breaking news
Hyderabad
-
కేన్సర్ రోగుల లెక్క తేల్చరా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేన్సర్ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తోంది. ఏటా 55 వేల మందికిపైగా కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్న చికిత్సల గణాంకాలతో వెల్లడవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా కేన్సర్ రోగుల లెక్కలను సేకరించడంలేదు. నిబంధనల ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదీనంలోని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సరై్వలెన్స్ పోర్టల్ (ఐడీఎస్పీ)లో దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, ప్రమాదకర రోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చాలి. తద్వారా ఆయా వ్యాధుల నివారణ, ముందు జాగ్రత్తలపై కేంద్రం నిఘా ఉంటుంది. ఆయా వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, ఎక్కడెక్కడ ప్రబలుతున్నాయనే అంశాలపై కేంద్రానికి పరిశోధనలు జరిపే అవకాశం లభిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కేవలం అంచనాలకే పరిమితమవుతోంది. ఐడీఎస్పీలో నిరంతర పర్యవేక్షణ సీజనల్ వ్యాధులతోపాటు తాగునీరు, ఆహారం, దోమలు, ఇతర రోగాలకు సంబంధించిన గణాంకాలను ఐడీఎస్పీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించి ఆయా రోగాలపై నిరంతర నిఘా పెడుతుంది. డయేరియా, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్, కలరా, వంటి 12 రోగాలపై ‘ఎల్’కేటగిరీలో నిఘా కొనసాగిస్తుంది. వాటితోపాటు కుక్క కాటు, పాముకాటు, చికెన్పాక్స్, మీజిల్స్, ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సోకే వ్యాధులు, ఇతర గుర్తించని రోగాలకు సంబంధించి ‘ప్రిసంప్టివ్’విభాగంలో నమోదు చేసి ముందు జాగ్రత్త చర్యలు, పరిశోధనలు జరుపుతుంది. అలాగే సంబంధిత రాష్ట్రాలకు అవసరమైన మందులు, ఇతర సహకారాన్ని కూడా అందిస్తుంది. మంత్రి చెప్పినా పడని ముందడుగు .. రాష్ట్రంలో ఏటా 55 వేలకుపైగా కేన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు ఓ కేన్సర్ డే కేర్ సెంటర్ (సీడీసీ)ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్తోపాటు కీమోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారు. త్వరలో రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కేన్సర్ చికిత్స అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. లంగ్, బ్రెస్ట్, సరై్వకల్ కేన్సర్లే ఎక్కువగా రాష్ట్రంలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులకు తొలిదశ నుంచే చికిత్స అందించడం ద్వారా కేన్సర్ మరణాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ కేసులను ప్రతి వారం ఐడీఎస్పీలో నమోదు చేయాలని మంత్రి దామోదర గతంలో తన శాఖ సమీక్షలో ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు లేదు. -
కాంగ్రెస్కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్: కేటీఆర్
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్రెడ్డి, రోహిన్రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు. తుపాకీ రోహిన్రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదని, ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు. -
కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదే బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తోంది.కిషన్రెడ్డిపైనే భారం.. ఎన్నికల ప్రచారంలో ముఖ్యనేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్రెడ్డి ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటంతో ఈసారి కచి్చతంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఇమేజ్.. నియోజకవర్గంలో దీపక్రెడ్డికి ఉన్న పరిచయాలను బేరీజు వేస్తే బీజేపీ గెలుపు కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలున్నారు. ఏపీ ప్రాంత ఓట్లకు గాలం... ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో ఆ ఓట్లపై కన్నేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులున్నారు. వీరి ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వారి ఓట్లను వేయించుకోగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ దిశలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వివిధ కులాలు, వర్గాల ముఖ్యనేతలు, సంఘాలు, ప్రభావం చూపే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ పార్టీల్లోని ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా... ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పైకి చెబుతున్నా.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. -
TG: నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్
హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు.నవంబర్ 1 లోపు రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలిలేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్ కాట్ చేస్తాం.2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్మ్యాప్ను ప్రకటించాలి2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా చేయాలిప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలిప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసనహైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసననవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాంబెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదుబకాయిలు అడిగితేనే విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయి -
జేఎన్టీయూ ఫ్లై ఓవర్పై కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ జేఎన్టీయూ ఫ్లై ఓవర్పై ఓ కారు బీభత్సం సృష్టించింది. TS 09 FU 5136 నెంబర్ గల కారు వేగంగా దూసుకొచ్చింది. డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన కారును మరో ప్రాంతానికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరూ సూడాన్ దేశస్థులుగా గుర్తించారు.ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
‘జూబ్లీహిల్స్లో గెలుపు మాదే.. మంచి మెజారిటీతో గెలుస్తాం’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టితో గెలుపు సొంతం చేసుకుంటామన్నారు. ‘ జూబ్లిహిల్స్ లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుంది. అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నాం. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయం. ఎవరైనా, ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం. గోడలకు చెవులు ఉండే సమయం. జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డిసిసి బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు డబుల్ పోస్టులుగా చూడం. కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదు. ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరు. నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేస్తారు. కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలి. మెట్రో ఫేస్ టూకు కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్రెడ్డికి బాధ్యత లేదా?,’ అని ప్రశ్నించారు. -
చాదర్ఘాట్ ఘటన.. డీసీపీ చైతన్యను పరామర్శించిన డీజీపీ, సీపీ
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున నిన్న(శనివారం అక్టోబర్ 25) తుపాకీ కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చాదర్ఘాట్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ జరిగిన ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్మెన్ వీఎస్ఎన్ మూర్తిలను డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వారిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.డీసీపీ, గన్మెన్ ధైర్య సాహసాలు కనబరిచారు : డీజీపీ శివధర్ రెడ్డినిన్న చాదర్ఘాట్లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు దాడులు జరిపారు. సెల్ ఫోన్ స్నాచింగ్కి పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారు. డీసీపీ చైతన్య కుమార్, గన్మెన్ మూర్తి 750 మీటర్లు నిందితులను చేజ్ చేశారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారు. నిందితుడు ఒమర్ అన్సారీ పై 22 కేసులు ఉన్నాయి. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీషీట్ ఉంది. ఈ ఆపరేషన్లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్మెన్ ఆర్యోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. డీసీపీ, కానిస్టేబుల్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం. నిందితుడు ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.రౌడీ షీటర్లు, దొంగలపై ఉక్కుపాదం: సీపీ సజ్జనార్ఈ ఘటనలో ఇవోల్వ్ అయినా ఆటో డ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకోవడానికి డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో టీమ్స్ పని చేస్తున్నాయి. కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నాము. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచాం. నగర ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్పై కూడా నిఘా పటిష్టం చేశాం డీసీపీకి మెడ భాగంలో గాయమైంది. గన్ మెన్ మూర్తికి కాలు గాయం అయ్యింది. డ్రైవర్ సందీప్ అలర్ట్గా ఉండి కీలక పాత్ర పోషించారు. డీసీపీ చైతన్య, మూర్తి, డ్రైవర్ సందీప్ ముగ్గురు ధైర్యసాహసాలు చూపారు. ఐదు బృందాలు నిందితుల కోసం గలిస్తున్నాయి.అసలేం జరిగిందంటే..కరడుగట్టిన దొంగ అన్సారీ సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతుండగా డీసీపీ చైతన్య గమనించి తన గన్మ్యాన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మ రక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు.డీసీపీ, గన్మ్యాన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. -
Jubilee Hills: సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 28వ తేదీనగ బహిరంగ సభతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాన్ని న రోడ్ షోతో ఆరంభించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) వెల్లడించారు. నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్ బహిరంగ సభకు ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఈ సభను పోలీస్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆపై అక్టోబర్ 30, 31, నవంబర్ 4,5 తేదీలలో సీఎం రోడ్ షో చేపట్టనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొననున్నారు. -
కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. Drunk drivers are terrorists. Period.Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads. The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense. It was a preventable… pic.twitter.com/oXTp0uOt2k— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 26, 2025 -
ఏం చేసిందని కాంగ్రెస్కు ఓటెయ్యాలి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందని.. హస్తం పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ బీ టీమ్ అంటూ మాపై నిందలు వేసి.. కాంగ్రెస్ నేతలు మాత్రం దోస్తీ చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అని చెప్పుకొచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి షేక్పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. గంగా-జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్ హిందు. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. ఆయన సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి?. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో ఆదరణ లేకుండా చేస్తాయి. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు?. కేంద్రంలో సీబీఐపీ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది.వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.తెలంగాణలో అన్ని అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మేము కుల రాజకీయం, మత రాజకీయం చేయం. మేం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీలో ఉద్యోగాలు మూడు రేట్లు పెరిగాయి. మైనారిటీ విద్యార్థుల కోసం 204 విద్యాలయాలు ఏర్పాటు చేశాం. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్ల ద్వారా మైనారిటీ విద్యార్థులకు చేయూతనిచ్చాం. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించాం. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో మేము బ్రహ్మాండంగా గెలిచాం. మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ప్రస్తుతం అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.బీఆర్ఎస్ పాలనా కాలంలో కరోనా సమయంలో కూడా అభివృద్ధి ఆగలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో రోడ్లు నిర్మించాం. విద్యావంతులు ఓటు వేయడానికి నిరాసక్త చూపిస్తారు. మీరు కూడా ఓటు వెయ్యాలి. రాజకీయాలపై విద్యావంతులు ఆసక్తిగా ఉండరని అందుకే ఓటు వేయరని నాకు తెలుస్తుంది. కానీ అలా చేయడం సరికాదు. మీరు ఓటు వేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మీ భవిష్యత్తును నిర్ధారిస్తారు. కాబట్టి మంచి నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఓటు అడిగే వారిని ఓటు ఎందుకు వేయాలి మీరు ఎదురు ప్రశ్నించాలి అని’ కామెంట్స్ చేశారు. -
హైదరాబాద్:18 గంటలు నీళ్లు బంద్
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శనివారం జలమండలి ప్రకటించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా.. పైపులైన్ విస్తరణ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: నల్లగుట్ట, ప్రకాశ్నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాస నగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. భోలక్పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి, హస్మత్పేట్, ఫిరోజ్గూడ, గౌతమ్నగర్. బల్క్ వినియోగదారులు: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, మిలిటరీ ఇంజినీరింగ్ సరీ్వసెస్, బేగంపేట్ విమానాశ్రయం. బాలంరాయి పంప్హౌస్, బాలంరాయి చెక్పోస్ట్, బోయిన్పల్లి, రైల్వే కాలనీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది. -
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్గా మారనుంది. కేటీఆర్కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జూబ్లీహిల్స్లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్హౌస్కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
రూ. వెయ్యి కోసం చంపేశారు
రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... మైలార్దేవ్పల్లి వట్టెపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్... నాలుగేళ్లలో అమెరికాను దాటేస్తుంది!
సాక్షి, హైదరాబాద్: సైన్స్ టెక్నాలజీ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న భారతదేశం ఇంకో నాలుగేళ్లలోనే విజ్ఞాన శాస్త్ర ప్రచురణల్లో అమెరికాను అధిగమించే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్శిటీ అధ్యాపకుడు డా.జాన్ పి.ఏ.ఇయోనిడిస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న భారత్ వృద్ధిరేటును ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఇది సాధ్యమేనని తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని వోక్సెన్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవానికి ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు-అమెరికన్ వైద్య శాస్త్రవేత్త, రచయిత ప్రొఫెసర్ ఇయోనిడిస్ హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా, వోక్సెన్ యూనివర్శిటీకి చెందిన బిజినెస్, టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ డిజైన్, లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. శాస్త్ర, పరిశోధన రంగాలకు అందించిన సేవలకు గుర్తింపుగా వోక్సెన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇయోనిడిస్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. వర్శిటీ ఛాన్సలర్ ప్రవీణ్ కె.పూలా ఈ డాక్టరేట్ను ప్రొఫెసర్ ఇయోనిడిస్కు అందించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఇయోనిడిస్ మాట్లాడుతూ..“ప్రపంచం సాంకేతికంగా ఎంత పురోగమించినప్పటికీ ఈ రోజుకూ సుమారు 400 కోట్లమంది రోజుకు వెయ్యి రూపాయల్లోపు ఆదాయంతో జీవిస్తున్నారు. ఇంకో 70 కోట్ల మంది రెండు వందల రూపాయల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. పర్యావరణ కాలుష్యం, మద్యం, మత్తు పదార్థాలు, నివారించగల వ్యాధులతో ఏటా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి మానవత్వానికే ఒక సవాలు’’ అన్నారు. అందుకే మానవ పురోగతిని సాంకేతిక ఆవిష్కరణలతో, యుటోపియన్ కలలతో కొలవలేవమని, ప్రతి మనిషికి గౌరవం, బాధ్యత, విలువను జోడించడమే అసలైన పురోగతి అని స్పష్టం చేశారు. శాస్త్రరంగంలో భారతదేశం సాధించిన అద్భుత పురోగతిని ప్రశంసిస్తూ “పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఇదే వృద్ధి కొనసాగితే 2029 నాటికి అమెరికాను అధిగమించగలదు. శాస్త్ర ఆవిష్కరణలు మొదలుకొని ఆర్థిక వ్యవస్థ విస్తరణ వరకూ అన్నింటినీ అర్థవంతంగా, అవసరమైనంతగా సాధించవచ్చునని భారత్ రుజువు చేస్తోంది’’ అన్నారు. వోక్సెన్ విశ్వవిద్యాలయ పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ ప్రయాణం ఈ రోజు ముగియదు. ఇదొక కొత్త ఆరంభం. భవిష్యత్తును మలచగల అద్భుత అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ విజయానికి నైతికతను, మీ లక్ష్యాలకు మానవతను, మీ పురోగతికి సామాజిక బాధ్యతను జోడించండి.” అని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఇయనిడిస్ అత్యంత ప్రభావవంతమైన వైద్య పరిశోధకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ప్రచురించిన ఆయన ప్రసిద్ధ పేపర్ “ వై మోస్ట్ పబ్లిష్డ్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఆర్ ఫాల్స్” ప్రపంచ వైద్య శాస్త్ర రంగంలో అత్యధికంగా ఉటంకించబడిన పరిశోధనలలో ఒకటి. వోక్సెన్ యూనివర్శిటీ ఛాన్సలర్ ప్రవీణ్ కె. పులా మాట్లాడుతూ “ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, క్రీడా వేదికలతో కూడిన విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలన్న లక్ష్యం నుంచి వోక్సెన్ పుట్టింది. నిజమైన విజయం ఓపిక, కృషి, దృష్టి, మరియు జట్టు పనితీరుతో వస్తుంది. విజయం వ్యక్తిగతం కాదు, సార్వజనీనమైనది. విద్యార్థులారా, మీరు చేసే పనిపట్ల అభిరుచి కలిగి ఉండండి, ఓపికను కోల్పోకండి, ఎల్లప్పుడూ ‘మానవ విలువలకు ప్రాధాన్యమివ్వండి.” అన్నారు.ఈ సందర్భంగా వోక్సెన్ యూనివర్శిటీ వార్షిక నివేదిక 2025ను రిజిస్ట్రార్ అభిజిత్ శిరోద్కర్ విడుదల చేశారు. ఈ నివేదికలో 450కి పైగా పరిశోధన పత్రాలు, 60+ పేటెంట్లు, 190కు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, 25కు పైగా విదేశీ అకడమిక్ ప్రతినిధి బృందాల సందర్శనలు, అలాగే జపాన్కి చెందిన సన్వా సప్లై సంస్థ నుండి వచ్చిన కోటి యెన్ ఎండోమెంట్ వంటి ప్రధాన విజయాలను వివరించారు.రిజిస్ట్రార్ అభిజిత్ శిరోద్కర్ మాట్లాడుతూ “భారత ఉన్నత విద్య వ్యవస్థ పునర్నిర్మాణమే లక్ష్యంగా వోక్సెన్ ముందుకు సాగుతోంది. అత్యున్నత విద్యా ప్రమాణాలు, వాస్తవిక దృక్పథంతో కూడిన పాఠాలు, అంతర్జాతీయంగా గుర్తింపు.. అందరినీ కలుపుకు పోవడం అన్న నాలుగు ప్రాథమిక విలువల ఆధారంగా ముందుకు వెళుతున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం మంది ఎక్కువ విద్యార్థులు చేరారు. కొత్తగా 45 అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలోనూ 163 అగ్రస్థాయి రిక్రూటర్లు పాల్గొన్నారు, వాటిలో 98 శాతం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ల సగటు జీతం రూ.9.9 లక్షలుగా ఉంది. బీటెక్, బీబీఏ ప్రోగ్రామ్లు కూడా బలమైన వృద్ధిని చూపాయి.” అని తెలిపారు. -
‘కీలక ఖనిజాల’పై పరిశోధనలకు మరింత ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ–మెట్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది. ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్అండ్డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది. -
రేపు బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ దిశలో కదిలి శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి ఆదివారం ఉదయంకల్లా తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.తదుపరి 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం తుపాను మరింత బలపడి ఈనెల 28వ తేదీనాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తీవ్ర తుపాన్ ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ కాకినాడకు సమీపంలో 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుపానుగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తదుపరి తుపాను ప్రభావం రాష్ట్రంపైన మధ్యస్తంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని చెబుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బతుకుదెరువు కోసం అప్పులు చేసి జోర్డాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడే చిక్కుకు పోయిన 12 మంది వలస కార్మికులు హరీశ్రావు చొరవతో శనివారం తెల్లవారు జామున హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో వారు హరీశ్రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోర్డాన్లో అనేక కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకుని, స్వదేశానికి చేర్చేందుకు చొరవ తీసుకున్నందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రవాస తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఒక్క హామీనీ నెరవేర్చలేదు.రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులపై విధించిన జరిమానా కూడా చెల్లించి వారిని స్వదేశానికి తీసుకువచ్చాం అని హరీశ్రావు వెల్లడించారు. హరీశ్రావుతో భేటీ తర్వాత వారు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. -
ఈసారి పత్తి విక్రయాలు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: జిన్నింగ్ మిల్లుల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు, దళారుల జోక్యాన్ని అడ్డుకోవ డానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెచ్చిన నిబంధనలు పత్తి రైతులకు గుది బండగా మారాయి. గతేడాది వరకు సీసీఐ నోటిఫై చేసిన సమీపంలోని జిన్నింగ్ మిల్లుల్లో రైతులు పత్తిని విక్రయించుకొనే వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోవడమే అందుకు కారణం. సీసీఐ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం రైతులు కపాస్ కిసాన్ యాప్లో వారి వివరాలతో పంట సమాచారాన్ని నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్నాక సీసీఐ నోటిఫై చేసిన ఆయా జిల్లాల్లోని కొన్ని మిల్లుల్లో ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. తదనుగుణంగా ఎంత దూరమైనా ఆ జిల్లాలో నిర్దేశించిన మిల్లుల్లోనే రైతులు పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశించిన రోజు పత్తిని విక్రయించకపోతే రైతులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 జిల్లాలలోని మిల్లులను ఎల్–1, ఎల్–2, ఎల్–3లుగా 12 రకాల సీసీఐ విభజించడంతో ఈ సమస్య తలెత్తింది.ఎల్–1 నుంచి ఎల్–12 వరకు మిల్లుల విభజనఏదైనా పనికి టెండర్లు వేసినప్పుడు తక్కువ ధరకు బిడ్ వేసిన వారిని ఎల్–1గా, ఆ తర్వాత వారిని ఎల్–2, ఎల్–3గా నిర్ణయిస్తారు. పత్తి విక్రయాల్లోనూ ఈసారి సీసీఐ అదే విధానాన్ని అవలంబించింది. పత్తి కొనుగోళ్లకు టెండర్లు పిలిచినప్పుడు 347 మిల్లులు పాల్గొనగా వాటిలో 317 మిల్లులను పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ నోటిఫై చేసింది. వాటిలోనూ తక్కువ ధరకు జిన్నింగ్ చేసేందుకు ముందుకొచ్చిన, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి, మెరుగైన సదుపాయాలు ఉన్న మిల్లులకు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఎల్–1, ఎల్–2 నుంచి ఎల్–12 వరకు కేటగిరీలుగా విభజించింది. ఈ లెక్కన రాష్ట్రంలో ఎల్–1 కింద 117 మిల్లులు ఉండగా ఎల్–2 కింద 75, ఎల్–3 కింద 48, ఎల్–4 కింద 26, ఎల్–5 కింద 10 మిల్లులు, ఎల్–12 కింద వరంగల్లోని ఒక మిల్లును సీసీఐ ఎంపిక చేసింది.ఒకటి నిండాకే మరొకటి..రాష్ట్రంలో ప్రస్తుతం సీసీఐ ద్వారా నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఆదిలాబాద్లో 6, కొత్తగూడెంలో 2, ఖమ్మంలో 3, నారాయణపేట, సిద్దిపేటలో ఒక్కో జిన్నింగ్ మిల్లు చొప్పున 13 మిల్లులు మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. వాటిలో ఇప్పటివరకు 26 మంది రైతులు కేవలం రూ. 53 లక్షల విలువైన 66.48 క్వింటాళ్ల పత్తినే విక్రయించారు. వారంతా ఎల్–1 కింద నమోదైన మిల్లుల్లోనే పత్తిని విక్రయించారు. ఎల్–1 కింద కేటాయించిన 117 మిల్లుల్లో వాటి సామర్థ్యం మేరకు పత్తి బేళ్లు నిండాకే ఎల్–2, ఆ తర్వాత ఎల్–3కి కేటాయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎల్–1 మిల్లులకే రైతులు పత్తిని విక్రయించాల్సి వస్తోంది. వచ్చే నెలలో పత్తి ఎక్కువగా మార్కెట్లకు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఎల్–1లో లేని మిల్లులు తమ వంతు వచ్చే వరకు మిల్లింగ్ చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై రాంచందర్రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్లు శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన మాధవ్, రాంచందర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలవుతున్న తీరు, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమాలోచనలు జరిపారు.సమావేశం తర్వాత రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ, పార్టీని మరింత విస్తరిస్తామని తెలిపారు. మాధవ్ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ యువమోర్చా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సందర్భాల్లో పలుమార్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోనూ త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కార్యాలయానికి రావడం స్వగృహానికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోనూ విస్తృత పరిచయాలు ఉన్న రాంచందర్రావు ఇక్కడ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందన్నారు. -
ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్కాలనీ: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్ సమస్యలపై అవగాహన ఉంది.హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రజూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్లో షేక్పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
స్పామ్ కాల్స్తో తలనొప్పా? తక్షణం రిపోర్ట్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: నేటి బిజీబిజీ జీవితాల్లో ప్రతి నిమిషం విలువైందే. ఎక్కడో అత్యంత ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్కాల్ వస్తుంది. ఒకసారి ఆన్సర్ చేయకపోతే మరోసారి వరుసగా మోగుతూనే ఉంటుంది. తీరా ఫోన్ ఆన్సర్ చేస్తే.. అవతలి వ్యక్తి హలో అంటూ మొదలు పెట్టి.. మనకు సంబంధం లేని ఏవేవో వాణిజ్య ప్రకటనలు, భూముల కొనుగోళ్లు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్లు అవసరం లేకుండా ప్రీ అప్రూవ్డ్ లోన్లు.. అంటూ దండకం అందుకుంటారు.ఇలాంటి స్పామ్ ఫోన్కాల్స్ తలనొప్పి కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి అనవసరమైన ఫోన్కాల్స్ బారి నుంచి బయటపడటంతోపాటు అనుమానాస్పద, మోసపూరిత యూఆర్ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)పై సైబర్ క్రైం పోర్టల్ ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేసేందుకు రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ అనే ఆప్షన్ అందుబాటులో ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇలా చేయండి..మీకు అనుమానాస్పద నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ కాల్స్ చేసి విసిగిస్తున్నా, మీ వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అలాంటి ఫోన్కాల్ను కట్ చేసి వదిలేయకుండా ఆ నంబర్ల వివరాలను పోలీసుల దృష్టికి తెచ్చి చర్యలు తీసుకోవచ్చని సైబర్ నిపుణులు చెపుతున్నారు. అందుకు మీరు చేయాల్సింది.. సైబర్ క్రైం పోర్టల్లోకి వెళ్లి రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. రిపోర్ట్ సస్పెక్ట్లోకి వెళ్లాలి.మీరు ఏ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయాలో కూడా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫోన్ నంబర్, వెబ్సైట్ యూఆర్ఎల్, సోషల్ మీడియా యూఆర్ఎల్ నమోదు చేయాలి. మీకు ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తున్నారన్న దానికి సంబంధించిన స్కీన్ర్షాట్ లేదా వాయిస్ రికార్డింగ్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సైబర్ క్రైం పోలీసులు ఈ ఫిర్యాదులను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారు. -
