Hyderabad
-
మౌనమే సమాధానం!
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: డ్రగ్స్ పార్టీ కేసులో కస్టడీకి తీసుకున్న నిందితుల విచారణ రెండో రోజూ కొనసాగింది. ప్రధాన నిందితులైన పైలెట్ రోహిత్రెడ్డి, రితీష్రెడ్డి, నమిత్శర్మను బుధవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు యోగేష్ గౌతం, శిరీష వేర్వేరుగా విచారణ చేశారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది? ఎవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు? గతంలో ఎన్నిసార్లు డ్రగ్స్ పార్టీలు జరిగాయి? అనే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. సాయంత్రం ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు శంషాబాద్ పీఎస్కు వచ్చారు. ఆయన నిందితులను విచారించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. రెండో రోజు కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సరైన సమాధానాలు చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసింది. మరో వైపు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొంత మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా, కేసులో ప్రధాన నిందితులైన రోహిత్రెడ్డి, రితీష్రెడ్డి, నమిత్శర్మల కస్టడీ గురువారం ముగి యనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిలో 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఏలూరు ఎంపీ మహేశ్కుమార్ యాదవ్ మినహా మిగతా వారిని 6 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. వారు చెప్పిన అంశాలు, ప్రధాన నిందితులు చెప్పిన విష యాలను పోల్చి చూస్తూ, ఈ కేసులో మరికొంత మంది ప్రమే యం ఉందని సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
సత్తాచాటిన ఐఐటీహెచ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం: వరల్డ్ క్యూ ఎస్ ర్యాంకింగ్స్లో ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ హెచ్) మరోసారి సత్తా చాటింది. 2026 సంవత్సరా నికి సంబంధించి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూని వర్సిటీల ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే 395వ ర్యాంకు సాధించింది. 2025లో ఈ సంస్థ 501–550 ర్యాంకింగ్లో ఉండగా, ఒక్క ఏడాదిలోనే వంద ర్యాంకులు ఎగబాకడం విశేషం. ఆరు ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రపంచంలోనే టాప్–300లో నిలిచింది. మొత్తం 9 సబ్జెక్టులు గ్లోబల్ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించా యి. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్ట మ్స్, ఫిజిక్స్, ఆస్ట్రా నమీ వంటి విభాగాలు మరింత మెరుగుపడ్డాయి. బ్రిటన్కు చెందిన క్వాక్వేరెల్లి సైమ ండ్స్ అనే సంస్థ ఈ క్యూఎస్ ర్యాంకింగ్లు ఇస్తుంది. ఆయా వర్సి టీల అకడమిక్స్, పరిశోధనలు, ఆవిష్క రణలు, అంతర్జా తీయ సంబంధాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది. అధ్యాపకులు, విద్యా ర్థులు కలి సి అకడమిక్స్, పరిశోధనలు, ఆవిష్కర ణలో చేసిన కృషి ఫలితంగానే ఈ ర్యాంకింగ్లు సాధ్యమయ్యా యని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి అన్నారు. గ్లోబల్ అకడమిక్ ఎక్స్లెన్స్పై తాము పెట్టిన సమష్టి కృషికి ఇది ప్రోత్సాహక గుర్తింపుగా నిలుస్తుందని నోడల్ ఆఫీసర్ డాక్టర్ సౌరభ్ శాండిల్య పేర్కొన్నారు.హెచ్సీయూకు గుర్తింపుహెచ్సీయూకు అంతర్జాతీయంగా ఏడు సబ్జెక్టుల్లో మంచి గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా 1,700కు పైగా విశ్వవిద్యాలయాల్లో 55 అకడమిక్ విభాగాల్లో విaద్యార్థులు తీసుకున్న 18,300కు పైగా వ్యక్తిగత విశ్వవిద్యాలయ ప్రోగ్రామ్ల పనితీరుపై క్యూఎస్ వరల్డ్ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో హెచ్ సీయూ.. లింగ్విస్టిక్స్ (151–200), ఇంగ్లిష్ భాష– లిటరేచర్ (251–300), సోషియాలజీ (251–300), పొలిటికల్ సైన్స్ (301–400), కెమిస్ట్రీ (401–450), ఎకనామిక్స్–ఎకానోమెట్రిక్స్ (501– 550), బయో లాజికల్ సైన్సెస్ (651–700) సబ్జె క్టుల్లో మంచి ర్యాంకులు వచ్చాయి. సబ్జెక్టుల వారీగా హెచ్సీయూ నిలకడగా స్థానం సంపాదించడం హర్షణీయమని ఇన్చార్జి వీసీ ప్రొ.జె.అనురాధ చెప్పారు. -
ప్రేమకు అడ్డొస్తోందని..
జవహర్నగర్: నవమాసాలు మోసి... గోరుముద్దలు తినిపించి... ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచి పెంచిన అమ్మను ఓ కూతురు ప్రియుడి మోజులో పడి కడతేర్చిన ఘాతుకం సమాజాన్ని నివ్వెరపరిచింది. తన ప్రేమకు అడ్డుపడుతోందని కన్న తల్లిని కత్తితో పొడిచి చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పాతిపెట్టిన అమా నుష ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్, జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి, సీఐ సైదులు కేసు వివరాలను వెల్లడించారు. కౌకూర్ భరత్నగర్కు చెందిన అంజు(40) వృత్తిరీత్యా పనిమనిషి. ఈమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.పెద్ద కుమార్తె రోషిణి వివాహమై వేరుగా నివాసముంటోంది. చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్న క్రమంలోనే బిహార్కు చెందిన డ్రైవర్ మోంటీ కుమార్సింగ్ (22) తో పరిచ యం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ అమ్మాయిని వేధిస్తున్నాడని 2024 అక్టోబర్ నెలలో జవహర్నగర్ పోలీస్స్టేషన్, 2025లో బొల్లారం పోలీస్స్టేషన్లో మోంటీ కుమార్ సింగ్పై రెండు సార్లు పోక్సో కేసులు నమోదవడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని..తల్లి తమ ప్రేమకు అడ్డువస్తోందని, ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కూతురు, మోంటీ కుమార్ సింగ్ పథకం వేశారు. గతేడాది మే 12న అంజు ఇంట్లో ఉన్న సమయంలో కూతురు తల్లిని గట్టిగా పట్టుకోగా అక్కడే ఇంట్లో నక్కి ఉన్న మోంటీ కత్తితో అంజు ఛాతీపై పొడిచి విచక్షణా రహితంగా చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మంచం కింద దాచి, రక్తం మరకలు తుడిచారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, పైన సిమెంట్ ఇసుకతో పక్కాగా పూడ్చిపెట్టారు. ఎలుకల వల్ల నేల పాడైందని నమ్మించి రిపేరు చేయించారు.ఈ క్రమంలో తన తల్లి కనిపించడంలేదని పెద్ద కూతురు రోషిణి 2025 అక్టోబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కేసును మలుపుతిప్పిన స్కూటీహత్యకు గురైన అంజు పేరున ఓ ద్విచక్రవాహనం ఉంది. అంజు ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో తన స్కూటీని తీసుకుని వెళ్లి అదృశ్యమైందని అంజు పెద్దకూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గత కొద్దిరోజులుగా ఆమె పేరున ఉన్న స్కూటీ ఇతరుల పేరున మారడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసిన వారిని పిలిపించడంతో అసలు విషయం బయటపడింది. ఆ స్కూటీని అంజు చిన్న కుమార్తె, కుమార్సింగ్లు కలిసి తమకు అమ్మారని చెప్పడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చారు. జవహర్నగర్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాన్ని ఒప్పుకున్నా రు. కాగా, హత్య తర్వాత నిందితులిద్దరూ కలిసి జీవిస్తూ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం వారికి రెండు నెలల కుమారుడున్నారని పోలీసులు తెలిపారు. కౌకూర్ భరత్నగర్లోని వారి నివాసంలో పాతిపెట్టిన మృతదేహాన్ని అల్వాల్ డిప్యూటీ తహసీల్దార్, ఉస్మానియా వైద్యుల సమక్షంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జవహర్నగర్ సీఐ సైదులు, ఎస్ఐలు రామ్నాయక్, వేణుమాధవ్, మమత, పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్ అభినందించారు. -
‘అనర్హత’పై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ను, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. సదరు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్కు తాజా పిటిషన్లు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి.ప్రకాశ్గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్కుమార్లు కాంగ్రెస్లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్.. వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. దీనిపై రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాశ్గౌడ్, వెంకట్రావు, గాం«దీ, దానం నాగేందర్, కృష్ణమోహన్రెడ్డి, కాలే యాదయ్య, శ్రీనివాస్రెడ్డికి సంబంధించి దాఖలైన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. స్పీకర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. ‘2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి విజయం సాధించిన సదరు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్లో చేరడం, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో కూడా ప్రసారమైంది. దానం నాగేందర్ ఏకంగా 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీటన్నిటిపై బీఆర్ఎస్ అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. అవేవీ పరిశీలించకుండానే పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం. పిటిషన్లపై సత్వరమే విచారణ చేపట్టాలి..’అని కోరారు. దీంతో సీజే ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
అసెంబ్లీలో ‘ఇప్పపువ్వు సారా’ దుమారం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఇప్పపువ్వు సారా అంశం చర్చ తీవ్ర దుమారం రేపింది. ఇప్పపువ్వు సారా ఉత్పత్తి చేస్తే.. ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని, మంచి పేరు పెట్టాలంటూ బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. దీనిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమేకాక.. బీజేపీ సభ్యుడు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీని అవమానించేలా మాట్లాడిన రాకేష్ రెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ బాలూనాయక్ను శ్రీధర్బాబు కోరారు. అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో రాకేశ్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పపువ్వుకు చేయూత ఇవ్వండి ప్రత్యేక అంశంలో భాగంగా జడ్చర్ల శాసన సభ్యుడు అనిరు«ద్రెడ్డి ఇప్పపువ్వు సారా తయారీ, మార్కెటింగ్, టర్నోవర్పై ఉదాహరణలతో సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో ఉన్న ఇప్పపువ్వు చెట్ల ద్వారా 200 మెట్రిక్ టన్నుల ఇప్పపువ్వు ఉత్పత్తి అవుతోందన్నారు. దీంతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయొచ్చని, విదేశాల్లో ఇప్పటికే రూ.లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని చెప్పారు. దీనికి ప్రభుత్వం చేయూత ఇస్తే ఎన్నో గిరిజన కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందనగా.. పలువురు సభ్యులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ కల్లు, ఆల్ఫ్రాజోలమ్ కలిపిన మత్తు పానీయాలు తాగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయనా లు లేని సాధారణ పద్ధతిలో తయారు చేసే ఇప్పపువ్వు సా రాను ప్రభుత్వం అనుమతించాలని సూచిస్తూ... ఈ ఉత్పత్తికి ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దనడంతో సభలో దుమారం రేగింది. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్కలుగజేసుకుంటూ ఇందిరాగాంధీ పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఆమెను అవమానిస్తున్నా రని మండిపడ్డారు. సారా గురించి మాట్లాడుతూ ఇందిరాగాంధీ పేరు ఎలా ప్రస్తావిస్తారని, తక్షణమే ఆయన సభకు క్షమాపణ చెప్పాలన్నారు. వాజ్పేయిలాంటి వ్యక్తి ఇందిరాగాం«దీని ఉక్కుమహిళగా ప్రస్తావించారని, అలాంటి మహి ళ పట్ల హేళనగా మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. ఆయన తీరు సరికాదు.. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మహిళల పట్ల ఆయనకు గౌరవం లేనట్టుందని, బాధ్యతగల పదవిలో ఉండి, సభలో ఇలా వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జోక్యం చేసుకుంటూ రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఇంతలో బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి కలగజేసుకుంటూ రాకేశ్రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేలా బీజేఎల్పీ నేత వ్యవహరిస్తోన్న తీరు సరికాదని శ్రీధర్బాబు అన్నారు. ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని రాకేష్ రెడ్డికి సూచించారు. ఒక అంశాన్ని పట్టుకుని అదేపనిగా సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని, అభ్యంతరకరమైన అంశాలను స్పీకర్ తొలగించి సభను కొనసాగించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు సూచించారు. ఇందిరమ్మ పేరునే కాదు.. ఎవరినీ కించపరిచేలా మాట్లాడవద్దన్నారు. దీనిపై రాకేష్ రెడ్డి వివరణ ఇస్తూ తాను తప్పుగా మాట్లాడలేదని, సభ్యులు నొచ్చుకుని ఉంటే వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నానని, ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలనడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
కొత్త పీజీ వైద్య కళాశాలలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐదు జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీజీ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహేశ్వరంలో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను ఎల్బీనగర్కు తరలిస్తామని..మహేశ్వరంలో మరో పెద్ద ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హైవేలపై ప్రతి 35 కిలోమీటర్లకొక ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.400 కోట్లు కేటాయించామని, రెండు నెలల్లో వీటి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.మొత్తం 109 ట్రామా కేంద్రాల్లో 74 కేంద్రాలు డీఎస్హెచ్ పరిధిలో ఏర్పాటు కానున్నాయి. ప్రతి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్హెచ్) ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సమాధానాలిచ్చారు. వైద్యులతోపాటు, ఇతర సిబ్బంది నియామకాలు, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నందున టీవీవీపీను ప్రత్యేక డైరెక్టరేట్గా వైద్యశాఖలో విలీనం చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాల చెల్లింపు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద క్యాష్లెస్ వైద్యం, రూ.1.2 కోట్ల ప్రమాద బీమా, పూర్తి ప్రభుత్వ ఉద్యోగ హోదా లభిస్తుందని మంత్రి వివరించారు. జిల్లాలకే ఆధునిక వైద్య సదుపాయాలను తీసుకురావడంలో భాగంగా ప్రస్తుతం 6 ఆస్పత్రుల్లో ఉన్న సీటీ స్కాన్ సేవలను విస్తరించనున్నామన్నారు.అదనంగా 200 పడకలకు పైగా ఉన్న 11 ఆసుపత్రుల్లో కొత్తగా సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని, దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమీపంలోనే ఆధునిక నిర్ధారణ సేవ లు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశాఖలో డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు 9,572 పోస్టులు భర్తీ కాగా, మరో 7,267 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. 2027లో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని మంత్రి వెల్లడించారు. ఆశావర్కర్లు ధర్నాలు చేస్తున్నారు: హరీశ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడు తూ ఈ బిల్లును తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆశావర్కర్లు జీతాలు రాక ధర్నాలు చేస్తున్నారని, వారిని కూడా ఈ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా చెప్పాలని, వారికి నెలకు రూ.18 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చే యడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో ఏర్పా టు చేసిన మెడికల్ కాలేజీని ఎల్బీనగర్కు మార్చవద్దని కోరారు. ఆ పార్టీ సభ్యుడు కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజీవరెడ్డి, మజ్లిస్ సభ్యుడు జాఫర్ మాట్లాడారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి: బీజేపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు సూచించారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లును తెచి్చనందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రుల్లో పేదలకు అందే వైద్యంపై సరైన పర్యవేక్షణ లేదన్నారు. కాంగ్రెస్ సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై మన్ననూరు, అచ్చంపేటలో ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. -
పేదోడి ఇంటి కల నిజం చేసింది వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా భావించే సొంతింటి కలను పెద్ద ఎత్తున నిజం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన హయాంలోనే అత్యధికంగా 21 లక్షల ఇళ్లు పేదలకు కట్టించారని తెలిపారు. తిరిగి తమ ప్రభుత్వమే ఈ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తోందని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ తదితరులు లేవనెత్తిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంశం సుదీర్ఘ చర్చకు దారితీసింది. అధికార, విపక్ష సభ్యులు ఈ అంశంపై పలు ప్రశ్నలు వేశారు. వీటన్నింటికీ మంత్రి పొంగులేటి బదులిచ్చారు. పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. 99 రోజుల ప్రణాళికలో దీనికే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏప్రిల్ మొదటి వారానికి 1.12 లక్షల ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం, పంపిణీ పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2,31,206 ఇళ్లు మంజూరు చేశారని, వీటిల్లో 1,62,936 ఇళ్లు కొన్ని మౌలిక వసతులు మినహా పూర్తయినట్టు తెలిపారు. నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణలపై థర్డ్ పార్టీ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా వచ్చే సందేహాలను వెంటనే నివృత్తి చేస్తామన్నారు. లబ్ధిదారులు నివాసం ఉండడం లేదు ఇళ్లు కేటాయించినా, చాలాచోట్ల లబ్ధిదారులు నివాసం ఉండడం లేదని మంత్రి తెలిపారు. అధికారులతో దీనిపై ఇటీవల సమీక్షించినట్లు చెప్పారు. దీనిపై 6,500 మందికి నోటీసులిస్తే, 4,500 మంది మాత్రమే స్పందించారని వెల్లడించారు. మరో రెండు నెలల్లో లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లకపోతే, ఆ ఇళ్లను అర్హులైన ఇతరులకు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేటాయించిన 12 వేల ఇళ్లలోకి లబ్ధిదారులు వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయిస్తామని, పాత కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే ఇతరులకు అప్పగిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ కమిటీలు వేసినా, ఆ గ్రామ సర్పంచ్, పట్టణాల్లో వార్డు కౌన్సిలర్లకు అధికారాలుంటాయని చెప్పారు. వారి సిఫారసులను కలెక్టర్ పరిశీలిస్తారని, అంతిమంగా ఇన్చార్జి మంత్రి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంతంలో షాపులను అమ్మడం కాకుండా, లీజుకు ఇవ్వాలన్న సభ్యుల ప్రతిపాదనను మంత్రి తోసిపుచ్చారు. లీజుకు తీసుకున్న వ్యక్తి అద్దె కట్టడని, ఖాళీ చేయడని, కొత్త సమస్యలు వస్తాయన్నారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా అమ్మేసి, ఆ డబ్బును ఆ కాలనీ అసోసియేషన్, మున్సిపాలిటీ, లేదా గ్రామ పంచాయితీ జాయింట్ అకౌంట్లో ఉంచుతామన్నారు. వడ్డీతో అపార్ట్మెంట్ నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు. వైఎస్ హయాంలో సంతృప్తి : స్పీకర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్లపై ప్రజల నుంచి పూర్తి సంతృప్తి వచ్చిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇళ్ళ కేటాయింపు, నిర్మాణాలపై శాసనసభ్యులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మంత్రి పొంగులేటి బదులిస్తున్న సమయంలోనూ ‘రివ్యూ కమిటీ పెడుతున్నారా? లేదా?’అంటూ ఆయన ప్రశ్నించారు. త్వరలోనే సమీక్ష చేపడతామని మంత్రి బదులిచ్చారు. -
ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్రెడ్డి చేరికపై వేచిచూడండి మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్ను మరోమారు కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. -
బంకులు.. బారులు
సాక్షి, హైదరాబాద్: ఇంధనం సెగ రాష్ట్రంలోని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆయిల్ కొరత వార్తలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడా చమురు కొరత లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయం పదేపదే చెబుతోంది. ఆయిల్ కంపెనీలు సైతం సరిపడా డీజిల్, పెట్రోల్ నిల్వలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడురోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరి కన్పిస్తున్నారు. గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కిక్కిరిసి ఉంటున్నాయి. కొన్ని బంకులు నిరాటంకంగా పని చేస్తుంటే.. కొన్నిచోట్ల మాత్రం బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కన్పిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు, సహజ వాయువుల కొరత వార్తల నేపథ్యంలో ఈ నో స్టాక్ బోర్డులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాహనదారులు అవసరం ఉన్నా, లేకపోయినా డీజిల్, పెట్రోల్ ట్యాంక్ నిండా నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏరోజు కారోజు ఇంధనం నింపుకునే క్యాబ్ డ్రైవర్లు, ఇతర గిగ్ వర్కర్లు, సామాన్య ప్రజలు కూడా ఎంతో కొంత అదనంగా ట్యాంకు నింపుకోవాలని చూస్తుండటంతో తెరిచి ఉన్న బంకుల వద్ద క్యూలు పెరిగిపోతున్నాయి. కొందరు సీసాలు, పెద్దపెద్ద క్యాన్లు, డ్రమ్ముల్లో సైతం ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని బంకులు మూతపడి కన్పిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. బంకులు మూత పడి ఉండటానికి ‘నో క్రెడిట్’ సమస్య ప్రధాన కారణమని తెలుస్తుండగా..ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీల ప్రకటనలను పట్టించుకోకుండా ప్రజలు ఎక్కడ పెట్రోల్, డీజిల్ దొరుకుతోందో తెలుసుకొని మరీ కొనుగోళ్లు చేస్తుండటంతో తెరిచి ఉన్న బంకులు కిక్కిరిసిపోయి కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం నుంచే.. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడో మొదలైనా..సోమవారం సాయంత్రం నుంచే బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు క్యూలు కట్టడం ప్రారంభించారు. ఆ ఫొటోలు టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో చమురు కొరతపై భయాందోళనలు మొదలయ్యాయి. బంకులన్నీ వాహనదారులతో నిండిపోవడం మొదలయ్యింది. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. భారీగా పెరిగిన డిమాండ్ ఇంధన కంపెనీల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 3,600 పెట్రోల్ బంకులకు సాధారణంగా రోజుకు సగటున 13,752 కిలోలీటర్ల ఇంధనం అవసరం ఉంటుంది. తదనుగుణంగా ఆయిల్ కంపెనీలు సగటున 14,729 కిలోలీటర్లు సరఫరా చేసేవి. కానీ ప్రస్తుతం డిమాండ్ ఒక్కసారిగా 17,246 కిలోలీటర్లకు చేరింది. దీనికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు కూడా సరఫరాను 17,898 కిలోలీటర్లకు పెంచినట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటికీ కొన్ని బంకులు నోస్టాక్ బోర్డులతో మూతపడి కన్పిస్తున్నాయి. మరికొన్ని బంకులు వాహనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో రెట్టింపు స్థాయిలో పెట్రోల్ విక్రయాలు పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం విక్రయాలు జరగ్గా, 23న ఇది రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుంది. వచ్చిన స్టాక్ వచ్చినట్టు ఖాళీ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంధనానికి అగచాట్లు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు, రవాణా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ఉదయం వచ్చిన స్టాక్ అదే రోజు ఖాళీ అవుతోంది. దీంతో పలు పెట్రోల్ బంకులు మధ్యాహా్ననికే ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లు హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ బుధవారం ఉదయం నుంచే వాహనదారులతో నిండిపోగా, ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గచ్చిబౌలిలోని ప్యారడైజ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ను పోలీసులే మూసివేయించినట్లు ఖాన్ అనే వైద్యుడు ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసిన తర్వాత స్టాక్ అయిపోయిందని చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యలో ఉన్న ఆన్లైన్లో ఆహారం, నిత్యావసరాలు, ఇతర వస్తువులు చేరవేసే కార్మీకులు, ఉబర్, రాపిడోల వంటి ద్వారా సేవలందించే క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో సైతం వాహనదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. క్యాన్లలో పెట్రోల్తో ప్రమాదం డీజిల్, పెట్రోల్ కొరత లేదంటున్న ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు..ఈ విషయంతో పాటు వాస్తవ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారు ఇబ్బందులు పడకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాన్లలో పెట్రోల్ పోయవద్దని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, క్యాన్లలో నిల్వ ఉంచుకోవడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని పేర్కొంటున్నారు. నో క్రెడిట్..అడ్వాన్స్ పేమెంట్తో అసలు సమస్య! రాష్ట్రంలో ఇంధనం కొరత లేదని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక డీలర్లు కూడా సంక్షోభానికి కారణం కొరత కాదని, ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలేనని పేర్కొంటుండటం గమనార్హం. వారి కథనం ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో.. గతంలో ఉన్న ‘క్రెడిట్’ సౌకర్యాన్ని రద్దు చేసి, ‘అడ్వా¯న్స్ పేమెంట్’ పద్ధతిని అమలు చేస్తుండటంతో బంకుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లక్షల్లో పేరుకు పోయిన పాత బకాయిలు కూడా సమస్య తీవ్రతకు కారణమవుతున్నట్లు తెలిసింది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామన్న కంపెనీల నిబంధనతో పలు బంకులు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంకులు మూత పడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసి తెరిచి ఉన్న బంకులకు వాహనదారులు రెండు, మూడు రెట్ల ఎక్కువ సంఖ్యలో పోటెత్తుతుండటంతో..క్రెడిట్, ఇతర సమస్యల్లేని ఆ బంకుల్లో స్టాక్ గంటల్లోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ‘రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 20 వేల కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది. సరఫరా వ్యవస్థలో కూడా ఎలాంటి అంతరాయం లేదు. మంగళవారం ఒక్కరోజే 1,500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపించాం. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు..’ అని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, అవసరం లేకుండా ఆయిల్ కొనుగోలు చేయవద్దని (ప్యానిక్ కొనుగోళ్లు) మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఇంధన నిల్వలపై సమీక్ష జరిపారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దు: హైదరాబాద్ సీపీ ‘హైదరాబాద్లో ఇంధనం కొరత లేదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. నగర వ్యాప్తంగా చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు. కేవలం వదంతుల వల్లే రద్దీ ఏర్పడుతోంది..’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హెచ్చరించారు. నగరంలో తాజా పరిస్థితిపై బుధవారం టీజీసీసీసీలో వారు సమీక్ష జరిపారు. అవసరానికి మించి కొనుగోళ్లతో స్టాక్ ఖాళీ: డీలర్ల సంఘం ‘ఇంధన కొరత అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుండటంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. మళ్లీ ఆయిల్ దొరుకుతుందో లేదో అని అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్టాక్ త్వరగా అయిపోతోంది. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ప్యానిక్ కొనుగోళ్లు నిలిపివేయాలి. కంటైనర్లు, సీసాల్లో కూడా తీసుకోకూడదు..’ అని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్రెడ్డి సూచించారు. ‘పాత బకాయిలు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు ఇంధనం సరఫరా చేస్తున్నాయి. క్రెడిట్ (ఉద్దెర)లో పెట్రోల్, డీజిల్ ఇవ్వడం లేదు. ఇది కొన్ని బంకులు మూతపడటానికి, తెరిచి ఉన్నచోట క్యూలు పెరగడానికి కారణమవుతోంది..’ అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. -
నియోజకవర్గాల పునర్విభజన.. అనివార్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని రాజకీయ పరిశీలకుడు జోతిర్మయరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తర –దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా వైరుద్యం నెలకొన్న నేపథ్యంలో దామాషా పద్దతిన పెంచటమే మేలని ఆయన చెప్పారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో 182 శాసనసభ స్థానాలు, 26లోక్సభ స్థానాల ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు సైతం 60 స్థానాలు రిజర్వు అవుతాయని, అయితే వాటిని లాటరీ పద్దతిన ఎంపకి చేసే అవకాశం ఉంటుందని జ్యోతిర్మయరెడ్డి వెల్లడించారు. -
హీరో రాజ్తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్చల్
సాక్షి, సంగారెడ్డి: మద్యం మత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పాజిటివ్ రావడంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో లావణ్య ఢీ కొట్టింది. ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కారును మల్లెపల్లి పోలీసులు అడ్డుకున్నారు.సారీ చెప్పాలని గ్రామస్థులు చెప్పడంతో వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్నారు. పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. -
Hyderabad: కుళ్లిన గుడ్లతో కప్ కేక్స్
సాక్షి, హైదరాబాద్: కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలను తయారీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైలార్దేవ్పల్లి పోలీసులు కాటెదాన్లోని ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. ఇంద్ర సొసైటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ పిల్లలు తినే డోనట్ బన్స్, కేకులు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.నిందితులు అఫ్రిది అన్సారీ, యాసిన్, ఖత్రేషన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. బయట మార్కెట్ నుండి కుళ్లిపోయిన, పగిలిపోయిన కోడిగుడ్లను సేకరించి, వాటికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో డోనట్స్, కేకులు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తినడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.కుళ్లిపోయిన కోడిగుడ్లు(330) రసాయనాలు సోడియం బెంజోయేట్ (15 కిలోలు), సోర్బిక్ యాసిడ్ (15 కిలోలు), పొటాషియం సోర్బేట్ (20 కిలోలు), పీజీపీఆర్ లిక్విడ్, అమ్మోనియా సల్ఫైట్, తయారైన డోనట్స్, కేకులు (150 కిలోలు), డాల్డా (120 కిలోలు), మిల్క్ పౌడర్ (25 కిలోలు), మిక్సింగ్ మెషీన్లు, స్పైరల్ మెషీన్, ఓవెన్లు, వెయింగ్ మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్: అన్నిట్లోనూ కల్తీనే.. చివరకు..
సాక్షి, హైదరాబాద్: కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని పాడుచేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కల్తీకి కాదేది అనర్హం' అన్న చందంగా మార్కెట్లో ప్రతి వస్తువును కల్తీచేస్తున్నారు. నగరంలో ఇటీవల కళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ పన్నీర్, పచ్చళ్ల కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులు కూడా బయటపడ్డాయి. తాజాగా.. కల్తీ కొబ్బరిపొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు.హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ (గోల్కొండ, ఖైరతాబాద్ జోన్లు) మరియు గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. బేగంబజార్లోని కల్తీ కొబ్బరి పొడి తయారీ కేంద్రంపై దాడి చేశారు. అనారోగ్యకరమైన పద్ధతుల్లో కొబ్బరి పొడిని ప్యాకింగ్ చేస్తున్న నిందితుడు నకుల్ మరోటియాను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో రూ.21 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.నిల్వ ఉంచిన కొబ్బరి పొడి (8,300 కిలోలు), సీలింగ్ ప్యాకింగ్ యంత్రాలు(3), బరువు తూచే యంత్రాలు(3), ప్యాకింగ్ కవర్లను సీజ్ చేశారు. నిందితుడు నకుల్ మరోటియా బేగంబజార్లోని బాలాజీ పురుషోత్తం కోకోనట్ బిజినెస్ షాప్ పేరుతో అక్రమంగా కొబ్బరి పొడిని తయారు చేస్తున్నాడు.నిందితుడు కర్ణాటక నుండి తక్కువ ధరకే నాణ్యత లేని కొబ్బరి పొడిని కొనుగోలు చేసి, దానిని 'చేతక్' (Chetak) బ్రాండ్ ప్యాకెట్లలో నింపి, అసలైన కొబ్బరి పొడిగా విక్రయిస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. ఈ ప్యాకెట్లపై ఎలాంటి బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ డేట్ (గడువు తేదీ), ఆహార భద్రతా ప్రమాణాల (FSSAI) లైసెన్స్ వివరాలు లేవని విచారణలో తేలింది.నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు..నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా పట్టుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, ఫుడ్ అడల్టరేషన్ (ఆహార కల్తీ నియంత్రణ) విభాగం అధికారులతో కలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్, ఎం.ఎం. పహాడీలో గల "డెక్కన్ ట్రేడర్స్" గోడౌన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. సుమారు మూడున్నర లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ (70 క్వింటాళ్లు), సింథటిక్ ఫుడ్ కలర్ ప్యాకెట్లు(1 బాక్స్), శాంటిక్ యాసిడ్ టిన్:1 (40 లీటర్లు), ఆదిత్య బిర్లా కెమికల్స్(1 బాక్స్)లను సీజ్ చేశారు. నిందితులు ముగ్గురు కలిసి ఎం.ఎం. పహాడీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గోడౌన్లను నడుపుతున్నారు. వీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ప్రమాదకరమైన పేస్ట్ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి, హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పపువ్వు సారా మంచిదే గానీ.. ఇందిరమ్మ పేరు పెట్టకండంటూ రాకేష్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రాకేష్రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. రాకేష్రెడ్డివ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రూల్స్ ప్రకారమే సభ నడవాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు.కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై మాజీ మంత్రి హరీష్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్,బీజేపీ ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చర్చను పక్కదారి పట్టించడం సరైన పద్దతి కాదన్నారు. ఒక్క విషయాన్ని పట్టుకుని గంట సమయం వృథా చేయడం సరికాదన్నారు. రాకేష్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న స్పీకర్.. కొత్త సభ్యులు పొరపాటు చేస్తే ఫ్లోర్ లీడర్ సరిచేయాలని సూచించారు.తానేం తప్పు మాట్లాడలేదన్న రాకేష్రెడ్డి.. ప్రతి స్కీమ్కు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు.. ఈ స్కీమ్కు ఆమె పేరు పెట్టొద్దని చెప్పానంటూ రాకేష్రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే హౌస్ కమిటీ వేయండి.. ఇందిరమ్మపై తప్పుగా ప్రచారం చేస్తుంటే తానూ మాత్రమే ఖండించానని రాకేష్రెడ్డి అన్నారు. ఇప్పపువ్వు సారా ఫ్యాక్టరీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని చెప్పడం తప్పేమీ కాదంటూ మహేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందిరమ్మ పేరు ఎందుకు తెచ్చారో రాకేష్రెడ్డి సమాధానం చెప్పాల్సిందేని మంత్రి సీతక్క అన్నారు. -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇవాళ వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్లో వడగళ్ల వాన పడింది. ఘట్కేసర్, పోచారం, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురిసింది.రంగారెడ్డి జిల్లా, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఇలా పెట్రోల్ నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు: ఉత్తమ్
హైదరాబాద్: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనపడుతుండడంతో దీనిపై తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదని అన్నారు.‘మీరు ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం. అవసరం మేరకు సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకేసారి డ్రమ్లు, కంటైనర్లు నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు. ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటరింగ్ చేస్తుంది. రూమర్స్, ఫేక్ న్యూస్ను నమ్మొద్దు’ అని సూచించారు.కాగా, తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... ‘డిమాండ్ 25 శాతం పెరిగింది. 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాయి. పెట్రోల్ బంక్ లు క్లోజ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. అహ్మదాబాద్, సూరత్, నాగపూర్, చెన్నైలో ఇలాంటి పరిస్థితి ఉంది. బంక్ లకు క్రెడిట్ సమస్య లేదు. గ్యాస్ అక్రమ రవాణా పై 175 కేసులు నమోదు చేస్తాం. 2,954 వాణిజ్య సిలిండర్ లు సీజ్ చేశాం.గృహ అవసరాలకు గ్యాస్ ఇబ్బంది లేదు. ఎల్పీజీ బుకింగ్ 15 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది’ అని అన్నారు. కాగా, పెట్రోల్ , డీజల్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఇతర అధికారులు కూడా సూచిస్తు న్నారు. పెట్రోల్ బంక్లలో కావాల్సినంత సప్లై జరుగుతుందని అంటున్నారు. -
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో ఇవాళ (బుధవారం) టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి.. కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు.ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని.. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
Rapido: వామ్మో.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా!
