన మేరకు పొదుపు చర్యలు పాటించటం ద్వారా ఎంత మేర బడ్జెట్లో కోత పెట్టొచ్చో ఎన్హెచ్ఏఐ అధికారులు లెక్కలేస్తున్నారు. మరో పదిరోజుల్లో రివైజ్డ్ ప్రాథమిక బడ్జెట్ను అందజేయాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. కొత్త లెక్కలతో మరోసారి భేటీ ఉంటుంది. దానికి ఆయన ఓకే చెబితే.. వెంటనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ముందుంచుతారు. ఆ కమిటీ ఓకే చెప్పగానే ఉత్తర రింగు టెండర్లు ఖరారు అవుతాయి. -
ఐ–ఫోన్లకూ తప్పని ఫేక్ లోన్యాప్ల బెడద
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ భద్రత పరంగా సురక్షితంగా భావించే ఐ–ఫోన్లకు ఫేక్లోన్ యాప్ల బెడద తప్పడం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగానే యాపిల్ యాప్ స్టోర్లో ఇటీవల మూడు ఫేక్ లోన్ యాప్లను గుర్తించినట్టు కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్) వెల్లడించింది. థిన్లోన్, రిష్నాలోన్, అంబాలా క్యాష్ అనేవి నకిలీ యాప్లు అని తెలిపింది.ఈ యాప్లను గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. ఈ యాప్లను డౌన్లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించి ఆ తర్వాత ఆన్లైన్ బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డాక్యు మెంట్లు లేకుండా లోన్లు ఇస్తామని ఊదరగొట్టే ఈ యాప్లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. అనుమానాస్పద యాప్లకు సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1930లో లేదా cybercrime. gov. in లో ఫిర్యాదు చేయా లని అధికారులు సూచించారు. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
బంజారాహిల్స్: ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు. అయితే ట్యూషన్లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్ను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు. పోలీసులు మానసపై బీఎన్ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది. -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
మొబైల్స్కు డ్రాయిడ్ లాక్ ముప్పు!
సాక్షి, హైదరాబాద్: కేవలం కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలు, ఐటీ ఉద్యోగులకు సంబంధించిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లకు మాత్రమే పరిమితమైన ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ ప్రస్తుతం స్మార్ట్ఫోన్లకూ విస్తరించాయి. ఆండ్రాయిడ్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని డ్రాయిడ్ లాక్ అనే మాల్వేర్తో సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నట్లు జిమ్పెరియం వెల్లడించింది. మొబైల్ఫోన్ సెక్యూరిటీ రంగంలో పేరుగాంచిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా అప్రమత్తత జారీ చేసింది. అపరిచిత మెయిల్స్, లింకులు, యాప్ల రూపంలో డ్రాయిడ్ లాక్ ఎటాక్స్ జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఒక్కసారి ఫోన్లో ప్రవేశిస్తే... ఈ మాల్వేర్తో కూడిన లింకులు, యాప్లను ఒకసారి క్లిక్ చేస్తే ఫోన్లో నిక్షిప్తం అయిపోతుంది. ఆ వెంటనే మాల్వేర్ ఆయా ఫోన్ల స్క్రీన్లను లాక్ చేస్తుంది. రిమోట్ యాక్సెస్ విధానంలో ఫోన్లోని ఎస్సెమ్మెస్లు, కాంటాక్టులు, ఆడియో రికార్డింగ్స్ తదితరాలకు సంబంధించిన యాక్సెస్ను సైబర్ నేరగాళ్లకు ఇస్తుంది. ఈ–కేటుగాళ్లు మాల్వేర్ ప్రోగ్రామింగ్ను ఆ విధంగా చేస్తున్నారు. ఫ్యాక్టరీ రీసెట్, లాక్ ప్యాట్రన్స్ను సైతం అధీనంలోకి తీసుకుంటున్నారు. కనీసం ఫోన్ను చార్జింగ్ చేయడానికి కూడా ఈ మాల్వేర్ అవకాశం ఇవ్వదు. ఫోన్ వినియోగదారులు ఎంత ప్రయత్నించినా అన్లాక్, రీసెట్, స్విచ్ఛాఫ్ చేయలేరు. కేవలం ఫోన్ స్క్రీన్పైన కనిపించేలా నేరగాడు పంపే సందేశాన్ని మాత్రమే చూడగలుగుతారు. బిట్ కాయిన్లలో డిమాండ్ చేస్తూ... కొన్ని సందర్భాల్లో ఈ మాల్వేర్ ఫోన్లోని డేటాను ఎన్క్రిప్ట్ చేయడం ద్వారా అది యజమాని అధీనంలో లేకుండా చేస్తుంది. అలా ఎన్క్రిప్ట్ అయిన డేటాను డీక్రిప్ట్ చేయడానికి, ఫోన్ అన్లాక్ కోసం భారీ మొత్తం చెల్లించాలంటూ ఫోన్ స్క్రీన్పై సందేశం కనిపిస్తుంటుంది. కొందరు సైబర్ నేరగాళ్లు ఈ డ్రాయిడ్ లాక్ ఎటాక్స్తో ఫోన్లను అ«దీనంలోకి తీసుకుంటూ వాటిలోని యూపీఐ యాప్స్, నెట్ బ్యాంకింగ్లను వినియోగించి బాధితుడి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి ర్యాన్సమ్వేర్ ఎటాక్తో లాక్ అయిన కొన్ని ఫోన్ స్క్రీన్లపై నిర్ణీత కాలానికి కౌంట్డౌన్ టైమింగ్ కూడా డిస్ప్లే అవుతుంది. అన్లాక్, డిక్రిప్షన్ పాస్వర్డ్ను ఆ సమయం తర్వాత నిర్వీర్యం చేస్తామని.. ఇక మీ ఫోన్లోని డేటా శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని సైబర్ నేరగాళ్లు బెదిరిస్తుంటారు. ఈలోగా తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలోకి మార్చి తాము సూచించిన విధంగా పంపాలని స్పష్టం చేస్తున్నారు.ఎలాంటి ప్రయత్నం చేసినా నష్టమే.. ఎవరైనా ఆ టైమర్ను, సెల్ఫోన్ను, మాల్వేర్ ప్రోగ్రామ్ను మార్చాలని ప్రయత్నించినా.. బిట్ కాయిన్ రూపంలో చెల్లించినట్లు తప్పుడు వివరాలతో మెయిల్ పంపినా నేరగాళ్లు నిర్దేశించిన డెడ్లైన్ తగ్గిపోతూ కౌంట్డౌన్ టైమర్లో మార్పులు రావడం ఈ మాల్వేర్కు ఉన్న మరో లక్షణం. ఫిషింగ్ మెయిల్స్తోపాటు యాప్స్, లింకుల ద్వారా మాత్రమే ఈ ఎటాక్స్ జరుగుతాయని సైబర్క్రైమ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ తరహా ఎటాక్స్పై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అపరిచిత లింకులు, మెయిల్స్ను ఓపెన్ చేయడం, అనధికారిక లింకుల ద్వారా వచ్చే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలో ఈ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయని.. చాలా మంది వారి ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, డేటా కోసం సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసినంత సొమ్మును బిట్కాయిన్లుగా చెల్లిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తాలు అందిన తర్వాతే వారి ఫోన్లు అన్లాక్ అవుతున్నాయని వివరిస్తున్నారు. -
గులాబీ జోష్..
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ అంటోంది.పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానంగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
పోలవరం–నల్లమలసాగర్పై సుప్రీంకు!
సాక్షి, హైదరాబాద్: పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పక్కనపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం–నల్లమలసాగర్ను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాకుండా గోదావరి–కావేరి అనుసంధానాన్ని నల్లమలసాగర్ నుంచే చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ చర్యలను అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశాన్ని న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసులో తెలంగాణ తరఫున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం ఢిల్లీలో కలిసి కోరనున్నారు. ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీని ప్రతివాదిగా చేర్చి కేసు వేయాలని సింఘ్వీకి ఉత్తమ్ సూచించనున్నారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలపై మరో న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తున్నారు. ఆయన స్థానంలో సింఘ్వీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు డీపీఆర్కు ఏపీ టెండర్లు.. పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎస్ఆర్)ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖతోపాటు సీడబ్ల్యూసీకి అందించి మదింపు చేయిస్తోంది. మరోవైపు ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేయడానికి వీలుగా గత నెలలోనే టెండర్లు పిలిచింది. పోలవరం నుంచి నల్లమలసాగర్కు తొలిదశలో... నల్లమలసాగర్ నుంచి సోమశిలకు రెండోదశలో... ఆ తర్వాత కావేరికి తరలించాలని యోచిస్తోంది. కేంద్రం సంకేతాల నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి నీటిని తరలించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) నుంచి నీటి తరలింపునకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మతి తెలపగా... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నీటిని తరలించాలని సూచించింది. అంతేకాకుండా ఇచ్చంపల్లి బ్యాక్వాటర్ నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ కొన్ని షరతులతో ఇచ్చంపల్లికి అంగీకరించగా ఏపీ మాత్రం బేషరతుగా పోలవరం–నల్లమలసాగర్–సోమశిల–కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరడం.. అందుకు కేంద్రం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో దీన్ని అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ఉంది. -
అత్యధికమే.. అనుకూలమేనా?
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. బీఆర్ఎస్ పోటీపై నిశితంగా..... ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు. రెండు దశలకు మరింత పకడ్బందీగా.. తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
యాదవులు ఏ పార్టీలో ఉన్నా కలిసి ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్లోని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన యాదవ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. యాదవులు ఏ పార్టీలో ఉన్నా అంతా ఒక్కటిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అనంతరం అంజన్కుమార్ ఏర్పాటు చేసిన విందు ఆతిథ్యంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తాజ్ కృష్ణ హోటల్కు వెళ్లారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అఖిలేశ్కు రేవంత్ రెడ్డి వివరించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. యాదవులకు ఇష్టమైన సదర్ పండుగను ప్రభుత్వం గుర్తించడంపై అఖిలేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని యాదవ సమాజం రేవంత్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని.. తెలంగాణలోని యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా గుర్తింపు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేశ్ వెంట ఎంపీ అనిల్కుమార్ యాదవ్, అంజన్కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిణ్రెడ్డి తదితరులున్నారు. వారిప్పుడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారు..యాదవ సమ్మేళనం అనంతరం అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత వందేమాతరం ఆలపించని వారు, మూడు రంగుల జాతీయ జెండాను ఇష్టపడనివారు ఇప్పుడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. యూపీలో 3 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ ఓడిపోయే చోట్ల ఈసీతో కలిసి ఎక్కువ ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. యూపీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి ఆహ్వానించి ఫుట్బాల్ మ్యాచ్ ఆడతామని, హైదరాబాద్లో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ను టీవీలో చూస్తానని చెప్పారు. ఏఐ సమ్మిట్కు హాజరువిజన్ ఇండియా పేరుతో దేశమంతా పర్యటిస్తున్న ఆయన అఖిలేశ్ తాజ్కృష్ణలో జరిగే ఏఐ సమ్మిట్లో పాల్గొంటారు. విజన్ ఇండియా దేశాభివృద్ధి ప్రణాళికల విషయంలో తన దృక్పథం గురించి వివరించనున్నారు. శనివారం సాయంత్రం అఖిలేశ్ ప్రత్యేక విమానంలో లక్నో తిరిగి వెళ్లనున్నారు. -
ఐటీ, రక్షణ, ఫార్మా రంగాల్లో కలిసి పనిచేద్దాం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోపాటు రక్షణ, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఐటీ, రక్షణ, ఔషధ రంగాల్లో పెట్టుబ డులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడంతోపాటు అక్కడి ప్రముఖ లోహ, కార్ల తయారీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.భట్టి విక్రమార్క, మంత్రి డి.శ్రీధర్బాబుతో శుక్రవారం ప్రజాభవన్ లో జర్మనీ పార్లమెంటరీ బృందం భేటీ అయ్యింది. జర్మనీ, భారత్ నడుమ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం భవిష్యత్లో మరింత పటిష్టంగా ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం అన్నారు. ‘ఐటీ రంగానికి హబ్గా పేరొందిన హైదరాబాద్ జర్మనీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్స్ వర్సిటీలో జర్మన్ భాషా విభాగం ఏర్పాటు ద్వారా జర్మనీలో ఉద్యోగ, అవకాశాలు మెరుగవుతాయి’అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం: శ్రీధర్బాబుసైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దూరదృష్టితో ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ‘సైబర్ సెక్యూరిటీ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా రెండు ఫ్లోర్లు కేటాయించాం. జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేయడంతో ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి’అని మంత్రి వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్ను జర్మనీ పార్లమెంటు బృందానికి భట్టి, శ్రీధర్బాబు అందజేశారు. సైబర్ సెక్యూరిటీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు సంబంధించి తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నట్టు జర్మనీ పార్లమెంటు బృందం ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణలో జర్మనీ పెట్టుబ డులు, బోష్ వంటి ప్రసిద్ధ కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తెలంగాణలో కొదవలేదని జర్మనీ పార్లమెంట్ ప్రతినిధి బృందం కితాబునిచ్చింది. జర్మన్ పార్లమెంట్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ ప్రతినిధి జోసెఫ్ ఓస్టర్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. భేటీలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ప్రణాళిక శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. -
‘టెన్త్’ షెడ్యూల్పై రగడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ వ్యవహారం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. ప్రతి పరీక్షకూ మధ్య కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండేలా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించేలా టెన్త్ పరీక్షల విభాగం నిర్ణయించి షెడ్యూల్ విడుదల చేయడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమంటూ మండిపడుతున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. విద్యాశాఖ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. సీబీఎస్ఈ కూడా ఇదే విధానంలో పరీక్షలు నిర్వహిస్తోందని.. ఇతర రాష్ట్రాల్లో కొన్ని బోర్డులు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయని తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు, పరీక్షల నిర్వహణ సాఫీగా ఉండేందుకే మార్పులు చేశామని విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమవుతున్నాయి. యథావిధిగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. టీచర్ల అభ్యంతరం ఏమిటి?నాలుగు రోజులకో పరీక్ష వల్ల ఎగ్జామ్స్ నిర్వహణ కాలం పెరుగుతుందని టీచర్లు చెబుతున్నారు. నెల రోజులకుపైగా పరీక్షల కోసం పనిచేయాల్సి వస్తుందని.. అన్ని రోజులపాటు స్కూళ్లు, హాస్టళ్లలో విద్యా ర్థులను చదివించాలని, తమకు సెలవులు పెట్టే అవకాశం ఉన్నతాధికారులు ఇవ్వరని వాదిస్తున్నా రు. మరోవైపు ప్రశ్నపత్రాలను అన్ని రోజులపాటు రక్షించడం కూడా సమస్యేనని టీచర్లు చెబుతున్నా రు. టెన్త్ ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాల నుంచి తొలుత సమీపంలోని పోలీసు స్టేషన్లకు.. పరీక్షల రోజుల్లో అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్లకు చేరవేసే మధ్య ఎక్కువ కాలవ్యవధి ఉండటం వల్ల ప్రశ్నప త్రాలు ఎక్కడైనా లీకయ్యే అవకాశం ఉంటుందని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి తామే బా ధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని కలవ రపడుతున్నారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇచ్చి నా పెద్దగా పురోగతి ఉండదని అంటున్నారు.వ్యవధి ఇస్తే ప్రయోజనం ఉంటుందా?రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. కొన్నేళ్లుగా 94 శాతం మంది రెగ్యులర్గా, మరో 2 శాతం మంది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాసవుతున్నారు. అంతిమంగా ఫెయిలయ్యే విద్యార్థులు 4 శాతమే ఉంటున్నారు. వారిలోనూ గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ మంది ఉంటున్నారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సగానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉంటున్నారు. సాధారణంగా వారిలో ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. విద్యార్థులకు చాలాకాలం క్రితమే సిలబస్ పూర్తి చేయడంతో పరీక్షల సమయానికి రెండు దఫాల రివిజన్ కూడా చేయిస్తున్నారు. కాబట్టి ఇంతకు మించి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం లేదని టీచర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఇచ్చినా నష్టమే జరుగుతుందనేది టీచర్ల వాదన. స్థానికంగా ఉపాధ్యాయులు ఉండనందున విద్యార్థులను చదివించే వారు ఉండరని... పైగా ఇతర పనులకు వెళ్లడం వల్ల విద్యార్థులు పరీక్షలు తప్పే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. -
రాష్ట్రమంతా గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతన మయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత, పొగమంచు అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 7.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం హనుమ కొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.4 డిగ్రీలు తక్కువగా 8.5 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా.. మిగిలిన ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ప్రణాళిక శాఖ గణంకాల ప్రకారం రాష్ట్రంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీల సెల్సియస్గా రికార్డయింది. కోహిర్లో గతేడాది ఇదేరోజున 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఇప్పుడు మరింత తగ్గడం గమనార్హం. అలాగే హైదరాబాద్ శివారులో ప్రాంతాల్లోనూ చలి గజగజలాడించింది. ముఖ్యంగా పటాన్ చెరులో సాధారణం కంటే 7.7 డిగ్రీలు తక్కువగా 5.4 డిగ్రీల సెల్సియస్గా నమోదై గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 6.3, మొయినాబాద్లో 6.0, మౌలాలిలో 7.1, ఉప్పల్లో 7.1, రాజేంద్ర నగర్లో 7.5, శివరాంపల్లిలో 8.8, అల్వాల్లో 9.0, గచ్చిబౌలిలో 9.1, దుండిగల్లో 10.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మొత్తంగా హైదరాబాద్లో సగటున 10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు దట్టమైన పొగమంచు పరుచుకోవడంతో హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–ముంబై హైవేలపై వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రానున్న నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్లలో)ఆదిలాబాద్ 7.2భద్రాచలం 14.6దుండిగల్ 10.7హకీంపేట్ 14.3హనుమకొండ 8.5హైదరాబాద్ 10.8ఖమ్మం 12.4మహబూబ్నగర్ 13.5మెదక్ 7.2నల్లగొండ 14.0నిజామాబాద్ 11.2రామగుండం 10.9 -
ఆల్ ఈజ్ వెల్.. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.ఎవరి లెక్కలు వారివే..అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలోఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం. -
కేటీఆర్తో అఖిలేష్యాదవ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని.. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు.. తిరస్కరిస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లోనే ఉండాలని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఆయన.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు.నంది నగర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్ యాదవ్కు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో కేసీఆర్ను కలుస్తానన్నారు.కేటీఆర్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ తమకు స్ఫూర్తి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 37 ఎంపీ స్థానాలు సాధించారు. దేశంలో మూడో స్థానంలో పార్టీని నిలిపారని కేటీఆర్ అన్నారు. -
బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవు!!
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని వారికి ఆయన హితవు పలికారు. హైదరాబాద్ అమీర్ పేటలోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ గారు పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్ జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు."ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించం. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు" అని ఆయన హెచ్చరించారు.ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా ఉంటుందని చెప్పారు. 'ప్రైడ్ ప్లేస్'తో సమస్యల పరిష్కారం: ఏడీజీ చారు సిన్హా ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో 'ప్రైడ్ ప్లేస్' అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు.ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్ను ఆశ్రయించవచ్చని ఆమె అన్నారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ, సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.హైదరాబాద్ జిల్లా ట్రాన్స్జెండర్ సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పక తీసుకోవాలని సూచించారు . ట్రాన్స్జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో జాయింట్ సిపి లా ఆండ్ ఆర్డర్ .తఫ్సీర్ ఇకుబాల్ ఐపిఎస్ , నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళ భద్రతా విభాగ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ సృజనతో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆరుగురి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ చందానాయక్ తండా హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థులకు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్రామ్గూడ రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
మెట్లబావిలో తాబేళ్ల మృత్యువాత
కాలుష్యమయంగా మారిన పురాతన బావి ● పట్టించుకోని ఉద్యాన శాఖ అధికారులునాంపల్లి: పబ్లిక్ గార్డెన్లోని అతి పురాతన మెట్లబావి కాలుష్యమయంగా మారింది. తాబేళ్లకు ప్రాణ సంకటమైంది. అయినా ఉద్యాన శాఖ అధికారుల్లో చలనం లేకుండాపోయింది. సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఈ శాఖ విఫలమైంది. తెలంగాణ శాసన మండలి ప్రవేశ ద్వారం సమీపంలోని మెట్ల బావి ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. ప్రస్తుతం ఈ బావిలో మురుగునీరు వచ్చి చేరింది. మంచినీటి ఊట బావిలో లక్డీకాపూల్ నుంచి వచ్చే మురుగునీటి కాల్వ నీరు మెట్లబావిలోకి వచ్చి చేరుతోంది. ఈ కాలుష్యంతో గత ఏడాది పబ్లిక్ గార్డెన్ చెరువులో సుమారు 70 చేపలు, 22 తాబేళ్లు చనిపోయాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాబేళ్లు చనిపోవడాన్ని చూసిన వాకర్లు, సందర్శకులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉద్యాన శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాలయం పక్కనే ఉన్న మెట్ల బావిని కూడా పరిరక్షించలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. వీటికి తోడు పార్కులో ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది బస్సులు పార్కింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. ఈ విషయములో ఉద్యాన శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాబేళ్ల మృత్యువాత ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. -
సబ్సిడీ.. ‘గ్యాసేనా’
అర్హత సాధించినా రాయితీ వర్తించని వైనం సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే రూ.500కు ఎల్పీజీ సిలిండర్ వర్తింపు ఉత్తుత్తి ‘గ్యాస్’గా తయారైంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హత సాధించినా.. సబ్సిడీ సిలిండర్ మాత్రం వర్తించడం లేదన్న ఆవేదన పేద కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. దీంతో బహిరంగ మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ రీఫిల్ కొనుగొలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనకు రెండేళ్లు కావస్తున్నా.. కొందరికే సబ్సిడీ భాగ్యం కలుగుతోంది. మరోవైపు కొన్ని కుటుంబాలకు సబ్సిడీ వర్తించినా సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం స్లాబ్కు పరిమితమై కేవలం రూ.40.71 మాత్రమే నగదు బదిలీగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి పథకం వర్తిస్తే.. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించిన కుటుంబాలకు మాత్రం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ అవుతోంది. తాజాగా సిలిండర్లపై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగతా వారికి జమ కావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పష్టత కరువు.. వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింపజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్ల పాటు వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబ్ధిదారుల సిలిండర్ల సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికి.. గతంలో వినియోగించిన సంఖ్యను తక్కువగా ఉంటే దాటి ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం. ఆరు లక్షలు మించలే.. మహా హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలపైగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కనెక్షన్దారుల్లో సుమారు 24 లక్షల కుటుంబాలు ప్రజాపాలనలో రూ. 500కు వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 12 లక్షల వరకు దరఖాస్తులు అర్హత సాధించినా.. వర్తింపు మాత్రం 50 శాతం మించలేదు. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ వర్తిస్తునప్పటికీ.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం అందని ద్రాక్షగా మారింది. కొంత మందికే వంటగ్యాస్ సిలిండర్ మిగతా వారికి మూణ్నాళ్ల ముచ్చటగానే.. సంబంధిత అధికారులకూ స్పష్టత కరువు ఇదీ ఆరు గ్యారంటీల లబ్ధిదారుల పరిస్థితి త్రిశంకు స్వర్గం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం -
పొల్యూషన్ కంట్రోల్ తప్పుతోంది
నగరంలో మూడేళ్ల గరిష్టానికి వాయు కాలుష్యం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాయు కాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారుతోంది. ఈ ఏడాది 12 శాతం వాయు కాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 ధూళి కణాల సంఖ్య నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా కనీసం 150 నుంచి 265 మధ్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు సంతాన సమస్యలకు కారణమవుతోందని పేర్కొంటున్నారు. విమర్శల పాలవుతున్న పీసీబీ.. నగరంలో వాయు కాలుష్య నివారణకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ)లో భాగంగా 2019 జనవరిలో రూ.614 కోట్లు మంజూరయ్యాయి. 2017తో పోల్చితే 2026 నాటికి గాలిలో పీఎం 10 ధూళి కణాలు కనీసం 40 శాతం తగ్గించాలన్నది ఈ పథకం లక్ష్యం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) రూ.561 కోట్ల నిధులు ఖర్చు చేసినా సాధించిన పురోగతి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. 2020లో నగర వాయు నాణ్యత సూచీ 100 (ఏక్యూఐ) ఉండగా 2025లో ఏక్యూఐ 100గానే నమోదు కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డిసెంబర్ నెల ఏక్యూఐ 178గా నమోదైంది. గతంలో 2021 డిసెంబరులో 155గా నమోదు కావడమే గరిష్టంగా ఉండేది. ఆ రికార్డులను చెరిపేస్తూ వాయు వేగంతో గాలి కాలుష్యం దూసుకెళుతోంది. దీంతో రూ.వందల కోట్ల నిధులు వృథాగా గాలిలో కలిపేసినట్లైందన్న విమర్శలను పీసీబీ మూటగట్టుకుంటోంది. ● కాలుష్య నియంత్రణ మండలి గాలి నాణ్యత లెక్కలకు రహదారిపై వెళ్లే మోటారు సైకిల్, ఆటో, బస్సు ప్రయాణికులు, నడిచి వెళ్లే వ్యక్తులు పీల్చిన గాలిలో ఉన్న ధూళి కణాల (పీఎం 2.5, పీఎం10) లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. అధికారులు రహదారికి కొంత దూరంలో యంత్ర పరికరాలు అమర్చుతున్నారు. దీంతో రహదారిపై ప్రయాణించే సగటు ప్రయాణికుడు పీల్చే గాలి నాణ్యతకు కొలమానం లేకుండా పోయింది. రహదారిపై వాహనాలు రాకపోకలు సాగించే క్రమంలో గాలిలో ఎగిరిన ధూళి కణాలు పీసీబీ అమర్చిన సీఏఏక్యూఎంఎస్ వరకు వెళ్లేసరికి వాటి సాంద్రత గణనీయంగా తగ్గిపోతోంది. రహదారి పక్కనే వాయు నాణ్యత కొలిచే పరికరాలు అమర్చినట్లైతే భయంకరమైన గణాంకాలు వెలుగు చూస్తాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. పీసీబీ అధికారులు మాత్రం పరిసర ప్రాంతాల వాయు నాణ్యతను కొలవడానికి ఇలా ప్రశాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామని సమర్థిచుకుంటున్నారు. అయితే.. కొన్ని కేంద్రాల్లో పీఎం 10, మరికొన్ని కేంద్రాల్లో పీఎం 2.5 గణాంకాలు నమోదు కావడం లేదు. కొన్ని ప్రాంతాలకే పరిమితం.. నగరంలో పీసీబీకి 14 ప్రాంతాల్లోనే వాయు నాణ్యత కొలిచే వ్యవస్థ ఉంది. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా అది లెక్కలోకి రావడంలేదు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. సికింద్రాబాద్– మెహిదీపట్నం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ –విజయవాడ, ఉప్పల్– వరంగల్, హైదరాబాద్– బీజాపూర్, ఇతర జాతీయ రహదారులపై గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు. మణికొండ, బండ్లగూడ జాగీర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్ ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు. రూ.వందల కోట్లు కరుగుతున్నా ఫలితం శూన్యం ప్రమాదకర స్థితిలో గాలి నాణ్యత సూచీ ఈ ఏడాది 12 శాతం పెరుగుదల నమోదు రూ.561 కోట్లు ఖర్చు చేసినా లక్ష్యసాధనలో వెనకబాటే.. సంవత్సరాల వారీగా వాయు నాణ్యత సూచీ ఇలా.. సంవత్సరం ఏక్యూఐ 2020 100 2021 105 2022 104 2023 95 2024 89 2025 100 నగరంలో ప్రాంతాలవారీగా ఇటీవల నమోదైన కాలుష్య వివరాలు ప్రాంతం పీఎం 2.5 పీఎం 10 మలక్పేట్ 264 135 బొల్లారం 190 154 పటాన్చెరు 187 155 సనత్నగర్ 185 ––– నాచారం 185 ––– సోమాజిగూడ 170 150 జూపార్క్ 157 153 -
హెచ్ఎండీఏ డీలా..
