2030-35 నాటికి విస్తృతంగా పొలాల్లో రోబోలు | Robots will be widely used in fields by 2030-35 | Sakshi
Sakshi News home page

2030-35 నాటికి విస్తృతంగా పొలాల్లో రోబోలు

Dec 20 2025 5:02 AM | Updated on Dec 20 2025 5:02 AM

Robots will be widely used in fields by 2030-35

అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవంలో ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి, వీసీ జానయ్య తదితరులు

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవంలో వీసీ అల్దాస్‌ జానయ్య

అగ్రి వర్సిటీల్లో ఈ తరహా ల్యాబ్‌ ఇదే తొలిసారి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2030-35 నాటికి రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రా­క్టర్లు, సెన్సర్ల వినియోగం విస్తృతం కానుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ­విద్యాలయ ఉప­కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య అన్నారు. అందుకు అవసరమైన పరిశోధనలు వర్సిటీల్లో కొనసాగుతున్నాయని తెలి­పారు. మానవరహిత వ్యవసాయ సాధన దిశగా తమ వర్సిటీ కీలక ముందడుగు వేసిందన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆర్థిక సహకారంతో విశ్వవిద్యాల­యంలో ఏర్పాటు చేసిన తొలిదశ అగ్రి రొబోటిక్స్‌ ప్రయోగశాలను ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు­శెట్టితో కలిసి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య శుక్రవారం ప్రా­రంభించా­రు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయా­ల్లో అత్యాధు­నిక అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ఏర్పాటవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీని­వా­సులుశెట్టి మాట్లాడుతూ వర్సిటీ పూర్వ విద్యార్థిగా ఇలాంటి ఆధునిక ప్రయోగశాల ప్రారంభంలో భాగస్వామిగా ఉండ­టం సంతో­షంగా ఉందన్నారు. సుమారు ఏడాది క్రితం ప్ర­యోగశాల ప్రతిపాదనను వీసీ అల్దాస్‌ జానయ్య, నాటి డీన్‌ జెల్లా సత్య­నారాయణ తన దృష్టికి తీసుకొచ్చారని చె­ప్పా­రు. ఏడాది­లోనే ప్రయోగశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చి తొలిదశ ల్యాబ్‌ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, రోబోలు భవిష్యత్తు­లో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడంలో కీలకంగా మారతాయని శ్రీనివాసులుశెట్టి అభిప్రాయపడ్డారు. 

వికసిత్, రైజింగ్‌ లక్ష్యాల సాధనలో..
ఉపకులపతి అల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్‌ భారత్, తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాల సాధనలో వ్యవ­సాయ, గ్రామీణ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు వ్యవసాయం ఏఐ ఆధారిత పరిజ్ఞా­నం­పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా మానవ­రహి­త వ్యవసాయ సాధనలో భాగంగా అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రిహబ్‌ ఎండీ డాక్టర్‌ జి. వెంక­టేశ్వర్లు, అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ప్రాజెక్టు హెడ్‌ డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, వర్సిటీ అధికారులు, ఎస్‌బీఐ సీనియర్‌ అధికారులు, ఫౌండేషన్‌ ప్రతినిధులు, విద్యార్థులు, శాస్త్ర­వేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement