breaking news
Bigg Boss 9 Telugu
-
దండం పెడ్తా, నీ కాళ్లు మొక్కుతా.. అడుక్కున్న సోహైల్
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో చిట్టచివరి కెప్టెన్సీ టాస్క్ జరగబోతోంది. ఈ కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను వినూత్నంగా సెలక్ట్ చేస్తున్నాడు బిగ్బాస్. గత సీజన్లలోని ఫైనలిస్టులతో పోటీపడి గెలిచి కంటెండర్షిప్ సాధించమని సవాలు విసిరాడు. అలా ఇప్పటికే ప్రియాంక జైన్ను ఓడించి కల్యాణ్, మానస్ను ఓడించి పవన్ కంటెండర్స్ అయ్యాడు.సోహైల్ ఎంట్రీఈరోజు సోహైల్ (Syed Sohel Ryan) బిగ్బాస్ హౌస్లోకి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో వదిలారు. బిగ్బాస్ 4 ఫైనలిస్ట్ సోహైల్ వచ్చాడంటే ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే! అదే విషయం ప్రోమోలోనూ చూపించారు. నాన్వెజ్ అంటే చాలు పడిచచ్చే సోహైల్.. ఈ సీజన్లోని కంటెస్టెంట్స్ మొదటి ఆరువారాలు ముక్క తినలేదని తెలిసి షాకయ్యాడు. దండం పెడ్తా..నా ఇజ్జత్కే సవాల్.. నీకు దండం పెడ్తా.. వీళ్లకు రెండు పాలప్యాకెట్లు, ఒక కాఫీ పౌడర్, కిలో చికెన్ పంపించండి అని కెమెరాల ముందు అడిగాడు. అందరిముందు బిగ్బాస్కు ఆర్డరేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన సోహైల్.. నీకు దండం పెడ్త, నీ కాళ్లు మొక్కుతా... పంపించు అని అడుక్కున్నాడు. అతడు అడిగిన వెంటనే చికెన్, పాల ప్యాకెట్ల ఫోటోలు పంపించి ఆడుకున్నాడు. కాసేపటికి మాత్రం నిజంగానే చికెన్ పంపించాడు. దీంతో మటన్, చికెన్ అంటూ అందరూ కలిసి స్టెప్పులేశారు. చదవండి: బిగ్బాస్ 9: దివ్యకు దండం పెట్టేసిన భరణి -
నీకో దండం దివ్య.. చేతులెత్తి మొక్కిన భరణి
బిగ్బాస్ హౌస్లోకి యోధులు అంటూ మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో ఆడి గెలిచినవారు కెప్టెన్సీ కంటెండర్ అవుతున్నారు. ఓడినవారు చివరి కెప్టెన్సీ కోసం పోటీపడే అదృష్టాన్ని కోల్పోతున్నారు. మరి తాజాగా హౌస్లోకి ఎవరు వచ్చారు? ఎవరు కంటెండర్ అయ్యారనే విషయాలు బుధవారం (నవంబర్ 26వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఓడిన తనూజబిగ్బాస్ హౌస్లోకి గత సీజన్ టాప్ 4 కంటెస్టెంట్ ప్రేరణ (Prerana Kambam) అడుగుపెట్టింది. ఆమెను చూడగానే తనూజ.. నువ్వే స్ట్రాంగ్.. నీతో ఆడాలనుందని చెప్పింది. వీళ్లిద్దరూ గేమ్ బాగా ఆడారు. కానీ, తనూజపై సెకన్ వ్యవధిలో ప్రేరణ గెలిచేసింది. ఇక దివ్య, భరణి గొడవలు ఏరోజుకారోజు ఫ్రెష్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో కూడా ఇద్దరూ తగవు పడ్డారు. నా ఏజ్ టాపిక్ తీయకు.. పదిసార్లు ఏజ్ గురించి మాట్లాడితే చిరాకుగా ఉంటుంది. దివ్యకు క్షమాపణలుమధ్యలో దూరి మరీ అది చెప్పాల్సిన పని లేదు. దేనికైనా లిమిట్ ఉంటుంది అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి దివ్య.. నాకు నొప్పిగా ఉంటే నన్ను చూసి మీరు కుంటినప్పుడు లేదా? నాపై మీరు జోకులేయొచ్చు.. నేను జోకులేస్తే మాత్రం సీరియస్గా తీసుకుంటారని దివ్య మండిపడింది. దీంతో భరణి.. నీకో దండం దివ్య అని చెప్పి కాసేపటికి ఆమెకు చేతులు జోడించి మరీ సారీ చెప్పాడు.మానస్పై గెలిచిన పవన్తర్వాత దేత్తడి హారిక ఇంట్లోకి వచ్చింది. సుమన్తో ఆడి గెలిచింది. దీంతో అతడి కెప్టెన్సీ కంటెండర్ చేజారింది. అనంతరం మానస్ రాగా.. అతడు డిమాన్ పవన్ను ఎంచుకున్నాడు. వీరిద్దరూ ఆడిన ఆటలో పవన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఈరోజు శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ వంటివారు హౌస్లోకి రానున్నారట! ఇకపోతే సుమన్, తనూజ, భరణి తప్ప మిగతా అందరూ కంటెండర్లయినట్లు తెలుస్తోంది. -
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ యేటికాయేడు షోకి వచ్చే సెలబ్రిటీలు తగ్గిపోతున్నారు. ఈసారి కూడా అదే జరగబోతుందని ఊహించిన బిగ్బాస్ టీమ్ కామనర్స్కు వెల్కమ్ చెప్తూ అగ్నిపరీక్ష షో పెట్టింది. తద్వారా ఆణిముత్యాలను వెలికి తీసి బిగ్బాస్ 9కి పంపింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగుర్ని హౌస్లోకి పంపింది. (Bigg Boss 9 Telugu Top 5 Contestants Prediction)కామనర్స్వాళ్లే కల్యాణ్, హరిత హరీశ్, డిమాన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్. లెక్క సరిపోలేదనుకున్నాడో ఏమోకానీ బిగ్బాస్.. అగ్నిపరీక్ష నుంచి దివ్యను సైతం హౌస్లోకి వైల్డ్కార్డ్గా పంపించాడు. అయితే షో ప్రారంభంలో కామనర్లు మూటగట్టుకున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. తామేదో తోపులం, బిగ్బాస్ ఇంటికి మహారాజులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేసరికి మనీశ్, ప్రియ, హరీశ్, శ్రీజను బయటకు పంపించేశారు. హౌస్లో 9 మందిదివ్య కూడా వెళ్లిపోయేదే కానీ గొడవలకోసం తనను ఆపేశాడు బిగ్బాస్. ఫైర్స్ట్రామ్స్ అయితే ఒక్కరూ మిగల్లేదు. ఇప్పుడు బిగ్బాస్ 12వ వారం నడుస్తోంది. ప్రస్తుతం హౌస్లో తొమ్మిది మంది మిగిలారు. వారే భరణి, కల్యాణ్, పవన్, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ, దివ్య. వీరిలో తనూజ మొదటినుంచి విన్నింగ్ రేస్లో ఉంది. ఏడుపు గోల ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా అన్నింట్లోనూ ది బెస్ట్ ఇస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. నెగెటివిటీ నుంచి టాప్ 2కి..కల్యాణ్ (Pawan Kalyan Padala).. మొదటి మూడు వారాలు ఆడిందే లేదు. పైగా అమ్మాయిలను అదోలా చూస్తూ నెగెటివిటీ సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే నాగార్జున హింట్స్ ఇచ్చాడో వెంటనే తీరు మార్చుకుని గేమ్పై ఫోకస్ పెట్టాడు. అలా ఇప్పుడేకంగా కప్పు కోసం పోటీపడుతున్నాడు. ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. ఇతడు ఆల్రౌండర్. గేమ్స్ బాగా ఆడతాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కానీ సేఫ్ గేమ్ ఒక్కటే అతడికి పెద్ద మైనస్. దానివల్లే కాస్త వెనకబడ్డాడు. 11వ వారాలు నామినేషన్స్లోకి రాకపోవడం కూడా అతడికి దెబ్బేసింది.(Bigg Boss Telugu 9 Top 5 Contestants Analysis) టాప్ 5లో ఎవరు?తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్.. ఈ ముగ్గురు టాప్ 3లో ఉండటం ఖాయం. మరి తర్వాతి రెండు స్థానాల్లో ఎవరన్నది అసలైన ప్రశ్న. గుడ్డు దొంగతనంతో ఈ సీజన్పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన సంజనా తర్వాత మాత్రం దారి తప్పింది. ఇటీవల జరిగిన నామినేషన్స్లో అయితే రీతూ క్యారెక్టర్ను తప్పు పడుతూ మాట్లాడింది. అసలే పెద్దగా ఫ్యాన్ బేస్ లేని తనకు ఇది కచ్చితంగా నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆమె టాప్ 5 బెర్త్ గల్లంతయినట్లే!ఈ ముగ్గురు కష్టమే!దివ్య ఆల్రెడీ గతవారమే ఎలిమినేట్ అవాల్సిన క్యాండిడేట్.. పైగా తనూజను టార్గెట్ చేయడం సీరియల్ ఆడియన్స్కు అస్సలు నచ్చలేదు. పైగా భరణికి కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకోవడం చూసేవారికి కూడా కోపం తెప్పిస్తోంది. ఇవన్నీ దివ్యను టాప్ 5కి వెళ్లకుండా ఆపుతున్నాయి. సుమన్ కూడా టాప్ 5కి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. మిగతావారందరితో పోలిస్తే గేమ్లో సుమన్ చాలా వెనకబడి ఉన్నాడు. పైగా హౌస్లో మెరుపుతీగలా ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్తో ఫైనల్స్కు వెళ్లడం కష్టమే!భరణికి ఛాన్స్తనూజ, దివ్య మధ్య నలిగియిన భరణి (Bharani Shankar)ని జనాలు పట్టించుకోవడం మానేశారు. అందుకే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, రీఎంట్రీ తర్వాత తనలో కామెడీ యాంగిల్ చూపించాడు. తనూజ, దివ్యను నామినేట్ చేశి వారికే ఎదురెళ్లాడు. ఇది జనాలకు నచ్చింది. అతడిపై పాజిటివిటీ పెరుగుతోంది. కాబట్టి టాప్ 5లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. పవన్ - రీతూ.. ఏ సీజన్లో అయినా లవ్ట్రాక్ వల్ల పేరొస్తుంది. కానీ ఈ సీజన్లో మాత్రం బోలెడంత నెగెటివిటీ వచ్చింది. కొన్నివారాలపాటు వీళ్లిద్దరినీ విమర్శించనివాళ్లే లేరు. కానీ, రానురానూ ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారింది. ఎవరెన్ని మాటలన్నా కలిసే ఉండటంతో వీళ్ల బంధం నిజమైనదే అని జనాలు అభిప్రాయపడ్డారు. ఒకరి కోసం ఒకరు నిలబడటాన్ని మెచ్చుకున్నారు. దీంతో వీళ్లిద్దరు లేదా ఎవరో ఒకరు టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.అదే పవన్కు మైనస్నిజం చెప్పాలంటే పవన్ ఆటకు, మాటతీరుకు అతడు టాప్ 3లో ఉండాల్సినవాడు. కానీ, అతడికి రావాల్సినంత హైప్ రాలేదు. పైగా అతడేం చేసినా నెగెటివే అవుతోంది. పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా అతడికి మైనస్గా మారింది. మరి అతడు ఈ అడ్డంకులను దాటుకుని ఫినాలేకు వెళ్తాడేమో చూడాలి! రానున్న రోజుల్లో కంటెస్టెంట్ల ఆటతీరు, మాట తీరును బట్టి టాప్ 5 స్థానాలు మారే ఛాన్స్ ఉంది!చదవండి: బిగ్బాస్: ప్రేరణతో తలపడి ఓడిపోయిన తనూజ -
ప్రేరణ ఎంట్రీ.. ధైర్యంగా ముందుకొచ్చి బొక్కబోర్లా పడ్డ తనూజ
Bigg Boss Telugu 9: ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లాక హౌస్మేట్స్ ముఖాలు వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతున్నాయి. ఈవారం చివరి కెప్టెన్సీని చేజిక్కించుకునేందుకు అందరూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ అవడానికి మాజీ కంటెస్టెంట్లతో గేమ్ ఆడి గెలవాలి. అలా ప్రియాంకతో కలిసి గేమ్ ఆడి కల్యాణ్ గెలిచి కంటెండర్ అయ్యాడు. గౌతమ్తో ఆడి భరణి ఓడిపోయాడు.తనూజ అవుట్తాజాగా ప్రేరణ.. తనూజతో గేమ్ ఆడింది. ఈమేరకు ఓప్రోమో వదిలారు. మీరు టఫ్ ప్లేయర్.. మీతో ఆడాలని ఉంది అని చెప్పింది తనూజ. ఇద్దరూ గేమ్లో బాగా కష్టపడ్డారు. కానీ చివరకు ప్రేరణ తనూజను ఓడించినట్లు తెలుస్తోంది. దీంతో తనూజ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయింది. హౌస్లోకి మానస్, యావర్, శోభాశెట్టి వంటి సెలబ్రిటీలు కూడా రానున్నారు. వీరితో కంటెస్టెంట్లు గేమ్ ఆడి గెలిచిన డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు అయినట్లు తెలస్తోంది. వీరి వీరిలో ఎవరు కెప్టెన్ అన్నది చూడాలి! చదవండి: గంటకు ఎంత? అని చీప్ కామెంట్స్: నటి -
దివ్య-భరణిలపై ట్రోల్స్ ఆపండి..! భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
-
కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోపోయా.. భరణి భావోద్వేగం
తెలుగు బిగ్బాస్ తొమ్మిదవ సీజన్ (Bigg Boss Telugu 9) ముగింపుకు దగ్గరపడేకొద్దీ మరింత రంజుగా మారుతోంది. నామినేషన్స్ ఈసారి అగ్గిరాజుకున్నాయి. ముఖ్యంగా సంజన.. ప్లాన్ చేసి మరీ గొడవ పడింది. రీతూ క్యారెక్టర్ను తప్పు పట్టిన తను ఆమెకు సారీ చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. మరోవైపు మాజీ కంటెస్టెంట్లు బిగ్బాస్ హౌస్లో సందడి చేశారు. ఆ విశేషాలు మంగళవారం (నవంబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...చూసిందే చెప్పా!రీతూ (Rithu Chowdary)- పవన్ ఫ్రెండ్స్కు ఎక్కువ, ప్రేమికుల కన్నా తక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. రాత్రిపూట ఒకే బెడ్పై కూర్చుని ముచ్చట్లు కూడా పెడుతుంటారు. కానీ, జరగరానిదేదో జరిగినట్లు దాన్ని చాలా చెండాలంగా చిత్రీకరించింది సంజన. తొమ్మిదివారాలుగా నేను కనబడలేనంటుందా? సంజనా ఉందని తనకివాళ తెలిసుంటుంది అని శాడిజం చూపించింది. సారీ చెప్పనుసారీ చెప్పమని ఎవరు అడిగినా కుదరదని కరాఖండిగా చెప్పింది. నేను చూసిందే చెప్పా.. అందులో తప్పేం లేదని అడ్డంగా వాదించింది. అంతగా కావాల్సి వస్తే ఆమె సారీ చెప్తేనే నేను చెప్తా అని మొండిగా వాదించింది. ఇదంతా చూస్తుంటే రీతూపై పగ తీర్చుకున్నట్లే కనిపిస్తోంది. ఇక హౌస్లో ఈసారి కెప్టెన్సీ టాస్క్ వెరైటీగా సాగింది. పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లు వస్తుండగా.. వారితో తలపడి ఆడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అవాలి.బిగ్బాస్ హౌస్లో మాజీ కంటెస్టెంట్లుమొదటగా బిగ్బాస్ 7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. తను కల్యాణ్తో పోటీపడతానంది. వీరిద్దరికిచ్చిన చేప గేమ్లో కల్యాణ్ ప్రియాంకను ఓడించి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత బిగ్బాస్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పంచెకట్టుతో హౌస్లో ప్రవేశించాడు. ఇప్పటివరకు కెప్టెన్ అవని భరణికి తనతో తలపడే ఛాన్స్ ఇచ్చాడు.భరణి ఎమోషనల్అసలే టాస్కుల్లో దిట్ట అయిన గౌతమ్.. భరణి (Bharani Shankar)ని ఇట్టే ఓడించేశాడు. కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందంటూ భరణి ఎమోషనలయ్యాడు. కెప్టెన్ అవాలి నాన్న అని కూతురు ప్రేమగా కోరిన ఒక్క కోరికను నెరవేర్చలేకపోయానని బాధపడ్డాడు. నాకు కెప్టెన్సీ రాసి లేదు. సారీ హనీ పాప, సారీ ఫ్రెండ్స్, సారీ అమ్మా.. అని బాధపడుతుంటే తనూజ అతడిని ఓదార్చింది. రేపు మరికొందరు మాజీ కంటెస్టెంట్లు హౌస్లోకి రానున్నారు. -
బిగ్బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?