జీహెచ్ఎంసీ విస్తరణతో ప్రతిష్టంభనసాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఐదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాలు, హైరైజ్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, భారీ వెంచర్లు తదితర నిర్మాణరంగ అనుమతులన్నీ హెచ్ఎండీఏ నుంచే అందజేస్తున్నారు. త్వరలో ఈ అధికారాలన్నీ జీహెచ్ఎంసీకి బదిలీ కానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ ఆదాయం భారీగా పడిపోనుంది. అధికారులు, ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు సహా హెచ్ఎండీఏ చేపట్టే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి ఇచ్చే అనుమతులపైనే హెచ్ఎండీఏకు ప్రతి ఏటా దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. కొన్ని సందర్భాల్లో రూ.1500 కోట్లకు పైగా కూడా లభించింది. ఇలా ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంతోనే ఉద్యోగుల జీతభత్యాలతో పాటు పార్కులు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఔటర్ రింగ్రోడ్డు నుంచి రీజినల్రింగ్ రోడ్డు వరకు చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లతో పాటు, ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు, సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లను సైతం హెచ్ఎండీఏ సొంతంగానే చేపట్టింది. ఈ ప్రాజెక్టులకన్నింటికీ నిధుల కొరత తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రియల్ భూమ్ అంతా అక్కడే.. విస్తరణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధి 650 చ.కి.మీ. నుంచి సుమారు 2000 చ.కి.మీ.లకు పైగా పెరగనుంది. దీంతో ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ తదితర జోన్లలోని కీలకమైన ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్తాయి. రియల్ ఎస్టేట్ వర్గాలు, నిర్మాణరంగ సంస్థలు మొదలుకొని సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు జీహెచ్ఎంసీ నుంచే అన్ని రకాల అనుమతులు పొందవచ్చు, మరోవైపు ఉప్పల్ భగాయత్, మేడిపల్లి, బాచుపల్లి, హయత్నగర్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ సొంత భూముల్లో వేసిన లేఅవుట్లకు సైతం భారీ స్పందన లభించింది. ఇలా అన్ని విధాలుగా వచ్చిన ఆదాయ మార్గాలన్నీ హెచ్ఎండీఏ నుంచి జీహెచ్ఎంసీకి మారనున్నాయి. జీత భత్యాలు కష్టమే.. ‘హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా సుమారు రూ.70 కోట్లకు పైగా జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపులకే వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు 90 శాతానికి పైగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లడంతో జీతభత్యాల చెల్లింపు ఒక సవాల్గా మారనుంది’అని ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధికి వెలుపల అంటే సుమారు 2000 చ.కి.మీ దాటిన తర్వాత చేపట్టే నిర్మాణాలు మాత్రమే హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఆ దిశగా నిర్మాణరంగం విస్తరించేందుకు మరో 5 నుంచి 10 ఏళ్లు పట్టవచ్చు’ అని ఆయన వివరించారు. హెచ్ఎండీఏ వద్దనే డెలిగేషన్ పవర్స్.. జీహెచ్ఎంసీ విస్తరణ, డివిజన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఒక వైపు వేగంగా కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ అనుమతులు, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన డెలిగేషన్ పవర్స్ మాత్రం ఇంకా హెచ్ఎండీఏ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన హెచ్ఎండీఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగిన తర్వాతనే అధికారాల బదిలీ జరగనుందని అధికారులు తెలిపారు. వార్డుల సంఖ్య పెరగడంతో భారీగా పడిపోనున్న ఆదాయం నిర్మాణ అనుమతులపై ఏటా రూ.1200 కోట్లు ఈ రాబడికి సైతం గండిపడే అవకాశం ఉద్యోగుల జీతభత్యాలకూ గడ్డు కాలమే -
12 జోన్లు.. 60 సర్కిళ్లు
డీలిమిటేషన్పై ఆందోళనలు.. కొనసాగుతున్న అభ్యంతరాలు సాక్షి, సిటీబ్యూరో ఇటీవల విలీనమైన స్థానిక సంస్థలు సహా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ను 300 వార్డులు (కార్పొరేటర్ డివిజన్)గా డీలిమిటేషన్కు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికార యంత్రాంగం, తదుపరి దశలో చేయాల్సిన సర్కిళ్లు, జోన్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులుండగా, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండటం తెలిసిందే. వార్డులు 150 నుంచి 300కు పెరిగి రెట్టింపు కాగా, సర్కిళ్లు, జోన్లు సైతం రెట్టింపు కానున్నాయి. మొత్తం 60 సర్కిళ్లు, 12 జోన్లుగా జీహెచ్ఎంసీ పరిపాలన సాగనుంది. ఈమేరకు కసరత్తు జరుగుతోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. ఆందోళనలు.. అభ్యంతరాలు విస్తరించిన జీహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వచ్చిన వార్డుల్లో కొన్నింట్లో వార్డు పేరు తప్ప ఆ ప్రాంతం లేదంటూ బాకారం వార్డును ప్రస్తావించారు. కొందరు కాచిగూడ బదులు వార్డు పేరు బర్కత్పురా కావాలని కోరినట్లు తెలిసింది. ఇంకొందరు సరిహద్దులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న వార్డులకు సంబంధించిన మ్యాపులు లేకపోవడం. వార్డుల వివరాలు కూడా ఆంగ్లంలో తప్ప తెలుగులో లేకపోవడంతో అందరికీ అర్థం కావడం లేదని నిరసనలు వ్యక్తం చేశారు. కమిషనర్ కర్ణన్ను కలిసిన కమలం నేతలు వార్డుల విభజనపై బీజేపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతమ్రావు, ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పార్టీ నేతలు సి.కృష్ణయాదవ్, చింతల రామచంద్రారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి తదితరులు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. విలీనం, డీలిమిటేషన్ అత్యంత తొందరపాటుతో పారదర్శకత లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్లోని 300 వార్డుల మ్యాపులను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్కు ఏ విధానం అనుసరించారో పబ్లిక్ డొమైన్లో లేకపోవడం తగదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ప్రక్రియ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. అధికార పార్టీ అండదండలతో ఒకపార్టీ నేతలు ప్రభావం చూపారని ఆరోపించారు. ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు కమిషనర్ పాలకమండలి అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా నిబంధనలున్నప్పటికీ, పాటించలేదని, వార్డులవారీగా జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవ్వాలని కోరారు. 16న పాలకమండలి ప్రత్యేక సమావేశం శివారు స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తరణ, కలిసిన పరిధి మేరకు వార్డుల పునర్విభజన అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకునేందుకు ఈ నెల 16న పాలకమండలి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈమేరకు సభ్యులకు సమాచారం పంపారు. వార్డుల మ్యాపులు, తెలుగులో వివరాలు లేకపోవడంపై నిరసనలు వార్డు పేరు మార్పు కోసం వినతులు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసిన బీజేపీ నేతలు -
వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
ఉప్పల్: వరకట్న వేధింపుల కారణంగా ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది..ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సూర్యపేట జిల్లా తిరుమలగిరి ప్రాంతానికి చెందిన శ్రీహరి కూతురు శ్వేతశ్రీ (28) వివాహం జూన్ నెల జనగాం జిల్లా దేవరుప్పల ప్రాంతానికి చెందిన దామెర శ్రీనివాస్తో వివాహాం జరిగింది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం ఇచ్చారు. దంపతులు రామంతాపూర్ ఆర్టీసి కాలనీలో నివాసముంటున్నారు.కొంత కాలం నుంచి శ్రీనివాస్ అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయాన్ని శ్వేత తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది.ఈ క్రమంలో ఈ నెల 10న ఇంట్లోని హాల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి స్థానికుల సహకారంతో కిందికు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన అల్లుడి వరకట్న వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఇద్దరు కాదు ఐదుగురు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడిగా ఉన్న డాక్టర్ పి.వినయ్కుమార్ తదితరులను రూ.23.1 కోట్ల మేర మోసం చేసి, టాస్క్ఫోర్స్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పలపాటి సతీష్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొలుత సతీష్తో పాటు ఆయన భార్య శిల్ప బొండ మాత్రమే నిందితులుగా ఉన్నారు. అయితే వీరి అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన పరిణామాలతో మరో ముగ్గురినీ ఆ జాబితాలో చేరుస్తూ సీసీఎస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సతీష్ సోదరిలతో పాటు బావను నిందితులుగా చేరుస్తున్నట్లు సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టుకు సమాచారం ఇచ్చారు. వీరిలో సతీష్, శిల్పలతో పాటు హిమబిందులను ఇప్పటికే అరెస్టు చేసిన సీసీఎస్ అధికారులు త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. పథకం ప్రకారం షెల్ కంపెనీలు ఏర్పాటు... సతీష్ 2018లో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, ఆ తర్వాత మూసేశాడు. సతీష్ తన సోదరి హిమబిందు, భార్య శిల్ప, స్నేహితుడు పువ్వల ప్రసేన్ కుమార్తో కలిసి భారీ స్కామ్కు కుట్ర పన్నారు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అనేక షెల్ కంపెనీలను తెరిచారు. 2019లో సతీష్, శిల్ప, ప్రసేన్కుమార్ పథకం ప్రకారం డాక్టర్ వినయ్కుమార్ను కలిసి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని, కచ్చితంగా భారీ లాభాలు పంచుతామని చెప్పారు. నమ్మడంతో నట్టేట ముంచేసి... ఈ విషయం నమ్మిన వైద్యుడితో పాటు మరో ముగ్గురు ఆయన కుటుంబీకులకూ కలిపి విజయ్ శ్రావ్య ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు.వారు రూ.15.21 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థలో వీరితో పాటు మరో ఇద్దరూ రూ.6.5 కోట్లు, రూ.1.39 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఈ బాధితుల నుంచి ప్రసేన్, శిల్పలు రూ.23.1 లక్షలు పెట్టుబడులు పెట్టించారు. బాధితుడితో పాటు ఆయన కుటుంబీకులకు ప్రసేన్, శిల్పలు 2023 జనవరి వరకు లాభాలు పంచారు. ఆపై ఎలాంటి సమాచారం లేకుండా ఆపేయడంతో వీరికి సందేహం వచ్చింది. ప్రసేన్ కుమార్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం బాధితుడికి అందింది. దీంతో ఆ ఏడాది ఏప్రిల్లో ఆయన్ను చూడటానికి బాధితుడు వెళ్లారు. ఆ సమయంలో ప్రసేన్ కుమార్ బాధితుడితో మాట్లాడుతూ శిల్ప బండతో పాటు సతీష్ ఉప్పలపాటి కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని, పథకం ప్రకారం తమ పెట్టుబడులను వాటిలోకి మళ్లించారని చెప్పాడు. సహకరించిన సోదరిలు, బావ... ఎట్టకేలను తాను మోసపోయానని గుర్తించిన వినయ్ కుమార్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సతీష్, శిల్పలపై కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన శిల్ప, సతీష్ను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు స్కామ్లో హిమబిందు పాత్రను గుర్తించారు. గత నెల 8న ఆమెను అరెస్టు చేశారు. సతీష్, శిల్ప తప్పించుకోవడానికి, న్యాయపోరాటానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలూ మాధవితో పాటు బిందు భర్త భాగవతుల వెంకటరమణ అందించారు. కారు డ్రైవర్ శివానందంను బెదిరిస్తూ, అతడి ఫోన్ తమ ఆధీనంలో ఉంచుకుని సతీష్, శిల్పలు అనేక రాష్ట్రాల్లో తిరిగారు. చివరకు గత నెల 20న వీరి కదలికల్ని కర్ణాటకలో ఉన్న ధార్వాడలో గుర్తించిన సీసీఎస్ అధికారులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే వీరి ఎస్కేప్తో పాటు మోసాల్లోనూ మాధవి, వెంకట రమణ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. అంతు చిక్కని ‘విషం’ మిస్టరీ.. ప్రసేన్ కుమార్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలిసిన డాక్టర్ వినయ్కుమార్ 2023 ఏప్రిల్లో వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంలోనే ప్రసేన్... సతీ ష్, శిల్పలు ఉద్దేశపూర్వకంగానే ఈ మోసానికి పాల్పడ్డారని, అంతేకాకుండా వాళ్లిద్దరే తనకు విషం పెట్టారని వివరించాడు. అదే నెల 24న ప్రసేన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అదే ఏడాది జూన్లో సతీష్ను కలిసిన వినయ్ కుమార్ తన డబ్బు విషయం ఆరా తీశారు. అప్పుడు నిధులను వివిధ షెల్ కంపెనీల్లోకి మళ్లించి, సొంతానికి వాడుకున్న విషయాన్ని సతీష్ అంగీకరించాడు. తన డబ్బు కోసం బాధితుడు ఒత్తిడి తీసుకురాగా.... చట్టపరంగా ముందుకు వెళ్లాలని చూస్తే ప్రసేన్కు పట్టిన గతే పడుతుంది బెదిరించాడు. ఈ అంశాలను సీసీఎస్ పోలీసులు తమ కేసులో ప్రస్తావించారు. సతీష్, శిల్పల వాంగ్మూలాల్లోనూ ప్రసేన్ విష ప్రయోగంతో చనిపోయారనే విషయం పొందుపరిచారు. ఆ విషం అతడికి ఇచ్చింది ఎవరు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అనే అంశాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. శిల్ప, సతీష్ ( ఫైల్)ఉప్పలపాటి సతీష్ కేసులో పెరిగిన నిందితులు ఇప్పటికే సూత్రధారులు సహా ముగ్గురు అరెస్టు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిటీ సీసీఎస్ త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు -
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఫుట్బాల్ పోటీలో ప్రఖ్యాత ప్లేయర్ మెస్సీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటుండటంతో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి,రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపులు, రవాణ సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, డీజీ స్వాతి లక్రా పాల్గొన్నారు. -
అపార్ట్మెంట్లో భారీ చోరీ
రూ. 70 లక్షల నగదు, నగలు మాయం మలక్పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్బాగ్ డివిజన్ ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్మెంట్లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. వాచ్మెన్పై అనుమానం.. నేపాల్కు చెందిన అర్జున్ ఐదు నెలలు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. నేపాల్కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్మెన్గా కూడా పెట్టాడని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
చలి వేళ.. మూగజీవాలకు వెచ్చగా!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జంతువులకు వెచ్చదనం కలిగించేలా నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలి నుంచి జంతువులను రక్షించడానికి హీటర్లు, షేడ్ నెట్లు, చెక్క పలకలు, ఇన్సులేటెడ్ షెల్టర్లు, అత్యధిక వెలుగునిచ్చే బల్బులు ఏర్పాటు చేశారు. బయటి ఉష్ణోగ్రతల కంటే జూలో 3–5 డిగ్రీలు తక్కువగానే ఉంటుంది. ఇటీవల జూలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గది హీటర్లు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పనిచేసేలా ఏర్పాటు చేశారు. కొన్ని ఎన్క్లోజర్ల చుట్టూ మందపాటి గోనెసంచులను చుట్టి వుంచారు. కొన్నింట్లో చెక్క పలకలపై జంతువులు విశ్రాంతి తీసుకునేలా చూస్తున్నారు. నిత్యం వైద్యపరీక్షలు చలి ప్రభావం నుంచి తట్టుకునేలా జంతువులు ఉండే ఎన్క్లోజర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ మహ్మద్ అబ్దుల్ హకీం బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. వ్యప్రాణులకు అందించే ఆహారం, పానీయాలలోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్గా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. నిమోనియా వంటి వ్యాధులు సోకకుండా బీ కాంప్లెక్స్, కాల్షియం మందులు ఇస్తున్నట్లు తెలపారు. -
అఖిలేష్ సభ కోసం..ఇదేం పని ?
సాక్షి, సిటీబ్యూరో: సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిల్యాదవ్తో సభ నిర్వహణకు షెడ్ వేసేందుకు ఆదర్శ్నగర్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్లో చెట్లను తొలగించారు. ప్రజాప్రతినిధులు బస చేసే ఎమ్యెల్యే క్వార్టర్స్లో ఎవరైనా తెలియక చెట్లు నరికితే వారించాల్సింది పోయి.. సభా కార్యక్రమం కోసం చెట్లను నరికివేశారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో పారిశుద్ధ్య, ఇతరత్రా పనులు చేయించారు. షెడ్డు ఏర్పాటుకు అడ్డుగా ఉన్నందున కొమ్మలు తొలగించాల్సిందిగా కోరితే.. తాము కొమ్మలు మాత్రమే తొలగించామని.. పనులు చేశాక తమ సిబ్బంది వెళ్లిపోయాక ఒక చెట్టు మొదలు వరకు నరికినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సంబంధిత యూబీడీ విభాగం అధికారి తెలిపారు. దీంతో సంబంధిత ఫారెస్ట్ విభాగానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
గ్యాస్ సబ్సిడీ.. అర్హత ఉన్నా కొందరికే రాయితీ!
సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే రూ.500కు ఎల్పీజీ సిలిండర్ వర్తింపు ఉత్తుత్తి ‘గ్యాస్’గా తయారైంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హత సాధించినా.. సబ్సిడీ సిలిండర్ మాత్రం వర్తించడం లేదన్న ఆవేదన పేద కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. దీంతో బహిరంగ మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ రీఫిల్ కొనుగొలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనకు రెండేళ్లు కావస్తున్నా.. కొందరికే సబ్సిడీ భాగ్యం కలుగుతోంది. మరోవైపు కొన్ని కుటుంబాలకు సబ్సిడీ వర్తించినా సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం స్లాబ్కు పరిమితమై కేవలం రూ.40.71 మాత్రమే నగదు బదిలీగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. మహాలక్ష్మి పథకం వర్తిస్తే.. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించిన కుటుంబాలకు మాత్రం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ అవుతోంది. తాజాగా సిలిండర్లపై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగతా వారికి జమ కావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పష్టత కరువు.. వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింపజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్ల పాటు వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబి్ధదారుల సిలిండర్ల సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికి.. గతంలో వినియోగించిన సంఖ్యను తక్కువగా ఉంటే దాటి ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం.ఆరు లక్షలు మించలే.. మహా హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలపైగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కనెక్షన్దారుల్లో సుమారు 24 లక్షల కుటుంబాలు ప్రజాపాలనలో రూ. 500కు వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 12 లక్షల వరకు దరఖాస్తులు అర్హత సాధించినా.. వర్తింపు మాత్రం 50 శాతం మించలేదు. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ వర్తిస్తునప్పటికీ.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం అందని ద్రాక్షగా మారింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట ప్రభాకర్ రావు సరెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. దీంతో, ప్రభాకర్ రావును.. సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. ఇంటి నుంచే భోజనం అందించాలని ఆదేశాల్లో తెలిపింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆధారాలు ధ్వంసం చేశారు..అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు. డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్డిస్క్లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. -
డిజిటల్ సేఫ్టీలో రోల్ మోడల్గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్లోనూ సమగ్ర కార్యాచరణ ప్రణా ళికను పొందుపర్చామన్నారు. గురువారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) కాంక్లేవ్–2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారని.. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకుపైగా సైబర్ దాడులు జరిగాయన్నారు.తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17 వేలకుపైగా ర్యాన్సమ్వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందని చెప్పారు. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ. 800 కోట్లకుపైగా సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారని.. ఇలాంటి తరుణంలో సంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరమన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని వివరించారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరమన్నారు.కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వారిని వారియర్స్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ రమేశ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈల్లో హైదరాబాద్ హవా
తెలంగాణలో ఇప్పటివరకు 35.39 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లోక్సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిస్తూ జిల్లాల వారీగా వివరాలను వెల్లడించారు.రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 4.82 లక్షల పరిశ్రమలు ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి (2.84 లక్షలు), మేడ్చల్ మల్కాజిగిరి (2.24 లక్షలు) నిలిచాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 20,325 యూనిట్లు నమోదయ్యాయి. ‘క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’కింద 2024–25లో ఇప్పటివరకు తెలంగాణలో ఏకంగా 97,292 గ్యారెంటీలను ఆమోదించారు. వీటి విలువ రూ.11,586 కోట్లు అని, గత ఏడాది రూ.6,368 కోట్ల గ్యారంటీలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని కేంద్రమంత్రి తెలిపారు. -
హైకోర్టులో 12 జడ్జి పోస్టులు ఖాళీ
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. హైకోర్టుకు మంజూరైన జడ్జి పోస్టులు 42 కాగా, ప్రస్తుతం 12 ఖాళీలు ఉన్న మాట వాస్తవమేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పార్లమెంట్ వేదికగా అంగీకరించారు. అయితే, ఈ ఖాళీల భర్తీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కొలీజియం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్లో లేవని స్పష్టం చేశారు.రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 డిసెంబర్ 5 నాటికి తెలంగాణ హైకోర్టు నుంచి జడ్జీల నియామకానికి సంబంధించి ఏ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద పెండింగ్లో లేదన్నారు. నిబంధనల ప్రకారం ఖాళీ ఏర్పడటానికి 6 నెలల ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కానీ, ఈ గడువు చాలా అరుదుగా మాత్రమే అమలవుతోందని మంత్రి తెలిపారు. -
డబ్బులొస్తాయనుకుంటే తలనొప్పొచ్చింది
సాక్షి, హైదరాబాద్: డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవచ్చనే ఆశతో ఏకంగా రాష్ట్రంలోని 174 జలాశయాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్, 2021 పరిధిలోకి తీసుకువచ్చి స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలో పొందుపర్చడం.. ఇప్పుడు నీటిపారుదల శాఖకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. చట్టం ప్రకారం ఈ డ్యామ్ల భద్రతకు సంబంధించిన మూల్యాంకనాన్ని పూర్తి చేసి నివేదికలు సమర్పించడానికి ఏడాదే మిగిలి ఉన్నా.. రాష్ట్రం ఆశించిన పురోగతి సాధించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ గురువారం హైదరాబాద్ జలసౌధలో ఈ అంశంపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) అంజాద్ హుస్సేన్, సంబంధిత ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. స్పెసిఫైడ్ డ్యామ్ల జాబితాలోని అన్ని డ్యామ్ల మూల్యాంకనం పూర్తి చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి గడువు పూర్తికానుండగా, ఆలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, ఏదైనా జరిగితే సంబంధిత డ్యామ్ల పర్యవేక్షకులే (సీఈలు) బాధ్యత వహించాల్సి ఉంటుందని తేలి్చచెప్పినట్టు తెలిసింది. నిధుల కోసం జాబితాలో చెరువులు డ్యామ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఆయా డ్యామ్ల సీఈలు ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత డ్యామ్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించి వాటి భద్రత ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. కేటగిరీ–1లో అత్యవసర మరమ్మతులు జరపకపోతే తక్షణమే విఫలమయ్యే డ్యామ్లను, కేటగిరీ–2లో తీవ్రమైన లోపాలు కలిగి ఉండి అత్యవసర మరమ్మతులు అవసరమైన డ్యామ్లను, కేటగిరీ–3లో ఏడాదిలోగా స్వల్పమైన మరమ్మతులు అవసరమైన డ్యామ్లను చేర్చాల్సి ఉంటుంది. కేటగిరీ–2లోని డ్యామ్లకు సత్వరంగా మరమ్మతులు నిర్వహించి కేటగిరీ–3కి అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కాగా డ్యామ్ల నిర్వచనంతో సంబంధం లేకుండా నిధుల కోసం వాటి పరిధిలోకి రాని బరాజ్లు, స్టోరేజీ రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి స్పెసిఫైడ్ డ్యామ్ల జాబితాలో చేర్చడంతో జాబితా చాంతాడంత అయింది. ఇప్పుడు తొలగించాలంటూ ప్రతిపాదనలు! తాజాగా డ్యామ్ల నిర్వచనం కింద రాని జలాశయాలను స్పెసిఫైడ్ డ్యామ్ల జాబితా నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. అత్యవసర మరమ్మతులు అవసరం లేని డ్యామ్లను సైతం కేటగిరీ–2 జాబితాలోకి చేర్చడంతో వాటికి సంబంధించిన మూల్యాంకనం నిర్వహించి సత్వరం మరమ్మతులు జరపాలని ఎన్డీఎస్ఏ చైర్మన్ సమీక్షలో కోరడం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. మూల్యాంకనంలో ఏం చేయాలి.. చట్టం ప్రకారం స్పెసిఫైడ్ జాబితాలోని ప్రతి డ్యామ్కి నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) మాన్యువల్ను తయారు చేయాలి. గరిష్ట వరద ప్రవాహాలకు తగ్గట్టూ డిజైన్లు, నిర్మాణం జరిగిందా? అనే అంశంతో పాటు హైడ్రాలజీకి సంబంధించిన ఇతర అన్ని అంశాలను సమీక్షించాలి. ఏదైన అనుకోని ప్రమాదం జరిగితే విపత్తుల నిర్వహణకు అత్యవసరంగా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. ముప్పుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం జరపాలి. అన్ని డ్యామ్ల భద్రతకు సంబంధించి సమగ్ర పరీక్షలు జరపాలి. భూకంపాల్లాంటి విపత్తులను గుర్తించడానికి డ్యా మ్ల వద్ద హైడ్రో–మెటిరోలాజికల్, సీస్మాలజికల్ పరికరాలను ఏర్పాటు చేయాలి. ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా స్పెసిఫైయిడ్ జాబితాలో చేర్చిన 174 డ్యామ్లన్నింటి విషయంలో వచ్చే డిసెంబర్లోగా చర్యలు తీసుకోవాలి. గడువులోగా పూర్తి చేస్తామన్న కార్యదర్శి తాజా సమీక్షలో ఎన్డీఎస్ఏ చైర్మన్ డ్యామ్ల వారీగా ఈ ప్రక్రియల్లో సాధించిన పురోగతిని సమీక్షించి.. సంబంధిత ప్రాజెక్టుల సీఈలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని 10 డ్యామ్లను కేటగిరీ–2 నుంచి కేటగిరీ–3కి మార్చాలని ఆయన సూచించినట్టు తెలిసింది. పెద్దవాగు, జూరాల, రేలంపాడు, మంజీర డ్యామ్లకి మరమ్మతుల్లో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా గడువులోగా అన్ని స్పెసిఫైడ్ డ్యామ్ల మూల్యాంకనం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తామని శాఖ కార్యదర్శి ఆయనకు హామీ ఇచ్చారు. -
ప్రభాకర్రావు సరెండర్ కావాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది.తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.ఆధారాలు ధ్వంసం చేశారు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు.డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్డిస్క్లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. -
పాములు.. కోతులు.. తేనెటీగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే 24 గంటలూ స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువారం సచివాల యంలో సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్షించారనీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విస్తతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ అవసరమైన బారికేడింగ్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి, ఆర్అండ్బీ, హోం శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. -
ఫుట్బాల్ ఆడిన సీఎం
మునిపల్లి (అందోల్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లోని వోక్సన్ యూనివర్సిటీ క్రీడాకారులతో సీఎం రేవంత్రెడ్డి ఫుట్బాల్ ఆడారు. గురువారం రాత్రి యూనివర్సిటీ క్రీడాకారులతో రెండు బ్యాచ్లతో ఆడారు.అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. వర్సిటీ లోకి 6.32 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8.15 గంటలకు వెళ్లిపోయారు. రేవంత్కు వర్సి టీ యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది. -
కార్పొరేట్ కంపెనీల కోసమే విత్తన బిల్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన బిల్లు ముసాయిదాను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండి, రైతుల ప్రయోజనాలను కాలరాస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి రావడం, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు లేకపోవడం, రాష్ట్రాలకు విత్తన ధరలపై నియంత్రణ అధికారం లేకుండా పోవడం, సాంప్రదాయ రైతు విత్తన హక్కులకు రక్షణ లేకపోవడం వంటి తీవ్ర లోపాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు దేశీయ విత్తనభద్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చించకుండా ఈ బిల్లును రూపొందించడం సరికాదని, వెంటనే ఆపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ తరఫున సుదీర్ఘ ఫీడ్బ్యాక్తోపాటు సవరణలు సైతం కేంద్రానికి పంపినట్టు తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు గరిష్ట ఉత్పత్తి మేరకు నిర్దిష్ట సమయంలో నష్టపరిహారం అందేలా కఠిన నిబంధనలు పెట్టాలని, రాష్ట్రాల అధికారాలను కాపాడాలని సూచించారు. త్వరలో మాజీమంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కేంద్రానికి మరిన్ని సూచనలు పంపనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. -
వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలుపుదాం
సాక్షి, హైదరాబాద్: వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ ఆర్డీ)లో జరిగిన ‘దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో ఆయన ప్రసంగించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ హబ్గా తీర్చిదిద్ద డంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. దక్షిణ భారతదేశానికి అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందని, శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్వర్క్లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుంచి విజయన గర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, రాజ్యపాలనకు ప్ర తీకగా నిలిచాయని చెప్పారు. ఈ సదస్సు స్వతహా గానే చరిత్రాత్మకమైనదని, వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు, మ్యూజి యంల శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ సదస్సు రెండురోజులు జరిగే కార్యక్ర మంగా మాత్రమే కాకుండా, కొత్త ఆలోచనలను రగిలించే వేదిక కావాలన్నారు. న్యూ మిస్ మ్యా టిక్స్, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలని భట్టి ఆకాంక్షించారు. -
ఆ పిల్కు నంబర్ కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాప్ర యోజన వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్ను ఈ పిటిషన్కు జత చేయాలని స్పష్టం చేసింది. ఈ రెండు పిల్లపై సీజే ధర్మాసనం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. పలువురికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఫైలింగ్ నంబర్పైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ.. 2017లో అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇదే ‘కేబినెట్ హోదా’ అంశంపై పిటిషన్ వేశారని, అది ఇప్పటికీ పెండింగ్లో ఉందన్నారు. ఇప్పుడు ఆ పిటిషన్పై విచారణ చేపట్టినా ప్రయోజనం లేదని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఓ నిర్ణయం తీసుకుంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తారని చెప్పారు. ఆర్టికల్ 164 (1ఏ) ప్రకారం మంత్రివర్గ హోదా కల్పించే విషయంలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. ప్రస్తుతం 16 మంది కేబినెట్ మంత్రులకు అదనంగా ప్రభుత్వంలోని 14 మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు ఆ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నా రు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ పొట్టిగారి శ్రీధర్రెడ్డి వాదనలు వినిపించారు. -
తెలంగాణ ‘విజన్’ భేష్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’పై కాంగ్రెస్ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారంటూ ముఖ్య మంత్రి ఎ.రేవంత్రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతమైన తీరును రేవంత్రెడ్డి వారికి వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసుకున్న ఒప్పందాలు, విజ న్ డాక్యుమెంట్ ఆవిష్కరణ వంటి అంశాలపై వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. సమ్మిట్ నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అగ్రనేతలు ప్రత్యేకంగా అభినందించారు. రేవంత్రెడ్డి వెంట మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.ప్రణబ్ ముఖర్జీకి ఘన నివాళిమాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో ఘన నివాళులర్పించారు. ప్రణబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దశాబ్దాలపాటు ప్రజాసేవకే అంకితమైన గొప్ప దార్శనికుడు ప్రణబ్ ముఖర్జీ అని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాలేయ రోగుల్లో ఎండీఆర్ ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: కాలేయ మార్పిడి రోగుల్లో సగం మందికిపైగా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ (ఎండీఆర్) ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు హైదరాబాద్కు చెందిన సౌత్ ఏసియన్ లివర్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనం వెల్లడించింది. 26 నెలలపాటు జరిగిన ఈ అధ్యయనంలో 67 మంది కాలేయ శస్త్రచికిత్స రోగులను పరిశీలించారు. వారిలో 24 శాతం మందిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను గుర్తించారు. 46 మంది కాలేయ మార్పిడి పొందిన రోగుల్లో 16 మందికి ఇన్ఫెక్షన్లు విస్తరించగా వారిలో 94% మందికి తొలి, రెండో దశ యాంటీబయోటిక్స్ కూడా పనిచేయలేదని నివేదిక తెలిపింది.ఇన్ఫెక్షన్ కేసుల్లో 56 శాతం మందికి శస్త్రచికిత్సకు ముందే రక్త నమూనాల్లో ఎండీఆర్ బాక్టీరియా కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోగుల్లో సగానికిపైగా ఎండీఆర్ ఇన్ఫెక్షన్తో వస్తే ఆసుపత్రుల్లో అందించే ఇన్ఫెక్షన్ నిరోధక చర్యలు పనిచేయవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ టామ్ చెరియన్ పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు ముందు రోగులలోని క్రియాశీల ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.తీవ్ర స్థాయిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ తాజా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం భారత్లోని రోగుల్లో 80 శాతం మందిలో ఎండీఆర్ సూక్ష్మజీవులు ఉన్నాయని వెల్లడైంది. ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జీఎల్ఏఎస్ఎస్–2025 నివేదికలో భారత్లో ప్రతి మూడు బాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ఒకటి సాధారణ యాంటీబయోటిక్స్ను ప్రతిఘటిస్తున్నట్లు తేలింది. బ్యాక్టీరియా కల్చర్లను ముందుగానే నిర్వహించడం వల్ల శస్త్రచికిత్సల సమయంలో 30 శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చినా సరైన యాంటీబయోటిక్స్తో సమస్యను నియంత్రించగలిగామని సౌత్ ఏసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు చెబుతున్నారు. భారత్లో జరుగుతున్న తాజా అధ్యయనాల ప్రకారం చివరి దశలో వాడే ‘కార్బాపెనమ్’ యాంటీబయోటిక్స్కే రెసిస్టెన్స్ పెరుగుతోందని తేలింది. ఇందులో ఇ.కోలికి 22 శాతం, కె.నిమోనియాకు 31 శాతం రెసిస్టెన్స్ ఎదురైనట్లు తేలింది. ద్వితీయశ్రేణి నగరాల్లో స్క్రీనింగ్ తప్పనిసరినిపుణుల సూచన ప్రకారం సెమీ–రూరల్, ద్వితీయశ్రేణి నగర ప్రాంతాల్లో ప్రీ–ఆపరేటివ్ స్క్రీనింగ్ విధానాలు తప్పనిసరి చేయడం ద్వారా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాంటీబయోటిక్స్ వినియోగం, పర్యవేక్షణ వ్యవస్థల బలోపేతం అత్యవసరమని సూచించారు. -
84.28% పోలింగ్ నమోదు
సాక్షి, హైదరాబాద్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 84.28 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా, వారిలో 45,15,141 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27 % ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదయ్యింది. మధ్యా హ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్టుగా ఎస్ఈసీకి నివేదికలు అందాయి. ఉదయం నుంచే బారులు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్పేపర్తో బ్యాలెట్ బాక్స్లను సీల్ చేశారు. ఉదయం 9 గంటలకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే ఒంటిగంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్లలో క్యూలైన్లలో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్టు ఎస్ఈసీ వెల్లడించింది. కాగా ఓటింగ్ సరళిని ఎస్ఈసీ కార్యాలయం నుంచి లైవ్ లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు కూడా పోలింగ్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. అర్థరాత్రి దాటినా కౌంటింగ్ ఓటింగ్ శాతం భారీగా నమోదుతో పాటు క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో.. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది. -
పంచాయతీ ముచ్చట్లు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైనా గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రాగా, టాస్లో పలువురిని అదృష్టం వరించింది. ఇంకొన్ని చోట్ల ఎన్నో ప్రయాసలు పడి ఓటు వేసి తమ బాధ్యత ఏంటో తెలియజెప్పారు.టెంట్ల కిందే ఓటింగ్..దుద్యాల్ /దండేపల్లి: పాఠ శాల గదుల్లోనో, పంచాయతీ భవనంలోనో నిర్వహించే సర్పంచ్ ఎన్నికలను ఈసారి టెంట్ల కింద పూర్తిచేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సట్రకుంటతండాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల స్కూల్, జీపీ భవనాలు మంజూరైనా, ప్రస్తుతం అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక టెంట్ల కింద పోలింగ్ జరిపించారు.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చెల్కగూడెంలో ప్రభుత్వ పాఠశాల లేదు. పైగా పంచాయతీకి పక్కా భవనమూ లేదు. అంగన్వాడీ కేంద్రం కూడా ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రం ఆవరణలోనే టెంట్లు వేసి పోలింగ్ నిర్వహించారు.ఫ్యామిలీ పాలిటిక్స్తల్లిపై కూతురు విజయంకోరుట్లరూరల్/ ఉట్నూర్రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయి పల్లె సర్పంచ్ పదవికి తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లపు సుమలత పోటీ పడగా, కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆరుగురు బరిలో ఉన్నా, ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజీతండా సర్పంచ్గా జాదవ్ మాయ 88 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి జాదవ్ విమల బాయిపై గెలుపొందారు. ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మాయ భర్త జాదవ్ హరినాయక్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే గ్రామ పంచాయతీకి జాదవ్ హరినాయక్ సర్పంచ్గా ఎన్నికయ్యారు.మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగాడుకోరుట్లరూరల్/ శంషాబాద్ రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ పోలింగ్ బూత్కు పిట్టల వెంకటి ఓటు వేసేందుకు వచ్చాడు. పోలింగ్ సిబ్బంది ఆయనకు సర్పంచ్, వార్డు సభ్యుడికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓటు వేసి తీసుకురమ్మన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటి తెలుపు కలర్ బ్యాలెట్ పేపర్ నమిలి మింగాడు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ నములుతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి పిట్టల వెంకటిని జీపులో ఎక్కించుకొని పోలింగ్ స్టేషన్కు దూరంగా తీసుకెళ్లి వదిలేశారు.తప్పు జరిగిందని బ్యాలెట్ పేపరు చించివేత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బుర్జుగడ్డతండాలోని పోలింగ్ స్టేషన్లోకి ఓటు వేసేందుకు ముడావత్ సత్యనారాయణ వెళ్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే మరో అభ్యర్థికి వేసినట్టు గుర్తించి, ఆ బ్యాలెట్ పేపరును చించివేశాడు. గమనించిన ఎన్నికల అధికారి రాజశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపారు. సత్యనారాయణ పోలింగ్ ఏజెంటుగా తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.బ్యాలెట్లో వార్డు అభ్యర్థి గుర్తు గల్లంతునాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. దీంతో గంటపాటు పోలింగ్ నిలిపివేయించి.. కొత్త బ్యాలెట్స్ తెప్పించి ఓట్లు వేయించడంతో వివాదం ముగిసింది.నాగారంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తండ్రి విజయంనాగారం: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి నాగారం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుపై 136 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి తన స్వగ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలన్న కల సాకారమైంది. తండ్రి గెలుపు కోసం కుమారులు జగదీశ్రెడ్డి, సురేష్రెడ్డి, కుటుంబ సభ్యులు కృషి చేశారు. యువతతో పోటీ పడుతూ ఈ వయసులో రామచంద్రారెడ్డి విజయం సాధించడంపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందనలు తెలిపారు.సర్పంచ్గా గెలిచిన 80 ఏళ్ల వృద్ధురాలుమంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల సర్పంచ్ బరిలో ముగ్గురు నిలిచారు. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కాసిపేట వెంకటమ్మ 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.చెక్కు చెదరని అభిమానంచనిపోయిన వ్యక్తికి మెజారిటీ ఓట్లు సర్పంచ్గా గెలిచినట్టు ధ్రువీకరించిన అధికారులు వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేము లవాడ మండలం చింతాల్ ఠాణా సర్పంచ్ పదవికి 1,717 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెర్ల మురళికి 739 ఓట్లు, సమీప ప్రత్యర్థులు సురువు వెంకటికి 369, కొలాపూరి రాజమల్లయ్యకు 357 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈ నెల 4వ తేదీన చెర్ల మురళి గుండెపోటుతో మృతి చెందాడు. అయినా గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమానంతో ఓట్లు వేశారు. అయితే సర్పంచ్ పదవికి పోటీ చేసిన మురళికి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పారు.ఆయనకు 160 ఓట్లు..మహబూబా బాద్ రూరల్ : మహబూబా బాద్ జిల్లా నడి వాడ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్ద తుతో రాగిపాటి బుచ్చిరెడ్డి పోటీ చేశాడు. ఈ నెల 9న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బుచ్చిరెడ్డి భార్య సావిత్రమ్మ గ్రామ ప్రజల కోరిక మేరకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలోనూ గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమా నాన్ని చాటుకుంటూ ఓటేశారు. దివంగత బుచ్చిరెడ్డికి 160 ఓట్లు వేశారు.ఓటు.. బాధ్యతకొడుకు చనిపోయిన బాధలో ఉన్నా...దుద్యాల్/బోధన్ /ఇబ్రహీంపట్నం: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట్కు చెందిన భూకల వెంకటయ్య–పద్మమ్మల కొడుకు మల్లేశ్యాదవ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంట్లో మృతదేహం ఉండగానే, రోదిస్తూనే వెళ్లి ఓటు వేశారు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించారు.అంబులెన్స్లో వచ్చి.. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జమాల్పూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి మల్లవరపు ఆరోగ్యరాజు అంబులెన్స్లో వచ్చి ఓటు వేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన రోడ్డు ప్రమాదానికి గురికాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నడవలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్లో తీసుకొచ్చారు.ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాఅహ్మద్పల్లి సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి తన ఓటమి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీఐపీ విలేజ్ ఆ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో... మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు«ద్రెడ్డి (కాంగ్రెస్) స్వగ్రామం రంగారెడ్డిగూడెం (రాజాపూర్) గ్రామపంచాయతీలో బీజేపీ మద్దతుదారు కాటేపాగ రేవతి విజయం సాధించారు. తొలుత రేవతికి 6 ఓట్ల మెజార్టీ రాగా.. అధికార పార్టీ నాయకుల డిమాండ్తో రీకౌంట్ చేయడంతో రేవతి మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. \వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్ఎస్‡ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్ట మండలం గంగిమాన్దొడ్డి పంచాయతీలో బోయపద్మ (ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గం) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టల్లపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొలను ప్రశాంత్రెడ్డి కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఊరు తరలినా.. ఓట్లు అక్కడే.. కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ వాసులను పునరావాసంలో భాగంగా ధర్మాజీపేట్ సమీపంలోని పునరావాస గ్రామా నికి తరలించారు. అయినా వీరి ఓట్లు ఉడుంపూర్ పరిధిలోనే ఉన్నాయి. దోసండ్ల లచ్చన్న గ్రామస్తుడి సహాయంతో మోటారుసైకిల్పై 32 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్ వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లచ్చన్నకు కళ్లు సరిగ్గా కనబడకపోయినా ఓటేసేందుకు అంత దూరం వెళ్లడం విశేషం.ఓటేసిన శతాధిక వృద్ధుడు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పంచాయతీ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధుడు లాడే లింగన్న ఓటేశాడు. హుషారుగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన లింగన్నను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.హరిత పోలింగ్ కేంద్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధురాలు. ఓటరు దేవుళ్లకు దండాలు..వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న మద్దతుదారులు.. లక్కీ.. లక్కీచాన్స్..చీటీ తీసి... సర్పంచ్ ఎంపిక టేక్మాల్/రఘునాథపల్లి /రాజాపేట/కొందుర్గు /మంథనిరూరల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లి సర్పంచ్ స్థానానికి 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు పడగా, 3 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న మైలారం పోచయ్య, కాంగ్రెస్ బలపరి చిన రామచంద్రయ్యకు 276 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. రెండుసార్లు కౌంటింగ్ చేసినా, మళ్లీ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరు అభ్యర్థుల సమ్మతితో ఒక్కొక్కరి పేర ఐదైదు చీటీలు రాశారు. ఆ పది చీటీల నుంచి ఒక చీటీ తీయగా, అందులో మైలారం పోచయ్య పేరు ఉంది. దీంతో ఆయన్ను సర్పంచ్గా ఎన్నికైనట్టు ప్రకటించారు.టాస్తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం జోజి బరిలో నిలిచారు. పంచాయతీ పరిధిలో 474 ఓట్లు ఉండగా, 420 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ ఇద్దరికి సమానంగా 210 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు రెండుమార్లు రీకౌంటింగ్ చేశారు. అయినా ఓట్లు సమానంగానే వచ్చాయి. దీంతో టాస్ వేయగా అదృష్టం స్వతంత్ర అభ్యర్థిని జోజి వరించింది.లక్ష్మక్కపల్లిలో...యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండ లం లక్ష్మక్కపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతు దారుడు ఇండ్ల రాజయ్య టాస్ ద్వారా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో మొదట ఇండ్ల రాజ య్యకు 147 ఓట్లు, వేముల సురేందర్రెడ్డికి 148 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయ డంతో ఇండ్ల రాజయ్యకు ఒక్క ఓటు వచ్చింది. దీంతో ఇద్దరి ఓట్లు సమానం అయ్యాయి. ఎన్ని కల అధికారులు టాస్ వేయగా, రాజయ్యను అదృష్టం వరించింది. ఇదే పంచాయతీ పరిధి లోని 3వ వార్డులో బీమనపల్లి కృష్ణకుమార్, అయిల కిరణ్లకు చెరి 27 ఓట్లు రాగా, టాస్ వేయగా, కృష్ణకుమార్ను గెలిచాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులకు సమానంగా 392 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి మెండే రాజ య్య, బీఆర్ఎస్ నుంచి కనవేన కొమురయ్య బరిలో నిలిచారు. డ్రాలో కనవేన కొమురయ్య గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.కోటినాయక్ తండాలో... ఆత్మకూర్(ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటినాయక్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టి టాస్లో విజేతగా నిలిచింది. ధరావత్ చిట్టికి, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు ధరావత్ తులసికి 315 చొప్పున ఓట్లు సమానంగా రాగా.. అధికారులు టాస్ నిర్వహించారు. టాస్లో ధరావత్ చిట్టి గెలుపొందింది. పోస్టల్ ఓటుతో సమానం..ఆపై టాస్తో గెలుపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ స్థానానికి 616 ఓట్లు పోలయ్యాయి. మరాఠి రాజ్ కుమార్కు 211, గోపి రాములుకు 212, వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా, రాజ్కుమార్కు ఒక ఓటు వచ్చింది. దీంతో రాజ్కుమార్, రాములుకు ఓట్లు సరిసమానం అయ్యాయి. టాస్ వేయగా, రాజ్కుమార్ను విజయం వరించింది. వాసాలమర్రిలో... తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొమ్మాట అనురాధకు, బీఆర్ఎస్ బలపరిచిన పలుగుల ఉమారాణికి ఓట్లు 615 చొప్పున సమానంగా వచ్చాయి. దీంతో అధికారులు టాస్నిర్వహించగా దొమ్మాట అనురాధను విజయం వరించింది. డ్రా ఫలితంపై అభ్యంతరం.. లాఠీచార్జ్ సాక్షి, సిద్దిపేట: మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్ఖాన్పల్లి సర్పంచ్గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్ఎస్ మద్దతుదారులే. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మి కి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచి్చందో పూర్తిగా చూపించకుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు. ఒక్క ఓటుతో విజయం..గూడూరు/ రేగోడ్ /మంథనిరూరల్: మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు సనుప సుజాత ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. పంచాయతీ పరిధిలో 1,140 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ మద్దతుదారు నూనావత్ స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ మద్దతుదారు సుజాత అభ్యంతరం చెబుతూ రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. రీ కౌంటింగ్లో సుజాతకు 550 రాగా, స్వాతికి 549 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరగా, మరోసారి రీ కౌంటింగ్ చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో రిటర్నింగ్ అధికారులు సుజాతను విజేతగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ హాల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కొండాపూర్లో...: మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ సర్పంచ్గా బేగరి పండరి ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. ఓట్ల కౌంటింగ్లలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సత్తయ్యకు 287 ఓట్లు రాగా.. కాంగ్రెస్ మద్దతులో పోటీలో ఉన్న బేగరి పండరికి 288 ఓట్లు వచ్చాయి. ఇదే మండల పరిధిలో గజ్వాడ సర్పంచ్గా మున్నూరి సరోజన 570 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్గా ఒక్క ఓటుతో బీఆర్ఎస్ మద్దతుదారు తోంబూరపు సుజాత విజయం సాధించారు. ప్రత్యర్థి కోరవేన వైష్ణవికి 559 ఓట్లు రాగా సుజాతకు 560 ఓట్లు వచ్చాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది.ఓటు కోసం పల్లెబాటచౌటుప్పల్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం పెద్ద సంఖ్యలో పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరుగుపయనమయ్యారు. దీంతో హైదరాబాద్ మార్గంలోనూ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. -
కాంగ్రెస్దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశలో గురువారం 3,835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై విజయం సాధించగా..మరి కొన్నిచోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటీపోటీగా ఉన్నట్లు కనిపించింది.కాంగ్రెస్ విజయ దుందుభి మొత్తం 4,236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీనితో 3,835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి..ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2,440 గ్రామాల్లో సర్పంచ్లుగా గెలుపొందారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల (అధికార పార్టీ నేతలు) గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించినట్లు సమాచారం. సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1,132 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. స్వతంత్రులు 364 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 206 స్థానాల్లో, వామపక్షాలు 25 స్థానాల్లో గెలుపొందాయి. మిగతా చోట్ల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.చనిపోయినా సర్పంచ్గా గెలుపు ఈ ఎన్నికల్లో 95 సంవత్సరాల వృద్ధుడు సర్పంచ్గా ఎన్నికవగా.. మరోచోట ఎన్నికల బరిలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల తల్లిపై కూతురు, అత్తపై కోడలు విజయం సాధించిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3,835 సర్పంచ్ స్థానాలతో పాటు 27,628 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరిగాయి. -
హ్యామ్కు దారేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం–హ్యామ్) విధానంలో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారుల విస్తరణ, మరికొన్ని రోడ్ల పటిష్టతకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్యారంటీ ఇచ్చే తరహాలో కాంట్రాక్టర్లతో ఒప్పందానికి ముందుకు వచ్చినా కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికార వర్గాల సమాచారం. నిధులు క్రమం తప్పకుండా కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ఎస్క్రో (నేరుగా ఖజానా నుంచి మొదట కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా) ఖాతా ఏర్పాటుచేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ని ఆహా్వనించినా పంచాయతీరాజ్ శాఖ పిలిచిన ఆర్ఎఫ్పీకి స్పందన రాలేదని తెలియవచ్చింది. అలాగే ఆర్ అండ్ బీ అధికారులు పిలిచిన ఆర్ఎఫ్పీకి టెండర్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజుకాగా టెండర్లకు స్పందన రాకపోవడంతో మరో 15 రోజులపాటు గడువు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క హ్యామ్ రహదారుల కోసం కాంట్రాక్టర్లకు రుణాలు ఇవ్వాలని.. తద్వారా ప్రభుత్వం చేపట్టాలనుకున్న ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ బ్యాంకర్ల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులు శుక్రవారం మరోసారి బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇదీ లక్ష్యం..: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నుంచి మండలాలకు మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, జి ల్లా కేంద్రాల నుంచి నాలుగు లేన్ల రహదారులుగా మార్చా లని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఇవి కాకుండా ప్రస్తుత రహదారులను మరింత పటిష్ట పరిచేలా ప్రణాళిక రచించింది. తొలిదశలో ఆర్ అండ్ బీకి చెందిన 5,824 కి.మీ. రోడ్లను రూ. 11,399 కోట్లతో.. పంచాయతీరాజ్ శాఖలో 17 ప్యాకేజీల కింద 7,449 కి.మీ. రోడ్లను రూ. 6,294 కోట్లతో నిర్మించడంతోపాటు వాటిని 15 ఏళ్లపాటు కాంట్రాక్టర్లే నిర్వహించేలా హ్యామ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. రోడ్ల నిర్మాణాన్ని ఏకకాలంలో చేపట్టడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రహదారులు నిర్మించేలా ఈ విధానాన్ని రూపొందించింది. హ్యామ్ పద్ధతి కింద రహదారి నిర్మాణం జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మేరకు నిధులను కాంట్రాక్టర్లకు సమకూర్చి మిగిలిన 60 శాతం నిధులను సంవత్సరానికి అసలు, వడ్డీని కలుపుతూ వారికి చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం వాయిదా పద్ధతిలో చేసే చెల్లింపుల్లో జాప్యం ఉండబోదన్న నమ్మకం కాంట్రాక్టర్లకు లేకపోవడంతో వారు ముందుకు రావడంలేదని ఆర్ అండ్ బీలోని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ల నెట్వర్త్, వారి రుణాల చెల్లింపు ప్ర క్రియ సక్రమంగా ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సర్కార్కు హైకోర్టు జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. వారం లోపు చెల్లించాలని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.చివరి అవకాశం ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది. -
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టిషాకిచ్చారు. సర్పంచ్ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎంపీ ఈటల రాజేందర్ బిగ్షాక్ తగిలింది. ఈటల బలపరిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపుపొందారు. ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం ఈ ఘటన పంచాయతీ ఎన్నికల్లో హాట్టాపిగ్గా మారగా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.కాగా, ఇవాళ జరిగిన పోలింగ్లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 1484 పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 723 మంది, బీజేపీ 132 మంది, ఇతరులు 339 మంది గెలుపొందారు. -
ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది. -
రేషన్కార్డుదారులకు అలర్ట్.. త్వరపడండి
సాక్షి, హైదరాబాద్: ఆహారభద్రత కార్డులోని సభ్యులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేసిన పౌర సరఫరాల శాఖ తాజాగా కొత్త సభ్యులపై దృష్టి సారించింది. కొత్త రేషన్కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్తసభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త సభ్యులు సైతం ఈ కేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. రేషన్కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ–పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు సైతం రేషన్ కోటా డ్రా కోసం వస్తున్న లబ్ధిదారులకు ఈ కేవైసీ(e-KYC) గురించి గుర్తు చేస్తున్నారు.వాస్తవంగా గత రెండేళ్లగా ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ పలు మార్లు గడువు పెంచుకుంటూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే డుబ్లికేట్, చనిపోయిన యూనిట్లు ఎరివేతకు గురికాగా, మిగిలిన వాటిలో దాదాపు 85 శాతం ఈ–కేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుంటే సదరు యూనిట్ల రేషన్ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఆధార్కు ఈ–పాస్ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం (Rice) తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం అవుతుంది. దీనితో చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చనే ఉద్దేశంతో ఈ–కేవైసీ నిబంధన తప్పనిసరి చేసినట్లు కనిపిస్తోంది.అప్డేట్ లేక తిప్పలు ఆధార్ నవీకరణ(అప్డేట్) లేక బయోమెట్రిక్ వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. ఆధార్ అప్డేట్ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్ (Aadhaar) నవీకరణ పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఈ–కేవైసీ ప్రక్రియకు దూరమవుతున్నారు. చదవండి: బంజారాహిల్స్లో రూ. 350కు గజమా? -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ ఎంపీలు మరింత యాక్టివ్గా ఉండాలంటూ వారికి ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్సయింది. అది నాకు చాలా ఆవేదన కలిగించిందంటూ ఎంపీలతో మోదీ అన్నారు.తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడింది. 8 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నలు గుప్పించారు. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేలా దూకుడుగా పని చేయాలని సూచించారు.ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. నిత్యం ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండాలంటూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో ఎంపీలకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.కాగా, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసంలో విందు కార్యక్రమం జరగనుంది. విందు ఏర్పాట్లను కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి అప్పగించారు.విందు కార్యక్రమంలో 54 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక కేంద్రమంత్రి కూర్చునే ఏర్పాట్లు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని.. ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై మోదీ మాట్లాడనున్నారు. -
పాసులుంటేనే ఫుట్బాల్ మ్యాచ్కు ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అర్జెంటీనా ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ‘గోట్’ ఫుట్బాల్ మ్యాచ్కి పాస్ లేకుంటే అనుమతి లేదని రాచకొండ పోలీసులు ఆదేశించారు. ఈ నెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– మెస్సీతో ఉప్పల్ మైదానంలో మెస్సీ– గోట్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ సు«దీర్ బాబు తెలిపారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మ్యాచ్కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. -
మరదల్ని ఎందుకు చంపాడంటే!
బౌద్ధనగర్: తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకొని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి పరారైన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు బుధవరం చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ బాల స్వామి వివరాలు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మిర్యాపుట్టి మండలం సిరియకంది గొల్లవీధికి చెందిన డుక్క ఉమా శంకర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్నగర్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువు అయిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరడంతో వారు అంగీకరించారు. ఆరు నెలల క్రితం నిశి్చతార్థం కూడా జరిగింది. అయితే, ఉమా శంకర్కు మద్యం అలవాటు ఉంది. తాగిన ప్రతీసారి పవిత్రకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించి విసిగించాడు. ఈ నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కక్షగట్టిన ఉమాశంకర్ గత సోమవారం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందే గొంతుకోసి హత్యచేసినట్లు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించి హంతకుడు ఉమాశంకర్ చిలకలగూడలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఐ పురేందదర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో.. ఇదేం చలి!
సాక్షి, హైదరాబాద్: మహా నగరం గజగజా వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణ శీతాకాల ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతోంది. శివారు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ రికార్డు అవుతోంది. మరోవైపు ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. దీంతో రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.2 డిగ్రీలు నమోదు కాగా, పటాన్చెరులో 7.8, రాజేంద్రనగర్లో 9.5, హయత్నగర్ 10 డిగ్రీలు నమోదయ్యాయి. -
కూతురుని ప్రేమించాడని.. ఇంటికి పిలిచి.?
పటాన్చెరు టౌన్: ప్రేమ వ్యవహారం బీటెక్ బీటెక్ విద్యార్థిని బలి తీసుకుంది. మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాట్తో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రావణ్ సాయి (19) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెదనాన్న వద్ద ఉంటున్నాడు.పటాన్చెరు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సృజన లక్ష్మీసాయి మెడోస్లో ఉండే యువతితో ఇతనికి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా వీరి వైఖరిలో మార్పు కనిపించలేదు. దీంతో పథకం ప్రకారం మాట్లాడేందుకంటూ మంగళవారం అమ్మాయితో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. మాటామాటా పెరిగి..ప్రేమ విషయమై యువతి తల్లి సిరి, సాయి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తురాలైన సిరి క్రికెట్ బ్యాట్తో సాయిని, కూతురిని కొట్టింది. తల, వీపుపై బలంగా దెబ్బలు తగలడంతో సాయి స్పృహ కోల్పోయాడు. కుమార్తె చేయి విరిగింది. దీంతో తల్లి, సోదరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం వేకువజామున ఇంటికి రాగా.. అప్పటికీ ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉన్న సాయిని చూసి వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. సాయి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉపాధి కోర్సులు కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి ఆవశ్యకత మరోమారు తేటతెల్లమైంది. చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పించే కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రజలు బలంగా కోరుతున్నట్టు వెల్లడైంది. తెలంగాణ రైజింగ్–2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 40 శాతానికి పైగా సత్వర ఉపాధి కోర్సులు కావాలని, ఈ దిశగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలని అడగడం గమనార్హం. తెలంగాణను మూడు మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వాములను చేసింది. ఆన్లైన్ ద్వారా సిటిజన్ సర్వే నిర్వహించి ప్రజలు ఏ కోణంలో అభివృద్ధిని కోరుకుంటున్నారనే సమాచారం తీసుకుంది. ప్రజల అభిప్రాయాలను విజన్ డాక్యుమెంట్లోనూ పొందుపర్చింది. » సిటిజన్ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ శాతం మంది మొదటి ప్రాధాన్యం కింద ఉపాధి కల్పనా కోర్సుల గురించే ప్రస్తావించారు. ళీ ఆ తర్వాత ఎక్కువమంది చిన్న వ్యాపారాలకు మద్దతు లభించే విధానాలను ప్రభుత్వం రూపొందించాలని కోరారు. » వ్యవసాయ రంగ ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని కోరినవారు మూడో స్థానంలో ఉండడం గమనార్హం. » తమ నివాసాలకు సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ళీ 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి కావాలంటే పారదర్శక పాలన జరగాలని కోరిన వారు నాలుగోవంతు కూడా లేరు. ళీ మహిళల భద్రత గురించి ఈ సర్వేలో పాలుపంచుకున్న వారు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ళీ ఆరోగ్య బీమా గురించి ప్రస్తావించిన వారు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ప్రజాభిప్రాయమే భవిష్యత్కు బలం ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా పాల్గొన్నారని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో సర్వే జరిగిన తీరు, ప్రజల అభిప్రాయాలను కూడా పేర్కొంది. ఈ సర్వేలో మహిళలు, విద్యార్థులు, కారి్మకులు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు పాల్గొన్నారు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది యువత తమ అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా 2047 విజన్కు బలం చేకూర్చారని డాక్యుమెంట్లో ప్రభుత్వం వెల్లడించింది. ప్రజారోగ్యం కోణంలో ప్రజలు అడిగినవి ఆస్పత్రులు, మొబైల్ వ్యాన్లు, తక్కువ ఖర్చుకు వైద్య ప రీక్షలు, టెలీ మెడిసిన్, స్వచ్ఛమైన నీరు–పారిశుధ్యం, వ్యా ధుల నియంత్రణ, ఆరోగ్య బీమా సౌకర్యం, మానసిక ఆరోగ్యం, పోషకాహారం, తక్కువ ఖర్చుతో మానసిక వైద్యం. ఆర్థిక వృద్ధి కోణంలో... సత్వర ఉపాధిని కల్పించే కోర్సులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, చిన్న వ్యాపారాలకు మద్దతు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మార్కెట్ మార్గదర్శకత్వం, పర్యాటక అభివృద్ధి, స్థానిక చేతి వృత్తులకు ప్రోత్సాహం. స్థానికాభివృద్ధి, అవకాశాలపై.... సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు, స్థానికంగా ఉద్యోగాలు, పారదర్శక పాలన, మహిళాభద్రత, వారికి మంచి అవకాశాలు కల్పించడం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం. -
మెస్సీ@ తాజ్ ఫలక్నుమా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రానున్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాతబస్తీలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. అక్కడ నుంచే ఆయన తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడి యానికి వెళ్లి.. సీఎం రేవంత్రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఆపై ప్యాలెస్కు తిరిగి వచ్చి, ఎంపిక చేసిన ప్రముఖులను కలుసుకుంటారని తెలిసింది. శనివారం మెస్సీ పర్యటన నేపథ్యంలోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 1894లో నిజాం నిర్మించిన ఫలక్నుమా ప్యాలెస్, 2010లో తాజ్ ఫలక్నుమా హోటల్గా మారింది. 2014 నవంబర్లో సల్మాన్ఖాన్ సోదరి అరి్పత ఖాన్ వివాహం ఇందులోనే జరిగింది. 2017 నవంబర్లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు తాజ్ ఫలక్నుమాలోనే విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెస్సీ కూడా అందులోనే బస చేయనుండటంతో ఈ ప్యాలెస్ పేరు అంతర్జాతీయ స్పోర్ట్స్ సర్కిళ్లలోనూ మారుమోగనుంది. శనివారమే హైదరాబాద్ రానున్న మెస్సీ, ఆయన టీమ్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తాజ్ ఫలక్నుమా హోటల్కు వెళ్లి బస చేస్తుంది. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ బృందం తిరిగి నేరుగా హోటల్కే వెళుతుందని సమాచారం. శనివారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లోనే బస చేసే మెస్సీ, ఆదివారం అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, జి.సుదీర్బాబులతో పాటు నగర ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్లు మెస్సీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఓ పక్క మెస్సీతో పాటు ఆయన బృందం, మరోపక్క సీఎం రేవంత్రెడ్డి సహా ఇతర ప్రముఖులు స్టేడియం వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి రూట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఓ సవాల్గా తీసుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పాస్లు, టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతించనున్నారు. -
సీఎం‘కోడ్’ ఉల్లంఘన ఫిర్యాదు ఎంసీసీ కమిటీకి పంపాం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై వచ్చిన పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదును ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కమిటీకి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకు ముదిని వెల్లడించారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందాక, దానిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలి పారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదు అందిందన్నా రు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విజయో త్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అనుమతికి ఆమోదం తెలిపా మని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశామన్నారు. ఎంసీసీ పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు పనిచేస్తు న్నాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్కీబాత్’కార్యక్రమం తాము రెగ్యులర్గా నిర్వహిస్తున్నామని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనూ రేడియోలో ప్రసారం అవుతున్నందున ఆకాశవాణి అధికారు లు అనుమతి కోరారని చెప్పారు. బుధవారం ఎస్ ఈసీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్భగ వత్, పీఆర్ఆర్డీ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారి డా.జి.సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. మకరందుతో కలిసి రాణీ కుముదిని మీడియాతో మాట్లాడారు. గురువారం జరగనున్న తొలివిడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు, ఈ ప్రాంతాల్లో డబుల్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్పంచ్, వార్డుల ఏకగ్రీవాలకు సంబంధించి సమీక్ష, అభ్యర్థుల డిక్లరేషన్ల ఆధారంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే వీటికి సంబంధించి ఏవైనా ఉదంతాల్లో కేసులు నిరూపితమైతే ఆ ఎన్నికలు రద్దు అవుతాయని, ఏకగ్రీవాలపై ఆరోపణలు వచ్చిన చోట నివేదికలు కోరినట్టు చెప్పారు. నోటాను అభ్యర్థిగా పరిగణించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన వినతిపత్రంపై ఎస్ఈసీ స్పందన ఏమిటని ఓ విలేకరి కోరగా.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమి చేయాలి, సింగిల్ నామినేషన్ వస్తే ఏమి చేయాలి తదితరాలపై వేసిన పిల్పై విచారణ సుప్రీంకోర్టులో ఉందని రాణీకుముదిని తెలిపారు. దానిపై వచ్చే తీర్పు లేదా ఆదేశాలకు అనుగుణంగా తాము కూడా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. మహేశ్భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, వస్తువులు, డ్రగ్స్ ఇలా అన్ని కలిపి రూ.7,54 కోట్ల విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏకగ్రీవాలకు సంబంధించి సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వచ్చిన ఫిర్యాదులపై అక్కడి పోలీస్ కమిషనర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలపై 3,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బంజారాహిల్స్లో రూ. 350కు గజమా?
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున బంజారాహిల్స్లో గజం రూ.350 చొప్పున మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు భూమిని క్రమబద్ధీకరించడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సామాన్య ప్రజలకూ అదే ధరకు ఎల్ఆర్ఎస్ చేస్తున్నారా అని అడిగింది. జీవోలో లోపాలు కనిపిస్తున్నా యని, పరిశీలించి తప్పు ఉంటే సరిదిద్దుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో తామే జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. కేకే కుమారుడు వెంకటేశ్వర్రావు, కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మికి భూమి క్రమబద్ధీకరణ చేస్తూ 2023, మే 23న విడుదల చేసిన జీవో 56ను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో కింద వందల కోట్ల విలువైన భూమిని కె.కేశవరావు కుమారుడు, కూతురుతోపాటు కవితరావుకు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ చేశారన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎన్బీటీ నగర్లో 1,161 గజాల భూమిని రూ.2,500 చొప్పున, 425 గజాలను రూ.350 చొప్పున క్రమబద్ధీకరించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మురికివాడల్లో క్రమబద్ధీకరణకూ ఓ పరిమితిపిటిషనర్ తరఫున న్యాయవాది శ్రేయస్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్లో స్వల్ప ధరలకు ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ చేసిందన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర రూ.60 వేలు ఉండగా, రూ.350, రూ.2,500కు గజం చొప్పున ఇచ్చిందన్నారు. దీంతో ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. లబ్ధిదారులు ఆర్థిక శాఖకు వినతిపత్రం సమర్పించడంతో ప్రత్యేక జీవో విడుదల చేశారన్నారు. అప్పటికే ఒక ప్లాట్కు విద్యుత్ కనెక్షన్ ఉండటంతో.. కనెక్షన్ తీసుకున్న నాటి మార్కెట్ ధరకే క్రమబద్ధీకరించినట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో అందరికీ ఒకేలా ఉండాలి కానీ.. ఇలా ఒకరికి అనుకూలంగా ఉండేలా ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. మురికివాడల్లోనూ భూ క్రమబద్ధీకరణకు కూడా ఓ పరిమితి ఉందని వ్యాఖ్యానించింది. 1998 నాటి ధరను పరిగణనలోకి తీసుకోవడం సమర్థనీయం కాదంది. -
ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి పర్యటనలో ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీని కలుస్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. గ్లోబల్ సమ్మిట్కు రాహుల్గాంధీ హాజరు కాని నేపథ్యంలో, సమ్మిట్ జరిగిన తీరు గురించి సీఎం ఆయనకు వివరిస్తారని సమాచారం. గురువారం పార్లమెంటుకు వెళ్లి వీలును బట్టి కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. సోనియా గాందీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. శరద్ పవార్ విందులో రేవంత్, రాహుల్ భేటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న శరద్ పవార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ తోపాటు, మధుయాష్కీ గౌడ్ ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు..కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. -
నేడే 'తొలి' పోరు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభానికి గంట ముందే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటించనున్నారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను చేపడతారు. మొదటి దశలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 అభ్యర్థులు, 27,628 వార్డుసభ్య స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతకు సంబంధించి 5 గ్రామాలకు, 169 వార్డులకు అసలు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. 396 పంచాయతీల్లో సర్పంచ్లు, 9,633 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒక సర్పంచ్ స్థానంలో, 10 వార్డులలో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు జరగడం లేదు. ఇక పోటీలో ఉన్న సర్పంచ్అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడి బ్యాలెట్పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగియగానే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. సామాగ్రి, సిబ్బంది రెడీ.. పోలింగ్కేంద్రాలకు బుధవారం ఎన్నికల సామాగ్రి చేరుకుంది. సాయంత్రం కల్లా పోలింగ్సిబ్బంది కూడా చేరుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. ఓటరు స్లిప్పుల విషయంలో ఈసారి ఎస్ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. పోలింగ్కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి స్లిప్పులను పంపిణీ చేశారు. బుధవారం సాయంత్రం కల్లా వంద శాతం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఇవి అందనివారి కోసం పోలింగ్ రోజు కేంద్రం బయట బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. నేరుగా tsec. gov. in వెబ్సైట్ నుంచి కూడా ఫొటో లేని ఓటరు స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచే మద్యం అమ్మకాలను నిషేధించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆధార్, పాస్ట్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, బ్యాంక్ పాస్బుక్ తదితర గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చునని ఎస్ఈసీ ప్రకటించింది. -
ఓయూకి వెయ్యి కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు రాజకీయాలకు అతీతంగా చేపడతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఎవరు పైరవీలు చేసినా సహించబోమని, ఇందులో ప్రభుత్వ జోక్యం కూడా ఉండదని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదేనన్నారు. ఎంతోమంది ఉద్యమకారులను, మేధావులను అందించిన చరిత్ర ఓయూకు ఉందని చెప్పారు. అయితే గడచిన పదేళ్ళుగా వర్సిటీ అభివృద్ధికి దూరంగా ఉందని విమర్శించారు. ఓయూ అభివృద్ధికి బాటలు వేసేందుకే తాను వచ్చానని అన్నారు. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని, అందుకే రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడను ఎలా వదిలించాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. బుధవారం ఓయూను సందర్శించిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రమే..నాలెడ్జ్ కాదు ‘ఏ వ్యక్తికైనా భూమి లేకపోవడాన్ని పేదరికంగా గుర్తిస్తారు. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనమనే అనాలి. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని దూరం చేస్తుంది. అయితే డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. ఆ అవకాశం లేని పేదల కోసం ఓయూలో అధునాతన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆంగ్ల భాష కమ్యూనికేషన్ మాత్రమే.. నాలెడ్జ్ కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని వారు ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడరు. చైనీయులకు ఇంగ్లీష్ భాష రాదు. ఆ దేశం ఉత్పత్తులు నిలిపివేస్తే అమెరికా విలవిల్లాడుతుంది. నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా. గుంటూరులో చదువుకోలేదు. గూడు పుఠాణీలు తెలియవు. నాకు విదేశీ భాష రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవడం వచ్చు. పేదలు, నిస్సహాయులకు సాయం చేయాలనే తపన నాకు ఉంది. అలాగని ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. నాలెడ్జ్, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. చరిత్ర గుర్తుంచుకునేలా పాలన అందించాలన్నదే నా లక్ష్యం..’అని సీఎం వెల్లడించారు. యువత చదువుకుని పైకి రావాలి ‘విద్యార్థులు రాజకీయాల ఉచ్చులో పడకుండా, నిబద్ధతతో చదువుకుని పైకి రావాలి. డాక్టర్లు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు కావాలి. యువత డిగ్రీలు సాధిస్తున్నారు కానీ, నైపుణ్యం ఉండటం లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది. నాకు ఫాం హౌస్ల్లేవ్ చేతనైతే ఓయూ ఆర్ట్స్ కాలేజీకి రమ్మని గతంలో కొంతమంది సవాల్ విసిరారు. కానీ నేను అభిమానంతో ఇక్కడికి వచ్చా. నాకు ఎక్కడా ఫాం హౌస్లు లేవు. నేను ప్రజల సొమ్ము దోచుకోలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రెండేళ్ళల్లో ఏం చేశావని నన్ను ప్రశ్నించే నేతలు పదేళ్ళ పాలనలో ఏం చేశారో చెప్పాలి. కుటుంబం మొత్తం వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు కట్టుకున్న వాళ్ళు దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామన్న హామీని అమలు చేశారా? మేము రెండేళ్ళ పాలనలో ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాం. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేశాం. ఎస్సీ వర్గీకరణ అమలుతో సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేపట్టాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఏవీఎన్ రెడ్డి, అద్దంకి దయాకర్, హైదరాబాద్ మేయర్ జి. విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కళాశాల విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఓయూ వీసీ కుమార్ మొలుగరం తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నమూనాల ఆవిష్కరణ సభా వేదికపై ఓయూ అభివృద్ధికి సంబంధించిన పలు నమూనాలను సీఎం ఆవిష్కరించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్లో కొత్త అకడమిక్ బ్లాక్, పరిశోధన, అభివృద్ధి బ్లాక్, కొత్త బాలుర, బాలికల హాస్టళ్లు, బహుళార్ధసాధక క్రీడా కేంద్రం, సమీకృత గ్రంథాలయం, కొత్త ఆరోగ్య కేంద్రం, జీవ వైవిధ్య ఉద్యానవనం, కన్వెన్షన్ సెంటర్, సైకిల్ ట్రాక్లు, పాదచారుల నడక మార్గాలతో కూడిన విస్తృత రహదారి నెట్వర్క్ ఉన్నాయి. కాగా ఓయూ అభివృద్ధి పనులకు రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. -
మీడియా క్రికెట్లో దూసుకుపోతున్న సాక్షి టీమ్.. ఫైనల్లో టీవీ9తో అమీతుమీ
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్ టీవీతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిగ్ టీవీ టీమ్.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాక్షి టీమ్కు చెందిన సతీష్ 48 పరుగులు చేయగా.. రమేష్ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్లోకి అడుగు పెట్టింది.బుధవారం జరిగిన సెమీస్లో సాక్షి టీమ్ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే విజయం సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్, రమేష్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు తీశారు.అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
పటాన్ చెరులో పరువు హత్య!
సాక్షి,హైదరాబాద్: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.పటాన్ చెరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పెళ్లి చేస్తామని నమ్మించి పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్పై దాడి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.పోలీసుల దర్యాప్తు ప్రారంభంసమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికులు ఆగ్రహం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
సీఎం రేవంత్పై ఫిర్యాదును పరిశీలిస్తున్నాం: ఎస్ఈసీ రాణి కుమిదిని
సాక్షి, హైదరాబాద్: రేపటి మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ జరిగినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని దేవి ప్రకటించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె బుధవారం మీడియాకు వెల్లడించారు. రేపు మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్ల, మైక్రో అబ్జార్వుల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్ల్ లు పంపిణి దాదాపు పూర్తి అయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తి అయిందని వెల్లడించారామె. సీఎం రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు పైనా ఆమె స్పందించారు. ఆ ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎంసీసీ(Model Code of Conduct) కమిటీకి పంపాం. ఆ కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం అనుమతి అడిగారు. మేం అనుమతి ఇచ్చాం అని అన్నారామె. 👇మొత్తం మండలాలు నోటిఫై: 189గ్రామ పంచాయతీలు నోటిఫై: 4236వార్డులు నోటిఫై: 37,440పోలింగ్ స్టేషన్లు: 37,562ఫేజ్–1 ఓటర్ల సంఖ్య: 56,19,430పురుషులు: 27,41,070మహిళలు: 28,78,159ఇతరులు: 201👇పోలింగ్కు వెళ్లే GPలు: 3,834పోలింగ్కు వెళ్లే వార్డులు: 27,628సర్పంచ్ అభ్యర్థులు: 12,960వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 65,455ROలు నియామకం: 3,591పోలింగ్ సిబ్బంది: 93,905మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడూ దశలకు)వెబ్కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,461బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 45,086 👉ఇక ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు.. సీజ్లు తదితర వివరాలను ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు: 3,214 FIRలుప్రివెంటివ్ యాక్షన్లో బౌండ్ ఓవర్ వ్యక్తులు: 31,428డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాలు: 902సీజ్ చేసిన నగదు: ₹1,70,58,340సీజ్ చేసిన మద్యం: ₹2,84,97,631డ్రగ్స్ / నార్కోటిక్స్: ₹2,22,91,714విలువైన లోహాలు / ఆభరణాలు: ₹12,15,500ఇతర వస్తువులు: ₹64,15,350మొత్తం సీజ్ విలువ: ₹7,54,78,535రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ డబుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. -
‘ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి’
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా.. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది.మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే. జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారుప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా.. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు..పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారుజయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారుచదువు లేకపోవడం వెనుకబాటుతనంభూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది.ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది.. కానీ నాణ్యమైన విద్య కావాలి. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కులవివక్షను రూపి కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం. రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం. తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదు. పిల్లల భవిష్యత్ను చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని నియమించుకొండివిద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి. నిబద్ధతతో నిరంతరం కష్టపడండి.. తప్పకుండా ఫలితం వస్తుంది.మీరంతా డాక్టర్లు లాయర్లు, ఉన్నతాధికారులు కావాలి. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని’ ఆకాంక్షించారు -
జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
హైదరాబాద్: చలికాలంలో చల్లని వాతావరణం గుండెను బలహీనం చేస్తుందని, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుందని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి కాథ్ల్యాబ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా అపోలో ఆసుపత్రి సహకారంతో కార్డియాక్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్యాపులో 200 మంది జర్నలిస్టులు బీపీ, ఈసీజీ, 2డి ఎకో, బీఎంఐ, డెంటల్ టెస్టులు చేయించుకున్నారు. చాలామంది జర్నలిస్టులకు బిపీ, షుగర్ కంట్రోల్లో ఉండటం లేదని, మందులు సరిగ్గా వాడటం లేదని, ఈ విషయంలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ కుమార్ అన్నారు. అవసరమైతే అపోలో తరఫున జర్నలిస్టులకు 50 శాతం రాయితీ కూడా ఇస్తామని తెలిపారు. కార్డియాలజిస్ట్ రామకృష్ణ మాట్లాడుతూ చాలామంది జర్నలిస్టులకు చాతిలో నొప్పి, ఎడమచెయ్యి లాగడం, నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు ఇలాంటి హెల్త్ క్యాంపుల్లో బయటపడుతున్నాయని అన్నారు. వైద్యులను ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల సత్కరించారు. -
TG: ఏసీపీ మునావర్పై వేటు..
హైదరాబాద్: నగరంలో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. కూల్సుంపుర ఏసీపీ మునావర్ను సస్పెండ్ చేశారు సీపీ సజ్జనార్ . అవినీతి ఆరోపణలు, భూ వివాదాలు, కేసుల తారుమారుపై ఏసీపీ మునావర్పై వేటు వేశారు. తన మాట వినని పోలీస్ సిబ్బందిని పరువు తీసేలా వ్యవహరించినట్ల విచారణలో తేలింది. దాంతో ఏసీపీ మునావర్ వ్యవహారంపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారుఉ. మ మునావర్ ను హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేస్తూ ఆదేశాలు చేశారు. ఇటీవల అదే పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇన్స్పెక్టర్ సునీల్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ కీలక కేసుకు సంబంధించి విచారణను ప్రభావితం చేసేలా సునీల్ వ్యవహరించారు. ఉద్దేశ్యపూర్వకంగా కేసులో నిందితుల పేర్లు మార్చి ఒక వర్గానికి అనుకూలంగా వ్యహహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఆ వర్గం నుంచే డబ్బులు కూడా భారీగా అందినట్లు మీడియాలో వెలుగుచూసింది. ఇది ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో సునీల్ను సస్పెండ్ చేశారు. ఆపై రోజుల వ్యవధిలోనే కూల్సుంపుర ఏసీపీ మునావర్ను సస్సెండ్ చేయడం గమనార్హం.. -
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి
హైదరాబాద్: పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి విచక్షణా రహితంగా ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాంనగర్కు చెందిన చాకలి గోపాల్, శైలజ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఎయిర్పోర్టు బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా శైలజ వారు నివాసం ఉండే అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తుంది. గోపాల్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి శైలజను వేధిస్తున్నాడు. దీనిపై ఇటీవలే ఆమె సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో తిరిగి ఇంటికి వచి్చంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పుల్లుగా మద్యం తాగి వచి్చన గోపాల్ భార్యతో గొడవకు దిగి..వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. దాదాపు 20 నుంచి 25 కత్తిపోట్లు పొడవడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. పిల్లలు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిన గోపాల్ అనంతరం పారిపోయాడు. శైలజ అరుపులకు బయటకు వచి్చన చుట్టుపక్కల వారు ఆమెను అంబర్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ రాంచంద్రారెడ్డి కేసు నమోదు చేసి..మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ముచ్చటగా 300 జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్
సాక్షి, హైదరాబాద్: శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాలు, నియోజకవర్గాల పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేసినట్లు చెప్పారు. విస్తరించిన పరిధితో 300 వార్డులుగా డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించారు. వివరాలు జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ చూడవచ్చన్నారు. ప్రజలు, పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలోనూ వీటిని స్వీకరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల సూచనలూ పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చాలా వార్డులకు సరిహద్దులు మారాయి. కొన్ని పాత వార్డులు రెండు వార్డులయ్యాయి. కొన్ని గల్లంతయ్యాయి.ఇదీ ప్రాథమిక నోటిఫికేషన్.. కాలానుగుణంగా సవరించి 6.11.1996న ప్రభుత్వం జారీ చేసిన జీఓ (నెంబర్ 570), తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996లోని నిబంధన 8 మేరకు, ఈ నెల 8న జారీ అయిన జీఓ (నెంబర్ 266) ననుసరించి జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 300 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ స్థానికులకు తెలియజేయడమైనదంటూ ప్రాథమిక నోటిఫికేషన్ పేరిట వెలువరించిన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు వివరణల వివరాలను జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయంలో నోటీసు బోర్డులపై ఉంచినట్లు తెలిపారు. వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్ (ఠీఠీఠీ.జజిఝఛి.జౌఠి.జీn)లో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ నివాసితులు ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలుంటే ఈ నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ (9.12.2025) నుంచి 7 రోజుల్లోపు దాఖలు చేయాల్సిందిగా కమిషనర్ కోరారు. ఇంతింతై.. మహా నగరమంతై.. హైదరాబాద్ నగర పరిపాలన నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర. ఒక పరిణామ క్రమం. 1800 కాలంలో చిన్నపాటి మున్సిపల్ బోర్డులతో మొదలైన వ్యవస్థ.. ప్రస్తుతం 27 స్థానిక సంస్థల విలీనంతో మరింతగా విస్తరించింది. బల్దియా పరిణామ క్రమమిలా.. చారిత్రక దశలు 1869: నిజాం కాలంలో కొత్వాల్– ఎ–బల్దియా ఆధ్వర్యంలో నగర పరిపాలన. 1886: చాదర్ఘాట్ ప్రత్యేక మున్సిసిపాలిటీ. 1921–1933: హైదరాబాద్ బోర్డు + చాదర్ఘాట్ బోర్డు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా మార్పు. 1934: తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు. 1942–1951: సికింద్రాబాద్ మున్సిపాలిటీ.. అనంతరం కార్పొరేషన్గా మార్పు. జీహెచ్ఎంసీ ఏర్పాటు.. 2007: శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ). çపరిధి: 650 చ.కి.మీ. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు. ప్రస్తుతం: శివార్లలోని 12 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీలోని 150 నుంచి 300 వార్డులకు పెరుగుదల. ఈ పరిణామ క్రమంలో ఒకప్పటి నిజాం రాజధాని, ఇప్పుడు గ్లోబల్ మెట్రోపాలిటన్గా మారింది. నగర పరిపాలన మరింత విస్తరించింది. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు. హైదరాబాద్ భవిష్యత్ దిశలో ఇది ఒక నూతనాధ్యాయం. -
ఉస్మానియాకు సీఎం రేవంత్
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మాని యా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బుధవారం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్ప టికే ఓయూ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్న ట్లు గతంలో ప్రకటించిన సీఎం.. నేడు ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నా రు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నా రు. యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీపైనా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఓయూకి రెండోసారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి ప్రకటించబోయే వరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి గత ఆగస్టు లో యూనివర్సీటీలో వివిధ హాస్టళ్ల ప్రారంభోత్సవానికి క్యాంపస్కు వచ్చారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయా లని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. ఈ పనులకు శంకుస్థాపనలు శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను కూల్చివేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన సముదాయం, ఇంజినీరింగ్ కాలేజీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లా భవనం తదితర అభివృద్ధి పనులకు సభా వేదిక ద్వారానే సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా.. యూనివర్సిటీలోని విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత నెల రోజులుగా సీఎం రాక కోసం ఉస్మానియా యూనివర్సిటీ గంపెడాశతో వేచి చేస్తోంది. సీఎం వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనీ భావిస్తున్నాయి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉందని ఓయూ అధికారులు చెబుతున్నారు. ఇవీ డిమాండ్లు ⇒ దాదాపు 25 ఏళ్లుగా చాలీచాలనీ వేతనాలతో ఓయూలో కాంట్రాక్టు, పార్ట్ టైం టీచర్లు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. యూనివర్సిటీ న్యాక్ ఏ గ్రేడు వంటి వివిధ జాతీయ స్థాయి ర్యాంక్లను సాధించడానికి పాటుపడుతున్నామంటున్నారు. తమకు యూజీసీ వేతనాలను వర్తింపజేయాలని కోరుతున్నారు. ⇒ యూనివర్సిటీలోని బోధనేతర సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 30 ఏళ్ల నుంచి ఆఫీస్ వర్క్లో వివిధ స్థానాల్లో సేవలందిస్తున్నారు. తాము కనీస వేతనాలకు నోచుకోవడం లేదంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా బోధనేతర రంగంలో యూనివర్సిటి అభివృద్ధికి అహరి్నశలు కృషి చేస్తున్నామంటున్నారు. తమను క్రమబదీ్ధకరించాలనీ కోరుతున్నారు. ⇒ సీఏఎస్ ఇంటర్వ్యూల్లో 47 మందికి ప్రమోషన్స్లో అన్యాయం జరిగిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. సీఎం దీనిపై స్పందించి తమకు న్యాయం చేయాలనీ అధ్యాపకులు కోరుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను వెంటనే అమలు చేయాలని యూనివర్సిటీ అ«ధ్యాపకులు వేడుకుంటున్నారు. -
Hyd: కామాటిపురాలో దారుణ హత్య
హైదరాబాద్: పాతబస్తీలోని కామాటిపురా పీఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న(మంగళవారం) రాత్రి అరవింద్ మోస్లీ(30) అనే వ్యక్తి సైకిల్పై వెళ్తుండగా అడ్డగించి హత్య చేశార పలువురు గుర్తు తెలియని దుండగులు. మోస్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య పని ముగించకుని సైకిల్పై వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పాతగొడవలు, వివాహేతర సంబంధం హత్యకు కారణం అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అరవింద్ ఘోస్లే , బియ్యం షాప్లో పని చేస్తున్నాడు.. కామాటిపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్టరీకి తరలించారు..కాగా, నగరంలో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతకుముందు రెండు రోజుల క్రితం హైదరాబాద్లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర గురయ్యాడు.. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. మల్కాజ్గిరిలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్పేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆకాశంలో వికసించిన డ్రోన్ పుష్పాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ సిగలో డ్రోన్ పుష్పాలు వికసించాయి. ఆకాశంలో కాంతి రేఖలు వెదజల్లుతూ కనువిందు చేశాయి. రాత్రి సరిగ్గా 8.53 నిమిషాలకు 3 వేల డ్రోన్లు ఆహూతులపై వెలుగు పూలు విరజిమ్మాయి. తెలంగాణ సాంకేతికత, సమర్థతను చాటి చెబుతూ సాగిన డ్రోన్ విన్యాసాలు అలరించాయి.స్వాగత ముద్రతో ప్రారంభమైన డ్రోన్ ప్రదర్శనలో.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సృష్టే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’, హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ, 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ట్రిపుల్ ఆర్, కొత్త ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ సరోవర్, ఫ్యూచర్సిటీ, స్కిల్స్ వర్సిటీ, మ హిళా శక్తి, రైతు సంక్షేమం వంటివి ఆకాశంలో కనువిందు చేశాయి. 3 వేల డ్రోన్లతో కూడిన ప్రదర్శన గిన్నిస్ రికార్డు కావడంతో ఈ మేరకు బుక్లో నమోదు చేసిన రికార్డు పత్రాన్ని నిర్వా హకులు సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. -
సమ్మిట్ సంబురం ముగిసింది
సాక్షి, హైదరాబాద్/ రంగారెడ్డి జిల్లా: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఇందుకోసం సుమారు 25 రోజుల పాటు సర్వశక్తులూ కేంద్రీకరించి శ్రమించింది. ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సు తెలంగాణ సత్తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటేలా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండురోజుల సదస్సులో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, ఒప్పందాలపై దిగ్గజ సంస్థల ప్రకటనలు చేయడం గమనార్హం.సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో..ఫ్యూచర్ సిటీలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో స్టార్ హోటల్ వసతులను తలపించేలా రెండు ప్రధాన హాళ్లు, మరో ఆరు అనుబంధ సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. అతిథులు, ప్రతినిధులకు ఆహ్వానం, వసతి, రవాణా, భోజనం సహా ఎక్కడా లోటు రాకుండా ఏర్పాట్లు జరిగాయి. ప్రముఖులను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సదస్సు ప్రాంగణానికి రప్పించేందుకు మూడు ప్రత్యేక హెలిపాడ్లు నిర్మించారు.ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, పూలతోటలను సృష్టించారు. మొత్తం 45 స్టాళ్లు..: 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సమావేశ ప్రాంగణం నిర్మాణం కాగా, ప్రభుత్వ ప్రైవేటు సంస్తలు ఎగ్జిబిషన్లో 45 స్టాళ్లు ఏర్పాటు చేశాయి. డిజిటల్, ఏఐ, 3 డి సాంకేతికత మేళవింపుతో ఆహూతులను అబ్బురపరిచేలా ఏర్పాటు చేసిన స్టాళ్లు తెలంగాణ, హైదరాబాద్ భవిష్యత్ ప్రగతిని కళ్ల ముందు సాక్షాత్కరింప చేశాయి. నెట్జీరో సిటీ, రక్షణ శాఖ, మూసీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిజిటల్ తెరలతో కూడిన డిజిటల్ టన్నెల్, రోబో, మూసీ టన్నెల్, ఏరోస్పేస్ స్టాళ్ల వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యూచర్సిటీ, మూసీ, గ్రీన్ ఎనర్జీ, ఏవియేషన్, ఉద్యానవన, లైఫ్ సైన్సెస్, హ్యాండ్లూమ్స్, పర్యాటక సాంస్కృతిక, రక్షణ, భద్రత విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వీక్షకులతో నిండిపోయాయి. తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులుప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 5 వేల మందికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అయితే భారత్ సహా 40కి పైగా దేశాల నుంచి సుమారు 2 వేల మంది అతిథులు, ప్రతినిధులు రెండు రోజుల సదస్సుకు హాజరైనట్లు అంచనా. అలాగే పారిశ్రామికవేత్తలు బాలీవుడ్, టాలీవుడ్ తారలు పాల్గొన్నారు.యువ పారిశ్రామికవేత్తలు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాంగణమంతా కలియ తిరిగారు. సినీ తారలు అర్జున్ కపూర్, చిరంజీవి, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్బాబు, శ్యాం ప్రసాద్రెడ్డి, రాకేష్ ఓం ప్రకాష్, జోయ అక్తర్, జెనీలియా, రితేష్ దేశ్ముఖ్, ప్రముఖ కీడ్రాకారులు అనిల్కుంబ్లే, పీవీ సింధూ, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల తదితరులు సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. సందర్శకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సిబ్బంది వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.క్విజ్ కాంటెస్ట్లో డీజీపీఇంధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నెట్ జీర్ సిటీ క్విజ్’ కాంటెస్ట్లో డీజీపీ శివధర్రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో 27 అంశాలపై తెలంగాణ స్తితిగతులు, అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలు, పెట్టుబడులకు సంబంధించి చర్చా గోష్టులు జరిగాయి.తెలంగాణ రుచులు.. ప్రత్యేక కానుకలుసదస్సుకు హాజరైన అతిథులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఇక్కత్ శాలువాలు, హైదరాబాద్కు ప్రత్యేకమైన ముత్యాల అభరణాల గిఫ్ట్బాక్స్, అత్తరు అందజేశారు. హైదరాబాద్ బిర్యానీ, ఇతర 50 రకాల వంటకాలను రుచి చూపించారు. రెండురోజుల పాటు సాయంత్రం వేళల్లో సంగీత దర్శకులు కీరవాణి సంగీత కచేరీ, సామల వేణు మేజిక్ ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్ షో, బాణసంచా ప్రత్యేక ఆక ర్షణగా నిలిచాయి. రెండురోజుల పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి సభా ప్రాంగణంలోనే మకాం వేశారు. సుమారు 2,500 మంది పోలీసులు, వేయి సీసీ కెమెరాలతో నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు స్కూల్ విద్యార్థులను, ప్రజలను గ్లోబల్ సదస్సు ప్రాంగణం సందర్శనకు అనుమతించనున్నారు. ఇందుకోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవ కాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత కోర్సుల అవసరం చాలా ఉంది. అందువల్ల ప్లస్ టు దశలోనే ఈ కోర్సులను ప్రవేశ పెట్టా లని భావిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ నాటికి స్కిల్స్ వర్సిటీ పూర్తవుతుంది. ఆ తర్వాత మరిన్ని కోర్సులను తీసుకొస్తాం. – వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు, వీసీ, స్కిల్స్ వర్సిటీపెట్టుబడిదారులను ఎంత గౌరవిస్తే అంత మేలు పెట్టుబడి దారులను ఒకప్పుడు శత్రువులుగా చూసేవారు. ప్రస్తుత సమాజంలో ప్రభుత్వం కన్నా..పెట్టుబడి దారులే పవర్çఫుల్గా మారారు. ప్రభుత్వం వద్ద లేనంత సంపధ వీరి వద్దే ఉంది. పెట్టుబడిదారులను ఎంత గౌరవిస్తే..సమాజానికి అంత మేలు జరుగుతుంది. – నర్రా రవికుమార్, జాతీయ చైర్మన్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( డిక్కి) -
3 మూల స్తంభాలు 10 వ్యూహాలు..
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల అనంతర అద్భుత స్వప్నాన్ని కాంక్షిస్తూ వికసిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2047 దార్శనిక పత్రాన్ని (విజన్ డాక్యుమెంట్) రూపొందించింది. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 10 వ్యూహాలను ఇందులో పొందుపరిచింది. ముచ్చటగా 3 మూల స్తంభాల సాయంతో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులను తీర్చిదిద్దడం ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాలనలో విశిష్టత, సేవలకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పరిపుష్టం చేసుకోవడంతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా 83 పేజీల డాక్యుమెంట్ను.. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. మానవ రూపంలోని రోబో వేదికపై నడుచుకుంటూ వచ్చి సీఎంకు ఈ విజన్ డాక్యుమెంట్ను అందజేయడం అతిథులను ఆకట్టుకుంది. ప్రగతి కోసం పది వ్యూహాలు 1. ముఖ్య సిద్ధాంతం.. 3 జోన్ల రాష్ట్రం రాష్ట్రాన్ని 3 ముఖ్య జోన్లుగా విభజించుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. సుమారు 160 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి భాగంలో సేవల రంగం కేంద్రీకృతంగా హరిత మెట్రోపొలిస్ కోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), ఓఆర్ఆర్కు అవతల, 360 కిలోమీటర్ల రీజనల్ రింగు (ట్రిపుల్ ఆర్) రోడ్డు లోపలి భాగంలో తయారీ రంగంపై ఫోకస్ చేస్తూ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), ట్రిపుల్ ఆర్ ఆవలి భాగంలోని గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్) ఏర్పాటు.2. సులభతర విధానాల దిశగా..గత రెండేళ్ల కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునే దశ నుంచి పారదర్శకంగా, వేగంగా విధాన నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చాం. ఈ రెండేళ్ల కాలంలో ఇందుకు అనుగుణంగా క్రీడలు, పర్యాటకం, విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, సామాజిక సమ్మిళిత రంగాల్లో విధానాలు తీసుకువచ్చాం. ఈ విధానాలు అద్భుత ఫలితాలనివ్వడంతో పాటు చెప్పుకోదగిన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రజల జీవనంలోని ప్రతి కోణంలోనూ వారి ప్రతి అవసరం తీరే విధంగా సులభతర విధానాలను తీసుకువస్తాం.3. గేమ్ చేంజర్ ప్రాజెక్టులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్, తెలంగాణను తీర్చిదిద్దేందుకు గేమ్ చేంజర్ ప్రాజెక్టులను ఎంచుకున్నాం.4. పాలనలో విశిష్టత... సేవలకు గ్యారంటీ ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాల మధ్య లావాదేవీలు నేరుగా కాకుండా డిజటల్ రూపంలో జరిగేలా డిజిటల్ పాలన. రాష్ట్రంలోని పౌరులందరికీ అందుబాటులో ఇంటర్నెట్, డేటా. రాష్ట్రమంతటా భూగర్భ కేబుల్, వైఫై జోన్ల ఏర్పాటు. స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పద్ధతిలో సేవలందేలా పెట్టుబడులను ఆకర్షించే వ్యూహం. 5. నాలెడ్జ్ హబ్ టెక్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు, పరిశోధక సంస్థలతో కలిపి నాలెడ్జ్ హబ్ ఏర్పా టు. ఆఫ్షోర్ క్యాంపస్ల ఏర్పాటు, విద్యార్థుల మార్పిడి, ఫ్యాకల్టీ, పరిశోధక సామాగ్రి సమకూర్చుకోవడం కోసం అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆహ్వానించడం ద్వారా క్యూర్ పరిధిలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు. 6. సమ్మిళిత, సుస్థిర సంక్షేమంరాష్ట్రంలోని ప్రతి పౌరుడూ సమానమే అయినా మూడు ముఖ్యమైన వర్గాల సంక్షేమంపై రాష్ట్రం దృష్టి. మహిళలు, రైతులు, యువత–చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు. విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజల జీవనోపాధి పెంపు, ఆర్థిక సాధికారత కోసం దీర్ఘకాలిక వ్యూహాలకు రూపకల్పన. 7. అభివృద్ధి వనరులు ప్రపంచ స్థాయి విశ్వస నీయ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా వారికి భరోసా కలి్పంచడం, సుస్థిర అభివృద్ధి వలయం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిరంతర సంపద సృష్టి ధ్యేయంగా ప్రభు త్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లడం. 8. పర్యావరణం సుస్థిరత ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పర్యావర ణ పరిస్థితులు, వాతావరణ మార్పుల వల్ల నష్ట సంభావ్యత గురించి ఆలోచిస్తున్నారు. వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, వరద నష్టాల బారిన పడకుండా హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టాలి. గోదావరిని మూసీతో అను సంధానం చేయడం ద్వారా రాబోయే 75–100 ఏళ్ల వరకు నీటి కొరత లేకుండా కరువు బారిన పడకుండా చూడటం. 9. సంస్కృతి సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్ర, స్మారక చిహ్నాలు, కళలు, జానపదాలకు ప్రోత్సాహమందించడం. 10. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సమర్థతలకు అనుగుణంగా విజన్ రూపొందించాం. ఇది కేవలం నిపుణులతో సాధ్యం కాలేదు. 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. వారి నుంచి సమస్యలు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలు, అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సామూహిక చైతన్యం గురించి తెలుసుకోగలిగాం. తెలంగాణ రైజింగ్ నిరంతరం సాగుతూనే ఉంటుంది. రండి..అభివృద్ధిలో భాగస్వామి కండి. 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే.. » భారత్ ఫ్యూచర్ సిటీ » మూసీ పునరుజ్జీవనం » డ్రైపోర్టు » డ్రైపోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్ప్రెస్వే » బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నైకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో తయారీ రంగం అభివృద్ధి » రీజనల్ రింగు రోడ్డు » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్లను కలుపుతూ రేడియల్ రోడ్లు » రీజనల్ రింగ్ రైల్వే » వ్యవసాయ భూములకు గ్రీన్ ఎనర్జీ » ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ » గ్రీన్ ఎనర్జీ హబ్స్ » ఎల్రక్టానిక్ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడం3 మూలస్తంభాలివే.. 1. ఆర్థిక వృద్ధి..ఆవిష్కరణలు, ఉత్పాదకతల పునాదులపై జరిగే అభివృద్ధి ఆధారంగా క్యూర్–ప్యూర్–రేర్ విధానంతో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన. 2. సమ్మిళిత అభివృద్ధి..ఈ వృద్ధి ఫలాలను యువత, మహిళలు, రైతులు, అట్టడుగున ఉన్న వర్గాలు, సమాజంలో అన్ని వర్గాలకు అందించడం.3. సుస్థిర అభివృద్ధి..హరిత మార్గంలో 2047 నాటికి అన్ని రంగాల్లో సుస్థిరత. -
ఓట్లప్పుడే వస్తారా?