హైదరాబాద్: ర్యాపిడో డ్రైవర్కు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరించి వారి ఫోన్లు దోచుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్కర్నూల్ జిల్లా టూడుకుర్తి గ్రామానికి చెందిన రేణుక(32) నగరంలో కొండాపూర్లో నివసిస్తోంది. ఈ నెల 22న షేక్పేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ సమయంలో తనను మహ్మద్ ఖాలిద్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి తాను ర్యాపిడో డ్రైవర్నని చెప్పి ఆమెను బైక్పై తీసుకువెళ్లేందుకు ముందుకువచ్చాడు. నమ్మకంతో రేణుక అతని బైక్పై ఎక్కింది. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత చార్జీల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రేణుక, ఖాలిద్ల ఫోన్లు తీసుకుని పికప్, డ్రాప్ వివరాలు చెక్ చేస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో వారిద్దరి దృష్టి మరల్చి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తమ ఫోన్లు దొంగిలించినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గ్రేటర్ పరిధిలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల నాటికి రాజధాని నగరం హైదరాబాద్, నగరాన్ని ఆనుకొని ఉన్న ఇరుగుపొరుగు జిల్లాల్లో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునరి్వభజన చేసేందుకు నిర్ణయించడంతోపాటు 50 శాతం స్థానాలను పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి. శాసనసభా నియోజకవర్గాలు, లోక్సభ స్థానాలు 50 శాతం పెరగనుండటంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 183కి పెరగనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2011 జనగణన మేరకు రాష్ట్రంలోని జనాభా దాదాపు 3.52 కోట్లు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ జనాభా సగటున దాదాపుగా 1.93 లక్షలు. దీనికి పది శాతం అటూఇటూ ఉండేలా పునర్విభజన జరగవచ్చు. హైదరాబాద్తో పాటు సరిహద్దు జిల్లాల్లోనూ అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగనున్నాయి. జిల్లాల వారీగా పెరిగేదిలా.. 2011 లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 39,43,323. ఒక్కో అసెంబ్లీకి సగటుజనాభా 1.93 లక్షలను పరిగణనలోకి తీసుకుంటే ఈ జిల్లాలో 20 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 15 శాసనసభా స్థానాలకు తోడు కొత్తగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయన్న మాట. అలాగే మేడ్చల్ జిల్లా జనాభా 24,60,095. ఈ లెక్కన ఈ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడు అదనంగా మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. రంగారెడ్డి జిల్లా జనాభా 24,46,265. ఈ లెక్కన ఈ జిల్లాలో కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ (కల్వకుర్తి పాక్షికం) నియోజకవర్గాలకు అదనంగా మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. ఇదే లెక్కన వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు ఆవిర్భవిస్తాయి.ఐదు జిల్లాల పరిధిలో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలతో పునరి్వభజన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు కానున్న 63 శాసనసభ నియోజకవర్గాల్లో 22 ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. అంటే మూడో వంతుకు పైగా ఇక్కడే ఏర్పడనున్నాయి. ఒక నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండటంతో పాటు జీహెచ్ఎంసీకి ఒక సర్కిల్ లేదా జోన్ సైతం ఒకే జిల్లాలో జీహెచ్ఎంసీ పునరి్వభజన సందర్భంగానూ అధికారులు జాగ్రత్త వహించారు. కొత్త నియోజకవర్గాల్లో కొన్ని? ప్రస్తుతం ఆయా ప్రాంతాలకున్న ప్రాధాన్యం, వాడుక దృష్ట్యా కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ సీట్లు బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, హిమాయత్నగర్, శంషాబాద్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర, బాలానగర్ (ఐడీపీఎల్) పేరిట ఏర్పాటు కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అవి ఏ నియోజకవర్గంలో ఉన్నాయో, ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, పక్కపక్కనే ఉండే రెండు ముఖ్య ప్రాంతాల పేర్లు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉండవని చెబుతున్న వారూ ఉన్నారు. -
తెలంగాణలో పెట్రోల్ నిల్వలు.. డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో నిన్న అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. వదంతుల వ్యాప్తిచెందిన కారణంగా వాహనాల్లో డీజిల్, పెట్రోల్ నింపుకునేందుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయవద్దు అని హెచ్చరించింది.మరోవైపు.. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నట్టు సమాచారం. -
దిమ్మతిరిగేలా పెరిగిన నిమ్మకాయల ధరలు
సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో వీటి ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల తదితర ప్రాంతాల నుంచి నగరానికి నిమ్మకాయలు వస్తుంటాయని, మార్చి మధ్య నుంచి సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయిందని మరో వ్యాపారి నరేష్ కుమార్ పేర్కొన్నారు. 25 కిలోల బరువున్న 1,200 నుంచి 1,500 బస్తాల నిమ్మకాయలు గతంలో రాగా, ఇప్పుడు కేవలం 800–1,000 బస్తాలు మాత్రమే వస్తున్నాయని ఆయన తెలిపారు. మధ్యవర్తులు ప్రధాన డీలర్ల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత కూరగాయల వ్యాపారులకు సరఫరా చేయడంతో రిటైల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. నిమ్మకాయల కొరత కారణంగా హోటల్ యజమానులు బిర్యానీ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్తో పాటు సలాడ్లలో వడ్డించడం తగ్గించేశారు. -
‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్? నీ మొగుడు చూసుకుంటాడులే’’
సాక్షి,హైదరాబాద్: మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగంలోని ఓ మహిళా ఇన్స్పెక్టర్ సహచర సిబ్బందితో అమానవీయంగా, అసభ్యకర రీతిలో ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతోనే కాదు ఇన్స్పెక్టర్ ర్యాంక్ వారితోనూ ఆమె తీరు ఇలాగే ఉంటుందని పలువురు సిబ్బంది ‘సాక్షి’తో వాపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెను చూసుకునేందుకు సెలవు అడగ్గా... కుదరదని చెప్పడంతో పాటు ‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్? నీ మొగుడు చూసుకుంటాడులే’’ అని మాట్లాడిందని ఓ మహిళా పోలీసు ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏమాత్రం సానుభూతి లేకుండా ప్రతి విషయంలోనూ మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోలీస్ యూనిఫాంలో ఠాణాకు రాకపోవడం వంటి విమర్శలకు తోడు, ఇటీవల పోక్సో కేసులో స్టేట్మెంట్ రికార్డ్కు వచ్చిన స్థానిక పోలీసు సిబ్బందితో విపరీతంగా ప్రవర్తించడంతో.. వారు తీవ్రంగా కుంగిపోయారు. విషయాన్ని ఉన్నతాధికారులు, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమేనని కమిషనర్కు నివేదిక అందజేశారు. దీంతో మహిళా ఇన్స్పెక్టర్ను మల్టీ జోన్–2కు సరెండర్ చేశారు. సైబర్ క్రైమ్ ఠాణాలో హోదాతో సంబంధం లేకుండా అందరూ విధిగా యూనిఫామ్లో డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు. -
నేడు కాంగ్రెస్కు రాజీనామా.. జీవన్ పయనమెటు?
సాక్షి,జగిత్యాల: నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా అనంతరం ఏఐసీసీ, పీసీసీకి లేఖ పంపనున్నారు.కాంగ్రెస్తో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు పెట్టనున్న జీవన్ రెడ్డి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామా విషయంలో చివరి క్షణం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ దూత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కలిసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు.దీంతో జీవన్ రెడ్డి రాజీనామా, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న నేతగా జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం ఉంది. ఆయన స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్ఎస్లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం వంటి అవకాశాలు చర్చనీయాంశమవుతున్నాయి.జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. -
పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోతుందని, కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో నగరంలో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందారు. మంగళవారం ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్పేట వంటి అనేక ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు పోటెత్తారు. రాత్రివేళకు సగానికి పైగా పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు రావడంతో బంకుల్లో నిల్వలు త్వరగా అయిపోయాయి. చమురు కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉండడం వరుస సెలవుల వల్ల కొన్ని బంకులకు సకాలంలో స్టాక్ చేరకపోవడం కూడా కొంత ప్రభావం చూపింది. ఆటో.. ఎటో.. మహా నగరంలో రవాణాకు వెన్నెముకగా నిలిచే ఆటోలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. కొద్ది రోజులుగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తే.. మధ్యాహా్ననికి కూడా ట్యాంకులు నిండని పరిస్థితి నెలకొంది. పశి్చమాసియా యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కమ్మేయడంతో... దాని ప్రభావం హైదరాబాద్ ఆటో డ్రైవర్లపై పడింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో డిమాండ్ను సాకుగా చూపి కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లు స్టాక్ ఉన్నా లేదని బోర్డులు పెడుతున్నాయి. నగరంలో ఎల్పీజీ ఆటోల సంఖ్య లక్ష పైనే. రోజువారీ గ్యాస్ డిమాండ్ 1.70 లక్షల కిలోలు ఉండగా, సరఫరాలో సగటున 30–40 శాతం లోటు కనిపిస్తోంది. భారత్ గ్యాస్ లిమిటెడ్ , ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థలతో పాటు బీజీఎల్, ప్రైవేటు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. నగర వ్యాప్తంగా సీఎన్జీ, ఎల్పీజీ స్టేషన్లు ఉన్నప్పటికీ, సగంపైగా బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి.ప్రైవేటు గ్యాస్ సైతం... ప్రభుత్వ రంగంలోని ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో పాటు ప్రైవేటులో సూపర్ గ్యాస్, గో గ్యాస్, ఏజిస్ లాజిస్టిక్స్, తెలంగాణ గ్యాస్, టోటల్ ఎనర్జీస్కు నగర వ్యాప్తంగా స్టేషన్లు ఉన్నాయి. ప్రైవేటు సంఖ్య తక్కువే అయినా అత్యవసర సమయాల్లో ఇవే దిక్కు. దీంతో కొంత ఎక్కువ వసూలు చేస్తాయి. కాగా, యుద్ధానికి ముందు కిలో సీఎన్జీ ధర రూ.70–75 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.90–రూ.100 దాటింది. కొన్ని ప్రైవేట్ స్టేషన్లలో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల బంకుల్లో గ్యాస్ అయిపోవడంతో డ్రైవర్లు ప్రైవేట్లును ఆశ్రయిస్తున్నారు. అక్కడ లీటరుకు రూ.15–20 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. -
నాడు మైక్ ఇవ్వలేదు.. నేడు వాకౌట్ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కనీసం సభ్యులుగా గౌరవించేవారు కాదు. నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా మాట్లాడుతుంటే వినాల్సిందిపోయి బడ్జెట్ కాగితాలను చించి చెవిలో పువ్వుల్లాగా పెట్టుకుని వెళ్లిపోవడం సంస్కారమా? సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి, ఇక్కడ భట్టి విక్రమార్క, అక్కడ శ్రీధర్ బాబు కూర్చోవడం ఏమిటి? అనే చులకన భావంతో చూడొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజాతీర్పును గౌరవించాలి’ అని బీఆర్ఎస్ సభ్యులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్పై శాసనసభలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, బడ్జెట్ పద్దుల పుస్తకాలను సకాలంలో ఇవ్వడం లేదని ఆరోపిస్తూ భట్టి విక్రమార్క సమాధానాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు ప్రకటించి తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. ప్రశ్నించడానికి బీఆర్ఎస్ సభ్యులకు వీలైనంత సమయమిచి్చనా వాకౌట్ చేయడం సరికాదని భట్టి తప్పుబట్టారు. నాడు ఎన్ని అవమానాలకు గురిచేసినా తాము వాకౌట్ చేయలేదన్నారు. వాస్తవికతకు దగ్గరగా... ఆదాయం లేకున్నా ఏటా 20 శాతం బడ్జెట్ను గత బీఆర్ఎస్ సర్కారు పెంచిన తరహాలో పెంచుకుంటూ పోవడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. అలా చేస్తే ఈ పాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరేదన్నారు. ఏటా 6 శాతం వృద్ధితో బడ్జెట్ అంచనాలను పెంచుకుంటూ పోతున్నామని, మరో రెండుమూడేళ్లలో వాస్తవిక గణాంకాలకు దగ్గరగా ప్రతిపాదనలను తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల కోసం రైతు భరోసా చెల్లించారని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను భట్టి తోసిపుచ్చారు. గత బీఆర్ఎస్ సర్కారు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ చేయడంతో వడ్డీలపై వడ్డీలు పెరిగి రైతులు నష్టపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను గాలికి వదిలేసిందన్నారు. తాము వచ్చాక రాష్ట్ర వాటా రూ.3 వేల కోట్లను చెల్లించి రూ.10వేల కోట్ల కేంద్ర నిధులను సాధించామని చెప్పారు. అప్పులకే ఏటా రూ.93,194 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను విధ్వంసం చేసి ందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర అప్పులు, తిరిగి చెల్లింపులు 2014–15లో రూ.9,580 కోట్లు మాత్రమే ఉండగా, గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులతో 2023–24 నాటికి రూ.25,350 కోట్లు, 2024–25 నాటికి రూ.66,545 కోట్లు, 2025–26 నాటికి రూ.93,194 కోట్లు కట్టాల్సి వచి్చందన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.1,59,165 కోట్ల అప్పులు చేసి రూ.1,85,090 కోట్ల అప్పులను తిరిగి చెల్లించిందన్నారు. మోదీ అప్పులు రూ.140 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం 1950–51 నుంచి 2013–14 మధ్యకాలంలో 13 మంది ప్రధానుల ఆధ్వర్యంలో రూ.56.66 లక్షల కోట్లు అప్పులు చేస్తే ప్రస్తుత ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో ఏకంగా రూ.140 లక్షల కోట్లు కొత్త అప్పులు చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర అప్పులపై బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన దీటుగా బదులిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయికి 30 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది. దేశంలో అంతర్భాగం కాదా? కేంద్రం ఇలా ఇవ్వడమే చీటింగ్ అని ఏలేటిని నిలదీశారు.రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.10 పెంచినట్టు ఏలేటి చేసిన ఆరోపణ లు అవాస్తమని తప్పుబట్టారు. నాడు మహాత్మాగాం«దీని భౌతికంగా లేకుండా చేశారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని బీజేపీపై మండిపడ్డారు. భట్టి శాసనమండలిలో సైతం బడ్జెట్పై చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అర్ధరాత్రి వరకు సమాధానమిచ్చారు.పార్టీ ఆఫీస్ నడిపినట్టు సభ నడిపారు: మంత్రి శ్రీధర్బాబు బీఆర్ఎస్ హయాంలో సభను ఆ పార్టీ ఆఫీస్ను నడిపినట్టు నడిపారని మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు తగిన సమయమిచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సీఎం రేవంత్రెడ్డి సమాధానమిచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ను తీవ్రంగా తప్పుబడుతూ సభలో మాట్లాడారు. -
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు విడుదల చేయడంతోపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగ నియామకాల భర్తీ హామీ నెరవేర్చాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో విద్యార్థులు, యువతకు మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకుని లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్లో విద్యకు 18 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసినా కేటాయింపులు 8 శాతానికే పరిమితం చేశారు. గత ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన ఫీజు రీయింబర్స్మెంటులో 80 శాతం నిధులను విడుదల చేయలేదు. రూ.8 వేల కోట్ల బకాయిలకుగాను రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం మోసగిస్తోంది. బడ్జెట్లో విద్యానిధి పథకం, రూ.5 లక్షల విద్యా రుణం హామీ ఊసేలేదు. రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ కేలండర్ అమలు చేస్తామని ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయని రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’అని అన్నారు. విద్యార్థి నేతల అరెస్టు అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అరెస్టు చేసి పంజగుట్ట, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసులు పలువురు బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం నేతల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీసులు అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్ తదితరులు తమ ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చిన వీడియోలను ట్వీట్ చేశారు. విద్యార్థుల అరెస్ట్ దుర్మార్గ చర్య: కేటీఆర్ పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగ నియామకాల హామీ అమలు కోసం నిలదీసిన బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా ప్రశ్నించిన గొంతులపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఇచి్చన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి వచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. జాబ్ కేలండర్కు పాతరేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను నిర్లజ్జగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కుప్పకూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిదే. 127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా సీఎం రేవంత్రెడ్డిలో కనీసం చలనం లేదు. ఇప్పటికైనా బకాయిపడ్డ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేడో, రేపో సీన్ రీ కన్స్ట్రక్షన్!
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను సిట్ విచారించింది. రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని సోదరుడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్శర్మను మంగళవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని బందోబస్తు మధ్య శంషాబాద్ ఠాణాకు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. మొదట రోహిత్రెడ్డితో ప్రారంభించి, ముగ్గురిని వేర్వేరుగా విచారించారు.సిట్ బృందం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు మధ్యాహ్నం శంషాబాద్ ఠాణాకు వచ్చి నిందితులను స్వయంగా విచారించారు. వేర్వేరుగా ముగ్గురిని విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. ఫామ్హౌస్లో కుటుంబ సభ్యులతో పార్టీలు మాత్రమే జరుగుతుంటాయని రోహిత్రెడ్డి అడ్వొకేట్ శ్రీకాంత్రెడ్డి మీడియాతో తెలిపారు. పాత సంఘటలను కాకుండా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే విచారించాలని కోర్టు సూచించినట్టు చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు, కాల్పుల వ్యవహారంపై ఆరా కాల్పుల వ్యవహారం, డ్రగ్స్ కొనుగోలు అంశాలపై సిట్ అధికా రులు నిందితులను ప్రశ్నించినట్టు తెలిసింది. డ్రగ్స్ ఎక్కడ కొను గోలు చేశారు.. ఎవరు సరఫరా చేశారు.. డ్రగ్స్ పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి వంటి ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాల్పుల వ్యవహారంపై నమిత్శర్మను ప్రశ్నించి పలు విషయాలు తెలుసు కున్నారు. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసింది రోహిత్రెడ్డే కావడంతో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విచారణలో నాలుగు కొత్త పేర్లు బయటకొచ్చినట్టు సమాచారం. మిగిలిన రెండు రోజుల విచారణలో డ్రగ్స్ మూలాలకు సంబంధించిన వివరా లను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఫామ్హౌస్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
సర్వత్రా డీలిమిటేషన్ చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నియోజకవర్గాల పునర్విభ జన హాట్ టాపిక్గా మారింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందనే సమాచారంతో.. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా రాజకీయ నేతలనే తేడా లేకుండా పునర్విభజన గురించిన చర్చే జరుగుతోంది. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, అధికారులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా మాట్లాడుకోవడం కన్పించింది. ముఖ్యంగా సెంట్రల్, నార్త్, సౌత్ తెలంగాణల్లో ఎక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే సెంట్రల్ తెలంగాణగా పరిగణించే హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయి అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించగలిగే పార్టీలు సులువుగా అధికారం దక్కించుకునే విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల జనాభాలో మార్పురాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే పునర్విభజన ఆయా జిల్లాల పరిధిలోనే ఉండనుంది. కొత్త జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఈ మేరకు నియోజకవర్గాల జనాభాలో మార్పు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకుంటారనేది నిపుణుల భావన. జిల్లా, రాష్ట్రం యూనిట్గానియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల కేటాయింపునకు చాలా కాలంగా ఓ పద్ధతి పాటిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల కోసం జిల్లా యూనిట్గా, ఎస్టీ నియోజకవర్గాల కోసం రాష్ట్రం యూనిట్గా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఒకటి లేదా రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎస్టీ రిజర్వుడు స్థానాల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం వారి జనాభా ఆధారంగా మొత్తం స్థానాలను నిర్ధారించి, ఆ మేరకు ఎస్టీల జనాభా ఎక్కువ ఉండే నియోజకవర్గాలను రిజర్వు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో మహిళా కోటాఈసారి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో 60 అసెంబ్లీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో రిజర్వు అవుతాయని, పదిహేనేళ్లలో ఈ రొటేషన్ పూర్తయి రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిసారి ప్రతి జిల్లాలో ఒకటి నుంచి మూడు స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా లోక్సభ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతమున్న 17కు తోడు అదనంగా పెరిగే 9 స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి. పదవుల సంఖ్యలోనూ మార్పులుప్రస్తుతం జరుగుతున్న చర్చకు అనుగుణంగా శాసన, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే, ఆ మేరకు పలు పదవుల సంఖ్య కూడా మారనుంది. ముఖ్యంగా శాసనమండలిలోనూ సగం స్థానాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా, పునర్విభజన అనంతరం అది 60కి చేరనుంది. దీంతో పాటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు కూడా పెరగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 11కు చేరనుంది. ఇక రాష్ట్ర మంత్రివర్గం సైజు కూడా పునర్విభజన అనంతరం పెరగనుంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం మంది మంత్రులుగా పనిచేసే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల గరిష్ట సంఖ్య 18గా ఉంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 17 మంది మంత్రులుగా పనిచేయవచ్చు. అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మంత్రివర్గం సంఖ్య 27కు చేరనుంది. అయితే పునర్విభజన బిల్లుకు, ఇతర అంశాలకు సంబంధం లేని మండలి నుంచి మంత్రివర్గం వరకు ప్రత్యేక బిల్లుల ద్వారా సవరణలు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయంగా ఎవరికి లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయాలకతీతంగా, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా, జనాభా లెక్కలు, భౌగోళిక సరిహద్దుల ఆధారంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పునర్విభజన సమయంలో నియోజకవర్గాల కూర్పు, ఆయా నియోజకవర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు, నగర ప్రాంతాల్లో పెరిగే స్థానాలు, గ్రామీణ ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో జరిగే మార్పులను బట్టి ఈ లబ్ధిని అంచనా వేయగలుగుతామని చెబుతున్నారు. అయితే సెంట్రల్ తెలంగాణలో సీట్లు భారీగా పెరిగిన పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లకు కొంత మేలు జరగవచ్చని, గ్రామీణ తెలంగాణలో సీట్లు ఎక్కువగా పెరిగితే కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వన్ ఇండియా సర్వీస్
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ పౌరసేవల్లో మధ్యవర్తిత్వానికి ఇక తావు లేదు. వివిధ రకాల సర్వీసుల కోసం ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు మొదలు బదిలీ వరకు ఎక్కడా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోయే ‘వాహన్ పోర్టల్’రెండు రోజుల క్రితం అమల్లోకి వచ్చింది. వాహనాల కొనుగోలు సమయంలో ఆటోమొబైల్ డీలర్లు చేసే మాయాజాలానికి, ఫైనాన్స్ సంస్థల దోపిడీకి ‘వాహన్’అడ్డుకట్ట వేయనుంది. నకిలీబీమా సంస్థల అక్రమాలకు సైతం కళ్లెం పడనుంది. 2014లోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ను ప్రవేశపెట్టింది. 2016 నాటికి ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో వాహన్ పోర్టల్తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సేవలపైన ‘సారథి పోర్టల్’అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సారథి పోర్టల్ సేవలు కొనసాగుతుండగా, రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ‘వాహన్ పోర్టల్’ ను ప్రారంభించారు.ఈ రెండు రోజుల్లో ‘వాహన్’కు 1702 దరఖాస్తులు అందాయి. 318 టీఆర్లను (తాత్కాలిక రిజిస్ట్రేషన్) జారీ చేసి నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా నమోదయ్యే వ్యక్తిగత వాహనాలకే ఈ పోర్టల్ సేవలు లభిస్తున్నాయి. త్వరలో రవాణా వాహనాలకు సైతం పోర్టల్ను విస్తరించనున్నారు. ఈజీగా అంతర్రాష్ట్ర బదిలీలు సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం బదిలీ కావాలంటే సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) అందజేయాలి. ఆ పత్రాన్ని బదిలీ కానున్న రాష్ట్రంలోని అధికారి ధృవీకరించుకొనేందుకు చాలా రోజుల సమయం పట్టేది. దీంతో బదిలీల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకునేది. పైగా అధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు ఏజెంట్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనం వివరాలు వాహన్లో ఉంటాయి. మిగతా రాష్ట్రాల వాహనాల వివరాలు ఇప్పటికే ఈ పోర్టల్లో ఉన్నాయి. కాబట్టి రవాణా అధికారులు ఈ పోర్టల్లో లభించే డేటా ఆధారంగా క్షణాల్లో ఎన్ఓసీ అందజేసే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని తీసుకోవచ్చు. డీలర్లు మాయ చేయలేరు రవాణాశాఖకు చెల్లించే జీవితకాల పన్నును తగ్గించేందుకు, వాహన ధరలను పెంచేందుకు, లేదా తగ్గించేందుకు ఆటోమొబైల్ డీలర్లు ఇక ఏ మాత్రం మాయ చేయలేరు. వాహనం తయారీ సంస్థ నిర్ణయించిన ధర మేరకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ డీలర్ల సర్వర్ పోర్టల్ ‘హోమో లోగేషన్’ను వాహన్తో అనుసంధానం చేశారు. దీనివల్ల తయారీ సంస్థ నిర్ణయించిన ధర, వాహన ఇంజిన్ నంబర్, ఛాసీస్ నంబర్ తదితర వివరాల నమోదులో డీలర్లు ఎలాంటి తప్పులు చేసేందుకు అవకాశం ఉండదు. అదనపు చార్జీలను కూడా వాహనదారుడి నుంచి వసూలు చేసేందుకు వీల్లేదు. ఇన్వాయిస్లో ఉన్న ధర మాత్రమే వాహనదారుడు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ప్రస్తుతం షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండటం వల్ల వాహనదారుడు ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. ఫైనాన్స్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా వాహన్తో అనుసంధానమై ఉంటాయి. వాహనాలకు రుణాలు ఇవ్వాలనుకునే ప్రతి సంస్థ రవాణాశాఖ ఆమోదంతో అనుసంధానం కావాల్సిందే. ఇందుకోసం సదరు సంస్థల జీఎస్టీ గుర్తింపు, పాన్, ప్రభుత్వ గుర్తింపు, ఆర్బీఐ నుంచి పొందిన ఆమోద పత్రాలను తప్పనిసరిగా వాహన్లో అప్లోడ్ చేయాలి. దీంతో వాహనదారులకు అందజేసే రుణాలు, ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీ, ఆదాయపన్ను, తదితర అన్ని రకాల చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. నకిలీ బీమాకు తెర వాహన్ వల్ల నకిలీ బీమా సంస్థల మోసాలకు కూడా తెరపడుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బోర్డ్ (ఐఆర్బీ) అనుమతి పొందిన అన్ని బీమా సంస్థలు వాహన్తో అనుసంధానమై ఉంటాయి. దీంతో నకిలీ సంస్థల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వంద శాతం పారదర్శకం దేశవ్యాప్తంగా అన్ని రకాల పౌర సేవలను ఏకీకృతం చేసే లక్ష్యంతో కేంద్రం మిషన్ మేడ్ ప్రాజెక్ట్ (ఎంఎంపీ)లో భాగంగా ‘ఒకే భారత్, ఒకే లైసెన్స్, ఒకే వాహనం నంబర్’విధానాన్ని కొనసాగిస్తోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా దేశవ్యాప్తంగా 1,423 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ‘వాహన్ సారథి’పోర్టల్ సేవలను అందజేస్తున్నాం. వంద శాతం పారదర్శకత, జవాబుదారీతనం ఈ మిషన్ లక్ష్యం. – ఎస్.కాశిరెడ్డి, ఎన్ఐసీ, తెలంగాణ కోఆర్డినేటర్ -
తప్పుడు చార్జిషీటుతో అక్రమ కేసు
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేటు మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చార్జిషీటు పేరిట మళ్లీ తెరపైకి ఫార్ములా–ఈ తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసిన తొలి సంతకానికి సంబంధించిన ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. గతంలో తాను చెప్పినట్టు ఫార్ములా–ఈ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని చెప్పారు. శాసనసభ లాబీల్లోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో మంగళవారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఫార్ములా–ఈ అంశాన్ని గోరంతను కొండంతగా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడి నుంచి పంపిన నిధులు రూ.45 కోట్లు అయితే రూ.600 కోట్లకు పైగా ఉన్నాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ నుంచి పంపిన రూ.45 కోట్లు ఫార్ములా–ఈ బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయి. ఆ నిధులను ప్రభుత్వం ఎందుకు వెనక్కి రప్పించడం లేదు. ఈ కేసులో అనుచిత లబ్ధి జరిగిందని చెబుతున్న వారి పేరు చార్జిషీటులో లేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘అందాల పోటీల వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం లేకపోగా తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం అంతర్జాతీయంగా అప్రతిష్టపాలైంది. ఇంత దారుణం జరిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసు నమోదు కాలేదు. సీఎం సరదా కోసం రూ.100 కోట్లతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేసినా కేసు నమోదు కాలేదు. ఫార్ములా–ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడదు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ను వదిలిపెట్టేది లేదు’అని కేటీఆర్ చెప్పారు. మూసీపై ప్రణాళిక లేకుండానే.. ‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూపాయి లేకున్నా ఏడీబీ అప్పు ఇస్తుందనే ఉద్దేశంతో డీపీఆర్ లేకుండానే మూసీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతోంది. మూసీ ప్రాజెక్టుపై ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా మూసీ బాధితులతో చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మేధా పాట్కర్ వంటి మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు’అని కేటీఆర్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ ‘2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే స్వాగతిస్తాం. జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతమున్న నిష్పత్తిలో పునర్విభజన జరగాలి. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి 24శాతం ప్రాతినిథ్యం ఉంది. అదే నిష్పత్తిలో దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్రం చూడాలి. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. టీడీఆర్ స్కామ్ ‘‘ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కచ్చితంగా టీడీఆర్లు కొనుగోలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ కుంభకోణంపై విచారణ జరిపిస్తాం. నిర్వాసితుల నుంచి అతి తక్కువ ధరకు టీడీఆర్ కొనుగోలు చేసి వాటిని అడ్డగోలు ధరలకు తిరిగి అమ్ముకుంటున్న రేవంత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పాత్రను బయటపెడతాం. రేవంత్ పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్’గా మారిపోయాయి. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ కుటుంబం టీడీఆర్లను ఏటీఎంగా మార్చుకున్న తీరును బయటపెడతాం’అని కేటీఆర్ చెప్పారు. -
ఎల్బీనగర్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ రెండంతస్తుల వంతెన నిర్మాణం కానుంది. దిగువన సాధారణ రోడ్డు... ఆపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. అందులో తొలి అంతస్తులో ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితం కానుండగా రెండో అంతస్తులో మెట్రో కారిడార్ నిర్మాణం కానుంది. ఎల్బీనగర్లోని పనామా గోడౌన్ నుంచి హయత్నగర్ వరకు దాదాపు 5.5 కి.మీ. నిడివితో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రూపొందనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వచ్చే నెలలో ఆ శాఖ వార్షిక ప్రణాళిక ఖరారు కోసం జరగనున్న సమావేశంలో దీనికి తుది అనుమతి విషయంలో స్పష్టత రానుంది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొంత నియోజకవర్గమైన నాగ్పూర్లో ఇప్పటికే ఇదే డిజైన్లో 5.62 కి.మీ. మేర ఫ్లైఓవర్ రూపొందింది. ఆ వంతెనను చూసే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రతిపాదించింది. ఇటీవల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపే అవకాశం ఉందని ఆయన మంగళవారం శాసనసభలో వెల్లడించారు. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సందర్భంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత ఇచ్చారు. పెరిగిన కాలనీలు, ట్రాఫిక్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో.. ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్డును ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్ నుంచి నగర శివారు వరకు 8 వరుసలకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా భారీగా కాలనీలు వెలిశాయి. అలాగే హయత్నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఇటీవలి కాలంలో కాలనీలు వేగంగా పెరిగాయి. దాదాపు 15 లక్షల మంది ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ స్థానిక వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. కాలనీల్లోకి వెళ్లాలంటే రెండున్నర కి.మీ. ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తోంది. ఇందుకోసం ఈ పరిధిలో 8 అండర్పాస్లను నిర్మించేందుకు డిజైన్ చేశారు. ఇందులో నాలుగు పూర్తవగా ఒకటి నిర్మాణంలో ఉంది. ఈ అండర్పాస్ డిజైన్ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న సూచన వచ్చింది. ఇదే సమయంలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ తర్వాతి వరకు 7.1 కి.మీ. మేర మెట్రో రైలు కారిడార్ ఖరారైంది. ఆరు స్టేషన్లతో ఈ కారిడార్ను నిర్మించనున్నారు. అది కూడా ఇదే మార్గంలో రూపొందుతుంది. దీంతో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మిస్తే మెట్రో ప్రాజెక్టుకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో రెండూ ఒకే నిర్మాణంలో ఉండేలా తాజాగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు రూపకల్పన చేశారు. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ. 200 కోట్లు ఈ ప్రాజెక్టుకు రూ. 940.75 కోట్లు ఖర్చవుతుందని ఎల్ఎన్ మాల్వియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక అంచనాతో నివేదికను సమర్పించింది. దీంతో ఈ వ్యయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి రూ. 200 కోట్లను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మిగతా మొత్తాన్ని కేంద్రం భరించాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఆ శాఖ వార్షిక ప్రణాళికలో దీన్ని చేరి్పంచేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. అనుమతి రాగానే మరో ఆరు నెలల్లో దీనికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెండోది... ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో ఆ డిజైన్తో నిర్మితమయ్యే రెండో కట్టడం కానుంది. ఇప్పటికే పుణే–హెదరాబాద్ జాతీయ రహదారిపై మదీనాగూడ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 1.20 కి.మీ. పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీనికి రాష్ట్ర పభుత్వం రూ. 53.55 కోట్ల వాటా చెల్లించేందుకు కూడా అంగీకారం తెలిపింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని దీని ద్వారా రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి లక్షా 15 వేల 551 ఎలక్ట్రిక్ వాహనాలకు 925.94 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవి పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ వచ్చేలా ఈవి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఈవి వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే,చైనా లతో పోటీపడుతుందని తెలిపారు.ఈవి వాహనాలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్యూర్ ఏరియా లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.. క్యూర్ ఏరియా లో డీజిల్ ఆటో లు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్క్రాపేజీ పాలసీ లో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ లో వాహన్ , సారథి పోర్టల్ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యం తో EV వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందని 2 వేల కిలోమీటర్ల మేరకు CURE చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ సీఎస్ పేర్కొన్నారు. నగరం లో ఈవిబిబస్సు లను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ లో అమలు చేస్తున్న ఈవి పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందన్నారు.EVS -
హైదరాబాద్లో కుమ్మేసిన వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో వర్షం కురిసింది. కూకట్పల్లి, మియాపూర్, చందనగర్లో కుండపోత వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్లో భారీ వర్షం కురవగా, మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లిలో వడగళ్ల వాన పడింది. వానవెలిసే వరకు మెట్రో పిల్లర్ల కింద కొందరు వాహనాలను కాసేపు ఆపే ప్రయత్నం చేశారు.కామారెడ్డి జిల్లా జుక్కల్లో గాలివానతో పాటు పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం పడింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి. -
‘దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు’
హైదరాబాద్: డిలిమిటేషన్లో మహిళా రిజర్వేషన్ అనేది 33 శాతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జనగణన అనంతరం డిలిమిటేషన్ జరుగుతుందన్నారు. జనాభా , ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని, ఒకవేళ అలా జరిగితే నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల సీట్లు పెరగవన్నారు రాంచందర్రావు. ‘ఇక్కడ 8 వేలు ,10 వేలు జనాభా ఉన్న సీట్లు ఉన్నాయి. జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందని కాంగ్రెస్ చేసే ఆరోపణలో నిజం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు. ఉత్తరాదికి పెరిగిన ప్రపోషన్ ఆధారంగా దక్షిణాదిన సీట్లు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ లు మతం మార్పిడి చేస్తే రిజర్వేషన్ వర్తించదనే కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రలోభాలకు గురి చేసి మతం మార్చుకుంటున్నారు. మత మార్పిడిల వల్ల ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ తో ఎస్సీ ఎస్టీ లకు అందాల్సిన సరైన ఫలాలు అందుతాయి’ అన్నారు. -
ఉద్యోగుల జీతంలో కోత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు తల్లిదండ్రులకు అందజేసే బిల్లును కేబినెట్ ఆమోదించింది.తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికే స్ఫూర్తిదాయకమని, వృద్ధ తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ఎక్స్ వేదికగా కొనియాడారు.‘చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.‘దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈరోజు కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు.వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక. అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక భరోసా.ఈ బిల్లు మన దేశానికి స్పూర్తిదాయకం. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠం. వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష!’ అని పేర్కొన్నారు. చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం… pic.twitter.com/jV2LQNRSnx— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 24, 2026 -
గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ నేతలు.. గన్పార్క్ దగ్గర భారీ నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోందని.. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని మండిపడ్డారు.‘‘కేంద్రం అధీనంలో పెట్రోలియం శాఖ ఉందని.. తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఫ్యూచర్లో గ్యాస్ సిలిండర్ సైజ్ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయి. 14 కిలోల గ్యాస్ సిలిండర్ను 10 కిలోలకు తగ్గిస్తారంట. సామాన్య ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆంబోతు కొట్లాటలో లేగలు బలైనట్లు సామాన్యుల పరిస్థితి. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత చర్చనీయాంశంగా మారింది. కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం ప్రజలను మభ్యపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. గ్యాస్ కొరత పై ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రకటన చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
హైడ్రా కమిషనర్ చర్యలు ధిక్కరణే..