ఈసారి బిగ్బాస్ ఎప్పుడేం చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఈ సీజన్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయినోళ్లని ఓసారి తిరిగి తీసుకొచ్చి కొన్ని గేమ్స్ ఆడించాడు. వాళ్లలో గెలిచిన ఒక్కరిని రీఎంట్రీ చేయించాడు. అతడే భరణి. ఇదే కాదు రకరకాల ప్రయోగాలన్నీ ఈ సీజన్లోనే జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి. ప్రస్తుతం 12వ వారంలో కెప్టెన్ అయ్యేందుకు మరో కొత్త ప్రయోగం చేశాడు.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ')సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి రంజుగా సాగింది. కల్యాణ్-పవన్ ఒకరిపై ఒకరు రెచ్చిపోవడం, ఈ క్రమంలోనే కల్యాణ్ పీక పవన్ పట్టుకోవడం.. పవన్-రీతూ బంధం గురించి సంజన నోరు పారేసుకోవడం ఇలా మంచి మసాలా కనిపించింది. అలా కెప్టెన్ రీతూ తప్పితే మిగిలినోళ్లందరూ ఈసారి లిస్టులోకి వచ్చారు. మంగళవారం నుంచి చివరి కెప్టెన్సీ కోసం పోటీ మొదలైపోయింది. ఈసారి హౌస్మేట్స్ మధ్య కాకుండా ఓ హౌస్మేట్.. గత సీజన్లకు చెందిన ఓ కంటెస్టెంట్ వచ్చి పోటీ పడతాడు.ఈసారి భరణితో బయట నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణ పోటీపడ్డాడు. బిగ్బాస్లో అశ్వద్ధామ అంటూ హడావుడి చేసి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్.. ఏడో సీజన్లో ఓ మాదిరి ప్రదర్శన చేయగా, గత సీజన్లో రన్నరప్గా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ కెప్టెన్సీ టాస్క్లో పోటీ పడేందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. భరణి-గౌతమ్ పోటీ పడ్డారు. చివరగా భరణినే విజేతగా నిలిచాడు అన్నట్లు చూపించేశారు. మొత్తం ప్రోమోలోనే చూపించేస్తే ఇక ఎపిసోడ్లో ఏం చూపిస్తారా అనేది అర్థం కాలేదు. అయినా హౌస్లో ఉన్నవాళ్ల మధ్య పోటీపెడితే మజా ఉంటుంది గానీ బయటనుంచి తీసుకొచ్చి గేమ్స్ పెట్టడం ఎందుకో సరిగా అనిపించట్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన) -
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
గతవారం ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా కనిపించింది. హౌస్మేట్స్ కుటుంబ సభ్యులు, కన్నీళ్లు, భావోద్వేగాలు ఇలా చూడముచ్చటగా అనిపించింది. ఆదివారం దివ్య బయటకు వెళ్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇమ్ము పవర్ వల్ల ఆమె సేవ్ అయిపోయింది. దీంతో ఎవరూ ఔట్ కాలేదు. సోమవారం వచ్చేసరికి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. కాకపోతే ఈసారి అటు పవన్, ఇటు సంజన.. బిగ్బాస్ గీత దాటి ప్రవర్తించారు. ఒకరు నోరు జారితే మరొకరు ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశారు. ఇంతకీ 78వ రోజు ఏం జరిగింది? నామినేషన్స్లో ఎవరెవరున్నారు?ఈసారి నామినేషన్స్ ప్రక్రియని కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మొదటి సీక్రెట్గా ఒకరి పేరు రాసి, ఆ కార్డ్ని బాక్స్లో వేయాల్సి ఉంటుందని చెప్పగా అందరూ దీన్ని ముగించారు. ఇక సాధారణ నామినేషన్ ప్రక్రియ మాత్రం ఈసారి రచ్చ రచ్చ అనేలా సాగింది. కొట్టుకోవడం, నోరు జారడం లాంటివి చాలా జరిగాయి. మొత్తం ఎపిసోడ్లో కల్యాణ్-పవన్ వివాదం, సంజన-రీతూది మాత్రం హైలైట్ అయింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్)ఇమ్ముని పవన్ నామినేట్ చేశాడు. గతవారం కెప్టెన్సీ టాస్క్లో మనం మాట్లాడుకున్నాం, నేను నీకు సపోర్ట్ చేస్తాను.. నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని అనుకున్నాం. కానీ నువ్వు అలా చేయలేదు అని డీమాన్ పవన్ తన పాయింట్ చెప్పాడు. వీళ్లిద్దరూ ఎవరికి వాళ్లు తమని డిఫెండ్ చేసుకుంటుండగా.. మధ్యలో కల్యాణ్ ఎంటరయ్యాడు. వేర్వేరు టీమ్స్లో ఉండగా.. పవన్ ఇలాంటి డీల్ చేసుకోవడం ఏంటని అడిగాడు. డీమన్-కల్యాణ్ మధ్య డిస్కషన్ జరుగుతుండగా.. రీతూ కూడా దీనిలోకి ఎంటరైంది. నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు, ఆరోజు ఇమ్మూ అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద నింద వేశావ్. మరి ఇప్పుడు డీమన్ చేసింది ఏంటి అని కల్యాణ్ రీతూపై రెచ్చిపోయాడు.కల్యాణ్ మాటలకు రెచ్చిపోయిన రీతూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో కల్యాణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడకు.. ఏది పడితే అది వాగకు అంటూ రీతూ అనేసరికి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు శనివారం వచ్చినప్పుడు వీడియో ప్లే చేయించు.. నేను టీమ్ కోసం ఆడదామని చెప్పిన దానికి డీమన్ ఓకే చెప్పలేదని చూపించు. నేను షో నుంచి వెళ్లిపోతాను అని కల్యాణ్, రీతూకి సవాల్ చేశాడు. దీంతో మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అడ్డుకునే క్రమంలో కల్యాణ్ పీకని డీమన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు.దీని తర్వాత కెప్టెన్ రీతూ.. సంజనని నామినేట్ చేసింది. దీంతో మరో గొడవ మొదలైంది. ఫైర్ స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు. కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మూ సపోర్ట్ చేయలేదని చాలా ఫీలయ్యారు. కానీ ఈరోజు ఇమ్మూని మీరు నామినేట్ చేసే అవకాశమున్నా చేయలేనని చెప్పారు అని రీతూ తన కారణాలు చెప్పింది. తర్వాత బూతులు మాట్లాడుతున్నారని ఒకరి గురించి ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు. తర్వాత పవన్-రీతూ రిలేషన్ గురించి సంజన దారుణమైన కామెంట్స్ చేసింది. నీ అంత పెద్ద బూతులు ఎవరూ వాడలేదు, నీలాంటి స్ట్రాటజీలు ఈ హౌస్లో ఎవరికీ లేవు రీతూ. పవన్తో నువ్వు రాత్రి కూర్చుంటావ్.. కళ్లు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన అనేసింది. ఇలా అనకూడదని చెప్పి సంజనని హౌస్మేట్స్ అంతా సముదాయించారు. కానీ ఆమె వినలేదు. చివరగా రీతూ తప్పితే హౌస్లోని అందరూ నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది) -
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్లో భరణితో తనూజ, దివ్యల బాండింగ్ బాగా వైరల్ అయింది. ఇవేం బాండింగ్స్ రా బాబు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. తనూజతో భరణి క్లోజ్గా మాట్లాడితే చాలు దివ్యకు కోపం వచ్చేస్తుంది. తనూజ కాలికి నూనె రాసినప్పుడు, ఆమె కెప్టెన్ అయ్యాక భరణి ఎత్తుకున్నాడంటూ ఇలా పలు కారణాలు చూపుతూ తనూజ మీద దివ్య ఫైర్ అవుతూనే ఉంది. దీంతో గేమ్ పరంగా తనూజ కంటే దివ్యనే ఎక్కువగా నష్టపోయిందని చెప్పవచ్చు. భరణి విషయంలో ప్రతిసారీ ఆమె కావాలనే తనూజతో గొడవ పెట్టుకుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.తనూజ, భరణి బంధంపై ఆయన చెల్లెలు ఆరతి పలు వ్యాఖ్యలు చేశారు. 'తనూజ- భరణిల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆమెను చూస్తుంటే నాకు సొంత మేనకోడలు మాదిరిగానే అనిపించింది. వారిద్దరిపై సోషల్మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ చూస్తుంటూ చాలా బాగున్నాయి.. వాటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది. తనూజ గేమ్ కూడా నాకు బాగా నచ్చింది. అయితే, ఫ్యామిలీ వారంలో హౌస్లోకి నేనే వెళ్లాల్సింది. కానీ, నా అన్న కూతురు వెళ్లింది. ఒకవేళ నేను వెళ్లింటే తనూజాను అభినందించేదానిని. కానీ, దివ్య, తనూజల మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. దివ్య కూడా భరణి పట్ల మంచి అభిమానం చూపుతుంది. అయితే, ఆమె కాస్త గట్టిగా, డిమాండ్ చేసినట్లు భరణితో మాట్లడటం.. ఆపై కొంచెం ఎక్కువగా డామినేటెడ్గా మాట్లాడం వల్ల చూసేవారికి నచ్చడం లేదు. అంతేకానీ దివ్యతో ఎలాంటి సమస్య లేదు. దివ్య, భరణిలను ట్రోల్ చేసే వారు కాస్త ఆపండి. కానీ, తనూజ ఎప్పుడు కూడా భరణిని డిమాండ్ చేస్తూ మాట్లాడలేదు. తను చాలా క్యూట్గా అన్నయ్యతో మాట్లాడుతుంది.' అని ఆరతి పేర్కొంది. -
ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్ చేసిన భరణి
మండే వచ్చిందంటే నామినేషన్స్ పండగ. గొడవలు, అరుపులు, కేకలతో బిగ్బాస్ హౌస్ దద్దరిల్లుతుంది. గత వారం తనూజ, దివ్య ఎంతలా అరుచుకున్నారో అందరం చూశాం. మరి ఈ వారం ఎవరి మధ్య వార్ జరగనుందో చూడాలి! 12వ వారం నామినేషన్స్కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. 12వ వారం నామినేషన్స్ఈసారి నామినేషన్స్ రెండు లెవల్స్లో ఉంటుందన్నాడు బిగ్బాస్. మొదటగా ప్రైవేట్ నామినేషన్స్ జరుగుతాయన్నాడు. అలా ప్రతి ఒక్కరూ ఫేస్ టు ఫేస్ కాకుండా ప్రైవేట్గా నామినేట్ చేశారు. అలా ఇమ్మాన్యుయేల్.. పవన్ను, కల్యాణ్.. సుమన్ను, పవన్.. కల్యాణ్ను నామినేట్ చేశారు. 'ఇద్దరి గొడవల్లో తనూజ మళ్లీ నన్ను లాగింది. ఇదేదో చిన్నపిల్లల ఆటలా అయిపోతుంది. నామినేషన్స్లో ఎవరంటే?ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ మెచ్యూర్డ్గా ప్రవర్తించట్లేదు' అంటూ భరణి.. తనూజను నామినేట్ చేశాడు. నావైపు నిల్చుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్ను ఎఫెక్ట్ చేసిందంటూ దివ్య.. భరణిని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ రీతూ తప్ప మిగతా 8 మంది నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇమ్మూ బలవంతం.. ఫలించిన బిగ్బాస్ స్కెచ్ -
ఇమ్మూపై ఒత్తిడి.. దివ్య సేఫ్.. హర్టయిన తనూజ
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) భలే తెలివైనోడు.. ఇమ్మాన్యుయేల్తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్(నవంబర్ 23)లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారో చూసేద్దాం..సుమన్ కోసం పిల్లలుసుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్లను చూడగానే సుమన్కు కళ్లలో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. గేమ్ బాగా ఆడాలని సుమన్కు సూచించాడు. సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్ను టాప్ 5లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనల్లుడు వచ్చారు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్మూ, కల్యాణ్, తనూజ, సుమన్ను టాప్ 5లో పెట్టారు.రీతూ కోసం అఖిలతర్వాత రీతూ కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగెటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావ్ అని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డిమాన్ పవన్ను టాప్ 5లో పెట్టారు. అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది. మనీష్కు కౌంటర్పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం.. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి.. ముద్దుముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్కు ఇప్పుడు కౌంటరిచ్చింది. ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త.. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది.దివ్యను కాపాడేందుకు స్కెచ్డిమాన్ పవన్ (Demon Pavan) కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. నాకు నీతి, నిజాయితీగా ఉండటమే వచ్చు.. నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూను టాప్ 5లో పెట్టారు. అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్.నో ఎలిమినేషన్ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈవారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు? తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్రెడీ నాగ్.. దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హర్ట్ అయినట్లే కనిపిస్తోంది!చదవండి: సిక్స్ ప్యాక్తో హీరో సెకండ్ ఇన్నింగ్స్ -
అది నా పిల్లరా..: ముద్ద మందారం హీరో
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) కంటెస్టెంట్ల కోసం వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. నిన్న భరణి కోసం నాగబాబు రాగా, నేడు తనూజ కోసం ముద్దమందారం సీరియల్ స్టార్స్ స్టేజీపైకి వచ్చేశారు. సుమన్ కోసం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.లేడీ సింగంసీరియల్ నటి హరితను చూడగానే తనూజ చాలా మిస్ అయ్యానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు హరిత కూడా ఎమోషనలైంది. ముద్దమందారం హీరో పవన్.. తనూజను లేడీ సింగంగా అభివర్ణించాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫోటో ఉన్న కార్డ్ను బయటకు తీశాడు. దీంతో నాగ్.. ఆ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమన్నాడు. అందుకు పవన్.. అది నా పిల్ల అని చెప్పాడు. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణికి సలహా ఇచ్చాడు.ఎమోషనల్ ప్రోమోనాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను కప్పుతో చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని హరిత చెప్పగానే తనూజ భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రోమో చూసిన తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నింటికన్నా.. అది నా పిల్ల అనే డైలాగ్ బాగా హైలైట్ అయిందంటున్నారు. మరి దానికి కల్యాణ్ ఎలా ఫీలవుతున్నాడో? ఏంటో! చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్.. దివ్యను కాపాడేందుకే! -
ఈ వారం నో ఎలిమినేషన్.. టాప్ 5లో వీళ్లేనా?!