45 రోజుల్లో ఇంటర్ కొత్త సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యలో గుణాత్మక మార్పులు తెస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రెండు సంవత్సరాల సిలబస్ను పూర్తిగా మారుస్తున్నా మని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) స్థాయిలో పాఠ్య ప్రణాళిక ఉండబోతోందన్నారు. ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని సబ్జెక్టులను ఆరేళ్ల క్రితం, మరికొన్నింటిని 12 ఏళ్ల క్రితం మార్చారని.. ఇప్పుడు సమూలంగా మారుస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలపడంతో ఇప్పటికే సబ్జెక్టు కమిటీని వేశామని వివరించారు. ఏయే చాప్టర్లలో ఏ మార్పులు తేవాలనేది కమిటీ సూచిస్తుందని, వచ్చే 45 రోజుల్లో కొత్త సిలబస్ను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఏప్రిల్ ఆఖరు లేదా మే తొలివారంలోనే కొత్త సిలబస్తో కూడిన పుస్తకాల ముద్రణ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. నైపుణ్యం పెంపే లక్ష్యం: కొత్త సిలబస్ పూర్తిగా ప్రస్తుత అవసరాలకు, విద్యార్థుల నైపుణ్యాలు పెంచేదిగా ఉంటుందని కృష్ణ ఆదిత్య చెప్పారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఇతర భాషలను కూడా పరిపూర్ణంగా నేర్చుకునేలా బోధన కార్యాచరణను ఖరారు చేస్తున్నామన్నారు. ఉదాహరణకు చరిత్ర సబ్జెక్టు తీసుకున్న విద్యార్థి స్థానిక పరిస్థితులు, చరిత్ర నేర్చుకునేలా చేస్తామని.. కామర్స్లో బడ్జెట్ రూపకల్పన, స్వరూపంపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ నైపుణ్యం పెంచే పాఠ్యాంశాలు ఉంటాయన్నారు. ప్రతి చాప్టర్కూ క్యూఆర్ కోడ్ ఉంటుందని... దీన్ని స్కాన్ చేస్తే పాఠం మొత్తం లభించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాన్–డిటేయిల్డ్ కూడా తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. ప్రయోగాలపై కొత్త పంథా ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్కే పరిమితమైన ప్రాక్టికల్స్ను ఫస్టియర్లోనూ నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణ ఆదిత్య చెప్పారు. ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలన్నదే దీని ఉద్దేశమన్నారు. 80 శాతం థియరీ మార్కులు ఉంటే 20 శాతం మార్కులు ప్రాక్టికల్స్కు ఉంటాయని వివరించారు. ప్రయోగశాలలు ఎక్కడ బాగుంటే అక్కడకు వెళ్లి విద్యార్థులు నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నామని.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో సంబంధం లేకుండా ఆన్లైన్ ద్వారా విద్యార్థి లే»ొరేటరీని ఎంపిక చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇంటర్... ఇలా ఏ కాలేజీలోనైనా ప్రాక్టికల్స్కు హాజరయ్యేలా సింగిల్ పోర్టల్ను తీసుకొస్తున్నామన్నారు. ఎంఈసీలో స్కేలింగ్ విధానం ద్వారా మరింత మెరుగైన కోర్సును రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్తో కూడిన కొత్త కోర్సును అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు మొదలు పెట్టామని కృష్ణ ఆదిత్య తెలిపారు. మే 25 నుంచి మార్చి 15 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే షెడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థులు నవంబర్ తొలివారంలో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీచేసి అతడు పారి పోతుండగా సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ గమనించి తన గన్మ్యాన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ, గన్మ్యాన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.ఘరానా నేరగాడు మహ్మద్ ఒమర్ అన్సారీ...నగరంలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ అన్సారీపై టప్పాచబుత్ర, కామాటిపుర, మైలార్దేవ్పల్లి, శివరాంపల్లి, చార్మినార్, బహదూర్పుర, అఫ్జల్గంజ్, ఉప్పల్, హుస్సేనిఆలం, ఫలక్నుమా, కాలాపత్తర్ ఠాణాల్లో 20 కేసులు ఉన్నాయి. వీటిలో చైన్ స్నాచింగ్, చోరీ, బెదిరింపులు తదితర నేరాలపై నమోదైనవే అధికం. అతడిపై పోలీసులు గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆయా సందర్భాల్లో ఏడాది చొప్పున జైలులో గడిపి వచ్చినా అన్సారీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల మరో నిందితుడితో కలిసి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. రద్దీ ప్రాంతాలతో పాటు నిర్మానుష్యంగా ఉన్న చోటు మాటు వేసి అటుగా వచ్చే వారి సెల్ఫోన్లు లాక్కుపోతున్నాడు. ఇతడితో కలిసి నేరాలు చేస్తున్నది కూడా పాతబస్తీకి చెందిన పాత నేరగాడిగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్నారు. నేరం చేస్తుండగా గుర్తించి.. 500 మీటర్లు వెంబడించి...నగరంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్.చైతన్య కుమార్ శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై సైదాబాద్లోని కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం సుల్తాన్బజార్ మీదుగా చాదర్ఘాట్ చౌరస్తా వైపు వస్తున్నారు. ఈయన వాహనం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ వద్దకు చేరుకునే సమయానికి అన్సారీ, మరో నేరగాడితో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద సెల్ఫోన్ దొంగిలించి పారిపోతున్నారు. వారిని గమనించిన చైతన్యకుమార్ తన వాహనం నుంచి కిందకు దిగి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంటే గన్మ్యాన్ సైతం వాహనం నుంచి బయటకు వచ్చారు. వారిని తోసేసిన అన్సారీ, మరో నిందితుడు తలోదిక్కు పారిపోయారు. అన్సారీ ఇసామియా బజార్ మీదుగా పారిపోతుండగా డీసీపీ అతడిని ఛేజ్ చేసుకుంటూ విక్టోరియా ప్లే గ్రౌండ్ వరకు దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. ఆయన వెంటనే గన్మ్యాన్ కూడా వచ్చారు. అక్కడ ఓ భవనం ఎక్కిన అన్సారీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్లేగ్రౌండ్స్లోకి దూకేశాడు. అతడి వెంటే డీసీపీ, గన్మ్యాన్ కూడా గ్రౌండ్లోకి దూకారు. అక్కడ తన వద్ద ఉన్న కత్తితో గన్మ్యాన్, డీసీపీపై అన్సారీ దాడికి ప్రయత్నించాడు. పెనుగులాట జరిగి ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంతో కత్తితో రెచ్చిపోవడానికి ప్రయత్నించిన అన్సారీపై గన్మ్యాన్ తుపాకీతో డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తూటాలు అన్సారీ చేయి, కడుపులోకి దూసుకుపోయాయి. తీవ్రగాయాలైన అన్సారీ కుప్పకూలిపోయాడు.ఆస్పత్రుల్లో చికిత్స...డీసీపీ చైతన్యకుమార్తో పాటు ఆయన గన్మ్యాన్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్సారీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సారీతో వచ్చి పరారైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఉదంతం తర్వాత నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బందిలో అవసరమైన వారికి తుపాకులు జారీ చేయాలని కొత్వాల్ సజ్జనర్ నిర్ణయించారు. కేవలం మహిళలపై జరిగే నేరాల విషయంలోనే కాకుండా ప్రతి నేరగాడి విషయంలోనూ కఠినంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని నేర రహితంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు
దాచేపల్లి: లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. తెలంగాణలోని మిర్యాలగూడెంకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రతి రోజూ దాచేపల్లికి రాకపోకలు సాగిస్తుంటుంది. శనివారం 35 మందితో మిర్యాలగూడెం నుంచి బయలుదేరిన బస్సు దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని ఆంధ్రా సిమెంట్స్ వద్దకు చేరుకుంది.అదే సమయంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.. వెనుక వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. బస్సు డ్రైవర్ గొనేనాయక్, గురజాలకు చెందిన షేక్ నబీమున్కి తీవ్రగాయాలయ్యాయి. కండక్టర్ లింగయ్య, ప్రయాణికులు సంతోషం, ధనావత్ రంగి, రాణి, నర్సమ్మ, దానమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సాగర్ సిమెంట్స్ ప్రతినిధులు తమ అంబులెన్స్లో క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. -
గనుల శాఖలో బదిలీల పర్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలో తరచూ బదిలీల పర్వం కొనసాగుతోంది. గత 22 నెలల్లో గనుల శాఖతోపాటు అనుబంధ డైరెక్టరేట్, ఖనిజాభివృద్ధి సంస్థలో భారీగా ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. పూర్తి అదనపు బాధ్యతల పేరిట ఇన్చార్జి అధికారుల పాలనే కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఆదాయ లక్ష్యాలను చేరుకోకపోవడం, వివాదాస్పద పనితీరు, బాధ్యతలపై పట్టు లేకపోవడం తదితర కారణాలతో తరచూ అధికారుల మార్పిడి జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఆ శాఖలో విధాన నిర్ణయాల్లో జాప్యానికి కారణం కావడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాజకీయ ఒత్తిళ్లే అసలు కారణం?పాలనాపరమైన మార్పుల్లో భాగంగా జరగాల్సిన అధికారుల బదిలీల వెనుక రాజకీయ కారణాలే బలంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఈ శాఖకు లక్ష్యం నిర్దేశించగా అందులో సుమారు రూ. 1,200 కోట్ల మేర ఆదాయం తగ్గింది. గ్రానైట్, లైమ్స్టోన్ లీజుల అక్రమాలను అరికట్టి జరిమానా రూపంలో ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చాలనే లక్ష్యం నెరవేరకపోవడం కొందరు అధికారుల బదిలీకి దారితీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ వ్యవహారాలు, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇసుక వెలికితీత, విక్రయాలు, రవాణాలో అక్రమాలు అధికారుల బదిలీల్లో కీలకంగా మారాయని తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఇసుక క్వారీల లీజ్ల కోసం చేసిన ఒత్తిళ్ల వల్ల టీజీఎండీసీ నుంచి ఒకరిద్దరు అధికారులు నిష్క్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డైరెక్టర్ దాకా..!2024 జనవరిలో గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బదిలీతో మహేశ్ దత్ ఎక్కా బదిలీపై వచ్చారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎక్కా స్థానంలో గనుల శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. సురేంద్ర మోహన్ బదిలీతో ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్.శ్రీధర్ ఈ ఏడాది జనవరి నుంచి గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వర్తిస్తున్నారు. గనుల శాఖ డైరెక్టర్ స్థానంలో గత 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న పి.కాత్యాయనీదేవి స్థానంలో 2024 జనవరిలో బీవీఆర్ సుశీల్కుమార్ను నియమించారు. అదే ఏడాది సెప్టెంబర్లో కె.సురేంద్ర మోహన్, డిసెంబర్లో కె.శశాంక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరగక ముందే శశాంక స్థానంలో ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న క్రాంతి వల్లూరును ఇన్చార్జిగా నియమించారు. తాజాగా ఈ నెల 20న వల్లూరు క్రాంతిని గనుల శాఖ డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తూ ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు గత ఏడాది ఆగస్టులో రిటైరైన బీవీఆర్ సుశీల్ కుమార్ గతేడాది అక్టోబర్లో టీజీఎండీసీ వీసీ, ఎండీగా రెండేళ్లపాటు ఉండేలా ప్రత్యేక నియామకంపై వచ్చారు. కానీ స్వల్ప వ్యవధిలోనే ఆయన్ను గనుల శాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. తాజాగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ)గా నియమిస్తూ ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. రిటైరైన అధికారికి ఏడాదిలోపే మూడుసార్లు స్థానచలనం కలగడం చర్చనీయాంశమైంది. -
పరాయి కాలేజీల్లో ‘ప్రయోగాలా’?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఖరారు విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయంపై గురుకుల విద్యాసంస్థల అధ్యాప కులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు హాజరు కావాలని పేర్కొనడంపై వారు పెదవివిరుస్తు న్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాలేజీలైన గురుకుల విద్యాసంస్థలను ప్రయోగ పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం గురుకు లాల పరపతిని దిగజార్చడమేనని విమర్శిస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెల్ఫ్ సెంటర్లు ఉంటుండగా గురుకులాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయ ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే గురుకులాల్లో రెసిడెన్షియల్ విధానంలో బోధన జరుగుతుందని.. ప్రయోగ పరీక్షల కోసం విద్యార్థులు గురుకులాలను వదిలి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండే ప్రాంతాల వరకు రాకపోకలు సాగించాల్సి రానుండటం వారికి ఇబ్బందిగా మారుతుందని అధ్యాపకులు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. -
అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు
సిటీ కోర్టులు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అనుమతి లేకుండా ఇతర వ్యక్తులు లేదా సంస్థలు ఆయన పేరు, ఫొటోలు, స్వరాన్ని (వాయిస్) వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా పలువురు వ్యక్తులు, సంస్థలు తన పేరును వాడుతున్నారని, దాని వల్ల తన పరువుకు భంగం కలిగే అవకాశం ఉన్నందున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్లో కూడా ఇలాంటివి జరుగకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు/చిత్రం/ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆ¯న్లైన్ ప్లాట్ఫాంలపై వినియోగించడం, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా మార్పులు చేసిన తన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. వ్యక్తులు లేదా ఏ సంస్థలైనా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదని శనివారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్న పలువురికి కోర్టు నోటీసులు జారీచేస్తూ అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ చిరంజీవి పేరును ఉపయోగించొద్దని స్పష్టంచేసింది. చిరంజీవి వ్యక్తిత్వ/ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. టెలివిజన్ చానళ్లు, డిజిటల్ ప్లాట్ఫాంలు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు/సంస్థలు లాభాలను పొందే ఉద్దేశంతో చిరంజీవి పేరు, చిత్రం, వాయిస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా చూపించడం లేదా వక్రీకరించడం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. -
హైదరాబాద్లో ఆర్టీఏ అధికారుల దాడులు
హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నిబంధనలు పాటించలేని 68 బస్సులపై కేసులు నమోదు చేశారు.ఏపీ వ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వ్రైవేట్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో పలు బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. సుమారు 289 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై రూ. ఏడు లక్షలుగా పైగా జరిమానా విధించారు.ఇదీ చదవండి: కర్నూలు ఘటన: మరో షాకింగ్ ట్విస్టు -
ఈ రోజే లాస్ట్.. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ లేకపోతే అక్టోబర్ నెల జీతం నిలిపివేయనున్నట్లు సృష్టం చేసింది. అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం.. IFMIS పోర్టల్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని పేర్కొంది.రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఒకే నిబంధన విధించిన ప్రభుత్వం.. అక్టోబర్ 25 రాత్రి 12 గంటల లోపు డేటా అప్డేట్ చేయాలని తెలిపింది. ఆధార్ లింక్ లేని ఉద్యోగుల జీతం నిలిపివేత తప్పదని.. నియమాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయంటూ ప్రభుత్వం హెచ్చరించింది. -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR -
హైదరాబాద్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాదర్ఘాట్లో కాల్పుల కలకలం రేగింది. చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగలను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునేందుకు యత్నించగా.. డీసీపీపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. తోపులాటలో డీసీపీ గన్మెన్ కిందపడిపోయారు. ఈ క్రమంలో గన్మెన్ నుంచి వెపన్ తీసుకుని దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు.దొంగలపై డీసీపీ చైతన్య రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా, నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని.. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు. రౌడీలు, స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ సజ్జనార్చాదర్ ఘాట్లోని కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. కాల్పుల్లో చైన్ స్నాచర్ ఒమర్ ఛాతి, భుజంపై గాయాలయ్యాయి. ఒమర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చైన్ స్నాచర్లు పాతబస్తీకి చెందిన పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఒమర్పై 25 కేసులు ఉన్నాయని.. రౌడీషీట్ కూడా ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు.‘‘ఆత్మ రక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది. రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒమర్ రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్మెన్ వచ్చారు. దొంగ కత్తితో గన్మెన్పై దాడి చేశాడు. వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారు. దొంగకు చేతిపై, కడుపులో గాయాలయ్యాయి.దొంగను మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాం. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం. డీసీపీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గాయలైన కానిస్టేబుల్ లు ఇద్దరూ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. మహమ్మద్ ఉమర్ అన్సారీ.. కేసులు.. నేరాలు.. అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తాం’’ అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. -
ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష.. తెలంగాణలో SIR
హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంపై సన్నాహాలను ముఖ్య ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs)*తో సమీక్షించారు.ఈ సందర్భంగా సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్టాప్ వ్యాయామం వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన , లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.తదుపరి సమీక్షా సమావేశం నవంబర్ 1, 2025న వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించబడనుందని, అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇటీవల సుధర్శన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల మరియు ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ -
న్యూరో అత్యవసర పరిస్థితులపై ఎంకాన్ 2025 సదస్సు
హైదరాబాద్: “ప్రాణాంతక న్యూరో అత్యవసర పరిస్థితులను వేగంగా గుర్తించడం, వాటి చికిత్స” అనే అంశంపై సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమి) సహకారంతో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎంకాన్ 2025 సదస్సును శనివారం విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ ఎమర్జెన్సీ ఫిజిషియన్లు, న్యూరాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, ఇతర విభాగాల వైద్యనిపుణులందరినీ ఒక చోటుకు చేర్చి, న్యూరో అత్యవసర కేసుల చికిత్సలో కొత్త టెక్నాలజీలు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్లపై రోజంతా చర్చించారు.ఈ వర్క్షాప్లో కేసుల వారీగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా న్యూరోసర్జరీ కేసుల్లో చాలావరకు అత్యవసరంగా చికిత్సలు చేయాల్సినవి ఉంటాయని, అలాంటి సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఇందులో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి..ఎమర్జెన్సీ విభాగంలో తక్షణం న్యూరోకేసులపై అంచనాఎమర్జెన్సీ విభాగంలో స్ట్రోక్ కేసుల్లో సమయమే కీలకంతీవ్రమైన న్యూరోమస్క్యులర్, వెన్నెముక అత్యవసర పరిస్థితులుకోమా, మానసిక పరిస్థితిలో మార్పులు- ఈడీ ఆల్గరిథమ్పిల్లల్లో న్యూరో అత్యవసర పరిస్థితులు, న్యూరో ఇమేజింగ్న్యూరో రీహాబిలిటేషన్లో అత్యవసర పరిస్థితులుప్రమాదాల్లో మెదడుకు గాయాలు (టీబీఐ), మెదడులో ఒత్తిడి పెరిగితే చికిత్సఈ వర్క్షాప్ గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈఓ, కార్యక్రమ ప్యాట్రన్ డాక్టర్ కె. హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ, “అత్యవసర చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉండడమే చావు బతుకుల మధ్య తేడాను నిర్ణయిస్తుందని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో మేం నమ్ముతాము. న్యూరో అత్యవసర పరిస్థితుల్లో సమస్యను వేగంగా గుర్తించడం, అన్ని విభాగాల సమన్వయంతో చికిత్స చేయడం చాలా కీలకం. ఎంకాన్ లాంటి సదస్సులతో ఎమర్జెన్సీ విభాగం వైద్యులు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే సాక్ష్యాల ఆధారిత ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవచ్చు. సెమి భాగస్వామ్యంతో ఇంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించినందుకు మేమెంతో గర్విస్తున్నాం” అని చెప్పారు.ఎంకాన్ 2025 అకడమిక్ ఛైర్, ఈవెంట్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్. శ్రీనాథ్ కుమార్ మాట్లాడుతూ, “న్యూరో అత్యవసర పరిస్థితులపై నిర్వహించిన ఈ ఎంకాన్ 2025 ప్రీకాన్ఫరెన్స్ అత్యున్నత ప్రమాణాలను సృష్టించింది. అత్యంత సంక్లిష్టమైన న్యూరోలాజికల్ భావనలను ప్రాక్టికల్గా, రోగులకు ఎమర్జెన్సీ వైద్యం ఎలా అందించాలో ఈ సెషన్లో అందరూ చాలా సమగ్రంగా వివరించారు. మన దేశంలో ఉన్న అన్ని ఆస్పత్రుల ఎమర్జెన్సీ విభాగాలలో న్యూరో క్రిటికల్ కేసులకు అత్యంత వేగంగా, నైపుణ్యంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో చికిత్స చేయడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండేలా చేయాలన్నది మా లక్ష్యం” అని వివరించారు.న్యూరో అత్యవసర కేసులలో సమస్యను త్వరగా గుర్తించడం, నిర్మాణాత్మక అంచనా, అన్ని విభాగాల సమన్వయంతో చికిత్స చేయడం ద్వారా ప్రతి నిమిషాన్నీ విలువైనదిగా భావించాలన్న విషయాన్ని ఈ సదస్సులో ప్రధానంగా చెప్పారు. వృత్తిపరమైన అవగాహనను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, అందరితో కలిసి నేర్చుకోవడంపై దృష్టిపెట్టిన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సెమితో భాగస్వామ్యం ద్వారా దేశంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తన నాయకత్వ స్థానాన్ని నిరూపించుకుంది. ఈ సదస్సుకు సెమి జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పాటిబండ్ల సౌజన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడం, అకడమిక్ సహకారాల ద్వారా క్లినికల్ నైపుణ్యాన్ని పెంచడంలో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథం పైడిపెద్దిగారి కూడా పాల్గొని ప్రత్యేకంగా ప్రసంగించారు. ఇంకా.. డాక్టర్ వై.మురళీకృష్ణ, డాక్టర్ నీలోఫర్ అలీ, డాక్టర్ వివేక్ పొట్లూరి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సనత్నగర్, మోహిదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్, కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది.పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.#HYDTPinfo🚧 Traffic Alert 🚗Due to waterlogging and ongoing road work near Mehdi Function Hall, Ayodhya Junction, the movement of vehicles is slow in the area.Commuters are advised to plan their travel accordingly and use alternate routes where possible.Drive cautiously and… pic.twitter.com/kAByg5kMpK— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025 కాగా, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ.. అత్యంత అప్రమత్తత ప్రకటించింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశముందని.. బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో మెంథా తీవ్ర తుఫాన్. తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.#HYDTPinfo🌧️ Traffic Alert 🚗Due to waterlogging on Panjagutta Flyover towards NFCL, vehicle movement is slow in the area.Commuters are advised to plan their travel accordingly and drive with caution. 🚦#HyderabadTraffic #TrafficUpdate #RainAlert #DriveSafe pic.twitter.com/R7iceOFQbV— Hyderabad Traffic Police (@HYDTP) October 25, 2025 -
ఓఆర్ఆర్ వద్ద బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ దాకా పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 3 నుండి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. పాత విధానంలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉన్నట్లుగానే మిగతా భాషల్లోనూ ప్రాక్టీకల్స్ జరిపిస్తాం. అలాగే.. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్లో మార్పులు జరగబోతున్నట్లు తెలిపారాయన. మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ మారబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ప్రభుత్వ ఆమోదంతో నిర్వహిస్తున్నాం. నవంబర్ 1 నుండి పరీక్షల ఫీజులు ఆన్ లైన్ ద్వారా చెల్లించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. 12 సంవత్సరాల తర్వాత ఇంటర్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పు చేస్తున్నాం. సిలబస్ మార్పులో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములవుతారు. నలభై నుండి నలభై ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం డిసెంబరు 15 నాటికి సిలబస్ తెలుగు అకాడమీకి అందిస్తాం. నూతన సిలబస్తో పాటు క్యూఆర్ కోడ్ ముద్రణ ఉంటుంది.. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి తెస్తాం అని అన్నారు. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయి. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు కూడా ఉంటాయి.2026 నుండి ACE గ్రూప్ ప్రారంభం అవుతుంది. అకౌంటెన్సీ గ్రూపు రూపకల్పన తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నామని తెలిపారు. -
గన్పార్క్ వద్ద క్షమాపణలు చెప్పిన కవిత
సాక్షి, హైదరాబాద్: ఇన్నేళ్ల తన రాజకీయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని.. అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరఫున శనివారం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంతకంటే ముందు.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను నేను క్షమాపణలు కోరుతున్నా. గతంలో నేను గట్టిగా కొట్లాడలేకపోయా. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నా జాగృతి జనం బాటలో అందరినీ కలుస్తా. 33 జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుస్తా’’ అని అన్నారామె. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో? ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాం. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాం. ఈ మొత్తంలో 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు,కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదు. నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేక పోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని కవిత వ్యాఖ్యానించారు. -
లెక్క తప్పింది.. తెలంగాణ ఎక్సైజ్కు చుక్కెదురు!
సాక్షి, రంగారెడ్డి: ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదులో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా పదివేల దరఖాస్తులు తక్కువ రావడంతో అధికారులను నివ్వెరపోయేలా చేసింది.అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. కానీ ఇందుకు భిన్నంగా 10,673 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. కాగా, దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో ఆదాయం కొంత పెరిగినట్లు కన్పించినా.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ కిక్కు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం సహా దేశీయంగా రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు దెబ్బతినడం, అప్పటి వరకు ఆయా రంగాలపై ఆధారపడిన వాళ్లు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడడం, ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల్లో ఖర్చుల కోసం అభ్యర్థులు తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసి పెట్టుకోవడంతో ఔత్సాహిక వ్యాపారులకు మార్కెట్లో అప్పు దొరకని పరిస్థితి.అంతేకాదు షాపుల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా గుడ్విల్ పేరుతో అదనపు చెల్లింపులు సైతం దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మరో కారణం. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును పెంచడంతో మెజార్టీ వ్యాపారులు వైన్స్ టెండర్లను భారంగా భావించారు. అప్పటి వరకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసినవారు.. ప్రస్తుతం ఒకటి రెండు షాపులకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం మద్యం షాపుల టెండర్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2023–25లో గ్రేటర్ జిల్లాల్లోని ఏడు డివిజన్ల పరిధిలో మొత్తం 45,631 దరఖాస్తులు రాగా, రూ.906.62 కోట్ల ఆదాయం సమకూరింది. 2025–27 ఆర్థిక సంవత్సరంలో 639 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో 34,958 దరఖాస్తులే వచ్చాయి. ఫీజు పెంపు కారణంగా రూ.1,048.74 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే ఆయా మద్యం దుకాణాలకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించనున్నారు. -
హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సులు, వాహనాల తనిఖీలు.. చలాన్లు చెల్లిస్తేనే అనుమతి..
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలించారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.మరోవైపు.. కూకట్పల్లి, హయత్నగర్, ఎల్బీనగర్ పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వాహనాలపై ఉన్న చలాన్లను పోలీసులు వసూలు చేస్తున్నారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.కాగా, కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. అయితే.. ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారుల సోదాలు నిర్వహించారు. ఏపీ నుంచి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే, ఎల్బీనగర్లోని చింతలకుంట వద్ద కూడా ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. -
ఎన్నికల విధులకు ఆటంకం.. సల్మాన్ఖాన్పై కేసు నమోదు
బంజారాహిల్స్: అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను బీఆర్ఎస్ నేత సల్మాన్ఖాన్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బోరబండకు చెందిన సల్మాన్ఖాన్ హెచ్వైసీ పార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. బుధవారం స్క్రూట్నీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాం తన నామినేషన్ను తిరస్కరించడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేగాక విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో దూషించారు. తన నామినేషన్ను కావాలనే తిరస్కరించారని, దీనిపై కాంగ్రెస్ ఒత్తిడి ఉందంటూ ఆరోపించారు. అతడి వైఖరి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనందున అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సల్మాన్ఖాన్ గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు బస్సుల్లో ఎడాపెడా మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఓ భారీ లోపాన్ని ఎత్తిచూపింది. ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తొలుత సాధారణ సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయించిన యాజమాన్యం.. ఆ తర్వాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా మార్పించింది. బస్సు తయారీ సంస్థలు స్లీపర్, సాధారణ సీటర్ బస్సులకు అనుగుణంగా వాటి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తాయి. కానీ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల తయారీ కంపెనీల ప్రమాణాలను కాదని సొంతంగా బస్సుల నిర్మాణాన్ని మారి్పంచుకుంటున్నారు.సీటర్ బస్సుల కంటే స్లీపర్ బస్సులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో గిరాకీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో పాత సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్ సరీ్వసుగా మార్చి నడుపుతున్నారు. బస్సుల్లో ఎక్కువ సరుకులు పట్టేలాగా కూడా సొంతంగా మార్పులు చేయించుకుంటున్నారు. అలాగే స్లీపర్ బస్సుల్లో కర్టెన్లు, దుప్పట్లు, దిండ్లు వాడుతుండటం, నడిచే ప్రాంతం ఇరుకుగా ఉండటం, బెర్తులకు రక్షణ రాడ్లు ఉండటం తదితర కారణాలతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడే లోపాలు, సమతూకం అగి్నప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడాన్ని కష్టంగా మారుస్తున్నాయి. ఈ లోపాలన్నీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సమయాల్లో వెలుగుచూస్తున్నా అధికారులు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్లీపర్ బస్సుల తయారీ నిబంధనలు ఇలా.. ⇒ స్లీపర్ బస్సుల్లో బెర్తులు 2+1 లేఅవుట్లో (ఒకవైపు 2 బెర్తులు, మరోవైపు ఒకటి). ⇒ ట్విన్ యాక్సిల్ బస్సులకు 30 బెర్తులకే (లోయర్ 15, అప్పర్ 15) పరిమితి. మొత్తం 30–36 బెర్తులు. ⇒ స్లీపర్ బస్సుల్లో 2+2 లేఅవుట్కు అనుమతి లేదు. ఒక బెర్తు 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు. ⇒ లోయర్ బెర్తు ఎత్తు 200–350 మి.మీ., హెడ్రూమ్ 800 మి.మీ. (నాన్–ఏసీ), 600 మి.మీ. (ఏసీ), కుషన్ మందం కనీసం 75 మి.మీ. ⇒ బస్సు పొడవు 12 మీటర్లు, బస్సు ఎత్తు 4.5 మీటర్లు. ⇒ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనీసం 4 ( రెండు రూఫ్ హ్యాచ్లు) ఉండాలి. అత్యవసర సమయాల్లో కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు అన్ని సీట్ల వద్ద హ్యామర్ ఉండాలి. విదేశాల్లో స్లీపర్ బస్సులపై ఆంక్షలు, నిషేధం... ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. కొన్ని దేశాల్లో కఠిన ఆంక్షలున్నాయి. 2012 నుంచి చైనా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. అంతకు ముందున్న బస్సులను కఠిన ఆంక్షల మధ్య మాత్రమే తిప్పుతోంది. కేవలం నాలుగేళ్లలో స్లీపర్ బస్సుల్లో జరిగిన ప్రమాదాల్లో 231 మంది మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే జర్మనీ సైతం స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. పాత బస్సులను కూడా తొలగించింది. ఆ్రస్టియా, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో పరిమిత సంఖ్యలో, నిబంధనల ప్రకారం ఉన్న బస్సులనే అనుమతిస్తున్నారు. మంటలు అంటుకొనే అవకాశం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయా దేశాలు డీజిల్ బస్సులకు బదులు ఎలక్ట్రిక్ బస్సులకు వీలు కల్పిస్తున్నాయి. -
దూసుకొస్తున్న మృత్యువు
సాక్షి, హైదరాబాద్: ‘వేగంకన్నా ప్రాణం మిన్న’అంటూ రోడ్డు రవాణా శాఖ చేసే సూచనను ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడిపే డ్రైవర్లు గాలికొదిలేస్తున్నారు. ఇతర ట్రావెల్స్ బస్సులకన్నా ముందుగా గమ్యం చేరాలన్న ఆలోచనతో అతివేగంగా బస్సులను నడుపుతూ వాటిని మృత్యుశకటాలుగా మారుస్తున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర దుర్ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. ముందు వెళ్తున్న బైక్ను బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తు వెల్లడిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మితిమీరిన వేగం కారణంగానే జరుగుతున్నట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో అతివేగం కారణంగా 72.26 శాతం (3,33,323) రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2023లో 68.4 శాతం (3,22,795) ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అతివేగం తర్వాత డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్రూట్ డ్రైవింగ్, రెడ్లైట్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ ఉన్నట్లు తేలింది. 2023లో నమోదైన గణాంకాల ప్రకారం బస్సులు ఢీకొనడం వల్ల దేశవ్యాప్తంగా 4,327 మంది మృత్యువాతపడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో 2023లో మొత్తం 16,916 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2024లో 18,991 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో ప్రమాదాల తీవ్రత ఎక్కువ..జాతీయ రహదారులపై దూర ప్రయాణాలు చేసే వాహనాలకు రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను అనుకోని పరిస్థితుల్లో అకస్మాత్తుగా అదుపులోకి తెచ్చే క్రమంలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని వారు చెబుతున్నారు. హెచ్చరిక బోర్డుల ప్రకారం ఆ రోడ్డులో ఎంత వేగంగా వెళ్లాలి.. ఏ మలుపు వద్ద ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందన్నది స్పష్టంగా ఉంటున్నా కొందరు వాహనదారులు పట్టించుకోవడం లేదు.అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో ఇద్దరు చొప్పున డ్రైవర్లు ఉంటున్నా కొన్నిసార్లు తెల్లవారుజామున నిద్రమత్తులోకి వెళ్లడం వల్ల రెప్పపాటులో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు సైతం ఆదమరిచి నిద్రపోయే సమయం కావడంతో ఏదైనా ప్రమాదం జరిగి మంటలు అంటుకొనే పరిస్థితి తలెత్తితే తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో గందరగోళం నెలకొని ప్రాణనష్టం పెరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు. -
నిబంధనలను సర్కారే ఉల్లంఘిస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఎలా మార్పు చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. సొంత నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎలా? అని అడిగింది. ఏ నిబంధన మేరకు గడువు పొడిగించారో చెప్పాలని, లేనిపక్షంలో లిక్కర్ షాపుల ఎంపిక ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని చెప్పింది. మరోవైపు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచితే వచ్చే నష్టమేంటని పిటిషనర్లను ప్రశ్నించింది. దరఖాస్తులను స్వీకరించవద్దని ఎలా చెబుతారని నిలదీసింది. కాగా, ప్రాథమిక ఆధారాలున్నందున ఇరుపక్షాల పూర్తి స్థాయి వాదనలు వినాలని అభిప్రాయపడింది. వాదనలు ముగిసే వరకు ప్రక్రియను నిలిపివేయడమో లేదా ఈ నెల 18వ తేదీని కటాఫ్గా తీసుకోవడమో చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.ఏదేమైనా శనివారం మరోసారి వాదనలు వింటామని చెబుతూ, విచారణను వాయిదా వేసింది. మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును పొడిగించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన డి.వెంకటేశ్వరరావుతో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో 2025–27కు సంబంధించి 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు కోరుతూ ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలైంది. తొలుత దరఖాస్తుల గడువును ఈ నెల 18వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ నెల 23 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.23న జరగాల్సిన డ్రాను 27కు వాయిదా వేసింది. దరఖాస్తుల గడువు పెంపు నిర్ణయం తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టంలోని నిబంధన 12(5)లకు విరుద్ధం. 18వ తేదీ తర్వాత పోటీ పెరిగింది. దీంతో పిటిషనర్లకు మద్యం దుకాణాలు పొందే అవకాశాలు తగ్గిపోయాయి. కారణాలు ఏవైనా గడువు పెంపు చట్టవిరుద్ధం. దుకాణాల కోసం గడువు పొడిగిస్తూ 18న తెలంగాణ ప్రభుత్వ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మెమోను కొట్టివేయాలి. విచారణ పూర్తయ్యే వరకు ప్రక్రియపై స్టే విధించాలి’అని కోరారు. ప్రక్రియను నిలిపివేయవద్దు.. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్లు కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మెమోను సవాల్ చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాల్లో ప్రచురించిన గెజిట్ను వారు సవాల్ చేయలేదు. ఈ నెల 18 వరకు మద్యం దుకాణాల కోసం మొత్తం 89,343 దరఖాస్తులొచ్చాయి. ఆ తర్వాత వచి్చన వాటి సంఖ్య 5,793 మాత్రమే. ఇది చాలా తక్కువ. మొత్తం దరఖాస్తుల సంఖ్యలో దాదాపు 5 శాతమే. గడువు పెంపు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. పరిస్థితుల మేరకు గడువు పెంచే అధికారం సర్కార్కు ఉంటుంది. దుకాణాల కేటాయింపు ప్రక్రియపై ఎలాంటి స్టే ఇవ్వవద్దు. మొత్తం ప్రక్రియపై స్టే ఇస్తే అది సర్కార్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శనివారం వాదనలు విని నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేశారు. -
రేవంత్రెడ్డీ.. దమ్ముంటే అశోక్నగర్కు రా..!
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్రెడ్డీ.. నీకు దమ్ముంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు పోలీసు భద్రత లేకుండా అశోక్నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రాగలవా?’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరు ద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను వేడుకొని, వాడుకొని.. అధికారంలోకి వచ్చాక వదిలేశారని ధ్వజమెత్తారు.శుక్రవారం నెక్లెస్రోడ్లోని జలవిహార్లో ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ఆవిష్కరణ కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు కానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జాబ్లు నింపాలని అడిగితే.. జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గల్లా పెట్టెలు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రెండు లక్షల జాబ్ కేలండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ కేలండర్ విడుదల చేశారని హరీశ్రావు ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని సీఎంను ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ అయిందని, రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలని పిలుపునిచ్చారు. విద్య, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని.. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 1.64 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని హరీశ్రావు తెలిపారు.‘నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్టు పెట్టింది, ఎంపిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే... నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇక గుర్తు పెట్టుకో రేవంత్.. ఈరోజు నుంచి నీకు చుక్కలు చూపిస్తాం’అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్ధన్, ఇందిర నాయక్, పురుషోత్తం యాదవ్, నవీన్ పటా్నయక్, మోతీలాల్, తిరుపతి, సింధురెడ్డి, లలిత రెడ్డి, శింబు, శంకర్ నాయక్, బాలకోటి, మహేందర్, కుమార్, రాడపాక రవి తదితరులు పాల్గొన్నారు. -
మృతుల గుర్తింపునకు ఆరు పద్ధతులు
సాక్షి, హైదరాబాద్: మొన్న మహబూబ్నగర్ సమీపంలోని పాలెం... నిన్న కర్ణాటకలోని కలబురిగి ప్రాంతం... తాజాగా కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు... ఇలా అనేక సందర్భాల్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు అగ్నిప్రమాదాలకు లోనవుతున్నాయి. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాల్లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడిమసైపోతున్నాయి. ఆయా సందర్భాల్లో మృతులను గుర్తించడానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రధానంగా ఆరు రకాల పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. 1. సీటు నంబర్ ఇది ప్రాథమిక అంశం. మృతదేహం పడి ఉన్న సీటు నంబర్ను బస్సు బయలుదేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో సరిచూస్తారు. దీనిద్వారా ఆ సీటులో ఎవరు కూర్చున్నారో తెలుస్తుంది. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశం ఉండటంతోపాటు ప్రమాద ప్రభావం వల్ల మృతులు సీట్లలో ఉండకపోవచ్చు. దీంతో ఈ విధానాన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోరు. 2. ఆభరణాలు మృతదేహాలను స్వా«దీనం చేసుకొనే సందర్భంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహాన్ని ఏ సీటు నుంచి స్వా«దీనం చేశారనే అంశంతోపాటు మృతదేహంపై ఒకవేళ నగలు, ఆభరణాలు ఉంటే ఆ వివరాలను పొందుపరుస్తారు. భద్రపరిచిన ఆభరణాలను సంబం«దీకులకు చూపి గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తారు. 3. దుస్తులు, వస్తువులు ప్రయాణం ప్రారంభించే ముందు ఆయా ప్రయాణికులు ధరించిన దుస్తులు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం ఈ తరహా ప్రమాదాల్లో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. మృతదేహంపై లభించే దుస్తులకు సంబంధించిన ఆనవాళ్ల కోసం ప్రయతి్నస్తారు. ఒకవేళ ఫలితం లేకుంటే కాలిపోగా మిగిలిన సూట్కేసులు, బ్యాగులు, సెల్ఫోన్లు, లైటర్ల వంటివి సేకరిస్తారు. వాటిని కూడా పంచనామాలో పొందుపరిచి వాటి ఆధారంగానూ మృతుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు. 4. శరీరం, గాయాలు ఎత్తు, ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను, ఎముకల ద్వారా తెలుసుకోవడంతోపాటు గాయాలు, అంగవైకల్యాలు తదితరాలు సైతం మృతదేహాల గుర్తింపునకు ఉపకరిస్తాయి. కుటుంబీకుల నుంచి చనిపోయిన వ్యక్తి వైద్య చరిత్రతోపాటు దంతాల వివరాలను సేకరించి వాటిని మృతదేహాలతో పోలి్చచూస్తారు. గతంలో ఆపరేషన్లు జరిగినా, కాళ్లు–చేతులు తదితరాలు విరిగాయా? తదితర వివరాలన్నింటితోనూ మృతుల్ని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. 5. బ్లడ్, డీఎన్ఏ మృతదేహం పూర్తిగా కాలిపోయినా అంతర్గత అవయవాల్లో కొంతవరకు రక్త నమూనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదీ సాధ్యం కానప్పుడు బోన్మ్యారోను సేకరించడం ద్వారా బ్లడ్గ్రూప్ను విశ్లేషిస్తారు. దీన్ని రక్త సంబం«దీకులతో సరిపోల్చి మృతుల్ని గుర్తిస్తారు. బ్లడ్ గ్రూపింగ్తోపాటు ఇతర విధానాలకు అవకాశం లేని సందర్భాల్లో డీఎన్ పరీక్షలే శరణ్యమవుతాయి. అత్యధిక కేసుల్లో వాటి ద్వారానే గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. మృతదేహంలోని అతిచిన్న ఆధారం నుంచైనా డీఎన్ఏ సేకరించే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశం. 6. సూపర్ ఇంపొసిషన్ గుర్తించాల్సిన మృతదేహం ఫలానా వారిదనే అనుమానం ఉండి డీఎన్ఏ–బ్లడ్ శాంపిల్స్ సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఘటనాస్థలిలో లభించిన పుర్రెను అత్యా«ధునిక పరికరాలతో విశ్లేషించి కంప్యూటర్ సాయంతో దానికి ముఖాకృతిని ఇస్తారు. దీన్ని అనుమానితుల ఫొటోలతో సరిపోల్చడం ద్వారా మృతులను గుర్తిస్తారు. ఇది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. -
డ్రైవర్లు అప్రమత్తం చేస్తే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఘోర రోడ్డు ప్రమాదాల జాబితాలో ముందు వరుసలో ఉండేవి రెండు ఘటనలు కాగా..మొదటిది 2013 అక్టోబర్లో మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని పాలెం గ్రామ శివారులో జరిగింది. జబ్బార్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు గోడను ఢీకొని 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. రెండోది శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగిన దుర్ఘటన. ఇవి రెండూ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా జరిగినవి కావడం గమనార్హం. కాగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను మేల్కొలిపేందుకు ప్రయతి్నస్తే ప్రాణ నష్టం తక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ ఎక్కువ ఘటనల్లో డ్రైవర్లు.. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో బస్సును, ప్రయాణికులను వదిలేసి పరారవుతున్నారు. ప్రమాదం ధాటికి, మంటలకు మేల్కొనే ప్రయాణికులు తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గాయపడిన వారిని సకాలంలో రక్షించలేక పోవడం, మంటలు చెలరేగినప్పుడు తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. రెండు ఘటనల్లోనూ అంతే..విమాన పైలెట్ల విషయంలో కీలక నిబంధన ఉంది. విమానం ఏదైనా ప్రమాదానికి గురవుతుందనుకున్నప్పుడు.. ముందుగా ప్రయాణికులను, ఆ తర్వాత విమాన సిబ్బందిని రక్షించే కీలక బాధ్యత పైలట్ది. వారిని రక్షించే ప్రయత్నం చేసిన తర్వాతనే తనను తాను రక్షించుకునేందుకు యత్నించాలి. ఇది అంతర్జాతీయ ఏవియేషన్ నిబంధన. పైలట్ శిక్షణలో దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. బస్సు డ్రైవర్లు కూడా ఇలాంటి బాధ్యతే నిర్వర్తించాలి. నిబంధనల్లో ప్రత్యేకంగా పొందుపరచనప్పటికీ, డ్రైవింగ్ శిక్షణలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్తారు. పునఃశ్చరణ తరగతుల్లోనూ దీన్ని వివరిస్తారు.కానీ ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అసలు శిక్షణే ఉండటం లేదు. పునఃశ్చరణ అనేది వారెప్పుడూ వినని మాట అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి నిర్లక్ష్యం, అవగాహన లోపమే ఈ రెండు భారీ ప్రమాదాల్లో ఏకంగా 65 మంది ప్రాణాన్ని బలిగొంది. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురై మంటలు అంటుకోగానే డ్రైవర్లు వెంటనే బస్సు దిగి పారిపోయారు. కర్నూలు ఘటనలో మంటలకు బస్సు వైరింగ్ వ్యవస్థ దెబ్బతిని తలుపులు తెరుచుకోకపోవటంతో ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు రావాల్సి వచి్చంది. డ్రైవర్లు పారిపోయేముందు తలుపులు తెరిచి ప్రయాణికులను పెద్దగా అరుస్తూ అప్రమత్తం చేసి ఉంటే చాలామంది ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లారీ డ్రైవర్లకు బస్సుల అప్పగింత!సాధారణ బస్సులతో పోలిస్తే ఓల్వో, బెంజ్, స్కానియా లాంటి కంపెనీ అధునాతన బస్సులను నడపాల్సిన తీరు వేరుగా ఉంటుంది. ప్రత్యేక శిక్షణ అవసరం. ఆర్టీసీ అలా ప్రత్యేకంగా శిక్షణ ఇచి్చన డ్రైవర్లకు మాత్రమే ఈ బస్సులు అప్పగిస్తోంది. కానీ పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ఎలాంటి శిక్షణ లేకుండా, లారీలు, ట్రాక్టర్లు నడిపిన వారికి కూడా ఈ బస్సులు ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో కీలక సమయంలో ఎలా వ్యవహరించాలో వీరికి తెలియటం లేదు.తప్పించుకోనీకుండా చేస్తున్న పొగ ప్రమాదం జరిగిన కొన్ని క్షణాలు, నిమిషాల తర్వాత మేల్కొనే ప్రయాణికులు పొగ వల్ల తప్పించుకోలేకపోతున్నారు. బస్సులోకి మంటలు వ్యాపించటం కంటే ముందుగానే దట్టంగా పొగ వ్యాపించడం జరుగుతోంది. మంటలు బస్సు దిగువ భాగం నుంచి వ్యాపిస్తాయి. ప్రయాణికులు ఉండే డెక్ కింద సామాను ఉంచే భాగం ఉంటుంది. ప్రైవేటు బస్సు నిర్వాహకులు ప్రయాణికుల టికెట్ ఆదాయం కంటే అక్రమంగా సరుకు రవాణా చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం దిగువ భాగంలో ఎక్కువ సామాను ఉంచేలా స్థలం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని రకరకాల సామగ్రితో నింపేస్తున్నారు. మంటలకు అవి కాలిపోయి దట్టమైన పొగ బస్సులోకి క్షణాల్లో వ్యాపిస్తోంది.నిద్రలో ఉంటున్న ప్రయాణికులు ఆ పొగను పీల్చి అస్వస్థతకు గురై స్పృహ కోల్పోతున్నారు. ఎక్కువమంది మృత్యువు పాలవుతున్నారు. ఇక బస్సులో నిబంధనలకు విరుద్ధంగా బెర్తులకు భారీ కర్టెన్లు ఏర్పాటు చేస్తున్నారు. సీట్లకు రెగ్జిన్ కవర్ అమర్చుతున్నారు. ప్రయాణికులకు దిండ్లు, దుప్పట్లు, సీట్ల మీద పరుచుకునేందుకు దుప్పట్లు ఉంచుతున్నారు. ఇవన్నీ మంటల తీవ్రతను పెంచుతున్నాయి. పొగతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రయాణికులను వీటి మంటలు వేగంగా చుట్టుముడుతున్నాయి. -
కార్మికులకు చేరువయ్యేలా ఈఎస్ఐ సేవలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) చందాదారులకు అమలు చేస్తున్న సేవలపై విస్తృత ప్రచారం చేస్తోంది. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలతోపాటు చందాదారులు పనిచేస్తున్న సంస్థల్లోనూ ఈఎస్ఐసీ ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వాల్పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీల ఏర్పాటుకు ఉపక్రమించింది. రూ.21 వేల వేతనంలోపు కార్మికులు ఈఎస్ఐ పథకం కింద అర్హత పొందుతారు. ఉద్యోగం పొందిన కార్మికుడు తన వివరాలతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేయించడంతోపాటు అందరి ఆధార్ కార్డు వివరాలను యాజమాన్యం ద్వారా వెబ్సైట్లో ఎంట్రీ చేయించాలి.సాధారణంగా ఈఎస్ఐ ద్వారా కేవలం వైద్య సదుపాయాలు మాత్రమే అందుతాయనేది కార్మిక వర్గాల్లో ఉన్న ప్రచారం. కానీ అంతకు మించిన మరెన్నో ప్రయోజనాలను ఈఎస్ఐ ద్వారా పొందొచ్చని ఇప్పుడు కార్పొరేషన్ విస్తృత అవగాహన కల్పిస్తోంది. ⇒ దేశవ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలు, రెండు డెంటల్ కాలేజీలు, మరో రెండు నర్సింగ్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో ప్రవేశాల విషయంలో 15 శాతం సీట్లు ఆలిండియా కోటాకు కేటాయించగా, 50 శాతం సీట్లు స్థానిక అభ్యర్థులకు, 35 శాతం సీట్లు మాత్రం ఈఎస్ఐ చందాదారుల పిల్లలకు కేటాయించారు. ర్యాంకు ఆధారంగా ఈఎస్ఐ చందాదారు కోటాలో ప్రవేశాలు పొందొచ్చు. ⇒ మహిళా చందాదారులు ప్రసూతి సెలవులు తీసుకోవొచ్చు. ఇద్దరు పిల్లల వరకు 26 వారాల పాటు నూరుశాతం వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తారు. దత్తత తీసుకుంటే 12 వారాల పాటు సెలవులు పొందొచ్చు. ఈ సేవలు పొందేందుకు ముందుగా ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యులతో చికిత్స చేయించి ధ్రువీకరించుకున్న తర్వాత యాజమాన్యం సహాయంతో పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ⇒ చందాదారులు విధుల్లో మరణిస్తే వేతనంలో 90 శాతాన్ని పింఛన్ రూపంలో పొందొచ్చు. భార్యకు జీవితాంతం, కుమారుడికి 25 సంవత్సరాలు వచ్చే వరకు, కూతురుకు వివాహం అయ్యే వరకు పింఛన్ నిబంధనల మేరకు ఈఎస్ఐ చెల్లిస్తుంది. దివ్యాంగులైన కుమారుడు లేదా కుమార్తె ఉంటే వారికి బెనిఫిట్స్ ఇస్తారు. ఇందుకు సంబంధించి ఫారం–15, బ్యాంకు ఖాతా, కుటుంబ వివరాలను సమీప ఈఎస్ఐ కార్యాలయంలో సమరి్పంచాలి. ⇒ కార్మికులు జబ్బు పడితే వారికి వేతనంలో 75 శాతాన్ని కార్పొరేషన్ సాయం చేస్తుంది. ఏడాదిలో గరిష్టంగా మూడు నెలల (91 రోజుల) పాటు చెల్లిస్తారు. ⇒ టుబెక్టమీ చేయించుకుంటే 14 రోజులు, వ్యాసెక్టమీ చేయించుకుంటే 7 రోజుల పూర్తి వేతనం ఈఎస్ఐ కార్పొరేషన్ అందిస్తుంది. పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత లభిస్తుంది. -
ఎమర్జింగ్ కోర్సులకు అధ్యాపకుల కొరత
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నైపుణ్యం గల ఫ్యాకల్టీ ఈ ఏడాది పెద్ద ఎత్తున విరమించుకున్నట్టు కాలేజీల యాజ మాన్యాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. టాప్ కాలేజీలకు చెందిన కొంతమంది అధ్యాపకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు.మధ్యస్తంగా ఉండే కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీని టాప్ కాలేజీలు తీసుకున్నాయి. దీంతో టాప్ 20 తర్వాత ఉండే కాలేజీల్లో సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్, ఆఖరుకు సివిల్, మెకానికల్ ఫ్యాకల్టీతో ఎమర్జింగ్ కోర్సులను నెట్టుకొస్తున్నారు. జిల్లాల్లో, హైదరాబాద్ పరిసరాల్లోని సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అరకొరగానే ఫ్యాకల్టీ ఉంది. కనీస నైపుణ్యం కూడా లేని వారితో క్లాసులు నిర్వహిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్కు చెందిన ఓ సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కాలేజీల్లో బోధన సిబ్బంది సమస్య ఉన్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి.ఎందుకీ పరిస్థితి?టాప్ టెన్ కాలేజీలు మినహా అన్ని కాలేజీలూ రెండేళ్ళుగా అధ్యాపకుల వేతనాలు పెంచలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని, ఫీజులు పెంచేందుకు ప్రభు త్వం ఒప్పుకోవ డం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈసారి యాజమాన్య కోటా సీట్ల భర్తీ కూడా టాప్ 15 కాలేజీల్లోనే ఎక్కువగా జరిగింది. అదే సాధా రణ కాలేజీల్లో సీఎస్ఈ సీట్లు కూడా మిగిలిపోయాయి. మరో వైపు నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులకు మౌలిక వసతుల కల్పన వ్యయం ఎక్కువైందని యాజమాన్యాలు అంటున్నాయి.ఇంకోవైపు ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి పెద్ద ఎత్తున కంప్యూటర్, ఎమర్జింగ్ కోర్సుల సీట్లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మంజూరు చేసింది. ఫలితంగా ఆయా కాలేజీల్లో ఫ్యాకల్టీ అవసరం ఏర్పడింది. మన రాష్ట్రం నుంచి దాదాపు వందకు పైగా డేటాసైన్స్ అధ్యాపకులు కర్ణాటక, తమిళనాడు కాలేజీలకు వెళ్ళినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో డేటాసైన్స్ ఫ్యాకలీ్టకి నెలకు రూ.75 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకూ వేతనాలు ఇస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాల్లో రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ ఆఫర్లు వచి్చనట్టు అధ్యాపకులు చెబుతున్నారు. కోడింగ్ కష్టాలు ఇంజనీరింగ్ విద్యార్థులకు కోడింగ్ అత్యంత ప్రాధానమైంది. కమాండ్లు, సూచనలు రాయడం ఈ దశలోనే చేయాలి. సీ, సీ ప్లస్, జావా, పైతాన్, జావా స్క్రిప్్ట, మెటాలాబ్, ఆర్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ వంటి ప్రోగ్రామ్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నిపుణులైన అధ్యాపకులు వీటిని ప్రాక్టికల్గా నేర్పుతారు. అయితే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మంచి ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థులు కోడింగ్పై దృష్టి పెట్టలేకపోతున్నారు.మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఆన్లైన్లో నేర్చుకుని వచ్చి చెప్పాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో తమ సందేహాలు వారు నివృత్తి చేయలేకపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్..ఆల్గరిథమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, విజన్ కంట్రోల్, బేసిక్ వెబ్ డిజైనింగ్, పైతాన్, మెటాలాబ్ ఫర్ డేటా సిమ్యులేషన్, ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్స్లో కనీస ప్రమాణాలు కూడా ఫ్యాకల్టీ నుంచి ఉండటం లేదని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు అంటున్నారు. -
మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఒకే సారి రూ. 2,780 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులను తెలంగాణ కోర్ అర్బన్ సిటీ మినహాయించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో ఖర్చు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.15 కోట్లు, కొత్త కార్పొరేషన్లకు రూ.30 కోట్లు, గ్రామాలను విలీనం చేసిన మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున వెంటనే పంపిణీ చేయాలని తెలిపారు. ఈ రూ.2,780 కోట్లతో చేపట్టే మొత్తం 2,432 పనులకు సీఎం ఆమోద ముద్ర వేశారు. ఈ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి కచి్చతంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.పురపాలక శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలక ఎన్నికలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ, చుట్టుపక్కల వాటికి మినహా అన్నింటికి ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు.. ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతోపాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలన్నింటిలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతోపాటు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (UIDF) నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
‘జూబ్లీహిల్స్ బరిలో 58 మంది’
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉండగా, పురుషులు- 2,08,561, మహిళలు 1,92,779 మంది ఉన్నారన్నారు. ఇతరులు 25 మంది మాత్రమే ఉన్నారన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వివరాలు వెల్లడించిన ఆర్వీ కర్ణన్.. ‘ ముగ్గురు అబ్జర్వర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుంది. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఉంటుంది. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పోలింగ్ స్టేషన్కి వెళ్లాలి. పోలింగ్ స్టేషన్ లోపలికి ఓటర్లకు, ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదు’ అని తెలిపారు.2 కోట్ల 83 లక్షల రూపాయల నగదు పట్టుకున్నాంఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల రూపాయల నగదు పట్టుకున్నామన్నారు పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ స్పష్టం చేశారు. ‘ టీమ్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు పట్టుకున్నాం. 512 లీటర్ల మద్యం సీజ్ చేశాం. ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశాం. సోషల్ మీడియా ప్రచారం పై నిఘా పెట్టాం. ఈవీఎంలు సరిపడా ఉన్నాయి. 20 శాతం ఈవీఎంల ఎక్స్ట్రా ఉన్నాయి. ఓటర్ స్లిప్పులు స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు పంచుతారు. పొలిటికల్ పార్టీల వారు ఓటర్ స్లిప్పులు పంచితే కేసులు నమోదు చేస్తాం. ఈనెల 27న పారా మిలిటరీ బలగాలు వస్తున్నాయి. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు నియోజకవర్గంలో పని చేస్తాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయి. 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి’ అని తెలిపారు. -