పంచాయతీ ఎన్నికల వేళ.. అభివృద్ధి నోచుకోని గ్రామాలు, తండాల ప్రజలు ఓటుకు దూరంగా ఉంటామని ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్నికలు అనగానే వాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సౌకర్యాలు కల్పించేవరకు ఓటెయ్యంరాయపర్తి/ ఇంద్రవెల్లి: ‘అరవై ఏళ్లుగా తండాలో అన్నీ ఇబ్బందులే.. సౌకర్యాలు వచ్చే వరకు ఓటు వేయం ’అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రం శివారులోని గుబ్బెడుబోడుకింది తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లకోసం ఓటు అడగడానికే వస్తున్నారు కానీ ఆ తర్వాత మా తండాను పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో 45 ఓట్లు, 60 మంది జనాభా ఉంటుందని, సరైన రోడ్డు, తాగునీటి సౌకర్యం, వీధిస్తంభాలు, విద్య, వైద్యం అందుబాటులో లేవని చెప్పారు. తెలిపారు తండాను రాయపర్తి నుంచి వేరు చేసి జేతురాంతండాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం తండాకు చేరుకొని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, అంతా ఓటింగ్లో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేయించారు. అయినా, తాము ఓటింగ్లో పాల్గొనబోమని తండావాసులు తేల్చిచెప్పారు. ఎన్నికలకు దూరం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్పూర్, గోపాల్పూర్గూడ గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. మంగళవారం గ్రామ సమీపంలోని వాగు వద్దకు వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు వేస్తామని, అభివృద్ధి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ముందు ప్రకటించి ఆ తర్వాత ఎవరూ ఇటువైపు రావడం లేదన్నారు. సర్పంచ్ అభ్యర్థి కుటుంబానికి పోలీస్ భద్రతచింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిని జాడి దర్శన కుటుంబానికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దర్శన సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా, ఉపసంహరించుకోవాలని గుర్తుతెలియని వ్యక్తులు దళం పేరిట గురువారం తుపాకీతో బెదిరించి లేఖ అందజేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, కౌటాల సీఐ సంతోశ్కుమార్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేశ్ విచారణ చేపట్టారు. అనంతరం దర్శన కుటుంబానికి రక్షణగా రణవెల్లిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రతినిత్యం ఒక ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతిమహబూబాబాద్ రూరల్ /ములకలపల్లి: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్గా రాగిపాటి బుచ్చిరెడ్డి (70) బరిలో ఉన్నాడు. సోమవారం రాత్రి వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఇనుగంటి నాగప్రసాద్ (57) నర్సా పురం పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. పంచాయతీ ప్రచారంలో మహిళలు...ఖాళీగా పల్లె వెలుగు బస్సులు కోదాడ: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కా లు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు.అవినీతి కన్నా.. అడుక్కు తినడం మిన్నవరంగల్లో యాచకులతో వినూత్న ర్యాలీహన్మకొండ చౌరస్తా: ‘అవినీతి కన్నా.. అ డుక్కు తినడం మి న్న ’అంటూ జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్సత్తా ఉద్యమ సంస్థ సంయుక్త ఆధ్వ ర్యంలో మంగళవారం వరంగల్లో యాచకుల తో కలిసి ర్యాలీ నిర్వ హించారు. వేయిస్తంభాల ఆలయం నుంచి హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. లోక్సత్తా ఉభయ తెలుగు రాష్టాల అధ్యక్షుడు బండారు రామ్మోహన్రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీ రావు, లోక్సత్తా సంస్థ సభ్యు డు శ్రీనివాసరెడ్డి, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.ఫ్యామిలీ పంచాయతీ హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూద న్పల్లి సర్పంచ్ పదవికి పోటీలో తల్లీకూతురుతోపాటు అల్లుడి అన్న కోడలు రంగంలో ఉన్నారు. సూదన్పల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. అయితే ఆరుగురు పోటీలో ఉన్నారు. వీరిలో తల్లీకూతురు ఆకారపు లచ్చమ్మ, తిక్క శైలజతోపాటు తిక్క మాధవి (శైలజ భర్త సోదరుడి కోడలు) కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఆకారపు లచ్చమ్మ 2006–2011 వరకు సర్పంచ్గా పనిచేశారు.పంపిణీకి కాదేది అనర్హం పర్వతగిరి/సంగెం: పంచాయతీ ఎన్నికల ప్రలోభాల్లోనూ చిత్ర విచిత్రాలు జరుగు తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో మహిళలను ఆకట్టు కునేందుకు ముగ్గు, చాయ్పత్త ఉచితంగా ఇస్తున్నారు. చేపలు కూడా పంపిణీ చేస్తున్నారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లవాయి నుంచి రేషన్ బియ్యాన్ని తన సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి గ్రామంలో పంపిణీ చేసేలా చూస్తానని వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మడివరం సర్పంచ్ అభ్యర్థి ఇజ్జగిరి అశోక్ ఓటర్లకు హామీ ఇస్తూ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. -
పేదలకు న్యాయం చేస్తా: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నా బాల్యంలో పేదరికం, అంటరానితనాన్ని స్వయంగా చూశా. సమస్య ఏమిటో తెలుసు. నేను రైతుబిడ్డను. నాకు పేదరికం తెలుసు. కొందరు నేతలకు పేదరికం విహారయాత్ర లాంటిది. పేదలు ఎలా ఉంటారో చూడటానికి హైదరాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారులో చిన్న గ్రామాలకు వెళ్తారు. అంటరానితనం ఉన్నచోట నుంచి.. ఆలయాల్లో కొందరిని రానీయని చోటు నుంచి వచ్చాను. పేదలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు ఏం కోరుకుంటారో అన్ని తెలుసు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం నిర్మూలనే నా లక్ష్యం. అదే నా పాలసీ డాక్యుమెంట్. అదే ప్రజలతో నా ఒప్పందం. ఇది నా రాష్ట్రానికి, యువతకు మార్గదర్శకంగా మారుతుంది’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను రేవంత్ ఆవిష్కరించారు. ‘నేను ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మాధ్యమంలో చదివాను. కార్పొరేట్ బడిలో ఇంగ్లిష్ మీడియంలో కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి. నాకు రాజకీయ నేపథ్యం లేదు. పేద కుటుంబం నుంచి వచ్చా. 2006లో జెడ్పీ సభ్యుడిగా ఎంపికై ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయిన. 17 ఏళ్లకు సీఎం అయిన’ అని గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. విజన్ డాక్యుమెంట్–2047 తయారీలో సహకరించిన ఐఎస్బీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, నీతి ఆయోగ్, సూచనలు ఇచి్చన వారికి కృతజ్ఞతలు తెలిపారు.అందుకే విజన్ డాక్యుమెంట్.. ‘తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చైతన్యం ఉంది. జల్ జమీన్ జంగల్ అని కుమ్రం భీమ్ పోరాడితే.. సాయుధ రైతాంగ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం వేలాది మంది పోరాడి నేలకొరిగారు. ఆ స్ఫూర్తితోనే మన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సోనియా, మన్మోహన్ నెరవేర్చినా, ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకున్నా గతంలో సాధించలేకపోయాం. నేడు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. వాటిని అందించాలనే తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్ను తెచ్చాం.దేశం 2047లో 100 ఏళ్ల స్వాతం్రత్యాన్ని జరుపుకోనుండగా, ఆలోగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది వికసిత్ భారత్ లక్ష్య సాధనతో ముందుండాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జనాభాలో 2.9 శాతం వాటా కలిగి ఉన్న మన రాష్ట్రం దేశ జీడీపీలో 5 శాతం వాటాను కలిగి ఉంది. 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడానికి విజన్ డాక్యుమెంట్ తెచ్చాం’ అని సీఎం రేవంత్ అన్నారు. లక్ష్యాలు ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్..‘విజన్ డాక్యుమెంట్ నాలుగు గోడల మధ్య తయారు చేసిన కాగితం కాదు. నాలుగు కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలోని మేధావులతో చర్చించి, ఆర్థికవేత్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులను భాగస్వాములను చేసి రూపొందించిన విధాన పత్రం. నెహ్రూ దేశ తొలి ప్రధానిగా బాధ్యతల స్వీకరణకు ముందు గాంధీని కలిసి సలహా కోరగా, పాలనాపర నిర్ణయం తీసుకునే సమయంలో పేదలు, నిస్సహాయులకు ఎలా సహాయం చేయగలవో ఆలోచించాలని సలహా ఇచ్చారు. ఆ సూచనలతో నిరక్షరాస్యత నిర్మూలనకు విద్య, ఆకలి నిర్మూలనకు ఇరిగేషన్ అని విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా అనేక వర్సిటీలు, ప్రాజెక్టులను నిర్మించారు. దేశంలో బాక్రనంగల్, రాష్ట్రంలో ఎస్సారెస్పీ వంటివి నెహ్రూ కాలంలోనే ప్రారంభించారు.మా ప్రభుత్వం విద్య, ఇరిగేషన్తోపాటు కమ్యూనికేషన్ను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. ఐటీ, రోడ్లు, పోర్టుల ద్వారా ప్రపంచంతో కమ్యూనికేట్ కావాలని నిర్ణయించాం. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహా్వనిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ నాకు ఆదర్శం. వాటితో పోటీపడతా. వారిని ఆదర్శంగా తీసుకుని నా రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తా. సంక్షేమ పథకాలు అమలు చేస్తా’ అని రేవంత్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల సగటు వయస్సు 32 ఏళ్లు కాగా నెహ్రూ విజన్ కారణంగా ఇప్పుడు 73 ఏళ్లకు పెరిగిందన్నారు. వందేళ్ల సగటు ఆయుష్షును సాధించాలని అనుకుంటున్నామన్నారు. నిరుపేదలకు, మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. ‘11 ఏళ్ల వయస్సులో పెద్ద ప్రమాదానికి గురైతే నా తల్లిదండ్రులు నన్ను గ్రామం నుంచి నిజాం నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పేదరికాన్ని నిర్మూలించాలని, విద్యను అందించాలని, ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని, పౌరులకు మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కుల నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‘కుల నిర్మూలనకు పనిచేయాల్సిన ప్రభుత్వాలే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీ హాస్టళ్లను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. నేను సీఎం అయిన వెంటనే వాటిని ఒకేచోట తేవాలని ఆదేశించా. అందులోభాగంగానే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను నిర్మిస్తున్నా. ఒక్కొక్కటి రూ.200 కోట్లతో 100 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. కులవివక్ష నిర్మూలనకు, సమానత్వం వచ్చే వరకు సంక్షేమంపై పెట్టుబడి అవసరం. విద్యపై ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడే. మన యువత చదువుకుని దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా చేసి కొరియాతో పోటీపడబోతున్నాం. సోనియా గాంధీ తెచ్చిన విద్యా హక్కు చట్టం ఉన్నా నాణ్యమైన విద్య అందడం లేదు. యువతలో నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ తెచ్చాం. 140 కోట్ల జనాభా ఉన్నా ఒలింపిక్స్లో ఒక్క బంగారు పతకం గెలవలేకపోతున్నాం. దీనికోసమే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తెస్తున్నా. నా నిరుపేదల కోసం ఇదే నా విధానం’ అని సీఎం ప్రకటించారు. -
మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి మొదలవు తున్నా యి. ప్రధాన సబ్జెక్టులు ఏప్రిల్ 13తో ముగుస్తాయి. సైన్స్ రెండు పేపర్లుగా ఉంటుంది. ఈ పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకూ ఉంటుంది. మిగతా పేపర్లన్నీ ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ నిర్వహి స్తారు. పరీక్షల నిర్వహణలో ఈ సారి మార్పులు చేశారు. ప్రతీ పరీక్షకు మధ్య కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండేలా చేశా రు. విద్యార్థులు పరీక్షలకు సన్న ద్ధమయ్యేందుకు, ఎలాంటి ఒత్తి డి పడకుండా ఈ జాగ్రత్తలు తీ సుకున్నట్టు అధికార వర్గాలు తె లిపాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల తేదీ లను టెన్త్ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. -
‘విజన్’.. రాష్ట్ర భవితకు ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో తీర్చిదిద్దిన విజన్ డాక్యుమెంట్ కేవలం ఒక పత్రం కాదని.. తెలంగాణ భవిష్యత్తు కోసం తాము చేసే ప్రతిజ్ఞ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంగళవారం ‘3 ట్రిలియన్ దిశగా తెలంగాణ: పెట్టుబడులు, ఉత్పాదకతల పరపతి’అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిని ఆయన ప్రారంభించారు. ‘ప్రస్తుతం తెలంగాణ 185 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అది 3 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే 16 రెట్లు పెరగాలి. సాధారణ వృద్ధిరేటు సాధిస్తూ వెళ్తే 2047 నాటికి 1.12 ట్రిలియన్ డాలర్ల వరకే వెళ్లగలం. అంటే లక్ష్యానికి, పరిస్థితులకు మధ్య ఉత్పాదకత అంతరం ఉంది. రోడ్లు, భవనాలు కట్టి ఈ అంతరాన్ని పూడ్చాలని మేం అనుకోవట్లేదు. ఆర్థిక వ్యవస్థ మూల సూత్రాన్ని మార్చగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. పెట్టుబడి, ఆవిష్కరణలు కలిస్తేనే ఉత్పాదకత వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూపాంతరం చెంది ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్గా మారాలి. ప్యూర్, క్యూర్, రేర్ వ్యవస్థలు సహకరించాలి. ఇక్కడ ప్రణాళిక, ప్రతిభ ఉంది కానీ ఆవిష్కరణలు చాలా ఖరీదైనవి. అవి చాలా ఏళ్లపాటు ఆర్థిక ఫలితాలనివ్వవు. అందుకే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించే వ్యవస్థలా కాకుండా ఉ్రత్పేరకంగా, భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. మేం హైదరాబాద్ను ఆసియా ఇన్నోవేషన్ హబ్గా మార్చాలనుకుంటున్నాం’అని భట్టి చెప్పారు. సానుకూల దృక్పథంతోనే సాధ్యం: ట్రాన్స్కో సీఎండీ 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని తెలంగాణ నిర్ణయించుకున్న లక్ష్యం ఆర్థిక వ్యవస్థలోనే గతంలో ఎన్నడూ లేదని.. అలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాలనే దృక్పథం ఉన్నప్పుడే సాధ్యమవుతుందని ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ చెప్పారు. ఐఐటీలో చదివిన ఇంజనీర్గా, ఆర్థిక శా్రస్తాన్ని చదివిన నిపుణుడిగా, ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్లు తెలిసిన వ్యక్తిగా పలు అంశాలపై విశ్లేషించారు. చర్చాగోష్టిని సమన్వయం చేసిన ఐఎస్బీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఆదిత్య కువలేకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐఎస్బీ ఫైనాన్స్ ఫ్యాకల్టీ ప్రసన్న తాంత్రి మాట్లాడుతూ ఆవిష్కరణలను విలాసంగా భావించకుండా అవసరంగా పరిగణించాలన్నారు. గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురాం పాక మాట్లాడుతూ తాను అమెరికా నుంచి భారత్కు వచ్చినప్పుడు స్టార్టప్ల రంగంలో ఆర్థిక, మానవ వనరుల పరంగా ఇబ్బందులు పడ్డానని.. అయినా ఫలితంపై శ్రద్ధతో చివరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేయగలిగామని చెప్పారు. ఇజ్రాయెల్ అవలంబిస్తున్న స్టార్టప్ల ప్రోత్సాహక విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించారు. -
2036 ఒలింపిక్స్లో పతకమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మైదానంలో తెలంగాణ సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి ఒక్క పతకమైనా తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్–2027’కార్యక్రమంలో ‘తెలంగాణ–ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఊరు, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం కప్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో.. 450 మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించామని, వీరందరికీ నెక్ట్స్ లెవల్కు వెళ్లేందుకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ, తెలంగాణలో నిఖత్ జరీన్, సానియా మీర్జా, పీవీ సింధు, గుత్తా జ్వాల వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు క్రీడలలో తమదైన ముద్ర వేశారని చెప్పారు. క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే మరింత రాణించగలుగుతారని, క్రీడాకారులపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలన్నారు. కుటుంబ బాధ్యతలతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ దృష్టిని మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం వారికి ధీమాను అందించగలిగితే బాగుంటుందని పేర్కొన్నారు. ఆత్మస్థైర్యం నింపాలి: అనిల్ కుంబ్లే క్రీడాకారులకు శిక్షణ ఒక్కటే సరిపోదు. వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. పరిశ్రమ నిపుణులతో భాగస్వామ్యం కావడం అతిముఖ్యం. 2030 నాటికి దేశంలో 120 బిలియన్ డాలర్ల స్పోర్ట్స్ అండ్ ఎకో సిస్టమ్ పరిశ్రమలో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. క్రీడల్లో సీఎం మక్కువ అభినందనీయం: గోపీచంద్ క్రీడాకారులకు శారీరక సామర్థ్యం, అక్షరాసత్య ముఖ్యం. ముఖ్యమంత్రికి ఆటలపై మక్కువ ఉండటం అభినందించదగ్గ పరిణామం. అందుకే క్రీడా పాలసీలో స్పోర్ట్స్ హబ్, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పిల్లాడు ఏదో ఒక క్రీడలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. క్రీడలతో మానసికోల్లాసమే కాదు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఫౌండేషన్ బలంగా ఉండాలి: పీవీ సింధు ఫౌండేషన్ బలంగా ఉంటేనే క్రీడల్లో రాణించగలం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై మక్కువ కలిగేలా, క్రీడలను ప్రోత్సహించాలి. ప్రతీ అకాడమీ, మైదానం చాలా ముఖ్యం. శారీరక, సాంకేతిక వ్యూహాలు కీలకమే డానీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వీటా డానీ నేటి సమాజంలో యువతకు చదువొక్కటే కాదు క్రీడలు, నైపుణ్యత కూడా ముఖ్యమే. భారతీయ పిల్లలకు క్రీడలలో అపారమైన సామర్థ్యం ఉంది. ఇలాంటి వారికి శారీరక, సాంకేతిక వ్యూహాలను అందిస్తే మరింత మెరికల్లా తయారవుతారు. ప్రభుత్వం వ్యక్తిగత ఆటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శిక్షకుడి సంక్షేమం ముఖ్యం: గుత్తా జ్వాల శిక్షకుడి సంక్షేమం అత్యంత ముఖ్యం. మన రాష్ట్రంలో అండర్ కాంట్రాక్ట్ కోచ్లు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ క్రీడా పాలసీలో శిక్షకులను కూడా భాగస్వామ్యం చేయడం అభినందించదగిన పరిణామం. మంచి శిక్షకులు ఉంటే మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. -
అల్పాదాయ వర్గాలకు ‘ముంబై’ విధానం
సాక్షి, హైదరాబాద్/బిజినెస్ బ్యూరో: ‘హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. కానీ ఇవన్నీ, ధనికులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్నవే. లగ్జరీ ఇళ్ల నిర్మాణం దాదాపు శాచురేషన్కు చేరుకుంది. అల్పాదాయం ఉన్న వర్గాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ వర్గాలకు ఇళ్లు పొందటం కష్టంగా ఉంది. బడా నిర్మాణ సంస్థలు ఆ వర్గాలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేలా పీపీపీ ప్రాజెక్టులు రావాల్సి ఉంది’ చవక ధరల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిపుణులు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సూచన ఇది.గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్–తెలంగాణ మోడల్ 2047’అంశంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది. సీబీఆర్ఈ దక్షిణాసియా ప్రతినిధి ప్రీతం మెహ్రా సంధానకర్తగా వ్యవహరించగా, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతం, వాసుదేవన్ సురేష్ (హడ్కో మాజీ సీఎండీ), అభిజిత్ శంకర్ రే (వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి), డాక్టర్ పీఎస్ఎన్ రావు (ఎస్పీఏ ఢిల్లీ), జి.రామ్రెడ్డి (క్రెడాయ్ అ«ధ్యక్షుడు), ఎం.నంద కిషోర్ (రాంకీ ఎండీ), అజితేష్ (ఏఎస్బీఎల్ ఫౌండర్) పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్ఐజీ కేటగిరీలో 20.33 లక్షల ఇళ్లు, ఎంఐజీ కేటగిరీలో 8.77 లక్షల ఇళ్ల అవసరం ఉందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతం తెలిపారు. ప్రత్యేక నమూనా దిశగా: పొంగులేటి ‘రాష్ట్రంలో గృహాల డిమాండ్– సరఫరా మధ్య భారీ అంతరం ఉంది. దీన్ని తగ్గించేందుకు వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, పట్టణ ప్రాంతాల అవసరాలపై దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన గృహ నిర్మాణ తెలంగాణ నమూనా–2047 వైపు అడుగులేస్తున్నాం. ఈ నమూనా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా ఉంటుంది. పీపీపీ విధానంలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య పేదల కోసం భారీ కాలనీలను నిర్మించే యోచనలో ఉన్నాం. మురికివాడల పునరాభివృద్ధి, గ్రీన్ఫీల్డ్ శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల కాలనీలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్లతో అనుసంధానిస్తూ అద్దె/కార్మికుల కాలనీల నిర్మాణం ప్రధాన వ్యూహాలుగా నమూనాను రూపొందించాం’అని మంత్రి పొంగులేటి చెప్పారు. అందుబాటులో ధరల్లో గృహాలు లభించాలంటే పన్ను రాయితీల్లాంటివి సరిపోవని, మరింత అనువైన వ్యవస్థ కావాలని రామ్కీ ఎస్టేట్స్ ఎండీ నందకిషోర్ తెలిపారు. ఇళ్లు, స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రెంటల్ హౌసింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని బ్లాక్స్టోన్ రియల్ ఎస్టేట్ ఇండియా ఎండీ మోహిత్ అరోరా చెప్పారు. -
‘చలి’oచిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే.. 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం మధ్యస్థానికి చేరుకోవడంతో ఉష్ణోగ్రతలు పతనమవుతాయని, ఈశాన్య దిశ నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని స్పష్టం చేసింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని సూచిస్తూ.. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో.. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 32.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 7.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి మండలం తిర్యాణిలో 6.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 6.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.9 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. హైదరాబాద్లో గరిష్టం 29.9, కనిష్టం 13.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవటంతో పాటు మంచు కురుస్తుండటంతో.. రాత్రి వేళ ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే.. : రాష్ట్రంలో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల రికార్డు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి మండలంలోనే ఉంది. 2021 డిసెంబర్ 21న అతి తక్కువగా 3.5 డిగ్రీలు నమోదైంది. -
అధికారుల నిర్లక్ష్యంతోనే సిగాచీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: సిగాచీ పేలుడు ఘటనకు ఒకరోజులో జరిగిన లోపం కారణం కాదని.. కొంత కాలంగా అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యమే ప్రధాన కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మిక, పరిశ్రమలు, పర్యావరణ శాఖలు ఎవరి పని వారు చేయలేదని అభిప్రాయపడింది. సరైన సమయంలో తనిఖీలు నిర్వహించి ఉంటే 54 మంది ప్రాణాలు పోయేవి కాదంది. పరిమితికి మించి పేలుడు పదార్థాలున్నా పట్టించుకోలేదని, 90 మంది పనిచేయాల్సిన చోట సగం మందే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేస్తేగానీ మిగతా వారు దారిలోకి వచ్చేలా లేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారి చెప్పిన వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాలు సమయం ఇస్తున్నామని, పూర్తి వివరా లతో సమాధానం చెప్పేందుకు సిద్ధమై రావాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామి కవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందంటూ హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియు ద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారించింది.సంక్షిప్త నివేదికలు సమర్పించాం..దర్యాప్తు అధికారులు హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ఆదేశించడంతో.. డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ విజయ్కృష్ణ, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్ కోర్టుకు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు అధికారులు రికార్డులతో పాటు సంక్షిప్త నివేదికను సమర్పించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని అధికారుల తనిఖీలపై డీఎస్పీని ప్రశ్నించింది. గత డిసెంబర్లో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించినట్లు బదులిచ్చారు. మరి ఇతర శాఖలు ఏం చేస్తున్నాయని ధర్మాసనం అడిగింది. ప్రమాదకర రెడ్ జోన్లోని పరిశ్రమల్లో పదుల సంఖ్యలో శాఖలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా, అది జరగలేదని తెలు స్తోందని చెప్పింది. పరిశ్రమ యాజమాన్యంపై చార్జిషీట్ దాఖలు చేస్తారు.. మరి అధికారుల మాటేమిటని ప్రశ్నించింది. ఈ కేసు విచారణలో సహకరించడానికి అమికస్ క్యూరీగా డొమినిక్ ఫెర్నాండెజ్ను ధర్మాసనం నియమించింది. ఘట నకు సంబంధించిన వివరాలు, పత్రాలను ఆయ నకు సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు రోజులుగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండు రోజుల్లో మొత్తంగా రూ. 5,75,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సమ్మిట్ తొలిరోజైన సోమవారం రూ. 2.43 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా రెండో రోజైన మంగళవారం రూ. 3,32,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్రెడ్డి మంగళవారం 20కిపైగా సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఐటీ, విద్యుత్, ఫార్మా, క్రీడలు, పర్యాటకం, అటవీ, ఆహార ఉత్పత్తులు, గృహ సముదాయాల నిర్మాణానికి సంబంధించిన కంపెనీలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థల్లో రిలయన్స్, గోద్రెజ్, ఫోర్టిస్, హెటెరో, మహీంద్ర అండ్ మహీంద్ర, భారత్ బయోటెక్, అరబిందో, గ్రాన్యూల్స్, బయోలాజికల్–ఈ, వింటేజ్ కాఫీ, కేజేఎస్, కేన్స్ టెక్నాలజీస్, జేసీకే ఇన్ఫ్రా, అక్విలాన్ నెక్సస్, ఏజీపీ గ్రూప్, ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్, ప్యూర్వ్యూ గ్రూప్, ఎంఎస్ఎన్, సత్వా, సుమధుర ఉన్నాయి. సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలకు గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.రంగాలవారీగా మంగళవారం వివిధ సంస్థలు కుదుర్చుకున్న ఎంవోయూలు ఇలా..డేటా సెంటర్లు, జీసీసీ..ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్: రూ. 70 వేల కోట్లతో 150 ఎకరాల్లో ఏఐ ఆధారిత ఒక గిగావాట్ డేటా పార్క్ ఏర్పాటు.జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: రూ. 9,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు. యాన్సిలరీ మౌలిక వసతుల కల్పన. 2,000 మందికి ఉపాధి కల్పన.ఏజీపీ గ్రూప్: రూ. 6,750 కోట్లతో 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాంగణం ఏర్పాటు.కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్: ప్రస్తుత ప్లాంట్కు అదనంగా రూ. 1,000 కోట్లతో విస్తరణ.ప్యూర్వ్యూ గ్రూప్: గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ), ఏఐ డేటా సెంటర్ క్యాంపస్. 3,000 మందికి ఉపాధి. 10 ఎకరాల్లో ఏర్పాటు.అక్విలిన్ నెక్సెస్ లిమిటెడ్: గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు. 50 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు.వ్యవసాయ, అనుబంధ రంగాలు..ఫోర్టిస్ ఇండియా లిమిటెడ్: వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రంగంలో క్రాప్ న్యూట్రిషన్లో పరిశోధనల కోసం రూ. 2,200 కోట్లతో రెండు దశల్లో పెట్టుబడి. 100 ఎకరాల్లో 800 మందికి ఉపాధి.రిలయన్స్ కన్సూ్యమర్ పోడక్ట్స్ లిమిటెడ్: రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఆహార, పానీయాల ఉత్పత్తి ప్లాంట్. 1,000 మందికి ఉపాధి.వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్: రూ. 1,100 కోట్ల పెట్టుబడితో 15 ఎకరాల్లో ప్రీమియం కాఫీ పొడి ఎగుమతుల ప్లాంట్. 1,000 మందికి ఉపాధి.కేజేఎస్ ఇండియా: ఫుడ్ అండ్ బేవరేజెస్ రెండో యూనిట్.. రూ. 650 కోట్లు పెట్టుబడి, 44 ఎకరాల విస్తీర్ణంలో 1,050 మందికి ఉపాధి. గోద్రెజ్: పాడి రంగంలో రూ. 150 కోట్ల పెట్టుబడి. ప్రతిరోజూ 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో 40 ఎకరాల్లో డెయిరీ ప్లాంట్ విస్తరణ. 300 మందికి ప్రత్యక్ష ఉపాధి.పర్యాటక రంగంలో..» మొత్తం పెట్టుబడులు: రూ. 7,045 కోట్లు. ప్రత్యక్ష ఉపాధి 10 వేలు, పరోక్షంగా 30 వేలు.» ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్: రూ. 3,000 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ట్రేడ్, ఎగ్జిబిషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు.» అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు): రూ. 800 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ వెల్నెస్ రిట్రీట్ కేంద్రం.» ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: రూ. 300 కోట్ల పెట్టుబడి.» పొలిన్ గ్రూప్ (టర్కీ) అండ్ మల్టీవర్స్ హోటల్స్ (హైదరాబాద్): రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రపంచ శ్రేణి అక్వమెరైన్ పార్క్, అక్వా టన్నెల్ నిర్మాణం.» కేఈఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్ (కామినేని గ్రూపు): గండిపేట మండలం కిస్మత్పూర్లో రూ. 200 కోట్లతో గ్లాస్,–గ్రీన్ హౌజ్ కన్వెన్షన్ సెంటర్.» రిధిరా గ్రూప్: రూ. 120 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా యాచారంలో నోవాటెల్ ఆతిథ్య రంగంలో పెట్టుబడి.ఫార్మా రంగంలో..బయోలాజికల్–ఈ లిమిటెడ్: రూ.3,500 కోట్ల పెట్టుబడితో వ్యాక్సిన్ పరిశోధన, ఉత్పత్తులకు సంబంధించి మలిదశ విస్తరణ కోసం 150 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీలో ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి. అరబిందో ఫార్మా: ఔషధ రంగంలో రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు. 3,000 మందికి ఉపాధి అవకాశాలుహెటెరో గ్రూప్: రూ.1,800 కోట్లతో 100 ఎకరాల్లో దేశీయ, అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు. 9,000 మంది ఉపాధి.గ్రాన్యూల్స్ ఇండియా: రూ.1,200 కోట్ల పెట్టుబడితో కేన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాలు, పరికరాల ఉత్పత్తికి 100 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీలో ప్లాంట్ ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి.భారత్ బయోటెక్: పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి. 200 మందికి ఉపాధి.విద్యుత్ఆర్సీటీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్: రూ. 2,500 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు, 1,600 మందికి ఉపాధిఇతర సంస్థలు» విజ్హీ హోల్డింగ్ ఐఎన్సీ: రూ. 2,500 కోట్లతో ప్రాణాంతక వ్యాధుల నివారణపై పరిశోధనల కోసం అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు ఒప్పందం. » అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్: రూ. 2,500 కోట్లతో ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్ స్థాపన. » టీడబ్ల్యూ గ్రూప్: రూ. 1,100 కోట్లతో ప్రపంచ తొలి ప్లగ్ ఇన్ మోటార్ బైక్ ఉత్పత్తుల పరిశ్రమ. » ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ లిమిటెడ్: రూ. 700 కోట్లతో జినోమ్ వ్యాలీలో టీకాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ. » మహీంద్రా అండ్ మహీంద్రా: రూ. 500 కోట్లతో వచ్చే నాలుగేళ్లలో జహీరాబాద్లో ఎల్రక్టానిక్ ట్రాక్టర్లు, గ్రీన్ఫీల్డ్ ఇంజిన్ షాప్ ఇతర ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఒప్పందం. » ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్: రూ. 500 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో సాహస క్రీడలు, వినోద కార్యక్రమాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు. » బయోవరం: రూ. 250 కోట్లతో టిష్యూ ఇంజినీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్, ఏఐ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలు, కణ, జన్యు చికిత్సలకు సంబంధించి అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటుకు ఒప్పందం. » అనలాగ్: ఏఐ ఆధారిత ఆర్ అండ్ డీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు, ల్యాబ్లు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం, టీఎస్ ఐ–పాస్ సమన్వయంతో ఏర్పాటు. » ఆల్ట్మ్యాన్ సంస్థ బ్యాటరీ మెటీరియల్ తయారీ యూనిట్. » అజయ్ దేవ్గణ్ ఫిలిం స్టూడియో: వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, వర్క్షాప్లు, స్థానిక నైపుణ్యాల వెలికితీత.» జ్యూరిక్ ఇన్సూరెన్స్: హైదరాబాద్లో సంస్థ మొదటి జీసీసీ. » కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్: తొలి జీసీసీ ఏర్పాటు. సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ ఇంజనీరింగ్ హబ్, దేశంలో తొలి బ్యాంక్ ఏర్పాటు. » మాగ్జిమస్ (అమెరికా): భారత్లో తొలిసారి గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ ఆపరేషన్ హబ్. ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో పెట్టుబడులు » జీఎంఆర్ స్పోర్ట్స్, వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్: భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు. స్టేడియాలు, క్రీడాకారులకు శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. » బ్లాక్ స్టోన్ ఏసియా: డేటా సెంటర్ల ఏర్పాటు. » సత్వా గ్రూప్: అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టుల ఏర్పాటు. » బ్రిగేడ్ గ్రూప్: భారత్ ఫ్యూచర్ సిటీ–ఐటీ కారిడార్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల నిర్మాణం.. ఆతిథ్య రంగంలో భారీ పెట్టుబడులు » సుమధురగ్రూప్: మధ్యాదాయ వర్గాలకు, ఐటీ, పారిశ్రామిక వాడలకు దగ్గరలో గృహ సముదాయాల నిర్మాణం » ఫిఫా–ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ: హైదరాబాద్లో ప్రపంచస్థాయి అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం. -
కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదిక నుంచి రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం వర్చువల్గా ఆవిష్కరించారు. దేశ, విదేశీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాం«దీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమె జన్మదినం డిసెంబర్ 9. ఈ రోజున రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచి్చంది.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. అందుకే ప్రతి ఏడాది ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటాం..’అని సీఎం స్పష్టం చేశారు. సోనియా ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చారు‘ఆరు దశాబ్దాల ఆకాంక్ష, 4 కోట్ల మంది ప్రజల కోరి కను కరీంనగర్లో జరిగిన సమావేశంలో సోనియాగాంధీ ప్రకటించడమే కాకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రజా పాలనకు సంకేతంగా ఉన్న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఇప్పుడు జిల్లాల్లో పాలనా కేంద్రాలైన కలెక్టర్ కార్యాలయాల్లో విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషకరం..’అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఘనంగా రెండవ రోజు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047 లో భాగంగా తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సు లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ... రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందని తెలిపారు.2036 ఒలంపిక్స్ లో, అంతర్జాతీయ స్థాయి పోటీలో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంగా పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలతో కమిటీ సభ్యులుగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నిధుల సమీకరణ కోసం స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని నూతనంగా ఏర్పాటు చేశామని మంత్రి తెలియజేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా పాఠశాల స్థాయి నుండే క్రీడా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా బాలికలకు, పారా అథ్లెట్ ల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్లోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు లౌబరో యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ వంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలోనే 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి తద్వారా ఒలంపిక్, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లకు ఆతిథ్య కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. స్పోర్ట్స్- టెక్ స్టార్టప్ లు టూరిజం లాంటివి అన్నీ టీ- హబ్, టి.ఎస్- ఐ పాస్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయన్నారు. అథ్లెట్ ల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వారికోసం గ్రేడెడ్ ఇంటెన్సివ్ లు, ఇన్సూరెన్సు, గురువందనం లాంటి స్కీములు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కోచింగ్ మౌలిక సదుపాయాలు ఇన్నోవేషన్ అథ్లెట్ డెవలప్మెంట్ రంగాల్లో తోడ్పాటుకు భాగస్వాములు కావడానికి ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు.ఈ సదస్సులో మైనారిటీ శాఖ మంత్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.పీ జితేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి,స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లె,అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ పీ.వీ సింధు, జ్వాలా గుత్తా, స్పోర్ట్స్ సీనియర్ జర్నలిస్ట్ బాలా మజుందార్, స్పోర్ట్స్ హబ్ మెంబర్ వితాదాని తదితరులు పాల్గొన్నారు -
పోలీసు పహారాలో గ్లోబల్ సమ్మిట్
భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు భారీ పోలీసు వహారా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు విదేశీ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అడుగడుగునా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు.దీనికి గాను కింది స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు బందోబస్తు మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిఒక్క అధికారి ఈ సమ్మిట్కలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా సమ్మిట్లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ను ఎస్టాబ్లిష్ చేసి వెయ్యికి పైగా సీసీ కెమెరాల ద్వారా ప్రతి సెకను కదలికలను గమనిస్తున్నారు.శంషాబాద్ విమానాశ్రయం టూ ఫ్యూచర్ సిటీఈ అంతర్జాతీయ సమ్మిట్ కోసం పోలీసు శాఖ నెల రోజుల నుంచి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫ్యూచర్ సిటీలోనే మకాం వేసి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఈ బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్నటి రోజు సదస్సులో అనేక మంది ప్రముఖులు పాల్గొనగా వీరిలో పలువురు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మార్గాన వచ్చారు. అలా వచ్చిన ప్రతినిధులు, ప్రముఖుల కోసం రహదారి వెంట వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు బాంబు స్వార్డ్, డాగ్ స్క్వాడ్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహించారు.ఆకట్టుకున్న పోలీసు స్టాల్సమ్మిట్లో ఏర్పాటు చేసిన పోలీసు స్టాల్ విదేశీయులను తదితరులను ఆకట్టుకున్నది. తెలంగాణ పోలీసు శాఖ తరపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలను వారికి అర్థమయ్యే విధంగా వారి భాషలోనే వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఆంగ్లంలోవున్న ఈ కరపత్రాలు అందరికీ ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. అలాగే సమ్మిట్ ప్రాంతంలో రోడ్డు మార్గంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు కలియతిరిగుతూ వాహనాల తనిఖీ నిర్వహించి హెల్మెట్ లేనివారికి అవగాహన కల్పించారు. -
పేదరికం ఏంటో నాకు తెలుసు.. అందుకే ఈ తపన: సీఎం రేవంత్
సాక్షి, ఫ్యూచర్సిటీ: సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన తమ ప్రభుత్వ లక్ష్యం అని.. విద్య మీద ఖర్చు చేసేది వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేటలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చాం2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రూపొందించాం. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు.... ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత. పేదలలో నిరుపేదలకు సహాయం చేయడం మా ప్రాధాన్యత. సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన మా లక్ష్యం. ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేసేది వ్యయం కాదు పెట్టుబడి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో క్వాలిటీ, స్కిల్ లేదు. దాన్ని మేం నెలకొల్పుతాం. 140 కోట్ల జనాభాలో ఎంతమంది మెడల్స్ వస్తున్నాయి?. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ నుండి గోల్డ్ మెడల్స్ తెచ్చేలా కృషి చేస్తాంపేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష. కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిది.. కానీ నాకు పేదరికం ఏంటో తెలుసు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకుని వచ్చా. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉంది. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన.... విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు. ఇది తెలంగాణ భవిష్యత్కు పెట్టుబడిగా భావిస్తున్నాం. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందిఅందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’’ అని రేవంత్ ప్రసంగించారు. -
Global Summit: నేను చిరంజీవిగా ఇక్కడకు రాలేదు
సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని ప్రసంగించారు. వేదిక పై ఒక్కో రంగం నుంచి ఒక్కరు ఉన్నారు. నన్ను వేదికపై ఉంచడం సినిమా పరిశ్రమ కు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం. నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా. సీఎం రేవంత్రెడ్డి ‘బ్రెయిన్ చైల్డ్’ చూడాలని సమిట్కు వచ్చా. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మొదట్లోనే హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా చేయాలని ఆయన మాతో అన్నారు. చెప్పినట్లుగానే.. సీఎం ప్రాక్టికల్గా ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ సమిట్ చూసిన తర్వాత.. సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది. వినోద రంగం పరంగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తామని నమ్మకంగా చెప్పారు. మా సలహాలతో ముందుకు వెళ్తాం అన్నారు. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను వినోదం వైపు మల్లించాలి. చదువే ప్రమాణికం కాదు , డిగ్రీ లేని వారు కూడా జాతీయ స్థాయి సినిమా లు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా... ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు. -
సీఎం రేవంత్ను సమ ఉజ్జీగా ఫీలవుతున్నా: ఆనంద్ మహీంద్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ చూశాక.. తన టార్గెట్ పెద్దదిగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రమఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. యువత, మహిళల అభివృద్ధి ఇందులో ఉందని ఈ డ్యాకుమెంట్ రూపొందించినందుకు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ తమకెంతో ప్రత్యేకమని ఆనంద్ మహీంద్రా అన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం రంగంలో ఉన్న తనకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమ ఉజ్జీగా అనిపించారని తెలిపారు. ప్రస్తుతం ఎంత ఏఐ, డిజిటల్ సాంకేతికతలు వచ్చినా హ్యుమన్ టచ్కు ఉన్న ప్రత్యేకత వేరని ఆ స్కిల్ను భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీర్పేటలోని ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున ఒప్పందాలు చేసుకుంది. మంగళవారంతో ఈ సమ్మిట్ ముగియనుంది. -
తెలంగాణ: ఎల్లుండి దాకా మందు బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆ ప్రాంతాల్లో ఎల్లుండి సాయంత్రం దాకా మందు బంద్ కానుంది. మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రచారం.. నేటి సాయంత్రంతో ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా .. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో (మంగళవారం, డిసెంబర్ 9)ముగిసింది. సాయంత్రం నుంచి మైకులు మూగబోగా.. ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ కానున్నాయి. కాదని తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల్లో అమ్మడం, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎల్లుండి(గురువారం, డిసెంబర్ 11న) మొదటి విడత 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. -
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఒక్కో ఎగ్జామ్కు మూడు రోజుల గ్యాప్ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30గంటలకు ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది. మార్చి 14- ఫస్ట్ లాంగ్వేజ్ - (గ్రూప్ -ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1, ఫస్ట్ లాంగ్వేజ్ -పార్ట్ 2మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్మార్చి 23 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)మార్చి 28- గణితం (మ్యాథమెటిక్స్)ఏప్రిల్ 2 - సైన్స్ (పార్ట్ -1) - భౌతిక శాస్త్రం (ఫిజికల్ సైన్స్)ఏప్రిల్ 7 - సైన్స్ - పార్ట్ 2 - బయోలాజికల్ సైన్స్ఏప్రిల్ 13 - సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్ )ఏప్రిల్ 15 - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1; ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)ఏప్రిల్ 16 - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 -
తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్: హరీష్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో విజయ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పదవులను గడ్డి పూసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి ఆయన. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనివని గుర్తుచేశారు.కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పేరు తప్పక రాయాల్సి వస్తుందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, రెండేళ్లుగా ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళోజి, దాశరధి, గద్దర్ పేర్లతో ఇచ్చే అవార్డులను అవమానించడం, రేడియల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రయత్నం, ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ నేడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే దానికి మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవయాత్ర అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ సీఎంవో, రాజ్భవన్లకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపుల వ్యవహారం అధికారులను, పోలీసులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. తాజాగా తెలంగాణ సీఎంవో, లోక్ భవన్(రాజ్భవన్)లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. వాటిని పేల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆగంతకుడు మెయిల్ పంపాడు. దీంతో, అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్(రాజ్భవన్)లకు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. వాసుకి ఖాన్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వీఐపీలను ప్రముఖులను అందులో నుంచి ఖాళీ చేయించారు. బెదిరింపులు రావడంతో గవర్నర్ కార్యాలయం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిల్ పై దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి ఈ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. ఈరోజు కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఎయిర్పోర్టుకు అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి అమెరికా వెళ్ళే విమానాల్లో బాంబు ఉందని మెయిల్ పంపాడు.. విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తా అంటూ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. బాంబు పేలకూడదు అంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన ఎయిర్పోర్టు అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక, సోమవారం కూడా శంషాబాద్ ఎయిర్పోర్టు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. శంషాబాద్కు వచ్చే మూడు విమానాల్లో బాంబులు ఉన్నట్టు బెదిరింపులకు దిగారు. -
విషాదం నింపిన ‘బిర్యానీ’!
రంగారెడ్డి జిల్లా: బిర్యానీ తినాలనే కోరిక ఆ కుటుంబంలో విషాదం నింపింది. బిర్యానీ అయిపోయిందని స్టౌను ఆఫ్ చేయకముందే రెగ్యులేటర్ను తొలగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాలకు గురి కాగా ఆమెను కాపాడేందుకు వెళ్లిన కూతురు, కుమారుడు కూడా గాయపడ్డారు. రాజేంద్రనగర్ పోలీసు సమాచారం మేరకు... ఉప్పర్పల్లిలో హరి సింగ్ కుటుంబ నివసిస్తుంది. ఇతని కూతురు మాధవి ఠాకూర్(55) తన కుమారుడు, కుమార్తెతో కలిసి తండ్రి వద్దే ఉంటుంది. ఆదివారం మాధవి ఠాకూర్ ఇంట్లో బిర్యానీ చేసేందుకు స్టౌను వెలిగించి బిర్యానీ పూర్తి చేసింది. బిర్యానీ పూర్తయిన అనంతరం స్టౌను ఆఫ్ చేయకముందే రెగ్యులేటర్ను తీసి మరో స్టౌకు పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో మాధవి ఠాకూర్ తీవ్ర గాయాలకు గురైంది. వంట గదిలోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. మాధవి ఠాకూర్ను కాపాడేందుకు ప్రయత్నించిన కూతురు, కుమారుడు సైతం స్వల్ప గాయాలకు గురయ్యారు. తీవ్ర గాయాలకు గురైన మాధవి ఠాకూర్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం రేవంత్ కాన్వాయ్కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ 17 వద్ద రన్నింగ్ లోనే సీఎం కాన్వాయ్ జామార్ టైర్ పగిలింది. జామార్ కుడి వైపు ఉన్న వెనుక టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ టీమ్ వెంటనే స్పందించి స్టెప్నీ టైర్ మార్చారు. జామార్కు చేయవలసిన మరమ్మతులు పూర్తి చెయ్యడంతో వాహనం మళ్లీ సీఎం దగ్గరకు చేరుకుంది. జరిగిన ఘటన వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
పాతికేళ్ల నాటి పగ!
సాక్షి, సిటీబ్యూరో/జవహర్నగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాతికేళ్ల నాటి పగ తుపాకీ, కత్తులతో విరుచుకుపడింది. అప్పట్లో తన తండ్రి మరణానికి ఆయన డ్రైవరే కారణమని భావించిన వ్యక్తి...బంధువుతో పాటు మరికొందరితో కలిసి విరుచుకుపడ్డాడు. కుమార్తెను పాఠశాల వద్ద వదిలి వస్తున్న మాజీ డ్రైవర్ను పట్టపగలు, నడిరోడ్డుపై అడ్డగించి చంపేశాడు. నేరుగా నగరంలోని షాహినాయత్గంజ్ పోలీసుస్టేషన్కు వచి్చన ఆరుగురు నిందితులు లొంగిపోయారు. వీరిని అధికారులు జవహర్నగర్ పోలీసులకు అప్పగించారు. అప్పట్లో డాన్గా వ్యవహరించిన సుదేశ్ సింగ్... నగరంలోని మంగళ్హాట్ ప్రాంతానికి చెందిన సుదేశ్ సింగ్ 1990ల్లో ఓ స్థాయి డాన్గా చెలామణి అయ్యాడు. మంగళ్హాట్, ధూల్పేట, జిర్రా తదితర ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారంతో పాటు బెదిరింపు వసూళ్లు, గంజాయి దందాలను తన గుప్పెట్లో పెట్టుకున్న సుదేశ్ సింగ్ పోలీసులనూ పరుగులు పెట్టించారు. ఇతడి వ్యవహారాలు శృతిమించడంతో అప్పటి ఉన్నతాధికారులు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 1999లో టాస్్కఫోర్స్లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన సుదేశ్ సింగ్ తన సన్నిహితులైన అనుచరులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇతడి ప్రధాన అనుచరుడైన అనిల్ ఆచూకీ కామాటిపుర ప్రాంతంలో గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అనిల్ చనిపోయాడు. వెంకటరత్నంనే ఇన్ఫార్మర్గా అనుమానించి... ఈ ఎన్కౌంటర్తో మరింత అప్రమత్తమైన సుదేశ్ సింగ్ తర్వాతి టార్గెట్ తానే అని భావించారు. తన ఉనికి ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అనుచరుల్నీ దూరంగా ఉంచారు. అయినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య 2000 ఏప్రిల్లో జిర్రా ప్రాంతంలోని గుట్టలపై జరిగిన ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. అప్పట్లో నగరానికి చెందిన గంటా వెంకటరత్నం డాన్ సుదేశ్ సింగ్కు డ్రైవర్గా వ్యవహరించారు. పోలీసులు ఇతడిపై ఒత్తిడి పెంచడంతోనే సుదేశ్ సింగ్ కదలికలపై ఉప్పందించాడని, ఈ కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని మృతుడి కుటుంబీకులు భావించారు. దీంతో కొన్నేళ్లుగా సుదేశ్ కుమారుడు చందన్ సింగ్, సమీప బంధువు కక్షతో రగిలిపోయారు. వెంకటరత్నం ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు జవహర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. పక్కా రెక్కీ చేసి, ఆయుధం సేకరించి... చందన్ తన సమీప బంధువుతో పాటు మరో నలుగురితో కలిసి ముఠా కట్టాడు. సాకేత్ కాలనీలో పక్కాగా రెక్కీ చేసి వెంకటరత్నం కదలికల్ని గమనించారు. ఆపై హత్య పథకాన్ని అమలు చేయడానికి ఓ తుపాకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన తండ్రి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో వెంకటరత్నాన్ని కూడా కాల్చి చంపాలని చందన్ భావించాడు. షాహినాయత్గంజ్ ప్రాంతంలో నివసించే చందన్, అతడి సమీప బంధువు కొన్నాళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఓ తుపాకీ ఖరీదు చేసుకుని వచి్చన ఈ ద్వయం సోమవారం మరో నలుగురితో కలిసి రంగంలోకి దిగింది. తుపాకీతో కాల్పులు జరిపినా తప్పించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కత్తులనూ తమ వెంట తెచ్చుకుంది. ఎప్పటిలాగే వెంకటరత్నం తన కుమార్తెను కాప్రాలోని పాఠశాలలో దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఇది గమనించిన చందన్ విషయాన్ని అనుచరులకు సమాచారమిచ్చాడు.కాపుకాసి దారుణంగా హత్య చేసి..నలుగురు ఆటోలు ఇద్దరు స్కూటీపై వచ్చి కాపుకాశారు. తన కుమార్తెను స్కూల్లో దింపిన వెంకటరత్నం తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ఈయన్ను వెంబడిస్తుండగా ఆటోలో నలుగురు మార్గమధ్యంలో కాపుకాశారు. వీళ్లు కాపుకాసిన ప్రాంతానికి వెంటకరత్నం చేరుకున్న వెంటనే అడ్డగించి దాడికి తెగబడిన ముఠా ముందు కాల్పులు జరిపింది. కిందపడిపోయిన వెంకటరత్నం దగ్గరకు వెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయింది. ఛాతి, తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వెంకటరత్నం అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జవహర్నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించింది. క్లూస్టీం, డాగ్స్వాడ్లతో హత్యాస్థలిలో ఆధారాలు సేకరించారు. నిందితులు నేరుగా షాహినాయత్గంజ్ పోలీసుస్టేషన్కు వచ్చి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. -
తల్లిదండ్రుల ఎదుటే గొంతు కోసి ఘాతుకం
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని కక్ష పెంచుకుని..ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల ఎదుటే గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పార్శిగుట్టలోని బాపూజీనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (19), రేవతి ఉన్నారు. పవిత్ర ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చదువుతుంది. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ (25 )వీరికి దూరపు బంధువు. ఉమాశంకర్కు తల్లిదండ్రులు లేరు, యూసఫ్గూడలోని సోదరి వద్ద నివాసం ఉంటూ టైల్స్ పనిచేస్తుంటాడు. చిలకలగూడలో ఉండే సోదరుడి దగ్గరకు వస్తూ.. ఇదే ప్రాంతంలోని కాంతారావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో పవిత్రపై కన్నేసిన ఉమాశంకర్ ఆమెను ప్రేమిస్తున్నాని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన ఉమాశంకర్తో పెళ్లిని పవిత్ర తిరస్కరించింది. కాగా ఆదివారం కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చారు. తనకు చెప్పకుండా ఎందుకు విజయవాడ వెళ్లారని ఉమాశంకర్ వారితో గొడవకు దిగాడు. సోమవారం ఉదయం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ సమయంలో కాంతారావు దంపతులు, పవిత్ర ఆమె చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి గురించి వీరి మధ్య కొద్దిసేపు వాగ్వవాదం జరిగింది. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాశంకర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తల్లిదండ్రుల కళ్లెదుటే పవిత్ర కన్నుమూసింది. వెంటనే సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ శశాంక్రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్రెడ్డి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు పవిత్ర తనను ఇష్టపడడం లేదని తెలుసుకున్న ఉమాశంకర్ ముందే పథకం ప్రకారం ఆమెను హత్యచేసేందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే తనతో పాటు కత్తిని కూడా తీసుకొచ్చిన ..ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పవిత్రపై దాడికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటనతో పవిత్ర తల్లిదండ్రులు, చెల్లి రేవతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే బిడ్డను చంపేయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. -
రెండేళ్ల మొండిచేయి: కాంగ్రెస్ పాలనపై హరీశ్రావు విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెండేళ్లు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లకు రెండేళ్లు. రెండేళ్ల మొండిచేయి ఇది. ఒక ప్రభుత్వానికి మొదటి రెండేళ్ల సమయం అనేది అత్యంత కీలకం. ప్రభుత్వ విజన్ ఏమిటో..విధానం ఏమిటో.. అభివృద్ధి, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో తేటతెల్లం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన సమయంలో దాదాపు సగం పూర్తయ్యింది. ఇక మిగిలింది రెండేళ్ల కాలమే. చివరి ఏడాదైతే ఎన్నికల హడావుడి, కోడ్తోనే సరిపోతుంది. రేవంత్ రెండేళ్ల పాలనను నిర్వచించాలంటే.. మూడేమూడు మాటలు నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం’అని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘రెండేళ్ల కాంగ్రెస్ పాలన– వైఫల్యాలపై బీఆర్ఎస్ చార్జిషీట్’ను హరీశ్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై పలు విమర్శలు గుప్పించారు.ఒక్కరోజు బాగోతంగా ప్రజా దర్బార్‘సీఎం కార్యాలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తామన్న ప్రజాదర్బార్ ఒక్కరోజు బాగోతమైంది. సీఎంతోపాటు మంత్రులు కూడా రావడం లేదు. ప్రగతిభవన్ ముందున్న ఇనుప గ్రిల్స్ తీసేసి షో చేసిన బిల్డప్ బాబాయ్ రేవంత్రెడ్డి. ప్రజాభవన్ కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్గా మారింది. డిప్యూటీ సీఎం ఫ్యామిలీ సెటిల్మెంట్లు, సాయంత్రంగానా భజానాలు, సంగీత్లు, పెళ్లిళ్లు, రిసెప్షన్లతోని ప్రజాభవన్ ప్రీమియం భవన్గా, ఢిల్లీ బాసులకు గెస్ట్ హౌస్గా మారింది’అని హరీశ్రావు అన్నారు. రెండేళ్ల పాలనలో విధ్వంసం‘రెండేళ్ల పాలనలో ప్రజాధనం కొల్లగొట్టి తమ సొంత సంపాదనపై సీఎం, మంత్రులు దృష్టి పెట్టారు. బరి తెగించి భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇంత ప్లాన్డ్గా, ఇంత ఆర్గనైజ్డ్గా కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు దేశంలో ఎక్కడ ఉండరు. కరప్షన్ కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలనే సిలబస్. ఆరు గ్యారంటీలు అటకెక్కించిండు. అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. హైడ్రా పేరిట కూల్చివేతల అరాచకంతో సృష్టించాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ ఆగమైపోయింది’అని అన్నారు.కాంగ్రెస్ అసలు పేరు స్కాంగ్రెస్ ‘కాంగ్రెస్ పార్టీ స్కాంల వారసత్వాన్ని రేవంత్ కూడా కొనసాగిస్తున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్, భట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఎనుముల బ్రదర్స్ ట్యాక్స్ పేరిట దోచుకుంటున్నారు. హైడ్రా పేరిట విలువైన భూములు కొల్లగొట్టే స్కాం.. మూసీ సుందరీకరణ పేరిట పరీవాహక భూములు బుక్కే స్కాం, 450 ఎకరాల హెచ్సీయూ భూములను చెరబట్టే బడా స్కాం. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే స్కాం. హిల్ట్పి పేరిట రూ.5 లక్షల కోట్ల స్కాం. రూ. 50 వేల కోట్ల పవర్ స్కాం. ఫెయిల్ అయిన వైద్య విద్యార్థులను పాస్ చేసి మెడికల్ స్కాం’’అని హరీశ్రావు విమర్శించారు.కేసీఆర్ పథకాలు రద్దు ‘గత ప్రభుత్వాలవైనా ప్రజలకు మేలు చేసే పథకాలను కేసీఆర్ అమలు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను యథాతథంగా అమలు చేశారు. రేవంత్ మాత్రం వ్యక్తిగత ద్వేషంతో కేసీఆర్ తెచి్చన పథకాలను ఆపి పేద ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కేసీఆర్ పేరు’అని హరీశ్రావు పేర్కొన్నారు.ఆత్మహత్యలు పెరిగాయి రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత రెండేళ్లలో 822 మంది రైతులు, 48 మంది నేతన్నలు, 116 మంది గురుకుల విద్యార్థులు, 179 మంది ఆటో డ్రైవర్లు, 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఐదుగురు బిల్డర్లు, ఒక బీసీ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులివ్వలేదు కానీ...బడా కాంట్రాక్టర్లకు మాత్రం రూ.9000 కోట్లు విడుదల చేసిండు. కమీషన్లు దండుకునేందుకు రేవంత్ స్పెషల్ స్కీం తెచ్చాడు. యంగ్ ఇండియా స్కూళ్ల స్కాం త్వరలో బయటపెడుతాం.’అని హరీశ్రావు అన్నారు. ‘ప్రజల సొమ్మునువాడి సొంత ఇమేజ్ పెంచుకునేందుకు మెస్సీతో మ్యాచ్ అంటూ పీఆర్ స్టంట్లు వేస్తున్నావ్. హోం శాఖ నీ దగ్గరే ఉంది..పెరుగుతున్న క్రైమ్ రేట్కు సమాధానం చెప్పాలి. ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు నీకు దగ్గర్లోనే ఉన్నాయి’అని హెచ్చరించారు.అందరికీ...‘ఆరు గ్యారంటీల పేరుతో ఆడబిడ్డలను రేవంత్ సర్కార్ నిలువునా మోసం చేసింది. 17శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల నోట్లో మట్టి కొట్టారు. మైనారిటీలకు ద్రోహం చేశారు. ఆటో సోదరుల కష్టాల పాలయ్యారు. రెండేళ్లలో జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేదు. సాగునీటి రంగంలో చేసింది సున్నా. రెండేళ్లలో నువ్వు ఎన్ని ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్రెడ్డి’అని హరీశ్రావు అన్నారు. -
మా విజన్కు విద్యుత్తే ప్రధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం 2047 నాటికి నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ విజన్కు విద్యుత్ వ్యవస్థే కేంద్ర బిందువని.. తాము ఎదగడంతోపాటు నలుగురూ ఎదిగేలా బాధ్యతతో ఈ విజన్లో ముందుకెళ్లాలని అనుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పారిశ్రామీకరణ నుంచి జీవన ప్రమాణాల నాణ్యత వరకు నిర్దేశించే విద్యుత్ వ్యవస్థ మార్పు, వాతావరణ చర్యలను కీలక అభివృద్ధి వ్యూహంగా ఎంచుకున్నామని వెల్లడించారు.గ్లోబల్ సమ్మిట్–2025లో భాగంగా సోమవారం ఫ్యూచర్ సిటీలో ‘ద జస్ట్ ట్రాన్సిషన్ ఇన్టు 2047: పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో భట్టి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని, విద్యుత్ రంగంలో మార్పుల ఆవశ్యకత, ప్రణాళికలు, సహకారం గురించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విజన్కు విద్యుత్ వ్యవస్థే కేంద్ర బిందువు లాంటిదని చెప్పారు. పారిశ్రామీకరణ, ఉద్యోగ సృష్టి, వ్యవసాయ శ్రేయస్సు, జీవన ప్రమాణాల నాణ్యతను విద్యుత్ వ్యవస్థ నిర్దేశిస్తుందన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధి వ్యూహంలో ఇంధన మార్పు, వాతావరణ చర్యలను చేర్చామని పేర్కొన్నారు.100 శాతం స్వచ్ఛ వాహనాల రవాణా వ్యవస్థ, 2030 నాటికి దేశంలోనే ఈ–బస్సులను ఎక్కువగా వినియోగించే నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడం, ప్రస్తుతమున్న 11.4 గిగావాట్లకు తోడు మరో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం, అటవీ ప్రాంతాల విస్తరణ, కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే పారిశ్రామిక వృద్ధిని తెలంగాణ భవిష్యత్ కార్యాచరణగా నిర్దేశించుకున్నాం. 2047 నాటికి పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా 1.39 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ అవసరమవుతుందని అంచనాలున్నాయి.అందుకు పునరుత్పాదక ఇంధనాలతోపాటు నిల్వ సౌకర్యం, అవసరమైనంత థర్మల్ సామర్థ్యం, డిజిటల్ గ్రిడ్, పంపిణీ వ్యవస్థలు కావాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో ఇదం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ అజిత్ పండిట్, ఎనీ్టపీసీ గ్రీన్ సీఈవో సరిత్ మహేశ్వరి, మహాలక్ష్మి గ్రూప్ ఫౌండర్ హరీశ్ యార్లగడ్డ, ఈవై పార్ట్నర్ మహ్మద్ సైఫ్, నెట్జీరో ట్రాన్స్మిషన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేత్రా వాల్క్వాకర్, ‘ఆస్కి’ ప్రొఫెసర్ రాజ్కిరణ్ వి. బిలోలికర్, తదితరులు ప్యానెల్ స్పీకర్లుగా వ్యవహరించారు. -
రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో సోమవారం తొలిరోజునే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. తెలంగాణలో దాదాపు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో 35 అవగాహన ఒప్పందాల (ఎంఓయూ)లు కుదుర్చుకు న్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలిరోజే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో తొలిరోజు డీప్టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చే శారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, భారీగా ఉద్యో గావకాశాల సృష్టికి దోహదపడనున్నట్లు ప్రభుత్వం వెల్ల డించింది. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయో టెక్, సినీ నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించిందిప్రధాన పెట్టుబడులు ఇవీ..⇒ భారత్ ఫ్యూచర్సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్అండ్డె వలప్మెంట్, డీప్టెక్హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.⇒ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ. 41 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి.⇒ ఈవ్రెన్యాక్సిస్ ఎనర్జీ రూ. 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ⇒ పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.⇒ ఏరోస్పేస్డిఫెన్స్రంగాల్లో మెయిన్టెనెన్స్, రిపేర్, ఓవర్హాల్తోపాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.⇒ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు చెందిన సల్మాన్ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్రూ. 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వినోద వసతులు కల్పించనుంది. ⇒ మేఘా ఇంజనీరింగ్గ్రూప్ రూ. 8 వేల కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ∙రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్గ్రీన్టెక్ ఎలక్ట్రానిక్స్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.⇒ ఇంటిగ్రేటేడ్ స్టీల్ప్లాంట్ఏర్పాటుకు కృష్ణా పవర్యుటిలిటీస్పెట్టుబడి రూ. 5,000 కోట్లు. ∙ప్రముఖ సంస్థ అతిథత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు నెలకొల్పనుంది. వాటిని స్థాపించేందుకు రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ∙సీతారాం స్పిన్నర్స్రూ. 3 వేల కోట్లతో టెక్స్టైల్యూనిట్ నెలకొల్పనుంది. ⇒ సిమెంట్రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్సిమెంట్స్, రెయిన్సిమెంట్స్రూ. 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ∙డిఫెన్స్, ఏవియానిక్స్తయారీకి అపోలోమైక్రో సిస్టమ్స్లిమిటెడ్రూ. 1,500 కోట్లు పెట్టుబడులు. ⇒ సోలార్డిఫెన్స్–ఏరోస్పేస్ లిమిటెడ్సంస్థ మిస్సైల్భాగాలు, ఏరో ఇంజన్ స్ట్రక్షర్కు రూ. 1,500 కోట్లు. ⇒ అపోలో గ్రూప్ హైదరాబాద్లో రూ. 800 కోట్లతో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మించనుంది.⇒ అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ∙ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం ‘వంతారా’ను ఏర్పాటు చేయనుంది. ⇒ యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభించనున్నాయి. ⇒ డిస్ట్రిబ్యూషన్హైడ్రో టెక్రంగంలో సాహీటెక్ఇండియా రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ⇒ సిడ్బీ స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూ.1,000 కోట్లు పెట్టబడులతో ముందుకు వచ్చింది. ఫ్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్సెంటర్ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఈ నిధులు సమకూర్చనుంది. ⇒షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్అసోసియేషన్ అండ్ జీనియస్ఫిల్టర్స్ పవర్లూమ్టెక్నికల్యూనిట్ కోసం రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ⇒ ఎంపీఎల్లాజిస్టిక్స్కంపెనీ రూ. 700 కోట్లు, టీవీఎస్ఐఎల్పీ రూ. 200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.భారీ పెట్టుబడులు ప్రభుత్వ విధానాలకు నిదర్శనం: సీఎం రేవంత్ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు, తెలంగాణ ప్రభుత్వంపై దేశీయ, అంతర్జాతీయ సంస్థల విశ్వాసానికి రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీప్టెక్ సిటీ నుంచి టెక్స్టైల్ యూనిట్వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిర ప్రారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశగా బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచి్చన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడివిడిగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపగా టైక్స్టైల్, ఫరి్నచర్ రంగాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో భాగస్వామ్యంపై ఐకియా సంస్థ సీఎంతో చర్చింది. -
‘సాక్షి’ ఎడిటర్పై సర్కార్ దాష్టీకం
సాక్షి, అమరావతి: పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికపై కక్షసాధింపును మరింత విస్తృతం చేస్తోంది. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నందుకు అక్రమ కేసులతో బరితెగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా హక్కును కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. కర్నూలులో రూ.4 వేల కోట్ల ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు అధికార టీడీపీ నేతలు పన్నిన కుట్రలను బట్టబయలు చేయడం, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నవారి ఆందోళనకు మద్దతుగా నిలిచినందుకు ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులు నమోదు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు విచారణ పేరుతో సోమవారం కర్నూలు పోలీసులు హైదరాబాద్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో హల్చల్ చేశారు. పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డికి 35 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులిచ్చారు.ఆధారాలతో కథనాలు.. వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం బాబు సర్కారులో... సాక్షి ప్రధాన కార్యాలయం, ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల నమోదు, నోటీసులు, విచారణ పేరుతో వేధించడాన్ని పోలీసులు వారి విధానంగా మలుచుకున్నట్లు స్పష్టమవు తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్పై 19 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనం. అక్రమ కేసులకు కారణమైన కథనాల్లో ఒక్కదాంట్లోనూ ‘సాక్షి’ అవాస్తవాలను ప్రచురించలేదు. పూర్తి ఆధారాలతో ఇస్తూ బాధితులు చెప్పిందే పేర్కొన్నది తప్ప సొంత భాష్యం ఇవ్వలేదు. వాస్తవాలను వక్రీకరించలేదు. అయినా, బాబు ప్రభుత్వ డైరెక్షన్లో పోలీసులు అక్రమ కేసులకు తెగబడుతున్నారు. పోలీసు ఉన్నతాధికా రులు అత్యుత్సాహంతో కొన్ని నమోదు చేయిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా ఆదేశించి మరీ మరికొన్ని నమోదు చేయిస్తున్నారు.బాధితుల పక్షాన నిలిచినందుకే...ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలుగె త్తడం, బాధితుల ఆవేదనను వెలుగులోకి తేవడమే ‘సాక్షి’ చేసిన నేరం అన్నట్లు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల కుట్రపై కర్నూలు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నారు. 19 అక్రమ కేసుల్లో 5 ఈ జిల్లాలోనే నమోదవడం దీనికి నిదర్శనం. ఇక ఇటీవల నమోదు చేసిన కేసు మరీ విడ్డూరంగా ఉంది. కర్నూలులోని ఏ, బీ, సీ క్యాంప్ క్వార్టర్లను ఖాళీ చేయించాలని మంత్రి భరత్ ఆదేశించారు.ఆ భూముల్లో స్టేడియం నిర్మిస్తామని ఓసారి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మరోసారి చెప్పారు. వీటిలో ఏ నిర్మాణానికీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినాసరే, అక్కడివారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు మంత్రి భరత్ సంసిద్ధులయ్యారు. కర్రపట్టుకుని మరీ ఖాళీ చేయిస్తామని బహిరంగంగా హెచ్చరించారు. దాంతో దశాబ్దాలుగా ఉంటున్న కుటుంబాలు తీవ్ర నిరసన తెలిపాయి. ‘సాక్షి’ దీన్ని ప్రచురించింది. ఆగ్రహించిన మంత్రి భరత్... సాక్షిపై అక్రమ కేసు నమోదు చేయాలని హుకుం జారీ చేశారు. పోలీసులు జీహుజూర్ అన్నారు. అంతేకాదు సోమవారం ఏకంగా సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చి ఎడిటర్కు నోటీసులిచ్చారు.➜భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులే ఎత్తుకెళ్లారు. దీన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు చేశారు. రాయలసీమలో భారీ దందాకు పాల్పడుతున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారి బాగోతాన్ని బయటపెట్టినందుకు మరో అక్రమ కేసు పెట్టారు. ఇక టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి భరత్ అనుచరులు వాట్సాప్ మెసేజులతో బెదిరించారు. ఈ విషయాన్ని ప్రచురించినందుకు సాక్షిపై అక్రమ కేసు నమోదు చేశారు.➜పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రైవేట్ పీఏ సతీశ్... ఒంటరి ఉద్యోగిని ఆర్థికంగా, లైంగికంగా వేధించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై సాలూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.➜పోలీసు శాఖలో అర్హులైన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతుల్లో అన్యాయం జరగడాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులే అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం.➜ఇటీవలి భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురైందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో విమర్శించారు. సంబంధిత ఫొటోలను ప్రదర్శించారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.➜రాష్ట్రంలో టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బట్టబయలవడంతో ప్రభుత్వం కంగారుపడింది. నకలీ మద్యం బాగోతాన్ని వెలుగులోకి తెస్తున్న సాక్షి గొంతు నొక్కేందుకు అక్రమ కేసులకు తెగించింది. కల్తీ మద్యం తాగి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి ప్రచురించగా బాబు సర్కారు తట్టుకోలేపోయింది. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాక దానిని వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కక్షసాధింపునకు దిగారు.ప్రభుత్వం ఆదేశాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టారు. అర్థరాత్రి వేళ హైదరాబాద్, విజయవాడ సాక్షి కార్యాలయాలు, సాక్షి పాత్రికేయుల నివాసాలకు వెళ్లి నోటీసుల పేరుతో వేధించారు. ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డికి వాట్సాప్లో ముందుగా నోటీసులు పంపారు. వాట్సాప్లో నోటీసులు షేరింగ్ వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా దాన్ని ఉల్లంఘించారు. అనంతరం విచారణ పేరుతో పేరుతో ఎడిటర్ ధనుంజయ్రెడ్డికి ఏకంగా 85 ప్రశ్నలతో బుక్లెట్ ఇచ్చారు. పత్రికలు, మీడియా ఎలా విధులు నిర్వర్తిస్తాయనే కనీస అవగాహన లేకుండా ఈ ప్రశ్నావళి ఉంది. న్యూస్ సోర్స్, బాధితుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే విస్పష్టంగా ప్రకటించింది. కానీ, సాక్షి వద్ద ఆవేదన వెళ్లగక్కిన బాధితుల వివరాలు చెప్పాలని, న్యూస్ సోర్స్ వెల్లడించాలని ఏపీ పోలీసులు ప్రశ్నించడం విస్మయపరిచింది. -
వాక్ టు వర్క్
సాక్షి, హైదరాబాద్: నడుచుకుంటూనే ఆఫీసుకు వెళ్లొచ్చు.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఇంటికి దగ్గర్లోనే సినిమాకో, షికారుకో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. వైద్య సేవలూ ఇంటికి చేరువలోనే..! భారత్ ఫ్యూచర్ సిటీ లక్ష్యమిదీ. 15 నిమిషాల్లో వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో ఈ ఫోర్త్ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరానికి దక్షిణాన శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేల మధ్యలో మీర్ఖాన్పేట ప్రాంతంలో ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుండటం తెలిసిందే.సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్ సైన్సెస్.. ఇలా అన్ని రంగాలకు ఫోర్త్ సిటీలో భూములను కేటాయించారు. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్–2025లో ఏర్పాటు చేసిన భారత్ ఫ్యూచర్ సిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఫిబ్రవరిలో ఎఫ్సీడీఏ ఆఫీసు ప్రారంభం..ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్సీడీఏ అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు.అన్ని రకాల గృహ సముదాయాలు..ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలకు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) ఫ్యూచర్ సిటీలో లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది.ఫ్యూచర్ సిటీలో ఏ జోన్కు ఎంత భూమి అంటే..నివాస విభాగం: 1,300 ఎకరాలుడేటా సెంటర్లు: 500 ఎకరాలుఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్: 2,000 ఎకరాలుఎడ్యుకేషన్: 500 ఎకరాలుహెల్త్ సిటీ: 150 ఎకరాలుకృత్రిమ మేధ: 300 ఎకరాలుఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్: 900 ఎకరాలుఈవీ అండ్ బీఈఎస్ఎస్: 200 ఎకరాలులైఫ్ సైన్సెస్: 3,000 ఎకరాలు -
ఇంత దారిద్య్రం ఎన్నడూ లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం గతంలో ఎన్నడూ ఇంతగా టెక్నాలజీ, ఐటీ, వనరుల సంపద కలిగి లేదని..అయినా ఏనాడూ పలు కీలకాంశాల్లో ఇంత దారిద్య్రాన్ని ఎదుర్కో లేదని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్గత కుమ్ములాటలు, తీవ్రవాదం, విభజన, విద్వేష రాజకీయాలు పెట్రేగిపోతున్నా యని.. మానవత్వం కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతితో పాటు ప్రజలూ ప్రమాదంలో పడ్డారన్నారు. ఈ పరిస్థితుల్లో వినూత్న పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనే ఈ సమస్యలకు పరిష్కారమని, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం గొప్ప ముందడుగు వేసిందని ప్రశంసించారు. ఫ్యూచర్ సిటీలో సోమ వారం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ లక్ష్యం అసాధ్యమేమీ కాదు..ప్రపంచం నైతిక స్థైర్యం, జవాబుదారీతనం, బాధ్యత విష యంలో తీవ్ర కొరత ఎదుర్కొంటోందని సత్యార్థి చెప్పారు. నిస్వార్థంతో మేధస్సును రంగరించి ప్రపంచంలో ఒకరి సమస్యలను మరొకరు పరిష్కరించుకుంటే, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అభివృద్ధి చెందడం అసాధ్యమేమీ కాదన్నారు. రెండేళ్లలో 20 మంది లక్షల రైతుల రుణాల మాఫీ, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, విద్యా, వైద్య రంగాల ప్రక్షాళన ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ను ప్రశంసించారు. దేశంలో 100 కోట్ల సమస్యలుంటే, వాటికి 130 కోట్ల మంది ప్రజలే పరిష్కారమని చెప్పారు. రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం: టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ దినేశ్సీఐఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 5 వేల నుంచి 10వేల మంది రైతులను పారి శ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఐఐ మాజీ చైర్మన్, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.దినేష్ తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధికి టీవీఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో సహకరిస్తామన్నారు. మూడేళ్లలో రూ.1,700 కోట్ల పెట్టుబడులు: శోభన కామినేని అపోలో హాస్పిటల్స్ విస్తరణలో భాగంగా ప్రోటాన్ ఆధారిత ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటుకు వచ్చే మూడేళ్లలో రూ.1,700 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నామని అపోలో హాస్పిటల్స్ ఎగ్జి క్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని వెల్లడించారు. ‘జెమినాయ్’ పేరుతో ఏఐ ఆధారిత వైద్య సేవలను తయారు చేశామని, డీప్సీక్ కంటే చౌకగా ఇది అందుబాటులోకి వచ్చిందన్నారు. రూ.2,500 కోట్లతో గ్రీన్డేటా సెంటర్: కరణ్ అదానీరాష్ట్రంలో రూ.2,500 కోట్లతో 48 మెగావాట్ గ్రీన్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదాని ప్రకటించారు. కట్టింగ్ ఎడ్జ్ ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుందన్నారు.తెలంగాణతో కొనసాగుతాం: జెరెమీ జుర్జెన్స్భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణతో గత కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నామని, ఈ భాగస్వామ్యాన్ని ఇకపైనా కొనసాగిస్తామని.. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలోని సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ అండ్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ విభాగం అధిపతి ఎండీ జెరెమీ జుర్జెన్స్ తెలిపారు. జనవరిలో దావోస్లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సు, ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగే బయో ఏసియా సదస్సులో సీఎం రేవంత్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. చిన్న అడుగులే పెద్ద లక్ష్యాల సాధనకు సోపానం: అభిజీత్ బెనర్జీప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే అత్యంత ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభి జీత్ బెనర్జీ స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో వేసే సరైన చిన్న చిన్న అడుగులే భారీ లక్ష్యాల సాధనకు తోడ్పాటు అందిస్తాయ న్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనకు ఏం చేయాలి? అనే ఆలోచన చేయడంతోనే మార్గం ఏర్పడుతుందన్నారు. -
హలో రోబో
రంగారెడ్డి జిల్లా/ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘గ్లోబల్ సమ్మిట్– 2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సుకు వచ్చిన అతిథులకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడి, భద్రాచలం జిల్లాకు చెందిన కొమ్ముకోయ కళాకారులు తమ నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు.పలువురు మంత్రులు, వీఐపీలతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగ్జి బిషన్ హాల్కు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి..అక్కడ మానవ రూపంలో ఉన్న రోబో హాయ్ చెప్పి లోనికి ఆహ్వానించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా రోబోతో ముఖ్యమంత్రి కరచాలనం చేశారు. ఆ తర్వాత ఎంఆర్డీసీఎల్, భారత్ ఫ్యూచర్ సిటీ స్టాళ్లను, విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నెట్జీరో సిటీ, పోలీసు విభాగం ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఏరోస్పేస్, ఏవియేషన్ ప్రదర్శనలను వీక్షించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ స్టాల్ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారు.మూసీ సుందరీకరణ ఇలా..మూసీకి జీవం పోస్తూ రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. మూసీ సుందరీకరణలో భాగంగా నదికి రెండు వైపులా భవిష్యత్తులో చేపట్ట నున్న అభివృద్ధి పనులు, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, పార్కులు, అందమైన భవనా లను ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా చూపించారు. ఏ ప్రదేశంలో ఏ ప్రాజెక్టు రాబోతుంది? వంటి అంశాలను డిజిటల్ తెరలపై ప్రదర్శించారు.ఆకట్టుకున్న ప్రదర్శనలుప్రవేశ ద్వారం మొదలుకుని సమావేశ మందిరాలకు వెళ్లే మార్గాల్లో డిజిటల్ తెరలపై వివిధ దేశాల జాతీయ పతాకాలు, డిజిటల్ టన్నెల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ హాల్ మధ్యలో గ్లోబ్ను ఏర్పాటు చేశారు. అంతరిక్ష ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు మించి నిర్మించబోతున్న భవిష్యత్ నగరాన్ని కళ్లముందు ఆవిష్కరించారు.డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ప్రదర్శించిన ‘ఫ్లైట్ సిమ్యూలేటర్’ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ధృవ స్పేస్ సెంటర్ నిర్వాహకులు శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ సహా రాడార్లను ప్రదర్శించారు. పి–30 శాటిలైట్ సహా ఆస్ట్రా వ్యూ.. ఇస్రో ప్యానల్స్ను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో సిటీ స్టాల్ ఆధ్యంతం ఆకట్టుకుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి సహా కాలుష్య రహితంగా ఈ ప్రాంతం ఏ విధంగా ఆవిçష్కరించబోతుందో ఇక్కడ వివరించారు.సంక్షేమ విద్యార్థుల ప్రతిభ..ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ఆదిలాబాద్ జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ కాలేజీ విద్యార్థినులు సీహెచ్ రనూష, జె.వైష్ణవిలు రూ.10 వేల ఖర్చుతో రూపొందించిన ‘మల్టీ పర్పస్ అగ్రికల్చర్ మిషన్’ పారిశ్రామిక వేత్తలను ఆలోచింపజేసింది. ఇది ఇంధనం అవసరం లేకుండా ఒకే సమయంలో దుక్కి దున్నడం, విత్తనాలు వెదజల్లడం, నీటిని చల్లడం వంటి పనులు చేస్తుంది. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహానికి చెందిన పదో తరగతి విద్యార్థి జి.గగన్చంద్ర రూ.25 వేల ఖర్చుతో తయారు చేసిన త్రి ఇన్ ఒన్ హైబ్రిడ్ సైకిల్ సైతం సందర్శకులను ఆకర్షించింది.12 అంశాలపై చర్చా గోష్టులుసదస్సు ప్రారంభోత్సవం తర్వాత అనుబంధ హాళ్లలో రెండు సెషన్లలో 12 అంశాలపై చర్చా గోష్టులు జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.స్కిల్స్ వర్సిటీ, ఉస్మానియా ఆస్పత్రి నమూనాలువిద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నమూనా’ సహా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్తగా నిర్మించ తలపెట్టిన ఉస్మా నియా ఆస్పత్రి భవనం నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హెచ్ ఎండీఏ, హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో రీజినల్ రింగ్రోడ్డు, రేడియల్ రోడ్ మ్యాప్లను ప్రదర్శించారు. ఇందిరా మహిళా శక్తి స్టాల్లో ఫ్యూయల్ స్టేషన్ నమూనాను ప్రదర్శించారు. నెట్ జీరో సిటీలో ప్రభుత్వం పూర్తి ప్లాస్టిక్ రహితంగా ఏర్పాట్లు చేసింది.ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోసదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిలతో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. -
పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో, ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ మీడియా అండ్ టెక్నా లజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఆహ్వానించడంతో పాటు గౌరవం, అభివృద్ధి కనిపించిన చోటే తమ పెట్టుబడులు పెడతామని అన్నారు. గత కొన్ని నెలలుగా తమను తెలంగాణకు ఆహ్వానిస్తూనే ఉన్నా, ఆలస్యం జరిగిందని, రాష్ట్రంలో అభివృద్ధికి భారీ అవకాశాలుండడంతో రాక తప్పలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.భారత్లో అద్భుతమైన మానవ వనరులుపెట్టుబడులు పెట్టేముందు డబ్బు తిరిగి వస్తుందా.. లాభాలు వస్తాయా? అని అందరూ ఆలోచి స్తారని, అయితే అదే ప్రధానం కాకూ డదని స్వైడర్ అన్నారు. స్వల్పకాలిక ప్రయో జనాలు కాకుండా దీర్ఘకాలిక అంశాలూ దృష్టిలో ఉంచుకో వాలని చెప్పారు. ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటే అక్కడికి పెట్టు బడులు నీటి ప్రవాహంలా వెళ్తాయన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులున్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్న పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆదరాభిమానాలు మరిచిపోలేనుసదస్సుకు ఆహ్వానించి తనకు ఊహించని రీతి లో అద్భుత ఆతిథ్య మిచ్చినందుకు సీఎం రేవంత్రెడ్డికి స్వైడర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూపిన ఆదరాభిమానాలు మరచిపోలేనని అన్నారు. అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు దాడి చేస్తున్న సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడా నికి ‘ట్రూత్’ సోషల్ మీడియాను ప్రారంభించామని ఈ సందర్భంగా చెప్పారు. తమ ఆలోచనలకు అనుగుణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు -
విజన్ సాధిస్తాం.. భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త రాజ్యాంగంతో నాటి నాయకత్వం భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేసిన తరహాలోనే తెలంగాణ భవిష్యత్తు కోసం తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. వచ్చే పదేళ్లలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 2047లో వందేళ్లు పూర్తయ్యే నాటికి సాధించాల్సిన అంశాలపై చర్చించే క్రమంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్కు బీజం పడిందన్నారు.విజన్ లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా అనిపించినా సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. కష్టమైన ప్రణాళికలను వెంటనే చేపట్టి, అసాధ్యమైన వాటికి కొంత గడువు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో, ‘తెలంగాణ రైజింగ్’ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో సీఎం కీలకోపన్యాసం చేశారు.రాష్ట్రం కలలు నెరవేర్చేందుకే.. ‘దశాబ్దాల పాటు సాగిన ప్రత్యేక రాష్ట్ర పోరాట ఫలితంగా దేశంలో తెలంగాణ యువ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర భవిష్యత్తు కలలు నెరవేర్చేందుకు నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో చర్చించి విజన్ డాక్యుమెంటు తయారు చేశాం. రెండు రోజుల సదస్సులో వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్య వేత్తలు, ప్రభుత్వాధికారులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.గ్వాంగ్డాంగ్ నమూనా స్ఫూర్తి దేశంలో 2.9 శాతం జనాభా కలిగిన తెలంగాణ.. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉంది. 2047 నాటికి 10 శాతం వాటాను రాష్ట్రం కలిగి ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ క్రమంలో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు భాగాలుగా విభజించాం. ఈ మూడు ప్రాంతాలను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు చిరునామాగా మారుస్తాం. చైనాలోని అతిపెద్ద ప్రావిన్స్ ‘గ్వాంగ్ డాండ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే ప్రపంచంలో అత్యధిక పెట్టుబడులు, వృద్ధిరేటును సాధించింది. గ్వాంగ్డాంగ్ నమూనాను రాష్ట్రంలోనూ అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందిన తెలంగాణ.. ప్రస్తుతం ఆ దేశాలతో పోటీ పడాలని అనుకుంటోంది..’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ‘ప్రదానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలు ఉన్నాయి. వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్లో సమగ్రాభివృద్ధి, స్థిరమైన విధానాలు, ఆవిష్కరణలు మూల స్తంభాలుగా ఉన్నాయి. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే సంకల్పంతో ముందుకు సాగుతున్న రీతిలోనే తెలంగాణ కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు, రైతులు, యువత, పిల్లలను కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. మహిళల స్వశక్తీకరణలో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు, రిటైల్ ఎంటర్ప్రైజ్లు, సౌర శక్తి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళలను ఆర్థిక వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మార్చడంతో పాటు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల పునరుద్ధరణ వంటి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాం«దీజీ స్ఫూర్తితో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కూల్స్, నైపుణ్య శిక్షణ, క్రీడా యూనివర్సిటీలు యువతను భవిష్యత్తు వైపు మళ్లిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్తగా మార్చేందుకు రాష్ట్రంలో విమానాశ్రయాలు, పునరుత్పాదక శక్తి, రవాణా వ్యవస్థలు, స్మార్ట్ జోనింగ్ వంటి ఆధునిక మౌలిక వసతులను ప్రభుత్వం చేపడుతోంది. పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న విధానాలుప్రభుత్వ స్థిరమైన, స్పష్టమైన విధానాలు పెట్టుబడులను, ఆవిష్కరణలను ఆకర్షిస్తున్నాయి. మహిళా కారి్మకుల కోసం ‘గిగ్ వర్కర్ల పాలసీ’, రెస్ట్ సెంటర్లు వంటి వినూత్న ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. సాంకేతికత, వృత్తి ఆధారిత నైపుణ్య శిక్షణ ద్వారా భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేస్తోంది. ప్రజల సేవకులుగా పనిచేసే ప్రభుత్వాలు బాధ్యతాయుత పాలనతో ప్రజల్లో నమ్మకాన్ని పెంపొదిస్తాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది.’ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.రాష్ట్రాల సహకారంతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి‘సాంకేతికతతో సంప్రదాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసిన హైదరాబాద్ కేవలం తెలంగాణకు రాజధాని మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటిది. ఐటీ హబ్గా, ఇన్నొవేషన్ కారిడార్గా, ఫార్మాస్యూటికల్ క్యాపిటల్గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్గా వర్ధిల్లుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముంది. 2047 నాటికి వికసిత భారత్గా వెలుగొందాలనే ప్రధాని మోదీ కల రాష్ట్రాల కీలక సహకారంతోనే సాకారమవుతుంది. పరిశ్రమలను, స్టార్టప్లను, టాలెంట్ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలి. రాష్ట్రాల మధ్య సుహృద్భావ పోటీతో ప్రమాణాలు పెరగడంతో పాటు సంస్కరణలు జరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా అవతరించింది.అభివృద్ధిలో రాష్ట్రంతో కలిసి పనిచేస్తాం2014 నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు, రైల్వే రంగానికి రూ.32 వేల కోట్లు కేటాయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రూ.521 కోట్లతో కాజీపేలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రామగుండంలో రూ.11 వేల కోట్లతో ఎనీ్టపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల కొత్త థర్మల్ పవర్ ప్లాంటు నిర్మించాం. మరో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉంది. వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కు ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.2,300 కోట్లతో జహీరాబాద్ ఇండ్రస్టియల్ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.బెంగళూరు హైదరాబాద్ నడుమ దృఢ బంధం: డీకే శివకుమార్‘కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నా మిత్రుడు రేవంత్రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చా. అభివృద్ధి పథంలో సాగుతున్న బెంగళూరు, హైదరాబాద్ నడుమ దృఢ బంధం ఏర్పడాల్సిన అవసరముంది. రెండేళ్లలోనే రేవంత్రెడ్డి ప్రభుత్వం గణనీయమైన పురోగతితో అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ సదస్సు తీరును చూస్తే బెంగళూరుతో కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయంగా పోటీ పడుతున్నట్టుంది. విజన్ డాక్యుమెంట్ 2047 వచ్చే తరం ఆకాంక్షలకు అద్దం పడుతుంది. దేశ ఆర్థిక పురోగతిలో దక్షిణాది రాష్ట్రాలు మరింత ఐక్యంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత ఐటీ రంగంలో బెంగళూరు, హైదరాబాద్ను విస్మరించలేని పరిస్థితి ఉంది. రెండు నగరాలు పరస్పరం పోటీ పడకుండా సహకారంతో ముందుకు సాగడం ద్వారా భారత సాంకేతిక, ఆర్థిక రంగాలకు మూల స్తంభాలుగా నిలుస్తాయి..’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ వార్డులు 300కు పెంపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఇటీవల 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. దీంతో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుండి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ జీహెచ్ఎంసీ పరిధిలో భాగమైంది. 27 అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ చేపట్టింది. ఓట్లు వేసే ప్రజాప్రతినిధుల సంఖ్యను కూడా ప్రభుత్వం 300కే ఫిక్స్ చేసింది. -
తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఒప్పందాలు
సాక్షి హైదరాబాద్:నేడు రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ సమ్మట్ లో విద్యుత్ శాఖకు పెట్టుబడులు వెల్లువగా వచ్చాయి. ఈ రోజు మెుత్తంగా రూ. 4లక్షల కోట్లకు చెందిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగా కేవలం విద్యుత్ శాఖలోనే రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలనుంచి దాదాపు 4వేల మందికి పైగా ప్రతినిధులు తరలివచ్చారు.కంపెనీల వారిగా విద్యుత్ శాఖలో పెట్టుబడులు గ్రీన్ కో ఎనర్జీస్. 3,960 మెగావాట్లుపెట్టుబడి: ₹24,000 కోట్లు ములుగు జిల్లా, ఇప్పాగూడెంగ్రీన్ కో టీజీ01- 950 మెగావాట్లు పెట్టుబడి : రూ.5,800 కోట్లు ఆదిలాబాద్ జిల్లా, ఝారిశ్రీ సిద్ధార్థ ఇన్ ఫ్రా -900 మెగావాట్లు పెట్టుబడి: రూ.5,600 కోట్లు ఆదిలాబాద్ & నిర్మల్ జిల్లాఆస్తా గ్రీన్ ఎనర్జీ - 750 మెగావాట్లవు పెట్టుబడి: రూ.4,650 కోట్లు నిజామాబాద్ జిల్లా, మైలారంసెరూలిన్ ఎనర్జీ సొల్యూషన్ - 900 మెగావాట్లు పెట్టుబడి: ₹5,600 కోట్లు ఆదిలాబాద్ జిల్లా, రామాపురఆక్సిస్ ఎనర్జీ, 2,750 మెగావాట్లు పెట్టుబడి 31,500 కోట్లుఈకోరిన్ 1,500 మెగావాట్లుపెట్టుబడి రూ.16,000మై హోమ్ పవర్ 750 మెగావాట్లుపెట్టుబడి రూ. 7,000 కోట్లుఆస్తా గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి రూ. 5,600 కోట్లు జాబ్స్ 200-300యునైటెడ్ టెలికామ్స్పెట్టుబడి రూ.2,500 కోట్లు జాబ్స్ 16, 500ఏఏమ్ ఆర్ ఇండియా పెట్టుబడి రూ. 1,2500కోట్లు జాబ్స్ 19,750ఎఏమ్ గ్రీన్ (ఇండియా) పెట్టుబడి రూ.8,000 కోట్లు – 4,000 జాబ్స్ఎఏమ్ గ్రీన్ (ఇండియా)పెట్టుబడిరూ.10,000 కోట్లు – 35,000 జాబ్స్ఎస్ ఎల్ ఆర్ సురభి పవర్ పెట్టుబడి రూ.3,000 కోట్లు 1,000 జాబ్స్అయిత్రా హోల్డింగ్స్పెట్టుబడి రూ.4,000 కోట్లు – 9,000 జాబ్స్శ్రీ సురాస్ ఇండస్టీస్పెట్టుబడి రూ.3,500 కోట్లు – 5,000 జాబ్స్సోలానిక్స్ పవర్ - 500 మెగావాట్లు పెట్టుబడి రూ. 2,400 కోట్లు – 500 జాబ్స్హైజోన్ గ్రీన్ ఎనర్జీస్ పెట్టుబడి రూ.1250 కోట్లు జాబ్స్ 850హైజీనో గ్రీన్ ఎనర్జీస్ పెట్టుబడి రూ. 1250 కోట్లు జాబ్స్ 850సాయిల్ ఇండస్ట్రీస్ పెట్టుబడి1,600 కోట్లు, జాబ్స్ 1,250ఆస్తా గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి రూ. 5,600 కోట్లు జాబ్స్ 200-300యునైటెడ్ టెలికామ్స్పెట్టుబడి రూ.2,500 కోట్లు జాబ్స్ 16, 500ఏఏమ్ ఆర్ ఇండియా పెట్టుబడి రూ. 1,2500కోట్లు జాబ్స్ 19,750 -
తెలంగాణలో ‘వంతారా’ జూపార్క్.. కుదిరిన ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ అధినేత అంబానీ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న వంతారా జూపార్క్ బ్రాంచ్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలోనే ఈ జూపార్క్ ఏర్పాటు కాబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసిన వంతరా బృందం.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్క్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో MOU కుదుర్చకుంది. వంతారా-అటవీశాఖ అధికారులు సీఎం సమక్షంలో ఒప్పందానికి వచ్చారు. ఈ సందర్భంగా జంతువుల సేవ నినాదంతో వంతారా పని చేయడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే జూపార్క్లో జంతువులకు.. గుజరాత్ జామ్ నగర్ వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ కల్పించాలని.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదే సమయంలో.. ఈ నెల చివర్లో తానే స్వయంగా సీఎం రేవంత్ వంతారా టీంతో అన్నారు. -
2026 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో 2026 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నంబరు 1715) జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 26 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.జనవరి 14న బుధవారం భోగి, వెంటనే 15 జనవరి గురువారం సంక్రాంతి/పొంగల్.. 26 జనవరి సోమవారం గణతంత్ర దినోత్సవం.. ఫిబ్రవరిలో 15న ఆదివారం మహాశివరాత్రి.. మార్చి 3న మంగళవారం రంగుల పండుగ హోలీ, 19 మార్చి గురువారం ఉగాది, 21 మార్చి శనివారం రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్), 22 మార్చి ఆదివారం రంజాన్ తరువాతి రోజు, అలాగే 27 మార్చి శుక్రవారం శ్రీరామ నవమి..ఏప్రిల్న శుక్రవారం గుడ్ ఫ్రైడే, 5 ఏప్రిల్ ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14 ఏప్రిల్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. 27 మే బుధవారం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా).. 26 జూన్ శుక్రవారం మొహర్రం (ఇమామ్ హుస్సేన్ షహాదత్ – 10వ రోజు)..10 ఆగస్టు సోమవారం బోనాలు, 15 ఆగస్టు శనివారం స్వాతంత్ర్య దినోత్సవం, 26 ఆగస్టు బుధవారం ఈద్ మిలాద్-ఉన్-నబీ.. 4 సెప్టెంబర్ శుక్రవారం శ్రీకృష్ణ అష్టమి, 14 సెప్టెంబర్ సోమవారం వినాయక చవితి.. 2 అక్టోబర్ శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి, 18 అక్టోబర్ ఆదివారం సద్దుల బతుకమ్మ, 20 అక్టోబర్ మంగళవారం విజయదశమి, 21 అక్టోబర్ బుధవారం విజయదశమి తరువాతి రోజు..8 నవంబర్ ఆదివారం దీపావళి, 24 నవంబర్ మంగళవారం కార్తీక పౌర్ణమి / గురు నానక్ జయంతి.. 25 డిసెంబర్ శుక్రవారం క్రిస్మస్, 26 డిసెంబర్ శనివారం క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)గా ప్రకటించింది.ఐచ్చిక సెలవులు (Optional Holidays)గా.. 1 జనవరి గురువారం నూతన సంవత్సరం, 3 జనవరి శనివారం హజ్రత్ అలీ జన్మదినం, 16 జనవరి శుక్రవారం కనుమ, 17 జనవరి శనివారం షాబ్-ఎ-మెరాజ్, 23 జనవరి శుక్రవారం శ్రీపంచమి, 4 ఫిబ్రవరి బుధవారం షాబ్-ఎ-బరాత్… ఇలా మొత్తం 26 ఉన్నాయి. అయితే.. వీటిల్లో ఉద్యోగులు తమ ఇష్టప్రకారం గరిష్టంగా 5 రోజులు మాత్రమే తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక అయిదు ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో స్పష్టం చేసింది. -
భవిష్యత్తు కోసం ఎదురుచూడం... నిర్మిస్తాం: శ్రీధర్ బాబు
భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా... దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ "మేం వేసే ప్రతి అడుగు... చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమే" అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. "ఫీనిక్స్" పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్, సస్టైనబులిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని మార్చాలనే లక్ష్యంతోనే "తెలంగాణ రైజింగ్"కు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్మెంట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు అడుగులు వేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.ఈ ప్రయాణంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం వేసిన తొలి అడుగు "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025" అని అన్నారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2024 - 2025 లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు అయ్యిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ అని వివరించారు.అదేవిధంగా రాష్ట్ర ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రేటు 7.6 శాతం కాగా, జాతీయ సగటు 6.6 శాతం మాత్రమే అన్నారు. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11.9 శాతం కాగా, అదే జాతీయ సగటు 10.7 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 12.6 శాతం వృద్ధి రేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇతర యుటిలిటీస్ లాంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమని శ్రీధర్ బాబు తెలిపారు.దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్ గా మారిన మంథని అనేది ఒక మారుమూల గ్రామమని కాని ఆచిన్న ఊరే "రేపటి తెలంగాణ"కు మార్గదర్శిగా నిలిచిందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ ఐటీఐలు, ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, లైఫ్ సైన్సెస్ హబ్ "వన్ బయో", సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ లాంటి విప్లవాత్మక అడుగులు ప్రపంచపటంలో "తెలంగాణ"ను ప్రత్యేకంగా నిలుపుతాయన్నారు.రేపటి కోసం, భవిష్యత్ తరాలకు భరోసాగా తెలంగాణతో కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణులకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు. -
Global Summit: తెలంగాణ రైజింగ్ అనేది అన్స్టాపబుల్
సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచ పటంలో తెలంగాణ మంచి రాష్ట్రంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని.. అది ఎంత కష్టమైనా అందరి సహకారంతో సాధించి తీరతామని మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో ఆయన ప్రసంగించారు.దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారు. మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నాం. ఇందుకు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో సోనియా గాంధీ, ఆనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది. భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది... మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం.. ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలుఈ గ్లోబల్ సమ్మిట్కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు. ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం.దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం... ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం. ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం.కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా. గ్వాంగ్డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్కైనా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం.మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీంకు నేను చెప్పేదొక్కటే. కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక.. ఇవాళ మీరందరూ మాతో చేరారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. Come and join the rise అని సీఎం రేవంత్ తన ప్రసంగం ముగించారు. -
ముషీరాబాద్ డివిజన్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ముషీరాబాద్ డివిజన్లో ఓ యువతి తన ఇంట్లో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బౌద్ధనగర్ పరిధిలోని బాపూజీ నగర్ పవిత్ర(17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం మధ్యాహ్నా సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు ఇంట్లోకి దూరి కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకుంటుండగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..మేనబావ పనే..!పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావే ఉమాశంకరేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. టైల్స్ పనిచేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని.. దీంతో కక్ష పెంచుకొని ఉన్మాదిగా ఈ ఘోరానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. ఘటన స్థలంలో ఉమాశంకర్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు ధృవీకరించుకున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం వారాసిగూడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
జిస్మత్ మండీని ప్రారంభించిన సినీ నటుడు ధర్మ మహేష్
సినీ నటుడు, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్ ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాము ఇది నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని అన్నారు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుంది. ధర్మ మహేష్ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడు మరియు ఆ పరివర్తన పూర్తయ్యే వరకు, కార్యకలాపాలు మరియు విస్తరణను పర్యవేక్షిస్తునాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ”ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్ ను బలోపేతం చేస్తుందని అని విశ్వసిస్తునాము అన్నారు. -
ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.అయితే, ఐఏఎస్ ఆమ్రపాలిని ఏపీకి అలాట్ చేస్తూ గత ఏడాది అక్టోబర్లో DOPT ఉత్తర్వులు జారీ చేశారు. DOPT ఉత్తర్వులను ఆమ్రపాలి క్యాట్లో సవాల్ చేశారు. ఈ క్రమంలో ఐఏఎస్ హరికిరణ్తో స్వాపింగ్లో భాగంగా ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను DOPT మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ సందర్బంగా ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది. -
జల్సాలు, విందులకు కేరాఫ్గా ప్రజాభవన్: హరీష్రావు
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్ను కేరాఫ్గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేళ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణను నంబర్ వన్గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.అలాగే, ప్రతీరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కు రేవంత్ వచ్చారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పెళ్లిళ్లకు, సీఎల్పీ మీటింగ్లకు ప్రజాభవన్ను వాడుతున్నారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన.. రెండేళ్ల పాలనలో రేవంత్ చేసింది ఒక్కటైనా చెప్పగలడా?. అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలి. ఫైనాన్స్లో బిల్లు రావాలి అంటే 30 శాతం ఇవ్వాలి. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకువచ్చారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలి’ అని కామెంట్స్ చేశారు. -
కబళించిన పొగమంచు
● దారి కానరాక డివైడర్ను ఢీకొన్న కారు ● లాలాపేటలో ఇద్దరు యువకుల దుర్మరణం అడ్డగుట్ట: క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు తెల్లవారుజామునే కారులో బయలుదేరిన నలుగురు యువకుల్లో ఇద్దరిని పొగమంచు రూపంలో మృత్యువు కాటేసింది. దట్టంగా ఆవరించిన పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో డివైడర్ కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం లాలాగూడ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. ఇన్స్పెక్టర్ రఘుబాబు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ఆశ్రిత్రెడ్డి (22), బాలాజీ మణికంఠ శివసాయి (23), రాహుల్ (23), శ్రీకాంత్ (24)లు స్నేహితులు. వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగులు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మిత్రులు కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు తార్నాకలోని గ్రౌండ్కు కారులో బయలుదేరారు. ఆశ్రిత్రెడ్డి కారు నడుపుతుండగా పక్క సీటులో బాలాజీ మణికంఠ శివసాయి, వెనుక సీట్లలో రాహుల్, శ్రీకాంత్లు కూర్చున్నారు. మౌలాలి నుంచి తార్నాక వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున 6 గంటల సమయంలో భారీగా పొగమంచు కమ్ముకుంది. లాలాపేట ధోబీఘాట్ వద్ద కల్వర్ట్పై ఉన్న డివైడర్ పొగ మంచు కారణంగా కనిపించలేదు. దీంతో మౌలాలి బ్రిడ్జిపై నుంచి వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవ్ చేస్తున్న ఆశ్రిత్రెడ్డితో పాటు ముందు సీటులో కూర్చున్న బాలాజీ శివసాయి మణికంఠ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లలో కూర్చున్న రాహుల్, శ్రీకాంత్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. స్వల్ప గాయాలైన మరో ఇద్దరు మల్కాజిగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదాలకు నెలవుగా లాలాపేట కల్వర్టు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లాలాపేట కల్వర్టు రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కల్వర్టుపై ఉన్న డివైడర్ సరిగా కనబడకపోవడంతో గతంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ, ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటికై నా ట్రాఫిక్ పోలీసులు డివైడర్కు సరైన సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే బారికేడ్లయినా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు. తద్వారా బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు నెమ్మదిగా వస్తాయని, అప్పుడు ప్రమాదాలు కూడా తగ్గుతాయని పలువురు చెబుతున్నారు. లాలాపేట కల్వర్టుపై డివైడర్ను ఢీకొన్న కారుఆశ్రిత్రెడ్డి (ఫైల్) బాలాజీ శివసాయి మణికంఠ (ఫైల్) -
ఫుట్బాల్ మ్యాచ్కు సర్వం సిద్ధం
ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన ఉప్పల్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– 11.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనిల్ మెస్సీ–11 జట్లు ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర క్రీడల శాఖ చైర్మన్ శివసేనా రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు రానున్న క్రీడాకారుడు మెస్సీకి భారీ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెస్సీ రాకతో అనేక ఖండాల నుంచి దిగ్గజాలు వస్తున్నందున అదే తరహాలో భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి వచ్చి సీట్లలో కూర్చోవాలని, తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొక్కిసలాటకు తావుండదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మెస్సీని చూడటానికి అవకాశం వచ్చినందున అందరూ సహకరించాలని సూచించారు. మంత్రుల వెంట హెచ్సీఏ ప్రతినిధి దిల్జీత్ సింగ్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, గోవింద్ రెడ్డి తదితరులున్నారు. -
ఓఆర్ఆర్పై లారీ, కారు ఢీ..
● తండ్రి, కూతురు మృతి ● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు పటాన్చెరు టౌన్: మేడ్చల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయ్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం, భార్య లక్ష్మి, కూతురు సుభిక్ష (4)తో పాటు వీరి దూరపు బంధువు తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి కూతుర్లు శశిక, ధూవిక మొత్తం ఏడుగురు షిఫ్ట్ కారులో శనివారం రాత్రి మేడ్చల్ నుంచి తిరుపతి బయలుదేరారు. ఈ క్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ఎగ్జిట్ – 2 సమీపంలో ఓఆర్ఆర్పై అదే మార్గంలో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుభిక్ష అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. శ్రీశైలం భార్య లక్ష్మి, తిరుపతి, అతడి భార్య జ్యోతిలక్ష్మి, వీరి ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (ఇన్ సెట్లో) మృతులు శ్రీశైలం, సుభిక్ష (ఫైల్) -
బాంబు.. బూచీ!
● ఈ ఏడాది ఆర్జీఐఏకి 18 సార్లు ఈ–మెయిళ్లు ● అత్యధికంగా గత నవంబర్, ఈ నెలలో పదిసార్లు ● ప్రయాణికులు, వైమానిక భద్రతాధికారులు బెంబేలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బూటకపు బెదిరింపులుశంషాబాద్: బూటకపు బాంబు బూచీలు అటు వైమానిక భద్రతాధికారులు.. ఇటు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడచిన ఏడాది కాలంగా ఇలాంటి సందేశాల సంఖ్య ఇంతకింతకూ రెట్టింపవుతుండటంతో ప్రయాణికులతో పాటు వైమానిక యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 18 హాక్స్ (బూటకపు) మెయిల్స్ రావడంతో సైబరాబాద్ పోలీసు యంత్రాగం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటి వరకు నలుగురిని రిమాండ్కు తరలించింది. ఎవరు.. ఎందుకు..? శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే బాంబు బెదిరింపు ఈ– మెయిళ్లపై చేపడుతున్న దర్యాప్తులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత సమస్యను కాస్తా భయాందోళనగా మార్చే ఉద్దేశాలు కొందరివైతే.. సమస్యను మరో వ్యక్తిపై నెట్టేందుకు యత్నించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బాయ్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని ఓ టెకీ ఏకంగా అతడి మెయిల్స్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ఎయిర్పోర్టులు. క్రీడా మైదానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసింది. గుజరాల్ ఎయిర్ ఇండియా ఘటన సైతం తన ప్రియుడిపై మోపేందుకు చేసిన ఈ మెయిల్ గుట్టును గుజరాత్ పోలీసు యంత్రాంగం గుర్తించిన కేసులో శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు కూడా సదరు యువతిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వ్యక్తిగత ద్వేషాలతోనూ.. అదేవిధంగా ఎయిర్లైన్స్ ఉద్యోగులు తనతో సరిగా ప్రవర్తించలేదని ఒకరు. మతి స్థిమితం లేని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఓ మైనర్ బాలుడు.. ఇలా తమ వ్యక్తిగత ద్వేషాలను సంతృప్తి చేసుకునేందుకు కూడా ఇలాంటి థ్రెట్ మెయిల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ మెయిల్స్ ద్వారా కాకుండా వీటిని ప్రత్యేక యాప్ల ద్వారా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్బాల్లో ఇలాంటి మెయిల్స్ విదేశాల నుంచి కూడా పంపుతున్నారు. వరసగా వస్తున్న థ్రెట్స్ మెయిల్స్లో ఇటీవల ఒకే ఐడీతో పలుమార్లు వచ్చిన సందర్భాలను కూడా పోలీసులు శోధిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు ఇప్పటికే నాలుగు కేసుల్లో నలుగురిని రిమాండ్కు కూడా తరలించారు. విమానాలు వెనక్కి.. బెదిరింపు ఈ మెయిళ్ల ప్రభావం ఎంతగా ఉందంటే టేకాఫ్ తీసుకుని మార్గంమధ్యలో ఉన్న విమానాలు కూడా వెనక్కి మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొన్నింటిని సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు సైతం మళ్లించాల్సి వస్తోంది. తాజాగా ఈ నెల 6న మూడు అంతర్జాతీయ విమానాలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో కువైట్ విమాన్ని తిరిగి కువైట్కు తిప్పి పంపారు. నవంబర్ ప్రారంభం నుంచి ఇప్పటికు మొత్తం పదికిపైగా బాంబు థ్రెట్స్ మెయిల్స్ ఆర్జీఐఏ కస్టమర్ సపోర్ట్కు అందాయి. సుమారు ఆరుదేశీయ విమానాలు కూడా పక్కవిమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. ఈ పరిణామాలు అటు ప్రయాణికులకు గంటల కొద్దీ ప్రయాణ భారంతో పాటు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి కారణంగా ఎయిర్లైన్స్ సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బెదింపులు వస్తే.. ఉరుకులు పరుగులే.. బాంబు థ్రెట్ మెయిల్స్ అందిన వెంటనే విమానాశ్రయంలోని భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబు థ్రెట్ అసెస్మెంట్ కమిటీ) డిక్లేర్ చేసి విస్తృతమైన తనిఖీలు షురూ చేస్తారు. బాంబు, డాగ్ స్క్వాడ్లతో అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని థ్రెట్ మెయిల్స్ ఉన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. బాంబు థ్రెట్ మెయిల్స్ను తీవ్రంగానే పరిగణిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే నలుగురిని రిమాండ్కు తరలించాం. సైబర్క్రైమ్, ఇంటలిజెన్స్ విభాగాల సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రక్రియ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికు వరకు దర్యాప్తు చేపట్టిన వాటిలో వ్యక్తిగత కారణాలు, మానసిక కారణాలతో కొందరు ఇలాంటి మెయిల్స్ పంపినట్లు గుర్తించాం. – బి.రాజేష్, శంషాబాద్ డీసీపీ -
భద్రతా వలయంలోభారత్ ఫ్యూచర్ సిటీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్ూచ్యన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వెయ్యి సీసీ కెమెరాలతో 2,500 మంది పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక చుట్టూ వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత, మరో 1500 మందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పరిశీలించారు. విద్యుత్, మంచి నీరు, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ సహా ఏసీలు, 3డీ ఎల్సీడీ ప్రొజెక్టర్లు, లైటింగ్, సౌండ్ సిస్టం సహా రిసెప్షన్ కౌంటర్, ప్రధాన వేదికకు వచ్చిపోయే మార్గాలను పరిశీలించారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్లు సహా వచ్చి పోయే మార్గాలను మరోసారి చెక్ చేశారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. సచివాలయం, అసెంబ్లీ సహా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన మార్గాలు, మెట్రో పిల్లర్లతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల ముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇటు శంషాబాద్ నుంచి తుక్కుగూడ, శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా మీర్ఖాన్పేట వరకు భారీ పోలీసు బందోబస్తును సిద్ధం చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాలు సాక్షి, సిటీబ్యూరో: మీర్ఖాన్పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు. స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. కోడ్ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు శంషాబాద్: గ్లోబల్ సమ్మిట్కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును సిద్ధం చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ ఏర్పాటు చేశారు. ఆర్జీఐఏ ఔట్పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. సిటీ ముస్తాబు మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబైంది. సమ్మిట్కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. హాజరు కానున్న దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమాలోచనలు, సదస్సులు -
శీతాకాల విడిది హైదరాబాద్కు రాష్ట్రపతి.. ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము విడిది చేయనున్నారు. సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెలలో శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్లో బస చేస్తారు. ఈ మేరకు ఈ సంవత్సరం కూడా షెడ్యూల్ను కొనసాగిస్తున్నారు. ఈ ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.డిసెంబర్ 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించే తేనీటి విందులో ఆమె పాల్గొంటారు. చివరగా, డిసెంబర్ 22న ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. -
HYD: రియల్టర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. మల్కాజ్గిరిలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వెంకటరత్నంపై ధూల్పేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
లంగర్హౌస్: లంగర్హౌస్ పరిధిలోని టిప్పుఖాన్ వంతెనపై కారు పల్టీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్లో నివాసముండే జనార్దన్ వృత్తిరీత్యా రియల్ఎస్టేట్ వ్యాపారి. థార్ కారు కొని సంవత్సరం పూర్తి కావడంతో ఆదివారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుని దర్శనానికి వెళ్లాడు. అనంతరం స్నేహితులతో మద్యం తాగి నగరంలో వారిని వదిలి..లంగర్హౌస్ మీదుగా సాయంత్రం వికారాబాద్కు బయలుదేరాడు. టిప్పుఖాన్ బ్రిడ్జి పైకి రాగానే ముందు బ్రిడ్జి దారి చిన్నగా ఉండటంతో గమనించి కారును పక్కకు తిప్పే ప్రయత్నంలో పల్టీ కొట్టింది. దీంతో జనార్దన్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు ఫోన్చేయగా అంబులెన్స్తో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కాగా ఈ సమయంలో బాధితుడికి, 108 సిబ్బందికి చిన్న వాగ్వాదం జరిగింది. తన తల్లికి ఫోన్ చేయాలని బాధితుడు కోరగా..ముందు అంబులెన్స్ ఎక్కాలని సూచించారు. బాధితుడు తమ మాట వినడం లేదని 108 సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మాటమార్చి ఇది హైదరాబాద్ వాహనం కాదని, రంగారెడ్డి జిల్లా వాహనం అంటూ అక్కడి నుండి వాహనం తీసుకొని వెళ్లిపోయారు. చివరకు లంగర్హౌస్ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుడిని గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆటోలో తరలించారు. పల్టీ కొట్టిన కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన 108 సిబ్బంది స్థానికుల ఆగ్రహం -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మేడిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిరిసిల్ల పట్టణం శివానగర్కు చెందిన దాసరి భాస్కర్ కుమార్తె హాసిని (18) ఘట్కేసర్ మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతూ..హాస్టల్లో ఉంటోంది. శనివారం తన స్నేహితుడు అక్షయ్తో కలిసి బైకుపై ఉప్పల్కు వెళ్లారు. తిరిగి రాత్రి రెండు గంటల సమయంలో ఘట్కేసర్ వైపు వస్తుండగా నారపల్లి సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న హాసిని కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్పగాయాలైన అక్షయ్ని సికింద్రాబాద్లోని ఓ ప్రయివేట్ అసుపత్రిలో చేర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ రవాణా విభాగంలో మెరుగైన వసతులు : డీజీపీ
అంబర్పేట: పోలీస్ రవాణా విభాగంలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంబర్పేట సీపీఎల్లో ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన పెట్రోల్ పంపు నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ పోలీస్ సేవల్లో రవాణా వసతులు ఎంతో కీలకమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ విభాగంలో ఉన్న రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.51 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పోలీస్ విభాగం వాహనాలతో పాటు పోలీస్ సిబ్బందికి ఇక్కడ నిర్మించనున్న పెట్రోల్ పంపు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐజీ డాక్టర్ ఎం.రమేష్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులు పియూష్ మిట్టల్, బద్రినాథ్, ముత్తుకుమారన్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజ ఉన్నతికి జర్నలిజం తోడ్పడాలి
● మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి హిమాయత్నగర్: జర్నలిజం అనేది సామాజిక ధృక్పథం కలిగి ఉండి..సమాజం ఉన్నతికి తోడ్పడాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షుడు ములుగు రాజేశ్వర్ రావు రచించిన ‘నేను–బహువచనం(ఆత్మకథ)’, ‘అధినాయక జయహే(కవితా సంకలనం)’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు అధ్యతక్షన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రాజేశ్వర్రావు రచనలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ తరపున 12 మంది ప్రముఖ జర్నలిస్టుల పుస్తకాలు ఆవిష్కరించనున్నట్లు శ్రీనివాస్రెడ్డి చెప్పారు. పత్రికలకు సంబంధించిన సుమారు 5 లక్షల పేజీలను ఆన్లైన్లో చూసేందుకు ఆకాడమీ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.మోహన్ కందా మాట్లాడుతూ సమాజంలో మీడియాదే కీలక పాత్ర అని, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవర్లు, సీనియర్ జర్నలిస్టు జి.వల్లీశ్వర్, ఎమెస్కో సంపాదకులు డి.చంద్రశేఖర్ రెడ్డి, సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలా ఆక్రమణలు తొలగించిన హైడ్రా
మియాపూర్: మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య విద్యాసంస్థ ప్రాంగణంలో ఉన్న నాలా ఆక్రమణలను హైడ్రా అధికారులు ఆదివారం తొలగించారు. నాలాను అక్రమించి నాలాలో పోసిన మట్టిని హైడ్రా సీఐ బాలగోపాల్ పర్యవేక్షణలో మియాపూర్ పోలీస్ బందోబస్తు మధ్య డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో తొలగించారు. నాలా విస్తరణకు అడ్డుగా ఉన్న క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్ను కూడా తొలగించారు. మియాపూర్ పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలాను శ్రీ చైతన్య విద్యాసంస్థ అక్రమించి..మరో వైపు నుండి నాలాను మళ్లించి ప్రాంగణంలో ఉన్న నాలాలో మట్టి నింపారని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు ఆదివారం ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో ఇది తమ స్థలమని, గతంలో నాలాకు దారి ఇచ్చామని, దానిని మరో పక్కకు మార్చి ఈ నాలాను పూడ్చామని చైతన్య కళాశాల యాజమాన్యం హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. ఎస్ఎన్డీపీ ధీరజ్, హైడ్రా సీఐ బాలగోపాల్, కళాశాల యాజమాన్యానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మియాపూర్ పీఎస్లో కేసు నమోదు నాలా ఆక్రమణకు పాల్పడిన శ్రీ చైతన్య విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు శనివారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
యాక్సిస్ బ్యాంక్కు రూ.11.74 కోట్లు టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వ్యాపార విస్తరణ కోసమంటూ యాక్సిస్ బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ తీసుకున్న కీర్తి శ్రీనివాస సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్ఎస్పీఎల్) సంస్థ అందులో భారీ మొత్తాన్ని దారి మళ్లించింది. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సదరు సంస్థతో పాటు డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్ కుమార్లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేఎస్ఎస్పీఎల్ సంస్థకు హైదరాబాద్లోని బేగంపేటలో కార్యాలయం ఉండగా... బెంగళూరులో మూడు రెస్టారెంట్లు ఉండేవి. యాక్సిస్ బ్యాంక్ ఈ సంస్థకు 2017లో రూ.14.15 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేసింది. ఇందులో కొంత మొత్తాన్ని ఆ సంస్థ చెల్లించినా... రూ.11.74 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్యాలయంతో పాటు రెస్టారెంట్లు మూతపడినప్పటికీ రుణానికి సంబంధించిన చెల్లింపులు కొనసాగాయి. ఏప్రిల్ 16 నుంచి కేఎస్ఎస్పీఎల్కు సంబంధించిన ఖాతా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ జాబితాలోకి వెళ్లిపోయింది. దీంతో యాక్సస్ బ్యాంక్ ఈ సంస్థ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది. ఈ నేపథ్యంలోనే కేఎస్ఎస్పీఎల్ సంస్థ ఎస్ఎస్ఎస్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్, శ్రీ రాధే ట్రేడర్స్తో లావాదేవీలు జరిపినట్లు నకిలీ ఆధారాలు చూపినట్లు తేలింది. ఆ లావాదేవీల్లో భాగంగా ఈ రెండు సంస్థలకు చెందిన ఖాతాల్లోకి బదిలీ చేసిన రూ.6.26 కోట్లు, రూ.64 లక్షలు తిరిగి కేఎస్ఎస్పీఎల్ డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్కుమార్లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లినట్లు తేలింది. కేఎస్ఎస్పీఎల్ సంస్థ నకిలీ ఇన్వాయిస్లతో మరో రూ.4.16 కోట్లను బోగస్ సంస్థల పేరుతో మళ్లించినట్లు బయటపడింది. దీంతో కేఎస్ఎస్పీఎల్ సంస్థకు అనేక నోటీసులు జారీ చేసిన యాక్సస్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అందించాల్సిందిగా కోరినా స్పందించలేదు. ఎట్టకేలకు మోసం జరిగినట్లు నిర్థారించిన యాక్సిస్ బ్యాంక్ పోలీసులను ఆశ్రయించడానికి నిర్ణయించింది. బేగంపేటలోని మెగా హోల్సేల్ బ్యాంకింగ్ సెంటర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వరుణ్ కుమార్ కేఎస్ఎస్పీఎల్ సంస్థతో పాటు డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్ కుమార్లపై సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గత వారం కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ గుర్రం అనిల్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఇది గుర్తించిన అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదుతో కేసు నిందితుల జాబితాలో ఇద్దరు డైరెక్టర్లు సైతం -
TG: వార్డుల వారీగా ఓటర్ల లిస్ట్లు చూసుకోండిలా..
గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు (Voter List / Electoral Roll) చూడాలంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసి మీ వార్డ్ ఏమిటో చూసుకోండి. వార్డుల వారీగా మీ ఓటును చెక్ చేసుకోవడానికి ఈ లింక్ను క్లిక్ చేయండి.. -
తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోయి సింగిల్ డిజిట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పులి పంజా విసురుతుంది. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఉత్తర తెలంగాణకు కోల్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,, చలి బారి నుంఇ కాపాడుకునే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రాంతాలు, గోదావరికి అత్యంత సమీపంలో ఉండే గ్రామాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలైన లంబసింగి, పాడేరు, అరకుల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకునే కొన్ని మార్గాలు..శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలువెచ్చని బట్టలు ధరించండి స్వెటర్లు, జాకెట్లు, గ్లౌవ్స్, స్కార్ఫ్లు, సాక్స్లు తప్పనిసరిగా ధరించాలి. పోషకాహారం తీసుకోవాలిప్రోటీన్, విటమిన్ C, విటమిన్ D, ఐరన్, జింక్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.తగినంత నీరు తాగండి.. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా, నీరు తాగకపోతే డీహైడ్రేషన్, చర్మం పొడిబారడం జరుగుతుంది.మాయిశ్చరైజర్ వాడాలి. పొడిబారడం, చర్మం చిట్లిపోవడం నివారించవచ్చు.వ్యాయామం చేయండి.. చలికాలంలో శరీరాన్ని చురుకుగా ఉంచడం చాలా ముఖ్యం. ఇంట్లోనే యోగా, స్ట్రెచింగ్, లైట్ వర్కౌట్స్ చేయవచ్చు.హైజీన్ పాటించండి.. చేతులు తరచుగా కడగాలి. ఫ్లూ, జలుబు, దగ్గు వంటి వ్యాధులు చలికాలంలో ఎక్కువగా వ్యాపిస్తాయి. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న వేళ శంషాబాద్ విమానాశ్రయానికి(Shamshabad Airport) బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని ల్యాండింగ్ చేయగా.. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులను సురక్షితంగా దింపి ఐసోలేషన్కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. On 7th December 2025, late at night, a bomb threat email was received on the Hyderabad airport customer support ID for three flights. 6E 7178 from Kannur to Hyderabad. Landed safely at 10:50 pm on 7th Dec. LH 752 from Frankfurt to Hyderabad. Landed safely at 02:00 am (early…— ANI (@ANI) December 8, 2025 -
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. ఫ్యూచర్ సిటీ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ నేడు ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.మరోవైపు.. మీర్ఖాన్పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో..ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు.స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. కోడ్ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తుశంషాబాద్లో భద్రత..గ్లోబల్ సమ్మిట్కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును సిద్ధం చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ ఏర్పాటు చేశారు. ఆర్జీఐఏ ఔట్పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. సిటీ ముస్తాబు..మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబైంది. సమ్మిట్కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. -
హలో.. మీ మిల్లుపై దాడి జరగనుంది
సాక్షి, హైదరాబాద్: ‘హలో.. ఫలానా రోజు మీ రైస్మిల్లుపై దాడులు జరిగే అవకాశముంది. రీ సైక్లింగ్ బియ్యం, లెక్కల్లోకి రాని వడ్లు మిల్లులో లేకుండా చూసుకోండి. స్టేట్ నుంచి మా బాస్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాగ్రత్త..’అంటూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ అప్పగింతల్లో అక్రమాలకు పాల్పడే మిల్లులకు ఇలాంటి ఫోన్కాల్స్ సర్వసాధారణంగా మారాయి. పౌర సరఫరాల సంస్థను గాడి లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ స్థాయిలో ఐపీఎస్ అధికారులను నియమించి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేయాలని చూస్తుంటే, కంచె చేను మేసినట్టు విజిలెన్స్ విభాగంలోని కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా, ప్రతినెలా రూ.లక్షల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న వారికి వేతనాల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. వివిధ కారణాల వల్ల నాన్ ఫోకల్లో పనిచేసే పోలీస్ శాఖలోని వివిధ హోదాల్లోని వారితోపాటు ఉద్యోగ విరమణ చేసిన పోలీసులను పౌరసరఫరాల సంస్థకు అనుబంధంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో నియమించారు. రిటైర్డ్ ఉద్యోగులు 20 మంది వరకు పదేళ్లుగా ఈ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండగా, సర్వీస్లో ఉన్న మరో 30 మందిని గత సంవత్సరం ఆగస్టులో నియమించారు. వీరిలో ఉన్నతస్థాయిలో ఉన్న కొందరిని మినహాయిస్తే, జిల్లాల బాధ్యతలు తీసుకున్న పలువురు విజిలెన్స్ అధికారులు సంస్థకే భారంగా తయారయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ విభాగ పనితీరుపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. పెరుగుతున్న అప్పులు... విజిలెన్స్లో కొరవడిన చిత్తశుద్ధిధాన్యం కొనుగోలు, సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి బియ్యం అప్పగింత, పీడీఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమాల కోసం పౌర సరఫరాల సంస్థ ఏటా రూ. వేలకోట్లు ఖర్చు చేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూచీగా ఉండి అప్పులు ఇప్పిస్తోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు సంస్థ అప్పులు రూ.70వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. అదే సమయంలో మిల్లర్ల అక్రమాలు పెరిగిపోయాయి. 2022–23 రబీ సీజన్కు సంబంధించి మిల్లర్లు అమ్ముకున్న రూ.7వేల కోట్ల విలువైన ధాన్యంలో నానాకష్టాలు పడి రూ. 4వేల కోట్ల వరకు రికవరీ చేశారు. ఇంకా రూ. 3వేల కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగడం లేదు. ప్రభుత్వం రూ.వేలకోట్లు అదనంగా వెచ్చించి సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, దళారుల ద్వారా రైస్మిల్లర్లు సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు. సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్ మొదలైన జిల్లాల్లో విజిలెన్స్ దాడులు జరిగినప్పుడు గానీ, జరగకముందు గానీ మిల్లర్లతో మిలాఖత్ అయిన ఘటనలే ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేయడంతో చాలాచోట్ల ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, రేషన్ డీలర్లు, మిల్లర్లు, సంఘ నాయకులతో సత్సంబంధాలున్నాయి. కొన్నిచోట్ల అధికారులు కొత్త మిల్లుల ప్రారంబోత్సవాలకు హాజరవుతున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో అక్రమాలు వెలికితీసే అధికారులు పారదర్శకంగా ఎలా పని చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత రెండేళ్లలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు పరిశీలిస్తే 120 కేసులు నమోదు చేయగా, మిల్లుల్లో రూ.3వేల కోట్ల రికవరీ జరగలేదు. -
9న ఘనంగా ‘విజయ్ దివస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టమైన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది డిసెంబర్ 9వ తేదీనే అని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న ’దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా.. ’విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9న 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందని కేటీఆర్ అన్నారు. అలాంటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే విజయ్ దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ ఆసుపత్రిలో, అలాగే గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. పార్టీ నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. -
415 సర్పంచ్లు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 38,322 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక మిగిలిన 29,903 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మొత్తంగా 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏకగ్రీవాల్లో కామారెడ్డి టాప్ రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 197 పంచాయతీలుండగా, అత్యధికంగా 44 ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 196 పంచాయతీలకు 38, నల్లగొండ జిల్లాలో 282 పంచాయతీలకు 38 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లోనూ కామారెడ్డి జిల్లానే టాప్లో నిలిచింది. ఈ జిల్లాలో 1,654 వార్డులుండగా, 776 ఏకగ్రీవమయ్యాయి.నిజామాబాద్ జిల్లాలో 1,760 వార్డులకు 674, నల్లగొండ జిల్లాలో 2,418 వార్డులకు 553 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా కేవలం ఒక సర్పంచ్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో కేవలం 2 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. \రెండో విడతలో 10 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన చోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. సర్పంచ్ స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు, వార్డుకు సగటున ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. రెండో విడత పోలింగ్ 14వ తేదీన జరగనుండగా, అదే రోజు విజేతలను ప్రకటిస్తారు. మూడోవిడత నామినేషన్ల లెక్క తేలగా.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 9న ఉపసంహరణ ఉంటుంది. సండే స్పెషల్.. చికెన్ టోకెన్స్ లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలోని ఓ వార్డు అభ్యర్థి తమ ఓటర్లకు ఆదివారం స్పెషల్గా చికెన్ టోకెన్స్ అందజేశాడు. రెండు చికెన్ సెంటర్లను ఎంచుకొని శనివారం రాత్రే వారికి టోకెన్లు అందజేశాడు. దీంతో ఆ వార్డు ఓటర్లు ఉదయం చికెన్ సెంటర్లకు వెళ్లి అభ్యర్థి రాసి ఇచి్చన టోకెన్ చూపించి చికెన్ తెచ్చుకున్నారు.ఇదీ ఎన్నికల సండే స్పెషల్ చికెన్ అంటూ ఆరగించారు. జనాభా కన్నా ఓటర్లే ఎక్కువట గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన జనాభా, ఓటర్ల వివరాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. సూర్యతండా గ్రామ జనాభా 498 మంది, ఓటర్లు 499 మందిగా ఉంది. అంటే అధికారుల లెక్కల ప్రకారం జనాభా కన్నా ఓటర్లే ఎక్కువ అన్నమాట. అలాగే కొనాయమాకుల గ్రామపంచాయతీ జనాభా 850, ఓటర్లు 916 మంది, గంగదేవిపల్లి జనాభా 1,080, ఓటర్లు 1,118 మంది ఉన్నట్టు అధికారులు రూపొందించిన క్లస్టర్ల వారీ జనాభా, ఓటర్ల జాబితాలో నమోదై ఉంది. గెలిపిస్తే.. ఐదేళ్లు కేబుల్ కనెక్షన్ ఉచితం నర్సాపూర్ రూరల్: సర్పంచ్గా గెలిపిస్తే ఐదేళ్లు కేబుల్ టీవీ కనెక్షన్ ఉచితంగా ఇస్తానని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నయ్యపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ నీలి బిక్షపతి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం ప్రారంభించాడు. మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీతో పాటు టైలరింగ్ శిక్షణ ఇప్పిస్తానని, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పాడు. ఏకగ్రీవ సర్పంచ్గా ఎమ్మెల్యే కౌసర్ భార్య వెల్దుర్తి: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ సతీమణి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ నజ్మాసుల్తానా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ స్థానానికి నజ్మాసుల్తానాతోపాటు కాసాల ఇందిర నామినేషన్ వేశారు. అయితే కాసాల ఇందిర తన నామినేషన్ను విత్ డ్రా చేసుకోవడంతో నజ్మా సుల్తానా సర్పంచ్గా ఏకగ్రీవం కానున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు అప్సర్ 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బస్వాపూర్ నుంచి సర్పంచ్గా పోటీ చేసి 63 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అదే గ్రామంలోనే ఇప్పుడు తల్లి ఏకగ్రీవ సర్పంచ్ అయ్యారు. -
గూగుల్ స్ట్రీట్.. టాటా రోడ్డు.. ట్రంప్ అవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్కు మరింతగా ప్రపంచ పటంలో చోటు కల్పించేందుకు ఆయన సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమైన ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీని అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు దివంగత రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రావిర్యాల ఇంటర్చేంజ్కు ‘టాటా ఇంటర్చేంజ్’అని పేరు పెట్టారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ముందు నుంచి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. మరికొన్ని ప్రధాన రోడ్లకు కూడా.. ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్íÙప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్పీఎఫ్) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, హైదరాబాద్లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని ‘గూగుల్ స్ట్రీట్’గా ప్రకటించాలని నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతోపాటు హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించిన వారికి కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు. -
రాష్ట్రంలో సీఎం బ్రదర్స్ పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో సీఎం అండ్ సన్స్ మోడల్ ఉండేదని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అది సీఎం అండ్ బ్రదర్స్ మోడల్గా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ప్రజావంచన దినం పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని దుయ్యబట్టారు.విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, యువత, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిందన్నారు. వంచించే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్కు పోటీగా నిలబడే సర్పంచ్ అభ్యర్థులను హౌస్ అరెస్టులు, జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని రాంచందర్రావు ఆరోపించారు. అర్బన్ నక్సలైట్లను అంతమొందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లను పెంచి పోషిస్తోందని దుయ్యబట్టిన రాంచందర్రావు.. తాము అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలిజాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయట్లేదంటూ బీఆర్ఎస్ గతంలో నిందించినందుకు ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపారని.. ప్రస్తుతం కాంగ్రెస్ సైతం అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ‘హిల్ట్’పాలసీని తెచ్చిందని.. ఇది అవినీతికి తెరతీయడం వంటిదేనని రాంచందర్రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ అక్కడ ఏం చేయబోతున్నారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడుందని ఆయన నిలదీశారు. భూములను వేలం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాకు అప్పగించిందని రాంచందర్రావు ఆరోపించారు. సామాన్యులకు ఒరిగిందేమీ లేనప్పుడు తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.రెండేళ్లుగా నయవంచన పాలన: కేంద్ర మంత్రి కిషన్రెడ్డిరెండేళ్లుగా కాంగ్రెస్ నయవంచన పాలన కొనసాగిస్తోందని.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం తప్ప ఏ వర్గంలోనూ పెద్దగా మార్పు రాలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేస్తే ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప ఇతర హామీలేవీ అమలు చేయడం లేదని మండిపడ్డారు.ప్రభుత్వం భూములు అమ్మితే తప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. హామీల అమల్లో ప్రభుత్వ తీరుపై ఈ సందర్భంగా చార్జిïÙట్ విడుదల చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెట్టే లక్ష్యంతో జిల్లాలు తిరుగుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేమిటని ప్రశ్నించారు.రాష్ట్రంలో లంకెబిందెల కోసం సీఎం రేవంత్రెడ్డి వెతుకుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ. 6.30 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారని.. పరిశ్రమలను మూసేసి ఆ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ వెనుక చెడ్డీ గ్యాంగ్ ఉందని.. రేవంత్రెడ్డి రాబందు రెడ్డిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