సుమన్ చేసిన పొరపాటు వల్ల, తనూజ కంగారు వల్ల కెప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది. రీతూ కెప్టెన్గా గెలిచింది. ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్ రాగా వీకెండ్లో కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. టాప్ 5లో ఎవరుంటారో తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ విశేషాలు శనివారం (నవంబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..జీవితంలో ముఖం చూడను(Bigg Boss Telugu 9) తనూజతో జరిగిన గొడవ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది దివ్య. మీకిష్టం లేకపోయినా మీ వెంటపడుతున్నానని కామెంట్స్తో బాధపెట్టింది. బయటకెళ్లాక జీవితంలో తన ముఖం చూడను అంది. నాగార్జున స్టేజీపైకి వచ్చి తనూజ- దివ్య గొడవ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్ అవగానే కళ్లు నెత్తికెక్కాయా? అని తనూజకు క్లాస్ పీకాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసిందే నువ్వని దివ్యను తిట్టిపోశాడు. అలా ఇద్దరికీ కాస్త గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్ను స్టేజీపైకి పిలిచాడు.తనూజ నా మనవరాలుమొదటగా భరణి (Bharani Shankar) తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజీపైకి వచ్చాడు. తనూజ (Thanuja Puttaswamy)ను మనవరాలు అని పిలిచిన భరణి తల్లి.. దివ్యను మాత్రం పరోక్షంగా జాగ్రత్త అని హెచ్చరించింది. కొడుకుపై అరవొద్దు అన్నట్లుగా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది. వీళ్లు.. భరణి, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనను టాప్ 5లో వరుసగా పెట్టారు. కల్యాణ్ తండ్రి గొప్ప మాటలుతర్వాత కళ్యాణ్ కోసం తండ్రి లక్ష్మణ్రావు, తమ్ముడు బాలు వచ్చారు. కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, పవన్ను టాప్ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ అన్నతో పాటు కమెడియన్ అవినాష్ వచ్చారు. ఇమ్మూ, తనూజ, కల్యాణ్, పవన్, రీతూని టాప్ 5లో పెట్టారు. అవినాష్ తనూజకు మహానటి, కట్టప్ప అవార్డులు ఇచ్చాడు.టాప్5 చివర్లో దివ్యతర్వాత దివ్య తాతయ్య, స్నేహితురాలు వచ్చారు. వీళ్లిద్దరూ.. ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్, దివ్యను టాప్ 5లో పెట్టారు. దివ్యను చివర్లో పెట్టిన తాతయ్య.. నువ్వింకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇకపోతే ఈ వారం దివ్య-తనూజ గొడవతో టీఆర్పీలు బద్ధలైపోయాయట. దీంతో బిగ్బాస్ టీమ్ దివ్యను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించేందుకు సిద్ధమైందట! ఆ సంగతులు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.. -
బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
ప్రతివారం బిగ్బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. గతవారం గౌరవ్, నిఖిల్ బయటకొచ్చేశారు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయినట్లు అయింది. మరి ఈ వారం ఎవరు ఔట్ అవుతారా అందరూ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ఈ వారం ఆరుగురు నామినేషన్స్లోకి రాగా.. ఈమెనే ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించారు. ఇప్పుడు అలానే జరిగినట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్స్లోకి కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య వచ్చారు. ఇన్నివారాల పాటు మిస్ అవుతూ వచ్చిన ఇమ్ము.. తొలిసారి నామినేషన్స్లోకి వచ్చాడు. ఇదేమైనా ఇతడికి మైనస్ అవుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అభిమానులు గట్టిగానే ఓట్లు వేశారట. తద్వారా ఓటింగ్లో తొలిస్థానం కల్యాణ్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఇమ్ము నిలిచాడట.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)తర్వాత స్థానాల్లో పవన్, భరణి నిలిచారు. డేంజర్ జోన్లో సంజన, దివ్య ఉన్నారు. సంజనతో పోలిస్తే దివ్యపై గత కొన్నివారాల నుంచి నెగిటివిటీ పెరుగుతూనే వచ్చింది. దీనికి కారణం తనూజ. ప్రతిసారి తనూజతో దివ్య గొడవ పడుతూ వచ్చింది. శుక్రవారం ఎపిసోడ్లోనూ కెప్టెన్సీ విషయమై వీళ్లిద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇప్పటికే కెప్టెన్సీ, ఇమ్మ్యూనిటీ ఉన్న కారణంగా తనూజని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేందుకు తాను ఓటు వేస్తున్నానని దివ్య చెప్పింది.ఇలా పలు కారణాలతో పాటు నామినేషన్స్లో ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే దివ్యకు ఓటు బ్యాంక్ తక్కువగా ఉండటంతో 11వ వారం ఈమెనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె బయటకొచ్చేస్తే.. హౌస్లో ఉన్న కామనర్స్ కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. చూడాలి మరి ఈసారి ఊహించినట్లే దివ్య ఎలిమినేట్ అవుతుందా లేదంటే మరెవరైనా బయటకొచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?) -
తనూజ వల్ల సుమన్ బలి.. పవన్పై చిన్నచూపు?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో పదకొండోవారం కెప్టెన్ రీతూ అన్న విషయం ఈపాటకే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ అదేదో సస్పెన్స్ అన్నట్లుగా సాగదీస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ వేయనేలేదు. ఈరోజు ఎపిసోడ్లో సుమన్, రీతూ కెప్టెన్సీ కోసం ఎలా పోటీపడ్డారో చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు.బోల్తా కొట్టిన సుమన్ఇందులో సుమన్ చకచకా ఆడేశాడు. చివర్లో ఓ బోర్డు సెట్ చేస్తుంటే సంచాలక్గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. పర్లేదు, వెళ్లు వెళ్లంటూ పంపించేసింది. అలా ఫస్ట్ సుమన్ కెప్టెన్ అని రాసున్న జెండా ఎగరేశాడు. కొద్ది క్షణాల తేడాతో రీతూ జెండా ఎగరేసింది. అయితే సుమన్ చివరి బోర్డ్ సరిగా పెట్టలేదని డిమాన్ పవన్ ప్రశ్న లేవనెత్తాడు. అది దగ్గరుండి మరీ చూపించాడు. సైలెంట్ అయిన తనూజదాంతో తనూజ.. వాళ్లిద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? నువ్వేంటి చెప్పేది? అని పవన్ను తీసిపడేసింది. ఇంతలో కల్యాణ్.. నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డ్ వదిలేశాడని వాదించాడు. దీంతో తనూజ సైలెంట్ అయిపోయింది. తనూజ చేసిన ఆగం పని వల్ల సుమన్ బలైపోయాడు. రీతూ కెప్టెన్ అయింది. చదవండి: సీజన్లో పెద్ద లొల్లి.. సీరియల్ స్టార్ వర్సెస్ సింపతీ స్టార్ -
ఏయ్, నువ్వేం పొడిచావ్? సీజన్లోనే పెద్ద లొల్లి!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లోకి చివరగా ఇమ్మాన్యుయేల్ తల్లి వచ్చింది. నేను వద్దనుకున్న కొడుకే ఈరోజు నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చాడని తెగ మురిసిపోయింది. కొడుక్కి ప్రేమగా గోరుముద్దలు తినిపించింది. మరి ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 21వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...ఇమ్మూకి డబుల్ ధమాకాఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు బిగ్బాస్ డబుల్ బొనాంజా ఇచ్చాడు. తల్లిని బయటకు పంపించేశాక ప్రియురాలు పంపిన లేఖ, ఎంగేజ్మెంట్ రింగ్ను ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇది చూసి ఇమ్మూ తెగ సంబరపడిపోయాడు. తర్వాత ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ముందుగా కెప్టెన్సీకి అనర్హులు అనుకున్నవారిని గేమ్లో నుంచి తీసేయాలన్నాడు. దాంతో మొదటగా దివ్య.. తనూజ పేరు చెప్పింది. పర్సనల్ అటాక్ఆల్రెడీ రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్లీ ఇంకో వారం ఇమ్యూనిటీ అవసరం లేదంటూ తనూజను తీసేసింది. అది తనూజకు నచ్చలేదు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావ్? అంటూ ఒంటికాలిపై లేచింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. బయట రివ్యూలు సరిపోవన్నట్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నావ్.. నువ్వే సింపథీ స్టార్ అంటూ తనూజ మరింత అగ్గిరాజేసింది.గేమ్ కోసం వాడుకోనునీలాగా మనుషుల్ని గేమ్ కోసం వాడుకోను అని దివ్య.. ఒక మనిషి ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావ్.. అని తనూజ మధ్యలో భరణిని లాగారు. దాంతో ఆయన మధ్యలో నన్ను లాగొద్దని చెప్పానుగా అని అసహనం వ్యక్తం చేశాడు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. నేను నీకంటే బెటర్గా ఆడా.. అందరిదగ్గరికెళ్లి కెప్టెన్సీ అడుక్కోలేదు.. నిన్ను భరించలేక నన్ను గతంలో కెప్టెన్ చేశారు. నువ్వేం పొడిచింది లేదు. సీరియల్ స్టార్ అంటూ దివ్య తనూజను ఏకిపారేసింది. చివరకు ఆ ఇద్దరుఅలా వీరి గొడవతో హౌస్ను తగలబెట్టేసినంత పని చేశారు. దివ్య తర్వాత మెజారిటీ ఇంటిసభ్యులు తనూజను కెప్టెన్గా వద్దన్నారు. దీంతో ఆమె గేమ్లో లేకుండా పోయింది. అయితే హౌస్మేట్స్ను రెండు టీమ్స్గా విభజించే బాధ్యతను తనూజకు అప్పగించాడు బిగ్బాస్. దీంతో ఆమె పవన్, కల్యాణ్, రీతూ, సుమన్ను బ్లూ టీమ్గా మిగిలినవారిని రెడ్ టీమ్గా విభజించింది. వీరికి ఓ మాన్స్టర్ గేమ్ ఇచ్చాడు. ఇందులో చివరకు సుమన్, రీతూ మిగిలారు. అయితే రీతూ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
నీలాగా గేమ్ కోసం వాడుకోను.. తనూజపై రెచ్చిపోయిన దివ్య
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో దివ్యకు తనూజ అంటే ఏమూలనో కోపం, ద్వేషం, అసూయ ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో తనూజ కాలికి వాపు వచ్చిందని భరణి ప్రేమగా ఆయింట్మెంట్ పూసి మసాజ్ చేశాడు. అది దివ్య తట్టుకోలేకపోయింది. మీ ఆరోగ్యమే బాగోలేదు. చేయి నొప్పి ఉన్నప్పుడు సేవలు చేయడం అవసరమా? అని అరిచింది. ఎవరో ఒకరు చేస్తారుగా.. మీరెందుకు చేయడం అని తిట్టేసింది.తనూజపై అక్కసుపోనీ నిజంగా తనకు భరణిపై అంత కేరింగ్ ఉందా? అంటే.. పోయినవారం బీబీ రాజ్యం గేమ్లో భరణితో మసాజ్ చేయించుకుంది. మరి అప్పుడు భరణి నొప్పి గుర్తురాలేదా? అన్నది తనకే తెలియాలి. ఇప్పుడు తనూజ (Thanuja Puttaswamy)పై కోపాన్ని మరోసారి బయటపెట్టింది. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది. కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటున్నవారిని రేసు నుంచి తప్పించాలన్నాడు బిగ్బాస్. ఒంటికాలిపై లేచిన తనూజదీంతో దివ్య.. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఆల్రెడీ కెప్టెన్గా ఈ వారం ఇమ్యూనిటీ పొందావ్. మళ్లీ అది నీకు అవసరం లేదు అని తనూజను తీసేసింది. దాంతో తనూజ.. నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా.. ఎవరూ నా చేతిలో పెట్టలేదు. నీకు నేనే కనిపిస్తున్నానా? వేరేవాళ్లు కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా.. 100% నేను కరెక్ట్ ఆన్సరిచ్చా అని దివ్య సమర్థించుకుంది.గేమ్ కోసం వాడుకోనుబానే చెప్పుకున్నావ్ పో.. అని తనూజ వెక్కిరించడంతో దివ్యకు బీపీ లేచింది. నువ్వెవరు పో అనడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని వేలు చూపించి మాట్లాడింది. అయినా వెనక్కు తగ్గని తనూజ.. ప్రతిదానికి నామీద పడి ఏడుస్తావ్ అని వెటకారం చేసింది. గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు.. నీలాగా అందర్నీ గేమ్ కోసం వాడుకోను అని దివ్య అంది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవే జరిగింది. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. చదవండి: ఏడవద్దు డాడీ, హీరోగా బయటకు రా: ఇమ్మాన్యుయేల్ -
ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్! కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చేసింది. తనూజ, కల్యాణ్, సుమన్, భరణి, దివ్య, డిమాన్ పవన్, రీతూ, సంజన.. ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చి వెళ్లారు. చివరగా ఇమ్మూ ఒక్కడే మిగిలాడు. ఈరోజు అతడి తల్లి బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజైంది.ఏడవద్దు డాడీఇమ్మూ తల్లి అంటూ కొడుక్కి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టింది. తాను కొనిచ్చిన బంగారు గాజులు వేసుకుని రావడం చూసి ఇమ్మూ మురిసిపోయాడు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో.. ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు.. ఏడవద్దు డాడీ అంటూ కొడుకు కన్నీళ్లు తుడిచింది. కమెడియన్గా వచ్చావ్.. హీరోగా బయటకు రావాలంది.తల్లి కోసం పాటకొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా అందరితో బాగానే కామెడీ చేసింది. చివర్లో ఇమ్మూ.. సువ్విసువ్వాలమ్మా పాట పాడి అందరి మనసులు పిండేశాడు. ఇక ఇమ్మూ తల్లి కొడుక్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో చూడాలి. అలాగే హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరగ్గా రీతూ చౌదరి కొత్త కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: దివ్యకు దూరంగా ఉండు: భరణికి కూతురి సలహా -