మానవత్వం చాటుకున్న యాంకర్ వింధ్య విశాఖ.. రూ. లక్ష సాయం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాణానికి ప్రామాణికమైన కిడ్నీ, లివర్ పనిచేయకపోవండంతో.. ఆపన్నహాస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయమందించి తనమానవత్వాన్ని చాటుకుంది ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, టీవీ యాంకర్ వింధ్య విశాఖ. ఆ బాలుడు ప్రణీత్కు తాను అందించిన లక్ష రూపాయలు సరిపోవని, సోషల్ మీడియాలో సహాకారం అందించాలని కోరుతోంది. జన్యుపరమైన కారణాలతో కిడ్ని, లివర్ రెండూ పనిచేయకుండాపోయిన ప్రణీత్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో తన తండ్రి డయాలసిస్ కోసం తరచుగా వెళుతున్న వింధ్య విశాఖ తమ పక్క బెడ్ పైనే ఉన్న ప్రణీత్ పరిస్థితిని ఆరా తీసి తనవంతు సహాయం అందించింది. ఆరోగ్య శ్రీ వర్తించని బాలుడి కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స కోసం సహాకారం అందించాలని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో.. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, తన ఫేరెట్ కోహ్లి, తన జెర్సి నెంబర్ 18 అంటూ సాగిన సంభాషన అందరినీ కలచి వేస్తోంది.చికిత్స కోసం ఉన్న ఆస్తి అమ్మేశా..మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామం. తోమ్మిదేళ్ల నా కొడుకును వారంలో 3 రోజులు డయాలసిస్ కోసం నగరంలోని హాస్పిటల్కు రావల్సివస్తుంది. అర్థ ఎకరం భూమి అమ్మి 20 లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించాను. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం జీవన్దాన్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు 40 లక్షల రూపాయలు ఖర్చవుతాయంట. నా ఇద్దరు కొడుకులు జెనికల్ డిసార్డర్తోనే పుట్టారు. దాతలు సహాయాన్ని నా 9849520535 నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే చేయవచ్చు. -ఎంకమొల్ల స్వామి, ప్రణీత్ తండ్రి.ప్రణీత్ను కాపాడుకుందాం..డయాలసిస్ వల్ల బీపీ పెరిగిపోయి అవస్థలు పడుతున్న సమయంలో ప్రణీత్ని తన తండ్రి ఒడిలో పెట్టుకున్నప్పుడు మొదటి సారి చూశాను. సహాయంగా నావంతు లక్ష అందించాను, కానీ అది సరిపోదు. దయచేసి ఎవరికి తోచినంత వారు సహాయం చేయాలని కోరుతున్నాను. తనకు మంచి భవిష్యత్ ఉంది, చాలా యాక్టివ్గా, నేర్చుకోవాలనే తపనతో ఉంటాడు. ప్రణీత్ను గత 3 నెలలుగా గమనిస్తున్నాను. డబ్బులు సమకూరితే నిండు ప్రాణాన్ని కాపాడిన వారమౌతాము. -వింధ్య విశాఖ, స్పోర్ట్స్ ప్రజెంటర్. View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) -
కర్నూలు బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల వివరాలు
సాక్షి,కర్నూలు : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (నంబర్ DD01 N9490) కర్నూలు ప్రజానగర్కు చెందిన శంకర్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు తేరుకునేలోపే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన,సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:1. జె. ఫిలోమిన్ బేబీ (64)2. కిషోర్ (64)3. ప్రశాంత్ (32)4. ఆర్గా బందోపధ్యాయ (23)5. యువన్ శంకర్ రాజా (22)6. మేఘనాథ్ (25)7. ధాత్రి (27)8. అమృత్ కుమార్ (18)9. చందన మంగ (23)10. అనూష (22)11. గిరి రావు (48)12. కేనుగు దీపక్ కుమార్ (24)13. జి. రమేష్ 14. జి అనూష 15. మనిత16. కేశనాథ్ 17. సంధ్యారాణి 18. కర్రీ శ్రీనివాస రెడ్డి 19. పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) 20. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒకరి పేరు తెలియాల్సి ఉంది.సురక్షితంగా ఉన్న ప్రయాణికులు:శ్రీలక్ష్మి, జస్విత (8), అభీరా (1.8) కపర్ అశోక్ (27) అశ్విన్ రెడ్డి ఆకాశ్ జయంత్ కుశ్వాల్ – మధ్యప్రదేశ్ (హైదరాబాద్లో పనిచేస్తున్నారు)పంకజ్ ప్రజాపతి శివా గ్లోరియా ఎల్సా సామ్ – బెంగళూరుచారిత్ (21) మొహమ్మద్ ఖిజర్ (51) తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే ప్రయాణం రద్దు చేసుకున్నారుగాయపడిన ప్రయాణికులు:మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం. రవి – సత్తుపల్లి, ఖమ్మం జిల్లాబడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు – మియాపూర్, హైదరాబాద్అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి – హయత్నగర్, హైదరాబాద్సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు – బెంగళూరునెలకుర్తి రమేష్ (36) – దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాముసలూరి శ్రీహర్ష (25) – నెల్లూరు జిల్లాపునుపట్టి కీర్తి (28) – ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్వేణుగోపాల్ రెడ్డి (24) – తెలంగాణఎం.జి. రామరెడ్డి – తూర్పు గోదావరి జిల్లాఘంటసాల సుబ్రమణ్యం – కాకినాడ, ఆంధ్రప్రదేశ్గుణ సాయి – తూర్పు గోదావరి జిల్లా డ్రైవర్ల వివరాలు 1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. 2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.ప్రయాణికుల రాష్ట్రాలవారీగా: • తెలంగాణ రాష్ట్రం – 6 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11 • మధ్యప్రదేశ్ – 1 • కర్ణాటక రాష్ట్రం – 4మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది. -
బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను వెలికితీశారు. ఫోరెన్సిక్ బృందాలు వీటిని బస్సులో నుంచి వెలికితీశాయి. ఈ ఘటన నుంచి 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరితో తెలంగాణకు సంబంధించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. సూరారంలో ఇద్దరు, జేఎన్టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా.. మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ సిచ్చాఫ్ వస్తోంది. జేఎన్టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. అంతేకాకుండా.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి బయలుదేరిన వారు ఇద్దరు ఉన్నారు. బెంగళూరుకు చెందిన తల్లీ కుమారులు పిలోమి నాన్ బేబీ(64), కిషోర్ కుమార్(41) ఇటీవల దీపావళి పండగకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలోని బంధువు, సాఫ్ట్వేర్ ఉద్యోగి రాము ఇంటికి వచ్చారు.గురువారం సాయంత్రం పటాన్చెరు అంబేడ్కర్ కూడలి వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి బెంగళూరు బయలుదేరారు. అయితే ఈ లోపే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదానికి గురవడంతో వీరు క్షేమంగా ఉన్నారా లేదా? అనేది తెలియడం లేదు. వారి ఆచూకీ కనుక్కునేందుకు రాము దంపతులు కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. -
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో చోటుచేసుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులపై ప్రతీరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడితే వేధింపులు అంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం.కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుందిమృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాంఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం’ అని చెప్పుకొచ్చారు. -
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్ లైన్ ఏర్పాటు చేసిందిఎం.శ్రీరామచంద్ర- అసిస్టెంట్ సెక్రటరీ-991291954ఈ.చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్-9440854433గద్వాల్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్-9502271122కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ నంబర్ 9100901599- 9100901598కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూం నంబర్ 9100901604గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828బాధిత కుటుంబాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. -
బంజారాహిల్స్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. హోటల్లో స్రీకెట్గా..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఆర్–ఇన్ హోటల్లో ఓ గదిలో గత కొంతకాలంగా యువతులతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడులు చేసి ముగ్గురు యువతులతో సహా ఏడుగురు కస్టమర్లు, వ్యభిచార గృహ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ షరీఫ్ గతంలో స్టైల్ మేకర్ సెలూన్ నిర్వహించేవాడు. ఉద్యోగాల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి సెలూన్లో చేర్చుకుని వారిని అధిక డబ్బు సంపాదించవచ్చనే ఆశపెట్టి వ్యభిచారానికి తరలిస్తున్నాడు. కజకిస్థాన్, రష్యా, ఉగాండా, థాయ్ల్యాండ్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి తన సెలూన్లో ఉద్యోగాల పేరుతో రప్పించి వారిని ఖరీదైన హోటళ్లకు పంపిస్తూ వ్యభిచారం చేయిస్తున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఆర్–ఇన్ హోటల్లోని గదులపై దాడులు చేసి ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు. కజకిస్థాన్కు చెందిన యువతితో పాటు మరో ఇద్దరు యువతులు పట్టుబడిన వారిలో ఉన్నారు. మరో ఏడుగురు విటులకు నోటీసులు జారీ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఎండీ షరీఫ్పై కేసు నమోదు చేశారు. నగదును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Kokapet Lands: కోకాపేట్ ఔర్ ఏక్బార్.. ల్యాండ్ రెడీ ఫర్ సేల్
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించే కోకాపేట్పై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్ధ (హెచ్ఎండీఏ) మరోసారి దృష్టి సారించింది. నియోపోలిస్ లేఅవుట్లో మూడో దశ భూముల విక్రయానికి సన్నాహాలు చేపట్టింది. ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో రాయదుర్గం, కోకాపేట్ ప్రాంతాల్లోని డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సుమారు 25 ఎకరాలకు పైగా భూములను విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.రాయదుర్గంలోని టీజీఐఐసీ భూములకు లభించినట్లుగానే కోకాపేట్ నియోపోలిస్ భూములకు కూడా భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రెండో దశ కింద నియోపోలిస్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఒక ఎకరా అత్యధికంగా రూ.100.75 కోట్లకు విక్రయించారు. ఈసారి అంతకంటే ఎక్కువే లభించవచ్చని భావిస్తున్నారు. దీంతో 25 ఎకరాలపై రూ.3000 కోట్ల వరకు రావచ్చని అంచనా. నియోపోలిస్ మూడో ఫేజ్పై నవంబరు వారంలో నోటిఫికేషన్ ఇచ్చి చివరి వారంలో బిడ్డింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కోకాపేట్ నియోపోలిస్ లే అవుట్లో 2021 జూన్ నెలలో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో ఈ భూములపై రూ.2000 కోట్లకు పైగా లభించాయి. 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్లో 45.33 ఎకరాలు విక్రయించగా రూ.3,300 కోట్ల వరకు వచ్చాయి. తాజాగా పెరిగిన డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఎకరా గరిష్టంగా రూ.వంద కోట్లపైనే రావచ్చని అధికారులు భావిస్తున్నారు. కొంగు బంగారమే... నగరానికి పడమటి వైపు ఆకాశహర్మ్యాలతో అలరారే కోకాపేట్.. అంతర్జాతీయ హంగులతో దేశ విదేశాలకు చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఔటర్రింగ్రోడ్డు, మరోవైపు రాయదుర్గం వరకు కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో ఫారŠూచ్యన్ 500 కంపెనీలకు చేరువలో ఉన్న నియోపోలిస్లో రెండో దశ భూముల అమ్మకానికి కూడా భారీ స్పందన లభించింది. ఈ లే అవుట్ను హెచ్ఎండీఏ ‘నియోపోలిస్’ పేరుతో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. ఎలాంటి ఆంక్షలు లేనివిధంగా ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ భవనాలను నిర్మించేందుకు అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు మొదటి నుంచీ నియోపోలిస్ కోసం పోటీ పడుతున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించగా రెండో దశలో 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్లను విక్రయించారు. ప్రస్తుతం మిగతా ప్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. ఇక్కడ ఒక్కో ప్లాట్ సైజు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల వరకు ఉంటుంది.ఇవీ ప్రత్యేకతలు కోకాపేట్ నియోపోలిస్ సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రూ.300 కోట్లతో హెచ్ఎండీఏ ఈ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. సుమారు 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు తదితర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు తదితర అన్ని సదుపాయాలు ఉన్నాయి. కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని రకాల భవనాలకు అనుమతులు ఉన్నాయి. నియోపోలిస్లో ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ బిల్డింగ్లను నిర్మించవచ్చు. ఔటర్ రింగ్రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు 5 నిమిషాలు, ఎయిర్పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. -
ఇలాంటి కేసులు వాదించేముందు ఒకసారి ఆలోచించాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలతో భవిష్యత్లో ముప్పు వాటిల్లుతుందని, అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు ఒకసారి ఆలోచించాలని హైకోర్టు సూచించింది. అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ లేమితో ఇరుగు పొరుగు మధ్య సఖ్యతే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. జీ ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారును ప్రశ్నించింది. పిటిషనర్, అక్రమ నిర్మాణదారు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలుంటే ఇలా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది. కాలానుగుణంగా విప్లవాలు వస్తుంటాయని, ఇప్పుడు అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణకు అన్నదమ్ములిద్దరూ హాజరుకావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పర్వతపురంలో 175 గజాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ బి.సంజీవ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్లో పెను ముప్పుగా మారనుందని, ఆ తరాలు ఇప్పటివారిని క్షమించవని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ అధికారులతోపాటు అక్రమ నిర్మాణదారుల తరఫున వాదించే న్యాయవాదులు ఇది తెలుసుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు వస్తూ పోతూ ఉంటారని, ఇలాంటి కేసులతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతాయన్నారు. కొందరు భూములను భార్యల పేర కొనుగోలు చేస్తున్నారని, అక్కడ గంజాయి లాంటివి పండిస్తుండటంతో మహిళలు కూడా నిందితుల జాబితాలో చేరుతున్నారన్నారు. -
విద్యార్థి ఖాతాకే ‘ఫీజు’
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సంస్కరించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఫీజుల చెల్లింపుల్లో మరింత పారదర్శకత పాటించడంతోపాటు సులభతరంగా చెల్లింపులు చేసేందుకు మరిన్ని మార్పులు తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించే ఫీజులను కాలేజీ యాజమాన్య ఖాతాల్లో కాకుండా నేరుగా విద్యార్థి ఖాతాకు విడుదల చేసేలా నిబంధనల మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ గత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థి ఖాతాకు ఫీజులు విడుదల చేస్తుండగా గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా నేరుగా విద్యార్థులకే ఫీజులు విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాయి. తాజాగా ఈ ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపాక ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కాలేజీల ఆధిపత్యానికి చెక్... సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కాలేజీల యాజమాన్యాల ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫీజు నిధుల విడుదలలో జాప్యం వల్ల ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఫీజు అందే దాకా విద్యార్థుల ధ్రువపత్రాలు ఇచ్చేందుకు చాలా కాలేజీల యాజమాన్యాలు నిరాకరిస్తుండటం వల్ల కోర్సులు పూర్తి చేసినా ఉద్యోగ ఇంటర్వ్యూలు, చేరికల వేళ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలేజీలు ఫీజు పథకం పరిధిలోని విద్యార్థుల నుంచి కూడా ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీల ఆదిపత్యానికి చెక్ పెట్టడంతోపాటు విద్యార్థికి నేరుగా ఫీజులు చెల్లించడం వల్ల పారదర్శకత ఉంటుందనే కోణంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెలవారీగా నిధులు.. ఈ అంశంపై బీసీ సంక్షేమం, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సంక్షేమ శాఖల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇకపై సంక్షమ శాఖలకు నెలవారీగా బడ్జెట్ విడుదల చేస్తామని ఈ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. నెలకు రూ. 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తే అందులో గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణతోపాటు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు వాటిని వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. ఈ క్రమంలో నెలవారీగా నిధులు విడుదల చేస్తే ఉపకార వేతనాలు, ఫీజుల కోసం నెలకు రూ. 200 కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య
హయత్నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం స్నానం చేసి వస్తానంటూ వెళ్లిన వైష్ణవి.. బెడ్రూంలో గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా వైష్ణవి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేశ్ కుమారుడు రాకేశ్ (21) బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్కు ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్ ఊడ్చేందుకు షట్టర్ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. ఆమె సోదరి గమనించి కజిన్కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వరుస ఆత్మహత్య ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రప్పించడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా త్వరలో ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ని అమలు చేస్తామని ప్రకటించారు.గడిచిన 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్లుగా ఉందన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ సంస్థ ‘ఆస్ బయో టెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం మెల్బోర్న్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేష నల్ కాన్ఫరెన్స్ 2025’లో మంత్రి శ్రీధర్బాబు గురు వారం కీలకోపన్యాసం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గడిచిన రెండేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, పెట్టు బడులకు ఉన్న అనుకూల తలను మంత్రి వివరించారు.అత్యుత్తమ లైఫ్సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‘ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్కు చోటు దక్కి ంది. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన హైదరాబాద్ నిలిచింది. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు కాగా, 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగు లకు చేరింది.లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ఇండియా స్కిల్క్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్ బయో –డిజిటల్ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసు కుంది. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ సద స్సు ‘విక్టోరియా తెల ంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలి’అని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరా బాద్లో జరిగే బయో ఏషియా సదస్సు కు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను మంత్రి ఆహ్వానించారు. సదస్సులో విక్టోరియా మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియ ర్సన్, ఆస్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ జేమ్స్ క్యాంప్బెల్, తెల ంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
కొత్త గోడౌన్లు ‘కోల్డ్ స్టోరేజీ’లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో మరిన్ని కోల్డ్ స్టోరేజీ గోడౌన్లను నిర్మించాలని ఉద్యానవనశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్పందన రావట్లేదు. పండ్లు , కూరగాయలు, ఉల్లి వంటి ఉద్యాన పంటలతోపాటు మిర్చి, చేపలు, గుడ్లు, మాంసం, చీజ్ వంటి ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు భారీ స్థాయిలో కోల్డ్ స్టోరేజీల అవసరం ఉంది. ప్రస్తుతం ఉద్యానవనశాఖ పరిధిలోని సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 89 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఉండగా మరో 100 యూనిట్లు ఏర్పాటు చేసినా డిమాండ్కు తగ్గ నిల్వ సామర్థ్యం సరిపోదని అధికారులు చెబుతున్నారు. అయితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించట్లేదు.35 శాతం రాయితీ ఇవ్వనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలురాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 12 కోల్డ్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే కేవలం సిద్దిపేట నుంచి ఒక దరఖాస్తు రాగా మిగతా జిల్లాల నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో ఔత్సాహికులు తగిన అర్హతలతో ముందుకు వస్తే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఉద్యానవన శాఖ భావిస్తోంది. ఎంఐడీహెచ్ పథకం కింద శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. 5 వేల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ యూనిట్ నిర్మాణానికి రూ. 4.80 కోట్లు ఖర్చయితే అందులో రూ. 1.68 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించనున్నాయి. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 9,600 చొప్పున ఖర్చయితే అందులో రూ. 3,360 అందనుంది.సబ్సిడీ సరిపోదని..ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణదారులు ఐదు అంతస్తుల్లో రెండు వేర్వేరు చాంబర్లను నిర్మించాలి. ఒక్కో చాంబర్ నిల్వ సామర్థ్యం 3,631.90 టన్నుల చొప్పున రెండు చాంబర్లు కలిపి 7,284 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కట్టాలి. అయితే 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి మాత్రమే ఎంఐడీహెచ్ పథకం సబ్సిడీ లభిస్తుంది. అంటే మిగిలిన 2,284 మెట్రిక్ టన్నుల నిర్మాణాలు పూర్తి చేసుకున్న కోల్డ్ స్టోరేజీలకు అద్దె ప్రాతిపదికన చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో లేకపోవడంతో పంటలు వృథా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తగినంత భూమి ఉన్న ఔత్సాహికులు కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలికోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణం కోసం ఔత్సాహికులను ఆహ్వాని స్తున్నాం. ఇందుకోసం అందిస్తున్న 35 శాతం సబ్సిడీని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. శీతల గిడ్డంగులకు ఉన్న డిమాండ్ను సద్వినియోగం చేసుకుంటే తగిన ఆదాయం లభిస్తుంది. రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. – యాస్మిన్ భాషా, ఉద్యానవన శాఖ డైరెక్టర్ -
భూ అప్పగింత ఉత్తర్వుల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్లోని అనంతారం గ్రామం సర్వే నంబర్ 137/27లోని 1.07 ఎకరాలను సేవాలాల్ మందిరానికి దీర్ఘకాలిక లీజుకు, వాస్తవ ధరకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్న లోకాయుక్త ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. లోకాయుక్త రిజిస్ట్రార్తోపాటు శంకర్నాయక్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మరో నలుగురితో కలిసి సేవాలాల్ ఆలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి 10 నుంచి 15 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ లోకాయుక్తకు ఓ ఫిర్యాదు అందింది. ఈ ట్రస్టు అక్కడ నిర్మించే అతిథి గృహానికి రోడ్డు కోసం ఒక రైతు భూమిలోని మిర్చి పంటను తొలగించిందని, దీంతో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడని అందులో పేర్కొన్నారు. ఈ ఘటన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైందన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఆక్రమణపై దర్యాప్తు జరిపి, ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లోకాయుక్త జిల్లా కలెక్టర్ను నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2017, 2021లో కలెక్టర్ నివేదికలు సమర్పించారు. ట్రస్ట్ ఆక్రమించిన 1.07 ఎకరాల్లో లింటెల్ లెవల్ వరకు నిర్మాణం, అప్రోచ్ రోడ్డు, బోర్వెల్ కనిపించాయన్నారు. సదరు భూమిని లీజు లేదా ధరకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ను లోకాయుక్త ఆదేశించింది. ఆక్రమించినట్లు శంకర్ ఒప్పుకున్నారు..లోకాయుక్త గతేడాది జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కలెక్టర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కలెక్టర్ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తేరా రజినీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లోకాయుక్త తన అధికార పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం–1977, తెలంగాణ లోకాయుక్త చట్టం–1983 నిబంధనలకు విరుద్ధం. సేవాలాల్ మందిర నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్లు శంకర్నాయక్ లోకాయుక్త విచారణలో ఒప్పుకున్నారు. నిబంధనలకు మేరకు ఏదైనా కంపెనీ, ప్రైవేట్ సంస్థ, సంఘాలకు భూమి కేటాయించాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. చట్టవిరుద్ధంగా దాఖలు చేసిన వినతిపత్రం ఆధారంగా ఆ భూమిని శంకర్నాయక్కు అప్పగించలేమని సీసీఎల్ఏ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తూ ఇచ్చిన ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
మోసాలే ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా మన కష్టార్జితాన్ని కాజేసే సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త రకం మోసాలకు తెరతీస్తూనే ఉన్నారు. లాటరీ వచ్చిందని, ఆఫర్లు ఉన్నాయని, ఆన్లైన్ జాబ్లు ఇస్తామని, పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల వ్యవధిలోనే ఎన్నో రెట్లు పెరుగుతుందని.. ఇలా నిత్యం ఏదో ఒక రకమైన మోసపూరిత వల విసురుతూనే ఉన్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే 2025లో సెప్టెంబర్ వరకు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిచ్చే అంశం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్న ఫిర్యాదులలో ఎక్కువగా ఐదు రకాల మోసాలకు సంబంధించినవే ఉన్నట్టు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఇందులో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో ఐడెంటిటీ థెఫ్ట్ (వ్యక్తిగత సమాచారం సేకరించి మోసాలు) మోసాలు, అడ్వరై్టజ్మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, బిజెనెస్–పార్ట్టైం జాబ్ మోసాలు ఉన్నాయి. అత్యాశే అనర్థాలకు మూలం.. పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల్లోనే రెట్టింపు అవుతుందన్న ప్రకటనలు నమ్మి మోసపోతున్నవారే అధికంగా ఉంటున్నారు. ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధిక రాబడి వాగ్దానాలను నమ్మవద్దు. నెలకు 10 నుంచి 20 శాతం రిటర్న్ల వంటి వాగ్దానాలు ఇస్తున్నారంటే అది మోసమని గ్రహించాలి. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలి. సెబీ (సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమోదం లేని యాప్లు వాడవద్దు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు సూచించిన యాప్లలో లాభాలు చూపి, రియల్ అకౌంట్లో నష్టం కలిగిస్తారని మరవొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 18 నుంచి 20 శాతం వరకు ఉంటున్నాయి. ఈ తరహా మోసాలకు ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు బలవుతున్నారు. ఆ తర్వాత 30 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర విద్యాధికులు ఉంటున్నారు. అయితే, స్టాక్స్ ఇతర షేర్లలో పెట్టుబడులకు సంబంధించి వెరిఫైడ్ ఏజెన్సీల నుంచి మాత్రమే సూచనలు తీసుకోవాలి. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయాలి. వాట్సాప్ లింక్లలో వచ్చే సందేశాలు నమ్మి మోసపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టే స్టాక్స్ వివరాలు ముందుగా ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్బీ (ఫొటో కామన్లో శిఖాగోయల్ పేరిట ఉంటుంది) -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
స్థానికంపై 7న నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 7వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అనంతరం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నవంబర్ 3న హైకోర్టులో జరగనున్న విచారణలో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 7న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించినట్లు వివరించారు. ఎస్ఎల్బీసీలో టీబీఎంకు స్వస్తి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల కోసం ఇప్పటి వరకు అనుసరించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) విధానాన్ని పక్కనబెట్టి, అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో మిగతా పనులు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దివాళా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్తో గతంలో చేసుకున్న ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి లేదా 2028 జూన్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 44 కి.మీ.ల సొరంగం తవ్వాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 31–32 కి.మీల తవ్వకాలు జరిగాయని, ఆ తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు 2–2.5 కి.మీ.ల మేర మాత్రమే తవ్వకాలు జరిపిందని విమర్శించారు. ప్రపంచంలోనే అతి పొడువైన 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటివరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ తీర్మానించింది. 1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు... రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లను ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నిర్మించిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ–స్టేషన్ను తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, రివర్స్ పంపింగ్ ద్వారా అందుకు అవసరమైన విద్యుదుత్పత్తికి వ్యూహాలు సిద్ధం చేయాలని కోరింది. ఆ నిబంధన ఎత్తివేత.. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమ ల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్కు ఫైల్ పంపాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెక్షన్ 21(3) తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ను ప్రభుత్వం తీసుకురానుంది.కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. -