సాక్షి, హైదరాబాద్: బాగ్ అంబర్పేట్లోని బతుకమ్మ కుంట వివాదాస్పద భూమిలో స్టేటస్కో ఆదేశాల తర్వాత చేపట్టిన నిర్మాణాలు, బోర్డులను తొలగించాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. సివిల్ అప్పీలులో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి..హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పేర్కొంది. తొలగింపునకు నేటి నుంచి నాలుగు వారాల వ్యవధి ఇస్తున్నామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఆలోగా నిర్మాణాలను తొలగించినట్లు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. బాగ్ అంబర్పేటలో సర్వే నంబర్ 563/1 పరిధిలోని 7 గుంటల భూ వివాదంలో ఏ.సుధాకర్ రెడ్డి హక్కులకు భంగం కలిగించమనే హామీకి లోబడి, వరదలను నివారణకు పరిమిత పనులను చేపట్టేందుకు న్యాయస్థానం 2025, జూన్ 12న అనుమతి ఇచి్చంది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్రెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. -
‘మంగ్లీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు’
హైదరాబాద్: గాయని మంగ్లీపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయవాది నాగేశ్వరరావు పూజారి తెలిపారు. సోమవారం ప్రెస్క్లబ్ హైదరాబాద్లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని చానల్స్లో స్కూల్స్, ఆస్పత్రులు, పబ్లు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని, అత్యధిక వడ్డీ ఇస్తామని కొంతమంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని అందులో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు, సోదరులు ప్రధానంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు, డబ్బులు కట్టలు, కట్టలుగా చూపిస్తూ ఇది మంగ్లీ ఇంట్లోనే అని చెపుతున్నారని సుమారు రూ. 150 కోట్లు వసూలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. మంగ్లీకి పాటలు పాడడం, ఈవెంట్స్కు వెళ్లడం తప్ప వేరే ఎలాంటి వ్యాపారం లేదన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు
హైదరాబాద్: హాస్టల్లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్లోని ప్రైవేటు హాస్టల్లో వరంగల్ జిల్లా, గీసుకొండకు చెందిన రంజిత్ (28) ఉంటున్నాడు. సేల్స్ మెన్గా పనిచేసే రంజిత్ హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి రహస్యంగా ఫొటోలు తీశాడు. దీనిని గుర్తించిన సదరు యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రంజిత్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఔటర్పై రోడ్డు ప్రమాదం.. మాగంటి కుమార్తెలకు గాయాలు
హైదరాబాద్: ఔటర్రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన డీసీఎంను వెనకనుంచి ఢీ కొట్టిన కారు ప్రమాదంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలు అక్షర, దిశిరలకు గాయాలయ్యాయి. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన మేరకు.. తమ మిత్రుడిని ఎయిర్పోర్ట్లో వదిలి రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్ నుంచి గచి్చ»ౌలి వైపు వస్తున్న ఫార్చునర్ కారు పోలీస్ అకాడమి వద్దకు రాగానే ముందు వెళుతున్న డీసీఎం ఒక్కసారిగా వేగం తగ్గింది. దాంతో వేగంగా వస్తున్న పార్చునర్ కారు దాన్ని వెనకనుంచి ఢీ కొట్టింది. మిత్రుడు అరికెపూడి దుర్గ సాయి కారును నడుపుతుండగా, మాగంటి అక్షర నాగ ముందు కూర్చోగా వెనక సీట్లో మాగంటి దిశిర, మేడిపల్లి అభిరాంరెడ్డిలు కూర్చున్నారు. వీరంతా స్నేహితులే. ముందు కూర్చున్న అక్షరకు తీవ్ర గాయాలు కావటంతో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్షరకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని, మిగతా ఇద్దరు మిత్రులు రాత్రే ఇంటికి వెళ్లిపోగా సోమవారం దిశిరను డిశ్చార్జి చేశారు. -
గ్యాస్..ఉన్నా ఇవ్వరేంటి బాస్?
హైదరాబాద్: మహా నగరంలో గ్యాస్ కటకట రోజురోజుకు తీవ్రమవుతోంది. ఒక వైపు వంటగ్యాస్ లేక గృహ వినియోగదారులు ఆందోళనకు గురవుతుండగా...కమర్షియల్ ఎల్పీజీ, సీఎన్జీ సైతం అందుబాటులో లేక అటు ఆటోడ్రైవర్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దినసరి ఆదాయంపై ఆధారపడే ఆటోడ్రైవర్లు గ్యాస్ కోసం బంకుల చుట్టూ తిరుగుతూ..పూటల కొద్దీ వేచి చూస్తూ నానా యాతన పడుతున్నారు. లక్డీకాపూల్లోని ఓ బంక్ వద్ద సోమవారం దాదాపు వంద ఆటోలు బారులు తీరగా..చివరకు స్టాక్ లేదంటూ చెప్పడంతో డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. బంకులో గ్యాస్ ఉన్నా ఇవ్వడం లేదని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. -
మీరు కాంప్రమైజ్ అయితే.. పార్టీ కాంప్రమైజ్ కాదు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ సర్కార్పై గట్టిగా పోరాడండి.. ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలు, గ్యారంటీలపై అధికార పార్టీని, నేతలను నిలదీయండి’అని బీజేపీ ముఖ్య నేతలు, నాయకులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ బీజేపీలో కొందరు ముఖ్యనేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో ‘కాంప్రమైజ్ పాలిటిక్స్’నెరుపుతున్నారనే ఆరో పణల మధ్య.. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ద్వారా నాయకులకు గట్టి వార్నింగ్ పంపించినట్టుగా పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కేడర్ కష్టపడు తుంటే.. కొందరు ముఖ్యనేతలు, నాయకులు మాత్రం ఇతర పార్టీలతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యసాధనకు పార్టీలో అన్ని స్థాయిల నాయకులపై అధిష్టానం కన్ను ఉందని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని హైకమాండ్ సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై కొందరు నేతలు మెతక ధోరణిని అవలంబిస్తూ అంత తీవ్రస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శల మధ్య తాజాగా అభయ్పాటిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇటీ వల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పలు నియో జకవర్గాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలతో చేతు లు కలిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామా లపై సీరియస్గా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీ లైన్ దాటి ఎవరైనా ప్రైవేట్ డీల్స్ కుదుర్చుకుంటే సహించేది లేదని పాటిల్ హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని 9 జిల్లాల (పార్టీ యూని ట్లు) జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకు ల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘మీరు కాంప్రమైజ్ అయితే.. పార్టీ కాంప్రమైజ్ కాదు’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలదళంలో కలకలం రేపుతున్నాయి.తమతమ నియోజకవర్గాల్లో పట్టు కోసం లేదా కాంట్రాక్టులు, ఇతర వ్యక్తిగత ప్రయోజ నాల కోసం కొందరు నేతలు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరిస్తున్నారని అభయ్పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించాక...త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తాచాటడం అనేది కొందరు నేతల తీరు వల్ల బీజేపీకి అగ్నిపరీక్షగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఏర్పడిన లోపాలు, కొందరు నేతల కుమ్మక్కు రాజకీయాలు, ఇతర సమస్యలను సరిదిద్దడమే లక్ష్యంగా అభయ్పాటిల్ రంగంలోకి దిగినట్టుగా పార్టీవర్గాలు చెబుతున్నారు. హైకమాండ్ వార్నింగ్తోనైనా కొందరు నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాల్సి ఉందని పార్టీ అంతర్గత చర్చల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఫార్ములా ఈ–రేస్ కేసులో చార్జిషీట్?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు చార్జిషిట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అభియోగాలు మోపుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ చార్జిషిట్ దాఖలు చేసినట్లు సమాచారం. అలాగే ఏ2గా సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి. లక్ష్మీనర్సింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి), ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థలను చేర్చింది.హెచ్ఎండీఏ బోర్డుకు చెందిన రూ. 55 కోట్లను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ పేర్కొంది. దాదాపు వెయ్యికిపైగా పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషిట్ను కోర్టు పరిశీలిస్తోంది. పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. ఆ తరువాత కేటీఆర్ సహా నిందితులంతా కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించారని.. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు గత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అర్వీద్కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించడం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హెచ్ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలన, పట్టణాభివృద్ధి ప్రత్యేక సీఎస్గా ఉన్న అర్వీద్ కుమార్ను రెండో నిందితుడిగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితోపాటు ఫార్ములా–ఈ కార్ రేసింగ్ ఆర్గనైజర్, గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. -
విద్వేషంపై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు, 2026)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా చేసే పోస్టులు, అల్లర్లు.. ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సైతం ఇదే తరహా బిల్లును శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. దీంతో గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. హేట్ స్పీచ్ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు.. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.వర్సిటీల్లో కుల వివక్ష నియంత్రణకు..విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. గిగ్ వర్కర్స్కు భద్రత గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ – 2026’ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్తో పాటు సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు బోర్డు ఏర్పాటు ద్వారా వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.మెట్రో స్వాధీనం చర్యలు వేగవంతంహైదరాబాద్ నగరంలో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టంతెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.కులగణనపై కమిటీ నివేదికకు ఆమోదంరాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. కాగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.తల్లిదండ్రులకు భరోసా..వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతి నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఏది తక్కువైతే ఆ మొత్తం వేత నాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రులకు మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. -
బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’పార్టీ నాయకులు–పోలీసుల మధ్య తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కళ్లు కప్పి ఆటోలో అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఇతర నేతలు నిరసన తెలిపారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు నకు కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘6 గ్యారంటీలు ఎక్కడ’అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమీపానికి చేరుకొని బారికేడ్లు దాటేందుకు యతి్నంచిన కార్యకర్తలను పోలీసులు అడ్డు కున్నారు. వివిధ జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకొని ముట్టడించే ప్రయత్నం చేశారు. అనంతరం రాంచందర్రావు తదితరులను అరెస్ట్ చేసి పంజగుట్ట స్టేషన్కు తరలించారు. ఆయన్ను సాయంత్రం విడుదల చేశారు.ఆ తర్వాత కూడా ఐదు, పది మంది చొప్పున కొన్ని బ్యాచ్ల వారీగా ఆటోలు, క్యాబ్లు, ఇతర రూపాల్లో శాసనసభ సమీ పానికి చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.800 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, 50 మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ ప్రాంతా ల్లోని 9 పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. పలువురు నేతలను వారి ఇళ్ల వద్ద, అసెంబ్లీకి మార్గమధ్యలో హౌస్ అరెస్ట్లు చేసి పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, దాదాపు రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చింది.శాసనసభ ముట్టడికి సంబంధించి పోలీసులకు ముందస్తు సమాచారంతో చుట్టుపక్కల పెద్దసంఖ్యలో మోహరించారు. సోమ వారం ఉదయం 11 గంటల నుంచి పలు దఫాలుగా బ్యాచ్లుబ్యాచ్లుగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డా.ఎన్.గౌతమ్రావు, టి. వీరేందర్గౌడ్, బండ కార్తీకరెడ్డి, శిల్పారెడ్డి, ఎన్వీ సుభాశ్, దీపక్రెడ్డి, గణేశ్, మహేందర్ ఉన్నారు. రాంచందర్రావును పోలీస్స్టేషన్ లో ఎమ్మెల్యేలు పాయల్శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, డా.సి.అంజిరెడ్డి, మల్క కొమరయ్య పరామర్శించారు.మోసపూరిత హామీల సర్కార్ను మరింత నిలదీస్తాం: రాంచందర్రావు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత నిలదీస్తామన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం: ఏలేటి కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందే తప్ప మడమ తిప్పదని బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించిన రాంచందర్రావు అరెస్టు.. ప్రభుత్వ నిర్బంధ పాలనకు నిదర్శనమని ఒకప్రకటనలో విమర్శించారు. -
స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ మాత్రం స్వచ్ఛత లేదని, స్పష్టత, విశ్వసనీయత అసలు కన్పించడం లేదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశమంత హామీలిచ్చి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిందని అన్నారు. గత బడ్జెట్లు ’గాలి మాటలు’అయితే.. ఈ బడ్జెట్ అవాస్తవాల కోట లాగా కనిపిస్తోందని అన్నారు. ‘రైతన్నను ప్రభుత్వం దగా చేసింది. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అయ్యింది. కాంగ్రెస్ ’అభయహస్తం’రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారింది. రైతు రుణమాఫీ ఎక్కడా పూర్తిగా అమలు కాలేదు. రుణమాఫీ అమలు విషయంలో కొడంగల్ కానీ, మధిర కానీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడానికైనా నేను సిద్ధం..’అని సవాల్ చేశారు. బడ్జెట్పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం.. ‘కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసింది. ఎకరాకు రూ.15 వేలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామన్న మీ హామీ ఏమైంది? రైతులకు బోనస్ ఓ ప్రహసనంగా మారింది. గత యాసంగి బోనస్ రూ. 1,161కోట్లు ఎగ్గొట్టారు. బడ్జెట్లో పంటల బీమా ఊసే ఎత్తలేదు. బోనస్ బోగస్ అయ్యింది. బీమా బూటకమయ్యింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.12 వేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగులకూ దగా.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న సర్కార్ బడ్జెట్లో దాని గురించి కూడా ప్రస్తావించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఓట్ల కోసం అశోక్నగర్ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ పెద్దలే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే, నిరుద్యోగుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు. తలలు పగుల గొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దక్కింది డిప్రెషన్, సప్రెషన్ మాత్రమే (ఈ సందర్భంగా అధికార పార్టీని విమర్శిస్తూ హరీశ్ కవిత చదివారు)..’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకూ మొండి చెయ్యే ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినా, ఏ యువకుల ఖాతాల్లోనూ డబ్బులు పడలేదు. పథకాలకు రాజీవ్గాందీ, ఇందిరమ్మ పేర్లు ఎందుకు పెడుతున్నారు? వారి పేర్లు ఎందుకు బద్నాం చేస్తున్నారు? రేవంత్రెడ్డికి వారి మీద ఎలాగూ నమ్మకం లేదు. భట్టి అయినా దీన్ని ఆలోచించాలి. ఈ పథకానికి ‘రేవంత్ ఆత్మీయ మోసం’అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’అనో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. బడ్జెట్లో ఆ మాటే మాయం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఇచ్చిన జీవోను బయటపెట్టాలి. లేదంటే మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాగునీటిపై నిర్లక్ష్యం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆ హామీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 18 ప్రాజెక్టుల పూర్తి బడ్జెట్లో కన్పించడం లేదు. హామీ ఇచ్చిన 11,60,895 ఎకరాల ఆయకట్టు సాగు ఓ భ్రమగా మారింది. విలువలు అడుగంటాయి.. ఆశలు ఆవిరయ్యాయి..ప్రభుత్వం ఆడి తప్పింది.. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆరు గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు..’అని హరీశ్రావు విమర్శించారు. -
ప్రజలకు నష్టం చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవ్వరికీ నష్టం చేయం. నిరాశ్రయులను చేయం. పునరావాసం కల్పిస్తాం. మెరుగైన వసతులు ఏర్పాటు చేసి తరలిస్తాం. ప్రాజెక్టును నిర్మిస్తూనే అక్కడ నష్టపోయే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తాం. బఫర్ జోన్లో ఉండే వారికి ఏ రకంగా సహాయం అందించాలో అందిస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో అపోహలు సృష్టించకూడదు. అందరం కలిసి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు మహేశ్కుమార్గౌడ్, అద్దంకి దయాకర్ సోమవారం శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. కావాలంటే కేబినెట్ కమిటీ వేస్తాం.. ‘మూసీ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పారు. మూసీ నది వెంట 50 మీటర్ల బఫర్ జోన్ కూడా మీరు నిర్ణయించిందే. మీరు ప్రారంభించి అర్థాంతరంగా వదిలేసిన పనినే మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఈ విషయంలో మీరు ఏ సూచన చేసినా పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేవి అయితే 100% అమలు చేస్తాం. నాకు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం. ఆ కమిటీకి మీ సూచనలు చెప్పొచ్చు. ప్రాణాంతకంగా మూసీ నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలను చూస్తే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోరు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలో కాలుష్యం, జంతువుల కళేబరాలు, మనుషుల శవాలతో ఆ నీళ్లు వారికి ప్రాణాంతకంగా మారాయి. ఆ ప్రాంతంలో పండిన పంటలు, బోర్లలో నీళ్లు కూడా పిల్లలపైన విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఆ సమస్యల నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మూసీలో శుభ్రమైన నీరు ప్రవహించేలా గోదావరి జలాలు తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు ‘గాందీసరోవర్ నిర్మించేందుకు 98 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రం ఇస్తుంది. టూరిజం శాఖ దగ్గర ఇంకో 100 ఎకరాలు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ల (మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల అంశాన్ని ఉద్దేశించి) భూమి తీసుకోకపోయినా పరవాలేదు. కానీ ఆ అపార్ట్మెంట్లలో ఉండే మిత్రులు 2005–06లో 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి అనుమతులు తీసుకున్నారు. అయితే 2016లో మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అయ్యింది. ఆ ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్లు బఫర్ జోన్లో ఉంటాయి. భవిష్యత్తులో వాటిని అమ్ముకోవడానికి వీలుకాదు. అందువల్ల నష్టం జరుగుతుందని మాత్రమే చెబుతున్నాం. మీకు ఇష్టమైతే, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఆ భూమిని ఇప్పుడు ఇస్తే నష్టపరిహారం ఇస్తాం. ప్రత్యామ్నాయం చూపడానికి కూడా అభ్యంతరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి రోడ్మ్యాప్ ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్లో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయి. నగరంలో వాహనాల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టుగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశాం. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం. క్యూర్ పరిధిని సేవా రంగంగా, ప్యూర్ను తయారీ కేంద్రంగా, రేర్ను వ్యవసాయ ప్రాధాన్యతగా అభివృద్ధి చేయబోతున్నాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం (క్యూర్)లోని కాలుష్య కారక పరిశ్రమలను బయటకు తరలిస్తేం నగరం నివాస యోగ్యంగా మారుతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసే క్రమంలో ఒకే విధమైన పరిపాలన విధానం కోసం మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్ అభివృద్ధి కోసం ఒక రోడ్మ్యాప్ను తయారు చేశాం..’అని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణ..ఎలివేటెడ్ కారిడార్లు ‘ప్రజల సౌకర్యం కోసం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్రెడ్డి ఉన్న సమయంలోనే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు సదుపాయం వచ్చింది. ఆనాడు దేశంలో రెండో స్థానంలో ఉన్న మన మెట్రో గత పదేళ్లలో నిర్లక్ష్యంతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణకు ఎల్అండ్టీ అనుకూలంగా లేకపోవడంతో మెట్రోను రూ.15 వేల కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటోంది. ఏప్రిల్ వరకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత లాస్ట్మైల్ కనెక్టివిటీ వచ్చేలా మెట్రో రైలును నాగోల్ నుంచి ఎయిర్పోర్టుకు, గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట, రాయిదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మొత్తం 76 కిలోమీటర్లు మార్గాన్ని రూ.24 వేల కోట్లతో నిర్మించేందుకు అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. మెట్రో విస్తరణకు కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. హిమాయత్సాగర్ నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్కు రేడియల్ రోడ్లు వేస్తున్నాం. హిమాయత్సాగర్ నుంచి రామోజీ ఫిల్మ్సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ వేస్తున్నాం. గండిపేట నుంచి గౌరెల్లికి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకుంటారు. నగరంలో ఉండే వాళ్లు నగరం బయటకు వెళ్లేందుకు వీలుగా నగరం మధ్యలోంచి మూసీ వెంట ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తాం. దీనికి గౌలిగూడ బ్రిడ్జి దగ్గర, చాదర్ఘాట్ దగ్గర, నాగోల్ దగ్గర, అంబర్పేట జంక్షన్ దగ్గర ట్రంపెట్లు వస్తాయి. ఇలా హైదరాబాద్ను అద్భుత రీతిలో అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం..’అని రేవంత్ వివరించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద రోడ్డు ‘హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు.. రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్టు మధ్యలో రన్వే కింది నుంచి అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తెచ్చాం. పనులు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను జూలై వరకు పూర్తిచేస్తాం. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం. ఫుట్పాత్ వ్యాపారులకు ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి ప్రోత్సహిస్తాం. మల్టీలెవల్ పార్కింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. -
అందనంత ఎత్తుకు ప్లాస్టిక్ సంచుల రేట్లు.. ఇక గోనె సంచులైతే..
పశ్చిమాసియాలో యుద్ధం జరిగిందన్న విషయం తెలిసిందే. దానివల్ల నిన్నటివరకు క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దాని ప్రభావం వల్ల భారతదేశంలోని చాలా వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్ బ్యాగ్స్. మనం మార్కెట్ నుంచి ఎన్నో వస్తువులను తీసుకెళ్లడానికి వాడుతుంటాము. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ ధర కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఈ విషయంపై మరిన్ని వివరాలను ‘సాక్షి’కి వివరించారు మాన్ సరోవర్ అగ్రోసాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని భగవంత్ పన్సారి.ఇప్పుడు ప్లాస్టిక్స్ బ్యాగ్స్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఎన్నడూలేనంత రేట్ ఉంది. ఇలా పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఇది క్రూడాయిల్కు సంబంధించిన ప్రొడక్ట్. రైస్ మిల్స్, ఫ్లోర్ మిల్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నింట్లో ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉంది. వేరే ప్యాకింగ్ ఏది లేదు. అన్నింట్లోనూ ప్లాస్టిక్ ఉంది. మీరు గుట్కా తీసుకుంటే కూడా, నీళ్ల పాకెట్ తీసుకుంటే కూడా ప్లాస్టికే. ప్లాస్టిక్ యూసేజ్ ఇంకా పెరుగుతుంది. మాకే దానా దొరకడంలేదు. మాకు రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోని టై అప్ ఉంది. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి మేము ట్రేడ్ లో ఉన్నాం. ఇక ప్రజలు ఏం చేస్తారు? ఏ రేట్ ఉన్నా వాళ్లకు బ్యాగ్ కావాల్సిందే. 10 రూపాయల బ్యాగును మేము 18 రూపాయలకు అమ్ముతున్నాం ఇప్పుడు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. వచ్చేనెల సమస్య ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ ప్లాస్టిక్ బ్యాగులు తక్కువనే ఉత్పత్తి అవుతున్నాయి.డైలీ 3-4 లక్షలు అమ్మేవాళ్లం. 1,50,000కి వచ్చేశాం. సమీప భవిష్యత్తులో లక్ష బ్యాగులు కూడా ఇవ్వలేము. రా మెటీరియల్ మనకు దొరకదు. మన ఫ్యాక్టరీలు నడవవు. ఫ్యాక్టరీలు నడవకుంటే మనం సప్లై చేయలేము. పెట్రోల్ లేకుంటే బండి నడవదుకదా? పాల పాకెట్ కూడా ప్లాస్టిక్ ఉంటేనే మీ ఇంటికి చేరుతుంది. ప్లాస్టిక్ కొరత ఇంకా పెరుగుతుందన్న సమాచారం మా వద్ద ఉంది. మాల్ చాలా షార్టేజ్ ఉంది’ అని తెలిపారు.గోనె సంచులకు డిమాండ్ ఎందుకు తగ్గింది?ప్రస్తుతం గన్ని బ్యాగ్స్ (గోనె సంచులు)కు డిమాండ్ చాలా తక్కువగా ఉంది. వీటిని కేవలం వరి పండించిన తర్వాత ఆ వడ్ల కోసం మాత్రమే వాడుతున్నారు. ఇంకా దేనికీ వాడట్లేదు. గతంలో బియ్యానికి కూడా గోనె సంచులు వాడేవారు. కానీ ఈ కాలంలో బియ్యానికి కూడా ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు. అసలు గోనె సంచులకు ఎందుకు డిమాండ్ తగ్గింది? గన్నీ బ్యాగ్స్ బిజినెస్ చేసే మధు సురేష్ వివరాలు తెలిపారు.‘నేను 40 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాను. డిమాండ్ ఎందుకు తగ్గిందంటే ప్రాపర్గా జూట్ దొరకట్లేదు ఒకటి. ఆ జూట్ను ప్రొడక్షన్ చేయనివ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇస్తే దాని గురించి ఎంతో మంది ఫార్మర్స్ ప్రొడక్షన్ చేస్తారు. రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో టై అప్ అయిపోయి జూట్ను బంద్ చేసేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ తో ఏమవుతుంది? మొత్తం ప్లాస్టిక్ అంతా వేడి వస్తుంది. అంత కవర్ వేస్తారు.. దానివల్ల క్యాన్సర్స్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని పట్టించుకోవట్లేదు’ అని చెప్పారు. -వెబ్డెస్క్పూర్తి వివరాలు -
అది భస్మాసుర హస్తంగా మారింది: హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హరీష్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్ ఆపలేదు. మేము ఒక్క సీజన్ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు.నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అంటూ గత బడ్జెట్ లో రూ.6వేల కోట్లు పెట్టారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. గతసారి యువ వికాసం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘ అని హరీష్ రావు అన్నారు. -
మా ఇళ్లు కూల్చకండి
హైదరాబాద్ : బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం కోసం మా ఇండ్లు కూలగొట్టకండి అంటూ రాహుల్ గాంధీకి 1000కి పైగా పోస్టు కార్డులు రాసి నల్లటి రిబ్బన్పై అతికించిన మధుపార్క్ అపార్ట్మెంట్ చిన్నారులు – బండ్లగూడఖైరతాబాద్లో అరుదైన పక్షి పంజగుట్ట: ఖైరతాబాద్ ఆనంద్నగర్ కాలనీలోని మొగల్ మస్కాన్ అపార్ట్మెంట్లో ఆడుకుంటున్న చిన్నారులకు శనివారం రాత్రి ఓ పక్షి కనిపించింది. అప్పుడే అటువైపు వచి్చన ఓ వ్యక్తి గమనించి పంజరంలో ఉంచి యానిమల్ వారియర్స్ సొసైటీకి ఫోన్ చేశాడు. వారువచి్చ.. అది అరుదైన గుడ్లగూబ జాతికి చెందినదని చెప్పి తీసుకెళ్లారు. ఆ పక్షిని అడవిలో వదిలేస్తామని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలకు సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం,స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. -
Banjara Hills: ఇంట్లోనే వ్యభిచారం.. అలేఖ్య అరెస్ట్..!
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి యువతితో పాటు విటుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా అలేఖ్యరెడ్డి(26) అనే మహిళ ఆరు నెలలుగా వ్యభిచారం నడిపిస్తుందని పోలీసులు గుర్తించారు. ఆమె వెంకటేష్ అనే ఏజెంట్, రామ అనే వ్యక్తి పరిచయాల ద్వారా వ్యభిచారం నడిపస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అలేఖ్యరెడ్డి పోలీసులకు వివరించింది. ఆమెతో పాటు విటుడు వెంకట వినయ్కుమార్(27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా పెరిగిన చికెన్ ధరలు
జోగిపేట(అందోల్): మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఆదివారం కిలో చికెన్ ధర రూ.360కి చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు నాన్వెజ్ తినడమే కష్టంగా మారింది. లైవ్ చికెన్ రూ.230, స్కిన్లెస్ రూ.360, చికెన్ రూ.320 చొప్పున చికెన్ దుకాణాలలో విక్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఇంతరేటు పెరగడం గమనార్హం. గతంలో వారానికి ఒకసారైనా చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నాయి. చికెన్ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీఫారాల్లో ఉత్పత్తి తగ్గడం, పక్షుల ఆహార వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల ధరలు పెరిగినట్లు తెలిపారు. అలాగే వేసవి ప్రభావం కారణంగా కోళ్ల మరణాలు కూడా పెరిగి సరఫరా తగ్గిందని పేర్కొన్నారు. ఇక వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇప్పటివరకు కుటుంబంతో కలిసి వారానికి ఒకసారి చికెన్ తినేవాళ్లం. ఇప్పుడు ధరలు ఎక్కువ కావడంతో నెలలో ఒకసారి కూడా కొనలేకపోతున్నాం’’అని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. మటన్ ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, చికెన్ కూడా అదే దారిలో నడవడం వల్ల నాన్వెజ్ పూర్తిగా దూరమవుతోందని అంటున్నారు. హోటళ్లలో కూడా చికెన్ వంటకాల ధరలు పెరగడంతో కస్టమర్ల రాక తగ్గినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. -
బ్యాటింగ్.. జస్టిస్ విజయ్సేన్ రెడ్డి.. బౌలింగ్.. జస్టిస్ లక్ష్మీనారాయణ
హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మూడు రోజులపాటు జరిగిన హైకోర్టు జడ్జీలు–అడ్వొకేట్ల క్రికెట్ టోర్నమెంట్లో అడ్వకేట్స్ ‘ఏ’ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి రోజు పోటీల్లో చీఫ్ జస్టిస్ జట్టు ‘ప్రెసిడెంట్ లెవెన్’పై విజయం సాధించింది. అనంతరం అడ్వొకేట్స్ ‘ఏ’, ‘డీ’ జట్లు ఫైనల్కు చేరగా, ఆదివారం జరిగిన ఫైనల్లో అరవింద్ నేతృత్వంలోని ‘ఏ’ జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ‘డీ’ జట్టు 6 ఓవర్లలో 54 పరుగులు చేయగా, ‘ఏ’ జట్టు 4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్సేన్ రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరై ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించి, సరదాగా కాసేపు ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. -
బాల్కనీ కుప్పకూలి.. ఇద్దరు బలి
పంజగుట్ట: రెండో ఫ్లోర్లోని బాల్కనీ కూలి తండ్రి, కొడుకు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంబాగ్కు చెందిన దేవిదాస్ (56), ఆయన కుమారుడు వివేక్ (32) ఎలక్ట్రిషన్లు. వీరు కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తుంటారు. బేగంపేటలోని కుందన్బాగ్ మెథడిస్ట్ కాలనీకి చెందిన ద్వారకా ప్రసాద్ వీరికి ఎలక్ట్రిక్ పనులు ఇప్పిస్తుంటారు. ద్వారకా ప్రసాద్ ఉంటున్న ఇల్లు పురాతన కాలం నాటిది. ఈ భవనం రెండో అంతస్తులో ఆయన నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో ఎలక్ట్రిక్ పనులు చేయించేందుకు శనివారం దేవిదాస్, వివేక్లతో బాల్కనీ లిఫ్ట్ పక్కనే నిల్చొని మాట్లాకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలింది. దీంతో ముగ్గురూ రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తు బాల్కనీపై పడి అది కూడా కూలడంతో నేలపై పడిపోయారు. దీంతో దేవిదాస్, వివేక్ తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలు కావడంతో ద్వారకా ప్రసాద్ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దేవిదాస్, వివేక్ల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేవిదాస్ అల్లుడు నవీన్ ధర్మశాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న ఇద్దరు మృత్యువాత పడటంతో దేవిదాస్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
ఆధునిక ఇస్ఫహాన్.. మన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్–అమెరికాలు ఇరాన్ మీద దాడి ప్రారంభించినప్పటి కంటే ఓ నగరం మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు ‘హైదరాబాద్ నగరం’మనసు కలుక్కుమనే ఉంటుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసినప్పుడు మరింత ఆవేదనకు గురై ఉంటుంది. ఆ నగరమే ఇస్ఫహాన్. దాదా పు 3 వేల కి.మీ. దూరంలో ఉన్న ఆ నగరంపై బాంబులేస్తే హైదరాబాద్కు ఉలుకెందుకంటే... 22 ఆర్చి ద్వారాలతో అద్భుత శైలితో నిర్మితమైన పురానాపూల్, ఎత్తయిన నాలుగు మినార్లతో గంభీరంగా ఉండే చార్మినార్... షియా సంప్రదాయ కట్టడం బాద్షాహీ అషూర్ఖాన్... ఇవన్నీ ఆ ఇస్ఫహాన్ నగర ప్రభావంతో రూపొందినవే. వీటికి మూలం గోల్కొండ సామ్రాజ్య పేష్వాగా దశాబ్దాల పాటు కొనసాగిన మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఆయన మాట ల్లో... ‘హైదరాబాద్ అంటే ఆధునిక ఇస్ఫ హాన్’. ఆయ నకు ఇస్ఫహాన్ అంటే మక్కువ ఎందుకంటే.. ఆయనది ఇస్ఫహానే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రా యెల్–అమెరికా దాడులతో ఆ నగరం అతలా కుతల మవుతోంది. పర్షియన్ సంస్కృతి సంప్రదా యాలు, నిర్మాణాలను నిలువెల్లా అద్దుకున్న ఆ దేశం నిలువునా వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్ విధ్వంసం సృష్టిస్తుందోనని అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. కానీ, ఆ దేశంలో మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్కు నష్టం జరిగిందని తెలిసి హైదరాబాద్ గుండె బరువెక్కింది. ఇస్ఫహా న్తో ప్రస్తుతం హైదరాబాద్కు వాణిజ్య సంబంధాలు పెద్దగా లేకున్నా, హైదరాబాద్ పుట్టుకలో ఆ నగర ప్రభావమే కీలకం కావటం విశేషం.చార్మినార్..హైదరాబాద్ నగర సంతకం చార్మినార్ ప్రధాన డిజైన్ ఈయనదే. భారీ మినార్లతో కట్టడాలుండటం పర్షియన్ పద్ధతి. అక్కడి మసీదులకు ఎత్తయిన మినార్లు ఉంటాయి. వాటి మీదకు ఎక్కి ప్రార్థనలకు స్థానికులను గట్టిగా అరిచి పిలిచేవారు. ఇస్ఫహాన్లో 1316లో నిర్మించిన మినార్ ఏ జొంబన్ మసీదు నమూనాతో చార్మినార్కు డిజైన్ చేశారు. దానిలాగే ఆర్చి, అలాగే మినార్లు (మినార్ ఏ జొంబన్కు రెండే) డిజైన్ చేశారు. అప్పటికే ఆయన్ను పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించారు. 1590లో మొదలైన హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్ తరహాలో రూపొందించాలని నిర్ణయించి మొమిన్ తన మార్కు చూపించారు. అలా 40 ఏళ్లపాటు ఆయన పేష్వాగా కొనసాగారు. మళ్లీ ఇస్ఫహాన్కు వెళ్లకుండా ఇక్కడే ఉండి చనిపోయారు. ఆయన రూపొందించిన మీర్ మొమిన్ కా దాయరాలోనే ఆయన్ను ఖననం చేశారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ ఉంది. భారత సంప్రదాయాలను ధ్వంసం చేసి పర్షియా పద్ధతులను రుద్దినప్పటికీ, నగర నిర్మాణంలో ఆయన పాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చనిపోయే ముందు ఆయన రాసిన పుస్తకంలో హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్గా అభివర్ణించారు. అందుకే హైదరాబాద్ చరిత్రలో ఇస్ఫహాన్కు అంత ప్రాధాన్యం. యుద్ధంలో ఇస్ఫహాన్ దెబ్బతింటే హైదరాబాద్ మనసుకు గాయమైంది అందుకే.కులీ కుతుబ్షా పాలనలో..కులీకుతుబ్షాహీ పాలకుల్లో ఐదోవాడిగా పట్టాభిషిక్తుడైన మహమ్మద్ కులీకుతుబ్షా పాలనలో హైదరాబాద్ నగర నిర్మాణం మొద లైంది. అప్పటి వరకు గోల్కొండ పట్టణం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం పాతనగరం ఉన్న ప్రాంతంలో కొన్ని ఊళ్లు మాత్రమే ఉండేది. నాలుగో రాజు ఇబ్రహీం కులీకుతుబ్షాహీ కాలంలోనే గోల్కొండ ఇరుకుగా మారటంతో మూసీకి ఆవల కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. ఇబ్రహీం ఆదేశాలతోనే మూసీ దాటేందుకు వీలుగా వంతెన నిర్మాణం మొద లైంది. అప్పుడు నగరంలోకి ఓ వ్యక్తి కాలు మోపాడు. ఆయనే మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఈయన ఇరాన్ సఫావిద్ రాజ్య రాజధాని ఇస్ఫహాన్కు చెందిన ప్రముఖ పండితుడు. అక్కడి అస్తరాబాద్లో పుట్టినప్పటికీ, సఫా విద్ రాజకుమారుడు హైదర్కు ట్యూట ర్గా పనిచేసేవాడు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వైద్యం, ఆధ్యాత్మికం... ఇలా పలు అంశాల్లో నైపుణ్యం ఆయన సొంతం. అక్కడి రాజు మృతితో ఆయన హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడి కుతుబ్షాహీ పాలకులు పర్షియాకు చెందిన వారే కావటంతో అప్పటికే పర్షియాకు చెందిన ఎంతోమంది నిపుణులు హైదరాబాద్కు వస్తు ండేవారు. అలా వచ్చిన ఆయన తన నైపుణ్యంతో వెంటనే పాలకులను ఆకట్టుకున్నాడు.పురానాపూల్ ...సరిగ్గా అది నగర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణం. అప్పటికే పురానాపూల్ వంతెన సిద్ధమవుతోంది. వెంటనే తన నైపుణ్యాన్ని దానిమీద ప్రయోగించారు. పర్షియన్ ఆర్కి టెక్చర్ నమూనాను చొప్పించి అప్పటికే ఉన్న డిజైన్ను మార్పించారు. ఇరాన్లో 13వ శతా బ్దంలో నిర్మించిన వంతెన డిజైన్తో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఇస్ఫహాన్లో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న వంతెనలు (కొన్ని పురాన్ పూల్ తర్వాత కట్టినవి) అచ్చు పురానాపూల్ వంతెనను స్ఫురిస్తాయి. -
ఆర్థిక రంగానికి లైఫ్ సైన్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగానికి లైఫ్ సైన్సెస్ వెన్నుదన్నుగా నిలవనుంది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రావడంతోపాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 190 యూనిట్లకు అనుమతులు మంజూరు చేశామని, తద్వారా రూ.73,360 కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. తద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది.అదీకాక.. 2026–30 మధ్య కాలంలో రూ. 2.35 లక్షల కోట్ల (25 బిలియన్ డాలర్లు) పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించింది. తద్వారా ఏకంగా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్ రంగానికి కీలకంగా ఉంది. మరిన్ని పెట్టుబడులు రావడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదం కానుందని సర్కార్ తెలిపింది. ఈ ఏడాది 1,457 కర్మాగారాలు రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కొత్తగా 1,457 తయారీ కర్మాగారాలకు అనుమతులు ఇచ్చారు. తద్వారా రూ. 7,388 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తద్వారా 36,919 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పరిశ్రమ ల అధిపతులు ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్లో పేర్కొన్నట్లు వెల్లడించింది. కొత్తగా తయారీ రంగంలో వస్తున్న ఈ కర్మాగారాలన్నీ కూడా మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే వస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామిక వాడల్లోని 2,198 ఎకరాల భూములను పరిశ్రమలకు టీజీఐఐసీ కేటాయించినట్లు తెలిపింది. ఈ భూముల్లో పెట్టుబడుల కింద రూ. 88,534 కోట్లు వచ్చాయని, తద్వారా 75,008 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని వివరించింది. తయారీ రంగంలో 13 లక్షల మంది కార్మికులు.. రాష్ట్రంలో తయారీ రంగంలోని 21,436 కర్మాగారాల్లో దాదాపు 13 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ) మొత్తం రూ. 16,48,613 కోట్లు కాగా.. ఇందులో తయారీ పరిశ్రమల రంగం వాటా రూ. 3,04,217 కోట్లుగా ఉంది. ఇందులో తయారీ రంగం వాటా రూ. 1,37,229 కోట్లు (45.1 శాతం), నిర్మాణరంగం రూ. 93,404 కోట్లు (30.7 శాతం), ఎలక్ట్రిసిటీ, యుటిలిటీస్ రంగం రూ. 37,692 కోట్లు (12.4 శాతం), మైనింగ్–క్వారీయింగ్ రూ. 35,892 కోట్లు (11.8 శాతం) గా ఉన్నట్లు వివరించింది. -