కల్యాణ్ తల్లికి చీర పెట్టిన తనూజ.. అంత స్పెషల్ ఏంటో?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లోకి పవన్ కల్యాణ్, రీతూ, భరణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారు ఏం మాట్లాడారు? హౌస్లో ఏమేం జరిగాయో గురువారం (నవంబర్ 20వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..కల్యాణ్ తల్లికి తనూజ గిఫ్ట్ఫ్యామిలీ వీక్ వద్దని బెట్టు చేసిన కల్యాణ్ (Pawan Kalyan Padala).. తల్లిని చూడగానే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలని తల్లి కల్యాణ్ దగ్గర మాట తీసుకుంది. చివర్లో తనూజ.. కల్యాణ్ తల్లికి చీర పెట్టి సాగనంపింది. అది చూసిన కల్యాణ్ ఎందుకు స్పెషల్గా మా అమ్మకే చీర పెట్టావ్? అని అడిగాడు. అందుకామె.. నువ్వు నాపై ఎంతో కేర్ చూపించావ్, అందుకు బదులుగా తనకు చీర పెట్టాలనిపించింది, పెట్టాను అని సమాధానమిచ్చింది. రీతూ తల్లి ఎంట్రీఅలాగే తనపై లేనిపోని ఆశలు పెంచుకుంటున్న కల్యాణ్కు బిగ్బాస్ అయిపోయాక నీ జర్నీ నీది.. నా జర్నీ నాది అని క్లారిటీ ఇచ్చింది. అందుకు కల్యాణ్ నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావాలి అంటూ ప్రేమపిపాసిలా డైలాగులు కొట్టాడు. తర్వాత రీతూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే రీతూ బోరుమని ఏడ్చేసింది. కానీ, ఆమె తల్లి మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదంటూ చపాతీ కర్ర అందుకుని కొట్టబోయింది. కానీ కూతురి ఏడుపు చూసి కొట్టేందుకు చేతులు రాలేదు.మాడిపోయిన పవన్ ముఖంతనూజ, ఇమ్మూని పిలిచి మరీ మాట్లాడింది. కానీ డిమాన్ పవన్ను అసలు పట్టించుకోలేదు. దీంతో అతడి ముఖం వాడిపోయింది. గేమ్స్లో మాత్రమే ఫోకస్ చేయ్.. ఇంకేం వద్దు అని హెచ్చరించింది. మరి అది రీతూ తలకు ఎక్కించుకుందో? లేదో! ఇదంతా చూసిన పవన్.. రేపటినుంచి రీతూకి దూరంగా ఉండాలని మనసులో అనుకున్నాడు. తర్వాత భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. దివ్యకి దూరంగా ఉండుతనూజ-నాన్న బంధం తన ఫేవరెట్ అంది. నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందని తండ్రిని కోరింది. దివ్యను తన తండ్రిపై కమాండింగ్ కాస్త తగ్గించమని కోరింది. ఆమె అటు వెళ్లగానే కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీపై అరుస్తుంటే సైలెంట్గా ఉండకండి. అలా అరవడం నచ్చడం లేదని చెప్పండి అని తండ్రికి సలహాలు ఇచ్చింది. ఇక హౌస్లోకి అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఒక్క ఇమ్మూకి తప్ప! రేపు అతడి తల్లి ఇంట్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్ హైలైట్స్లో చూద్దాం.. -
ఇంత బాధేంట్రా పిచ్చోడా.. నాకో మాటివ్వు: కల్యాణ్ తల్లి
సామాన్యుడు బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)దాకా రావడమనేది చిన్న విషయం కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటం అంటే చాలా గొప్ప విషయం! ట్రోఫీ గెలుస్తాడా? లేదా? అని పక్కనపెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కల్యాణ్ పడాల.విమర్శల నుంచి పొగడ్తల వరకుచిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి... అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్బాస్ హౌస్కి వచ్చాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). మొదట్లో తనూజను చూసేవిధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు.వద్దు వద్దంటూ..అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్లో బోరుమని ఏడ్చాడు కల్యాణ్. కానీ, ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మాటిచ్చిన కల్యాణ్ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కల్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్గా సాగనుంది. చదవండి: పెళ్లయి 9 ఏళ్లు.. నాకు తల్లవ్వాలని లేదు: నటి -
నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటి?: రీతూ తల్లి
పదివారాలుగా ఇంటిల్లిపాదికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ ఈ వారం ఫుల్ జోష్లో ఉన్నారు. కారణం.. ఇది ఫ్యామిలీ వీక్. అమ్మానాన్న, చెల్లి, భార్య.. ఇలా ఎవరో ఒక రక్తసంబంధీకులు తమకోసం బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్కు రావడం చూసి ఆనందభాష్పాలు కారుస్తున్నారు. ఇప్పటికే సుమన్, తనూజ, పవన్, దివ్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈరోజు రీతూ తల్లి హౌస్లోకి రానుంది.రీతూకి క్లాస్ఈమేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో రీతూ తల్లి హౌస్మేట్స్ను ఓ ఆటాడుకుంది. ఫాస్ట్ ఫార్వర్డ్, ఫ్రీజ్ అంటూ కంటెస్టెంట్లను ఓ ఆటాడించింది. తల్లిని చూడగానే మిస్యూ అంటూ రీతూ ఏడుపందుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం.. నిన్ను కొడ్తా.. నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అని పవన్తో లవ్ ట్రాక్ గురించి పరోక్షంగా నిలదీసింది.ఏడుపందుకున్న రీతూమనం పక్కకెళ్దాం అమ్మ.. అని రీతూ అడిగితే చపాతీ కర్ర అందుకుని కొట్టేందుకు సిద్ధమైంది. కానీ రీతూ ఏడుపు చూసి కొట్టలేక దగ్గరకు తీసుకుని హత్తుకుంది. ఎంతైనా తల్లి మనసు కదా.. కూతురి కన్నీళ్లు చూశాక కొట్టే సాహనం చేయలేకపోయింది. చదవండి: డిమాన్ పవన్ తండ్రికి క్యాన్సర్ -
నాకు క్యాన్సర్, అప్పటినుంచి తిండి మానేశా..: పవన్ తండ్రి
రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వల్ల నెగెటివ్ అయ్యాడు కానీ టైటిల్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు డిమాన్ పవన్ (Demon Pavan)కు ఉన్నాయి. ఆటల్లో గట్టిపోటీనిస్తాడు. ఎంతమందినైనా సరే ఒంటిచేత్తో ఆపగలడు. అతడు టాస్కులో దిగాడంటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆటలో రఫ్ అండ్ టఫ్ కానీ మాటలో మాత్రం ఉట్టి డొల్ల. గట్టిగా మాట్లాడటం చేతకాదు. వెనకబడ్డ పవన్తనను ఎవరైనా నిందిస్తున్నా అమయాకుడిలా పడతాడు, అలుగుతాడు తప్ప రివర్స్ కౌంటరివ్వడం, తిట్టడం చేతకాదు. అందుకే విన్నింగ్ రేస్లో లేకుండా పోయాడు. ఫ్యామిలీ టైమ్ కోసం ఇచ్చిన గేమ్లో పవన్.. తన ఆట మధ్యలో ఆపేసి దగ్గరుండి సుమన్ తాళ్ల చిక్కుముడులు విప్పుతూ అతడికి సాయం చేశాడు. కానీ, అదెవరికీ కనబడలేదు. తండ్రి కోసం బెంగపవన్కు ఎప్పుడూ ఇంతే! అతడు చేసిన మంచి కన్నా, తప్పులే పెద్దగా కనిపిస్తాయి. అదే అతడికి పెద్ద మైనస్. నిన్నటి ఎపిసోడ్లో పవన్ తల్లి హౌస్లోకి వెళ్లి కొడుక్కి గోరుముద్దలు తినిపించింది. ఆ సమయంలో తండ్రి గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్. అసలు పవన్ తండ్రికేమైందో? ఆయన మాటల్లోనే విందాం..క్యాన్సర్పవన్ తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరోజు నా పన్ను నాలుకకి గుచ్చుకుని సెప్టిక్ అయింది. దీనికేం అవుతుందులే అనుకున్నాను. కానీ, తర్వాత సమస్య పెద్దదైంది. దాంతో పవన్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఆస్పత్రిలో చూపిస్తే క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అలా జూన్లో సర్జరీ జరిగింది. 4 గంటలపాటు ఈ ఆపరేషన్ జరిగింది.సరిగ్గా మాట్లాడలేని స్థితిలో..నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఐదో రోజు ఇంటికి వెళ్లిపోయాం. కాకపోతే నోటి లోపల చర్మం కట్ చేశారు. దీనివల్ల మాట సరిగా రావడం లేదు. భోజనం చేయడం కూడా మానేశాను. రోజూ జావ తాగుతున్నాను. కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటున్నాను అని తెలిపాడు. అందుకే పవన్ తండ్రిపై బెంగ పెట్టుకున్నాడన్నమాట!చదవండి: భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు -
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో టాస్కులకు బ్రేక్ పడింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఇల్లు భావోద్వేగాల నిలయంగా మారింది. ఇప్పటివరకు తనూజ, సుమన్, పవన్, దివ్య, సంజనల కుటుంబ సభ్యులు హౌస్లో అడుగుపెట్టారు. ఈరోజు భరణి ఫ్యామిలీ ఇంట్లోకి రానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అందులో భరణి (Bharani Shankar) కూతురు ఇంట్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది.కూతుర్ని చూడగానే భరణికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆమె భరణిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూస్తే గర్వంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ వారం కెప్టెన్గా చూడాలని మనసులోని కోరిక బయటపెట్టింది. మరి కూతురి కోరిక భరణి నెరవేరుస్తాడా? లేదా? చూడాలి! -
రీతూతో బంధం.. అమ్మతో పంచుకున్న డిమాన్ పవన్
బిగ్బాస్ 9 తెలుగులో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు వస్తున్నారు. బుధవారం ఎపిసోడ్లో డీమాన్ పవన్ తల్లి పద్మ, సంజన ఫ్యామిలీ, దివ్య అమ్మ శ్రీలక్ష్మీ సందడి చేశారు. పిల్లల మీద ఒక తల్లి ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా తల్లుల ప్రేమ చుట్టూ తిరిగింది. వారి అల్లరి, ప్రేమ, కన్నీళ్లు అన్నింటికి ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారు. ఆడియన్స్ను ఆకట్టుకునేలా బిగ్బాస్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడని చెప్పాలి.రీతూతో ఉండటానికి కారణం ఇదే: పవన్డిమాన్ పవన్ మన ఇంట్లో పిల్లోడిలా ఉంటాడు. ఎలాగైనా సరే తన కలలు నెరవేర్చుకోవాలని పోరాడే మధ్యతరగతి కుర్రోడిలా కనిపిస్తాడు. రీతూ విషయంలో తనని మోకాళ్ల మీద నిల్చోపెట్టినా సరే జీవితంలో గెలవాలనే భరించాడు. బిగ్బాస్లో పవన్ ఆటను చూసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన అతని అమ్మగారు చాలా ఎమోషనల్ అయ్యారు. తన బిడ్డ ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి పనిచేసేవాడు కాదంటూ ఒక మధ్యతరగతి తల్లిలా చెప్పే మాటలు మెప్పిస్తాయి. పవన్ను హగ్ చేసుకుని గోరుముద్దలు తినిపించడం.. తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందని పవన్ అడుగుతూనే.. ఆయన గురించే బెంగగా ఉందంటూ డిమాన్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో పవన్ను ఓదారుస్తూ.. లేదురా ఏం బాధపడకు.. మొన్నటి కంటే ఇప్పుడే బావున్నారని ఆమె ధైర్యం నింపింది. అయితే, రీతూతో బాండింగ్ పెరగడానికి కారణం ఇలా చెప్పాడు. ' ఇక్కడ మొదట్లో నాకు ఎవరూ సపోర్ట్ చేయకపోయినప్పటికీ రీతూ మాత్రమే ఫస్ట్ నుంచి నాతో ఉంది. ఆమె మాత్రమే నాకు సపోర్ట్గా నిలబడింది. ప్రతి టాస్క్లో నేను స్ట్రాంగ్ అంటూ ఇతర కంటెస్టెంట్స్ తీసేస్తున్నారు. అలాంటి సమయంలో రీతూ నాకోసం మాట్లాడేది. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లని మనమూ బాగా చూసుకోవాలి కదమ్మా.. అందుకే ఆమెతోనే ఎక్కువసేపు ఉంటున్నాను . అయితే, పవన్ మదర్ కూడా ఏం కాదులే అంటూ ఊ కొట్టారు. ఫ్యామిలీ ఫొటో టాపిక్ విషయంలో కూడా అర్థం చేసుకున్నాం అని ఆమె చెప్పింది. పవన్ను మోకాళ్ల మీద నిల్చోపెట్టడం కాస్త బాధగా అనిపించిందని ఆమె చివరగా చెప్పింది.సంజన ఫ్యామిలీ కోసం ఇమ్మానియేల్, కల్యాణ్ త్యాగంబిగ్ బాంబ్ వల్ల సంజనాకు ఫ్యామిలీ వీక్ లేదని నాగార్జున చెప్పారు. కానీ, హౌస్మేట్స్లో ఎవరైనా ముగ్గురి దగ్గరి నుంచి వారి ఫ్యామిలీతో గడిపపే టైమ్ నుంచి కొంత అడిగి తీసుకోవచ్చని బిగ్బాస్ ఆఫర్ ఇస్తాడు. దీంతో ఇమ్మానుయేల్ తన 45 నిమిషాల ఫ్యామిలీ టైమ్ నుంచి 15 నిమిషాలు త్యాగం చేశాడు. కల్యాణ్ కూడా తన 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడితే.. సంజనా తన నుంచి ఒక్క నిమిషం మాత్రమే తీసుకుంది. అలా ఫైనల్గా సంజనా తన భర్తతో పాటు పిల్లలను కలుసుకుంది.తనూజ నా పెద్ద కూతురు: దివ్య అమ్మదివ్య మదర్ శ్రీలక్ష్మీ అదరగొట్టేశారు. అందరికంటే ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించారు. హౌస్లోకి అడుగుపెట్టిన సమయం నుంచి అందరినీ తెగ నవ్వించారు. దివ్య కంటే ఇతర హస్మేట్స్తోనే ఆమె ఎక్కువగా మాట్లాడుతూ మెప్పించారు. దివ్య తల్లి మాటలకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. దివ్య తన అమ్మతో ఉన్న అనుబంధాన్ని చాలా రియలిస్టిక్గా చూపించింది. దివ్య చిన్నతనంలో చేసిన అల్లరి విశేషాలను వారితో సరదాగా పంచుకుంది. భరణి తనకు సొంత అన్నయ్య మాదిరి కనిపిస్తారని చెప్పింది. ఆపై తనూజ తనకు పెద్ద కూతరులాంటిదని హగ్ చేసుకుంది. ప్రతి ఇంట్లో పెద్ద కూతురులా తనూజ కనిపిస్తుందని మెచ్చుకుంది. తనూజ మాదిరే మా పెద్ద అమ్మాయి కూడా ఉంటుందని చెప్పింది. ఇక డిమాన్ పవన్-రీతూ రిలేషన్ గురించి మాట్లాడుతూ పంచ్లు వేసింది. ఈ ఎపిసోడ్ మొత్తం దివ్య మదర్ క్రాక్ చేసి రచ్చలేపిందని చెప్పాలి. దివ్య కంటే మరింత స్పోర్టివ్గా ఆమె ఉండటం విశేషం -
బిగ్బాస్ ఫ్యామిలీ వీక్: తనూజతో తగ్గించండి.. సుమన్కి భార్య సలహా
బిగ్బాస్ షోలో మిగతా అన్ని వారాలు ఎలా ఉన్నాసరే ఫ్యామిలీ వీక్ అంటే మాత్రం అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ వారమంతా అందరూ ఒక్కటైపోతారు. ఈసారి కూడా ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అంతకంటే ముందు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. దివ్య, పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయ్యారు. రీతూ కూడా అయ్యింది కానీ కెప్టెన్ తనూజ వల్ల ఆమె సేవ్ అయిపోయింది.ఈసారి ఫ్యామిలీ వీక్ నేరుగా మొదలుపెట్టేయకుండా బిగ్బాస్.. చిక్కుముడి అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓ ఫ్రేమ్కి గజిబిజిగా కట్టున్న తాడుని విప్పి, ఒంటికి చుట్టుకుని.. చివరలో దాన్ని విప్పి మాగ్నెటిక్ బోర్డులో ఉన్న టైమ్ కార్డ్ని తీసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాంబ్ ఉన్న కారణంగా సంజనకు ఈసారి ఛాన్స్ లేదు. దీంతో ఆమెని ఈ టాస్క్ కోసం సంచాలక్గా పెట్టారు. కెప్టెన్ కావడంతో తనూజకు నేరుగా టైమ్ తీసుకునే ఛాన్స్ బిగ్బాస్ ఇవ్వడంతో 60 నిమిషాల టైమ్ కార్డ్ తీసుకుంది. తర్వాత పోటీ జరిగింది. ఇమ్మాన్యుయేల్ 45, పవన్ 30, కల్యాణ్ 20, దివ్య 20, సుమన్ 15, రీతూ 15, భరణి 15 నిమిషాల కార్డ్స్ తీసుకున్నారు.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్గా ఖరీదైన రోల్స్ రాయిస్)తొలుత సుమన్ శెట్టికి అవకాశమొచ్చింది. 16వ పెళ్లిరోజు అని చెప్పి భార్య లాస్య నుంచి లెటర్ వచ్చింది. అలానే ఓ స్పెషల్ కోట్ కూడా వచ్చింది. దీంతో సుమన్ రెడీ కాగానే.. భార్య లాస్య లోపలికి వచ్చింది. చాలారోజుల తర్వాత కలిసేసరికి సుమన్, భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేశాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత చివరలో లాస్య.. 'టాప్-5లో ఉండాలి. గెలిస్తే ఇంకా హ్యాపీ. తనూజతో తగ్గించండి. హైప్లో ఉండేవాళ్లని దగ్గర చేసుకుంటుంది. ఏడవద్దు' అని చెప్పి వెళ్లిపోయింది.సుమన్ భార్య వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తనూజ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చెల్లితో పాటు అక్క కూతురు శ్రేష్ఠ హౌస్లోకి వచ్చింది. చెల్లి పూజ లోపలికి రాగానే.. పెళ్లి కూతురు పూజ అని చెబుతూ హౌస్మేట్స్ అందరికీ తనూజ తన చెల్లిని పరిచయం చేసింది. తనే చెల్లి, కానీ నాకు అమ్మ లాంటిది అని కూడా అందరితో చెప్పింది. ఇద్దరూ సెపరేట్గా వెళ్లి మాట్లాడుకున్నారు. 'ఎక్కువగా బాధపడకు, ఏడవుకు. అను, అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. నా పెళ్లికి కొన్నిరోజులే ఉంది. నువ్వు గేమ్ ఆడేదంతా ఫెర్ఫెక్ట్గా ఉంది. నువ్వే చేస్తావో నాకు తెలీదు నువ్వే గెలవాలి. నా పెళ్లికి బిగ్బాస్ టైటిల్ కావాలి' అని పూజ, తనూజకి మంచి బూస్టప్ ఇచ్చింది. చివరికు పూజని పెళ్లి కూతురిని చేసి, ఆమెని హౌస్ నుంచి పంపించారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'రాధేశ్యామ్' దర్శకుడి ఇంట్లో విషాదం) -
భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి
బిగ్బాస్ షోలో ఫ్యామిలీ వీక్ కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఎంత గొడపడ్డా సరే 'ఫ్యామిలీ వీక్' వచ్చేసరికి హౌస్మేట్స్ అందరూ ఒక్కటవుతారు. చూస్తున్నంతసేపు నిజమైన ఎమోషన్స్ బయటకొస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సీజన్లోనూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. ఈసారి 9వ సీజన్లో మొదలైపోయింది. ఇప్పటికే తనూజ కుటుంబ సభ్యులు రాగా.. సుమన్ శెట్టి భార్య కూడా హౌస్లోకి వచ్చింది. ఈ ప్రోమో చాలా బాగుంది.తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్బాస్.. మీరు పొందిన టైమ్ కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యునితో 20 నిమిషాలు మాత్రమే గడపగలరు అని చెప్పారు. మరీ ఇంత తక్కువ సమయమేనా అని సుమన్ బాధపడ్డాడు గానీ గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బుగ్గపై ముద్దుపెట్టి మరీ ఎలా ఉన్నావ్ అని క్యూట్గా అడిగాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ')అలానే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ చాలా బెంగపడుతూ భార్యని అడిగాడు. బాగానే ఉన్నారని చెప్పడంతో.. గౌతమ్ రాలేదేమీ అంటూ తన బిడ్డ గురించి సుమన్ అడిగాడు. ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఊరుకున్నాడు. బాగా ఆడుతున్నానా అని తన ఆట గురించి భార్యని స్వీటుగా అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అని చెప్పిన సుమన్ భార్య.. నీకు ఇష్టమని ఫుడ్ తెచ్చానని చెప్పింది. ఇది ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.నువ్వు తిను, నువ్వు తిను అంటూ సుమన్, అతడి భార్య ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకున్నారు. ఇది అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇద్దరూ కలిసి చిన్న స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేశారు. అదే టైంలో మిగిలిన హౌస్మేట్స్ కూడా వీళ్లని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా గంతులేశారు. ప్రోమోనే ఇంత బాగుందంటే.. ఎపిసోడ్ ఇంకెంత బాగుండబోతుందో?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా) -
బిగ్బాస్లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ'
బిగ్బాస్ 9 తెలుగులో ఈ వారం మొత్తం సందడిగా కనిపించనుంది. కంటెస్టెంట్స్కు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎమోషన్స్తో పాటు సంతోష క్షణాలు కనిపిస్తాయి. సుమారు 70రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తుండటంతో అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఫ్యామిలీ వీక్లో భాగంగా ఫస్ట్ ఎంట్రీ తనూజ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ క్రమంలో బిగ్బాస్ టీమ్ ప్రోమో వదిలింది.తనూజ చెల్లి పూజ బిగ్బాస్లోకి వచ్చింది. తనను చూడగానే ఒక్కసారిగా తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిరోజుల్లోనే తన పెళ్లి ఉందంటూ పూజను అందరికీ పరిచయం చేస్తుంది. తనూజ బిగ్బాస్లో ఉండటం వల్ల పెళ్లికి వెళ్లడం కుదరదు. దీంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది. హౌస్లోనే పసుపు, కుంకుమతో పాటు బొట్టు పెట్టి ఆపై కొన్ని గాజులు, బట్టలు తన చెల్లి ఒడిలో పెడుతుంది. అక్కగా ఆశీర్వదించగా పూజ కూడా తనూజ కాళ్లకు నమష్కారం చేస్తుంది. తనూజ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. అక్క అనూజ లాయర్ కాగా.. చెల్లి పూజ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనూజకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె కూతురు కూడా బిగ్బాస్లోకి వెళ్లింది. -
రీతూతో కల్యాణ్.. రెచ్చిపోయిన పవన్
బిగ్బాస్ తెలుగు 9లో సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డెమాన్ పవన్, రీతూల మధ్య జరిగిన గొడవ ప్రధానంగా నిలిచింది. ఆపై సుమన్ శెట్టి, డెమాన్ పవన్లు ఇద్దరూ కల్యాణ్పై మాటల తూటాలు పేల్చారు. అయితే, ఈ వారం నామినేషన్స్లో ఒక్కోక్కరికి కల్యాణ్ అంతే రేంజ్లో తరిగిచ్చిపడేశాడు. కప్టెన్గా ఉన్న తనూజ నామినేషన్స్ విషయంలో ఫుల్ స్ట్రాటజీతో తన అభిమానులను మెప్పించింది.రీతూను కాపాడిన తనూజఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చేతిలో బిగ్బాస్ పెట్టాడు. ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది తనూజకే ఆప్షన్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ముద్రపడిన భరణి, ఇమ్మాన్యుయేల్కు షాకిచ్చింది. ఇద్దరిని నామినేషన్ చేయమని ఆమె కోరింది. కానీ, కల్యాణ్, సుమన్లకు మాత్రం సింపుల్గా ఒక్కరిని మాత్రమే నామినేషన్ చేయమని సూచిస్తుంది. ఫైనల్గా నామినేషన్లోకి 'దివ్య, రీతూ, డెమాన్ పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్'లు వస్తారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరినైనా ఒక్కరిని సేవ్ చేయమని కెప్టెన్ తనూజను బిగ్బాస్ కోరుతాడు. దీంతో రీతూను సేవ్ చేస్తున్నట్లు తనూజ చెబుతుంది. అలా ఈ వారం నామినేషన్ నుంచి రీతూ బయటపడింది.డెమాన్లో మార్పు రాకుంటే ఇంటికేఎపిసోడ్ ప్రారంభం కాగానే డెమాన్ పవన్,రీతూ ఒకే బెడ్పై ఒకే బెడ్ షీట్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైమ్లో వారి మద్యలోకి కల్యాణ్ రావడంతో డెమాన్ పవన్ ఫీల్ కావడమే కాకుండా లేచి వెళ్లిపోతాడు. మరుసటిరోజు పొద్దున్నే రీతూని కూర్చోబెట్టి క్లాస్ పీకుతాడు. మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు (కల్యాణ్) వచ్చాడు. అప్పుడు వాడ్ని పంపించేయొచ్చు కదా అంటూ రీతూపై ఫైర్ అవుతాడు. అలా రావద్దని కల్యాణ్కు ఎలా చెబుతాను రా అంటూ పవన్ను తిరిగి ప్రశ్నిస్తుంది. ప్రతి చిన్నవిషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్నావ్ ఏంట్రా అంటూ గట్టిగానే రీతూ నిలదీస్తుంది. దాంతో పవన్ ఇంకా దిగజారిపోయేలా తిరిగి కౌంటర్ ఇస్తాడు. అలా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నువ్వు నాకు వద్దుని రీతూపై మండిపడతాడు. ఇలాంటి చెత్త కారణాలు చూపుతూ ఫైనల్గా రీతూను పవన్ నామినేట్ చేయడం మరీ దారుణంగా అనిపిస్తుంది. ఇక్కడ రీతూ చాలా హుందాగా పవన్తో వ్యవహరించింది. కానీ, పవన్ ఈ ఎపిసోడ్తో చాలా డ్యామేజ్ చేసుకున్నాడు. ఈ వారం ఫ్యామిలీ వీక్లో భాగంగా పవన్ మదర్ వెళ్తున్నారట. ఆమె ఏమైనా సలహాలు ఇచ్చిన తర్వాత తన గేమ్ను మార్చుకునే ఛాన్స్ ఉంది. ఈ గొడవతో రీతూ, పవన్లలో ఒక్కరు మాత్రమే టాప్-5కు చేరుకుంటారని తెలుస్తోంది.కల్యాణ్ అదరగొట్టేశాడుఈ వారంలో కల్యాణ్ను సుమన్, పవన్, సంజనా నామినేట్ చేశారు. అయితే, పూర్తిగా కల్యాణ్ పైచేయి సాధించాడు. ముగ్గురికి సరైన కౌంటర్స్తో ఇచ్చిపడేశాడు. మొదట డెమాన్ పవన్ రంగంలోకి దిగి కల్యాణ్ను నామినేట్ చేస్తూ.. పాత విషయాలను తీసుకొస్తాడు. గతంలో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి పిచ్చిపిచ్చి స్టేట్మెంట్స్తో కల్యాణ్పై మాటలు తూలుతాడు. నమ్మకం గురించి కొన్ని విషయాలను గుర్తూ చేస్తూ కల్యాణ్ను తప్పుబట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ, కల్యాణ్ ఎప్పుడు కూడా పవన్ విషయంలో మోసం చేయలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో పవన్ చేతిలోనే కల్యాణ్ మోసపోయాడు. రీతూ కోసం అతన్ని ఆట నుంచే తప్పించేశాడు. ఇలా కొన్ని చెత్త రీజన్లతో పవన్కు బాగా మైనస్ అయిపోయింది. సుమన్ ఫైర్టవర్ టాస్క్లో వరస్ట్ సంచాలక్ అంటూ కల్యాణ్ను నామినేట్ చేస్తున్నట్లు సుమన్ చెప్తాడు. టవర్ స్ట్రైట్గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ ఫైర్ అవుతాడు. అయితే, వీకెండ్లో నాగార్జున చూపించిన వీడియోతో తేలిపోయింది. నిజమైన విన్నర్ సంజనానే అని ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇదే విషయాన్ని కల్యాణ్ కూడా చాలా బిగ్గరగానే వినూ.. వినూ.. అంటూ వేలు చూపిస్తూ సుమన్ శెట్టి మీదికి వెళ్లాడు. దాంతో సుమన్ శెట్టి రిటర్న్గా వేలు దించూ కల్యాణ్ అంటూ ఊగిపోతాడు. ఆ తర్వాత కల్యాణ్ వేలు నీ వైపు చూపించడం లేదన్నా అంటూ చెప్పడంతో వాగ్వాదం ముగిసింది. ఇక సంజన కూడా సిల్లీ రీజన్తోనే కల్యాణ్ను నామినేట్ చేసింది. ఆ టాపిక్ గురించి చెప్పుకోవడం టైమ్ దండగ.. మొత్తానికి ఈ వారం నామినేషన్లో కల్యాణ్ దమ్మున్న పాయింట్లతో తిరిగి కౌంటర్ ఇచ్చాడు. -
నన్ను తొక్కుతూనే ఉన్నావ్.. రీతూ ఫ్రస్టేషన్
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఫైర్ స్ట్రామ్స్ అంటూ వచ్చిన ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరికంటే ముందు వైల్డ్కార్డ్గా వచ్చిన దివ్య మాత్రం ఎలాగోలా నెట్టుకొస్తోంది. కానీ, ఈవారం ఆమెకు కష్టకాలంలాగే కనిపిస్తోంది. నేడు హౌస్లో నామినేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు రెండో ప్రోమో వదిలారు.అన్నీ రివేంజ్ నామినేషన్స్ఇందులో భరణి.. తాను బాగా ఆడలేదన్న ఇమ్మాన్యుయేల్ను నామినేట్ చేశాడు. టెడ్డీ బేర్ టాస్క్లో ప్రతి రౌండ్లో నువ్వు నాకంటే వెనకే ఉన్నావ్.. అని గుర్తు చేశాడు. కల్యాణ్ కూడా అదే పని చేశాడు. తనను నామినేట్ చేసిన పవన్ (Demon Pavan)ను తిరిగి నామినేట్ చేశాడు. ఇక రీతూ.. దివ్యను నామినేట్ చేసింది. నేను ఈ గేమ్లో గెల్చాను. నేను ఇందులో సూపర్.. అందులో సూపర్.. కానీ ఆమె ఏ గేమ్లో గెల్చింది? అంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అంది. రీతూ వర్సెస్ దివ్యనీకంటే నేను ఎందుకు బెటరో చెప్తాను.. నీకు టాస్క్ అర్థమే కాదు. అలాంటిది నువ్వు గేమ్స్ గురించి మాట్లాడుతున్నావా? అని దివ్య ఇచ్చిపడేసింది. తర్వాత దివ్య రీతూని నామినేట్ చేసింది. ఈక్రమంలో 'ఇంకా ఎంతకాలం నన్ను తొక్కుతావ్?' అని రీతూ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ వారం సంజన, దివ్య, పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి నామినేషన్స్లో ఉన్నారు. డేంజర్ జోన్లో దివ్యవీరిలో కల్యాణ్, ఇమ్మూలకు ఓట్లు భారీగా పడతాయి. అందులో డౌటే లేదు. పవన్, భరణి, సంజనకి కూడా ఈ మధ్యకాలంలో నెగెటివిటీ లేదు కాబట్టి కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు. గత రెండు వారాలుగా దివ్య ఎక్కువ నెగెటివ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారకపోతే తను వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ కోసం సంజనాను ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ వారం ఆ అవసరం తీరిందని ఆమెను పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చదవండి: పుష్పను కాపీ కొట్టలేదు: మలయాళం హీరో -
రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో రెండు ఊహించనివి జరగబోతున్నాయి. పదివారాలుగా నామినేషన్స్లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయేల్.. ఎట్టకేలకు పదకొండోవారం నామినేషన్స్లోకి వచ్చేశాడు. ఇక ఫ్రెండ్స్కు ఎక్కువ, ప్రేమికులకు తక్కువ అన్నట్లుగా ఉండే పవన్-రీతూల మధ్య పెద్ద అగాధం ఏర్పడనుంది. కారణం.. పవన్ రీతూని నామినేట్ చేశాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.నీకు కాన్ఫిడెన్స్ లేదురీతూ.. గేమ్లో వెనకబడిపోయింది. తనకు కాన్ఫిడెంట్ లేదు అని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు. కాన్ఫిడెన్స్ లేనిది నీకంటూ తిరిగి వాదించింది రీతూ. ఇమ్మూ.. భరణి ఆటలో పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టడం లేదన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకుముందులా ఆడలగలవా? పర్ఫామెన్స్ అంటే కేవలం టాస్కులే కాదు. ప్రతి టాస్క్ నాకు సాధ్యమైనంతవరకు ఆడుతున్నా అని వివరణ ఇచ్చాడు.ఏడిపించేసిన పవన్ఇక పవన్ (Demon Pavan).. రీతూని నామినేట్ చేశాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుంది. అది బాధగా ఉంది. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, నాపై నమ్మకం లేదంటూ హర్ట్ చేశావ్. ప్రతిసారి నీ మంచే కోరుకున్నా.. అంటూ కన్నీళ్లు దిగమింగుతూ పాయింట్లు చెప్పాడు.మౌనంగా రీతూతనకు ఎదురొచ్చే ఎవరి నోరైనా మూయించే రీతూ (Rithu Chowdary).. ఈసారి మాత్రం మూగబోయింది. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్ తనను నామినేట్ చేస్తుంటే తట్టుకోలేక కన్నీళ్ల రూపంలో తన బాధను వ్యక్తపరిచింది. నామినేషన్స్ అయ్యాక నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా.. అని రెండు చేతులతో తల బాదుకుంది. ఎందుకరుస్తున్నావని పవన్ అడిగితే నా వల్ల కావడం లేదంది. నామినేషన్స్లో ఆరుగురుఅందుకు పవన్ కూడా.. నావల్ల కూడా కావడం లేదని అరిచి వెళ్లిపోయాడు. మొత్తానికి ప్రోమో అయితే రీతూ-పవన్ ఫ్యాన్స్ను హర్ట్ చేసేలాగే ఉంది. ఇకపోతే సంజన, రీతూ, దివ్య, డిమాన్, కల్యాణ్, ఇమ్మూ, భరణి నామినేషన్స్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తనూజ కెప్టెన్సీ పవర్తో రీతూని సేవ్ చేసినట్లు భోగట్టా! చదవండి: నన్ను బ్యాడ్ చేయొద్దు.. ఇమ్మూపై గరమైన తనూజ -
సంజన కోసం రీతూ త్యాగం.. ఇలాగైతే తనూజ గెలవడం కష్టమే!
వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...ఇమ్మూతో గొడవనీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్గా ఫీలవుతా.. అది నా వీక్నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు. నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకుమూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది. తనూజకు నాగ్ సలహాసారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు. రీతూ గెలిస్తేనే ఆఫర్ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.గౌరవ్ ఎలిమినేట్కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.చదవండి: గౌరవ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే? -
బిగ్బాస్ నుంచి 'గౌరవ్' ఎలిమినేట్.. రెమ్యునరేషన్ కూడా తక్కువే
బిగ్బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా గౌరవ్ హౌస్ నుంచి వచ్చేశాడు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్లో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా వైల్డ్కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ కావడం విశేషం. ఈ వారంలో 10 మంది నామినేషన్స్లో ఉండటంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఎలిమినేషన్ రౌండ్లో చివరి వరకు దివ్య, గౌరవ్ ఉంటే ఫైనల్గా తక్కువ ఓట్లు తెచ్చుకున్న గౌరవ్ హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, తన రెమ్యునరేషన్ కూడా ఇతర కంటెస్టెంట్స్తో పోలిస్తే కాస్త తక్కువేనని తెలుస్తోంది.అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్గా హౌస్లోకి గౌరవ్ ఎంట్రీ వచ్చాడు. అయితే, అతడికి వారానికి రూ. 1.5 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.7.5 లక్షల మేరకు సంపాదించాడు. ప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ గౌరవ్ నటిస్తున్నాడు. అతనితో పాటు ఎలిమినేట్ అయిన నిఖిల్ ఐదువారాలకు రూ. 12 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్ల తెలుస్తోంది.తనూజ సేవింగ్ పవర్ఆదివారం ఎపిసోడ్లో భాగంగా ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్న దివ్య-గౌరవ్ ఇద్దరూ చివరి వరకు మిగిలారు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్ను ఉపయోగిస్తావా అని నాగార్జున అడుగుతూ అది ఈ వారంతో ఎక్స్పెయిర్ అవుతుందని గుర్తుచేస్తారు. ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అవుతుందని క్లారిటీ ఇస్తారు. అప్పుడు మాత్రమే గౌరవ్ సేఫ్ అవుతాడని కండీషన్ పెడుతారు. దీంతో తనూజ కొంత సమయం ఆలోచించి ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ను గౌరవిస్తున్నానంటూ తన వద్ద ఉన్న సేవింగ్ పవర్ను వాడటం లేదని చెప్పడంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అలా దివ్య కూడా సేఫ్ అయిపోయింది. -
దివ్యకు తక్కువ ఓట్లు.. ఆ రెండు కారణాల వల్లే!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో పది మంది మిగిలారు. వారిలో నుంచి ఒకరు (గౌరవ్) ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ కానున్నారు. అంటే తొమ్మిది మంది మిగలనున్నారు. వచ్చేవారం వీరందరి కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వారం డేంజర్ జోన్లో నిఖిల్, గౌరవ్తో పాటు దివ్య కూడా ఉంది. తాజా ప్రోమోలోనూ అదే చూపించారు.ఆ రెండింటి వల్లే..నిఖిల్ను నిన్ననే పంపించేయగా నేడు గౌరవ్, దివ్య (Divya Nikhita)ను నిల్చోబెట్టారు. వీరిలో ఒకరే ఎలిమినేట్ అని నాగ్ ప్రకటించాడు. షూటింగ్ ఆల్రెడీ ముగియడంతో వెళ్లిపోయేది గౌరవ్ అని అందరికీ తెలిసిపోయింది. అయితే వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్యకు ఓట్లు తక్కువ పడి డేంజర్ జోన్లో ఉండటానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణిపై పెత్తనం చెలాయించడం.ఆ గేమ్ కొంప ముంచిందిగత వారం కెప్టెన్సీ గేమ్లో తనూజను తీసేయనని మాటిచ్చి ఆమెను సైడ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాగార్జున ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇక భరణి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఆర్డర్లేస్తోంది. అతడు చేసింది ఏదైనా నచ్చకపోతే చాలు ఒకటే నస పెడుతోంది. ఎపిసోడ్లో ఆ సీన్లు కొన్ని ఎత్తేస్తున్నారు కానీ లైవ్ చూసేవాళ్లకు మాత్రం పిచ్చెక్కిపోతోంది.తనూజపై కుళ్లు?ఈ బంధాల్లో చిక్కుకుని బలైపోయిన భరణి.. తనూజ, దివ్యకు దూరంగా ఉండాలనుకున్నాడు. తనూజ దూరంగానే మెదులుతోంది, కానీ దివ్య మాత్రం ఫెవికాల్లా అతుక్కుపోయింది. పైగా ఈ వారం తనూజ కెప్టెన్ అయినప్పుడు భరణి సంతోషంతో ఆమెను ఎత్తుకున్నాడు. అది కూడా చూసి సహించలేకపోయింది దివ్య. నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు? అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆమె సరదాగా అన్నా, సీరియస్గా అన్నా తనకు తనూజ అంటే ఈర్ష్య అని జనాలు బలంగా నమ్మారు.గండంబీబీ రాజ్యంలో కొన్ని సీక్రెట్ టాస్క్లు చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా సుమన్కే పోయింది. అయినదానికి, కానిదానికి నోరేసుకుని పడిపోవడం కూడా తనకు మైనస్ అయింది. తన తీరు మార్చుకోకపోతే, మంచి ఎపిసోడ్ పడకపోతే మాత్రం వచ్చేవారం దివ్య ఎలిమినేట్ అవడం ఖాయం. మరి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి! చదవండి: రీతూని రైడ్కు తీసుకెళ్తానన్న చైతన్య -
చైతో బైక్ రైడ్ ఆఫర్.. ఇంట్లో నుంచి వచ్చేస్తానన్న రీతూ
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య (Naga Chaitanya) వచ్చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో చై ఫుల్ ఎనర్జీతో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నాకు యాక్టింగ్తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ ప్రారంభించారు. మెలికలు తిరిగిన రీతూఅందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ఓనర్ని నేనే.. అని చై చెప్పడంతో నాగ్ (Nagarjuna Akkineni) సర్ప్రైజ్ అయ్యాడు. నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్? అని అడిగాడు. చైని చూడగానే రీతూ మెలికలు తిరిగిపోయింది. మీరంటే పిచ్చి, ఒక శిల్పాన్ని చెక్కినట్లే ఉంటారు అని చెప్పింది. దీంతో నాగ్ రీతూకి ఓ బంపరాఫర్ ఇచ్చాడు. చైతూకి బైక్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు హౌస్లో నుంచి బయటకు వస్తే చై నిన్ను బైక్ రైడ్కు తీసుకెళ్తాడు అని చెప్పాడు. రైడ్కు తీసుకెళ్తా..అంతే, రీతూ (Rithu Chowdary) ఎగిరి గంతేస్తూ సంతోషంగా బయటకు వచ్చేస్తానంది. అది చూసి ఆశ్చర్యపోయిన చై.. బిగ్బాస్ షో ఎందుకు వదులుకుంటావ్? గెలిచిన తర్వాత కూడా నిన్ను రైడ్కు తీసుకెళ్లొచ్చు అన్నాడు. అందుకు రీతూ.. మిమ్మల్ని జోష్ నుంచి గెల్చుకుందామనుకుంటున్నా అని అమాయకంగా ముఖం పెట్టింది. అది చూసి తండ్రీకొడుకులిద్దరూ ఏం మాట్లాడలేక నవ్వుకున్నారు. చదవండి: చిరంజీవితో సినిమా షూటింగ్.. నన్ను నేను థూ అని.. -
నేను చచ్చిపోతా.. నన్ను పంపించేయండి.. వెక్కెక్కి ఏడ్చిన సంజనా
Bigg Boss Telugu 9: ఫైర్ స్ట్రామ్స్ అంటూ ఆరుగారు వైల్డ్కార్డ్స్ను హౌస్లోకి తెచ్చారు. వచ్చినవాళ్లందరూ వరుసగా ఎలిమినేషన్ బండెక్కి ఇంటికి వెళ్లిపోయారు. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ ఎలిమినేట్ అవగా ఈరోజు గౌరవ్ను పంపించేయనున్నారు. దీంతో ఫైర్ స్ట్రామ్ కాస్తా ఫెయిల్ స్ట్రామ్గా మిగిలిపోయింది. మరి శనివారం (నవంబర్ 15వ) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చూసేద్దాం..పవన్కు క్లీన్ చిట్బీబీ రాజ్యం అనే గేమ్లో రాణి దివ్య ఆదేశాల మేరకు పవన్.. తనూజను కాస్త తోసినట్లు చేశాడు. ఆమాత్రం దానికే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ పెద్ద నింద వేసింది. ఊరుకుంటే ఎత్తుకునేవాడివేమో అంటూ నానామాటలంది. దానిపై నాగ్ కాస్త సున్నితంగానే తనూజకు క్లాస్ పీకాడు. ఇక్కడ ఆడ,మగ తేడా లేదు. రాణి ఆదేశాలను పవన్ పాటించాడు తప్ప అతడు ఏ తప్పూ చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చాడు.సంజనాపై బిగ్ బాంబ్ఇక హౌస్లో రెండు బిగ్బాంబ్స్ వేశాడు నాగ్. ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా రెండోది చెప్పేముందు ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో మీకు సపోర్ట్గా ఉన్నదెవరు? మీ ఆటను ముంచుతోందెవరు? అనేది చెప్పాలన్నాడు. మెజారిటీ ఇంటిసభ్యులు సంజనా (Sanjana Galrani) వల్లే ఆట చెడిపోతుంది అని అభిప్రాయపడ్డారు. దాంతో రెండో బిగ్ బాంబ్ సంజన మీద పడుతుందని నాగ్ అన్నాడు. తీరా ఆ బాంబ్లో ఉన్నది మరేంటో కాదు, నో ఫ్యామిలీ వీక్.గుక్కపెట్టి ఏడ్చిన సంజనాఇప్పటికే చంటిపిల్లలకు దూరంగా ఉన్న సంజనా.. రాత్రిళ్లు దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నా రోజంతా మాత్రం చలాకీగానే ఉంటోంది. ఫ్యామిలీ వీక్లో పిల్లలు వస్తారన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటిది తన కోసం ఎవరూ రారని అనడంతో గుక్కపెట్టి ఏడ్చింది. నేను ఇంటికెళ్లిపోతాను సర్.. నా వల్లకాదు, నేను చచ్చిపోతా.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను. ఇంక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేను అంటూ వెక్కెక్కి ఏడ్చింది.నన్ను ఇంటికి పంపించేయండి సార్ఇంట్లో మెజారిటీ హౌస్మేట్స్ నీవల్లే వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరేవాళ్ల పేరు వచ్చుంటే ఆ బాంబ్ ఇంకొకరిపై పడేది. ఇది బిగ్బాస్ నిర్ణయం అన్నాడు నాగ్. ఇంతలో కల్యాణ్, భరణి.. సంజనా కోసం తమ ఫ్యామిలీ వీక్ త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందుకు నాగ్ ఒప్పుకోలేదు. బాధను భరించలేకపోయిన సంజనా.. నన్ను ఇంటికి పంపించేయండి సార్, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు అని బతిమాలుకుంది. అప్పటికీ నాగ్ మనసు కరగలేదు. నిఖిల్ ఎలిమినేట్అయితే నిజంగా ఫ్యామిలీ వీక్ లేకుండా పోయే ఛాన్సే లేదు. గతంలో కూడా తేజకు ఫ్యామిలీ వీక్ లేదన్నారు. కట్ చేస్తే చివర్లో అతడి తల్లిని పంపారు. ఇప్పుడు కూడా అలాగే చివర్లో సంజనా ఫ్యామిలీని పంపించి మరింత ఎమోషన్స్ రాబట్టి టీఆర్పీ దండుకునే ప్లాన్ చేస్తున్నారు. ఎపిసోడ్ చివర్లో నిఖిల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. వారమంతా బాగానే కష్టపడ్డా సరే, ఇలా ఎలిమినేట్ చేశారేంటని నిఖిల్ షాక్ అయ్యాడు. అయినా చేసేదేం లేక సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు.చదవండి: బిగ్బాస్ 9.. నిఖిల్ పారితోషికం ఎంతో తెలుసా? -
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చారు. వాస్తవంగా ఆదివారం ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ, ఈసారి కంటెస్టెంట్స్కు షాకిస్తూ శనివారం ఎపిసోడ్లోనే ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఆపై ఆదివారం ఎపిసోడ్లో మరోకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ వారంలో 10 మంది నామినేషన్స్లో ఉండటంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఫైనల్గా తక్కువ ఓట్లు తెచ్చుకుని నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది.అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్గా హౌస్లో నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. అయితే, అతడికి వారానికి రూ.2.5 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.12.5 లక్షల మేరకు సంపాదించాడు. అతనికి తెలుగు బుల్లితెరపై మంచి ఫేమ్ ఉండటంతో రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు. గృహలక్ష్మి సీరియల్లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు.నిఖిల్ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి రాగానే నాగార్జున ప్రశంసించారు. చాలా బాగా ఆడావ్ అంటూ అతని ఆట తీరును ప్రశంసించారు. హౌస్మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే చెప్పాలని నాగ్ కోరడంతో నిఖిల్ ఇలా చెప్పాడు. తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ తనకు నచ్చవని సింపుల్గా చెప్పేశాడు. -
కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్లో కెప్టెన్ అవడం విశేషం! మరి తర్వాత హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 14వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నన్నెందుకు ఎత్తుకోలేదు?తనూజ కెప్టెన్ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్మేట్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్బాస్. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.చస్తా.. ఏడుస్తా..నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్.. ఏడుపు ఆపేయ్ అనడం తప్పా? అని కల్యాణ్ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్ పార్ట్.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్ నన్ను అని చిరాకుపడింది.గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్తర్వాత కల్యాణ్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్ క్లాస్లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఏడిపించేసిన ఇమ్మూకానీ నెలకోసారి మాత్రమే ఫోన్ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. నా జీవితంలో సూపర్ హీరోచిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. అంతా అమ్మ వల్లే..తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. రౌడీగా దివ్యతర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్ పవన్.. చెస్ ఛాంపియన్గా మెడల్ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్ అవుతానంది. సుమన్కు చైల్డ్హుడ్ ఫోటో అందింది. కానీ గౌరవ్, సంజనా, భరణి, నిఖిల్ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్ ఇదే! -
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్మేట్స్కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్.లవ్యూ అమ్మా: తనూజవాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్లో బెస్ట్ సూపర్ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.తినడానికి తిండి లేక మట్టిఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్ కోసం వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కల్యాణ్ను ఓడించి.. ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా -
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
బిగ్బాస్ తెలుగు 9 సీజన్లో తనూజ విన్నర్ అవుతుందని చాలామంది చెబుతున్న మాట.. అయితే, అదంతా పీఆర్ టీమ్ మాయా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బిగ్బాస్ కోసం దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ పీఆర్ను పెట్టుకుంటారు. అలా అని కేవలం వారి మీదనే ఆదారపడితే కుదరదు. హౌస్లో కంటెస్టెంట్ సరైన కంటెంట్ ఇవ్వకుంటే ఎంతమంది పీఆర్ టీమ్లో ఉన్న సరే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే.తనూజ కోసం రూ. 100 కోట్లుబిగ్బాస్లో పది వారాలుగా తనూజ టాప్లో ఉంది. సోషల్మీడియా సర్వేలలో చాలామటుకు ఆమె విన్నర్ అంటూ ఓట్లు పడుతున్నాయి. కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, కొందరు తనూజను టార్గెట్ చేస్తూ పీఆర్ టీమ్ సాయంతో నెట్టుకొస్తుందని అంటుంటే... మరికొందరు మాత్రం తనకు బిగ్బాస్ టీమ్ సపోర్ట్ ఉందని అంటున్నారు. దాదాపు ఇందులో నిజం ఉండదనే వాదన షో గురించి తెలిసిన వారు చెబుతున్నమాట. ఆమెకు కప్ ఇచ్చేందుకు బిగ్బాస్ టీమ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందా..? ఒకరి కోసం తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటుందా ..? ఒకవేళ తనూజకు సాయం చేయాలనుకుంటే మరో పది సీరియల్స్లలో అవకాశాలు కల్పిస్తారు. అంతే గానీ ఇలా కోట్లలో ఖర్చు పెట్టి ఆమెకు కప్ ఎందుకు ఇస్తారని వాదించేవారు కూడా ఉన్నారు.తనూజ ఓట్ల సీక్రెట్ ఇదేఅన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీరియల్ 'ముద్దమందారం..' 2014 నుంచి 2019 వరకు జీతెలుగులో ఈ సీరియల్ ప్రసారమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా 1580 ఎపిసోడ్లతో బుల్లితెర హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో పల్లెటూరి పేదింటి అమ్మాయి పాత్రలో తనూజ అదరగొట్టింది. ఈ సీరియల్ చూసిన ప్రతిఒక్కరు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా హిట్ అయింది. సీరియల్స్ ఎక్కువగా గృహిణిలే ఫాలో అవుతుంటారు. దీంతో బిగ్బాస్లో ఆమెకు వారి నుంచే మద్ధతు లభించింది. ఆపై చాలా గ్యాప్ తర్వాత బిగ్బాస్ వల్ల తనూజ మళ్లీ కనిపించడంతో మొదటి ఎపిసోడ్ నుంచే ఆమెకు భారీగా ఓట్లు పడటం జరుగుతుంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి. కేవలం పీఆర్ వల్ల మాత్రమే ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.. ముఖ్యంగా ఈ సీజన్లో బలమైన కంటెస్ట్ట్స్ లేకపోవడం ఆపై చాలా పవర్ఫుల్ అనుకున్న భరణి ఆట పేలవంగా ఉండటంతో తనూజకు బాగా కలిసొచ్చింది. ఇమ్మాన్యుయేల్ సత్తా చాటుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. దీంతో తనకూ ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది. ఆపై ప్రేక్షకులను మెప్పిస్తుంది కల్యాణ్ మాత్రమే.. కానీ, అతను కూడా తనూజతో బాగా క్లోజ్గా ఉండటం వల్ల విన్నర్ అయ్యేంత రేంజ్లో ఓట్లు పెద్దగా అతనివైపు మొగ్గుచూపడం లేదు. ఇలా పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తనూజ టాప్లో దూసుకుపోతుంది. పీఆర్ టీమ్ కారణంగానే బిగ్బాస్ విన్నర్గా ఎవరూ కాలేరనేది చాలామంది చెబుతున్నమాట.. అందుకోసం ధైర్యం చేసి అంత ఖర్చు ఎవరూ చేయరని కూడా తెలుపుతున్నారు. కానీ, వారి ఆటకు కాస్త బలాన్ని పీఆర్ టీమ్ ఇస్తుందనేది మాత్రం వాస్తవం అంటారు. -
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. అయితే రాజుల- రాణిల కోసం ప్రత్యేకమైన వంటకాలను పట్టుకొచ్చాడు. ఇదేదో కల్యాణ్ కోరిక(చికెన్, మటన్ తినాలనుందన్న కోరిక)ను నెరవేర్చేందుకే ఆయన్ను హౌస్లోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...రాజావారి విందు భోజనంరాజులు కల్యాణ్ (Pawan Kalyan Padala), నిఖిల్, రాణి రీతూ కోసం మాస్టర్ చెఫ్ సంజయ్ అసిస్టెంట్ ప్రణవ్ నాన్వెజ్ వంటకాలు సిద్ధం చేశాడు. ఆకలి మీదున్న పులుల్లా వాటిని ఈ ముగ్గురూ ఆవురావురుమని ఆరగించారు. తర్వాత కమాండర్స్ తనూజ, డిమాన్ పవన్, దివ్య, సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, భరణిలను పనోళ్లుగానే చూశారు. అందుకే వారిని కింద కూర్చోబెట్టి కేవలం శాఖాహార భోజనం మాత్రమే వడ్డించారు.కల్యాణ్ను ఓడించిన తనూజతర్వాత బిగ్బాస్.. రాజు, రాణిలకు చివరగా ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు కల్యాణ్తో కమాండర్ తనూజ (Thanuja Puttaswamy) పోటీపడింది. ఈ గేమ్లో చురుకుగా, చకచకా ఆడి తనూజ గెలిచింది. అలా కల్యాణ్ను రాజు స్థానంలో నుంచి కిందకు దింపి తను రాణిగా మారిపోయింది. బిగ్బాస్ రాజ్యానికి మహారాణి అవడమే కాకుండా ఏకంగా పదోవారం కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కెప్టెన్సీ చేతిదాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. ఈసారి ఏకంగా ఫ్యామిలీ వీక్లో కెప్టెన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చదవండి: నాతో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు: హీరో -
ఉమెన్ కార్డ్ తీసిన తనూజ.. డీమాన్ పవన్ తప్పు చేశాడా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలాంటి కొత్తదనం లేదు. రణరంగం అంటూ ఊదరగొట్టారు. కానీ, కంటెస్టెంట్స్ పేలవమైన ఆటతీరుతో ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తున్నారు. ఇప్పటికే 66 రోజులు పూర్తి అయింది. బుధవారం ఎపిసోడ్లో కాస్త నవ్వులతో పాటు నామామాత్రపు టాస్క్లు పెట్టి ముగించేశాడు. బీబీ రాజ్యం అంటూ జరుగుతున్న టాస్క్ పెద్దగా ఆకట్టుకోలేదు. మహారాణులుగా దివ్య-రీతూల కాంట్రవర్సీతో పాటు వారిద్దరూ కలిసి పదేపదే సుమన్ శెట్టి, భరణి, ఇమ్మానుయేల్ని టార్గెట్ చేసి ఆటాడుకున్నారనిపిస్తుంది. కమాండర్లుగా ఉన్న డీమాన్ పవన్-తనూజ మధ్య జరిగిన గొడవ మాత్రమే వివాదంగా మారింది.బిగ్బాస్ సీజన్-9 ప్రారంభం నుంచే తనూజ కాస్త హైలెట్ అవుతూ వస్తుంది. బుధవావరం ఎపిసోడ్లో డీమాన్ పవన్- తనూజ మధ్య జరిగిన గొడవ కూడా కంటెంట్ క్రియేట్ కోసం చేసినట్లు అనిపిస్తుంది. డిమాన్ పవన్ తప్పు అయితే ఎంతమాత్రం లేదు, కానీ అంత చిన్న విషయానికి తనూజ ఎందుకు రచ్చ చేసిందనేది ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. కేవలం కంటెంట్ కోసమే ఆమె ఇలా చేసిందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే వెంటనే వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు. మహారాజు-మహారాణుల పాత్రలో ఉన్న కళ్యాణ్, దివ్య, రీతూ కలిసి తనూజను ఆటపట్టించాలనుకుంటారు. ఈ క్రమంలో కిచెన్ దగ్గరికొచ్చి కమాండర్ తనూజని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టమని డీమాన్-నిఖిల్లకి చెప్పారు.దీంతో తనూజని ముందుగు నడవాలంటూ ఆమె భుజం మీద డీమాన్ పవన్ టచ్ చేశాడు. ఈ సమయంలో తనూజ ఫైర్ అయింది. చెయ్యి వేస్తున్నావేంట్రా.. అంటూ నో ఉమెన్ హ్యాండ్లింగ్.. అని ఫైర్ అయింది. ఇది రాణి ఆర్డర్ అని నిఖిల్ చెప్తాడు. అయితే, ఇలా హ్యాండిల్ చేస్తారేంటని తనూజ మళ్లీ అడుగుతుంది. అబ్బాయిల దగ్గర ప్రవర్థిస్తున్నట్లు చేస్తున్నారని తనూజ అంటుంది. కాదు కమాండర్స్లా చేస్తున్నారని రాణి పాత్రలో ఉన్న దివ్య కౌంటర్ ఇస్తుంది. మీ భుజాన్ని మాత్రమే పట్టుకున్నారు కదా అందులో ఏంటి తప్పు అని దివ్య కామెంట్ చేసింది. అయితే, తనూజ బాధ పడిందని డిమాన్ పవన్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కావాలని నెట్టలేదని చెప్తాడు. అయితే, తనను చాలా ఫోర్స్గా తోసేశావ్ అంటూ తనూజ చెబుతుంది. తాను చాలా హర్ట్ అయ్యానని. ఒక ఫ్రెండ్గా చెప్పవచ్చు కదా అంటుంది. కొంత సమయం పాటు ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, ఎపిసోడ్ ప్రకారం ఇందులో ఎక్కువగా తప్పు తనూజదే కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రీతూను గతంలో తోయడం వల్ల నాగార్జున ఇప్పటికే అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తనూజ కూడా మరోసారి అదేవిధంగా డీమాన్ పవన్ను చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవంగా తనూజతో పాటు ఇతర ఏ కంటెస్టెంట్తో కూడా డీమాన్ పవన్ చెత్తగా ప్రవర్తించలేదు. అందుకే కామనర్గా వచ్చినప్పటికీ ఆటలో కొనసాగుతున్నాడు.ప్రజలకి మరోసారి కమాండర్లు అయ్యేందుకు బిగ్బాస్ ఛాన్స్ కల్పించాడు. కమాండర్లు నిఖిల్, పవన్లతో ప్రజలు గౌరవ్, భరణి పోటీ పడ్డారు. ఈ రెండు టీమ్స్ మధ్య 'నిలబెట్టు పడగొట్టు' అనే టాస్క్ను బిగ్బాస్ ఇచ్చాడు. అయితే, ఇందులో డీమాన్-నిఖిల్ బాగా ఆడారు. మరోవైపు గౌరవ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ భరణి పూర్తిగా ఫెయిల్ కావడంతో ప్రజలు జట్టు ఓడిపోయింది. కేవలం భరణి వల్ల ఈ టాస్క్లో ఓడిపోవడంతో గౌరవ్ తట్టుకోలేకపోయాడు. పదేపదే కెమెరా ముందుకు వచ్చి భరణి ఆట వల్ల నష్టం జరిగిందంటూ వాపోయాడు. ఫైనల్గా నిఖిల్- పవన్లు కమాండర్స్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరో రౌండ్లో నిఖిల్ సత్తా చాటి రాజుగా ప్రమోషన్ పొందాడు. రాణిగా ఉన్న దివ్యను ఓడించాడు. దీంతో ఆమె కమాండర్గా మిగిలిపోయింది. బుధవారం ఎపిసోడ్లో ఎక్కువగా నవ్వులు పూయించారని చెప్పాలి. -
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్తో బయటకొచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. అయితే, తన అభిమానలు మాత్రం కాస్త నిరాశ చెందారు. సుమారు 60రోజుల పాటు తనకోసం అండగా నిలబడి ఓట్లు వేసిన వారందరికీ రాము రాథోడ్ తన కుటుంబంతో పాటు క్షమాపణాలు చెప్పాడు.బిగ్బాస్ గురించి రాము ఇలా చెప్పుకొచ్చాడు. ' నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ క్షమించండి. ఇదంతా నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉండటం జరిగింది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ అభిమానం వల్ల మాత్రమే బిగ్బాస్లో కొంతకాలమైన ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో హౌస్ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం బిగ్బాస్ కోసం అక్కడ వాళ్లతో గొడవపడటం కూడా నాకు నచ్చలేదు. నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండటం వల్ల హౌస్లో ఉండలేకపోయాను. కానీ, తనూజ మాత్రం చాలాసార్లు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. హౌస్లోని వారందరూ ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ అక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉండేది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ రాము తన ఫ్యామిలీతో ఒక వీడియో పంచుకున్నాడు. -
PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ టీమ్)ను సెట్ చేసుకుని వస్తారు. అందుకోసం వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో ఖర్చు పెడతారు. అంత స్థోమత లేని వారు హౌస్లో ఉన్నన్నాళ్లుండి ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తుంటారు. ఇటీవలే మలయాళ బిగ్బాస్ ఏడో సీజన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సీజన్లో నటి అనుమోల్ విజేతగా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ.42.5 లక్షలు, ఒక ఎస్యూవీ కారును గెల్చుకుంది.పీఆర్ కోసం రూ.16 లక్షలుకామన్ మ్యాన్ అనీష్ రన్నరప్గా నిలిచాడు. ఇక ఇదే సీజన్లో పాల్గొన్న బిన్నీ సెబాస్టియన్ అనే కంటెస్టెంట్.. అనుమోల్ (Anumol) పెద్ద పీఆర్ను పెట్టుకుందని, అందుకోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిగ్బాస్ హౌస్లోనే కామెంట్ చేశాడు. దీంతో ఆమె పీఆర్ వల్లే గెలిచిందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీనిపై అనుమోల్ స్పందించింది. నేను రూ.16 లక్షలు పెట్టి పీఆర్ను సెట్ చేసుకోవడం వల్లే టైటిల్ గెలిచానంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు.అంత డబ్బు నాకెక్కడిది?అంత డబ్బు నా దగ్గర లేదు. అయితే ప్రతి కంటెస్టెంట్ పీఆర్ను పెట్టుకుంటారని నాతో చెప్పారు. అందుకే నేను కూడా ఓ వ్యక్తిని కలిశాను. అతడు రూ.15 లక్షలు అడిగాడు. అంత స్థోమత నాకు లేదని చెప్పాను. కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇస్తానన్నాను. రూ.50 వేలు అడ్వాన్స్గా ఇచ్చాను. షో అయిపోయాక మిగతా సగం ఇస్తానన్నాను. ఈ రూ.16 లక్షల స్టోరీ ఎవరు అల్లారో నాకు అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే ఈ షోకి వచ్చేదాన్ని కాదు అని క్లారిటీ ఇచ్చింది.ఇక్కడా అదే రిపీట్?మలయాళ బిగ్బాస్ 7లో సెలబ్రిటీ విన్నర్ అయితే కామనర్ రన్నరప్ అయ్యాడు. దీంతో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లోనూ ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనూజకు కప్పిచ్చేస్తారని, కల్యాణ్ రన్నరప్గా ఉంటాడని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. పైగా పీఆర్ కోసం వాళ్లే అంత ఖర్చుపెడ్తే తెలుగు కంటెస్టెంట్లు ఇంకే రేంజులో ఖర్చు పెడుతున్నారో? అని గుసగుసలాడుతున్నారు. మరి ఫైనల్లో ఇదే జరుగుతుందా? లేదంటే కామనర్ విన్నింగ్ రేసులోకి వస్తాడా? చూడాలి!చదవండి: రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ వార్నింగ్ -
రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ కల్యాణ్ వార్నింగ్
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యంలో కల్యాణ్ రాజయితే, దివ్య, రీతూ మహారాణులు. వీళ్లు నలుగురు కమాండర్లను సెలక్ట్ చేసుకుంటే మిగతావాళ్లు ప్రజలుగా ఉంటారు. మరి ఎవర్ని కమాండర్లుగా తీసుకున్నారు? హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో మంగళవారం (నవంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..వాళ్లదే రాజ్యంబీబీ రాజ్యంలో బిగ్బాస్కు బుద్ధి పుట్టినప్పుడల్లా గేమ్స్ పెడుతూ ఉంటాడు. వారం ముగిసేసరికి రాజు, రాణులు, కమాండర్స్, ప్రజలు.. వీరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటగా మహారాజు, రాణులతో చర్చించి తనూజ, సంజనా, పవన్, నిఖిల్ను కమాండర్లుగా ఎంచుకున్నారు. మిగిలిన భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్, గౌరవ్ ప్రజలుగా మిగిలిపోయారు. ఈ ప్రజలే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.రీతూ తొండాటమహారాణిగా ఆసీనురాలైన దివ్య.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా భరణితో తలకు మసాజ్ చేయించుకుంది. తర్వాత కమాండర్స్కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ గేమ్కు రీతూ (Rithu Chowdary) సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే తను గతంలో చేసిన తప్పే మళ్లీ చేసింది. పవన్ ఔట్ అయినా సరే, కాలేదంటూ అతడిని గేమ్ ఆడించింది. ఈ క్రమంలో సంజనా, తనూజ.. రీతూపై ఎగబడ్డారు. అయినా ఆమె అస్సలు లెక్కచేయలేదు. చివరకు ఈ గేమ్లో సంజనా ఓడిపోయింది.కష్టపడ్డ సుమన్కమాండర్స్ నలుగురిలో ఓడిపోయిన సంజనా (Sanjana Galrani) తన పోస్టు కాపాడుకోవాలంటే ప్రజల్లో ఒకరితో తలపడి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమన్ను ఎంచుకుంది. ఈ ఇద్దరికీ కాటన్ డబ్బాలతో టవర్ కట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. సుమన్కు మరీ ఎక్కువ ఎత్తులో డబ్బాలు పెట్టడమనేది తన హైట్కు కష్టమైన విషయమే! అయినప్పటికీ సంజనాకు గట్టి పోటీనిస్తూ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. బజర్ మోగే సమయానికి సంజన-సుమన్ ఇద్దరి టవర్ ఒకే ఎత్తులో ఉంది. కాకపోతే సంజనా టవర్ నిటారుగా, పర్ఫెక్ట్గా ఉంది కనుక తనే గెలిచింది అని కల్యాణ్ ప్రకటించాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు.కల్యాణ్ను తిట్టిపోసిన తనూజటవర్ ఎలా ఉన్నా పర్లేదన్నారు కదా.. చివరి బాక్స్ సుమనే ముందు పెట్టాడుగా అని తనూజ, దివ్యలు నోరేసుకుని పడిపోయారు. అయినప్పటికీ కల్యాణ్ తన నిర్ణయంపై నిలబడి ఉన్నాడు. అప్పటికీ తనూజ ఒప్పుకోలేదు. ఇదంతా నువ్వు ముందు చెప్పాల్సింది. నచ్చినట్లు చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తానంటే ఎలా కుదురుతుంది? చెప్పిన మాట మీద లేవు.. గేమ్ స్టార్ట్ అయ్యేముందు ఒకటి చెప్పావ్, అయిపోయాక ఒకటి చెప్తున్నావ్.. సంచాలక్గా ఫెయిల్ అని అరించింది. ఆ మాటతో ఆగ్రహించిన కల్యాణ్.. నోటికొచ్చినట్లు వాగితే బాగోదంటూ బాక్సుల్ని ఒక్కదెబ్బతో గుద్ది పడేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.చదవండి: నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ -
'బిగ్బాస్'కే చుక్కలు చూపుతున్న కంటెస్టెంట్స్.. అందరూ నామినేట్