Hyderabad: విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఓ హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. నిన్న రాత్రి(అక్టోబర్ 22 బుధవారం) ఆర్ ఇన్ హోటల్లో టాస్క్ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహించారు. విదేశాల చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ అభివృద్ధిలో బాబుకు సంబంధమే లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్త తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు. దాని పేరే హైటెక్ సిటీ. ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్. కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారు. 2004, 2009లో వైఎస్సార్ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబుకు, హైదరాబాద్కు సంబంధమే లేదు. కానీ, ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు.2004లో వైఎస్సార్ ఓఆర్ఆర్ ఫేజ్-1 ప్రారంభించారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయింది. ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది వైఎస్సారే. మహానేత వైఎస్సార్ హయాంలోనే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం. బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 5650 కోట్లు. అదే వైఎస్సార్ వచ్చాక 2008-09 ఐటీ ఎగుమతులు 32509 కోట్లకు చేరింది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57000 కోట్లుగా ఉంది. కేసీఆర్ కూడా గొప్ప పరిపాలన అందించారు. కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగింది. కానీ, ఈ క్రెడిట్ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం’ అని విమర్శలు చేశారు. -
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది. -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 100 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పత్రాల స్రూ్కట్నీ కూడా పూర్తయ్యింది. అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారంతో పాటు ర్యాలీలు, రోడ్షోలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈమేరకు అందరూ సమన్వయంగా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి కిందికి వచ్చే టోలిచౌకి, గోల్కోండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట, సనత్నగర్ తదితర ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషిటర్లను బైండోవర్ చేశారు. నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలకు విభాగం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచడానికి ఎన్నికల సమయంలో రౌడీషిటర్ల బైండోవర్ చేస్తుంటారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలోని 100 మంది రౌడీషీటర్లతో పాటు 50 మంది సస్పెక్ట్ïÙట్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ ప్రక్రియలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానం ముందు హామీపత్రంపై సంతకం చేయాలని పోలీసులు కోరతారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.నేర కార్యకలాపాలను నివారించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, రౌడీషిటర్లు తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రోత్సహించడం బైండోవర్ల ముఖ్య ఉద్దేశ్యం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే పోలీసులు అడుగడుడుగునా పికెటింగ్లు ఏర్పాటుచేయడంతో పాటు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానితుల కదలికలపై దృష్టిపెట్టారు. రౌడీషిటర్ల కదలికలను కూడా గమనిస్తున్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషిటర్ల కదలికలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా..? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. వీరందరికీ ఇప్పటికే కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచి్చన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లను బైండోవర్ చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో వీరు పాల్గొంటున్నారా..? లేకపోతే ఏదైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయతి్నస్తున్నారా..? అన్నది పోలీసులు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే సోమాజీగూడ, షేక్పేట, యూసుఫ్గూడ, రహమత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ తదితర ఏడు డివిజన్ల పరిధిలో 407 పోలింగ్ బూత్లను 139 లొకేషన్లలో ఏర్పాటుచేశారు. ఇందులో 57 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. క్రిటికల్ పోలింగ్ బూత్ల పరిధిలో ఉంటున్న రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టారు. -
మేడ్చల్ కాల్పుల ఘటన.. ఇబ్రహీం సహా ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు(అజ్జు, శ్రీనివాస్) పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కీసర మండలం రాంపల్లికి చెందిన గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్కేసర్కు వస్తున్న క్రమంలో బహుదూర్పురకు చెందిన ఇబ్రహీం వెంబడించాడు. యంనంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే సోనూ సింగ్పై నిందితుడు రెండు రౌండ్ల కాల్పులను జరిపాడు. దీంతో ఆయన పక్కటెముకల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి గాయమైంది.అనంతరం, స్థానికులు బాధితుడిని హుటాహుటిన మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ, అతడికి సర్జరీ చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించి పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా సీపీ తెలిపారు. -
జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటినీ పూర్తి.. మిగిలింది 81 మందే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByPoll) బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం, బుధవారం నామినేషన్ల స్క్రూటినీ(Nominations Scrutiny Completed) ప్రక్రియ ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇక, రేపు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంత మంది విత్డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. స్క్రూటినీ సందర్బంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఇది కూడా చదవండి: స్థానికంపై నేడు నిర్ణయం! -
వైద్యం కోసం విమానం దిగిన ప్రయాణికురాలు
శంషాబాద్: విమానం ఎక్కిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తడంతో ఓ ప్రయాణికురాలు టేకాఫ్ జరిగే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం బెల్గావి వెళ్లేందుకు ఇండిగో విమానం 7512 విమానం సాయంత్రం 4.10 గంటలకు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ఓ ప్రయాణికురాలు మౌనా రవి తాను తీవ్రమైన చర్మ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్నానని తనను దింపివేయాలని కోరింది. దీంతో అధికారులు విమానం టేకాఫ్ను నిలిపివేసి ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నపటికి మళ్లీ ప్రయాణం కొనసాగించలేదు. దీంతో ఆమె లేకుండానే సాయంత్రం 5.25 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బెల్గావ్ బయలుదేరింది. బెంగళూరు విమానం రద్దు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం రద్దయ్యింది. 74 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు టేకాఫ్ తీసుకుని బయలుదేరాల్సిన విమానాన్ని ఆపరేషనల్ కారణాలతో రద్దుచేసినట్లు ఎయిర్లైన్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
డీజీపీ టెలీ కాన్ఫరెన్స్లో సీపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్ డీజీపీ...రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమినరేట్కు బాస్ నగర కొత్వాల్. వీరిద్దరి మధ్యా సరైన సమన్వయం లేకపోతే..! గతంలో పని చేసిన డీజీపీలు, నగర పోలీసు కమిషనర్ల విషయంలో అదే జరిగింది. ఫలితంగా ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్కు నగర కొత్వాల్గా పని చేసిన అధికారులు దూరంగా ఉంటూ వచ్చారు. డీజీపీగా బత్తుల శివధర్రెడ్డి, కొత్వాల్గా విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి మారింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డీజీపీ నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్కు నగర పోలీసు కమిషనర్ కచి్చతంగా హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే ఈ కాన్ఫరెన్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా విధానపరమైన నిర్ణయాలను డీజీపీ వెల్లడిస్తుంటారు. దీనికి తోడు ముందు జరిగిన కీలక ఘట్టాలు, లోటుపాట్లు, ఆ రోజు జరుగనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చ జరుగుతుంది. ఆయా సందర్భాల్లో పోలీసు విభాగం అనుసరించాల్సిన వ్యూహాల పైనా దిశానిర్దేశం ఉంటుంది. ఇంతటి కీలకమైన డీజీపీ టెలీ కాన్ఫరెన్స్కు దాదాపు మూడున్నరేళ్లుగా పని చేసిన హైదరాబాద్ పోలీసు కమిషనర్లు దూరంగా ఉన్నారు. అసలు పాల్గొనకపోడం, అడపాదడపా పాల్గొనడంతో పాటు తమకు బదులుగా వేరొక ఆఫీసర్ హాజరయ్యేలా చేయడం వంటివి జరిగాయి. కొత్వాల్ కంటే జూనియర్లు డీజీపీలుగా ఉండటం, డీజీపీకి కొత్వాల్కు మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో పాటు అనేక వ్యక్తిగత కారణాల వల్లా ఇలా జరిగింది. దీని ప్రభావం పోలీసింగ్పై పడటంతో పాటు అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నారు. శివధర్రెడ్డి, సజ్జనర్ ఈ విధానానికి స్వస్తి చెప్పారు. సంప్రదాయ పద్దతుల్ని మళ్లీ అమలులోకి తీసుకువస్తూ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్లో నగర పోలీసు కమిషనర్ కచి్చతంగా పాల్గొంటున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేని పక్షంలో డీజీపీ అనుమతి తీసుకుంటున్నారు. ఇలా నగర, రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న ఇతర అధికారులకు బాస్ ఈజ్ బాస్ అనే స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. -
బయటకు రాని బతుకమ్మ చీరలు!
హైదరాబాద్: బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు ఇప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని గోదాములకే ఈ చీరలు పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలందరికి రేషన్ కార్డుల ప్రాతిపదికన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఇందిరా మహిళా శక్తి పొదుపు సంఘాల మహిళలకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు గత నెల 25 వేల చీరలు మలక్పేటకు చేరాయి. అయితే ఇవి సరిపోవని తేలడంతో..మిగతా చీరలు వచ్చాక పంపిణీ చేసేందుకు అధికారులు పండగకు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ గడువులోగా మిగతా చీరల దిగుమతి జరగలేదు. ఈ కారణంతో బతుకమ్మ వేడుకలకు చీరల పంపిణీ చేపట్టలేదు. అన్ని సర్కిళ్ల పరిధిలోని వార్డు కార్యాయాల్లో పొదుపు సంఘం ఖాతా బుక్కును చూపించి పేర్లు నమోదు చేసుకొన్న మహిళలకు చీరల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పంపిణీ జరగకపోవడంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొందరు మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారని తెలిసింది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇంధీరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తారని చర్చించుకుంటున్నారు. మలక్పేటలో 50 వేల చీరలు.. జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ కార్యాలయాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు వార్డు కార్యాలయంలో అధికారులు పంపిణీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆరు డివిజన్లలో 25 వేల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పొదుపు మహిళకు 2 చీరల చొప్పున మొత్తం 50 వేల చీరలు పంపిణీ చేయనున్నారు.అర్బన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో.. ఆయా డివిజన్ పరిధి వార్డు కార్యాలయాల్లోనూ ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. పొదుపు సంఘాల మహిళల రుణాలు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) అధికారుల పర్యవేక్షణలో చీరలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మహిళా సంఘం పరిధిలో 8 నుంచి 13 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఒక్కో మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించే బాధ్యతలను ఆయా డివిజన్ అర్బన్ కమ్యూనిటీ ఆఫీసర్ నేతృత్వంలో రీసోర్స్ పర్సన్లకు అప్పగించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చేనెలలో ఈ మహిళలకు ఇందిరమ్మ చీరలు అందుతాయని భావిస్తున్నారు. -
‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
స్థానికంపై నేడు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విష యం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఇలావుండగా.. ఇద్దరుకు మించి సంతానం కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనను ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఆ మేరకు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసేలా గవర్నర్కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించనుంది. ఎస్ఎల్బీసీ కాంట్రాక్టు రద్దు ..?శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మా ణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాల్సి ఉంటుంది. అలా చేస్తే పెరిగిన ధరల ఆధారంగా అంచనాలు కొన్ని రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా తేల్చవచ్చని అంటున్నారు. కాళేశ్వరం టెండర్లకు ఓకే?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గం రాటిఫై చేయనుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. విజయోత్సవాల్లో భాగంగా సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. -
ఫిరాయింపుల విచారణ తిరిగి షురూ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం హైదరాబాద్కు చేరుకుంటారు. బార్బడోస్, ఫ్రాన్స్, లండన్, ఇటలీలో స్పీకర్తోపాటు మండలి చైర్మన్, వైస్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శితో కూడిన ప్రతినిధి బృందం 18 రోజుల పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకుంటోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డిని బీఆర్ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఈ నెల 4 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.మరో నలుగురి విచారణకు షెడ్యూల్?పది మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా నలుగురికి సంబంధించిన విచారణ షెడ్యూల్ను మాత్రమే స్పీకర్ గతంలో ప్రకటించారు. మరో నలుగు రు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై నెలాఖరులోగా స్పీకర్ విచారణ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విధించిన అక్టోబర్ 30 గడువులోగా విచారణ పక్రియ ముగిసే అవకాశం కనిపించడం లేదు.మరోవైపు స్పీకర్ నోటీసు లు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు తమ వివరణ ఇచ్చి ఉంటే సంబంధిత కాపీలు తమకు అంది ఉండేవని బీఆర్ఎస్ శాసనసభాపక్షం వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కోరాలనే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్లు సమాచారం. -
రెండేళ్లలో ఉస్మా‘నయా’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వందేళ్ల అవసరాలకు తగినట్లుగా కొత్త ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై బుధవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్టు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని, అవసరమయ్యే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి ప్రణాళికలో మార్చురీ గది నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. రోడ్డుకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి ఆసుపత్రి చుట్టూ ముందుగా రోడ్లు నిర్మించి, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఇప్పటినుంచే రూపొందించాలని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ ప్రతి పది రోజులకోసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణం పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్రాజ్, డీజీపీ శివధర్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్రాజ్, క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఇలంబర్తి, ముషారఫ్ అలీ ఫరూఖీ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, డీఎంఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ 2002లో మీ పేరుందా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమాన్ని త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఓటర్ల జాబితాలో చోటు కోసం ఓటరు తనతోపాటు తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులేనని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈసీ సృష్టించడంతో ఈ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. నిర్దేశిత 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా సమర్పించాలని బిహార్ ఓటర్లను ఈసీ కోరింది. బిహార్లో చివరిసారి 2003లో ఎస్ఐఆర్ నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో చోటు పొందిన 4.96 కోట్ల మంది ఓటర్లకు మాత్రం ఈ ధ్రువపత్రాల నుంచి మినహాయింపు కల్పించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2002లో నిర్వహించిన ఎస్ఐఆర్ ద్వారా రూపొందించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో వచ్చే ఏడాది ఎస్ఐఆర్ను నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్– 2002లో రూపొందించిన ఓటర్ల జాబితాను ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తన వెబ్సైట్ (https:// ceotelangana.nic.in/)లో పొందుపరిచింది. ఎస్ఐఆర్–2002లో ఓటరు పేరు/తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయో లేవో ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు తెలుసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా ఓటర్ల పేర్లను సులువుగా వెదకవచ్చు. ఎస్ఐఆర్ 2002లో తమ పేరు/తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్టు రుజువులు సమరి్పస్తే కొత్త ఎస్ఐఆర్లో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు కావాలి.. పుట్టిన తేదీ ఆధారంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పౌరసత్వ రుజువు కోసం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించి బిహార్లో దరఖాస్తులను ఈసీ స్వీకరించింది. 1987 జూలై 1కి ముందు భారతదేశంలో పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీతోపాటు పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రం ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రాలను సమర్పించాలి. 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిండ్రులిద్దరికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన పౌరులైతే సంబంధిత దేశంలోని భారత దౌత్య కార్యాయలం జారీ చేసిన బర్త్ రిజిస్ట్రేషన్ను సమర్పించాలి. ఒకవేళ భారత పౌరసత్వం స్వీకరించి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలి. ఇతర ఏ దేశ పౌరసత్వం స్వీకరించలేదని స్వీయ ధ్రువీకరణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 పత్రాలతో పాటుగా ఆధార్ కార్డును సైతం రుజువుగా ఎన్నికల సంఘం బిహార్లో స్వీకరించింది. ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాలు ఇవే.. – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా గుర్తింపు కార్డు. – 1987 జూలై 1కి ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థ/బ్యాంకు/పోస్టు ఆఫీసు/ఎల్ఐసీ/ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు/ధ్రువీకరణ పత్రం/డాక్యుమెంట్. – జనన ధ్రువీకరణ పత్రం – పాస్పోర్టు – గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదోతరగతి/విద్యార్హత పత్రాలు – రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా కుల ధ్రువీకరణ పత్రం – నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెక్స్ – రాష్ట్ర ప్రభుత్వం/స్థానిక సంస్థలు రూపొందించిన ఫ్యామిలీ రిజస్టర్ – ప్రభుత్వం భూమి/ఇళ్లు కేటాయిస్తూ జారీ చేసిన పత్రం -
అవినీతి ‘పోస్టు’లకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం అవినీతికి నిలయాలుగా మారిన రవాణా శాఖ చెక్ పోస్టులు ఎట్టకేలకు కనుమరుగైపోనున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఆయా పోస్టులను తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వీటిని రద్దు చేయాలని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఇవి ఇంతకాలం కొనసాగుతూ వచ్చాయి. అయితే..వాటి కోసమే ప్రత్యేకంగా అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయాలన్నట్టుగా.. ఆయా చెక్పోస్టుల్లో అవినీతి పేట్రేగుతుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. వాటిని తొలగిస్తున్నట్టుగా ఆగస్టులోనే ఉత్తర్వు జారీ చేసింది. కానీ వాటిని తొలగించకపోవడంతో సీఎం స్పందించారు. సాధారణ హెచ్చరికతో వాటిని తొలగించరని భావించిన ముఖ్యమంత్రి.. బుధవారం సాయంత్రానికల్లా వాటిని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించటంతో రవాణా శాఖ ఆగమేఘాల మీద వాటి తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్పోస్టుల్లో ఉన్న సిబ్బందిని జిల్లా రవాణా శాఖ కార్యాలయాలకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత..: డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ లావాదేవీలను ప్రమోట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ అమలు తర్వాత రవాణా శాఖ చెక్పోస్టులను తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఇవేవీ తెలంగాణ రవాణా శాఖను ప్రభావితం చేయలేకపోయాయి. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభించినా, సరిహద్దు చెక్ పోస్టుల్లో మాత్రం మాన్యువల్ లావాదేవీలనే కొనసాగిస్తూ వచ్చింది. దీంతో చెక్ పోస్టుల్లో పర్మిట్లు, ఓవర్లోడ్ చెకింగ్స్ పేరుతో వాహనాలను నిలిపేసి భారీగా డబ్బులు వసూలు చేయటాన్ని అక్కడి సిబ్బంది ‘విధి’గా పెట్టుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వాహన్, సారథి పోర్టల్లో చేరినా..ఒక్క తెలంగాణ మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు కేంద్రం గట్టిగా చెప్పటంతో ఏడాది క్రితం తెలంగాణ కూడా అందులో చేరింది. కానీ ఇప్పటివరకు వాటిని ఓ గాడిలో పెట్టలేక పోయింది. – ప్రస్తుతం రాష్ట్రాల మధ్య తిరిగే ట్రక్కులు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నాయి. అలా ఒకచోట చెల్లింపులు జరిగినా, రాష్ట్రాలలోని రోడ్ల విస్తీర్ణం, వాహనాల సంఖ్య ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. – అంతర్రాష్ట్ర బస్సులు కూడా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నాయి. వాటికి కూడా చెక్పోస్టు తనిఖీలు అవసరం లేదు. – పర్మిట్లు తీసుకోవటం, చార్జీలు చెల్లించటం.. అంతా ఆన్లైన్ ఆధారంగా జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వాటి డేటా ఉంటుంది. వాహన్–సారథి పోర్టల్ ఆధారంగా డేటా విషయంలో సమన్వయం సాధ్యమవుతోంది. – అన్ని టోల్ ప్లాజాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల కదలికలు రికార్డవుతున్నాయి. ఏ సందేహం ఉన్నా, వాటి ఆధారంగా పసిగట్టే వీలుంది. ఇష్టారాజ్యంగా వసూళ్లు..పోస్టింగులకు లక్షలు తనిఖీల పేరుతో వచ్చిపోయే వాహనాలను ఆపి డబ్బులు వసూళ్లు చేయడమే చెక్పోస్టుల సిబ్బంది పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. ఈ చెక్పోస్టుల్లో ప్రజా ప్రతినిధులు సిఫారసు చేస్తే తప్ప పోస్టింగులు రావు. అంతేకాదు ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ అవినీతి సొమ్ము దిగువ నుంచి పైస్థాయి వరకు పంపిణీ అవుతోందనే ప్రచారం ఉంది. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని చెక్ పోస్టులకు గిరాకీ మరీ ఎక్కువ. వాటిల్లో పోస్టింగ్ కోసం మంత్రుల స్థాయిలో పైరవీలు చేయాల్సిందేనని అంటారు. ఇక ఒక్కో చెక్పోస్టులో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు ఉంటాయని సమాచారం. కాగా ఈ మొత్తం ప్రతినెలా వాటాల రూపంలో చేతులు మారుతుంటుందని చెబుతున్నారు. – ఇటీవలి కాలంలో వాహనదారులు అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మరోవైపు ఈ చెక్పోస్టులను తొలగించాలంటూ వందల సంఖ్యలో వినతులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెక్పోస్టులు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఏర్పాట్లుఓవర్ లోడింగ్, అక్రమ రవాణా, పర్మిట్లు లేకుండా సరిహద్దు దాటడం లాంటి వాటి విషయంలో నిఘా తప్పనిసరి. చెక్పోస్టులను తొలగించి మొబైల్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. చాలా రాష్ట్రాలు వాటిని అనుసరిస్తున్నాయి. మొబైల్ బృందాలు రోడ్లపై తిరుగుతూ అనుమానం ఉన్న వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నాయి. ఏమాత్రం లోపాలు గుర్తించినా..వాహనాలను సీజ్ చేయటం, పెనాల్టీ విధించటం, పర్మిట్ రద్దు చేయటం, లైసెన్సులు స్వాధీనం చేసుకోవటం, రద్దు చేయటం... ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతకాలం చెక్పోస్టులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటంతో మొబైల్ తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఉన్న ఫళంగా చెక్పోస్టులను తొలగించటంతో యుద్ధప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 15 చెక్పోస్టుల్లో 75 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిని ఆయా జిల్లా రవాణా శాఖ కార్యాలయాలకు అటాచ్ చేశారు. వీరితో పాటు, ఆయా కార్యాలయాల్లోని సిబ్బంది నుంచి కొంతమందిని గుర్తించి మొబైల్ బృందాలుగా ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది -
తెలంగాణ-ఆర్ఎమ్ఐటీల మధ్య వ్యూహాత్మక ఒప్పందం
హైదరాబాద్: జీవవిజ్ఞాన (లైఫ్ సైన్సెస్) విద్య మరియు పరిశోధన రంగాల్లో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియాలోని RMIT University వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఇరు సంస్థలు Letter of Intent (LoI) పై సంతకాలు చేశాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RMIT విశ్వవిద్యాలయం డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాథరిన్ ఇట్సియోపోలస్ (Catherine Itsiopoulos), తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరయ్యారు.RMIT విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని ప్రముఖ గ్లోబల్ విద్యాసంస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అప్లైడ్ రీసెర్చ్లో అగ్రగామిగా ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో "ఇంటర్నేషనల్ అవుట్లుక్" విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది. RMIT విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన భాగస్వామ్యాలు మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల పేరుపొందింది. దాని సైన్స్ విభాగం బయోటెక్నాలజీ, బయోసైన్స్, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో ఆధునిక పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలకు అత్యాధునిక ల్యాబ్లు మరియు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.తాజాగా RMIT విశ్వవిద్యాలయం, బిట్స్ హైదరాబాద్తో కలిసి “BITS–RMIT హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీను ప్రారంభించింది. ఆస్ట్రేలియా మరియు భారతదేశాల మధ్య అధునాతన పరిశోధన, విద్యా మార్పిడి, ఆవిష్కరణ ఆధారిత విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుండి పరిశోధకులు జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్లను కొనసాగించవచ్చు. విద్యార్థులు తమ విద్యా కాలంలో కొంత భాగాన్ని బిట్స్ హైదరాబాద్లో, మరికొంత భాగాన్ని RMIT మెల్బోర్న్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులు రెండు దేశాల మధ్య మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కలిసి పరిశోధనలు చేస్తారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించి, భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బలపరచడమే లక్ష్యం.ఈ సందర్భంగా మంత్రి డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ - తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలపై, వారి ఆలోచనలపై పెట్టుబడి పెట్టే దిశగా ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తోంది. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ స్థాపన దిశగా సాగుతున్న సమయంలో, ఇలాంటి ఒప్పందాలు దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల నైపుణ్యం గల యువతను తయారు చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.RMIT డిప్యూటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఇట్సియోపోలస్ (Itsiopoulos) మాట్లాడుతూ - తెలంగాణతో కలిసి తదుపరి తరానికి చెందిన పరిశోధకులు, ఆవిష్కర్తలను తీర్చిదిద్దడం మాకు గర్వకారణం. ఇండస్ట్రీ ఆధారిత విద్య, సంయుక్త పరిశోధనతో మేము ప్రభావవంతమైన మార్పు తీసుకురావాలని తెలంగాణతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రేపటి జీనోమ్ వ్యాలీకి రూపకల్పన వంటిది. RMIT అందించే ప్రామాణిక విద్యను, హైదరాబాద్లో ఉన్న అత్యుత్తమ బయోటెక్ వేదికలతో మిళితం చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించటమే కాదు… మన పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, భారత్ను ప్రపంచ ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నిస్త్తున్నారు. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం (సెప్టెంబర్ 22) ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి ఎం. రఘునందన్ రావుకు కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవాదాయశాఖ డైరెక్టర్గా ఎస్ హరీశ్కు, గనులశాఖ డైరెక్టర్ భవేష్ మిశ్రాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను సర్కార్ రిలీవ్ చేసింది. మైన్స్ అండ్ జియాలజి డైరెక్టర్ గా భావేష్ మిశ్రాను నియమించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలను గరిమా అగర్వాల్కు అప్పగించింది. గరిమా అగర్వాల్ ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్గా సేవలందిస్తున్నారు. కాగా, సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ‘నేనే మాగంటి గోపినాథ్ వారసుడిని’..
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.ఆ లేఖలో ‘తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్కు ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు షేక్పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు. -
TG: ‘అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులను తక్షణం మూసివేయండి’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసిఏయాలనే ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోరి అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలి. చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని పేర్కొంది. ‘చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలి. ఆర్థిక మరియు పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలి. చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదిక ఈరోజే సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి’ అని ట్రాన్స్పోర్ట్ శాఖ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇదీ చదవండిL ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ సోదాలు..దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి..? -
రాయదుర్గ్లో భూముల వేలం.. కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి.ఈ నేపథ్యంలో రాయదుర్గ్లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ లే ఔట్లో వచ్చే నెల 10న సుమారు ఎకరా భూమిని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసింది. వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై ఔత్సాహిక కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న రాయదుర్గ్లోని టీ హబ్లో (t-hub) ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లించేందుకు నవంబర్ 4ను గడువుగా నిర్దేశించారు.ఎకరా రూ.200 కోట్లు? రాయదుర్గ్ (Raidurg) పాన్మక్తాలోని సర్వే నంబరు 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను టీజీఐఐసీ వేలం వేస్తోంది. ఈ రెండు ప్లాట్ల విస్తీర్ణం కలుపుకుని 4,718.22 చదరపు గజాలు (సుమారు ఎకరా విస్తీర్ణం) కాగా, ఒక్కో చదరపు గజం అప్సెట్ ధరను (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా, ఎకరా ధరను సుమారు రూ.146 కోట్లుగా నిర్ణయించింది. వేలం పాటలో ఎకరా ధర రూ.200 కోట్ల మార్క్ను అధిగమించే అవకాశముందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవలి వేలంలో 17 మంది బిడ్డర్లు పోటీ పడిన నేపథ్యంలో తాజా వేలానికి కూడా భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాయదుర్గ్లో టీజీఐఐసీ (TGIIC) అదీనంలో 470 ఎకరాలు ఉండగా, గడిచిన దశాబ్ద కాలంలో 200 ఎకరాలకుపైగా విక్రయించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మరో పది ఎకరాల మేర వేలానికి సిద్ధంగా ఉండగా, 50 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో కోర్టు వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా టీజీఐఐసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త ట్రెండ్ -
శ్మశానవాటికల్లో దీపావళి సంబరాలు
హైదరాబాద్: హిందూ శ్మశానవాటికల్లో సోమవారం రాత్రి దీపావళి పర్వదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుటుంబీకులు సమాధులను పూలమాలలతో సుందరంగా అలంకరించి పితృ దేవతలకు నైవేద్యాలు సమరి్పంచారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లోని హిందూ శ్మశానవాటికతో పాటు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–13లోని హిందూ శ్మశానవాటికలు దీపావళి సందర్భంగా సమాధులన్నీ బంతిపూల మాలలతో సుందరంగా అలంకరించగా అర్ధరాత్రి దాకా సందడిగా శ్మశానంలోనే పండుగ వాతావరణంలో నిర్వహించారు. తమ పూరీ్వకులను స్మరించుకుంటూ కుటుంబీకులంతా సమాధుల వద్ద దీపాలు వెలిగించి నివాళులర్పించారు. సాధారణంగా అర్ధరాత్రి శ్మశానంలో అడుగుపెట్టాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ బంజారాహిల్స్లోని ఈ మూడు శ్మశానవాటికల్లో మాత్రం ఎనిమిది దశాబ్దాలుగా శ్మశానాల్లోనే దీపావళి పండుగను జరుపుకునే సంప్రదాయాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉన్నా దీపావళి రోజు మాత్రం తప్పకుండా వచ్చి సమాధులను అలంకరించి దీపాలు వెలిగించి టపాసులు కాల్చి నైవేద్యాలు సమరి్పంచి సామూహిక భోజనాలు చేయడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని భగవాన్దాస్ అనే స్థానికుడు తెలిపారు. పూరీ్వకులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని వీరు పేర్కొంటున్నారు. -
Jubilee Hills By Poll: స్వతంత్ర అభ్యర్థిగా వీరబోగ వసంత రాయలు
హైదరాబాద్: నెత్తిమీద మహరాజులు ధరించే టోపీ, ఒంటి మీద కుర్తా, అలనాటి లెగ్గిన్, వంకీలు తిరిగిన బూట్లు, మెడలో రాజహారాలు, చేతులకు కడియాలు, రాజసంగా ఓ చేతిలో కత్తి ధరించి గుర్రపు బగ్గీపై నామినేషన్ వేసేందుకు వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరబోగ వసంత రాయలు ప్రజాపతి (వీబీవీఆర్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం నియోజకవర్గానికి వచ్చారు. యూసుఫ్గూడలోని పోచమ్మబస్తీ నుంచి ఆయన ఈ విధమైన వేషధారణతో గుర్రపు బగ్గీపై వెళ్తుండగా అందరూ మొబైల్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ప్రజాక్షేమమే లక్ష్యమని, సంపాదన ముఖ్యం కాదని అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఒక్కటే సిగ్నల్.. కళ్లు బయర్లు కమ్మే చలాన్లు!! ఎట్టకేలకు చిక్కాడిలా..
ఈ మధ్య సోషల్ మీడియాలో బైకులపై ఉన్న చలాన్ల గురించి నడుస్తున్న చర్చ గురించి తెలిసిందే. వేలల నుంచి లక్షల దాకా చలాన్లు ఉన్న బైకుల ఫొటోలను కొందరు తరచూ వైరల్ చేస్తున్నారు. అక్కడ ఆ అవసరం లేకుండానే పోలీసులకు చిక్కాడు ఓ చలాన్ల ధీరుడు!హైదరాబాద్: : తరచూ ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్రూట్లో వెళ్లడంతో ఆటోమెటిక్ సీసీ కెమెరా ద్వారా రూ.58895 జరిమానా పడినట్లు గుర్తించిన వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనాన్ని సీజ్ చేశారు. సంఘటనకు సంబందించి వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భూపతిగట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని హస్తినాపురం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు విలియంకేరికి చెందిన బైక్ నంబర్ ఏపి37డీఎస్ 3639 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఏకంగా రూ.58895 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. అతను ప్రతిరోజు గుర్రంగూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే యూటర్న్ వద్ద రాంగ్రూట్లో ఒక్కోరోజు నాలుగైదు సార్లు వెళితే నాలుగైదు జరిమానాలు ఆటోమెటిక్గా జరిమానాలు పడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్చేసిన పోలీసులు పెండింగ్ చలానాలు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని యజమానికి సూచించారు. దీంతో అతను డబ్బులు చెల్లించి బైక్ తీసుకెళతానని చెప్పి వెళ్లినట్లు సీఐ తెలిపారు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని విజయవాడ, నాగార్జున జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన యూటర్న్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరనే ఉద్దేశంతో వాహనదారులు రాంగ్రూట్లో వెళుతున్నారు. ప్రతి యూటర్న్ వద్ద తాము ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ యూటర్న్ లు ఉన్న ప్రాంతంలో వాహనదారులు రోజుకు ఎన్నిసార్లు రాంగ్ రూట్లో వెళితే అన్ని సార్లు రూ. 1235 చొప్పున జరిమానా పడుతుందన్నారు. ప్రతిఒక్కరూ గమనించి రాంగ్రూట్లో వెళ్లవద్దని, జరిమానాలే కాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని సీఐ హెచ్చరించారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పార్టీలకు షాకిస్తూ భారీ సంఖ్యలో నామినేషన్లు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వచ్చారు. దీంతో, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. బుధవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.నామినేషన్ల చివరిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మంగళవారం గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బుధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు.. రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
ఆయుధం లేకుండానే యుద్ధానికి!
సాక్షి, హైదరాబాద్: సరిహద్దులో సైనికులంతా అస్త్రశస్త్రాలతో కదన రంగంలోకి దూకి శత్రువులపై పోరాడుతుంటే సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం అసాంఘిక శక్తులు, ముష్కరులతో ఉత్త చేతులతోనే పోరాడాల్సి వస్తోంది. ఈ కారణంగానే తాజాగా నిజామాబాద్లో ఘరానా దొంగ రషీద్ను పట్టుకొని పోలీసు స్టేషన్కు తరలించే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు కత్తితో పొడవడంతో అమరుడయ్యాడు. గతంలోనూ పలువురు కానిస్టేబుళ్లు ఆయుధాలేవీ లేకుండానే నేరస్తులతోపాటు ఉగ్రవాదులకూ ఎదురెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నెత్తురోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు... రాష్ట్ర నిఘా విభాగంలో కానిస్టేబుల్గా పని చేసిన కుక్కుడపు శ్రీనివాసులు 2017లో ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పతకాన్ని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశవ్యాప్తంగా 25 ఉగ్రవాద కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఆలంజెబ్ అఫ్రిదీని శ్రీనివాసులు 2016 జనవరిలో పట్టుకున్నారు. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అఫ్రిదీ కదలికల్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరులోని పరప్పణ అగ్రహార ప్రాంతంలో గుర్తించారు.దీంతో పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ శ్రీనివాసులుపై అఫ్రిదీ, అతని భార్య కత్తితో దాడి చేశారు. పేగులు బయటకు వచ్చి నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా శ్రీనివాసులు స్థానిక పోలీసులు వచ్చే వరకు అఫ్రిదీని ఒడిసిపట్టుకున్నారు. విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు శౌర్యచక్ర అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా పోలీసు విభాగంలో పనిచేసే అధికారికి శౌర్యచక్ర పతకం లభించడం అదే తొలిసారి. నేరగాళ్లతో పోరాడిన వాళ్లెందరో... గత మూడేళ్లలో నేరస్తులను పట్టుకొనే క్రమంలో అనేక మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అయినా వెనక్కు తగ్గకుండా నిందితులను పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్ఓటీలో కానిస్టేబుల్గా పనిచేసిన రాజు నాయక్కు శౌర్య పతకం లభించింది. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో భార్యాభర్తల్ని చంపి దోపిడీకి పాల్పడిన రౌడీషీటర్ కరణ్సింగ్ను పట్టుకునే క్రమంలో రాజు ఛాతీలో కత్తి దిగింది. అయినా రాజు తన సహచరులు వచ్చే వరకు కరణ్సింగ్ను విడిచిపెట్టలేదు. ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదాపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.ఈ క్రమంలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎస్ఓటీ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి తొడలోకి తూటా దూసుకుపోయింది. అయినప్పటికీ ఆయన మిగిలిన కానిస్టేబుళ్లతో కలిసి ప్రభాకర్ను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. మాదాపూర్ సీసీఎస్లో కానిస్టేబుళ్లుగా పనిచేసే యాదయ్య, దినేశ్.. స్నాచర్లు రాహుల్, కిషన్ల కోసం ముమ్మరంగా గాలించారు. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో వీరిని గుర్తించి పట్టుకున్నారు. ఆ సందర్భంలో రాహుల్ కత్తితో దాడి చేయగా యాదయ్యకు ఏకంగా ఏడు కత్తిపోట్లు పడ్డాయి.పోలీసు వద్ద ఆయుధాలు కనుమరుగు... విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి ఆయుధం అనేది శరీరంలో భాగం లాంటిది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం వరకు అధికారులతోపాటు కీలక విభాగాల్లో పని చేసే కానిస్టేబుళ్లు తమ వద్ద తుపాకీ ఉంచుకునే వారు. అయితే కొన్నేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు చేపట్టే పోలీసులెవరూ తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా మెలిగేందుకు, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఐదింట నాలుగు యూపీఐ!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రూపురేఖలను యూపీఐ అని పిలిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మార్చేసింది. జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా యూపీఐ విస్తరించింది. 2022 జనవరి నాటికి యునిక్ యూపీఐ వినియోగదారుల సంఖ్య కేవలం 26.9 కోట్లు. ఈ ఆగస్టు నాటికి ఈ సంఖ్య 50.4 కోట్లకి చేరింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2022–23లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 74 శాతం కాగా.. 2024–25 నాటికి ఏకంగా 84 శాతానికి పెరిగింది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో సెప్టెంబరులో 1963 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.24.90 లక్షల కోట్లు. 2024 సెప్టెంబరులో లావాదేవీల సంఖ్య 1504 కోట్లు కాగా, వాటి విలువ రూ.20.63 లక్షల కోట్లు. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే అగ్రస్థానం. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు యూపీఐవేనంటే అది ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.‘కానీ’–అమెజాన్పే సర్వేమేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘కానీ’, అమెజాన్ పే కలిసి సంయుక్తంగా దేశంలోని 120 పట్టణాల్లో.. డిజిటల్ చెల్లింపులపై అధ్యయనం చేశాయి. మొత్తం 6,000 మందిని సర్వే చేశారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సహా చిన్నచిన్న పట్టణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లలో యూపీఐది సింహభాగం కాగా.. ఆఫ్లైన్లో మాత్రం ఇప్పటికీ నగదుదే అగ్రస్థానం.రికార్డు స్థాయిలో..2022–23 నుంచి 2024–25 మధ్య రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో.. రాష్ట్ర జీడీపీలో సుమారు 8 శాతం విలువైన యూపీఐ లావాదేవీలు జరగడం విశేషం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. టాప్ రాష్ట్రాలు..‘ఆన్లైన్’ బాటలో...మొత్తం సర్వే చేసిన వారిలో 90% మంది.. ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులనే ఎంచుకుంటున్నట్టు తెలిపారు. ఆఫ్లైన్ కొనుగోళ్లలోనూ (దుకాణాల వంటి చోట్లకు వెళ్లి చేసేవాటిలోనూ).. 56% మంది డిజిటల్ చెల్లింపులే చేశారట. కరెంటు, గ్యాస్ బిల్లు వంటి (యుటిలిటీ) ముఖ్యమైన చెల్లింపులు కూడా 87% మంది డిజిటల్లోనే చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ వాలెట్ల వాడకమూ పెరిగింది. యుటిలిటీ, సబ్స్క్రిప్షన్ల కోసం డిజిటల్ వాలెట్లు వాడుతున్నట్టు 13% మంది చెప్పారు.మహిళలూ ముందంజలో..పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ఇష్టపడుతుండటం గమనార్హం. ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో 88 శాతం మగవాళ్లు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నామంటే.. ఇలా చేస్తామన్న మహిళలు 89 శాతం కావడం విశేషం. మెట్రో నగరాల్లో ఇలాంటి మహిళల శాతం 63 శాతం కాగా, చిన్న పట్టణాల్లో ఇది 47 శాతం.ఎందుకు ‘డిజిటల్’ వైపు?ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఇష్టపడటానికి రెండు ప్రధాన కారణాలు చెప్పారు. అన్ని చోట్లా వాటిని అంగీకరిస్తున్నందున చేస్తున్నామని 57 శాతం, సౌకర్యవంతంగా ఉండటం వల్ల వాటిని వదల్లేకపోతున్నామని 61% మంది చెప్పారు.టాప్ –4 విభాగాలుఎన్పీసీఐ గణాంకాల ప్రకారం.. 2022–23 నుంచి 2024–25 మధ్య యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరిగిన టాప్ విభాగాలు..⇒ కిరాణా, సూపర్ మార్కెట్లు⇒ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లు⇒ ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్లు⇒ టెలికమ్యూనికేషన్ సేవలు -
అదరగొడుతున్న ఆఫ్ క్యాంపస్
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగ నియామకాల ట్రెండ్ మారింది. క్యాంపస్ నియామకాలకన్నా ఆఫ్ క్యాంపస్ నియామకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ దీనికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు తగ్గట్టు మానవ వనరుల సమీకరణకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మారడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూకుడుగా వెళ్తుండటంతో స్కిల్ ఉన్న వారికే కంపెనీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో గత మూడేళ్లుగా 78 శాతం ఏఐ, డేటాసైన్స్లో నైపుణ్యం ఉన్న వారినే కంపెనీలు ఎంపిక చేసుకున్నట్లు నౌకరీ డాట్ కామ్ అధ్యయనంలో తేలింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్లో 84 శాతం నియామకాలు ఆఫ్ క్యాంపస్ (off-campus) ద్వారానే చేపట్టినట్లు డెలాయిట్ సంస్థకు చెందిన సీనియర్ హెచ్ఆర్ ఒకరు తెలిపారు. వేతనాలు కూడా క్యాంపస్ నియామకాలకన్నా ఆఫ్ క్యాంపస్ ద్వారా నియమించుకున్న వారికే ఎక్కువ ఇస్తున్నారు. డెలాయిట్ ఇండియా నివేదిక ప్రకారం ఈ ఏడాది క్యాంపస్ నియామకాల్లో వేతనాలు 3.91 శాతం పెరిగితే ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో 15 శాతం వార్షిక వేతన ప్యాకేజీ పెరిగింది. యాన్ ఇండియా క్యాంపస్ స్టడీ 2025–26 ప్రకారం 73 శాతం సాధారణ కంపెనీలే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి. ఐటీ దిగ్గజ సంస్థల్లో 85 శాతం కంపెనీలు ఆఫ్ క్యాంపస్ ద్వారానే నియామకాలు చేశాయి. కారణాలేంటి? ఐటీ రంగంలో అనుభవం ఉంటే తప్ప ఉద్యోగులను తీసుకొనే పరిస్థితి లేదు. కానీ క్యాంపస్ నియామకాల్లో ఫ్రెషర్స్ను మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉన్నందున కాలేజీల్లో కాకుండా ఇతర సంస్థల్లో, ఆన్లైన్ విధానంలో కోడింగ్పై (Coding) పట్టు సాధించిన వారిని నియమించుకోవడంపై కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. ఇంకో ప్రధానాంశం ఏమిటంటే క్యాంపస్ నియామకాల్లో కేవలం కంపెనీ హెచ్ఆర్ విభాగం మాత్రమే ఇంటర్వ్యూ చేస్తోంది. అదే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అయితే ఆన్లైన్ ద్వారా వివిధ స్థాయిల నిపుణులు అభ్యర్థిని లోతుగా ప్రశ్నించే వీలుంది. దీనివల్ల నైపుణ్యం ఉన్న వారినే ఎంపిక చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ఆఫ్ క్యాంపస్లో రాణించాలంటే.... నైపుణ్యం ఉన్నప్పటికీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చాలా మంది ఎంపిక కావడం లేదు. పెద్ద ఐటీ సంస్థలు దాదాపు ఆరు రౌండ్ల దాకా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది అభ్యర్థులు ధైర్యంగా మాట్లాడలేక, బెరుకుగా సమాధానాలు ఇస్తుండటం వల్ల తొలి రౌండ్లోనే నిష్క్రమిస్తున్నారని ఐబీఎం హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు. రెజ్యూమ్ రూపకల్పనలోనూ తప్పులు చేస్తున్నారని.. అనుభవానికి మించి ఎక్కువ కేడర్ పోస్టులకు దరఖాస్తు చేస్తుండటం వల్ల తొలి దశలోనే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోందని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం ఉన్నా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ నైపుణ్యాలను ఆన్లైన్ వేదికల ద్వారా నేర్చుకోవచ్చని.. తద్వారా ఆప్ క్యాంపస్ కొలువులు సాధించడం కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఐటీ నియామకాల్లో ఎక్కువ భాగం ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అవుతున్నాం. ఇది తేలికగా ఉంటోంది. అభ్యర్థి సామర్థ్యాన్ని గుర్తించడానికి వివిధ కేటగిరీ నిపుణులూ ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇది సాధ్యం కాదు. అందుకే గత మూడేళ్లలో పెద్ద కంపెనీలు 70 శాతం మేర ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ వైపు మళ్లాయి. – అంబరీష్ నికోలన్ (ఓ ఎంఎన్సీ హెచ్ఆర్ మేనేజర్) సమర్థతకు ఇదే వేదిక ఫైనలియర్లో క్యాంపస్ నియామకాల కోసం పెద్ద కంపెనీలేవీ రాలేదు. ఆశించిన వేతన ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో కొన్ని కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నా. ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్కు ప్రయత్నించి ఓ ఎంఎన్సీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సాధించా. మన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇదే సరైన మార్గం. – సంజయ్ త్రిపూర్ (బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్) -
సాగర్ కుడివైపున సీసీ కెమెరాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయానికి కుడి వైపున ఏపీ భూభాగం పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతిచి్చంది. ఇందుకోసం ఇంజనీర్లు, సిబ్బందిని డిసెంబర్ 31 వరకు ఏపీ వైపు ఉన్న డ్యామ్పైకి అనుమతించాలని సీఆర్పీఎఫ్ కమాండింగ్ అధికారికి మంగళవారం లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం నిర్వహణ ఏపీ పరిధిలోకి వెళ్లగా నాగార్జునసాగర్ తెలంగాణ నిర్వహణ కిందకు వచ్చింది. గతంలో ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్ కుడిభాగంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలంగాణ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత ఇరురాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం సాగర్ కుడిభాగంలో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. ప్రస్తుతం కుడి భాగంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడ ఎలాంటి మరమ్మతులు చేయాల్సి వచి్చనా కృష్ణా బోర్డు అనుమతితోనే రాష్ట్ర ఇంజనీర్లకు అనుమతిస్తున్నాయి. జలాశయం భద్రతా చర్యల్లో భాగంగా కుడి భాగంలో సీసీ కెమెరాలతోపాటు పిడుగుల నుంచి రక్షణ కోసం లైట్నింగ్ అరెస్టర్లు, సర్జ్ ప్రొటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమ ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టర్ల సిబ్బందిని అనుమతించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేయడంతో బోర్డు అనుమతిచ్చింది. -
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా పార్టీకి చెందిన 40 మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రచార వాహనాల పాస్లు మంజూరు చేసింది. ఈసీ అనుమతి పొందిన స్టార్ క్యాంపెయినర్లు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వి.ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వి.శ్రీనివాస్గౌడ్, ఎస్.నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాతా మధు, ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రచారంలో పాల్గొంటారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, నేతలు రావుల శ్రీధర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అబ్దుల్లా సోహైల్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ నిర్ణయించింది
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ని ఎంఐఎం నేతలు నిర్ణయించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించిన వెంటనే మజ్లిస్ నేతలు కలసి, తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కలో చేరడం మజ్లిస్కు అలవాటేనన్నారు. కిషన్రెడ్డి మంగళవారం బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్రెడ్డి నామినేషన్ సందర్భంగా యూసఫ్గూడలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్ను లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, సింగపూర్గా మారుస్తా అన్న వ్యక్తి ఫాంహౌస్లో పడుకున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజీనామా చేసిన తరువాత ఫాంహౌస్ నుంచి బయటకు రాని వారికి ఓటు వేస్తామా’అని అన్నారు. జూబ్లీహిల్స్ అంటే అక్కడ అన్నీ అద్దాల మేడలని ప్రజలకు ఒక దురభిప్రాయం ఉందని, ఇక్కడ వీధుల్లో చూస్తే మురుగు నీరు, చెత్త, వెలగని వీధి లైట్లు, పార్కుల కబ్జాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. గుడి భూములు ఎంఐఎంకు: బండి సంజయ్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మతల్లి ఆలయానికి చెందిన 11 ఎకరాలను ఎంఐఎం పార్టీ వారికి రాసివ్వడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సల్కం చెరువులో ఎంఐఎం కాలేజీ కడితే వారితో కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యం పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లో సైకిల్కి కూడా గతి లేని నాయకులు ఇప్పుడు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు వేసుకుని, పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై మేం మాట్లాడం, మూసీపై మీరు మాట్లాడకండి అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. ఎంఐఎంలో ఇద్దరు జోకర్లు ఉన్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చెరో రూ.200 కోట్లు తెచ్చుకుని, పతంగి పార్టీని యూసఫ్గూడ చౌరస్తాలో వేలం వేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రెస్కు అభ్యర్థి దొరకలేదని, అందుకే మజ్లిస్ నుంచి ఒక వ్యక్తిని అద్దెకు తెచ్చుకున్నారని బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, దానికి జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు పాల్గొన్నారు. -
చివరిరోజు 189 నామినేషన్లు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. ఇలా మొత్తం 189 నామినేషన్లకు అధికారులు టోకెన్లు అందించారు. ఈ టోకెన్ల ప్రకారం అభ్యర్థులను లోపలకు పిలిచారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టగా రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్ల పత్రాలను మాత్రమే రిటర్నింగ్ అధికారి తీసుకోగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బు«§ధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పండి
శేరిలింగంపల్లి/బండ్లగూడ: (హైదరాబాద్): రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారుకు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి లింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్షాకోట్లో హైడ్రా కూల్చివేతల బాధితుల దీపావళి పండుగలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..బస్తీల ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, గడప దగ్గరలోనే వైద్య సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అందులో 350 బస్తీ దవాఖానాలను ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తే, ఇప్పుడు వాటిని నిర్వీర్యంగా మార్చారు. కనీసం బీపీ మీటర్లు కూడా పనిచేయడం లేదు. గతంలో బస్తీ దవాఖానాలలో 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తూ 110 రకాల మందులు అందించే వాళ్ళం. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటికి సుస్తీ పట్టింది. ప్రస్తుతం 60 నుంచి 70 రకాల మందులే ఇస్తున్నారు. 40 రకాల మందులు సరఫరా చేయడం లేదు. వైద్య పరీక్షలు కూడా అన్నీ జరగడం లేదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. సీఎం సొంత నియోజకవర్గంలోనే 108 సర్వీస్ సకాలంలో రాక, వైద్యం సకాలంలో అందక మనిషి ప్రాణం పోయింది..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు ‘ఆస్పత్రులలో కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల 20 శాతం ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలి వెళుతున్నారు. రూ.1,400 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండగా.. వాటిని చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా మారిందో అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ బీజేపీతో కలవదు. మాది లౌకిక పార్టీ. కానీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నగరంలో పేదల ఇళ్లు కూల్చడం ఆగాలన్నా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రేవంత్రెడ్డి నయా నరకాసురుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కునుకు లేకుండా చేస్తోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే బస్తీ దవాఖానాల్లో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారని రేవంత్రెడ్డి అనుకుంటాడు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటెయ్యాలి. హైదర్షాకోట్ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు తమకు అండగా ఉండాలని కోరారు. మీ కష్టాల్లో అండగా ఉన్నది బీఆర్ఎస్ పారీ్టయే..’అని హరీశ్రావు చెప్పారు. పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
మావోలు లొంగిపోవాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమంలోని అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసునని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసే అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. మంగళవారం గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. పోలీసుల కృషితో ఇప్పుడవి దాదాపు లేకుండా పోయాయి. గ్రేహౌండ్స్ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్ కల్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందితే.. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడురోజుల కిందట నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, ప్రమోద్ లాస్ట్ డ్రాన్ శాలరీ అతని పదవీ విరమణ సమయం వరకు కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షల ఎక్స్గ్రేషియాం, పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం..’ అని సీఎం చెప్పారు. దేశానికే ఆదర్శంగా మన పోలీసులు ‘రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరగనివ్వకుండా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణను పూర్తి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకే పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ‘ఈగల్’ వింగ్ను ఏర్పాటు చేశాం. కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వకారణం. సాంకేతిక రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తెలంగాణకు దక్కిన గౌరవం. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది..’ అంటూ రేవంత్ కితాబునిచ్చారు. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి ‘పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చాం. పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్లు సారథ్యం వహించడం గర్వించదగ్గ పరిణామం. కీలక విభాగాలను సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి గర్విస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులు డీసీపీలుగా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లను, ఎస్ఐలను రిక్రూట్ చేశాం. రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి సాధ్యం. ఇందులో పోలీసుల పాత్ర కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నాం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను.. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలకు, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలకు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలకు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మనది ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదని, ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే ఫార్ములాతో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ‘ఫెయిర్ పోలీసింగ్’ అయితే.. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ, శాంతిభద్రతలను కఠినంగా కాపాడటం ‘ఫర్మ్ పోలీసింగ్’. విధి నిర్వహణ సరిగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్నీ పొందడమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’..’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీకి అందజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
Hyd: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు
హైదరాబాద్: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 21వ తేదీ) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయం కాంపౌండ్క భారీగా క్యూకట్టారు స్వతంత్ర్య అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వేసినట్ల తెలుస్తోంది. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లన మాత్రమే ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) సైతం ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గత బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.ఇదీ చదవండిపార్టీలో నా న్థానం ఏమిటి..? -
‘‘కేసీఆర్పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని, పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే పోలీసుల అత్యాగాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. మంగళవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. దేశం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులకు నాలుగు కోట్ల ప్రజల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలోనే ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం... రోజు రోజుకు నేరాల స్వభావం మారుతోంది. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. శాంతి భద్రతల కట్టడికి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. అందుకే అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా పని చేస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణే మా ధ్యేయం. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉంది. సాంకేతికతలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు మంచి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం. ఇటీవల కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. తెలంగాణ అభివృద్ధిలో వారి వంతు తోడ్పాటు అందించాలి. అలాగే.. పోలీసుల గౌరవం పెరిగితేనే ప్రభుత్వ గౌరవం కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్న ఈ రోజుల్లో.. పోలీసుల ప్రతీ అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి అని సీఎం రేవంత్ సూచించారు.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రసంగిస్తూ.. పోలీస్ అధికారులు అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిధులు నిర్వహించాలి. దేశంలోనే తెలంగాణ పోలీసులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఒకరోజు గుర్తు చేసుకుంటే సరిపోదు. వాళ్ళ కుటుంబాన్ని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పై ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో చనిపోయిన కుటుంబాలకు అధిక ఎక్స్గ్రేషియా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని అన్నారు. -
సీఎం రేవంత్రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
వేములవాడ ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగ బాగోతం
సాక్షి, కరీంనగర్: వేములవాడ ఆలయంలో ఇంటి దొంగ బాగోతం బయటపడింది. సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి నిర్వాకం వైరల్గా మారింది. సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఓ అధికారి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంటికి తరలిస్తుండగా కొందర భక్తులు మొబైల్లో చిత్రీకరించారు. సదరు ఉద్యోగి నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్టతో పాటు, వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.గతంలో యాదాద్రిలో పని చేస్తున్నప్పుడు కూడా సదరు ఉద్యోగిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవో తన బంధువంటూ కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తాడంటూ సోషల్ మీడియాలో సూపరింటెండెంట్ వ్యవహారం వైరల్గా మారింది ఇవాళ (అక్టోబర్, 20 సోమవారం) ఒంటిగంట సమయంలో సరకులు తన ఇంటికి తరలిస్తుండగా కొందరు మొబైల్ ఫోన్లో షూట్ చేశారు. -
హైదరాబాద్: స్వీట్స్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు స్వీట్స్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. సుమారు 45 షాపులపై దాడులు నిర్వహించారు. -
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం: డీజీపీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్ధతో ఉందని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ను డీజీపీ శివధర్రెడ్డి దృవీకరించారు.ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధిక సాయం, ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 300గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం. ప్రమోద్ ఉద్యోగ విమరణ పొందే వరకు వచ్చే శాలరీని వారి కుటుంబానికి అందిస్తాం.దీంతో పాటు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16లక్షలు,పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8లక్షల పరిహారం ఇస్తాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి. కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీస్ శాఖ తరుఫున నివాళులు’ అని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. -
రేపే దీపక్ రెడ్డి నామినేషన్.. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రుల రాక!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో యూసఫ్గూడ హైలం కాలనీ నుంచి షేక్పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నట్టు సమాచారం. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముగ్గులు సీఎంలు ముఖ్యఅతిథిలుగా రానున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారికంగా కన్ఫరేషన్ ఇచ్చారు. అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కన్ఫరేషన్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. కాగా, నామినేషన్ ర్యాలీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. -
రోజుకు రూ.1.62 కోట్లు జరిమానా.. తగ్గని ట్రాఫిక్ ఉల్లంఘనలు!
రోడ్డు మీద కాస్త ముందుకు వెళ్లి వాహనాన్ని ‘యూ టర్న్’తీసుకోవాలంటే నిర్లక్ష్యం.. రెడ్సిగ్నల్ పడినప్పుడు ఆగాలన్న విషయం పట్టదు.. సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదన్నా వినరు..రాంగ్సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, వితౌట్ హెల్మెట్.. ఇవన్నీ ట్రాఫిక్ ఉల్లంఘనలు. రాజధానిలో మూడు కమిషనరేట్లలో ఈ ఉల్లంఘనులకు ట్రాఫిక్ విభాగం సరాసరిన రోజుకు విధిస్తున్న జరిమానా ఏకంగా రూ.1.62 కోట్లు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబంధించి ఈ ఏడాది జనవరి–అక్టోబర్ 6 మధ్య గణాంకాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ–చలాన్లలో 70 శాతం పెండింగ్లోనే ఉండటం గమనార్హం. ఇప్పుడంతా నాన్ కాంటాక్ట్ విధానంలో... ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తుంటారు. దీన్నే సాంకేతిక పరిభాషలో ఎన్ఫోర్స్మెంట్గా పిలుస్తారు. ఇదివరకు కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలులో ఉండేది. అంటే... క్షేత్రస్థాయి విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉండే చలానా పుస్తకాలను వినియోగించి ఉల్లంఘనులకు జరిమానాలు విధించేవారు. ఆ మొత్తాలను అక్కడికక్కడే వసూలు చేసేవారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో అపశ్రుతులు, ఘర్షణలు చోటుచేసుకునేవి. గోల్మాల్ జరిగిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. దీంతో కొన్నేళ్లుగా పూర్తిస్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ట్రాఫిక్ ఉల్లంఘనులకు జరిమానా విధింపు పరోక్షంగా జరిగిపోతుంది. క్షేత్రస్థాయిలో పోలీసులు, సీసీ కెమెరాల ద్వారా తీసిన ఫొటోల ఆధారంగా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లోని సర్వర్ వీటిని జారీ చేస్తుంటుంది. ఆ డేటానే వీరికి ఆధారం... ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ–చలాన్లు జారీ చేయడానికి వాహనచోదకుల అడ్రస్ అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం ఆర్టీఏ అధికారులపై ఆధారపడుతోంది. వాహనం రిజి్రస్టేషన్ సమయంలో ఇచ్చిన చిరునామా, యజమాని సెల్ఫోన్ నెంబర్ల డేటా ఆధారంగా ఈ–చలాన్ల జారీ అవుతోంది. ముద్రించిన కాపీ పోస్టులో, లింకును ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తున్నారు. అయితే అనేక వాహనాల యజమానులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారే. దీంతో వారి చిరునామా వాహనం ఖరీదు చేసిన తర్వాత మారిపోతుంటుంది. ఇదే రకంగా వారి సెల్ఫోన్ నెంబర్లు కూడా మారిపోతున్నాయి. కొత్తవి ఆర్టీఏ డేటాబేస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ కావట్లేదు. ఈ కారణంగా ఈ–చలాన్లు ఆయా వాహనచోదకులకు చేరట్లేదు. కొందరికి ఇవి అందినా... చెల్లించాలన్న విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు. ఈ–లోక్ అదాలత్ కోసం వెయిటింగ్.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్ జరిమానా బకాయిలు భారం తగ్గించుకోవడానికి అధికారులు 2016 అక్టోబర్ వరకు పలుమార్లు లోక్ అదాలత్ల ద్వారా అవకాశం ఇచ్చారు. ఆఖరిసారిగా 2023 డిసెంబర్లో ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్ జరిగింది. సాధారణంగా మెగా లోక్ అదాలత్ ఒకేరోజు నిర్దేశించిన ప్రాంతంలో జరుగుతుంది. అయితే ట్రాఫిక్ లోక్ అదాలత్ మాత్రం ఆన్లైన్లో జరిగింది. వాహన రకాన్ని బట్టి 60 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి మిగిలిన మొత్తం చెల్లించే వెసులుబాటు కలి్పంచారు. ఆ తర్వాత మళ్లీ ట్రాఫిక్ లోక్ అదాలత్ జరగలేదు. అనేకమంది వాహనచోదకులకు తమ వాహనంపై ఈ–చలాన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిసినా, ఉద్దేశపూర్వకంగా చెల్లించట్లేదు. ఈసారి లోక్ అదాలత్ జరిగినప్పుడు డిస్కౌంట్తో చెల్లించాలనే ఉద్దేశంతో ఉండిపోతున్నారు. అయితే ఉల్లంఘనులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ట్రాఫిక్ లోక్ అదాలత్లు నిర్వహించకూడదని అధికారులు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం.. నగరంలో ఉల్లంఘనల తీరుతెన్నులు గుర్తించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఈ పరిజ్ఞానంతో కూడిన ఓ కెమెరాను ఎంజే మార్కెట్ ప్రాంతంలోని సిద్ధి అంబర్బజార్ మార్గంలో ఏర్పాటు చేశాం. ఆ జంక్షన్లో అటు–ఇటు కలిపి ఎనిమిది రోడ్లు ఉండగా... ఈ ఒక్క రూటులోనే నెలరోజుల్లో 5 లక్షలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాహనచోదకుల్లో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. పెండింగ్ చలాన్ల విషయం కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు వాహనచోదకుడిని తెలుపుతున్నాం. అధిక చలాన్లు పెండింగ్లో ఉన్నవారిని గుర్తించడానికి క్షేత్రస్థాయిలో టాప్ వైలేషన్ టీమ్స్ పని చేస్తున్నాయి. – డి.జోయల్ డేవిస్,ట్రాఫిక్ చీఫ్, హైదరాబాద్ -
సీఎం వద్దే హోంశాఖ.. పోలీసులకే రక్షణ లేదు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు మస్తు డిమాండ్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదీలు విదేశీ రహదారులపై రయ్మంటూ దూసుకెళ్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లేవారు పాస్పోర్టులు, వీసాలతో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను కూడా ఒక తప్పనిసరి అవసరంగా భావించడం విశేషం. రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)కి ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ ఐడీపిపైన అక్కడ వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. సాధారణంగా యూఎస్కు వెళ్లేవారి నుంచి ఐడీపీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత డాలర్ కలలు కరిగిపోవడంతో విద్యార్థులు ఎక్కువగా యూరోప్ బాట పడుతున్నారు. దీంతో ఇప్పుడు యూఎస్కు వెళ్లే వాళ్లు మాత్రమే కాకుండా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇంటర్నేషనల్ పరి్మట్ల కోసం బారులు తీరుతున్నారు. ఏటా సగటున 10 వేల నుంచి 12 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను అందజేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13,151 పరి్మట్లను అందజేశారు. ఈజీగా డ్రైవింగ్.. లక్షలకొద్దీ వాహనాలు, కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్ రద్దీ నడుమ హైదరాబాద్లో బండి నడిపిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా దూసుకుపోగలుగుతాడనేది జగమెరిగిన సత్యం. అందుకే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లు అక్కడి రోడ్లపైన తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు సొంత డ్రైవింగ్ తప్పదు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ పరి్మట్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్ధులు, ఉద్యోగులతో పాటు మహిళలు సైతం ఐడీపీల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరిగా మారడంతో డ్రైవింగ్ కూడా అనివార్యమైంది. మరోవైపు మన ఐడీపీలు ఉన్న వాళ్లకు ఆయా దేశాల్లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం కూడా తేలిక. పెద్దగా కఠినమైన డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే లైసెన్సులు అందజేస్తారు. ఐడీపీలు పొందడం ఇలా.... పాస్పోర్టు కలిగిన వారు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లను తీసుకోవచ్చు.ఇందుకోసం రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘సారథి’ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. అలాగే రూ.1500 ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. అనంతరం పాస్పోర్టు,ఆధార్. డ్రైవింగ్ లైసెన్సు, తదితర డాక్యుమెంట్లతో సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలోని అధికారులను సంప్రదిస్తే అప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్పరి్మట్లను అందజేస్తారు. ఇది తీసుకున్న రోజు నుంచి ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది.ఆ తరువాత దీన్ని పొడిగించుకొనేందుకు అవకాశం లేదు. మరోసారి స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ దేశాల్లోనే స్థిరపడేవారైతే ఏడాదిలోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది.నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్, బండ్లగూడ, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మెహదీపట్నం, తదితర ప్రాంతీయ రవాణాకార్యాలయాల నుంచి సగటున 120 నుంచి 150 పర్మిట్ ను అందజేస్తున్నట్లు అంచనా.కొన్ని దేశాల్లో మన ఐడీపీ చెల్లుబాటు కాదుమన అంతర్జాతీయ డ్రైవింగ్ పరి్మట్లకు సుమారు 150 దేశాల్లో ఆమోదం ఉంది.కానీ కొన్ని దేశాల్లో మాత్రం చెల్లుబాటు కాదు.జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో భారతీయ ఐడీపీలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అక్కడ రవాణాశాఖ నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. యూఎస్,బ్రిటన్,న్యూజిలాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, తదితర దేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం 6 నుంచి 9 నెలల వరకు అనుమతినిస్తారు.డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు దృష్ట్యానే ఈ అనుమతుల్లో తేడాలు ఉన్నట్లు రహదారిభద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. -
మూసాపేట్లో బుల్లెట్ కలకలం
హైదరాబాద్: మూసాపేట మెట్రో స్టేషన్లో ఓ బాలుడి వద్ద బుల్లెట్ దొరకడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ బాలుడు (12) మూసాపేట పరిధి ప్రగతినగర్లో తల్లితో పాటు ఉంటూ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి.. తండ్రితో విడిపోయి గత ఆరేళ్లుగా బిహార్కు చెందిన మహమ్మద్ ఆలంతో కలిసి ఉంటోంది. అతను మూసాపేటలోని ప్రగతినగర్లో నివాసముంటూ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో బాలుడిని బాగా చదువుకోవాలని, ఆటలాడవద్దని తండ్రి మందలించటంతో ఇంటి నుంచి పారిపోవాలని, ఇంట్లో ఉన్న బ్యాగులో బట్టలు, డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద ఉండగా బాలుడి బ్యాగ్ను తనిఖీ చేయగా బుల్లెట్ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు బాబును స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ సమాచారం రాబట్టగా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వెళ్లిపోతున్నానని, బ్యాగులో బట్టలు, డబ్బులు తీసుకుని వెళుతున్నానని, తనకేమీ తెలియదన్నాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పటంతో ప్రగతినగర్కు వెళ్లి విచారించగా... మహమ్మద్ ఆలం తాత అన్సారీ ఆర్మీలో పనిచేసే వారని, తను చనిపోయినప్పటికి ఆయన బుల్లెట్ అలాగే ఉందని, ఇటీవల బిహార్కు వెళ్లినప్పుడు బుల్లెట్ను శుభ్రం చేసి జ్ఞాపకంగా పర్సులో దాచుకున్నానని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 ఎంఎం కేట్రిడ్జ్ బుల్లెట్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
సర్కారీ స్కూల్లో ఎందుకు చేర్చాలి?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లల్ని ఎందుకు చేర్చాలి?’ ఇదీ బడిబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇదే విషయాన్ని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. విద్యార్థుల చేరికలు, అందులో ఎదురవుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో జరగాల్సిన కృషిని తెలియజేస్తూ సవివర నివేదిక సమర్పించింది. స్పందన ఏదీ? బడిబాటను ఈసారి పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం భావించినా క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రయోజనాలు కనిపించలేదని విద్యాశాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు టీచర్లు వెళ్లినప్పుడు పెద్దగా స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకతలు ఏమిటనేవి ప్రజలకు చెప్పలేకపోతున్నామని టీచర్లు అంటున్నారు. అలాంటప్పుడు వారిని ఆకర్షించడం సాధ్యం కావడం లేదని పేర్కొంటున్నారు. ఏఐ జోరు పెంచితేనే.. ప్రైవేటు విద్యాసంస్థల్లో డిజిటల్ విద్యా బోధన చేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ తరహా ప్రాధాన్యత పెంచాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) బోధన అందించేందుకు అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వాటిని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. అయితే ఏఐ యాప్లను వాడుకోవడానికి స్కూళ్లలో అనేక మార్పులు తేవాలని అధికారులు అంటున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం, కంప్యూటర్లను అప్గ్రేడ్ చేయడం, డిజిటల్ లేబొరేటరీల ఏర్పాటు, అవసరమైన యాప్లను డౌన్లోడ్ చేసే, సాంకేతిక సహకారం అందించే నిపుణుల నియామకం బడుల్లో అవసరమని పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. తగ్గుతున్న ప్రవేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం మేర తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరగా 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. మరోవైపు ఇదే కాలానికి ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయి. 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 2024–25లో ఆ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. విద్యార్హతలున్న టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోనే ఉన్నా, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ప్రైవేటు వైపు ఆకర్షణకు కారణమవుతున్నాయి. విశ్వాసం పెంచితే తప్ప విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టరని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. తూమంత్రంగానే పాల్గొంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో కమిటీ ఏర్పాటు ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొన్ని కొత్త ప్రతిపాదనలను విద్యాశాఖ ముందుకు తెచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా స్కూళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించింది. ఆట స్థలాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. అయితే నిధుల కొరత నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద వాటిని సమకూర్చుకోవాలని సూచించింది. అయితే దీనికి క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దాతలు, పారిశ్రామికవేత్తల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఏ తరహా అడుగులు వేయాలనే విషయమై విద్యాశాఖ అధికారులతో త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేసే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2026)ను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ప్రవేశపరీక్ష తొలిదశకు ఈ నెలలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు రెండో దశను నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్టీఏ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. -
వారు కోవర్టులు.. విప్లవ ద్రోహులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి... సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి 2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. నిజాలు దాచి .. నిందలు మోపుతూ.. ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెపె్టంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు. బహిష్కరిస్తున్నాం సోను, అతని అనుచరులు ఆయుధాలు పారీ్టకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్లో ఉన్నారు.. గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ భారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
ఈడీ అటాచ్ చేసినా.. ఆస్తులను అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వివిధ స్కీమ్ల ముసుగులో రూ.6,000 కోట్ల స్కామ్కు పాల్పడిన నౌహీరా షేక్ మరో కుంభకోణానికి తెరలేపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్ని వివిధ మార్గాల్లో నకిలీ పత్రాల సాయంతో విక్రయించారు. హైదరాబాద్లోని కొన్ని ఆస్తుల్ని అమ్మేయగా... ముంబైలో విక్రయానికి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన ఈడీ అధికారులు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడంతోపాటు ఈ దందాలో నౌహీరాషేక్కు సహకరించిన సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.స్కీముల పేరుతో రూ.వేల కోట్ల మోసాలు హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ సహా వివిధ రకాలైన స్కీమ్ల పేరు చెప్పిన నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా అనేకమంది నుంచి డిపాజిట్లు సేకరించింది. గరిష్టంగా 36 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి దాదాపు రూ.5 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు భారీగా ఆస్తులు సీజ్ చేశారు.అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం అటాచ్ చేసిన ఆస్తులను కోర్టు అనుమతితో వేలం వేయడం ద్వారా ఈడీ నగదుగా మారుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని విక్రయించడం ద్వారా ఈడీ అధికారులు రూ.93 కోట్లు సమీకరించారు. అయితే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఫ్లాట్లను విక్రయించడానికి నౌహీరా షేక్ పథకం వేసింది. హైదరాబాద్లో ఉన్న కొన్నింటిని అమ్మేసి సొమ్ము చేసుకుంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ముంబైలో ఉన్న రూ.12 కోట్ల విలువ చేసే మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వీటిపై కొందరితో సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న నౌహీరా షేక్ రూ.3 కోట్లు అడ్వాన్స్గా తీసుకుంది. ఓ ఫ్లాట్ ఖరీదు చేసిన యజమానిని విచారించిన ఈడీ వాంగ్మూలం సైతం నమోదు చేసింది.సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం నౌహీరా షేక్ వేసిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నెల 10 తేదీన వీటి విచారణ జరిగింది. ఈ సందర్భంలో ఈడీ అధికారులు అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసు కువెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యా యస్థానం ఆయా ఆస్తుల్ని ఈడీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా నౌహీరా షేక్ను ఆదేశించింది. అలా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోపక్క ఈడీ అధికారులు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆస్తులనూ నౌహీరా షేక్ విక్రయించినట్టు గుర్తించారు. వీటి రిజిస్ట్రేషన్కు సహకరించిన సబ్రిజిస్ట్రార్ల వ్యవహారం ఆరా తీస్తోంది. -
శుభాకాంక్షల మాటున సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షల సందేశాలు పంపుకోవడం అత్యంత సాధారణం. ఇటీవల వాట్సాప్లో ఇలాంటి సందేశాలు ట్రెండీగా మారాయి. తమ బంధువులు, స్నేహితులకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలన్న తొందరలో కొందరు సైబర్ భద్రతా మరుస్తున్నారు. పండుగ శుభాకాంక్షల పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపుతున్నట్టు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరి స్తున్నారు. దీపావళి ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లతోపాటు ఇప్పుడు శుభాకాంక్షలకు సంబంధించిన మోసపూ రిత లింక్లు పంపుతున్నట్టుగా వారు చెపుతున్నారు.ఏదైనా కంపెనీ తరఫున మీకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా పంపే ఈ లింక్లలో ‘మీ పేరు, ఫొటోతో మీకు తెలిసిన వారికి శుభాకాంక్షలు వినూత్నంగా చెప్పండి’అనే సందేశాన్ని జోడిస్తున్న ట్టు తెలిపారు. ఇలాంటి లింక్లపై క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లడంతోపాటు వారు మన ఫోన్లో మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) సమాచా రం ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 390 మంది బాధితులు ఈ తరహా నకిలీ లింక్లపై క్లిక్ చేయడం ద్వారా రూ.8.5 లక్షలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలియనివారి వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే సందేశాల్లోని లింకులపై క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఒక్క మద్యం షాపు.. 34 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఒక్కో వైన్షాపు కోసం సగటున 34 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2025–27 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని 2,620 వైన్ (ఏ4) షాపుల నిర్వహణ కోసం లైసెన్సులు మంజూరు చేసేందుకు తొలి విడత గడువు ముగిసే సమయానికి మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారికంగా వెల్లడించింది. తద్వారా దరఖాస్తు ఫీజు రూపంలో మొత్తం రూ.2,680 కోట్లు సమకూరింది. ఇది గత రెండేళ్ల కాలానికి దరఖాస్తు ఫీజు రూపంలో వచ్చిన దాని కంటే కొంచెం ఎక్కువ కావడం గమనార్హం.కాగా, ఈ దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ మరో మూడు రోజులు పెంచింది. ఈనెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 23న జరగాల్సిన డ్రాలు ఈనెల 27న తీస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అత్యధికంగా శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 8 వేలకు పైగా వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్లో కేవలం 622 దరఖాస్తులు మాత్రమే రాగా, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,620 దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలివి..ఆదిలాబాద్ (711), ఆసిఫాబాద్ (622), మంచిర్యాల (1,617), నిర్మల్ (942), హైదరాబాద్ (2,960), సికింద్రాబాద్ (2,787), జగిత్యాల (1,834), కరీంనగర్ (2,635), పెద్దపల్లి (1,378), సిరిసిల్ల (1,324), ఖమ్మం (4,094), కొత్తగూడెం (3,799), గద్వాల (723), మహబూబ్నగర్ (2,360), నాగర్కర్నూల్ (1,424), వనపర్తి (676), మెదక్ (1,369), సంగారెడ్డి (4,190), సిద్దిపేట (2,642), నల్లగొండ (4,620), సూర్యాపేట (2,617), భువనగిరి (2,649), కామారెడ్డి (1,444), నిజామాబాద్ (2,633), మల్కాజ్గిరి (4,879), మేడ్చల్ (5,203), సరూర్నగర్ (7,595), శంషాబాద్ (8,110), వికారాబాద్ (1,750), జనగామ (1,588), భూపాలపల్లి (1,658), మహబూబాబాద్ (1,674), వరంగల్ రూరల్ (1,825), వరంగల్ అర్బన్ (3,012). -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి
చార్మినార్: రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయేరోజుల్లో తాము శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఆది వారం చార్మినార్ వద్ద రాజీవ్గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి..కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్కు రాజీవ్గాంధీ సద్భావన అవార్డును టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాజీవ్గాంధీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఓటుహక్కు వయసు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో ప్రజాసేవ చేస్తుండగా, రాజకీయాల్లో మాత్రం ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాహుల్గాంధీ భారత్ జూడోయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ప్రస్తుతం కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ కేవలం మన రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, మదన్మోహన్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం
కవాడిగూడ: యాదవులకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పిస్తామని...హైదరాబాద్ కా సదర్ ..యాదవుల ఖదర్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కులీకుతుబ్షాల కాలం నుంచి యాదవులపై నమ్మకం, విశ్వాసం ఉందని, యాదవులకు నమ్మిన వారికోసం ఏదైనా చేసే తెగువ ఉందని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఎంపీ అనిల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ముందుగా, శ్రీకృష్ణ భగవానుడికి, దున్నపో తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లా డుతూ యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను యాదవ ప్రతినిధులు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యాదవుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాదవులకు సముచిత స్థా నం లభించిందన్నారు.సదర్ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుడోలు.. కోలాటం.. బోనాలు, కళారూపాలు ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా జంటనగరాల నుంచి యాదవులు వారి దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో చేయి ంచిన విన్యాసాలు అలరించాయి. సీఎం రేవంత్రెడ్డి మాట్లా డుతుండగా పాత పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీ రుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్లోని పోలీస్ స్టేడి యంలో అమరవీరుల స్తూపానికి మంగళవారం నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు డీజీ పీ శివధర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించా రు. ఈనెల 21నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపను న్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పో లీస్ కార్యాలయాలలో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పోలీస్ స్టేషన్ పరి«ధులలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31వ తేదీన జరగనున్న జాతీయ సమైక్యతా దినం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ కు చెందిన పోలీస్ సిబ్బంది ఐదుగురు సహా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణా లను అర్పించారని తెలిపారు. ‘అక్టోబర్ 22 –24 మధ్య మర ణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను సందర్శించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. అమరవీరుల విగ్రహాలకు, ఫొటోలకు వారి స్వగ్రామాలలో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు. -
అద్భుతం ..వీరి సాహసం..
కాచిగూడ: హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలిచే విధంగా నగరానికి చెందిన తల్లీ కొడుకులు హిమలయ పర్వతాల మధ్యలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. ఈ యాత్రలో తల్లీ కొడుకులిద్దరూ చూపిన పట్టుదల, దైర్య, సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. జేపీ మెర్గాన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రవ్వ శరణ్య (39), బాచుపల్లిలోని కెన్నెడీ గ్లోబల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఆమె కుమారుడు మకం శ్రేయాన్షు (12) అక్టోబర్ 5, 2025న ఈ సహస యాత్రను ప్రారంభించారు.దాదాపు రెండు వారాల పాటు మంచు పర్వతాలపై కఠిన వాతావరణ పరిస్థితులు, తక్కువ ఆక్సిజన్తో కూడిన మార్గాలను అధిగమించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. శనివారం వారు సురక్షితంగా హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా శరణ్య తన అనుభవాన్ని పంచుకుంటూ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రత్యేక శిక్షణ.. శేయాన్షు తల్లిదండ్రులు గోవర్థన్–శరణ్య. యాత్రకు ముందు శ్రేయాన్షు ప్రత్యేక శారీరక దారుఢ్యంలోనూ, ట్రెక్కింగ్లోనూ శిక్షణ పొందాడు. పాఠశాల అధ్యాపకులతో పాటు పలువురు ప్రముఖులు, సహ విద్యార్థులు, తోటి సహచరులు తల్లీ కొడుకులిద్దరినీ అభినందించారు. ఇది కేవలం సాహసయాత్ర మాత్రమే కాదు, ‘ధైర్యం, పట్టుదల, కుటుంబ బంధం’ అనే విలువలకు ప్రతీకంగా నిలుస్తుంది. తల్లి, బిడ్డ కలిసి సాధించిన ఈ విజయం తెలంగాణకు గర్వకారణమని పలువురు కొనియాడారు. వయస్సు, వృత్తి, పరిస్థితులు కాదు.. మన సంకల్పమే పర్వతాలను అధిరోహించే శక్తినిస్తుందని చెబుతున్నారు యాత్రికులు.అంతసులభం కాదు.. చలిని తట్టుకోవడం అంత సులభం కాదు.. అదే విధంగా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకునే సమయంలో శ్వాస ఆడకపోవడం లాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో దృఢ సంకల్పంతో, పట్టు వీడకుండా తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ఎక్కాలన్న లక్ష్యాన్ని చేరుకున్నాం.. ‘ఇది కేవలం శారీరక పరీక్ష మాత్రమే కాదు, మానసిక స్థైర్యం, పట్టుదల, ఈ యాత్రతో నా కుమారుడితో అద్భుతమైన బంధం ఏర్పడింది.’ ప్రతి అడుగు మా సంకల్పాన్ని మరింత దృఢం చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను నా కుమారుడితో కలిసి అధిరోహించడం మాకు జీవితాతంతం గుర్తుండిపోయే గొప్ప యాత్ర. –రవ్వ శరణ్య క్లిష్టమైన ప్రయాణం.. ఇది చాలా క్లిష్టమైన ప్రయాణం. అయినప్పటికీ ప్రతి రోజూ కొత్త పాఠాలు నేర్పింది. ధైర్యం, క్రమశిక్షణ, కష్టాన్ని తట్టుకునే శక్తి అవసరాన్ని ఈ యాత్రలో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నా కల. హైదరాబాద్లోనే అని చిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ పూర్తి చేసిన పిల్లల్లో నేను ఒకడిని. – శ్రేయాన్షు -
'వెలుగులు' పంచుదాం..
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి. భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి. ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత.. భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాలి్చన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి. మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి. ప్రజల్లో కొత్త చైతన్యం.. నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనలు ఇవే.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అగ్నిమాపక సూచనలు..నగరంలోని అగ్నిమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగతో కళ్లకు ప్రమాదం.. క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది.ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాల్పిస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది. – పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం -
ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్టౌన్/తానూరు /వాంకిడి/భిక్కనూరు/మద్నూర్/పాల్వం చరూరల్/ అశ్వారావుపేట/పెనుబల్లి: రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు ల్లో మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ సమీకృత చెక్పోస్టు, నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడా చెక్పోస్టు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చెక్పోస్టుల్లో ఏసీబీ బృందాలు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తనిఖీలు చేపట్టాయి. భరోజ్ చెక్పోస్టులో లెక్కకు మించి ఉన్న రూ.1.26 లక్షలు, బెల్తరోడాలో రూ.3 వేలు, వాంకిడి చెక్పోస్టులో రూ.5,100 నగదు సీజ్ చేశారు. డబ్బాల్లో లంచాలుఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన డబ్బాల్లో డబ్బు వేసి వెళ్తున్నట్లు గుర్తించారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులో సోదాలు నిర్వహించి రికార్డుల్లో చూపని రూ.5 వేల నగదు, అక్కడే ఉన్న ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.46,300 నగదును గుర్తించారు. మొత్తం రూ.51,300ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడుల సమయంలో చెక్పోస్టులో ఏంవీఐ మహ్మద్ అప్రోజొద్దీన్ విధుల్లో ఉన్నారు. మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద జరిపిన దాడుల్లో రూ.36 వేల అక్రమ నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం చెక్పోస్టుతో పాటు అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. పాల్వంచ చెక్ పోస్టులో రూ.26 వేలు, ముత్తగూడెం చెక్పోస్టులో రూ.6,660 అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు భారీగా ఫిర్యాదులు రావటంతో ఏసీబీ చీఫ్ చారుసిన్హా ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో ఆకస్మిక సోదాలు చేశారు. నల్లగొండ జిల్లా విష్ణుపురం చెక్పోస్ట్, కోదాడ, సలాబత్పూర్, పెందుర్తి, జహీరాబాద్ చెక్పోస్టుల్లో కూడా సోదాలు నిర్వహించారు. చెక్ పోస్టుల వద్ద వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా లెక్కల్లో లేని రూ.4.18 లక్షల నగదు సీజ్ చేశారు. దీనిపై సంబంధిత ఆర్టీఏ అధికారులకు నోటీసులు ఇచ్చారు. -
రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతుకు అన్యాయం చేస్తే సొంత కుటుంబానికి అన్యాయం చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి భూమి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగానికి అండగా నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమురం భీమ్ పోరాడినా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరినా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగాయి. కన్నతల్లిపై ఎంత మమకారం ఉంటుందో, తెలంగాణలో భూమిపై కూడా అదే అనుబంధాన్ని చూపిస్తారు. భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలైనా, నిరుపేద నిరక్షరాస్యులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. విసునూరు దొరలు చెరబట్టాలనుకున్న ఎకరం భూమి కోసం వీరనారిగా మారిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. భూ యజమానుల హక్కులు, ఆ భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేయర్ల చేతుల్లో ప్రభుత్వం పెట్టబోతోంది. ఈ క్రమంలో తప్పులకు తావిస్తే ప్రజలు సర్వేయర్లతోపాటు ప్రభుత్వంపై కూడా తిరగబడే అవకాశం ఉంది’అని తెలిపారు. బంగాళాఖాతంలో విసిరేశారు గత ప్రభుత్వ హయాంలో ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఈ ధరణి దరిద్రంతోనే ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది కూడా ఈ చట్టమే. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. ఆ భూ దోపిడీ నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి తెలంగాణ రైతాంగం దగ్గర ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు, రైతుకు అండగా ఉండేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చాం’అని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్–3, 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. మా సైన్యం మీరే.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, ఆదర్శ రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలబట్టేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ను తీసుకొస్తోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేస్తుందని, సమస్యలను తెలిసిన వారిని పరిష్కారం అడగడం ద్వారా నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ లక్ష్యం నెరవేరడంలో మీ సహకారం కావాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలి. రైతు రాజు కావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మీ శ్రమకు ఫీజు తీసుకోండి. కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. క్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకుని మీరు వెళుతున్నారు. మాకెవరూ ప్రతినిధులు లేరు. మాకు సైన్యం లేదు. మీరే మా ప్రతినిధులు, మా సైనికులు మీరే. ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యతలను మీ భుజస్కందాలపై పెట్టి పంపుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే’అని సర్వేయర్లకు సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలు మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లైసెన్స్డ్ సర్వేయర్ల రూపంలో ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని చెప్పారు. 3,456 మందికి సర్వే లైసెన్స్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్, టి. రామ్మోహన్రెడ్డి, కె.ఆర్. నాగరాజు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, టీజీఐఐసీ చైర్మన్ టి.నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ శతక్కొట్టిన సీవీ ఆనంద్
తెలంగాణ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి, హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషర్ సీవీ ఆనంద్ మంచి క్రికెటర్ అన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు.సీవీ ఆనంద్ అండర్-19 క్రికెట్లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే అండర్-19, 22 విభాగాల్లో హైదరాబాద్ జట్టుకు కూడా ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చాలా టోర్నీల్లో పాల్గొన్నారు.ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపిక కావడంతో సీవీ ఆనంద్ క్రికెటింగ్ కెరీర్కు బ్రేక్ పడింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ ఆడుతుంటారు.తాజాగా సీవీ ఆనంద్ హెచ్సీఏ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్లో సికింద్రబాద్ క్లబ్కు ఆడుతూ మెరుపు సెంచరీ చేశారు. వారం రోజుల వ్యవధిలో అతనికి ఇది రెండో సెంచరీ.గత ఆదివారం బేగంపేటలో హెచ్పీఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 89 బంతుల్లో 111 పరుగులు చేసిన ఆనంద్.. తాజాగా సికింద్రబాద్ క్లబ్లో తారకరామ జట్టుతో జరిగిన మ్యాచ్లో 94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో సికింద్రబాద్ క్లబ్ జట్టు 36 పరుగుల తేడాతో తారకరామ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రబాద్.. సీవీ ఆనంద్ శతక్కొట్టడంతో 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరగులు చేసింది. ఛేదనకు దిగిన తారకరామ జట్టు 34.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. -
పారా త్రోబాల్ ప్లేయర్కు రామన్న భరోసా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడడానికి అర్హత సాధించారు.పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తి. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం సోషల్ మీడియా ద్వారా తెల్సుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తనకు భరోసా ఇచ్చి క్రీడా పరికరాలు, ఆర్ధిక సహాయం చేసి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని అంటున్నారు పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ‘రామన్న అంటేనే ఒక భరోసా.. సామాన్యులకు కొండంత అండ’ అని బీఆర్ఎస్ పేర్కొంది. రామన్న భరోసా ❤️అన్నా అంటే చాలు.. నేనున్నానంటూ భుజం తట్టి ప్రోత్సాహిస్తాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ… https://t.co/Vjzaimft7r pic.twitter.com/mrI21wBFNe— BRS Party (@BRSparty) October 19, 2025 -
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ దొరికాడు
సాక్షి.హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య కేసు నిందితుడు దొరికినట్లు నిజామాబాద్ సీపీ చైతన్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అందులో..‘నిజామాబాద్ టౌన్ 6 పోలిస్స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్,రియాజ్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు. -
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా’
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
ఆ కుట్రలను తిప్పి కొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్కు అందించిన నిర్వాహకులను అభినందిస్తున్నా. దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు. మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది. సల్మాన్ ఖుర్షీద్కు రాజీవ్ సద్భావన అవార్డ్ అందించడం మనందరికీ గర్వకారణం. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారు...రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 21 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి?. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలి’’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఇద్దరూ విప్లవ ద్రోహులే.. శిక్ష తప్పదు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoists Central Committee) తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలకే బుద్ధి చెబుతున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది.ఇటీవల మావోయిస్టుల(Maoists) కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venu gopal), ఆశన్నలు(Ashanna) పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. తాజాగా అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రవులు ఎదుట లొంగిపోయిన ఇద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడు అని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. -
మావోయిస్టులకు మద్దతిస్తారా?.. బండి సంజయ్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు.. అంతర్గత భద్రత విషయంలో రాలే లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా.. ఇదే మా హెచ్చరిక. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు. అవినీతి, మాఫియా, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్ను సైతం వెలికి తీస్తున్నాయి.దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయి. ఎంత పెద్ద వారైనా సరే అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదు. మావోయిస్టుల వైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు తెలిపినట్లు వచ్చిన వార్త కథనాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ పోస్టు చేయడం సంచలనంగా మారింది.Telangana politicians - consider this a warning.Those allegedly supporting armed networks while preaching democracy on stage, cut your links or get exposed.Central agencies won’t stop at Maoist cadres. Under the guidance of Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble HM Shri… pic.twitter.com/ucicID1msj— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 19, 2025ఇదిలా ఉండగా.. మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అసలు మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా? అని చర్చ మొదలైంది. ఒకవేళ ఈ పేర్లు బహిర్గతమైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు గెరిల్లాలు ,కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య రహస్య కుమ్మక్కు జరిగిందని ఆయన వివరించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అలాగే హిడ్మా తెలంగాణ వైపు వచ్చారని ఆయన సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. -
Hyderabad: బాలుడి దగ్గర బుల్లెట్.. మెట్రో స్టేషన్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట్ మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ లభించింది. దీంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ను స్వాధీనం చేసున్న కూకట్పల్లి పోలీసులు.. బాలుడిని విచారిస్తున్నారు.నిన్న రాత్రి(అక్టోబర్ 18, శనివారం) మెట్రోలో ప్రయాణించేందుకు బాలుడు మూసాపేటలోని స్టేషన్కు రాగా.. మెట్రో భద్రతా సిబ్బంది ఆ బాలుడిని తనిఖీ చేశారు. ఆ బాలుడి వద్ద ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ సౌండ్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాలుడి వద్ద 9 ఎంఎం బుల్లెట్ను గుర్తించారు. బుల్లెట్ ఎలా వచ్చిందంటూ ఆ బాలుడిని మెట్రో సిబ్బంది ప్రశ్నించారు.సరైన సమాధానం చెప్పకపోవడంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.. ఆ బుల్లెట్పై ఆరా తీశారు. పలు కోణాల్లో ఆ బాలుడిని విచారిస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
బీసీ బంద్లో దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బంద్ విజయవంతమైంది. బీసీ బంద్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక, బంద్ సందర్భంగా దాడులకు పాల్పడుతూ ఓవరాక్షన్ చేసిన ఎనిమిది మందిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.తెలంగాణవ్యాప్తంగా బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో షాపులపై దాడులు చేసిన వారిపై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బంద్ సందర్బంగా విద్యానగర్ నుంచి బర్కత్పురా వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా వచ్చారు. అనంతరం, పలువురు కార్యకర్తలు, నేతలు.. పలు షాపులు, షోరూమ్స్, పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. దీంతో, దాడులపై నల్లకుంట, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దాడులకు పాల్పడిన ఎనిమిది మంది బీసీ జేఏసీ ప్రతినిధులను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
Jubilee Hills by poll: 127కు చేరిన నామినేషన్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 127కు చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 94కు చేరింది. నామినేషన్లకు ఆదివారం, సోమవారం సెలవు దినాలు కాగా, మంగళ వారం ఒక్కరోజే నామినేషన్లకు తుది గడువు కాగా ఆ రోజు ఎంతమంది వేస్తారనేది చూడాల్సి ఉంది. -
ఎన్నికల వేళ ఆయుధాల డిపాజిట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి పొందిన ఆయుధాలను లైసెన్స్దారులు తమ సమీప ఠాణాల్లో అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వెపన్ లైసెన్స్ హోల్డర్లు తమ ఆయుధాలను పోలీస్స్టేషన్లో అప్పగించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వెపన్ లైసెన్స్దారులకు గత రెండు నెలల నుంచే ఆయా పోలీస్స్టేషన్ల అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిని ఠాణాల్లో గానీ, గుర్తింపు పొందిన సంబంధిత ఆయుధ విక్రయ కేంద్రాల్లో గానీ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సమయంలో తుపాకులను డిపాజిట్ చేయాలనే నిబంధనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని పరిధి కిందికి వచ్చే పోలీస్ స్టేషన్లలో లైసెన్స్దారులు గత కొద్ది రోజుల నుంచి వాటిని అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి కిందికి పంజగుట్ట, మధురానగర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, గోల్కొండ, సనత్నగర్ తదితర పోలీస్స్టేషన్లు వస్తాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ఎనిమిది ఠాణాల పరిధిలో 234 లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులు తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రియల్టర్లు ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తుపాకులు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు వాటిని డిపాజిట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతిఒక్కరికీ ఐడీ నెంబర్ కేటాయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 234 మంది లైసెన్స్దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి తుపాకులను డిపాజిట్ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేయడం జరిగింది.క్రిమినల్ కేసులు నమోదైతే లైసెన్స్ రద్దు.. ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఆయుధ లైసెన్స్ను రద్దు చేయనున్నారు. అంతేకాకుండా ఆయుధాన్ని అనవసరంగా ఉపయోగించినా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల్లో ఆయుధం సంచరించినా లైసెన్స్ను రద్దు చేస్తారు. -
నిమ్స్లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం
లక్డీకాపూల్ : ఎలక్రి్టక్ బైక్ దగ్ధమైన సంఘటన శనివారం నిమ్స్ మార్చురీ సమీపంలోని స్టాఫ్ పార్కింగ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే ఆస్పత్రిలో పని చేస్తున్న అన్స్కిల్డ్ వర్కర్ బాలచందర్ తన ఈవీ బైక్ను స్టాఫ్ పార్కింగ్లో పార్క్ చేసి విధులకు హాజరయ్యాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పార్క్ చేసిన వాహనం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన నిమ్స్ సెక్యూరిటీ అధికారి రామారావు వాహనాన్ని సిబ్బంది సహయంతో స్టాఫ్ పార్కింగ్ నుంచి బయటకి తీయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. -
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి. బంద్ సందర్భంగా సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాం«దీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పటికే బస్స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు ఏదో ఒకవిధంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో క్యాబ్లు, టాటాఏస్లు, మ్యాక్సీక్యాబ్లు, తదితర వాహనదారులు అడ్డగోలుగా దోచుకున్నాయి. గత్యంతరం లేకపోవడంతో ఎక్కువ చార్జీలను చెల్లించి వెళ్లాల్సి వచి్చంది. బీసీ బంద్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులు స్తంభించాయి. మరోవైపు నగరంలోని 25 డిపోల్లో మరో 2850 కి పైగా సిటీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ కావడంతో వివిధ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన జనాన్ని ఆటోవాలాలు దోచుకున్నారు.సెవెన్ సీటర్ ఆటోలు, శేర్ ఆటోల్లో సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు... ఓలా, ఉబెర్, ర్యాపిడీ వంటి సంస్థలతో అనుసంధానమయ్యే క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను బంద్ దృష్ట్యా జిల్లాలకు మళ్లించారు. మరోవైపు పలు ఐటీ సంస్థలకు వాహనాలను నడిపే ట్రావెల్ ఏజెంట్లు సైతం దీపావళి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రోడ్డెక్కాయి. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఆరాంఘర్, బీఎన్రెడ్డినగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ క్యాబ్లు బారులు తీరాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ రూట్లో రాకపోకలు సాగించే క్యాబ్లు సైతం ఈ చార్జీలను వసూలు చేస్తాయి. కానీ బంద్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్వాలాలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా క్యాబ్వాలాల దారిదోపిడీకి గురయ్యారు. మెట్రోలు ఫుల్... బీసీబంద్ దృష్ట్యా మెట్రో రైళ్లు కిక్కిరిశాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–ఎంజీబీఎస్ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయించారు. మరోవైపు ఆటోరిక్షాలకు సైతం డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటోల్లోనూ చార్జీలు అమాంతంగా పెరిగాయి.బంద్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారు, అత్యవసర పనులపైన బయటకు వెళ్లిన వాళ్లు పెద్ద మొత్తంలోసమరి్పంచుకోవాల్సి వచి్చంది. బంద్లో పలువురు నేతలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్కు మద్దతుగా అన్ని పారీ్టలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజారవాణా స్తంభించినప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సీపీఎం, సీపీఐ, సీసీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠీ , సుల్తాన్ బజార్, రామకోఠీ, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐఎల్ ఎల్ మాస్ లైన్ హన్మే‹Ù, గదేగోని రవి, తదితరులు పాల్గొన్నారు. -
మూలవిరాట్టును వీడియో తీయడమా?
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టు దర్శనం విషయంలో అధికారులు చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నందున పనులు పూర్తయ్యే వరకు ప్రధాన ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అప్పటి వరకు సమీపంలోని భీమేశ్వరాలయంలోని మూర్తినే సాధారణ భక్తులు దర్శించుకుని పూజాధికాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న దర్శన భాగ్యాన్ని కల్పించకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన దేవాలయ మూలవిరాట్టు దర్శనాన్ని ఎల్ఈడీ తెరల ద్వారా కల్పించాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ ఇటీవల ప్రకటించింది.ఇప్పుడు ఈ విషయంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత్లోని ప్రధాన దేవాలయాల్లో స్వామి, అమ్మవారి మూలవిరాట్టు చుట్టూ విద్యుత్తు కాంతులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం నూనె దీపం వెలుగులోనే దేవుళ్ల దర్శనాలుంటాయి. మూల విరాట్టు వీడియోలు, ఫొటోలు తీయడం కూడా నిషేధం. ఎల్ఈడీ తెరలపై స్వామి వారి దర్శనం కల్పించాలంటే కచ్చితంగా వీడియో తీయాలి. స్వామివారి మూలవిరాట్టుపై విద్యుత్తు కాంతి ప్రసరించడం, వీడియో తీయడం... ఇలా రెండు అపచారాలకు కారణమవుతుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటోలు, వీడియో తీయరాదని హెచ్చరిక బోర్డులు పెట్టే దేవాదాయశాఖనే దానిని ఎలా ఉల్లంఘిస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖ అయోమయానికి గురవుతోంది. శృంగేరీ స్వామి సూచనల మేరకు... శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ విదుశేఖర భారతి స్వామి ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఆదివారం రాత్రి వేములవాడకు చేరుకోనున్నారు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు తీసుకుని ఆ మేరకే చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించవని భావిస్తున్నారు. దేవాలయాల్లో దర్శనాలు, వైదిక కార్యక్రమాలన్నీ శాస్త్రబద్ధంగానే కొనసాగాల్సి ఉంటుందని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష కుమారశాస్త్రి పేర్కొన్నారు. -
ఆ రెండు పార్టీలు తలచుకుంటే ఆపేదెవరు?
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. -
‘సాక్షి’పై పథకం ప్రకారమే కుట్ర..
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రికపై పథకం ప్రకారమే ఏపీలోని కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇలాంటి కుట్ర లు ఈ ఒక్కసారే కాదు.. ప్రతిసారీ ఏదో విధంగా వేధిస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్నారు.అందుకు ఉదాహరణ ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడమే’ అని పేర్కొన్నారు. దీన్ని తాము సీరియస్గా పరిగణిస్తున్నామని, ఏదో సాకుతో కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇ లాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. ‘సాక్షి’కి, జర్నలిస్టులకు బాసటగా నిలబడతామని అంటూ, రాజ్యాంగంపై చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం, విశ్వాసం ఉన్నా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ఏపీ కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తోందని సాక్షి పత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో ఖండించారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా కు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం సరికాదన్నారు. వార్తలు, కథనాలు, ప్రసారాలపై అభ్యంతరాలుంటే ప్రెస్కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా ‘సాక్షి’పై పదేపదే కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. ఎడిటర్కు నోటీసులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే.. ప్రచురితం చేసిన వార్తా కథనాలకు సంబంధించి ఆధారాలు వెల్లడించాలంటూ ఎడిటర్పై పోలీసులు ఒత్తిడి చేయడం, నోటీసులు జారీచేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్ 143) ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎడిటర్ ధనంజయరెడ్డికి పలుమార్లు నోటీసులు జారీ చేయడం, ప్రచురితమైన వార్తలకు సంబంధించి సోర్స్ను బహిర్గతపరచాలని హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి చర్యల్ని జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.