ఆధునిక ఇస్ఫహాన్.. మన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్–అమెరికాలు ఇరాన్ మీద దాడి ప్రారంభించినప్పటి కంటే ఓ నగరం మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు ‘హైదరాబాద్ నగరం’మనసు కలుక్కుమనే ఉంటుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసినప్పుడు మరింత ఆవేదనకు గురై ఉంటుంది. ఆ నగరమే ఇస్ఫహాన్. దాదా పు 3 వేల కి.మీ. దూరంలో ఉన్న ఆ నగరంపై బాంబులేస్తే హైదరాబాద్కు ఉలుకెందుకంటే... 22 ఆర్చి ద్వారాలతో అద్భుత శైలితో నిర్మితమైన పురానాపూల్, ఎత్తయిన నాలుగు మినార్లతో గంభీరంగా ఉండే చార్మినార్... షియా సంప్రదాయ కట్టడం బాద్షాహీ అషూర్ఖాన్... ఇవన్నీ ఆ ఇస్ఫహాన్ నగర ప్రభావంతో రూపొందినవే. వీటికి మూలం గోల్కొండ సామ్రాజ్య పేష్వాగా దశాబ్దాల పాటు కొనసాగిన మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ.ఆయన మాట ల్లో... ‘హైదరాబాద్ అంటే ఆధునిక ఇస్ఫ హాన్’. ఆయ నకు ఇస్ఫహాన్ అంటే మక్కువ ఎందుకంటే.. ఆయనది ఇస్ఫహానే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రా యెల్–అమెరికా దాడులతో ఆ నగరం అతలా కుతల మవుతోంది. పర్షియన్ సంస్కృతి సంప్రదా యాలు, నిర్మాణాలను నిలువెల్లా అద్దుకున్న ఆ దేశం నిలువునా వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్ విధ్వంసం సృష్టిస్తుందోనని అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. కానీ, ఆ దేశంలో మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్కు నష్టం జరిగిందని తెలిసి హైదరాబాద్ గుండె బరువెక్కింది. ఇస్ఫహా న్తో ప్రస్తుతం హైదరాబాద్కు వాణిజ్య సంబంధాలు పెద్దగా లేకున్నా, హైదరాబాద్ పుట్టుకలో ఆ నగర ప్రభావమే కీలకం కావటం విశేషం.కులీ కుతుబ్షా పాలనలో..కులీకుతుబ్షాహీ పాలకుల్లో ఐదోవాడిగా పట్టాభిషిక్తుడైన మహమ్మద్ కులీకుతుబ్షా పాలనలో హైదరాబాద్ నగర నిర్మాణం మొద లైంది. అప్పటి వరకు గోల్కొండ పట్టణం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం పాతనగరం ఉన్న ప్రాంతంలో కొన్ని ఊళ్లు మాత్రమే ఉండేది. నాలుగో రాజు ఇబ్రహీం కులీకుతుబ్షాహీ కాలంలోనే గోల్కొండ ఇరుకుగా మారటంతో మూసీకి ఆవల కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. ఇబ్ర హీం ఆదేశాలతోనే మూసీ దాటేందుకు వీలుగా వంతెన నిర్మాణం మొద లైంది. అప్పుడు నగరంలోకి ఓ వ్యక్తి కాలు మోపాడు.ఆయనే మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఈయన ఇరాన్ సఫావిద్ రాజ్య రాజధాని ఇస్ఫహాన్కు చెందిన ప్రముఖ పండితుడు. అక్కడి అస్తరాబాద్లో పుట్టినప్పటికీ, సఫా విద్ రాజకుమారుడు హైదర్కు ట్యూట ర్గా పనిచేసేవాడు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వైద్యం, ఆధ్యాత్మికం... ఇలా పలు అంశాల్లో నైపుణ్యం ఆయన సొంతం. అక్కడి రాజు మృతితో ఆయన హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడి కుతుబ్షాహీ పాలకులు పర్షియాకు చెందిన వారే కావటంతో అప్పటికే పర్షియాకు చెందిన ఎంతోమంది నిపుణులు హైదరాబాద్కు వస్తు ండేవారు. అలా వచ్చిన ఆయన తన నైపుణ్యంతో వెంటనే పాలకులను ఆకట్టుకున్నాడు.పురానాపూల్ ...సరిగ్గా అది నగర నిర్మాణానికి ఏర్పాట్లు జరు గుతున్న తరుణం. అప్పటికే పురానాపూల్ వంతెన సిద్ధమవుతోంది. వెంటనే తన నైపుణ్యాన్ని దానిమీద ప్రయోగించారు. పర్షియన్ ఆర్కి టెక్చర్ నమూనాను చొప్పించి అప్పటికే ఉన్న డిజైన్ను మార్పించారు. ఇరాన్లో 13వ శతా బ్దంలో నిర్మించిన వంతెన డిజైన్తో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఇస్ఫహాన్లో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న వంతెనలు (కొన్ని పురాన్ పూల్ తర్వాత కట్టినవి) అచ్చు పురానాపూల్ వంతెనను స్ఫురిస్తాయి.చార్మినార్..హైదరాబాద్ నగర సంతకం చార్మినార్ ప్రధాన డిజైన్ ఈయనదే. భారీ మినార్లతో కట్టడాలుండటం పర్షియన్ పద్ధతి. అక్కడి మసీదులకు ఎత్తయిన మినార్లు ఉంటాయి. వాటి మీదకు ఎక్కి ప్రార్థనలకు స్థానికులను గట్టిగా అరిచి పిలిచేవారు. ఇస్ఫహాన్లో 1316లో నిర్మించిన మినార్ ఏ జొంబన్ మసీదు నమూనాతో చార్మినార్కు డిజైన్ చేశారు. దానిలాగే ఆర్చి, అలాగే మినార్లు (మినార్ ఏ జొంబన్కు రెండే) డిజైన్ చేశారు.అప్పటికే ఆయన్ను పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించారు. 1590లో మొదలైన హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్ తరహాలో రూపొందించాలని నిర్ణయించి మొమిన్ తన మార్కు చూపించారు. అలా 40 ఏళ్లపాటు ఆయన పేష్వాగా కొనసాగారు. మళ్లీ ఇస్ఫహాన్కు వెళ్లకుండా ఇక్కడే ఉండి చనిపోయారు. ఆయన రూపొందించిన మీర్ మొమిన్ కా దాయరాలోనే ఆయన్ను ఖననం చేశారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ ఉంది. భారత సంప్రదాయాలను ధ్వంసం చేసి పర్షియా పద్ధతులను రుద్దినప్పటికీ, నగర నిర్మాణంలో ఆయన పాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చనిపోయే ముందు ఆయన రాసిన పుస్తకంలో హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్గా అభివర్ణించారు. అందుకే హైదరాబాద్ చరిత్రలో ఇస్ఫహాన్కు అంత ప్రాధాన్యం. యుద్ధంలో ఇస్ఫహాన్ దెబ్బతింటే హైదరాబాద్ మనసుకు గాయమైంది అందుకే. -
మూసీ పేరుతో కాంగ్రెస్ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు దోచుకుందని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో దోపిడీకి తెగబడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు ఆరోపించారు. దీనివల్ల చివరకు తెలంగాణ మూసేసే పరిస్థితికి చేరుతుందని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై ఆదివారం ఓ హోటల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో రాంచందర్రావు మాట్లాడుతూ పెన్షన్లకు, ఉద్యోగుల జీతాలకు, రైతు భరోసాకు, ప్రభుత్వాన్ని నడిపేందుకు పైసల్లేవంటూ నిత్యం మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. అప్పు చేసి సొమ్ము తీసుకొచ్చి, ఆ అప్పు భారాన్ని సామాన్యులపై వేస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు.55 కి.మీ. మూసీ సుందరీకరణకు ముందుగా రూ. 5 వేల కోట్లు వ్యయం అవుతుందని చెప్పి తీరా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ప్రజెంటేషన్ రోజున రూ. 7 వేల కోట్లు అవుతుందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని వృథా చేసే పనులను బీజేపీ అడ్డుకుంటుందని రాంచందర్రావు చెప్పారు. డీపీఆర్ ప్రకటన రోజున 10 వేల ఇళ్లు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని సీఎం వివరించారని.. కానీ అసెంబ్లీలో మాత్రం కేవలం 1,400 ఇళ్లను కూల్చాల్సి వస్తుందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కూల్చడం, నాశనం చేయడమే కాంగ్రెస్ డీఎన్ఏ అని దుయ్యబట్టారు.50 మీటర్ల వరకూ మూసీ బఫర్ అని నిర్ధారించిన ప్రభుత్వానికి.. నార్సింగి వద్ద మూసీలోనే కడుతున్న బహుళ అంతస్తుల భవనం కనిపించడం లేదా అంటూ విమర్శించారు. పేదల ఇళ్లు, స్థలాలను బలవంతంగా లాక్కొని, వాటి మీద గాంధీ విగ్రహం పెడతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పేదలకు ముందుగా పునరావాసం కల్పించాకే మూసీ ప్రక్షాళనకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. అనంతరం మహారాష్ట్ర వాటర్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ అడ్వైజర్ శ్రీరాం వెదిరె పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూసీ పునరుజ్జీవంపై ప్రసంగించారు. -
అవగాహనలేమితో తెలంగాణ పరువు తీస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరులో 1972 నుంచి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం హరీశ్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నల్లమల సరిహద్దులు, కృష్ణా–గోదావరి జలాలు, సుంకేశుల ప్రాజెక్టుల మీదే కాదు..కళ్ల ముందున్న సంస్థలపై కూడా సీఎంకు కనీస అవగాహన లేదు. ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం తెలంగాణ పరువు తీస్తున్నాడు.ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు..ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ’అని హరీశ్రావు స్పష్టం చేశారు. దీని ఏర్పాటులో ఎఫ్ఏఓ, యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని, ప్రారంభంలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక అని వివరించారు. ‘దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం.ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని హితవు పలికారు. -
ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలోనూ ఆర్యవైశ్యుల భాగస్వామ్యం కీల కమైందన్నారు. ఇటీవల ఆర్యవైశ్యులకు 6 మున్సిపల్ చైర్మన్ పదవులతోపాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడి యం వేదికగా శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవాన్ని ఆది వారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘అవకాశాలు వచ్చినా రాకు న్నా.. ఆర్యవైశ్యులు క్రమశిక్షణతో ఉంటారు.నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. ఆయనతో వాదించడం, ప్రశ్నించడం గౌరవంగా ఉండేది. ఆర్యవైశ్యులు వారి హక్కులను కూడా శాంతియుత పద్ధతి లోనే తెలిపే ప్రయత్నం చేస్తారు. ఊరిలో ఒక్క ఆర్యవై శ్యు డున్నా.. ఊరంతా ఆయన చేతిలోనే ఉంటుంది. వ్యవసాయ కూలీలకు, రైతులకు, నమ్మకంతో అప్పులు ఇచ్చి తిరిగి తీసుకుంటారు’ అని చెప్పారు.ఈ సందర్భంగా వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత సీఎంను కోరగా.. శాసన సభ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, ఏపీ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే సూర్య నారా యణ, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది పీఠాధిపతులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సామూహిక పారాయణం.. గిన్నిస్ రికార్డుఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో భాగంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కవి చింత శ్రీనివాస్ రచించి, స్వరకర్త శ్రీ జోశ్యభట్ల స్వరపరిచిన 102 చరణాల వాసవీ పారాయణాన్ని గాయని కల్పన పాడగా.. 21 వేల మంది (ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిపి 30 వేల మంది) వైశ్యులు సామూహికంగా పారాయణం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కాగా, 28 అడుగుల భారీ అమ్మవారి విగ్రహం వద్ద 16 మంది పీఠాధిపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. -
ప్రభుత్వాలు లేకున్నా పార్టీ ఉంటుంది
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుంది..కార్యకర్తలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వాలు ఉండవు.. పార్టీయే శాశ్వతం.. ఎందరో ప్రాణ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ కాంగ్రెస్.. ఇది ప్రజల పార్టీ.. పార్టీ కోసం మనం కష్టపడితే ఫలితాలు దక్కుతాయి’అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహేశ్గౌడ్ మాట్లాడారు.ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ గెలవదని, ఏదైనా పోటీ ఉంటుందంటే అది బీజేపీతోనే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని, డీలిమిటేషన్ చేస్తే 140 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఏప్రిల్ చివరి లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ చైర్మన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీకనీకి వచ్చిండ్రా.. కార్యకర్తలపై ఎంపీ చామల ఫైర్భువనగిరి ఎంపీ చామల కాంగ్రెస్ పార్టీ కేడ ర్పై సీరియస్ అయ్యారు. సభలో ఎంపీ మా ట్లాడుతున్న సమయంలో కొందరు కార్యక ర్తలు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆగ్ర హించిన ఎంపీ ఏయ్ మాట్లాడకండయ్యా. మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లా డుకోండి.. ఇక్కడ సీరియస్గా మాట్లాడు తుంటే పీకనీకి వచ్చిండ్రా ఈడ అని అన్నా రు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. -
యాసంగి రైతులకు భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్లో ఆర్థిక ఊరట కల్పించే రైతు భరోసా పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు నిధులను విడుదల చేశారు. సోమవారం ప్రతి రైతుకు రూ.6 వేల సాయం (ఒక ఎకరానికి) అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 68,89,955 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తం 57.44 లక్షల ఎకరాలకు గాను రూ.3,446.94 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.రాష్ట్రంలో సాగు చేసే రైతులందరికీ ఎన్ని ఎకరాలున్నాయనే దానితో నిమిత్తం లేకుండా ఒక్క ఎకరం లోపు భూమికి మాత్రమే ఈ తొలి విడతలో సాయం జమ అవుతుంది. రెండు, మూడు విడతల్లో మిగతా భూమి ఎంత ఉంటే అంతకు రైతు భరోసా సాయం అందజేస్తారు. ఈ సీజన్లో రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో మొత్తం రూ.9 వేల కోట్లు 45 రోజుల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగ పడేలా నిధులు అందడం వల్ల రైతులకు కొంత ఊరట లభించనుంది. -
రియల్ ఎస్టేట్కు రిలీఫ్!
సాక్షి, హైదరాబాద్: టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులతో ఫలితం కనిపించకపోవడంతో కీలక సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్–2012 నిబంధనలను కొంతమేర సరళీకరించింది. స్టేక్ హోల్డర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సాధారణ రియల్టర్లకు ఉపశమనం ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్ జీఓ నంబరు 95 జారీ చేశారు. హైరైజ్ భవనమంటే...ఇక నుంచి 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తు గల భవనాలను మాత్రమే హైరైజ్ భవనాలుగా పరిగణిస్తారు. అయితే పారిశ్రామిక భవనాల్లోని చిమ్నీలు, కూలింగ్ టవర్లు, ఇతర భవనాల్లోని వాటర్ ట్యాంకులు, ఆర్కిటెక్చరల్ డిజైన్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు. ఇప్పటి వరకు 18 మీటర్ల ఎత్తు, అంతకంటే ఎక్కువ ఉంటే హైరైజ్గా పరిగణించేవారు. » 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలను నిర్మించాలంటే టీడీఆర్ వినియోగించడం తప్పనిసరి. పార్కింగ్, ఇతరత్రా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. » హైరైజ్ భవనాల్లో టీడీఆర్ వినియోగంతో 10 శాతం వరకు సెట్బ్యాక్స్లో మినహాయింపు పొందొచ్చు. అయితే అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్బ్యాక్ తప్పనిసరి. నాన్–హైరైజ్ భవనాలకు కూడా కనీస సెట్బ్యాక్లు పాటిస్తూ టీడీఆర్ ద్వారా రాయితీ పొందొచ్చు. » మాస్టర్ ప్లాన్ రోడ్లలో మార్పులు చేసినా, తగ్గించినా, తొలగించినా, దరఖాస్తుదారులు అభివృద్ధి/కన్వర్షన్ చార్జీలు చెల్లించాలి. లేదా చార్జీలకు సమానమైన టీడీఆర్ను సమర్పించొచ్చు. టీడీఆర్ వినియోగంతో 2,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తులకు అనుమతి ఇస్తారు.40 అడుగుల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు60 అడుగుల రోడ్డు: 4 అదనపు అంతస్తుల వరకు80 అడుగుల రోడ్డు: 5 అదనపు అంతస్తుల వరకు » ఫైర్, ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు.గత జనవరిలో జారీ చేసిన జీఓకు చేసిన సవరణల మేరకు..10 నుంచి 20 అంతస్తుల లోపు హైరైజ్ భవనాల్లో 10 అంతస్తులపైన ఉన్న మొత్తం బిల్టప్ ఏరియాలో 3% టీడీఆర్ వినియోగం తప్పనిసరి. 20 అంతస్తులకు పైబడిన భవనాలకు 20 అంతస్తుల పైన ఉన్న ఏరియాలో 5% టీడీఆర్ తప్పనిసరి. నిర్మాణ అనుమతి సమయంలో 50% టీడీఆర్, మిగిలిన 50% టీడీఆర్ను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీకి ముందు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, గెజిట్లో ప్రచురించాలని పేర్కొన్నారు. » గత జనవరిలో జారీ చేసిన జీఓ మేరకు ‘క్యూర్’ పరిధిలో పది అంతస్తులు దాటిన హైరైజ్ భవనాల్లో 11వ అంతస్తు నుంచి అన్ని అంతస్తులకు బిల్టప్ ఏరియాలో 10 శాతం టీడీఆర్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అనుమతి పొందే సమయంలోనే మొత్తం టీడీఆర్ ఇవాల్సి ఉంటుంది. ప్రస్తుత సవరణలతో అనుమతి సమయంలో 50 శాతం టీడీఆర్, భవన నిర్మాణం పూర్తయ్యాక ఓసీ జారీ సమయంలో మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పిస్తే సరిపోతుంది. ఇది సాధారణ రియల్టర్లకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. -
పొంతన లేని సమాధానాలు!
మొయినాబాద్: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. శంషాబాద్ పోలీస్స్టేషన్లో ఆరో రోజు ఆదివారం సిట్ విచారణ జరిగింది. స్టేషన్ బెయిల్ పొందిన వారిలో ఏడుగురు నిందితులు విచారణకు హాజరయ్యారు. వారిని వేర్వేరుగా విచారించారు. విచారణలో కొందరు నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారిని పదేపదే విచారించి అసలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా, పెడ్లర్లపై దృష్టి సారించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని తమ్ముడు రితేష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటకొస్తాయని.. కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు వెళ్తుందని పోలీసులు భావిస్తున్నారు.కస్టడీ పిటిషన్పై నేడు తీర్పుడ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు పైలెట్ రోహిత్రెడ్డి, రితేష్రెడ్డి, నమిత్శర్మ కస్టడీ పిటిషన్పై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది. -
టీపీసీసీ త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్ కుమార్గౌడ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ప్రకటించిన డీసీసీ కార్యవర్గాలతో సమావేశాలు నిర్వహించడమే ప్రధాన ఎజెండాగా సాగనున్న ఈ పర్యటనలో ఆయన త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రచారమే లక్ష్యంగా ఈ పర్యటనలు జరుగుతాయని తెలిపాయి. ఈ మేరకు ఆదివారం భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన బుధవారం మెదక్ వెళ్లను న్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడనుంది. తొలి విడతలో 14 జిల్లాలురాష్ట్రంలోని 14 జిల్లాలకు ఇటీవల డీసీసీ కార్యవర్గాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా ఆ 14 జిల్లాల్లో పర్యటించాలని మహేశ్గౌడ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి డీసీసీలకు వివరిస్తారు. పార్టీ, ప్రభుత్వ ఆలోచనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీపై విశ్వాసం కలిగించేలా చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయను న్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతరాలు, అనుబంధ సంఘాల బలోపేతం తదితర అంశాలపై చర్చిస్తారని, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత సమన్వయ కమిటీ భేటీకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాగా, రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఇటీవల ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసేందుకు 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ కమిటీ భేటీ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, నామినేటెడ్ పదవులు, పార్టీ, అనుబంధ సంఘాల బలోపేతం తదితర అంశాలపై ఈ కమిటీ చర్చిస్తుందని, కమిటీ అభిప్రాయాలను ఏఐసీసీకి వెల్లడించి ఢిల్లీ పెద్దల అనుమతి మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని సమాచారం. -
భార్యను హత్య చేసి.. బైక్పై తీసుకొచ్చి..
షాద్నగర్ రూరల్: కట్టుకున్న భార్యను అంతమొందించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బైక్పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసివెళ్లాడు. అంతేకాక రెండేళ్ల తమ కూతురును తల్లి మృతదేహం వద్ద వదిలివెళ్లాడు. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి పదేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి మహేందర్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శోభారాణి కోయిలకొండకే చెందిన నర్సింహులును రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కూతురు మమత ఉంది. మహేందర్ కూడా తల్లితోపాటే ఉంటున్నాడు. కాగా, నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శోభారాణి ఆరునెలల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. సైకిల్ కొనిస్తానని చెప్పి.. భార్యతో మాట్లాడేందుకు నర్సింహులు రెండు రోజుల క్రితం రంగారెడ్డిగూడకు వచ్చాడు. శనివారం కుమారుడు మహేందర్కు సైకిల్ కొనిద్దామని చెప్పి శోభారాణిని మహబూబ్నగర్కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో నర్సింహులు భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కూతురు మమతను బైక్పై ముందు కూర్చోబెట్టుకొని, భార్య మృతదేహాన్ని వెనకాల కట్టేసి, రంగారెడ్డిగూడ శివారులోకి తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేశాడు. కూతురును అక్కడే వదిలేసి పరారయ్యాడు.కాగా తల్లి హత్యకు గురైందని తెలియని ఆ చిన్నారి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తుండగా, ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
పప్పుధాన్యాలు తగ్గుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగం కొన్నేళ్లుగా స్థిరమైన పురోగతిని నమోదు చేస్తున్నప్పటికీ, పంటల వైవిధ్యంలో వెనుకబడిపోతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ.. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ మినహా ఇతర పంటల సాగులో వెనుకబడిపోతున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గత మూడేళ్లలో వివిధ పంటల సాగు తీరుతెన్నులను ఈ సర్వే కళ్లకు కట్టింది. పంటల మార్పిడి విషయంలో రైతులు మేల్కొనకపోతే రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కనుమరుగయ్యే పరిస్థితి రానుంది. 2023–24లో 207.95 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2024–25 కల్లా 232.10 లక్షల టన్నులకు పెరిగింది. 2025–26 నాటికి ఇది 236.87 లక్షల టన్నులకు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగా చెబుతున్నా, రైతుల ఆలోచనలో మార్పు రావడం లేదు. ఇతర పంటలకు కోతులు, అడవి పందుల బెడద ఉండటం, దిగుబడిపై ఉన్న అనుమానాలను వ్యవసాయ అధికారులు నివృత్తి చేయకపోవడంతో రైతులు కొంతకాలంగా అలవాటైన పత్తి, వరి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రైతుల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఇతర పంటలు సాగు చేసే రైతులకు బోనస్ ఇవ్వాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్లో పంటల బోనస్ కోసం రూ. 3,500 కోట్లు కేటాయించింది. ఇప్పుడు సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ను పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలకూ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇదే విషయాన్ని నర్మెటలో ఆదివారం జరిగిన సభలో రేవంత్రెడ్డి చెబుతూ, పంటల వైవిధ్యం పెంచడానికి ఏంచేయాలనే అంశంపై నిర్ణయానికి రావాలని మంత్రి తుమ్మలకు సూచించారు. పప్పుధాన్యాల్లో తగ్గిన స్థిరత్వం రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్థిరత్వం తగ్గింది. హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2023–24లో 3.61 లక్షల టన్నులుగా ఉన్న పప్పు ధాన్యాల ఉత్పత్తి 2024–25లో 3.99 లక్షల టన్నులకు పెరిగినప్పటికీ, 2025–26లో ఇది 3.48 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉందని అంచనా. పెసర, కంది, శనగలు, మినుముల ఉత్పత్తి పడిపోతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లభ్యత పెరగడంతో గతంలో పప్పుధాన్యాలు సాగు చేసిన భూముల్లోనూ వరి, పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించే విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి స్థిరత్వం–మార్పు రాష్ట్రంలో పంటల ఎంపికలో స్థిరత్వం, మార్పు అనే రెండు ధోరణులను ఒకేసారి చూపిస్తోంది. ముఖ్యంగా వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ఆధిపత్యం కొనసాగుతుండగా, మొక్కజొన్న వంటి పంటలు క్రమంగా విస్తరిస్తున్నాయి. సోయాబీన్, కందిపప్పు వంటి పంటలు తగ్గుదల చూపుతున్నాయి. యాసంగిలో జొన్న కొంత పెరుగుదల చూపుతుండగా, శనగ, వేరుశనగ తగ్గుతూ ఉన్నాయి. మొక్కజొన్న పంట 9.8 శాతం నుంచి 13 శాతం వరకు పెరగడం రైతుల్లో మార్పు సంకేతంగా కనిపిస్తోంది. -
25న రాజీనామా చేస్తున్నా..
జగిత్యాల టౌన్: పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకే కాంగ్రెస్ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారని, అయితే సంయమనంతో ఎలాంటి ఉపయోగమూ లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డానని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్రెడ్డి కూడా ఒక కారణమన్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదా?రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి ఏకైక సభ్యుడిగా తానూ అంతేస్థాయిలో పోరాటం చేశానని జీవన్రెడ్డి చెప్పారు. వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే అర్హత లేదా..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి మండలి సభ్యుడిగా తనకు 20 నెలల కాలం మిగిలి ఉందని గుర్తు చేశారు. నేను ఒక్కసారి చెబితే..!జీవన్రెడ్డి, రజినీకాంత్తో పోస్టర్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మాది పీపుల్స్ బడ్జెట్
ఖమ్మం మయూరి సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో పొందుపరిచినవి కేవలం అంకెలు కావని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక నమ్మకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమది పీపుల్స్ బడ్జెట్ అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో పుట్టడం మా అదృష్టం’అని ప్రతి పౌరుడూ గర్వపడేలా తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. కులమతాలు, ప్రాంతాల భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశామని.. జీవిత బీమా పథకం కింద రూ. 5 లక్షలు చెల్లిస్తామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు క్యాలెండర్ను ఏర్పాటు చేశామని.. నిర్మాణ దశను బట్టి వారానికోసారి బిల్లు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది అదనంగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మరో లక్ష ఇళ్లను మంజూరు చేయాలని యోచిస్తున్నామని భట్టి చెప్పారు. విద్యార్థులే రేపటి సంపద.. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మే తమ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు పౌష్టికాహారం అందిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు వారంలో రెండు రోజులు పాలు, రెండు రోజులు రాగి జావ అందిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట.. రాష్ట్రంలో 68,89,955 మంది పట్టాదారులకు రైతుభరోసా కింద రూ. 3,446.94 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాబోయే 45 రోజుల్లో మూడు విడతల్లో ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని స్పష్టం చేశారు. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు రెండు సీజన్లలో కలిపి బోనస్ అందించామన్నారు. ఈ సందర్భంగా తాజా బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల గురించి భట్టి వివరించారు. సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
సాయమింతేనా ‘సఖి’!
సాక్షి, హైదరాబాద్: మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ–సఖి)ల పర్యవేక్షణ గాడి తప్పింది. ఈ కేంద్రాల్లో నమోదయ్యే కేసుల సంఖ్యను క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సమర్పిస్తున్నప్పటికీ వాటి విశ్లేషణ, సేవల విస్తరణపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. కేసుల పరిష్కార చర్యల్లో భాగంగా సఖి కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే అందుకు తగిన న్యాయసహాయంతోపాటు వారి సమస్యలను ఆలకించే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా సఖి కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి కేంద్రంలో 13 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా చాలాచోట్ల కేస్ వర్కర్, కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్లు లేరు. దీంతో బాధితులకు న్యాయ సహాయం అందడం కష్టంగా మారింది. సఖి కేంద్రాల్లో ఖాళీల వివరాలను కేంద్రాలవారీగా సేకరించినప్పటికీ వాటి భర్తీకి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేయడంలేదు. దీనిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లోని జాయింట్ డైరెక్టర్ను సంప్రదించగా ఆమె స్పందించలేదు. నాలుగు రెట్లు పెరిగిన లైంగిక వేధింపులు.. రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక దాడులు మొదలు మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింస పెరుగుతున్నాయి. రెండేళ్లుగా సఖి కేంద్రాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. సఖి కేంద్రాలను ఆశ్రయిస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది లైంగిక వేధింపులకు గురైన వారే ఉంటున్నారు. 2024–25లో లైంగిక దాడులు, వేధింపులకు గురైనవారు 55 మంది సఖి కేంద్రాలకు వస్తే 2025–26లో జనవరి నాటికే 243 మంది ఆశ్రయించారు. మరోవైపు ఇదే కాలానికి అత్యాచార బాధితుల సంఖ్య 64 నుంచి 74కు (15.6 శాతం) పెరిగింది. అలాగే చిన్నారులపై లైంగిక దాడుల కేసులు 2024–25లో మొత్తం 553 కేసులు నమోదవగా 2025–26 జనవరి నాటికి వాటి సంఖ్య 613కు పెరిగింది. మునుపటి ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 10.8 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బాల్య వివాహ కేసులు 348 నమోదవగా ఈసారి ఆ సంఖ్య 382కు పెరిగింది. ఈ కేసుల నమోదు గతేడాదితో పోలిస్తే 9.8 శాతం పెరిగినట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరకట్న వేధింపులు, తద్వారా జరిగిన మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఈ విభాగంలో 2024–25లో 473 కేసులు నమోదైతే 2025–26 జనవరి నాటికి ఈ కేసుల సంఖ్య 594కు పెరిగింది. మునుపటి ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 25.6 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.గృహహింస కేటగిరీలో కేసుల సంఖ్య ఒకే విధంగా ఉంది. గతేడాది 6,907 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నాటికి 6,173 కేసులు నమోదయ్యాయి. అయితే మహిళల అక్రమ రవాణా కేసులు కాస్త తగ్గగా మిస్సింగ్, కిడ్నాప్ కేసులు గతంలో నమోదైన తరహాలోనే ఉన్నాయి. సైబర్ క్రైం, చీటింగ్, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసులు కూడా పెద్దగా పెరగలేదు. -
‘పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు’
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్కు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే ఉంటుందని విమర్శించారు. లక్షన్నర కోట్ల రూపాయిలతో కేసీఆర్ కాళేశ్వరం అంటే,.. ఇప్పుడు రేవంత్ మూసేశ్వరం అంటున్నారని సెటైర్లు వేశారు.ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో మూసీ పునరుజ్జీవం-వాస్తవాలు అంశంపై రాంచందర్ రావు అధ్యక్షతను చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే నిధులు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి మూసీ ప్రక్షాళనకు ినిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అని ప్రశ్నించారు. -
బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. ఇవాళ ఉదయం వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్న సీఎం రమేష్ హడావుడి చేశారు.2006లో శివనారాయణ అనే వ్యక్తి.. సర్వే నెంబర్ 129/1లో ప్లాట్ నంబర్లు 29,30ల్లో భూమి కొనుగోలు చేశారు. ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో సీఎం రమేష్ కబ్జాకు యత్నించినట్లు సమాచారు. తన భూమిని సీఎం రమేష్ కబ్జాకు యత్నించారని శివనారాయణ ఆరోపిస్తున్నారు. మా భూమిలోకి ఎవరూ రావొద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. 2006 నుంచి సీఎం రమేష్ ఇబ్బందిపెడుతున్నారు’’ అని శివనారాయణరెడ్డి తెలిపారు. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పంచాయతీ చేరింది. -
తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేస్తూ టీడీఆర్ (Transferable Development Rights) వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.తెలంగాణలో నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ - 2012'కు కీలక సవరణలు చేస్తూ G.O.Ms.No.95ను విడుదల చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పేరుతో వెలువడిన ఈ జీవోలో టీడీఆర్ వినియోగం, హై-రైజ్ భవనాల గుర్తింపు, సెట్బ్యాక్ సడలింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.కొత్త ఆదేశాలు ఇలా.. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై-రైజ్గా గుర్తింపు( పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు, ఇతర నిర్మాణ ఫీచర్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు).750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో TDR ద్వారా ఎత్తు పెంపు అనుమతి.నాన్ హై-రైజ్ భవనాలకు సెట్బ్యాక్ సడలింపు అవకాశం.హై-రైజ్ భవనాల్లో 10% వరకు సెట్బ్యాక్ రిలాక్సేషన్కు అనుమతి.మాస్టర్ ప్లాన్ రోడ్లు మారితే TDR లేదా ఛార్జీలు చెల్లించే ఎంపిక.2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతి.40 ఫీట్ల రోడ్డుపై 3 అంతస్తులు అదనంగా నిర్మాణం.60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు అదనంగా అనుమతి80 ఫీట్ల రోడ్డుపై 5 అంతస్తులు వరకు అవకాశం.10 నుంచి 20 అంతస్తుల హై-రైజ్లో 3% TDR తప్పనిసరి20 అంతస్తులపై భవనాలకు 5% TDR తప్పనిసరిబిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50% TDR సమర్పణOC (Occupancy Certificate) ముందు మిగతా 50% సమర్పణ తప్పనిసరి -
సిట్కు చిక్కిన డ్రగ్ పెడ్లర్
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు సిట్ అధికారులకు చిక్కాడు. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి డ్రైవర్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, డ్రగ్ పెడ్లర్ అభిషేక్సింగ్ను శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కోసం డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. ఇతని ద్వారా డ్రగ్స్ మూలాలను గుర్తించడంపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి బృందం సుమారు 24 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. లింక్లపై ఆరా.. అభిషేక్సింగ్ పోలీసులకు చిక్కడంతో అతని నుంచి డ్రగ్స్ ఎవరెవరు, ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారనే కోణంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇతనితో కొనుగోలుదారులు జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ చాటింగ్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేయగా.. రోహిత్రెడ్డి, రితేశ్రెడ్డి, నమిత్శర్మ జైలుకు వెళ్లారు. మిగతా వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్తో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరైంది. మహేశ్కుమార్ మినహా.. మిగిలిన వారంతా ఐదు రోజులుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరవుతున్నారు. కేసు దర్యాప్తుపై ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్బాబు ఎప్పటికప్పుడు కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆయన నిందితులను నేరుగా విచారించి పలు విషయాలు తెలుసుకుంటున్నారు. రిమాండ్లో ఉన్న ముగ్గురిని కస్టడీకి తీసుకుంటే ఈ కేసులో పురోగతి సాధించవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. కస్టడీ పిటిషన్పై తీర్పు సోమవారం వెలువడే అవకాశం ఉందని చెపుతున్నారు. పోలీస్ పహారాలో ఫామ్హౌస్.. వివాదాలకు కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఈ నెల 14న ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. డ్రగ్స్ పార్టీని భగ్నం చేసేందుకు ఈగల్ టీం, స్థానిక పోలీసులు వెళ్లడంతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. పార్టీలో పాల్గొన్న నిందితులకు చెందిన ఆరు లగ్జరీ కార్లు ఫామ్హౌస్లోనే ఉన్నాయి. ఆ రోజు నుంచి పోలీసులు ఫామ్హౌస్లో పహారా కాస్తూ.. బయటి వ్యక్తులను లోనికి రానివ్వడంలేదు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న ఫామ్హౌస్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూ రికార్డులను పరిశీలించిన అధికారులు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అనుమతులు లేకుండా రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సిటీ మెట్రో డీలక్స్, ఏసీ బస్సు చార్జీల తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు చార్జీలను ఆర్టీసీ తగ్గించింది. టికెట్ ధరలను సవరించనప్పటికీ, డిస్కౌంట్ పేరుతో ప్రస్తుతానికి తగ్గించింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉండే చార్జీలతో సమం చేసింది. మూడు నెలల పాటు దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. చార్జీల తగ్గింపు నేపథ్యంలో ఈ మూడు నెలల పాటు ఆ బస్సులకు ఆదరణ పెరిగితే, ఇవే చార్జీలను కొనసాగించటంతోపాటు ఆ కేటగిరీ బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. పురుషులకు సీట్ల కొరత.. ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ (పల్లె వెలుగు కూడా), మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు మొదలైనప్పటి నుంచి ఆ రెండు కేటగిరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇతర కేటగిరీ బస్సుల్లో వెళ్లే చాలామంది మహిళలు, అలాగే ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించే మహిళలు ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా ఆ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) వంద శాతాన్ని దాటింది. ముందు వైపు ఉండే మహిళల సీట్లు నిండిపోయి, వెనకవైపు సీట్లలో కూడా మహిళా ప్రయాణికులు కూర్చుంటున్నారు. ఫలితంగా పురుషులకు సీట్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీనిపై పురుష ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో, మెట్రో డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ సర్వీసును ఆర్టీసీ మొదలుపెట్టింది. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు లేనందున ఎక్కువ సీట్లు పురుష ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇది డీలక్స్ కేటగిరీ సర్వీసు కావటంతో టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదుకాలేదు. దీనిపై ఇటీవల అధికారులు సర్వే చేసి కారణాలను విశ్లేషించారు. టికెట్ ధర ఎక్కువగా ఉందన్న మాట చాలా మంది నుంచి వినిపించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తమకు సీట్లు దొరకటం లేదని, వాటిని వదిలి ఎక్కువ టికెట్ ఖర్చుతో డీలక్స్ బస్సులో వెళ్లటం ఏం న్యాయమని కొందరు ప్రశ్నించారు. దీంతో డీలక్స్ బస్సుల టికెట్ ధరను కొంత తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే, టికెట్ ధరలను సవరించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తిరిగి పెంచితే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థ తన అధికారాన్ని ఉపయోగించి డిస్కౌంట్ను ప్రకటించింది. మార్చి నుంచి మే వరకు ఇది అమలులో ఉంటుంది. ప్రస్తుతం సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉన్న టికెట్ చార్జీలనే వీటిల్లో అమలు చేస్తున్నారు. పనిలోపనిగా, నగరంలో తిరుగుతున్న మెట్రో లగ్జరీ(ఎయిర్పోర్టుకు తిరిగే పుష్పక్ కాకుండా) ఏసీ బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్ చార్జీలనే అమలు చేయనున్నారు. ఈ మూడు నెలల పాటు పరిశీలించి, ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే కొంతకాలం పాటు అవే చార్జీలను కొనసాగించటంతోపాటు, ఆ బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
ట్రిపుల్ ఆర్...ఇక జస్ట్ హైవేనే!
సాక్షి, హైదరాబాద్: ‘ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)ను మించిన అద్భుత ఎక్స్ప్రెస్ వేగా రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) రాబోతోంది, అది తెలంగాణకు గేమ్ ఛేంజర్ కాబోతోంది..’అంటూ ఊరించిన కేంద్రం చివరకు ఉసూరుమనిపించింది. ఓఆర్ఆర్తో పోలిస్తే ట్రిపుల్ ఆర్ దిగదుడుపుగానే ఉండనుంది. నిర్మాణ వ్యయానికి జడిసి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతో సరిపెట్టుకుని నిర్మించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే దానికి ఎక్స్ప్రెస్వే హోదా ఉండదు. ఫలితంగా ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ముందే చాలా ప్రత్యేకతలను కోల్పోయింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణ వ్యయం ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు రూ.38 వేల కోట్లను మించేలా ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించటం సరికాదని తేల్చిన అధికారులు, వీలైనంత మేర నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని గత రెండు నెలలుగా ఢిల్లీలో కసరత్తు చేపట్టారు. విడతల వారీగా ప్రత్యేకతలు తగ్గిస్తూ, బడ్జెట్లో కోత పెడుతూ అంచనా వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 8 వరుసలకు బదులు 6 వరుసలకు కుదించారు. సర్వీసు రోడ్డు స్థానంలో సాధారణ యాక్సెస్ పాత్ తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని కూడా తొలగించారు. స్ట్రీట్ లైటింగ్ను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. అండర్ పాస్ల సంఖ్యను సగానికి తగ్గించేశారు. తాజాగా మరోసారి సమీక్షించిన అధికారులు ఇప్పుడు ఏకంగా ఎక్స్ప్రెస్వే హోదా తొలగించేశారు. దీంతో ట్రిపుల్ ఆర్ మరిన్ని ప్రత్యేకతలు కోల్పోనుంది. ఓఆర్ఆర్ ముందు వెలవెల పోనుంది. ఓఆర్ఆర్ మీద వాహనాలు గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తుండగా, ట్రిపుల్ ఆర్పై వేగం 100 ఉండనుంది. మొత్తం మీద ఈ కోతల వల్ల అంచనా వ్యయం 25 శాతం మేర తగ్గుతుందని భావిస్తున్నారు.ట్రిపుల్ ఆర్ ప్రతిపాదనలు తొలుత ఎలా... ఇప్పుడెలా?తొలుత: దేశంలోనే తొలి అతి పొడవైన ఎక్స్ప్రెస్వే రింగురోడ్డు. దాదాపు 362 కి.మీ. నిడివితో ఓ నగరానికి రింగు రోడ్డుగా ఉండటం దేశ రోడ్ నెట్వర్క్లో ఓ రికార్డు. ఇప్పుడు: నిడివిలో మార్పు లేనప్పటికీ, ఎక్స్ప్రెస్ వేకు ఉండే ప్రత్యేకతల్లో భారీగా కోత పెట్టి సాధారణ హైవేగా మార్చేశారు. తొలుత: దేశంలోనే 8 లేన్లతో కూడిన అతి పొడవైన రింగురోడ్డుగా దీన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్ ఔటర్ కూడా 8 వరుసలతో ఉండగా, దానికి రెట్టింపు నిడివితో ట్రిపుల్ ఆర్ను ప్రతిపాదించారు. ఇప్పుడు: 8 వరుసల ఆలోచనను విరమించుకున్నారు. మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయని, 8 వరుసలు వృథా వ్యయమంటూ 6 వరుసలకు కుదించేశారు. తొలుత: సాధారణంగా ఎక్స్ప్రెస్వే/జాతీయ రహదారులపై పట్టణాలు, గ్రామాలు ఉన్న చోటనే లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవునా దీపాలు ఏర్పాటు చేసిన తరహాలోనే ట్రిపుల్ ఆర్ పొడవునా ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ప్రతిపాదించారు. ఇప్పుడు: అంత నిడివితో ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కేవలం జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.తొలుత: 162 కి.మీ. నిడివితో ఉత్తర భాగంలోనే మొత్తం 204 వంతెనలు నిర్మించాలని భావించారు. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్ఛేంజ్ వంతెనలు, మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరా నది మీద పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రానది మీద తూప్రాన్ వద్ద 3 పెద్ద వంతెనలు, వాగులు వంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాల్వలు, నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులు ప్రతిపాదించారు. ఇప్పుడు: వంతెనల వ్యయం భారీగా ఉండటంతో పొదుపు చర్యలు ప్రధానంగా ఇక్కడే చేపట్టారు. వంతెనల సంఖ్యను సగానికి సగం కుదించనున్నారు. దీంతో కొన్ని చిన్న దారుల వద్ద రోడ్డును దాటే వీలుండదు. ముందుకో, వెనక్కో వెళ్లి యూ టర్న్ తీసుకుకోవాల్సి ఉంటుంది. తొలుత: ఓఆర్ఆర్ తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా సర్వీసు రోడ్డును ప్రతిపాదించారు. తర్వాత ఆ ఆలోచన విరమించుకుని సాధారణ యాక్సెస్ పాత్ను ఖాయం చేశారు. అంటే ఫుట్పాత్ లాంటివి లేని ఓ కచ్చా రోడ్డు అన్నమాట. ఇప్పుడు: కచ్చా రోడ్డుతో కూడిన యాక్సెస్ పాత్ను సైతం విరమించుకున్నారు. పెద్ద చెరువు కట్ట తరహాలో ఉండే ఈ ప్రధాన క్యారేజ్ వే దిగువన ఎలాంటి రోడ్డు ఉండదు. వట్టి ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. దానిపైనే వాహనాలు రాకపోకలు సాగించాలి. తొలుత: 8 వరసల రోడ్డు, ఎక్స్ప్రెస్ ప్రమాణాలతో నిర్మాణం, వాహనాల వేగ పరిమితి 120 కి.మీ.కుపైగా అయినందున రోడ్డు ఎంబ్యాంక్మెంట్(రోడ్డు కట్ట) 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించేలా డిజైన్ చేశారు. అప్పుడు రోడ్డు ఉపరితలంలో నిలువు వాలు 1,300 మీటర్ల ముందే ప్రారంభం అయ్యేలా నిర్మించేందుకు వీలవుతుంది. ఇప్పుడు: సాధారణ ఎన్హెచ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నందున రోడ్డు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది.తొలుత: వాహనాలు గంటకు 160 కి.మీ. మించిన వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేని విధంగా డిజైన్ ప్రతిపాదించారు. అధికారిక వేగ పరిమితిని 120 కి.మీ.గా పేర్కొన్నారు. రోడ్డు నిలువు వాలు (వర్టికల్ కర్వ్) 1300 మీటర్లు ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఒక మీటర్ మేర రోడ్డు పల్లం (డీప్) కావాలంటే 1300 మీటర్ల నుంచే ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుందన్న మాట. (వాలు మొదలు అవుతుంది) దీంతో 600 మీటర్ల ముందు వరకు రోడ్డు విజిబిలిటీ ఉంటుంది. అంత దూరంలో పిల్లి సైజు జంతువు రోడ్డు దాటుతున్నా కనిపిస్తుంది. ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఇప్పుడు: గరిష్ట వేగం 100కు కుదించారు. రోడ్డు నిలువు వాలు 650 మీటర్లకు పరిమితం చేశారు. అంటే ఎత్తు, పల్లంల వద్ద వాహనాల గరిష్ట విజిబిలిటీ దూరం కవలం 360 మీటర్లు మాత్రమే ఉంటుంది. వాహనాలు ఒకవేళ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
మావోలకు ‘డెడ్’లైన్.. మరో పది రోజులే!
సాక్షి, హైదరాబాద్: ‘మార్చి 31 నాటికి భారత దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం’గత రెండేళ్లుగా పలు వేదికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటన ఇది. తాజాగా ఈ నెల 6న ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవంలోనూ ‘తిరుపతి నుంచి నేపాల్లోని పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు కనే శక్తులను మన భద్రత దళాలు కచ్చితంగా ఓడిస్తాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యం’అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్చి 31 లోపు అజ్ఞాతం వీడి లొంగిపోని మావోయిస్టుల పట్ల కఠిన వైఖరే అని కూడా అమిత్ షా సుస్పష్టంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం..ఈనెల 31న మావోయిస్టులకు ‘డెడ్’లైన్ పూర్తవుతుంది, మరో పదిరోజులే గడువు ఉంది, అయితే ప్రభుత్వాలు చెబుతున్నట్టు మార్చి 31 తర్వాత మావోయిస్టులు లేని భారత్ సాధ్యమేనా..? మరోవైపు పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు చెబుతున్నట్లుగా డెడ్లైన్లు పెట్టి సిద్ధాంతాలు అంతం చేయలేరన్న వాదనలు గెలుస్తాయా..? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఇంకా మావోయిస్టులలో వందలాది మంది సాయుధులు ఉన్నారని, మావోయిస్టులను అంతం చేయడం ప్రభుత్వాలు అనుకున్నంత సులువేంకాదని ఇటీవల జనజీవనస్రవంతిలోకి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఆ ఏడుగురు తిరిగొచ్చేనా...?మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2023లో 125 మంది ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య ఏడుకు పరిమితమైందని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ టిపిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, చంద్రన్న సహా ఎంతో మంది కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగుబాట పట్టారు. అయితే తాము అరెస్టు అయ్యామని చెబుతున్నా..పోలీసులు సరెండర్ చూపినా..ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారు. 2024 నుంచి తెలంగాణ పోలీసుల ఎదుట 721 మంది లొంగిపోవడంతోపాటు 266 ఆయుధాలను అప్పగించారు. తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులు ఇంకా యాక్టివ్గా ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, గణపతి భార్య జోడే రత్నాబాయి, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ , సికింద్రాబాద్కు చెందిన వార్త శేఖర్ , హైదరాబాద్కు చెందిన నక్క సుశీల అలియాస్ రేల, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భద్రాది జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్ ఉన్నారు. గణపతి లొంగుబాటుపై ఇప్పటికే తీవ్ర చర్చ.. దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా...అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించాలన్నా..అధికారిక రికార్డుల్లో ఉన్న మావోయిస్టులంతా అయితే లొంగిపోయారని, లేదంటే చనిపోయారని గుర్తించాల్సిందే. మావోయిస్టు అగ్రనేత, సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన నేత, తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసులతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్, ఇతర దర్యాప్తు విభాగాలు సైతం గణపతి జాడ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, రాజిరెడ్డి సహా కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలో పని చేసిన వారు కూడా తమకు గణపతి జాడ తెలియదని చెబుతున్న నేపథ్యంలో గణపతి లొంగుబాటు సాధ్యమా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 31 తర్వాత పరిస్థితి ఏంటి? సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన దాడులను ఎదుర్కోలేక మావోయిస్టు అగ్ర నాయకత్వం సైతం అడవులు వీడి లొంగుబాట పడుతున్నా..ఇంకా వందల మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.అజ్ఞాతం వీడేందుకు కొందరు అంగీకరించడం లేదు. అయితే మార్చి 31 తర్వాత మిగిలే మావోయిస్టులపట్ల కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. లొంగకపోతే మార్చి 31 తర్వాత మావోయిస్టుల ఏరివేత తప్పద న్న సంకేతాలే పంపుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం మరోసారి గడువు పెంచుతారా..లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.నిషేధం ఎత్తివేత షరతు ఫలించేనా?తాము అజ్ఞాతం వీడి జనంలో జనం మధ్య, ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే, మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే..అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డితో సమావేశంలోనూ మావోయిస్టు మాజీ కీలక నేతలు ప్రతిపాదించారు. సీఎం రేవంత్రెడ్డి కూడా ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో స్వయంగా కలిసి చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. -
ఆరు గ్యారంటీల అమలుకు ‘ప్రైవేటు’ బిల్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. న్యాయవాదులుగానూ అనుభవం ఉన్న పార్టీ నేతలు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్తోపాటు మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాది మోహన్రావు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పె ట్టడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై చర్చించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని వారి చాంబర్లో కలిసి తాము ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లును అనుమతించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరనున్నారు. వచ్చే శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరడంతోపాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బిల్లు కాపీలు ఇస్తారు. బిల్లుకు మద్దతు కోరుతూ అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలకు లేఖలు కూడా రాయాలని శనివారం జరిగిన భేటీలో నిర్ణయించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బిల్లు కోసం ఒత్తిడి ‘బీఆర్ఎస్ పెట్టే ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చేందుకు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలందరూ స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. ఆరు గ్యారంటీల ద్వారా లబ్దిదారులకు అందే డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే వేసేలా ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి రోజునే సీఎం రేవంత్ ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. గవర్నర్ నోటితో అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చెప్పించి 840 రోజులు కావస్తున్నా వాటి ఊసేలేదు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో 1986లో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ఆమోదించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే మేము ప్రవేశపెడుతున్న ప్రైవేటు మెంబర్ బిల్లును చర్చకు అనుమతించి ఆమోదించాలి. రాష్ట్రంలోని రైతులు, మహిళలు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు యువకులు సహా అన్ని వర్గాల తరపున ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. అభయహస్తం మేనిఫెస్టోను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మేము ప్రవేశపెట్టే బిల్లుకు అధికార పక్షం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం’అని కేటీఆర్ అన్నారు. తొలి సంతకం ఫైల్ను పోగొట్టుకున్నారా? ‘అధికారంలోకి వచి్చన వెంటనే ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం తొలి సంతకం చేసిన ఫైలు కనిపించడం లేదా? లేకపోతే తరచూ విమాన ప్రయాణాలు చేస్తున్న సీఎం ఆ ఫైలును పోగొట్టుకున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీల ఊసే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఏడాది మాత్రమే సంపూర్ణ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు బిల్లు పెట్టడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ బిల్లుకు చట్టబద్ధత వస్తే రైతు భరోసా సహా ఇతర హామీలు ఎగవేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండదు. ఈ బిల్లును శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది’అని కేటీఆర్ వెల్లడించారు. -
శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?
సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేటలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించే పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ తెచ్చింది, చేసింది కాదు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవే. శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?’అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కృషి ఫలితమే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అని, దానిని ఆదివారం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారని అన్నారు.కానీ, ప్రజల మనోఫలకాల మీద తమ పేరు ఎప్పటికీ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందే జిల్లాకు మంజూరై, రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్రావు.. సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను శనివారం సిద్దిపేటలో విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాధారమన్నారు. కాళేశ్వరాన్ని, కూలేశ్వరం అని అంటున్న రేవంత్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు? రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,170 కోట్లు అర్ధంతరంగా రద్దు చేశారని హరీశ్ తెలిపారు. వీటిలో పశువైద్య కళాశాలను రేవంత్ కొడంగల్కు తీసుకెళ్లారన్నారు. ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?, ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కాగా, సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులకు దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతుభరోసా డబ్బులు చెల్లించాలని కోరారు. -
నేటి నుంచి యాసంగి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: రైతుభరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో కొత్తగా నిర్మించిన ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి రైతుభరోసాను ప్రారంభించనున్నారు. మొదటి విడత కింద రూ. 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. తద్వారా ఎకరం లోపు విస్తీర్ణం భూములున్న సుమారు 73 లక్షల మంది రైతులకు డబ్బులు అందనున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.6 వేలు చొప్పున రాష్ట్రంలోని సుమారు 150 లక్షల ఎకరాల భూములకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. రెండవ విడతగా 20 రోజుల తరువాత రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంబోత్సవానికి వ్యవసాయ, అనుబంధ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ నర్మెటలోనే ఉంటూ సీఎం పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కాళేశ్వరంతో సాగు కావట్లేదు: తుమ్మల ‘ప్రతిపక్ష నేతలవి చిల్లర మాటలే.. కాళేశ్వరం జలాలతో పామాయిల్ సాగు కావడంలేదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచి్చన తర్వాతే సిద్దిపేట జిల్లా నర్మెటలో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాం. ఫ్యాక్టరీని 16 నెలల్లోనే పూర్తి చేశాం’అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అని వివక్ష చూపకుండా, సిద్దిపేట భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడే ఫ్యాక్టరీ మంజూరు చేశానని వివరించారు. కాళేశ్వరంతో పామాయిల్ సాగు కావడం లేదని, వాతావరణం అనుకూలంతో రాష్ట్రమంతా ఆయిల్పామ్ సాగవుతుందని తెలుసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తే అది రైతుల వడ్డీకే సరిపోయిందని, ఇంకా ఒక్కో రైతుపై రూ.12 వేలు వడ్డీ మీద పడిందన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం రైతులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రారంభాలు.. శంకుస్థాపనలు సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, పీహెచ్సీలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్, కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 30 వేల మంది రైతులతో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న రైతు ఉత్సవాలు సీఎం సభతో ముగియనున్నాయి. -
మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి తొలి విడత పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. తొలి దశ పనులు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. శనివారం రాత్రి ఆయన ఆలయ పునరాభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హన్మంతరావు తదితరులతో సమీక్షించారు.పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తిచేసి, పుష్కరాల అనంతరం మిగతా పనులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి తీరంలో భక్తులకు వసతి కల్పించాలన్నారు. భక్తుల దర్శనాలు కొనసాగుతుండగానే ఆలయ అభివృద్ధి పనులు జరపనున్నందున, భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు జరగాలని చెప్పారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా ఆగమశాస్త్రబద్ధంగా పునరాభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు. -
మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు మారినా రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సాదాబైనామాల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దాదాపు 37 ఏళ్లుగా తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిష్కార మార్గం దొరికినా మోక్షం మాత్రం కలగట్లేదు. భూభారతి చట్టంలో సాదాబైనామాలను చట్టబద్ధం చేసే ప్రక్రియకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా లక్షలాది సాదాబైనామా దరఖాస్తులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అడ్డంకిగా అఫిడవిట్ నిబంధన.. సాదాబైనామాల సమస్యకు పరిష్కారం చూపించే భూభారతి చట్టం గతేడాది ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులో హైకోర్టు అందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇచి్చన ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించింది. అంతవరకూ బాగానే ఉన్నా చట్టంలో పేర్కొన్న విధంగా సాదాబైనామాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ రూపొందించిన నిబంధనలు మళ్లీ సమస్యను జటిలం చేశాయి. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని 2014 జూన్ 2లోగా తెల్లకాగితం (సాదాబైనామా)తో కొని ఉంటే అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలని.. అప్పుడే సాదాబైనామా సరి్టఫికెట్ ఇవ్వాలనే నిబంధన పెట్టారు.దీంతో ఎప్పుడో దశాబ్దాల క్రితం తమకు అమ్మిన వారి నుంచి అఫిడవిట్లు తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తేసే దిశగా చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా వస్తాయని.. అమ్మినవారి అఫిడవిట్తో సంబంధం లేకుండా గతంలో లాగానే స్థానిక విచారణ ద్వారా సాదాబైనామాలను పరిష్కరిస్తామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. కానీ ఈ అఫిడవిట్కు మించిన సమస్యలు సాదాబైనామా దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాకపోవడం గమనార్హం.సాదాబైనామా దరఖాస్తును పరిష్కరించాలంటే ఆ భూమికి సంబంధించి భూభారతి పోర్టల్లో ఉన్న వివరాల్లో అమ్మిన వ్యక్తి పేరుపై పట్టా ఉండాలన్న నిబంధన ఈ సమస్యకు పీటముడి వేస్తోంది. ఎప్పుడో భూమి అమ్మినా ధరణి పోర్టల్ వచ్చాక తన పేరిట పట్టా రావడంతో అప్పట్లో అమ్మిన వ్యక్తి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయడం లేదంటే కుటుంబ సభ్యుల పేర్లపై పట్టా బదిలీ చేయడం లాంటివి జరిగిపోయాయి. చాలా చోట్ల సర్వే నంబర్లు సరిపోలట్లేదు. భూమి ఒకచోట ఉంటే మరో సర్వే నంబర్పై కాగితం ఉండటంతో ఆ దరఖాస్తులను కూడా రెవెన్యూ అధికారులు పరిష్కరించట్లేదు. కాగితాలపై రాసుకున్న విస్తీర్ణం, భూభారతి పోర్టల్లో ఉన్న విస్తీర్ణంలో తేడా ఉన్నా పరిష్కరించలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.ఇలా చాలా దరఖాస్తులను తిరస్కరించామంటున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలన్నింటికీ వివరణ ఇస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి ఆర్డీవోలకు ప్రత్యేక ఉత్తర్వులు రావాలని.. అప్పుడే సాదాబైనామాలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. సాదాబైనామాలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో అఫిడవిట్ నిబంధన ఎత్తేయడంతోపాటు సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు అలా... ఇప్పుడు ఇలా వాస్తవానికి సాదాబైనామాలను పరిష్కరించే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. కానీ సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించిన అప్పటి ప్రభుత్వం ధరణి చట్టంలో ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని విస్మరించింది. దీంతో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత విషయం కోర్టు మెట్లెక్కింది. కోర్టు కూడా చట్టంలో లేనందున పరిష్కారం ఎలా చేస్తారని ప్రశ్నించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ప్రత్యేక సెక్షన్ రూపొందించడంతో కోర్టు కూడా వాటి పరిష్కారానికి అనుమతినిచ్చింది. దీంతో ఇక సమస్య పరిష్కారమైనట్టేనని 9.2 లక్షల మంది దరఖాస్తుదారులు ఆశించారు. కానీ నేటికీ సమస్య అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే.. ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలి. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసిది ఆర్డీవో అయినప్పటికీ కలెక్టర్కు అప్పీల్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే తిరస్కారానికి గురైన రైతులు కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవడం ద్వారా సాదాబైనామాల దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుంది. – భూమి సునీల్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు -
సిలిండర్ అందుబాటు గ్యాసే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్యాస్ ఇక్కట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. షేక్పేట్లోని మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం వినియోగదారులు గంటలతరబడి వేచి చూడడం కన్పించింది. సిలిండర్ కోసం 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని, గత రెండు రోజులుగా ఏకంగా ఏజెన్సీ వద్దకు వచ్చి లైన్లో నిలబడినా లభించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరూ ఈ విధంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దీనిపై స్పందించడం లేదని, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత లేదని కొందరు వినియోగదారులు మండిపడ్డారు. ఎవరికి సిలిండర్లు అందిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. -
Telangana: యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆరీ్వఎన్ఎల్) ఇటీవల ఈ ప్రాజెక్టు టెండర్లను దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు.తొలుత రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టాయి. భూమి, వనరులు, అవసరమైన నిధులను అందజేసేందుకు అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇది పెండింగ్ జాబితాలో పడింది. చివరకు రైల్వేశాఖే సొంత నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా నిధులు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరి వరకు 33 కి.మీ. మేర రూ.430 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. కొత్తలైన్లను నిర్మించడంతో పాటు అవసరమైన చోట్ల డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ తదితర పనులు చేపట్టనున్నారు. భక్తకోటికి మార్గం సుగమం ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వస్తే భక్తకోటి ఇష్టదైవం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం మరింత సులభతరం కానుంది. తక్కువ చార్జీలతోనే ప్రయాణికులు రాకపోకలు సాగించచ్చు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్లో వెళ్లి అక్కడి నుంచి 4 కి.మీ.రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవచ్చు.ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో ప్రతి రోజు వేలాది మంది భక్తులు యాదాద్రి దర్శనానికి వెళ్తున్నారు. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే లింగంపల్లి నుంచి నేరుగా యాదాద్రికి వెళ్లవచ్చు. ఉందానగర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా చేరుకొవచ్చు. మేడ్చల్ నుంచీ యాదాద్రికి సులభంగా రాకపోకలు సాగించవచ్చు. అభివృద్ధి పరుగులు.. యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలోనే ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం దీన్ని పట్టాలెక్కించనున్న దృష్ట్యా డిమాండ్ పెరగవచ్చని అంచనా. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంది. -
ప్రైవేట్మెంబర్ బిల్లును ప్రవేశపెడతాం: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్మెంబర్ బిల్ పెడతామని తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలేనని అన్నారు.‘ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల చట్టం ఫైల్ పై సంతకం చేశారు. అప్పటి గవర్నర్ తమిళిసై కూడా ప్రసంగంలో అసెంబ్లీ లో చెప్పారు. 840 రోజులు అయినా అమలు చేయడం లేదు. వచ్చే శుక్రవారం రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం తెలపాలని సభలో అడుగుతాం. గతంలో అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టిన చరిత్ర ఉంది. మీరు ప్రవేశ పెట్టలేదని మేము ప్రవేశ పెడతాం. స్పీకర్, చైర్మన్ సభ్యులను అందరినీ కలుస్తాం. బీజేపీ వ్యతిరేకించినా ఏం ఇబ్బంది లేదు. ఫైల్ దొరకడం లేదని అంటున్నారు. ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కాలిపోయిందా? అనే అనుమానం ఉంది. మిగిలింది ఒక బడ్జెట్ మాత్రమే.. ఇచ్చిన హామీలను ఇంకా ఎప్పుడూ అమలు చేస్తారు? ఆరు గ్యారెంటీల చట్టం అయితే అన్ని వర్గాల వారికి లాభం అవుతుంది. ప్రజల తరుఫున ఈ బిల్ పెడుతున్నాం. పబ్లిక్ డొమైన్ లో బిల్ పెడతాం. అన్ని పార్టీలకు సహకరించాలని లేఖ రాస్తాం. నందమూరి తారక రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ బిల్ పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిల్ పెట్టిన చరిత్ర కూడా ఉంది’ అని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. -
షాకింగ్ సీన్.. కల్తీ సమోసాలు.. కుళ్లిన గుడ్లతో పఫ్స్..
సాక్షి, హైదరాబాద్: జియాగూడలో కల్తీ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ట్రేడ్ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారీ చేస్తున్నట్లు నిర్థారించారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్ చేశారు.నిందితుడు అబ్దుల్ రషీద్.. అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000), ముడి పదార్థాలు మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు తమ ప్రాంతాల్లో కల్తీ ఆహారాన్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. -
విడాకుల కేసు: అడ్వకేట్తో ఆమె సన్నిహితంగా..!
శంషాబాద్ రూరల్: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మహిళకు పరిచమైన ఓ అడ్వకేట్ ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు.. ఇది తెలుసుకున్న భర్త.. వారిద్దరూ కారులో వెళ్తుండగా బైక్పై వెంబడించాడు. ఈ క్రమంలో భర్తతో పాటు మరో వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అడ్వకేట్తోపాటు మహిళను పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్, ఝాన్సీ దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో భార్య దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది. ఝాన్సీ ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ నాగోల్లోని హాస్టల్లో నివాసముంటుంది. ఈ క్రమంలో మాధవరావు అనే అడ్వకేట్తో పరిచయమైంది. అతనితో సన్నిహితంగా ఉంటోందని నాగోలులో టీషాపు నిర్వహించే శివప్రసాద్ స్నేహితుడు కోడి నరేష్ గమనించి చెప్పాడు. దీంతో భార్య కదలికలను గమనించసాగారు. ఈ నెల 19న ఝాన్సీ ఉప్పల్ బస్స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా చూశారు. శివప్రసాద్, నరేష్ బైక్పై బస్సును వెంబడించారు. ఆరాంఘర్ చౌరస్తాలో బస్సు దిగిన ఝాన్సీ అక్కడ ఓ కారులో ఎక్కింది. వీరు కారును వెంబడిస్తూ మండలంలోని మేకలబండతండా శివారులో పీ–వన్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ కారును నిలపడంతో శివప్రసాద్ దగ్గరకు వెళ్లి మాట్లాడేప్రయత్నం చేశారు. అయితే కారును కొద్దిగా ముందుకు కదిలించి వేగంగా వెనక్కు వచ్చి ఇద్దరినీ ఢీకొట్టారు. ఈ ఘటనలో శివప్రసాద్, నరేష్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలో ఉన్న జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు మాధవరావు, ఝాన్సీని హత్యాయత్నం కేసులో శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మికుంట మండలం సీతంపేటలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య మృతి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ.. అత్తగారి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపుతోంది. దివ్య మృతిపై అనుమానాలు తలెత్తడంతో చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.కాగా, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యకు 2016లో ఎస్ఐ చంద్రశేఖర్తో కాగా.. భర్త రోజుమాదిరిగా మంగళవారం(మార్చి, 17) ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో అదేరోజు ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగిన దివ్య.. తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పింది. దివ్యను ఆమె భర్త.. వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.అయితే, దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమంటూ మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇవాళ(మార్చి 21, శనివారం) ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గదిలో నుండి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. -
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేయగా.. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నారు. రోహిత్కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్ సింగ్సెల్ఫోన్ డేటాను సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది.కాగా, డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
సిలిండర్ దొరికినోళ్లే ధురంధర్
హైదరాబాద్: నగరంలో గ్యాస్ కష్టాలు సాధారణంగా మారాయి. హోటళ్లు, పీజీలు ఇప్పటికే మూతపడుతుండగా.. మరోవైపు సాధారణ ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్లు కాకపోవడంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. గృహిణులు అయితే చంటి పిల్లలతోనూ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు కొందరు ఓపెన్ కిచెన్ లో వంట చేస్తున్నారు. సీఎన్జీతో నడిచే ఆటోలకూ కటకట ఏర్పడింది. దీంతో గ్యాస్ బంకుల వద్ద వాహనాలతో డ్రైవర్లు బారులు తీరుతున్నారు. -
రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి కేటాయింపులు
మహా నగరంపై ‘కోట్ల’ జల్లు కురిసింది. బహుశా.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్పై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపించినట్లుగా కనిపించింది శుక్రవారం నాటి పద్దు. ఉపముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ‘రాజధాని’ నగరానికి ప్రాధాన్యమిచ్చారనే చెప్పవచ్చు. అన్ని శాఖలకూ నిధులు నిరాశపర్చని రీతిలోనే పద్దులో పొందుపర్చినట్లు కనిపిస్తోంది. కాకపోతే.. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గమనించదగిన అంశం. కాగా.. అటు మూసీ నుంచి మొదలుకొంటే.. ఇటు ఫోర్త్ సిటీ.. జలమండలి, మెట్రో, ఎంఎంటీఎస్ రెండో దశ, జలమండలి, ఉస్మానియా, టిమ్స్ ఆస్పత్రులు, నాలుగు పోలీస్ కమిషనరేట్లు, హెచ్ఎండీఏ తదితర శాఖలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కినట్లుగానే అర్థమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో టీ క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) వరకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పూర్వ జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధితో 150 వార్డులుగా ఉన్నప్పుడు క్యూర్ వరకు కేటాయించిన రూ. 2,654 కోట్లనే ఒక్క రూపాయి కూడా పెంచకుండా.. తగ్గించకుండా పద్దులో ప్రతిపాదించారు. అవే నిధుల కేటాయింపులు వరుసగా ఇది మూడో సంవత్సరం. వాస్తవానికి ఆ మేరకు పనులు కూడా జరగలేదు. బహుశా, అందుకే ఈసారి కూడా అన్ని నిధుల్నే కేటాయించారు. కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఏర్పాటు కావడంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని కార్పొరేషన్లు భావించాయి. వాటికి కానీ, జీహెచ్ఎంసీకి కానీ ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. క్యూర్ పరిధి వరకు హెచ్–సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కింద మొత్తం రూ.2,654 కోట్లు కేటాయించారు. అంటే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలన్నింటికీ కలిపిన కేటాయింపులు. హెచ్–సిటీ కింద ఫ్లై ఓవర్లు, అండర్పాస్లతో పాటు నాలాల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఆర్ఓబీ, ఆర్యూబీ, తదితర పనులుంటాయి. గత సంవత్సరం బడ్జెట్లో హెచ్–సిటీ పనుల కింద రూ.2,654 కోట్లతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.419 కోట్లు కేటాయించారు. ఈసారి ఎలాంటి గ్రాంట్లు లేవు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు రూ.500 కోట్లను రుణాల రూపంలో కేటాయించింది. వివిధ అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్– శామీర్పేట్ వరకు త్వరలో ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12 నుంచి శిల్పా లేఅవుట్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. పలు చోట్ల రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటి కోసం ఈ నిధులను విని యోగించనున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ కోసం జైకా సంస్థ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల దృష్ట్యా మరో రూ.200 కోట్లు కేటాయించారు. మూసీ మురిసేలా.. సీఎం రేవంత్ కలల ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం రూ.1,500 కోట్ల పద్దును ప్రతిపాదించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.400 కోట్లు ఎక్కువ. కొత్త బడ్జెట్లో కేటాయింపులను భూ సమీకరణ, నది చుట్టూ మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నారు. తొలి దశలో నగరంలో మూసీ ప్రవహించే 55 కి.మీ. మేర నదిని సుందరీకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో జోన్–1 కింద మొత్తం 21 కి.మీ. మేర సుందరీకరించనున్నారు. జోన్–1ఏలో హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ 9.8 కి.మీ., జోన్–1బీ కింద ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.2 కి.మీ వరకు నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ.. నాలుగు పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు రూ.40 కోట్ల పద్దును ప్రతిపాదించారు. ఇక, సైబరాబాద్కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. కాగా.. గ్రేటర్లో హైదరాబాద్, సైబరాబాద్లకు శాశ్వత కమిషనరేట్ భవనాలు ఉండగా.. మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీలకు లేవు. మల్కాజిగిరి కమిషనరేట్ భవనానికి ప్రభుత్వం కేవలం రూ.లక్ష కేటాయించి చేతులు దులుపుకొంది. ఫోర్త్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్కు రూ.25 కోట్లను ప్రతిపాదించారు. ‘క్యూర్’ పరిధిలో పోలీసులకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చేందుకు ఈ– వెహికిల్స్ కోసం రూ.25 కోట్లు కేటాయించడం గమనార్హం ఎల్బీ నగర్, సనత్నగర్, అల్వాల్లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించి 5 వేల బెడ్స్ అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫలితంగా లక్షలాది మంది సామాన్య, పేద కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం చేరువకానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకంతో హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణకు భారీగా నిధులు కేటాయించారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి రూ.100 కోట్లు కేటార్చుుంచింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం రూ.600 కోట్లు అందజేయనున్నారు. రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర అవసరాల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కు మరో రూ,500 కోట్లు రుణాల రూపంలో ఇవ్వనున్నారు. ప్రస్తుతం మెట్రో రెండో దశలో భాగంగా పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ.మార్గంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టారు. 850 ఆస్తులకు రూ.600 కోట్లలో మరి కొంతమందికి పరిహారం అందజేయనున్నారు. మెట్రో టేకోవర్ చెల్లింపులపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1,150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్లో ఎంఎంటీఎస్ కోసం కేటాయిస్తున్నారు. నగర శివారులో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్సిటీని నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ పీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ లైన్లు, పర్యవరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలవనుందని ప్రకటించింది. జలమండలి అభివద్ధి పనులు, సుంకిశాల ప్రాజెక్టుకు రూ.3,305 కోట్లు కేటాయించారు. అభివృద్ధి పనులకు తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.1,450 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టు రుణం కింద రూ.1000 కోట్లు, నీటి రీయింబర్స్మెంట్కు రూ. 300 కోట్లు కేటాయించింది. రెండేళ్లుగా బడ్జెట్లో రూ.3,385 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.380 కోట్లు తగ్గించింది. నిధుల కొరతతో సతమతమవుతున్న జలమండలికి కేటాయింపులు నిరాశ కలిగించగా.. మూసీ పునరుజ్జీవానికి కేటాయించిన రూ.1,500 కోట్లు పరోక్షంగా జలమండలి పరిధిలోని సివరేజ్ పనులకు తోడ్పడనుండటం కొంత ఉపశమనం. గ్రేటర్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ప్రస్తావన తీసుకురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారుల వెంట గజిబిజిగా, ప్రమాదకరంగా మారిన ఓవర్ హెడ్లైన్ల స్థానంలో కొత్తగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని భావించింది. ఆ మేరకు రూ.1,5000 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచాన వేసింది. మూడు దశల్లో ఈ పనులు చేపట్టాలని భావించినప్పటికీ.. తాజా బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా.. గృహజ్యోతి పథకానికి రూ.2080 కోట్లు కేటాయించడంతో గ్రేటర్ జిల్లాల్లో 11.5 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. 3 కార్పొరేషన్లకు రూ.2,654 కోట్లు ‘హెచ్–సిటీ’ సహా క్యూర్ వరకూ.. గత రెండేళ్లుగా ఇదే మాదిరిగా.. మూసీ ః రూ.1,500 కోట్లు మెట్రో రెండో దశకు రూ.600 కోట్లు రుణాల రూపంలో మరో రూ.500 కోట్లు హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు పోలీసులకు రూ.387 కోట్లు ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.50 కోట్లు ఉస్మానియా ఆస్పత్రి భవనానికి రూ.100 కోట్లు జలమండలికి రూ.3,305 కోట్లు ఎఫ్సీడీఏకు రూ.300 కోట్లు -
ఈద్ నమాజ్కు వేళాయే
విద్యుద్దీపాల వెలుగులో మక్కా మసీదు.. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలునగరంలో ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ముస్లింలు ఈద్ నమాజ్ చేసేందుకు పాతబస్తీ మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదు, మాదన్నపేట ఈద్గా, ఈద్గా ఉజాలే షా, కుత్బుల్లాపూర్, నార్సింగి, ఫస్ట్ లాన్సర్, పహాడీషరీఫ్ ఈద్గాలతో పాటు వివిధ మైదానాలు సిద్ధమయ్యాయి. పాతబస్తీతో పాటు ప్రధాన ఈద్గాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీర్ ఆలం ఈద్గాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమ్మతుల్ విదా) సందర్బంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ సామూహిక ప్రార్థనలు జరిగాయి. – సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్ -
16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
● రూ.3,200 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ గచ్చిబౌలి: శేరిలింగంపల్లి టీఎన్జీఓకాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హెచ్ఎండీఏ లే అవుట్లో 10 ఎకరాల ముసాయికుంట, నాలుగు ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా, ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన రెండు ఎకరాలు.. ఇలా మొత్తం 16 ఎకరాలు కబ్జా అవుతోందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా.. భూమి విలువ రూ.3,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం భూమిని కాపాడి ఫెన్సింగ్ వేశారు. అనంతరం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. -
అనుమానంతో వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించి..
చిలకలగూడ : యువతిని అనుమానంతో వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితకృష్ణమూర్తి తెలిపిన మేరకు.. కోటేశ్వరరావు కుటుంబం సికింద్రాబాద్ శ్రీనివాసనగర్లో నివాసముంటోంది. ఈయన కూతురు జెనిమా (19) ఇంటర్ చదువుతోంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జగదీష్ (22) రాంనగర్లోని ఓ బుక్షాప్లో పనిచేస్తున్నాడు.సోషల్ మీడియా ద్వారా యువతికి పరిచయమయ్యాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల జెనిమా ప్రవర్తనపై అనుమానం పెంచుకొని మానసికంగా వేధించసాగాడు. బెదిరించేందుకు యువకుడి ఆత్మహత్యాయత్నం యువతిని బెదిరించేందుకు జగదీష్ ఈనెల 14న కొద్ది మోతాదులో పురుగుల మందు తాగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. మార్చి 17న ఉదయం జెనిమా ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి వెళ్లిపోయాడు. దీంతో జెనిమా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఉరి వేసుకునేందుకు సీలింగ్ ఫ్యానుకు కట్టిన చున్నీ ఫొటోను జగదీష్ స్నేహితుడు శ్యామ్కు వాట్సప్ ద్వారా పంపించింది. శ్యామ్ అందించిన సమాచారం మేరకు జగదీష్తోపాటు కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.గాంధీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో జగదీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడు జగదీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతురాలి కాళ్లకు అయితే గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా అయ్యాయని పోలీసులు తెలిపారు.యువతి ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్ -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
గన్ఫౌండ్రీ: కూచిపూడి, భరతనాట్య, జానపద నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా మాట్లాడుతూ.. పండుగల ప్రాముఖ్యత, విలువలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు నాట్య గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటుడు పృథ్వీ, వ్యాపారవేత్త ఎస్. రాజా, సంస్థ వ్యవస్థాపకులు లయన్ కేవీ రమణారావు పాల్గొన్నారు. -
ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: ‘ఎంతో కష్టపడి చదువుకుని గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు శాఖల్లో అధికారులుగా మీరు విధులు నిర్వహించనున్నారు. మీరే మీ విభాగాల్లో ప్రత్యేకతను చాటాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మీ చర్యలుండాలి. ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలి. మీ విభాగాల్లో ఎవరికి వారు కొత్త చరిత్రను సృష్టించాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. గ్రూప్–1 కేడర్కు ఎంపికై న ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. సమాజ ప్రయోజనాలు కోరి మంచి చట్టాలు రూపొందించుకున్నాం. అవి పేపరు మీద అన్నీ ఉంటాయి. కానీ, వాటిని అమలు చేయకపోతే ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. -
భూ వివాదంతో మంత్రికి సంబంధం లేదు
మణికొండ: తమ ఉమ్మడి కుటుంబ భూ తగాదాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి, ఆయన కుమారుడు హర్షవర్ధన్రెడ్డికి, వారి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. తమకు రావాల్సిన పొలాన్ని కలుపుకుని తమ చిన్నాన్న కుటుంబీకులు ప్రహరీ నిర్మాణం చేసుకుంటూ వివాదం పెద్దది చేస్తున్నారని గండిపేట మండలం వట్టినాగుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 259 యజమానులు అవినవ్షా, అక్షయ్షాలు పేర్కొన్నారు. తమ పొలంలో తిరిగి ప్రహరీ నిర్మిస్తున్నారన్నారని వివరించారు. శుక్రవారం వారు పొలం వద్దే మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లి సర్వేనెంబర్ 245, 259,260లలో షా కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములకు 300 ఎకరాల భూమి ఉండేదని, అందులో కొంత భూమి విక్రయించారని.. 40 ఎకరాలు ఓఆర్ఆర్, కోకాపేట ట్రంపెట్ నిర్మాణానికి తీసుకున్నారన్నారు. మిగిలిన 160 ఎకరాల భూమిని అందరం కలిసి 2006లో దక్షిణ్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చామన్నారు. వారు జీవో 111 కారణంతో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో 2025లో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సర్వేనెంబర్ 260లో ఉన్న 10 ఎకరాలతో పాటు 259లో ఉన్న 3.20 ఎకరాలను న్యూజెమ్ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చామన్నారు. 259 సర్వే నెంబర్లోని 3.20 ఎకరాల భూమి విషయంలోనే వివాదం ఉందని, అందులో తమకు భూమి ఉందని తాము, లేదని తమ చిన్నాన్న సతీష్షాల మధ్య వివాదం నడుస్తోందన్నారు. తమ భూమిని 2025లో ఏడీ సర్వే నిర్వహించి వారు చూపించిన హద్దులను తమ చిన్నాన్న సతీష్షా అంగీకరించటం లేద న్నారు. ఈ వివాదంలోకి మంత్రిని ఎందుకు లాగుతున్నారనే విషయం తమకు తెలియద న్నారు. ఇదిలా ఉండగా మొత్తం భూమి తమ పేర్లపై 40 సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని, అయినా తమకు భూమి ఉందని తమ దాయాదులు వస్తున్నారని మరో భూ యజమాని పల్లవిషా అన్నారు. రెవెన్యూ అధికారులే పరిష్కరించాలి వట్టినాగులపల్లి భూ యజమానులు అవినవ్ షా, అక్షయషా -
కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆక్రమణకు యత్నం
సాక్షి, సిటీబ్యూరో: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ అతిక్రమణ, ఆస్తి నష్టం, ప్రాణహాని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శ్రీనాథ్ స్పిన్నర్స్ మేనేజర్ నగేష్ సుతారి మేడ్చల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నమోదైన ఎఫ్ఐఆర్లోని అంశాల ప్రకారం. మేడ్చల్ ఐడీఏలోని సర్వే నంబరు 859లో 3 ఎకరాలు స్థలం ఉంది. సదరు ఆస్తిపై మేడ్చల్ న్యాయస్థానంలో కేసు ఉంది. ఈ స్థలంలో 2001 నుంచి శ్రీనాథ్ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను సాగిస్తున్నామని, ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి 11.40 గంటలకు మంతెన రవి వర్మ రాజు, మంతెన నాగజ్యోతి, రాములు గౌడ్, ఈ సాంబయ్య, ఈ సందీప్ రాజ్, వారి అనుచరులు పథకం ప్రకారం తమ ప్రాంగణంలోకి చొరబడ్డారని నగేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లతో వచ్చి ఫ్యాక్టరీ గేట్లను, ప్రహారీ గోడలను పగులగొట్టి ప్రాంగణంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్నారు. ఆస్తికి నష్టం కలిగించడంతో పాటు మిల్లులో ఉన్న కార్మికులపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడిలోకార్మికుడు రంజన్ మల్లిక్కు తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు దుండగులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారన్నారు. జేసీబీ (ఏపీ01పీ131), టిప్పర్ (టీఎస్08యూఎల్2449), ద్విచక్ర వాహనాలు (టీఎస్07ఎఫ్యూ4486, టీజీ153200)లను ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్లారన్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో అగ్ని ప్రమాదం సృష్టించాలనే దురుద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోందని నగేష్ ఆరోపించారు. 2001, 2021, 2022 సంవత్సరాలలో కూడా రాములు గౌడ్, సాంబయ్య, సందీప్ రాజ్లు అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశారన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు తమకు రక్షణకల్పించాలని నగేష్ కోరారు. జేసీబీలు, టిప్పర్లతో అర్ధరాత్రి చొరబడిన దుండగులు మేడ్చల్ ఠాణాలో ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ స్పిన్సర్స్ మేనేజర్ నగేష్ -
24 నుంచి ఓయూలో అంతర్జాతీయ సదస్సు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొ.కుమార్, సదస్సు కన్వీనర్ ప్రొ.విజ్జులత తెలిపారు. సదస్సుకు ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు గౌతమి తడిమల్ల హాజరవుతారన్నారు. శుక్రవారం ఓయూ అతిథి గృహాంలో సదస్సు వివరాలను వెల్లడించారు. వర్సిటీ క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో 24న ప్రారంభ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. మహిళా శక్తి–సుస్థిరత అనే అంశం జరిగే సదస్సులో దేశ విదేశాలకు చెందిన 250 మంది పరిశోధన పత్రాలను సమర్పిస్తుండగా, 1200 మంది మహిళా ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. రూ.1000 కోట్ల కేటాయింపుపై వీసీ హర్షం ఓయూకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.1000 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం పట్ల ఉస్మానియా వీసీ ప్రొ.కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను మంజురు చేశారన్నారు. -
‘గాంధీ’కి మరో నాలుగు ఫ్రీజర్ బాక్సులు
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి అదనంగా మరో నాలుగు ఫ్రీజర్ బాక్సులు వచ్చాయి. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) నుంచి ఇవి గాంధీ మార్చురీకి శుక్రవారం చేరుకున్నాయి. గాంధీ’లో పనిచేయని ఫ్రీజర్లు శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కఽథనానికి వైద్యమంత్రితోపాటు ఉన్నతాధికారులు స్పందించారు. గాంధీ మార్చురీలో 70 మృతదేహాలను భద్రపర్చేందుకు ఫ్రీజరు బాక్సులు ఉండగా, వీటిలో 44 పనిచేయకపోవడంతో కుళ్లిన మృతదేహాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీజర్ల కాల పరిమితి ముగిసిందని, మరమ్మత్తులకు కూడా పనికిరావని ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది.దీంతో స్పందించిన ప్రభుత్వం అదనపు ఫ్రీజర్ బాక్సులు గాంధీ ఆస్పత్రికి పంపింది. -
వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే సుమారు 10 శాతం నిధులు పెంచింది. 2025–26లో ఆరోగ్యశాఖకు రూ. 12,393 కోట్లు ప్రతిపాదించగా తాజా బడ్జెట్లో రూ. 13,679 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 6,985 కోట్లు, ప్రగతి పద్దు కోసం రూ. 6,695 కోట్లను ప్రతిపాదించింది. నిర్వహణ పద్దులో పరిపాలన, ఉద్యోగుల జీతభత్యాలు మొదలైన వాటికి నిధులు కేటాయించింది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ కోసం రూ. 1,143 కోట్ల మేర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అంటే నెలకు సుమారు రూ. 100 కోట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు కేటాయించనుంది.ప్రగతి పద్దులో నిధుల కేటాయింపు ఇలా...వైద్య, ఆరోగ్యశాఖలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్వహణతోపాటు ఇతర వైద్య సంబంధమైన అంశాలకు బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దు కింద కేటాయించిన రూ. 6,695 కోట్లను ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలు, పథకాల అమలుకు వినియోగించనుంది. ఈ బడ్జెట్లో మాతాశిశు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, మానసిక ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీకి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల స్థాయి పెంపుతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే మూడు ‘టిమ్స్’, వరంగల్ ఆసుపత్రి కోసం నిధులు వెచ్చించనుంది. -
పన్ను రాబడులే‘పునాదిగా’
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే పునాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడులు 3,24,134 కోట్లు ప్రతిపాదించగా, అందులో రాష్ట్ర సొంత పన్ను రాబడులు రూ.1,48,165.75 వస్తాయని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద వస్తుందని అంచనా వేసిన రూ.33,181.64 కోట్లు కలిపితే అది రూ.1,81,347.39 కోట్లకు చేరనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రాబడుల్లో పన్ను ఆదాయం రూపంలోనే 56 శాతం నిధులు సమకూరుతున్నాయన్న మాట. ఈ రాబడులను శాఖల వారీగా పరిశీలిస్తే ఈసారి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.52,310 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 38,105 కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ. 8,814 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, 2025–26లో పన్ను రాబడులను పరిశీలిస్తే రూ.1,63,490 కోట్లు సమకూరింది.ఇందులో సొంత పన్నుల ఆదాయం రూ.1.34 కోట్లు కాగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,471 కోట్లు సమకేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్ను రాబడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర పన్నుల్లో వాటాను మినహాయించి 2024–25లో వచ్చింది రూ.1.09 లక్షల కోట్లు కాగా, 2025–26లో రూ.1.34 లక్షల కోట్లు వచ్చాయి. అంటే రూ.25వేల కోట్ల మేర పన్ను రాబడులు పెరిగాయన్న మాట. ఈ నేపథ్యంలోనే రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ మేరకు పన్ను ఆదాయంలో వృద్ధి ఉంటుందనిఅంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర పన్నుల్లో వాటాను కలిపి 1.81 లక్షల కోట్లు పన్ను ఆదాయాన్ని ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయం తగ్గినాబడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే గత రెండేళ్లుగా ఆశించిన మేరకు పన్నేతర ఆదాయం రావడం లేదు. 2024–25లో రూ.35 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ. 25,807 కోట్లు వచి్చంది. అంటే బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడికి రూ.10వేల కోట్లు తేడా ఉంది. ఇక, 2025–26లో రూ.31,611.47 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ఆశించినా రూ.29,318 కోట్లు మాత్రమే సమకూరింది. అయినా పన్నేతర ఆదాయంపై ఆశలతో 2026–27 బడ్జెట్లోనూ రూ. 35,730.20 కోట్లను పన్నేతర ఆదాయం పద్దు కింద ప్రతిపాదించారు. గత ఏడాది ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్ల మేర పన్నేతర ఆదాయం పెంచడం గమనార్హం.సగానికి సగం తక్కువకేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు సగానికి సగం తగ్గాయని 2025–26 సవరించిన అంచనాలు చెబుతున్నాయి. 2024–25లో రూ.21,636.15 కోట్లు ఈ పద్దు కింద వస్తుందని అంచనా వేయగా, అందులో రూ.19,836 కోట్లు వచి్చనట్టు చూపెట్టారు. కానీ, 2025–26లో రూ. 22,782.50 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును చూపెట్టగా, అందులో కేవలం రూ.11,161.49 కోట్లు మాత్రమే వచి్చంది. అయినా ఈసారి కేంద్రంపై భారీ ఆశలతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును పెంచి రూ.24,166 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మద్యం,రిజిస్ట్రేషన్ల ఆదాయంపైనే ఆశ మద్యం, రిజిస్ట్రేషన్లు.. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి 2025–26లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.19,087 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ, ప్రతిపాదిత బడ్జెట్ కంటే దాదాపు రూ.3 వేల కోట్లు తక్కువగా రూ.16,087 కోట్ల ఆదాయం వచ్చింది. అయినా 2026–27 బడ్జెట్లో ఈ శాఖ ద్వారా రూ.19,540 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించడం గమనార్హం. దీనిని బట్టి ఈసారి భూముల విలువల సవరణ తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2024–25లో ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరగా, ఏ4 (వైన్) షాపులకు టెండర్లు íపిలవడం ద్వారా రూ.2వేల కోట్లు ఎక్కువగా వస్తుందన్న అంచనాల మేరకు రూ.27 వేల కోట్లు ప్రతిపాదించారు. అయితే, వైన్షాపుల టెండర్ల ద్వారా సమకూరిన మొత్తంతో కలిపి కూడా ఎక్సైజ్ ఆదాయం రూ.23,623 కోట్లు మాత్రమే వచి్చంది. అంటే దాదాపు రూ.4 వేల కోట్లు తగ్గింది. ఈ బడ్జెట్లో కూడా ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.27,668 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. -
అప్పులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే అప్పుల పద్దు ఈసారి బడ్జెట్లో కూడా పెరిగింది. అనివార్య ఖర్చులు, రెవెన్యూ వ్యయం సజావుగా సాగేందుకు వీలుగా వివిధ రూపాల్లో తీసుకునే రుణాలు 2026–27 బడ్జెట్లో రూ.80 వేల కోట్లు దాటాయి. 2025–26లో రూ.74,645 కోట్లను ప్రతిపాదించగా, ఈసారి అంతకంటే దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కువగా రూ.82,870.42 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలే రూ.73,383 కోట్లు ఉన్నాయి. అలాగే కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు, డిపాజిట్ లావాదేవీలు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.4 వేల కోట్ల వరకు అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు.సగం వరకు చెల్లింపులకే..ఏటా తీసుకునే అప్పులతో పాటు పద్దులో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. కాలపరిమితి తీరిన గత అప్పులు, అన్ని అప్పులకు వడ్డీలు ఏయేటికాయేడు చెల్లించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేస్తారు. ఈ మేరకు అప్పుల్లో అసలుతో పాటు వడ్డీల చెల్లింపు కింద రూ.41 వేల కోట్లు చూపెట్టారు. ఇందులో అసలు కంటే వడ్డీలే ఎక్కువ ఉండడం గమనార్హం. 2026–27లో అసలు కింద రూ. 19,785 కోట్లు చెల్లించనుండగా, వడ్డీల కింద రూ.21,304 కోట్లు కట్టనున్నారు. ఇవి పోను మిగతా రూ.41 వేల కోట్లు ఇతర ఖర్చుల కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.బడ్జెట్ కంటే ఎక్కువ సేకరణగత రెండు బడ్జెట్లను పరిశీలిస్తే ప్రతిపాదించిన వాటి కంటే ఎక్కువే అప్పులు సేకరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రూపాల్లో కలిపి 2024–25లో రూ.62 వేల కోట్లు తీసుకోవాల్సి ఉండగా, రూ.63,786 కోట్లను సేకరించింది. 2025–26లో రూ.74,645 కోట్ల మేర రుణాలు తీసుకోవాలని బడ్జెట్లో పెట్టగా రూ.77,359 కోట్లను సేకరించారు.మూడేళ్లలో రూ.20 వేల కోట్లు పెరిగిన రుణాలురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 2024–25లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ ఏడాది పద్దు రూ. 62,440 కోట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాది రూ.74 వేల కోట్లకు పెరిగింది. ఈసారి రూ.82 వేల కోట్లకు చేరడంతో మూడేళ్ల కాలంలో ఒక్క అప్పుల పద్దే ఏకంగా రూ.20 వేల కోట్లు పెరిగినట్టయింది. అదేవిధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోలిస్తే అప్పులు 32.5 శాతానికి చేరినట్టు బడ్జెట్ గణాంకాల్లో వెల్లడించారు. 2025–26లో కూడా ఇదే రీతిలో అప్పుల ప్రతిపాదనలుండడం గమనార్హం. -
9 కొత్తగా పథకాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి లెక్కల పద్దుతోపాటు కొన్ని కొత్త పథకాలకూ బడ్జెట్ వేదికైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు నిధుల కేటాయింపును ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కొత్తగా 9 పథకాలనూ ప్రకటించారు. వాటి వివరాలను శుక్రవారం బడ్టెట్లో ప్రస్తావించారు. వీటిల్లో కొన్ని పూర్తి కొత్త పథకాలు కాగా, కొన్ని అమలులో ఉన్న వాటి పరిధి పెంచారు. వీటికి నిధులను ప్రతిపాదించారు.‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకుటుంబానికి జీవనధారమైన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా బీమా సౌకర్యాన్ని క ల్పించాలని నిర్ణయించారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’అని నామకరణం చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల కుటుంబాలు ఉన్నాయని సామాజిక, ఆర్థిక తారతమ్యాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం వర్తిస్తుందని భట్టి ప్రకటించారు. బడ్జెట్లో ఈ పథకానికి రూ. 4వేల కోట్లు కేటాయించారు. చేయూత కింద...చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన 2 లక్షల పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 43 లక్షల మందికి చేయూత అందిస్తున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రాష్ట్ర విద్యా కమిషన్ సూచన మేరకు మొత్తం 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎంపిక చేసిన ఈ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థ, ఇతర అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదించారు.ఆరోగ్య భద్రత పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించాలని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందడానికి వీలుంటుంది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం ఉద్యోగుల భద్రత కోసం దేశంలో తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం ద్వారా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ 2 కోట్ల అదనపు కవరేజీ లభిస్తుంది. ఇది 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మి డియెట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతీ విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావ అందిస్తారు. దీనికి బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మి డియెట్ అభ్యసిస్తున్న విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకం ఇంటర్ విద్యార్థులకూ దక్కనుంది. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంవిదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. యువతకు వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ, ఉపాధికి అవకాశం ఉన్న వివిధ దేశాల భాషల్లో అవగాహన క ల్పించటం, వారికి వీసా పొందటంలో మార్గనిర్దేశం చేయటం, విదేశీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు, ఆయా దేశాల్లో ఆరోగ్య సేవలు కల్పించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఇందుకోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లుబడ్జెట్లో వెల్లడించారు. దీనికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్షిప్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెలా రూ. 2 వేలు స్కాలర్íÙప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించారు. -
వడగళ్ల వానతో 250 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న
జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో శుక్రవా రం కురిసిన భారీ వడగళ్ల వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మండలంలోని జక్రాన్ పల్లి, అర్గుల్, తొర్లికొండ గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. సుమారు 250 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం జరిగింది.అలాగే కల్లాలలో ఆరబెట్టిన పసుపు పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించాలని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న సిట్ విచారణ
మొయినాబాద్/శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. నాలుగో రోజు శుక్రవారం శంషాబాద్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారులు నిందితులను విచారించారు. స్టేషన్ బెయిల్ పొందినవారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు అర్జున్రెడ్డి, కౌశిక్ రవి, శరత్కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు.సిట్ అధికారులు ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించి వారి నుంచి డ్రగ్స్కు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ లోక్సభ సమావేశాలు ఉన్నందున వచ్చే నెల 4 వరకు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు తీసుకున్నారు. ఎంపీతోపాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో అసలు విషయాలు బయటకొస్తాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. శంషాబాద్కు సీపీ సు«దీర్బాబుడ్రగ్స్ కేసు విచారణను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంషాబాద్ పీఎస్కు చేరుకొని సిట్ అధికారులతో చర్చించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది. పెడ్లర్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలను రాబట్టాలని సూచించారు. ఈ వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి వాయిదా.. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేసి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, అతని తమ్ముడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 17న రాజేంద్రనగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై 18న కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 20కి వాయిదా వేసింది. 20న శుక్రవారం కోర్టుకు సెలవు ఉండటంతో తీర్పు సోమవారానికి వాయిదా పడింది.పాత రికార్డుల పరిశీలనవివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రోహిత్రెడ్డి ఫామ్హౌస్ను సీజ్ చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఫాంహౌస్ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు సైతం ఫాంహౌస్ భూమికి సంబంధించిన రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. అజీజ్నగర్ సర్వేనంబర్ 177/33లోని 2.20 ఎకరాల్లో రోహిత్రెడ్డి ఫామ్హౌస్ ఉంది. 2006లో రోహిత్రెడ్డి తండ్రి విఠల్రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది అసైన్డ్ భూమి కావడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అసైని అంతంగారి జంగయ్య పేరే వస్తోంది.అసైన్డ్ భూమి ఎలా రిజి్రస్టేషన్ జరిగింది ? అసలు పాత రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులు పాత దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఫామ్హౌస్ను సీజ్ చేయాల్సి వస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత రికార్డులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఫామ్హౌస్ను సీజ్ చేయాల్సి వస్తే అసైన్డ్ భూముల్లో ఉన్న మిగతా ఫామ్హౌస్లు, కబ్జాదారులపైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూముల్లో ఉన్న ఫామ్హౌస్లు, నిర్మాణాలు, కబ్జాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
గ్యారంటీలకు ఘోరీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. 20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. ‘బడ్జెట్ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్లోనే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్రావు విమర్శించారు. మూడు ముక్కలు చేయడం తప్ప.. ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ పేరిట, హైదరాబాద్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. బడ్జెట్ అంతా బోగస్. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు. మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ అమలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టించారు. కేసీఆర్ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు.. కరప్షన్ హబ్గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో ఫెయిల్ మీరు పాలనలో ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్కుమార్రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు. -
రేషన్కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్జోన్లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్రావు చెబుతుండడం తప్పు. చక్రధర్గౌడ్ పంజగుట్ట పీఎస్లో తనను హరీశ్రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్రావు బెదిరించినట్టు చక్రధర్గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
నిధుల మూట.. ప్రగతి బాట
సాక్షి హైదరాబాద్: ‘ధీరోదాత్తుడు ఎన్నడూ అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగుతాడు. ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రగతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్పై నమ్మకం కలిగించాం. ఇక పురోగతిలో మా మార్కు చూపుతాం. గత రెండున్నరేళ్లుగా ఈ బాటలోనే సాగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటికి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెడుతున్నాం.ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచి్చన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే మా లక్ష్యం. మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించేదిగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రూపొందించాం..’ అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల బడ్జెట్ను డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఉప ముఖ్యమంత్రి మాటల్లోనే.. పన్నుల సొమ్ము ప్రజల అభ్యున్నతికే.. ⇒ వరసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. మేం ప్రజలిక్చిన హామీలను, ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను ఈ రెండున్నరేళ్ల పాలనలో సంతృప్తి్కరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. పన్నుల రూపంలో వచి్చన సొమ్మును, తిరిగి ప్రజల అభ్యున్నతి కోసమే వెచి్చస్తున్నాం. ప్రతి పైసకు మేం కాపలాదారుగా ఉంటున్నాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం.రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్ట ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు. ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. దేశానికి బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ ⇒ 2025–6 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లుగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ 5 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ నిలుస్తోంది. గణనీయంగా పెరిగిన తలసరి ఆదాయం ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. అదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం æ1.9 రెట్లు ఎక్కువ. ⇒ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. మరిన్ని కేంద్ర నిధులకు కృషి ⇒ 2014–15 నుంచి 2023–24 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి ఉన్న రూ.3 వేల కోట్లను విడుదల చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకార, సమాఖ్య వాద స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. 2021–22లో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.4,826 కోట్లు రాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ.7.72 వేల కోట్లను సాధించింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. గత ప్రభుత్వ అప్పులతో తీవ్ర భారం ⇒ గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20–39 సంవత్సరాలకు పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025–26 నుంచి 2031–32 దాకా చెల్లించాల్సిన రూ.34.58 వేల కోట్ల రుణం రూ.11.915 వేల కోట్లకు తగ్గింది. లక్షల కోట్ల పెట్టుబడులు ⇒ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ముఖ్య వేదికగా నిలిచింది. దీని ద్వారా దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దావోస్ వేదికగా ఆవిష్కరించిన ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 వల్ల రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. సింగపూర్, వియత్నాంకు చెందిన సంస్థల నుంచి మొత్తం రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వ్యవసాయానికి ప్రాధాన్యం... ⇒ దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడులలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు ప్రతిపాదించాం. రూ.కోట్లలో మహిళలకు ఆదా ⇒ ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా రూ.752 కోట్ల మేర మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటివరకు 10.97 కోట్ల సున్నా బిల్లులు జారీ అయ్యాయి. ఫలితంగా రూ.3,954 కోట్లను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. హైదరాబాద్ సమ్మిళిత, సమాన అభివృద్ధి ⇒ హైదరాబాద్ అభివృ·ద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ అవతల, లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ 3 కార్పొరేషన్లుగా మార్చి సమ్మిళిత, సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నాం. 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి దానిని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో 67,763 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే మా విధానం ⇒ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా సమతుల్యంగా బడ్జెట్ను రూపొందించాం. పన్నులతో సామాన్యుడిపై భారం మోపకుండా, ఉన్న వనరులను సది్వనియోగం చేస్తూ, కొత్త సంపదను సష్టించి, దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం.‘పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి..’ అన్న మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పునాది ఈ బడ్జెట్. ఈ పునాది ఆధారంగా ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణను నిర్మించేందుకు ఇది బ్లూ ప్రింట్. డిజిటల్ జనగణనకు ముమ్మర ఏర్పాట్లు ⇒ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. తెలంగాణ ప్రజల ఆశాదీపం ⇒ బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం. మన భవిష్యత్తు ⇒ కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం ⇒ ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం ⇒ నీడలేని వారికి నీడ కల్పించడం ⇒ పంట పొలాలకు నీళ్లు పారించడం.. ఫలసాయం పెంచడం ⇒ కష్టపడే వారికి పని కల్పించడం..ఇష్టపడేలా పాలన అందించడం ⇒ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. ⇒ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. -
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్చాట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు. -
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బడ్జెట్ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు. -
బడ్జెట్.. విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్లో అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు కేటాయించింది.బడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించింది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీలకు నెలకు రూ. 2000 స్కాలర్ షిష్లు ఇవ్వాలని నిర్ణయించింది. -
తెలంగాణ బడ్జెట్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించినున్నట్టు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత ఆసుపత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్లరకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్లో ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇది తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు అత్యధిక కేటాయింపు కావడం విశేషం. అలాగే, ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయింపు చేశారు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా దక్కనుంది. ఇది కూడా చదవండి: తెలంగాణ బడ్జెట్ 2026-27.. హైలైట్స్ ఇవే.. -
చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్.. సర్కార్ స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రి మండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దశలవారీగా టేకోవర్...మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది.దీంతో మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నారు. పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను పలువురు అభినందించారు. -
Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అమీర్పేట్-రాయదుర్గం మార్గంలో అంతరాయం ఏర్పడింది. జూబ్లీచెక్ పోస్టు దగ్గర మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో రెండు వైపులా కూడా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ అంతరాయం కలగడంతో ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరించే పనిలో ఉందని.. కొద్దిసేపట్లో సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో అధికారులు తెలిపారు. -
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్.. హైలైట్స్ ఇవే
👉తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ఆరు గ్యారెంటీలకు రూ.50713 కోట్లు కేటాయింపుసంక్షేమం - అభివృద్ధికి రూ.145592 కోట్లుఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా – ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కవరేజ్విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభంఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొత్తగా అమలుయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభందివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీజీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ – 3 కార్పొరేషన్లుహైదరాబాద్కు “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణంCURE–PURE–RARE మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధిరైతులకు సోలార్ పంపు సెట్లు – 100 శాతం సబ్సిడీభూ భారతి చట్టం–2025 అమలుAI ఆధారిత ‘భూ మిత్ర’ చాట్బాట్ ప్రవేశపెట్టడంప్రజావాణి కార్యక్రమం – నేరుగా ఫిర్యాదుల స్వీకరణప్రజాపాలన-ప్రగతి 99 రోజుల ప్రోగ్రాంసీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులు -ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్సమగ్ర ప్రమాద బీమా పథకం ప్రభుత్వ ఉద్యోగులకుమహిళా ఎస్హెచ్జీలకు బస్సులు, పెట్రోల్ బంకులు274 మొబైల్ అంగన్వాడీలు ఏర్పాటు - 500 అంగన్వాడీ-కమ్-క్రెచ్ సెంటర్లుగోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు (రూ.500 కోట్లు)మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ - మెట్రో ఫేజ్-II, III విస్తరణఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, ఛార్జింగ్ స్టేషన్లుడ్రగ్స్ నియంత్రణకు EAGLE ప్రత్యేక దళం ఏర్పాటు👉ఉద్యోగులకు నగదు రహిత వైద్యంనగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వంప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటనప్రభుత్వాస్పత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్న ప్రభుత్వంరాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనంఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని పేర్కొన్న ప్రభుత్వం👉తెలంగాణ వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా.. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం రూ. 47,267 కోట్లుజూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకంవ్యవసాయం-రూ.23,179 కోట్లువిద్యుత్శాఖ-రూ. 21,285 కోట్లువిద్యాశాఖ-రూ.26,674 కోట్లుమహిళ, శిశు సంక్షేమం-రూ.3143 కోట్లుపశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లుసివిల్ సప్లై-రూ.7,366 కోట్లువైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లురాజీవ్ యువవికాసం- రూ. 6000 కోట్లుఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లుఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లుమైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లుఇరిగేషన్ -రూ.22615 కోట్లుమున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లుగృహ నిర్మాణం- రూ.7430 కోట్లుఐటీ- రూ.875 కోట్లుచేనేత- రూ.258 కోట్లుపరిశ్రమలు- రూ. 3490 కోట్లుపంచాయతీ రాజ్- రూ.33688 కోట్లుఆర్అండ్బీ - రూ.12789 కోట్లున్యాయ శాఖ- రూ.2367 కోట్లుహోంశాఖ- రూ. 121907 కోట్లుటూరిజం- రూ. 1224 కోట్లుగోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలు(అప్పుల రుపం లో)-80 వేల కోట్లుకొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లుద్రవ్య లోటు- 58458కోట్లుప్రాథమిక లోటు -37154ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్తో పోలిస్తే 43 వేల కోట్ల అదనపు బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వంఅప్పుల చెల్లింపు -23024భూముల అమ్మకం ,ఇతర మార్గాలు -35730వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు 2500 కోట్లుఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం 350 కోట్లుపంచాయతీ రాజ్ రోడ్లకు 2622 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు,చేయుత పెన్షన్లకు రూ.14,861 కోట్లుకొత్తగా 2 లక్షల మంది అర్హులకు చేయుత పింఛన్లు మంజూరుపంచాయతీ రాజ్ హమ్ రోడ్లకు రూ.1372 కోట్లుకనస్ట్రషన్ అఫ్ రూరల్ రోడ్లుకు రూ.750 కోట్లుమెయిటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ రూ.500 కోట్లుకేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు CSS పథకాల ద్వారా భారీగా నిధుల సమీకరణప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,072 కోట్లు సాధన2021-22లో రూ.4,826 కోట్లు పొందిన రాష్ట్రంనిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ పెరుగుదలబడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయింపుప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీంఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకంవెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లుఉస్మానియా యూనివర్సిటీ కి 1000 కోట్లు2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులుచాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లుఅడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీ లకి నెలకు 2000 స్కాలర్ షి👉ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931తెలంగాణ వృద్ధి రేటు 10.2 శాతందేశ తలసరి ఆదాయం రూ. 2,19,575దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.9 రెట్లు ఎక్కువప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యం: భట్టి2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్ధడమే లక్ష్యం 👉ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..ATCలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్ షిప్..👉తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం👉ముగిసిన కేబినెట్ సమావేశంరాష్ట్ర బడ్జెట్ను ఆమోదించి గవర్నర్కు పంపిన కేబినెట్👉అసెంబ్లీలో పాము కలకలం..అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పాము ను పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..పాము ను ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన ట్రాఫిక్ పోలిస్..👉బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కభట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులునల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భట్టి విక్రమార్క👉మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్కమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్రూ.3.35 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం👉బడ్జెట్ ముందు ఉదయం ప్రజాభవన్లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు👉ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి..👉మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు.👉అనంతరం బినెట్ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు.👉అదే సమయంలో శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. 👉ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం.👉స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి. -
మూగబంధం.. ప్రాణప్రదం
పెంపుడు జంతువులపై ఎనలేని మమకారంనగర శివారు మీర్పేట్ పరిధి వెంకటాద్రి కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని హిమబిందుకు పెట్స్ అంటే ప్రాణం. బంధువుల నుంచి మూడు పిల్లులను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. కుటుంబ సభ్యుల కంటే ఆమెకు మార్జాలంపైనే మక్కువ. అంతలా ప్రేమించే పిల్లి ఇటీవల రోడ్డుపై మృతి చెంది కనిపించింది. షాక్కు గురైన హిమబిందు మానసిక ఒత్తిడికి గురైంది. గురువారం బెడ్రూంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది ● వనస్థలిపురానికి చెందిన శాంభవి దేవి మగ పెర్షియన్ పిల్లిని పెంచుకుంటోంది. ఇటీవల అది అనారోగ్యం బారిన పడటంతో పెట్ క్లినిక్కు తీసుకెళ్లింది. డాక్టర్ పరీక్షించి మూడుసార్లు సర్జరీలు చేశాడు. అయినా.. పిల్లి ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో శాంభవి కుంగిపోయింది. మళ్లీ డాక్టర్ సంప్రదించగా.. అసభ్యకర పదజాలంతో దూషించాడని చైతన్యపురి ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది. ఇలా.. పిల్లులు, శునకాలు, కుందేళ్లు, పావురాలు, చిలుకలు.. కావేవీ అనుబంధాలకు అనర్హం అన్నట్టుగా మారింది నగరంలోని ప్రస్తుతం పెట్ లవర్స్ పరిస్థితి. మానవ సంబంధాల కంటే పెంపుడు జంతువుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. జంతువుల మీద ప్రేమలు, ఆప్యాయతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రేమగా పెంచుకునే పెట్స్ అనారోగ్యానికి గురైనా హైరానా పడిపోతున్నారు. మానసిక ఒత్తిడి, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఇక, అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు మరణిస్తే.. తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి బంధాలు చేరాయి. – సాక్షి, సిటీబ్యూరో బంధాల కోసం వెతుకులాట.. మానవ సంబంధాలు దారి మళ్లుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ప్రైవసీ.. కారణాలమైనా మహా నగరంలో అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. ఆప్యాయంగా పలకరించే వాళ్లే కరువైపోయారు. దీంతో అనుబంధాలను ఎతుక్కునే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులతోనే మమకారం పెనవేసుకుంటోంది. ఇంట్లో మాట్లాడేవాళ్లే లేకపోవడంతో పెట్స్తోనే జీవితం గడిపే పరిస్థితి ఏర్పడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలుక తప్పిపోవడంతో హైరానా పడిపోయిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫైర్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు.. మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి తప్పిపోయిన చిలుకను క్షేమంగా యజమానికి అప్పగించిన సంఘటన ఇటీవల బంజారాహిల్స్లో జరిగింది. మానసిక ఒత్తిడి దూరం.. మానసిక అలసట, దుఃఖం లేదా ఒంటరితనంతో ఉండే వ్యక్తులు జంతువులతో ఎక్కువగా మమేకమవుతున్నారు. మానసిక స్థితిని నియంత్రించుకోవడానికి, బంధాలపై నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి పెంపుడు జంతువులు సహాయపడతాయని పలు అధ్యయనాల్లోనూ తేలింది. పెట్స్ ఓ స్టేటస్ సింబల్ మారంది. స్థానిక జాతులు కాకుండా ప్రపంచ దేశాల నుంచి అరుదైన జంతువులను తీసుకొచ్చి పెంచుకోవడం కొత్త ఫ్యాషన్గా మారింది ఇంటిలో వాటి కోసం ప్రత్యేకంగా గదులు, ఆడుకునేందుకు వార్డ్రోబ్లు, ప్రత్యేకంగా పెట్ పార్క్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇగ్వానాలు, షుగర్ గ్లైడర్లు, బర్మీస్ కొండచిలువ, బాల్ పైథాన్లు, నక్షత్ర తాబేలు వంటి జంతువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రేమాప్యాయతలు కనబరుస్తున్న పెట్ లవర్స్ వీటికి అనారోగ్యం వస్తే తట్టుకోలేని వైనం పెంపుడు పిల్లి మృతిని తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తాజాగా నగర శివారు మీర్పేట్లో విషాద ఘటన కుక్క ఆరోగ్యం మెరుగవ్వలేదని వైద్యుడిపై ఇటీవల కేసు గ్రేటర్ పరిధిలో చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు -
ఆహార కల్తీని అరికడదాం
87126 61212కు ఫోన్ చేయండి అబిడ్స్: నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో (హెచ్–ఫాస్ట్) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గురువారం న్యూ ఉస్మాన్గంజ్ రోడ్డులోని పాత బేగంబజార్ పోలీస్స్టేషన్ భవనంలో ఈ టీమ్ కార్యాలయాన్ని ఐపీఎస్ అధికారి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభోత్సవం చేశారు. జంట నగరాల్లో ఆహార కల్తీని నిరోధించేందుకు కొత్వాల్ వీసీ సజ్జనర్ నేతృత్వంలో, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో హెచ్–ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆహార కల్తీకి పాల్పడితే 87126 61212కు ఫిర్యాదు చేయవచ్చు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రంజిత్కుమార్ గౌడ్, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ పాల్గొన్నారు. -
ఊహల పల్లకిలో..
● రాష్ట్ర బడ్జెట్పై జలమండలి భారీ ఆశలు ● క్యూర్ వాటర్, సీవరేజీ మాస్టర్ ప్లాన్ ● కేటాయింపులు సరే.. నిధుల విడుదల అంతంతే ఇస్తారా రూ.6,500 కోట్లు! మురిపించేనా.. ఉసూరుమనిపించేనా? రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తేనే మూడు కార్పొరేషన్ల మనుగడ సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీర్చే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (జలమండలి) రాష్ట్ర బడ్జెట్– 2026–2027పై ఆశలు పెట్టుకుంది. జలమండలి పరిధి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్ )వరకు విస్తరించడంతో బాధ్యతలు రెట్టింపయ్యాయి. దీంతో ఈసారి అవసరమైన నిధుల కోసం బడ్జెట్లో ప్రధానంగా నాలుగైదు అంశాలపై దృష్టి సారించి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్యూర్ వాటర్, సీవరేజ్ మాస్టర్ ప్లాన్లు, గోదావరి ఫేజ్–2, 3, సుంకిశాల ఇన్టెక్ వెల్, ఎస్టీపీల నిర్మాణ పనులకు నిధులు అవశ్యమని భావిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జలమండలి రూ.6,500 కోట్ల వరకు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా ఈసారి రూ.5వేల కోట్ల వరకు నిధులు కేటాయింపు ఉండవచ్చని జలమండలి భావిస్తోంది. సీవరేజ్ పనులకు ‘బూస్ట్‘ లభించేనా? సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవ పథకానికి అనుబంధంగా సీవరేజ్ పనులకు ఈ బడ్జెట్లో ‘బూస్ట్‘ లభించే అవకాశం ఉనట్లు తెలుస్తోంది, నగరం చుట్టూ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మూసీ ప్రక్షాళనకు ఊతమివ్వచ్చని జలమండలి ఆశిస్తోంది. గత మూడేళ్లలో బడ్జెట్ కేటాయింపులు భారీగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో నిధుల విడుదల ఆశించిన స్థాయిలో లేకుండాపోయింది. గతంలో కేటాయించిన నిధుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వరకే సకాలంలో విడుదలవుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్పై క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు భారీ ఆశలే పెట్టుకున్నాయి. క్యూర్ పరిధిలోని 27 స్థానిక సంస్థల్నీ దృష్టిలో ఉంచుకొని గత జనవరి 31 జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు ఇస్తారనే నమ్మకంతోనే ఆమోదం తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల అంచనాతోనే ఆ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. పాత జీహెచ్ఎంసీ పరిధి వరకు రూ.9,200 కోట్లు, విలీనమైన 27 స్థానిక సంస్థల పరిధిలో పనులకు రూ.2,260 కోట్లతో, మొత్తం రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. హెచ్– సిటీ ప్రాజెక్ట్ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు తదితర నిర్మాణాల కోసం, రూ.7,032 కోట్లు.. 7.60 లక్షల వీధిదీపాలకు రూ.1,341.60 కోట్లు, సీఆర్ఎంపీ కింద 1045 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్ల పనులకు ప్రభుత్వం పాలనపరమైన ఆమోదం తెలిపినప్పటికీ నిధులు కావాల్సి ఉంది. ఇవి దీర్ఘకాలిక పనులు కావడంతో ఏడాది కాలానికై నా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.3,100 కోట్లు అందవచ్చనే ఆశతోనే బడ్జెట్ను ఆమోదించారు. మారిన నగర ముఖ చిత్రం.. మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కాకముందే, విలీనమైన 27 స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, ఒకే కార్పొరేషన్గా ఆ బడ్జెట్ను ఆమోదించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులవసరం. రెండు కొత్త కార్పొరేషన్లు తమకు ప్రత్యేకంగా బడ్జెట్ను రూపొందించుకోవాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధి మారినందున దాని బడ్జెట్నూ సవరించాల్సి ఉంటుంది మూడు కార్పొరేషన్లుగా రూపాంతరం చెందకముందు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.400 కోట్లు గ్రాంట్స్, క్యాపిటల్ గ్రాంట్స్గా రూ.3,100 కోట్లు ఇవ్వగలదని భావించారు. కానీ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో నగర ముఖచిత్రమే మారినందున మరిన్ని నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందన్నది చూడాలి. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించనిదే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు మనుగడ సాగించలేని పరిస్థితి. గత మూడేళ్లలో ఇలా.. ఆర్థిక సంవత్సరం ప్రతిపాదన బడ్జెట్ కేటాయింపు (రూ. కోట్లలో) 2025-2026 5,500 3,385 2024-2025 5,650 3,385 2023-2024 5,937 1,960 -
అక్రమ సిలిండర్
● 1,073కు పైగా సిలిండర్లు సీజ్ ● ఒక వినియోగదారుకు ఒకటే కనెక్షన్ ● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● రంగంలోకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గ్రేటర్లో ‘ఎల్పీజీ’పై మెరుపు దాడులు సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో గ్యాస్ సిలిండర్ల అక్రమ చలామణిపై పౌరసరఫరాల శాఖ సీరియస్గా దృష్టి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కొన్ని రోజులుగా తనిఖీలు ముమ్మరం చేసింది. గృహావసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తోంది. మరోవైపు హోటళ్లలో సరైన పత్రాలు లేని అక్రమ ఖాళీ వాణిజ్య సిలిండర్లపై సైతం కొరడా ఝుళిపిస్తోంది. శ్రీనగర్ కాలనీ, మలక్పేట్, దిల్సుఖ్నగర్, చార్మినార్, జియాగూడ, అబిడ్స్, నార్సింగి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, బాలానగర్, షాపూర్నగర్, సూరారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై దాడులు జరిపి సుమారు 1,073కుపైగా సిలిండర్లను సీజ్ చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 308కి పైగా కేసులు నమోదు చేసింది. రీఫిల్లింగ్ చేస్తున్న కమర్శియల్, చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. నిబంధనలు కఠినతరం.. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. ఒక వినియోగదారుడికిఒకే కనెక్షన్్ మాత్రమే ఉండాలి. ఒకే పేరు మీద వేర్వేరు కంపెనీల కనెక్షన్లు ఉండటం నిబంధనలకు విరుద్ధం. అలాంటి కనెక్షన్లను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తున్నారు. మరోవైపు పైపులైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు పాత ఎల్పీజీ కనెక్షన్ను వెంటనే సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే (పైప్డ్ గ్యాస్) వాడుతున్న వారు సుమారు 20 వేలకు పైగా తమ పాత కనెక్షన్లను సరెండర్ చేయలేదని గుర్తించారు. అక్రమ ఖాళీ సిలిండర్లున్నా సీజ్ హోటళ్లు, హాస్టళ్లలో గృహ వినియోగ సిలిండర్ల వినియోగం చట్టరీత్యా నేరం. తనిఖీ సమయంలో ఇతర కంపెనీలకు చెందిన ఖాళీ సిలిండర్లు కనిపించినా, వాటికి సరైన ఆధారాలు చూపకపోతే అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. హోటల్ కిచెన్లలో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉండాలని, డొమెస్టిక్ సిలిండర్లు లభ్యమైతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? హోటల్ యజమానులు ప్రభుత్వ చర్యలపై హోటల్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని వారు వాపోతున్నారు. ఈ తరుణంలో అధికారులు దాడులు చేస్తూ సిలిండర్లను సీజ్ చేయడం వల్ల వ్యాపారాలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల దందాను అరికట్టేందుకు, సామాన్య గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో దాడులు ఇలా.. జిల్లా సిలిండర్ల కేసులు సీజ్ హైదరాబాద్ 643 233 రంగారెడ్డి 250 45 మేడ్చల్–మల్కాజిగిరి 180 30 -
ఆర్జీఐఏ సిబ్బంది ఉత్తమ సేవలకు మరోసారి అవార్డు
శంషాబాద్: విమానాశ్రయంలో సిబ్బంది అందించే ఉత్తమ సేవలకు గాను ఆర్జీఐఏ మరోసారి అవార్డును దక్కించుకుంది. ‘స్కైట్రాక్’ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల ద్వారా చెక్ ఇన్, భద్రత, ఇమిగ్రేషన్ తదితర అంశాల్లో ప్రయాణికుల అనుభవాన్ని క్రోడీకరించి ఈ అవార్డును అందజేస్తారు. ఈ మేరకు 2026 ‘బెస్ట్ ఎయిర్పోర్టు స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఏషియా ’ అవార్డును లండన్లో నిర్వహించిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోలో అందజేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆర్జీఐఏ ప్రయాణంలో ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి అని తెలిపారు. -
సంప్రదాయాలతోనే సమతుల్యత
మణికొండ: ప్రకృతి, పండగలు, సంప్రదాయాలు ఆచరించినపుడే జీవితంలో సమతుల్యత సాధ్యమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. గురువారం ఉగాది పండగను పురస్కరించుకుని కోకాపేట నియోపోలీస్లోని పీఠంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఉదయం 9గంటల నుంచి శ్రీశారదా చంద్రమౌళీశ్వర ఆరాధన, సంగీత విహారి, పంచాంగ ఆవిష్కరణ, పంచాంగ శ్రవణం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే విశాఖలో ఉన్న పీఠం మాదిరిగానే కోకాపేటలోను ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలు సుబిక్షంగా ఉండి, అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం రెండు రాష్ట్రాల ప్రజలకు సంపూర్ణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పంచాంగం, నక్షత్రాలు, గ్రహణాలు వంటి అంశాలు మూఢనమ్మకాలు కావని, వాటిపై మన రుషులు పరిశోధనలు చేసి వాటిని మనకు అందించారన్నారు. వాటి ఆదారంగానే సముద్రపు అలల మార్పు, జంతువుల ప్రవర్తన, చెట్లు చిగురించటం లాంటివి సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయన్నారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కాబట్టి అంతా బాగుంటుందని, ప్రతి రోజు ఉదయం సూర్యారాధన చేసే వారికి మరింతగా బాగుంటుందన్నారు. జూలై నెల నుంచి ఇక్కడే ఉండి పీఠం రాజశ్యామల అమ్మవారి దేవాలయ నిర్మాణ పనులను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్రావు, ఎన్సీఎల్టీ న్యాయ సభ్యుడు జస్టిస్ బద్రీనాథ్, మాజీ న్యాయమూర్తి మఠం వెంకటరమణ, హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, డీఆర్డీఏ మాజీ చైర్మెన్ సతీష్రెడ్డి, మాజీ డీజీపీ అంజనీకుమార్, గజల్ గాయకుడు శ్రీనివాస్లతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతిస్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి -
ఇక చెల్లింపులే కీలకం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు,సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది.మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రిమండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆర్ధిక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా టేకోవర్.... ● మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది. ● ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది. ● గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది. ● దీంతో మెట్రో మొదటిదశను స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... ● అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి. ● ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది. ● అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ● ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. చివరి అంకానికి చేరుకున్న మెట్రో టేకోవర్ మరో 10 రోజుల్లో సర్కార్ స్వాధీనంలోకి... బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం -
మణికొండ వేదకుమార్కు అరుదైన గుర్తింపు
ఇంటాక్ న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్కు నాలుగోసారి ఎన్నిక హిమాయత్నగర్: డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్), న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాలుగోసారి ఎన్నికై నట్లు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సెక్రెటరి కట్టా ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేదకుమార్ అర్బన్, రీజనల్ ప్లానర్, అంకితభావంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఇంటాక్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించడం ఆయన నిబద్ధత, విశ్వసనీయత, వారసత్వ సంరక్షణలో చేసిన విశిష్ట సేవలను ప్రతిబింబిస్తోందని అన్నారు. -
డీపీతో టోపీ!
నగర వ్యాపారి ఫొటో వాట్సాప్ డీపీగా వినియోగం సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా వ్యాపారి ఫొటోను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్గా (డీపీ) ఏర్పాటు చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్కు టోకరా వేశారు. ఆమె పంపినట్లుగా సందేశం పంపి రూ.1.2 కోట్లు కాజేశారు. మరో రూ.18 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నించగా... విషయం సదరు వ్యాపారికి తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సదరు సంస్థకు దేశ వ్యాప్తంగా క్లైంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి వీరి ఖాతా నుంచి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. యజమానురాలి నుంచి వచ్చే మౌఖిక ఆదేశాలు, సందేశాల ఆధారంగా అక్కడ అకౌంటెంట్ ఈ లావాదేవీలు చేస్తూ ఉంటారు. దీన్నే సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఈ సంస్థ యజమానురాలితో పాటు ఇతర ఉద్యోగుల వివరాలను సంగ్రహించారు. నెట్ నుంచే సంగ్రహించిన యజమానురాలి ఫొటోను తమ వాట్సాప్ నెంబర్కు డీపీగా పెట్టారు. ఈ నెంబర్ నుంచి ఈ ఈ నెల 13 మధ్యాహ్నం 3.30 గంటలకు అకౌంటెంట్కు ఓ సందేశం పంపారు. అందులో పొందుపరిచిన బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేయమంటూ ఆ సందేశంలో ఉంది. తమకు సందేశం వచ్చింది కొత్త నెంబర్ నుంచే అయినప్పటికీ... డీపీగా యజమానురాలి ఫొటోనే ఉండటంతో అకౌంటెంట్ నమ్మాడు. అది తన యజమానురాలికి చెందిన మరో నెంబర్గా భావించాడు. తరచు ఆమె నుంచి ఇలాంటి సందేశాలు రావడం, నగదు బదిలీలు జరగడం మామూలే కావడంతో ఆ సందేశంలో ఉన్న ఢిల్లీకి చెందిన సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేశాడు. ఆ రోజు తన యజమానురాలు హైదరాబాద్లో లేకపోవడంతో ఈ వివరాలను తన రికార్డుల్లో పొందుపరిచినా.. ప్రత్యేకించి ఆమె దృష్టికి తీసుకువెళ్లలేదు. ఒకసారి తమ పథకం పారడంతో సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సంస్థ నుంచి మరికొంత దోచుకోవాలని భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అదే వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంటెంట్కు మరో సందేశం పంపారు. ఈసారి తమిళనాడులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ ఖాతాకు రూ.18 లక్షలు బదిలీ చేయాలని అందులో పొందుపరిచారు. తన యజమానురాలి ఫొటో డీపీగా ఉన్న కొత్త వాట్సాప్ నెంబర్ నుంచి మరో సందేశం రావడం, అందులో మరో రాష్ట్రంలోని బ్యాంకు ఖాతా వివరాలు ఉండటంతో అకౌంటెంట్ అనుమానించాడు. అందుబాటులో ఉన్న యజమానురాలి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. దీంతో జరిగిన విషయం గుర్తించిన ఆమె నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్పర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్లోని 66సీ, 66 డీ, భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) 318 (4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి వాళ్లు వినియోగించిన సెల్ఫోన్ నెంబర్తో పాటు నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతా వివరాలను విశ్లేషిస్తున్నారు. ఆ నెంబర్ వినియోగించి ఆమె అకౌంటెంట్కు సందేశం ఢిల్లీకి చెందిన బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీకి ఆదేశం రూ.1.2 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు, కేసు నమోదు -
అలరించిన భక్త ప్రహ్లాద పద్యనాటకం
హైదరాబాద్ : ఉగాది సందర్భంగా ఫిలింనగర్లోని ఫిలించాంబర్లో ఆవరణలో ఉన్న రామానాయుడు కళామండపంలో ఉగాది పౌరాణిక పద్యనాటకోత్సవాలు నిర్వాహకులు పొత్తూరి వెంకట సుబ్బారావు గురువారం ప్రారంభించారు.పద్య నాటకోత్సవాల్లో భాగంగా తొలి రోజు రంగ స్థల కళాకారులు భక్త ప్రహ్లాద భక్తి రస ప్రధాన పద్యనాటకాన్ని రక్తి కట్టించారు.జగాది విజయసాయి దర్శకత్వం వహిచంగా మీగడ రామలింగ స్వామి ఈ నాటికను రచించారు. ప్రహ్లాదుడుగా చిరంజీవి జాహ్నవి లక్ష్మి, హిరణ్యకశ్యపగా బగాది విజయ సారధి, దేవేంద్రుడిగా బిర్లంగి ప్రసాద్, నారదుడుగా బగాది విజయసాయి, తామ్రక్షుడిగా డేవిడ్రాజు, దూమ్రాక్షుడిగా తమ్మినేని దాలినాయుడు, చండగా మైలిపల్లి చంద్రరావు, అమార్కుగా ఓలేటి శంకర్, సింగిగా కుమారి, లీలావతిగా సంధ్యా ప్రియదర్శిని, శ్రీ మహావిష్ణువుగా సురేంద్ర నాయుడు, వీరాక్షుడుగా బీఎస్.రెడ్డి, ఘోరాక్షుడిగా పైడిరాజు, ఋషులుగా పులి శివ ప్రకాశ్, ఎల్. జోగారావు నటించారున. నేటి తరానికి రంగ స్థల కళలను పరిచయం చేసేందుకు ఈ నాటికలను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు పొత్తూరి వేంకట సుబ్బారావు తెలిపారు. -
షడ్రుచుల సంగమం.. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. ఆధునిక, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.పరాభవం నుంచి ప్రాభవంలోకి.. ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాత్మితకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు.కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శాస్త్రాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్ బో విస్టాస్ రాక్గార్డెన్ అధ్యక్షులు టీఎస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్రెడ్డి, తదితర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.అమోఘం.. రుచుల మిశ్రమం..ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి.తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. – కూకట్పల్లి/మూసాపేటఅలరించిన భక్తి ‘గీతాంజలి‘ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం ‘భక్తి జామింగ్‘. అపార్ట్ మెంట్ కి చెందిన గీతాంజలి ప్రత్యేకంగా తన బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ బృందం ఆలపించిన హిందీ, తెలుగు భక్తి గీతాలు గంట పాటు శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ప్రదర్శన అనంతరం ఆహూతులు అందరూ నిల్చుని చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారుమోగింది. -
ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్ : ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్, విజయ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సంయుక్తంగా ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పెద్ది రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాగిడి లక్ష్మా రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ కొలను హనుమంత రెడ్డి, సెక్రటరీ సందీప్ రెడ్డి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పరంపర కళాకారులు ప్రదర్శించిన మహాకాళి నృత్యం ఆద్యంతం కట్టి పడేసింది. దీంతో పాటు నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, ప్రముఖ సామాజికవేత్త శిల్పా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సంప్రదాయ పిండి వంటల తో విందును ముగించారు. -
నిదుర.. రాదుర..
సాక్షి, హైదరాబాద్: మనిషి ఆరోగ్యకర జీవనానికి తగినంత నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మెట్రో నగరాల ప్రజలను మాత్రం నిద్రాదేవత తగినంత కరుణించట్లేదు. వేక్ఫిట్ డాట్ కామ్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిద్రవేళల్లో క్రమశిక్షణ, నిద్రలేమి, నిద్రలేచే సమయాలు, పగటిపూట అలసట వంటి కీలక నిద్ర సూచికల ఆధారంగా ఈ సర్వే చేపట్టింది. దీని ఆధారంగా ఆయా నగరాలకు ర్యాంకులు ప్రకటిస్తూ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ పేరిట నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. నిద్ర ఆధారంగా నగరాలకు ఇచ్చిన ర్యాంకులు ఇవే... » దేశంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నిద్ర అందుకుంటున్న నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోవడం (48.8%) ఆలస్యంగా నిద్రలేవడం (23.8%) అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 32.1% మంది నిద్రలేమి బాధితులున్నారు. అయితే గణనీయమైన సంఖ్యలో (61.9%) విశ్రాంతి పొందకుండానే నిద్రలేస్తున్నట్లు చెబుతున్నారు.» స్థిరమైన నిద్ర అలవాట్లను ప్రతిబింబిస్తూ హైదరాబాద్ ’బ్యాలెన్స్డ్ స్లీప్ సిటీ’గా నిలిచింది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా 31 శాతం మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే మెరుగైన సమతౌల్యమైన నిద్రా విధానాన్ని సూచిస్తుంది. » గురుగ్రామ్ మూడో స్థానంలో నిలిచి ‘రెసిలియంట్ స్లీపర్ సిటీ’గా పేరు పొందింది. ఇక్కడి యువ ఉద్యోగులు తమ బిజీ షెడ్యూళ్లను నిర్వహిస్తూనే ఆరోగ్యకరమైన నిద్రా విధానాలను పాటిస్తున్నారు. » బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచి ‘స్లీప్ పారడాక్స్’గా నిలిచింది. ఇక్కడ 36.3% మంది అర్ధరాత్రి తర్వాత నిద్రపోతుండగా 54% మంది నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించలేదన్నారు.» ఢిల్లీలో 45% మంది ఆలస్యంగా నిద్రలేస్తుండగా 32% మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. » కోల్కతా ‘లేట్నైట్ సిటీ’గా నిలిచింది. ఇక్కడ75.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నట్లు తెలిపారు. » ముంబై అత్యంత నిద్రలేమి నగరంగా నిలిచింది. ఇక్కడ 76.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 42.5% మంది ఆలస్యంగా నిద్రలేస్తుండగా 62.6% మంది నిద్రలేచాక విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించట్లేదని చెప్పారు. దాదాపు 60% మంది పనివేళల్లో నిద్రమత్తుగా అనిపిస్తోందని చెప్పడం గమనార్హం. డిజిటల్.. స్లీప్ డల్... డిజిటల్ పరికరాలపై ఆధారపడటం, అస్తవ్యస్తమైన పనివేళలు, పెరుగుతున్న అలసట దేశవ్యాప్తంగా నిద్ర విధానాలను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకం నిద్రకు భంగం కలిగించే అత్యంత సాధారణ ప్రవర్తన అని ఈ నివేదిక గుర్తించింది. 87.6 శాతం మంది రాత్రిపూట స్క్రీన్ ప్రభావానికి గురవుతున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, బింజ్–వాచింగ్ ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వంటి కార్యకలాపాలు నిద్ర నాణ్యత క్షీణించడానికి ముఖ్య కారణాలు. ఉత్పాదకత... హుష్ కాకి... నిద్రలేమి పనితీరుపై, ఉత్పాదకతపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. మెట్రో నగరాల్లో కార్యాలయ అలసట ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 64.4% మంది పగటిపూట నిద్రమత్తుకు లోనవుతున్నారు. బెంగళూరులో 61.7%, ముంబైలో 59.2% మందిది కూడా ఇదే పరిస్థితి. 57.8% మంది పనివేళల్లో నిద్రమత్తుగా ఉన్నట్లు చెప్పారు. ఇది 2025తో పోలిస్తే 7.8% అధికం. అదనంగా, 48.7% మంది భారతీయులు నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపించట్లేదని చెప్పారు. ఆలస్యపు ఉదయాలు... ఈ సర్వేలో ప్రజలు క్రమంగా ఆలస్యంగా నిద్రపోవడం వైపు మారుతున్నారని స్పష్టమైంది. 12%మంది మాత్రమే రాత్రి 10 గంటల్లోగా నిద్రపోతూ ఆరోగ్యకర నిద్రవేళలను పాటిస్తుండగా దాదాపు 60% మంది రాత్రి 11 గంటల తర్వాతే నిద్రపోతున్నారు. 29.1% మంది ‘కుదించబడిన నిద్రవేళలను’అనుభవిస్తున్నారు. అంటే ఆలస్యంగా నిద్రపోయినా పని ఒత్తిడి కారణంగా ఉదయాన్నే మేల్కొంటున్నారు. గతేడాదిలో 6 గంటల కంటే తక్కువ సేపే నిద్రపోయామని 46% మంది భారతీయులు తెలిపారు. -
స్టోరీతో వస్తే రీల్తో వెళ్లేలా..
సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. కేవలం స్టోరీతో సంప్రదిస్తే సినిమా పూర్తి చేసుకుని రీల్తో వెళ్లే విధంగా వెంట వెంటనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ, ఫార్మా పరిశ్రమకు సమానంగా సినీ పరిశ్రమను గుర్తించామని, చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గురువారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు–2025 ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆ నలుగురు చార్ మినార్ల వంటివారు.. ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఇవ్వడం మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. హైదరాబాద్ అంటే కేవలం ఐటీ హబ్, బిర్యానీ మాత్రమే కాదు.. ఇదొక సినిమా హబ్కు కేరాఫ్ అడ్రస్. భారతీయ సినీ పరిశ్రమకు గమ్యస్థానంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్కు చార్మినార్లోని చార్ మినార్ల లాగా ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ..ఈ నలుగురు సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. రామోజీరావు ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. ప్రభాకర్రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు. ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచి్చనా ముందుండే దాసరి నారాయణరావును కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తమ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. నెట్ ఫ్లిక్స్ వచ్చిందంటే హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టే. గద్దర్ ఒక చైతన్యం.. ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషం. సినిమా అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. సమాజాన్ని చైతన్యపరిచేందుకు దీన్ని సాధనంగా ఉపయోగించుకోవాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమా ద్వారా సందేశం అందించాలి..’అని సీఎం సూచించారు. సందేశాత్మక సినిమాలతో ప్రజల్లో మార్పు: డిప్యూటీ సీఎం ‘తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గద్దర్. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రపంచానికి చెప్పడమే. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. అనేక సందేశాత్మక సినిమాలు ప్రజల్లో మార్పునకు నాంది పలికాయి. అయితే గత పాలకులు 10 ఏళ్ల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదు. కానీ తెలుగు సినిమా తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచానికే తలమానికం కావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి గద్దర్ పేరిట సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించారు..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. -
రూ.3.35 లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం. స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి. ఈసారి దూకుడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే గత రెండు బడ్జెట్లలోనూ ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. అనేక అంచనాలు, ఆశలతో ఈసారి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా, 2025–26లో 5 శాతం పెంచి రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. అదే ఒరవడి కొనసాగితే 2026–27కు రూ.3.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముంది. కానీ ఏకంగా 10 శాతం పెంపుతో బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సమీకరణ పెరిగే అవకశాముందనే అంచనాలు, భూముల అమ్మకాలు, భూముల విలువల సవరణల ద్వారా మరిన్ని నిధులు సమకూరతాయనే ఆలోచనతో రూ.3.35 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పుల పద్దూ భారీగానే..! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 64,539 కోట్లు సేకరించాలని నిర్ణయించగా, ఈసారి దాన్ని రూ.80 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత రెండు బడ్జెట్లలో భూముల అమ్మకాల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదనలు లేవు. కానీ ఈసారి అనివార్యమవుతోందని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ద్వారా రూ.3 వేల కోట్ల వరకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రతిపాదన కూడా చేయనున్నట్టు సమాచారం. రూ.50 వేల కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా మూలధన వ్యయాన్ని కూడా పెంచనున్నారు. 2025–26లో రూ.36 వేల కోట్ల మూల ధన వ్యయం అంచనా వేసినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది రూ.50 వేల కోట్లను చేరింది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిపాదనలే రూ.50 వేల కోట్లకు చేరనున్నట్టు సమాచారం. 2025–26లో రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్కు గాను రూ.2.90 లక్షల కోట్ల వరకు సవరించిన అంచనాలుంటాయని భావిస్తూ ఈ మొత్తానికి మరో రూ.45 వేల కోట్లు కలిపి ఈసారి బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్టు సమాచారం. అభిజిత్ లగ్నం..రేవతి నక్షత్రం విజయ ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశలో ఈసారి బడ్జెట్కు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్ర అభిజిత్ లగ్నం సమయంలో అసెంబ్లీ ముందుంచనున్నారు. దీనికి ముందు ఉదయం ప్రజాభవన్లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి.. మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 9:30 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అదే సమయంలో శాసనమండలిలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి సాయం పెంపుఈసారి బడ్జెట్లో ఎప్పటిలాగే సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు యంగ్ ఇండియా స్కూల్స్ వరకు అన్నిటి బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, సన్న బియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అన్ని పథకాలను కొనసాగించేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నారు. అదే సమయంలో చేయూత పింఛన్లు రూ.500 చొప్పున పెంపు, కల్యాణలక్ష్మికి రూ.50 వేల అదనపు లబ్ధి ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. వీటికి తోడు మరో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్రంలోని దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రకటిస్తారని, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, యంగ్ ఇండియా కిట్స్, పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, వృద్ధ అర్చకులకు పింఛన్లకు తోడు ఎన్నికల హామీలో భాగంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్లు అందించే కార్యక్రమానికి కూడా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. -
ప్రతి రైతుకు.. ఒక ఎకరానికి..!
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్కు గాను ‘రైతు భరోసా’కింద పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి అదే వేదిక నుంచి ‘రైతుభరోసా’తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి గతానికి భిన్నంగా మొదటి విడతలో.. ఎన్ని ఎకరాలున్న రైతుకైనా ఒక ఎకరం లోపు విస్తీర్ణానికే సాయం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘రైతు బంధు’కింద 2018 జూన్ నుంచి గత వానాకాలం సీజన్లో ప్రారంభించిన ‘రైతు భరోసా’పథకం వరకు..దశల వారీగా మొదట ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, తర్వాత రెండెకరాలు, అంతకు మించి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరిగేది. ఈసారి ఆ విధానాన్ని మార్చి తొలి విడతలో రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఒక ఎకరానికి రూ.6 వేలు మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ కానుంది. తొలివిడతగా 73 లక్షల మందికి రూ.3,590 కోట్లు గత ఏడాది జూన్ 16వ తేదీన వానాకాలం సీజన్ రైతుభరోసా మొత్తాన్ని ఎకరాకు రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే 69.40 లక్షల మంది రైతులకు చెందిన 145.75 లక్షల ఎకరాల విస్తీర్ణానికి రూ.8,744.13 కోట్ల మొత్తాన్ని అందజేసింది. అందులో తొలి విడతగా ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు (13.54 లక్షల ఎకరాల సాగు భూమికి) రూ.812.63 కోట్లు చెల్లించారు. కానీ ఈసారి రైతులందరికీ ఎకరం లోపు విస్తీర్ణానికి సాయం అందించనున్నారు. ఈ విధంగా 73 లక్షల మంది రైతులకు సాయం అందిస్తుండగా.. ఇవ్వాల్సిన మొత్తాన్ని రూ.3,590 కోట్లుగా తేల్చారు. ఇలా చేయడం ద్వారా ప్రతిరైతుకు పెట్టుబడి సాయం అందిందనే తృప్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భావించినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక రెండో విడత కింద రూ. 2,650 కోట్లను ఏప్రిల్లో విడుదల చేస్తారు. మూడో విడత కింద మిగతా మొత్తాన్ని ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేయాలని నిర్ణయించారు. విస్తీర్ణంలోనూ మార్పులు రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి 1.50 కోట్ల ఎకరాలకు పైగానే ఉంటుందని వ్యవసాయ శాఖ లెక్కలు కట్టింది. అయితే ఇందులో వానాకాలం సీజన్లో పూర్తిస్థాయిలో సాగులో ఉన్న భూమి 1.30 కోట్ల ఎకరాలు. మిగతా భూమిలో మామిడి, నిమ్మ, దానిమ్మ, ఇతర ఉద్యాన తోటలు 12 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. మిగతా భూమి సాగులో లేకపోయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అందింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సాగు చేసే భూములకు మాత్రమే సీజన్ల వారీగా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. కానీ రైతుల్లో వ్యతిరేకత వస్తుందనే కారణంగా పాత పద్ధతినే కొనసాగించింది. గత జూన్లో మొత్తం 145.73 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేసింది. ఈసారి 73 లక్షల మంది రైతులకు మొత్తం రూ.8,881 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఈ నేపథ్యంలో ఈసారి రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. -
రైతు నామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజు చేయడమే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని రైతు నామ సంవత్సరంగా మారుస్తామని వెల్లడించారు. గురువారం రవీంద్రభారతిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయాధారితంగానే మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా వ్యవసాయరంగ సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేశామని.. రూ. 18 వేల కోట్లను రైతు భరోసా కోసం ఖర్చు చేశామని వివరించారు. ఈ నెల 22న మరో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. గతంలో రైతులను వేధించిన ధరణి భూతాన్ని పారదోలి భూభారతితో భూ సమస్యలు పరిష్కరించామని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటోందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది కొత్త పంచాంగాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పండితులు వేదాశీర్వాదం అందించారు. అనంతరం వేద పండితులు, ఆలయాల్లో సేవలందిస్తున్న కళాకారులను సన్మానించారు. ఈసారి మంచి వర్షాలే.. పరాభవ నామ సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండి మంచి వానలు కురుస్తాయని.. ఫలితంగా తెలంగాణ వ్యవసాయ తల్లిగా ధాన్యాగారంగా మారుతుందని పౌరాణికులు, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి పేర్కొన్నారు. శ్రీ పరాభవ ఉగాది వేడుకల్లో ఆయన ప్రభుత్వపక్షాన పరాభవ నామ పంచాంగాన్ని చదివి గోచార వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆరోగ్య శాఖలో అద్భుత ప్రక్షాళన జరుగుతుందని.. ప్రజారోగ్యానికి సంబంధించిన చర్యలు, మెరుగైన వైద్య వసతి కల్పించడంలో సానుకూలత ఉంటుందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల పరంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అవలంభించకుంటే ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదొడుకులు తప్పవన్నారు. ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని.. రాష్ట్రానికి ఖర్చులు బాగా పెరుగుతాయని పేర్కొన్నారు. పరిపాలనలో రాజుకు, మంత్రులకు మధ్య ఆధిపత్యాలను కోరుకొనే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే ధర్మంగా ఉండేవారికి మాత్రం ఈ ఆధిపత్యంలోనూ విజయం లభిస్తుందని వివరించారు. తులారాశిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులే ఉన్నాయని.. నడుస్తున్న దశా బలం, గోచార బలం, సమర్థత, వబలం వల్ల సవాళ్లను అధిగమించి తిరుగులేని ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని సంతోషకుమార్ శాస్త్రి చెప్పారు. -
రోహిత్రెడ్డి ఫాంహౌస్ సీజ్?
మొయినాబాద్, శంషాబాద్ రూరల్ : ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేయడంతో ఇప్పటికే రోహిత్రెడ్డితోపాటు అతని తమ్ముడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్శర్మను పోలీసులు జైలుకు పంపారు. డ్రగ్స్ మూలాలపై దృష్టి పెట్టిన పోలీసులు ఫాంహౌస్ కేంద్రంగా ఏయే రకాల దందాలు కొనసాగుతున్నాయనే విషయాలను వెలికితీస్తున్నారు.మరో వైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్రెడ్డి ఫాంహౌస్ను సీజ్ చేసేందుకు లేఖ రాస్తామని పోలీసులు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రెవెన్యూ అధికారులకు లేఖ అందే అవకాశం ఉంది. మూడో రోజు సుదీర్ఘ విచారణ.. మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో స్టేషన్ బెయిల్ పొందిన నిందితులను సిట్ అధికారులు మూడో రోజు సుదీర్ఘంగా విచారణ చేశారు. స్టేషన్ బెయిల్ పొందిన ఎనిమిది మందిలో ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు గురువారం మూడో రోజు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 11 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది? ఎవరు సరఫరా చేశారు? రోహిత్రెడ్డి ఫాంహౌస్లో ఎంత కాలం నుంచి డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి? వీటికి ఎవరిని పిలిచారు? శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రధానంగా ఏం చర్చించాలనుకున్నారు? అనే విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ్రపాంతాలకు చెందిన 11 మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారంటే వీరి మధ్య ఎలాంటి బిజినెస్ డీల్ జరిగిందనే కోణంలో ఆరా తీశారు. ప్రధానంగా డ్రగ్స్ మూలాలపైనే సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న పైలెట్ రోహిత్రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్శర్మలను కస్టడీకి తీసుకుంటే అసలు విషయాలు బయటకొస్తాయని ఓ అధికారి తెలిపారు. ఫాంహౌస్ సీజ్ చేసే అవకాశం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రోహిత్రెడ్డి ఫాంహౌస్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 177/33లో ఉన్న 3.39 ఎకరాల భూమిలో రోహిత్రెడ్డి ఫాంహౌస్ ఉంది. ఈ భూమిని ప్రభుత్వం అంతంగారి జంగయ్యకు అసైన్డ్ చేసింది. కొంత కాలం క్రితం రోహిత్రెడ్డి తన తండ్రి విఠల్రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేశారు. అయితే రెవెన్యూ రికార్డులో ఇప్పటికీ అంతంగారి జంగయ్య పేరుతోనే కొనసాగుతోంది. రోహిత్రెడ్డి ఫాంహౌస్ నిర్మించి అందులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు తోపాటు డ్రగ్స్ పార్టీ, గన్ ఫైరింగ్ వంటి వివాదాలకు ఈ ఫాంహౌస్ కేంద్ర బిందువుగా మారడంతో సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కస్టడీ పిటిషన్పై తీర్పు నేడే.. డ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు రోహిత్రెడ్డి, రితీశ్రెడ్డి, నమిత్శర్మను ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్పై రాజేంద్రనగర్ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. దీనిపై బుధవారం వాదనలు జరగడంతో తీర్పును శుక్రవారానికి రిజర్వు చేశారు. శుక్రవారం కోర్టు కస్టడీ పిటిషన్పై తీర్పు ఇవ్వనుంది. వారిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపితే కీలక విషయాలు వెలుగుచూస్తాని పోలీసులు సైతం భావిస్తున్నారు. -
మళ్లీ తెరపైకి బిల్డింగ్ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు పట్టణీకరణ వేగవంతమవుతుంటే మరో వైపు అంతే వేగంతో అక్రమ నిర్మాణాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం వద్ద నిర్దిష్ట యంత్రాంగమేదీ లేకపోవడంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. మహానగరంలో ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాం. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల్లో సుమారు 80 శాతం మేర అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. కాగా అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది కొరత, కోర్టు స్టే ఆర్డర్ల మూలంగా కూల్చివేతలు చేపట్టలేకపోతోంది. కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు నిరాకరించినా లేదా రద్దు చేసినా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మూలన పడిన ‘మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్’(ఎంబీటీ) ఏర్పాటు అంశాన్ని పురపాలక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2016లోనే తెరమీదకు ట్రిబ్యునల్2016లో ఎంబీటీ అంశం తెరమీదకు రాగా ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సవరణలు చేశారు. 2017లోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి నియమావళిని రూపొందించారు. ఈ నియమావళి ప్రకారం మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్లో చైర్మన్తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉండాలి. న్యాయ, సాంకేతిక అంశాలపై అవగాహన కలిగిన వారిని ట్రిబ్యునల్లో నియమించాలని ప్రతిపాదించారు. కేసుల సంఖ్యను బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బెంచ్లను కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రతీ బెంచ్లో కనీసం ఇద్దరు సభ్యులు (ఒకరు న్యాయ, మరొకరు సాంకేతిక అనుభవం) ఉండాలనే నిబంధన విధించారు. చైర్మన్గా నియమితులయ్యే వ్యక్తి జిల్లా జడ్జి లేదా మాజీ జిల్లా జడ్జి స్థాయి అధికారి అయి ఉండాలి. టెక్నికల్ సభ్యుడు తెలంగాణ టౌన్ ప్లానింగ్ సర్వీస్లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి అనే నిబంధనలు విధించారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ చైర్మన్ పదవికి అర్హులైన ఇద్దరు జిల్లా జడ్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. పలు విభాగాలు కూడా సభ్యుల పేర్లను పురపాలక శాఖకు సూచించాయి. ప్రతిపాదించిన సభ్యుల్లో కొందరిపై ఆ తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వేర్వేరు కారణాలతో ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. 2022లో హైకోర్టు ఆదేశాలు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటులో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని 2022 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని 2023లోనూ కోర్టు మరోసారి గుర్తుచేస్తూ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొంది.మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పారదర్శకత పెంచడం, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా చేపడుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట పడినా, ఇతర అక్రమ నిర్మాణాల నియంత్రణకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ లాంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమనే డిమాండ్ బలపడుతోంది. -
ఇంటర్ విద్యార్థిని కాపాడిన సబ్ కలెక్టర్
నిజాంసాగర్(జుక్కల్): ‘రామ్మా శ్రావణి.. నేను సబ్ కలెక్టర్ను వచ్చాను.. కిందకు దిగమ్మా...నీకు నేను ఉన్నాను కిందకు రామ్మా’అంటూ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి దాదాపు 9 గంటల పాటు గ్రామస్తులను ఆందోళనకు గురిచేసిన ఇంటర్ విద్యార్థిని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన మొట్ట శ్రావణి ఇందల్వాయి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన శ్రావణి బూర్గుల్ వచ్చింది. అయితే గురువారం ఇంట్లో తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కింది. కుటుంబీకులు, గ్రామస్తులు ఎవ్వరు చెప్పినా శ్రావణి ట్యాంకు దిగకపోవడంతో సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ట్యాంకు వద్దకు చేరుకొని మైక్ సెట్ ద్వారా శ్రావణికి నచ్చజెప్పారు. ఎంతకీ యువతి కిందకు దిగకపోవడంతో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూనే చిమ్మచీకట్లో సబ్ కలెక్టర్ ట్యాంక్ ఎక్కియువతి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఎస్సై శివకుమార్, అగ్నిమాపక సిబ్బంది ట్యాంకు ఎక్కి యువతిని కిందకు దించారు. చదువులకు పేదరికం అడ్డుకావడంతో పా టు నాయక్పోడ్ కులధ్రువీకర ణ సర్టిఫికెట్లు రావడం లేదన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని యువ తి సబ్ కలెక్టర్తో చెప్పినట్లు తెలిసింది.వాటర్ ట్యాంకు ఎక్కి విద్యార్థిని కిందికి తీసు కొచి్చన సబ్ కలెక్టర్ను గ్రామస్తులు అభినందించారు. -
ఎల్లుండి రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లింలు రేపు ఉపవాస ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎల్లుండి(మార్చి 21, శనివారం) రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం (30 రోజులు) శుక్రవారంతో పూర్తి కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ విప్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ విప్లను నియమించింది. శాసనసభ విప్లుగా యెన్నం శ్రీనివాస్రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను తెలంగాణ సర్కారు నియమించింది. అలాగే, శాసన మండలి విప్లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యెన్నం శ్రీనివాస్రెడ్డి వేముల వీరేశం -
ఆన్లైన్లో ట్రెండింగ్ గిఫ్ట్లు : ప్యార్ కా తోఫా
Ramadan 2026 విభిన్న ఆచారాలు, సంస్కృతుల నిలయం మన నగరం.. ఏ మంచి సంప్రదాయమైనా మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుంది.. అది హలీమ్, ధమ్కా రోట్ వంటి వంటకాలు కావొచ్చు.. రంజాన్ తోఫా వంటి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే పద్ధతులు కావొచ్చు.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వారిని ఒక చోట చేరుస్తున్న కార్పొరేట్ కల్చర్.. భౌగోళిక సరిహద్దులను మాత్రమే కాదు మతాల సరిహద్దులనూ తిరగరాస్తోంది. -సాక్షి, సిటీ బ్యూరో రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించి ఈద్–ఉల్–ఫిత్ర్ పండుగ సందర్భంగా పెద్దలు, పిల్లలకు తోచిన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవ డాన్ని ‘రంజాన్ తోఫా’ లేదా ‘ఈది’ గా పిలుస్తారు. ప్రేమ, కృతజ్ఞత, స్నేహ బంధాలను బలపరిచే ఒక చక్కని సంప్రదాయంగా స్థిరపడింది. నగదు రూపంలోనో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆట వస్తువులు, గాడ్జెట్లు వంటి బహుమతులు ఇవ్వడం ఒకరిని ఒకరు కలుసుకొని ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ బహుమతులు పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల ఈ రంజాన్ తోఫా సందడిలో భాగంగా కొత్త గిఫ్ట్ ఐడియాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఈ–కామర్స్ వృద్ధితో ఈద్ సమయంలో గిఫ్ట్ల ఎంపికలో విపరీతమైన మార్పులు చేర్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ ఆఫీసులు తమ ఉద్యోగుల కోసం కూడా తోఫాలను అందిస్తుండటంతో మరిన్ని కొత్త సొబగులు సంతరించుకుంటున్నాయి. ట్రెండింగ్ రంజాన్ గిఫ్ట్లు.. చాక్లెట్లు, అత్తర్, ప్రార్థనా మాలలతో తయారు చేసిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్లు ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే ప్రత్యేక ఖర్జూరాలను అందంగా ప్యాక్ చేసి బహుమతిగా ఇవ్వడం ట్రెండ్గా మారింది. పేరు లేదా ఈద్ ముబారక్ మెసేజ్తో ఉన్న కప్పులు, ఫొటోఫ్రేమ్స్, కస్టమ్ గిఫ్ట్ బాక్స్లకు నగరంలో బాగా డిమాండ్ ఉంది. కుర్తాలు, హిజాబ్లు, అబాయాలు, షాల్స్ వంటి ఫ్యాషన్ వస్తువులు కూడా బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు.ఇస్లామిక్ సంప్రదాయంలో సువాసనలు ముఖ్యమైనవి కావడంతో అత్తర్ లేదా అరబిక్ పరిమళాలు కూడా ప్రముఖ గిఫ్ట్ ఎంపికలుగా మారాయి. (Ugadi 2026 ‘పరాభవ’అంటే అవమానం కాదు, ఇదీ అర్థం!)చంద్రతార డిజైన్లతో ఉన్న లాంతర్లు, వాల్ హ్యాంగింగ్స్, ఖురాన్ ఆయతుల్లా కాలిగ్రఫీ ఫ్రేమ్స్ వంటి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. రంజాన్ తోఫా కేవలం బంధువుల మధ్య బహుమతులు పంచుకోవడం మాత్రమే కాదు. కొన్ని ప్రాంతాల్లో పేద ముస్లిం కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో ఆర్థిక చేయూత అందిస్తుంటారు. ఈ పండుగ సీజన్లో ఆలోచనాత్మకంగా రూపొందించిన గిఫ్ట్ బాక్సులు సిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలో ఒకటిగా మారుతున్నాయి. నగరవ్యాప్తంగా ఇప్పుడు విభిన్న అభిరుచులు ప్రాధాన్యతకు అనుగుణంగా ఈద్–థీమ్ హ్యాంపర్లను వ్యాపార సంస్థలు ఆన్లైన్ వేదికలు రూపొందిస్తున్నాయి. కొన్ని డెజర్ట్లు పండుగ ప్రత్యేక వంటకాలతో నిండిన ఆహార–ఆధారిత బహుమతులపై దృష్టి సారిస్తుండగా, మరికొన్ని యాక్సెసరీలు వ్యక్తిగతీకరించిన వస్తువులతో కూడిన ఆహారేతర హ్యాంపర్లను అందిస్తున్నాయి. అందంగా ప్యాక్ చేసిన స్వీట్ల నుంచి సొగసైన మెమెంటో బాక్సుల వరకు, హ్యాంపర్లు ఈ సందర్భాన్ని జరుపు కోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రేమ, సహానుభూతి, పంచుకునే భావనను ప్రతిబింబించే చిన్న బహుమతి అయినా పెద్ద ఆనందాన్ని పంచుతుంది. రంజాన్ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తుంది. ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రముఖ సర్జన్ డా. ప్రదీప్ కుమార్ సేథి భేటీ
హైదరాబాద్: దేశంలోనే ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. ప్రదీప్ కుమార్ సేథి ముంబైపర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాపరిధిలో ఉన్న “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించాలని రాష్ట్రపతిని ఆయన ఆహ్వానించారు.డా. సేథి రాష్ట్రపతికి తెలిపిన ప్రకారం ఈ పాఠశాల ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాలో ఉండి, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందిస్తోంది. అలాగే క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ప్రస్తుతం సుమారు 350 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు, వివిధ క్రీడా కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా అందిస్తున్నారు. “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ను డా. ప్రదీప్ కుమార్ సేథి తన సంస్థ ద్వారా నిర్వహిస్తూ, గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణాన్నిఅందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్నిప్రశంసిస్తూ, సమయం లభించినప్పుడు పాఠశాలను తప్పక సందర్శించి పిల్లలను కలసి ప్రోత్సహిస్తానని తెలిపారు. డా. ప్రదీప్ సేథి ప్రపంచంలోని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిపుణుల్లోఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన Eugenix Hair Sciences ద్వారా దేశ, విదేశాల్లోవేలాది మంది రోగులకు విజయవంతమైన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సినీ నటులు, అంతర్జాతీయ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, అనేక ప్రముఖులకు సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు కూడా విశేష గుర్తింపు లభించింది. డా. సేథి రాసిన అనేక పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. Step to Step Hair Transplant అనే పుస్తకాన్నిరచించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సను నేర్చుకునే వైద్యులకు మార్గదర్శకంగా నిలిచారు. ఈ పుస్తకం ద్వారా దేశ, విదేశాల్లోని అనేక మంది వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. డా. సేథి తన వైద్య ప్రయాణాన్నిఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవభూమి ప్రాంతంలో ప్రారంభించారు. న్యూఢిల్లీలోని AIIMS నుంచి డెర్మటాలజీలో MD పూర్తిచేసిన అనంతరం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో తన తొలి కేంద్రాన్నిస్థాపించారు. ప్రస్తుతం Eugenix Hair Sciences విదేశాలతో పాటు, ముంబై, గురుగ్రామ్, భువనేశ్వర్, హైదరాబాద్ వంటి పలు నగరాల్లోకేంద్రాలను కలిగి ఉంది.గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. ప్రదీప్ సేథి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైద్య రంగంలో విశేష విజయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. Eugenix Hair Sciences గురించి:Eugenix Hair Sciences భారతదేశంలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హెయిర్ రీస్టోరేషన్ బ్రాండ్ గా ప్రసిద్ధిచెందింది. శాస్త్రీయ విధానాలతో ఆధునిక పరిష్కారాలను అందిస్తూ, విశ్వసనీయతను సంపాదించింది. ప్రముఖ సర్జన్లుడా. ప్రదీప్ సేథి మరియు డా. అరికా బన్సాల్ స్థాపించిన ఈ సంస్థ, 30 సంవత్సరాలకుపైగా కలిపిన అనుభవంతో క్లినికల్ నైపుణ్యం, నైతిక వైద్య విధానం, అంతర్జాతీయ ప్రమాణాలను సమన్వయం చేస్తోంది. Eugenix లో హెయిర్ రీస్టోరేషన్ సాధారణ ట్రాన్స్ ప్లాంట్ ను మించి, అత్యంత క్లిష్టమైన బాల్డ్నెస్ కేసులను కూడా ఖచ్చితత్వంతో చికిత్స చేస్తారు. ఇక్కడ అభివృద్ధిచేసిన Direct Hair Transplant (DHT) టెక్నాలజీ సంప్రదాయ ఊ్ఖఉ పద్ధతితో పోలిస్తేమెరుగైన గ్రాఫ్ట్సర్వైవల్ ను అందిస్తుంది. శాస్త్రం మరియు కళను సమన్వయం చేసిన ఈ విధానం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నాణ్యతను గణనీయంగా పెంచింది. 18,000కుపైగా విజయవంతమైన ప్రొసీజర్లు, 50 మిలియన్ గ్రాఫ్ట్ల ఇంప్లాంటేషన్ తో Eugenix విశ్వాసం, పారదర్శకత, ఫలితాలపైఆధారపడి మంచి పేరు సంపాదించింది. కఠినమైన మెడికల్ ప్రోటోకాల్స్, పేషెంట్ఫస్ట్విధానం, వ్యక్తిగత చికిత్స ప్రణాళికలు మరియు నిరంతర ఆవిష్కరణ సంస్థ విజయానికి మూలం. Eugenix పురుషులు మరియు మహిళలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, హెయిర్ లైన్ రీ కన్సస్ట్రాక్షన్, గడ్డం, కనుబొమ్మల పునరుద్ధరణ, కరెక్టివ్ ప్రొసీజర్లు, ఆఫ్రో, బాడీ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి విస్తృత సేవలను అందిస్తుంది. ఆధునిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన వైద్య బృందం ద్వారా అత్యున్నత నాణ్యత మరియు భద్రతను నిర్ధారిస్తుంది. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన Eugenix అంతర్జాతీయ స్థాయిలో వేగంగా విస్తరిస్తూ, ఆధునిక సాంకేతికతను అభివృద్ధిచేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ క్రికెటర్లు, సంగీత విద్వాంసులు సహా అనేక మంది రోగులకు విజయవంతమైన సేవలను అందించింది. Eugenix హెయిర్ రీస్టోరేషన్ రంగంలో నైతిక వైద్య విధానాలకు ప్రాధాన్యతనిస్తూ, పారదర్శక కన్సల్టేషన్, నిజాయితీ గల గ్రాఫ్ట్అంచనా, వాస్తవిక ఫలితాల నిర్ధారణ ద్వారా రోగులలో దీర్ఘకాల విశ్వాసాన్నిఏర్పరచుకుంది. ప్రతి చికిత్సను అనుభవజ్ఞులైన వైద్యులు పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో వైద్య బాధ్యతను నిర్ధారిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
హైదరాబాద్: ప్రేమ విషయంలో మానసిక ఒత్తిడికి గురై ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించానని వెంటపడ్డ యువకుడు దాడిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం ధర్నా, రాస్తారాకో నిర్వహించారు. చిలకలగూడ ఠాణా పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రేబల్లె గ్రామానికి చెందిన గుడిసె కోటేశ్వరరావు, రమాదేవి దంపతులు సికింద్రాబాద్ శ్రీనివాసనగర్లో ఉంటూ పద్మారావునగర్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తె జెనిమా (19) ఉన్నారు. జగదీష్ అనే యువకుడు, జెనిమా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జెనిమా కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతోంది. మంగళవారం ఉదయం జెనిమా మాత్రమే ఇంట్లో ఉంది. ఆసమయంలో జగదీష్ ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత యువతి తల్లి రమాదేవికి ఫోన్ చేసి .. మీ కుమార్తె లోపల నుంచి తలుపు గడియపెట్టుకుంది. మీరు త్వరగా రావాలని చెప్పాడు. జెనిమా తల్లి రావడంతో స్థానికులతో కలిసి జగదీష్ తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ద్విచక్ర వాహనంపై గాం«దీఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. తమ కుమార్తెను జగదీష్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా జెనిమాపై దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం చిలకలగూడ గాంధీ చౌక్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం పెద్దపుడుమూరుకు చెందిన నిందితుడు జగదీష్ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చిలకలగూడ ఎస్హెచ్ఓ రామకృష్ణ తెలిపారు. మృతురాలి ఇంట్లో సూసైడ్నోట్ స్వాదీనం చేసుకున్నామని, అందులో ప్రేమ విషయమై మానసిక ఒత్తిడికి గురైనట్లు ఉందని స్పష్టం చేశారు. మృతురాలి కాళ్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. -
తెలంగాణ పోలీస్ బాస్ ఎవరంటే?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండటంతో, కొత్త డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నట్లు సమాచారం. డీజీపీ ఎంపికలో సాధారణంగా అధికారుల అనుభవం, సేవా రికార్డు, రాష్ట్రానికి చేసిన కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీవీ ఆనంద్కి నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభాకర్ ఆప్టే వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్య మిశ్రా కూడా తన సేవా కాలంలో అనేక ముఖ్యమైన పదవులను చేపట్టారు. ఈ ముగ్గురిలో ఎవరు కొత్తగా తెలంగాణ పోలీస్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.శివధర్ రెడ్డి పదవీ విరమణతో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో కొత్త నాయకత్వం అవసరం ఏర్పడింది. కొత్త డీజీపీ నియామకం రాష్ట్రంలో చట్టం, శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ ముగ్గురు అధికారులలో ఎవరు డీజీపీ? అనేది త్వరలో స్పష్టత రానుంది. -
మిగులు పోస్టులెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండేళ్ల కాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, టీచర్లు, లెక్చరర్లు, పోలీస్ విభాగాల్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు, మెడికల్ ఆఫీసర్, నర్సు లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా దాదాపు 70 వేల ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు నిర్వహించి అర్హులకు నియామకపత్రాలను జారీ చేసి నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో మెజార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రాలు పంపిణీ చేశారు. పత్రాలు అందుకున్న వారిలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారు? ఎంతమంది ఉద్యోగాలను వద్దనుకున్నారు? అందుకు ప్రధాన కారణాలను గుర్తించేందుకు జీఏడీ పరిశీలన ముమ్మరం చేసింది. ఇలా ఇవ్వండి... ఉద్యోగ ఖాళీల భర్తీకి వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ వైద్య, ఆరోగ్య సర్వీసుల నియామకాల బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. అర్హత పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు అర్హుల జాబితాలను సమర్పించడంతో నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. గడువులోగా రిపోర్టు చేయకుంటే సదరు ఉద్యోగావకాశాన్ని రద్దు చేయనున్నట్లు ఆయా అభ్యర్థులకు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన జీఏడీ... ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి ఉద్యోగాల్లో చేరిన, చేరని వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరిస్తోంది. ఉద్యోగ కేటగిరీ, అర్హత సాధించిన అభ్యర్థి హాల్టికెట్ నంబర్, పేరు, జిల్లా/జోన్/మల్టీజోన్ కేటగిరీ, ఉద్యోగంలో చేరిన తేదీ, డిలీటెడ్ వేకెన్సీ తదితర వివరాలున్నాయి. ఉద్యోగంలో చేరకుంటే అందుకు గల కారణాన్నీ వివరించాలని సూచించింది. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత సాధించడంతో వారంతా మెరుగైన పోస్టును ఎంచుకున్నారు. ఇలాంటి వారి వివరాలను కూడా స్పష్టంగా ఇవ్వాలని చెప్పింది. ఈ సమాచారాన్ని అందించేందుకు ఆయా శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ఖాళీలపై స్పష్టత ఎంతమంది కొలువుల్లో చేరారో తెలుసుకునేందుకు జీఏడీ ఒకవైపు చర్యలు చేపట్టగా... మరోవైపు శాఖల వారీగా ఖాళీల వివరాలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో రెండు అంశాలకు వేర్వేరుగా సమాచారాన్ని ఆయా శాఖలు సిద్ధం చేశాయి. ఇటీవల జీఏడీ ఆధ్వర్యంలో ఉద్యోగాల్లో చేరికలకు సంబంధించి సమీక్షలు కూడా జరిగాయి. నియామకపత్రాలు అందించిన వాటిలో అన్ని కేటగిరీల్లో రిపోర్టింగ్ గడువు ముగిసింది. వచ్చే సోమవారం కల్లా ఆయా శాఖలు వివరాలను అందించాల్సి ఉంటుంది. గ్రూప్–1 కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తయింది. ప్రభుత్వం పలు ఆటంకాలను అధిగమించి ఒకేసారి 563 ఉద్యోగాలను భర్తీ చేసింది. తొలి నోటిఫికేషన్ కావడం... అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం టీజీపీఎస్సీ పరపతికి గీటురాయిగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా భర్తీ చేసిన గ్రూప్–1 ఉద్యోగాల్లో ఎంతమంది అభ్యర్థులు చేరారనే అంశంపై కమిషన్ కూడా ఆయా శాఖలకు ప్రత్యేక ఫార్మాట్ పంపి సమాచారాన్ని సేకరిస్తోంది. -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్–2034 (ఒక ట్రిలియన్ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పాత వాటితో పాటు కొత్తగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా కిట్స్ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డిలు మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నించారు. దాని డీపీఆర్ సిద్ధమైందా, ప్రాజెక్టు వ్యయం అంచనా ఎంత, నిర్వాసితుల సంఖ్య, వారి పునరావాస చర్యల గురించి ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, ప్రాజెక్టు మొదటి దశకు డీపీఆర్ సిద్ధమైందని, మొదటి దశ అంచనా వ్యయం రూ.ఆరున్నర వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్లని, దాదాపు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, నిర్వాసిత కుటుంబాలకు టీడీఆర్ను జారీ చేస్తామని, 2013 చట్టం ప్రకారం సహాయ పునరావాసాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రి, మూసీనది అభివృద్ధి సంస్థ ఎండీ భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం అవసరమవుతుందని రెండు నెలల క్రితం ఇదే సభలో ప్రకటించిన శ్రీధర్బాబు, ఇప్పుడు డీపీఆర్ సిద్ధమైందని చెప్పటం వింతగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్బాబు చెప్పారని, కానీ, ఆ బ్యాంకును జనవరి, మార్చి నెలల్లో రెండు పర్యాయాలు సంప్రదిస్తే... తమకు డీపీఆరే అందలేదని, ఎలాంటి లోన్ మంజూరు చేయలేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. సమాచార లోపం వల్ల ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారా, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చెబుతున్నారా అంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రేమో రూ.లక్షన్నర కోట్లని చెబుతుంటే, ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు ఆరేడువేల కోట్లని అంటున్నారని నిలదీశారు. మంత్రి శ్రీధర్బాబు 1,400 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, మరి గెజిట్లో 10 వేలకుపైగా నిర్మాణాలు ప్రభావితానికి గురవుతాయని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బఫర్ జోన్ విషయంలో 50 మీటర్లని మంత్రి అంటే, అధికారుల మాటల్లో అది చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బురద చల్లటం ఆపాలి: మంత్రి శ్రీధర్బాబు కేటీఆర్ మాటలపై మంత్రి శ్రీధర్బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వైఖరి ముందు నుంచీ మేం బురద చల్లుతాం...మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్ మాత్రం రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని ఆ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్గా గుర్తిస్తూ 2016 లో అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్బాబు తెలిపారు. కేవలం రెండు నెలల్లో డీపీఆర్ ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించటం విడ్డూరమని, డీపీఆర్ తయారీ ఏడాది సమయం పట్టిందన్నారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుకు డీపీఆర్ ఇచ్చామని, తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకుకు సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. బీఆర్ఎస్కు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా: భట్టి బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. మూసీ ప్రక్షాళన ఆ పారీ్టకి ఇష్టం లేదోమోనని, దాని పరీవాహక ప్రాంత పేదల జీవితాలు బాగవ్వాలని ఆ పార్టీ కోరుకోవటం లేదేమోనని ఆరోపించారు. మూసి నిర్వాసిత పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్కాలర్ జాబ్లు పోయి బ్లూకాలర్ జాబ్లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
లూటీకి సహకరిస్తున్న అధికారుల తోకలు కత్తిరిస్తాం
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తామంటూ తమ పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరిట సీఎం చేస్తున్న దోపిడీకి సహకరిస్తున్న అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. శాసనసభ లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం చాంబర్లో కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి అందరి అభిప్రాయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం వచ్చిందని, డీపీఆర్ పూర్తయిందని సీఎం, మంత్రులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డీపీఆర్ పూర్తయినట్లు సభలో ఆధారాలు చూపకపోతే అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని కేటీఆర్ చెప్పారు. 3,297 ఎకరాల భూ సేకరణ, 10 వేల నిర్మాణాలపై ప్రభావం చూపుతుందని నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. అసెంబ్లీలో మాత్రం 1,400 నిర్మాణాలు ఉన్నాయని మాత్రమే చెప్తోందన్నారు. బ్లాక్ లిస్ట్లో మూసీ కాంట్రాక్టు సంస్థ ‘మూసీ పరిసరాలను సుందరీకరణ చేయడం మినహా ప్రభుత్వం చేసేదేమీ ఉండదు. మధు రిడ్జ్ పార్కువాసులపై వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సీఎం ఇతర నిర్వాసితులనూ అదే రీతిలో ఎందుకు చూడటం లేదు. మూసీ ప్రాజెక్టు అప్పగించిన మెయిన్హార్ట్ కాంట్రాక్టు సంస్థను సింగపూర్, పాకిస్తాన్తోపాటు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్లాక్ లిస్టులో పెట్టింది. బఫర్జోన్లో 50 మీటర్లు దాటి ఎక్కడో 5 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్నగర్ వాసులకూ నోటీసులు ఇస్తున్నారు.పలువురు మంత్రులు, సీఎం సోదరుడు, పలువురు నేతల ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయి. నార్సింగి, మంచిరేవుల వరకు మూసీ బఫర్లో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అంటే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అనే విమర్శ ఉంది. హైదరాబాద్లో ఏవీ రెడ్డి, కొండల్రెడ్డి, అనిల్రెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు ముఠాగా ఏర్పడి రిటైర్డ్ అధికారుల అండతో భూ దందా సాగిస్తున్నారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలనపై పట్టులేదు.. ‘సీఎంకు, మంత్రులకు పాలనపై పట్టులేదు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. మంత్రులకు అధికారులు బిజినెస్ రూల్స్ చెప్పాలి. ఐటీ రంగం కుప్పకూలితే హైదరాబాద్లో ఆతిథ్య, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతింటాయి. ఫ్యూచర్ సిటీ పేరిట ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 14 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఫార్మా భూముల్లో ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, జడ్జీలు, జూ పార్కులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తోంది’అని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసు ‘అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసు. మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ధాటిని తట్టుకోలేక అసెంబ్లీ ఎందుకు పెట్టామా అని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. రేవంత్ మమ్మల్ని దూషిస్తున్నా స్పీకర్ ఖండించే పరిస్థితి లేదు. అలాంటపుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిపై ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్ విధించాం. ఆయన నుంచి సమాధానం వచ్చిన తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరికపై ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదు’అని కేటీఆర్ వెల్లడించారు.