బిగ్బాస్ సీజన్-9లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. సీజన్ కూడా అయిపోవస్తుంది. కానీ, హౌస్లోని కంటెస్టెంట్స్ మాత్రం నామినేషన్లో కూడా చెత్త పాయింట్లతోనే ముగించేశారు. దీంతో బిగ్బాస్కు కూడా చిరాకు అనిపించినట్లుంది. హౌస్లో వారి ఆటకు తిక్కరేగిన బిగ్బాస్ సూపర్ ట్విస్ట్తో అందరికీ షాకిస్తూ.. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా ఈ వారం అందరినీ ఎలిమినేషన్లో నిలబెట్టాడు. 9 వారాలుగా ఇమ్ము ఎలిమినేషన్లో లేడంటూ రీసెంట్ ఎపిసోడ్లో నాగార్జున గుర్తుచేశారు. ఇదే క్రమంలో అతన్ని నామినేషన్లో పెట్టమని పరోక్షంగా బిగ్బాస్ రంగంలోకి దిగి ఛాన్స్ ఇస్తే దానిని కూడా హౌస్లో ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇలా చెత్తగా నామినేషన్ ప్రక్రియను ముగించేశారు. తనూజ కోసం భరణి అంటూ ఇమ్మూ ఫైర్బిగ్బాస్ హౌస్లో ఆరు వారాల ఆట మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్లో 11మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని.. అందుకోసం ఐదు నిమిషాల టైమ్ లిమిట్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారు అక్కడొక కుర్చీలో కూర్చుంటే బురదనీళ్లు వచ్చి వారి మీద పడుతాయి. మొదట ఇమ్మాన్యుయేల్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెడుతాడు. భరణిని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్లో మీరు తనూజ కోసం గివప్ చేయడం నచ్చలేదనే పాయింట్ తెరపైకి తెస్తాడు. మీకంటే తనూజనే బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటి అంటూ భరణిని ప్రశ్నిస్తాడు. ఈసారి కొత్త భరణిని చూస్తారన్నారని రీఎంట్రీ ఇచ్చారు. కానీ, రోజురోజుకి ఆ ఫైర్ కనిపించడంలేదంటూ ఇమ్మూ ఫైర్ అవుతాడు. అయితే, భరణి సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. అయితే, ఎక్కువ మంది గౌరవ్, నిఖిల్ను నామినేషన్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడారు.దివ్యను నామినేషన్ చేసిన భరణిఈ వారం నామినేషన్లో ప్రత్యేకత ఏదైనా ఉందంటే.. దివ్యను భరణి నామినేట్ చేయడమని చెప్పాలి. ఈ క్రమంలో భరణి ఇలా చెప్తాడు. 'నా గేమ్ నీ వల్ల పాడవ్వలేదు.. నేను నీ వల్ల హౌస్ నుంచి బయటికి వెళ్లలేదనేది నాకు మాత్రమే తెలుసు. కానీ, హౌస్మేట్స్ మాత్రం దివ్య వల్లనే భరణి వెళ్లారు అనుకుంటున్నారు. అది తప్పని ప్రూ చేయాల్సిన బాధ్యత నీపైన కూడా ఉంది కదా.. కాబట్టి నువ్వు నామినేషన్కి వెళ్లి సేఫ్గా వచ్చి ప్రూ చేసుకో..' అంటూ భరణి చెప్పాడు. దీంతో దివ్య కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. నా వల్ల మీ గేమ్ పాడైందా..? ఇది ఏ రకమైన కారణం..? అంటూ భరణిపై విరుచుకుపడింది. నా వల్ల మీరు హౌస్ నుంచి వెళ్లిపోలేదనే విషయంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు. మీరు వెళ్లిపోయింది నా వల్లే అని ఎవరూ అనలేదు బాండింగ్స్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా.. అని దివ్య ఫైర్ అయింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం గట్టిగానే నడిచింది.భరణి మాత్రమే ప్రత్యేకంనామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తూ.. ఈ వారం హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరినీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్కి మినహాయింపు ఇవ్వాలా, వద్దా అనేది సీక్రెట్ ఓటింగ్తో నిర్ణయించమని కోరుతాడు. అప్పటికీ కూడా ఎవరూ ఇమ్మూను నామినేట్ చేయలేదు. కేవలం భరణి మాత్రమే ఇమ్మాన్యుయేల్ను నామినేషన్లో ఉంచాలని ఓట్ వేస్తాడు. మిగిలిన అందరూ ఇమ్మూకు మద్దతు తెలుపుతూ నామినేషన్స్ నుంచి తప్పిస్తారు. దీంతో ఈ వారం ఇమ్మాన్యుయేల్ను మినహాయించి హౌస్లో ఉన్న అందరూ నామినేషన్ లిస్ట్లోకి వచ్చారు. -
'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్లో ఎవరంటే?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా గేమ్స్ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది. భరణిని నామినేట్ చేసిన ఇమ్మూఅయితే తెలుగు బిగ్బాస్ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్ తగ్గిపోతోందని కారణం చెప్పాడు. ఎమోషనల్ డ్రామా ఎక్కువైందిరీతూ.. దివ్యను నామినేట్ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్ చేశాడు గౌరవ్. కల్యాణ్.. నిఖిల్ను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్ -
బిగ్బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్లో ఏం జరిగిందో నవంబర్ 9వ ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఇద్దరికీ సమాన ఓట్లుట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్మేట్స్ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్ పవన్కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్ చేశారు.దివ్యకు వాయింపులుఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు నాగ్. దివ్య స్ట్రాటజీ కరెక్ట్.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్ ఫైట్ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇమ్మూని హెచ్చరించిన నాగ్ఇక బిగ్బాస్ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్, నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్లోకి రాకుండా సడన్గా వస్తే.. అప్పటికే ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్లోకి రమ్మని వార్నింగ్ ఇస్తూనే డైరెక్ట్గా హింటిచ్చాడు.పవర్ వాడేందుకు ఒప్పుకోని తనూజఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్ ఉపయోగించి సాయిని సేవ్ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సుమన్ కరెక్ట్ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్ అని పేర్కొన్నాడు.చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) లో 9వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇంటి మీద బెంగతో రాము స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయ్యాడు. మరి ఆయన ఎలిమినేషన్కు కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత చూసేద్దాం..ఇమ్యూనిటీతో హౌస్లోకి..అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్గా హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్ (Sreenivasa Sayee). ఇమ్యూనిటీ పవర్ ఉన్న వజ్రాన్ని అతడి చేతికిచ్చిన నాగ్ కావాల్సినప్పుడు వాడుకోమన్నాడు. అంతేకాదు, ఫస్ట్ వీక్లో వైల్డ్కార్డ్స్ నామినేషన్లోకే రాలేదు. తర్వాతి వారం నామినేషన్లోకి వచ్చినప్పటికీ సేవ్ అయిపోయాడు. కానీ, మరో వైల్డ్ కార్డ్ రమ్య ఎలిమినేట్ అయింది.కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడుఆ తర్వాతి వారం తన ఇమ్యూనిటీ వాడుకుని నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. గత వారం మాత్రం ఈ గండాన్ని తప్పించుకోలేకపోయాడు. తనూజను స్ట్రాంగ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసిన సాయి ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు. కానీ, తనూజ ఫ్యాన్స్కు మాత్రం గిట్టలేదు. తనూజతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలనుకున్నారు. పోనీ, టాస్కుల్లో అరాచకంగా ఏమైనా ఆడాడా? అంటే అదీ లేదు. అవకాశాలు దక్కించుకోలేక..ఆడేంత సత్తా ఉన్నప్పటికీ అవకాశాన్ని చేజిక్కించుకునే తెలివి లేకుండా పోయింది. టీమ్లో ఉన్నాడే కానీ, ముందు వరుసలో ఆడలేకపోయాడు. దివ్య తెలివిగా అతడిని వెనకపడేయడం.. రీతూ మరింత తెలివిగా అతడ్ని ఆటలో తప్పించడంతో గేమ్స్ ఆడే ఛాన్సులు రాలేవు. హౌస్లో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్పడంతో మానిప్యులేటర్ అన్న ముద్ర కూడా పడింది. రెమ్యునరేషన్ ఎంత?కెప్టెన్సీ గేమ్లోనూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో తడబడ్డాడు. ఎక్కువ అయోమయానికి లోనయ్యాడు. అప్పటికీ నెమ్మదిగా తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, అంత నెమ్మదితనం బిగ్బాస్ షోలో పనికిరాదు. ఫలితంగా సాయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడికి వారానికి రూ.2 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నాలుగువారాలకుగానూ రూ.8 లక్షల మేర సంపాదించాడన్నమాట!చదవండి: Bigg Boss 9.. నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి -
Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది.. మాధురి కామెంట్స్
ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా.. అని ఓ సినిమాలో మహేశ్బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు దివ్వెల మాధురికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. బిగ్బాస్(Bigg Boss 9 Telugu) హౌస్లోకి ఎప్పుడొచ్చాం..ఎప్పుడు పోయామని కాదు.. మనదైన ముద్ర వేశామా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో మాధురి సక్సెస్ అయినట్లే. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆలస్యంగా హౌస్లోకి వెళ్లి.. మూడు వారాలకే బయటకు వచ్చినా.. తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఫైర్బ్రాండ్గానే హౌస్లోకి వెళ్లి..ఆట కూడా అలాగే ఆడింది. గొడవలు, అరుపులతో కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు..టాస్కులు కూడా బాగానే ఆడింది. కానీ మూడోవారం ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.తాను కావాలనుకొనే బయటకు వచ్చానని మాధురి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే బిగ్బాస్ షో ద్వారా మాధురి భారీగానే సంపాదించిదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మూడు వారాలకు గాను ఏకంగా రూ. 9లక్షల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు.డబ్బుల కోసం వెళ్లలేదు.. బిగ్బాస్ షోకి చాలామంది ఫేమ్ కోసమో లేదా మనీ కోసం వెళ్తుంటారు. కానీ మాధురి మాత్రం ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్లారట. డబ్బుల కోసం అయితే తాను బిగ్బాస్ షోకి వెళ్లలేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పైవిధంగా చెప్పింది. ‘నేను డబ్బులకు టెంప్ట్ అయి బిగ్బాస్ షోకి వెళ్లలేదు. నాకు బయటే రోజు 2-3 లక్షలు వస్తాయి. బిగ్బాస్ షో మొత్తం ఆడితే కోటి వరకు వస్తాయేమో కానీ..నేను నెలకే రూ. కోటి సంపాదిస్తాను. అసలు నేను రెమ్యూనరేషన్ విషయంలో డిమాండే చేయలేదు. దేవుడిచ్చిన వరకూ మాకు డబ్బులు బానే ఉన్నాయి.. ఫేమ్ కూడా బానే ఉంది.. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి.. లైఫ్లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్లా’ అని మాధురి చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. -
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
రాను బొంబాయికి రాను.., సొమ్మసిల్లి పోతున్నవే.. పాటలతో యూట్యూబ్లో సెన్సేషన్ అయ్యాడు సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్. ఆ క్రేజ్తోనే బిగ్బాస్ ఛాన్స్ తెచ్చుకున్నాడు. తొమ్మిది వారాలు హౌస్లో ఉన్న రాము అమ్మపై బెంగ పెట్టుకుని లోలోపలే కుమిలిపోయాడు. చిన్నప్పుడు అమ్మనాన్నకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు బిగ్బాస్కు వచ్చి వాళ్లకు దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు. అసలు రాము పేరెంట్స్ ఏం చేసేవారు? ఎందుకు రాముకు దూరంగా ఉన్నారో వారి మాటల్లోనే చూద్దాం..మేస్త్రీ పనికి..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాము (Ramu Rathod) పేరెత్తగానే అతడి తల్లి.. నా కొడుకును రోజూ చూస్తున్నా, కానీ మాట్లాడలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత తమాయించుకుని ఆమె మాట్లాడుతూ.. నాకు ఐదుగురు సంతానం. పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి మేము ముంబై, పుణె వెళ్లి ఉప్పర్ (మేస్త్రీ) పని చేసేవాళ్లం. పొద్దున 4 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వచ్చేవాళ్లం. మొదట్లో నాకు రూ.30, నా భర్తకు రూ.60 ఇచ్చేవారు. నూకలతో వండిన అన్నం పెట్టేవాళ్లు. అందులో పురుగులు ఏరేసుకుని తినేవాళ్లం. నూకల బియ్యమే ఆహారంఊర్లో నా పిల్లలు సారా అమ్మేవాళ్లు. ఆ డబ్బుతోనే పుస్తకాలు కొనుక్కునేవాళ్లు. నేను కట్టెల మోపు అమ్మగా వచ్చిన డబ్బుతో నూకలు తెచ్చుకుని కుటుంబమంతా తినేవాళ్లం. కరోనా సమయంలో నా ఇంట్లోని నలుగురికి కరోనా వచ్చింది. అప్పుడు నేను, రాము కలిసి ఊరూరు తిరిగి కూరగాయలు అమ్మాం. ఒకప్పుడు మమ్మల్ని చాలా చిన్నచూపు చూసేవాళ్లు. అలా అవమానాలు పడ్డప్పుడు బతకాలనిపించలేదు. రేపు మా గతేంది? అని ఎంతో బాధపడ్డా.. కానీ, నా చిన్నకొడుకు దేవుడిచ్చిన వరం. కుటుంబ బాధ్యతను అతడే చూసుకుంటున్నాడు.నా భర్త కొట్టేవాడునాకు తన సంపాదనతో మొదటగా బంగారు కమ్మలు, మాటీలు కొనిచ్చాడు. అలాగే రూ.10 వేల చీర తెచ్చాడు. అందరూ మనవాళ్లే అంటారు. అన్నల కోసం, అక్క, చెల్లి కోసం చాలా ఖర్చు పెడతాడు. నాకు 6 తులాల బంగారం ఇస్తే, వాడి అక్కకు రూ.3 లక్షలు, చెల్లికి రూ.4 లక్షలు, అన్నకు రూ.16 లక్షలతో బస్ ఇప్పించాడు. అందరం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్తుంటాడు అని ఎమోషనలైంది. భార్యాభర్తలు గొడవపడేవారా? అన్న ప్రశ్నకు నా భర్త నన్ను కొట్టేవాడు.. కానీ, ఎప్పుడు కొట్లాడుకున్నా వెంటనే కలిసిపోయేవాళ్లం అని చెప్పుకొచ్చింది.చదవండి: రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
పచ్చని పల్లెటూరులో బతికే గంగవ్వకు ఏసీ వాతావరణం పడక, హౌస్లో ఉండలేక రెండుసార్లు (తెలుగు బిగ్బాస్ 4, 8వ సీజన్స్లో) సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. గత సీజన్లో మణికంఠ మానసికంగా వీక్ అయిపోయానంటూ పంపించేయమని వేడుకుని బయటకు వచ్చేశాడు. ఇప్పుడదే రకంగా రాము రాథోడ్ కూడా ఇంటి మీద బెంగతో తనంతట తానే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాగార్జున సర్దిచెప్పినా సరే వినకుండా ఎలిమినేషన్కే మొగ్గుచూపాడు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 8వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..టాప్ 6లో ఎవరంటే?నాగార్జున, అమల, రామ్గోపాల్ వర్మల 'శివ' మూవీ ప్రమోషన్స్తో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత.. కంటెస్టెంట్లు ఎవరు హిట్టు? ఎవరు ఫ్లాప్? అని ఆడియన్స్తో ఓటింగ్ వేయించారు. అందులో సుమన్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel), తనూజ, కల్యాణ్, రీతూ, పవన్ టాప్ 6లో ఉన్నారు. వీరికి నాగ్ కొన్ని బంపరాఫర్స్ ఇస్తూనే కొన్ని కండీషన్స్ పెట్టాడు. వారి కోరికలు నెరవేర్చుకోవాలంటే కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నాడు.ఇమ్మూ స్వార్థంభరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని తెలిపాడు. దీన్ని సుమన్ తిరస్కరించి కెప్టెన్సీ కంటెండర్షిప్ ఆడి గెల్చుకుంటానన్నాడు. ఇమ్మాన్యుయేల్కు గర్ల్ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అది వినాలంటే గౌరవ్కు బిగ్బాస్ ఇచ్చిన పవర్ పోతుందన్నాడు. ఆ పవర్ పోతే పోనీయ్.. అని భావించిన ఇమ్మూ.. ప్రియురాలి సందేశం విని ఎమోషనలయ్యాడు. తనూజ సోదరి వాయిస్ మెసేజ్ వినాలంటే కల్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవాలన్నాడు. రీతూకి రెండు సర్ప్రైజ్లురెండువారాల్లో సోదరి పెళ్లి ఉందని ఎమోషనలైన తనూజ.. తన కోసం కల్యాణ్ను బలి చేసేందుకు ఒప్పుకోలేదు. కల్యాణ్కు వారంపాటు చికెన్, మటన్ కావాలంటే నిఖిల్ రెండు వారాలు నామినేట్ అవ్వాలన్నాడు. దీన్ని కల్యాణ్ తిరస్కరించాడు. రీతూ.. తండ్రి షర్ట్ పొందడం కోసం సంజనా చీరల్ని కోల్పోయింది. పవన్.. ఫ్యామిలీ ఫోటో కావాలంటే రీతూకి తండ్రి ఫోటో రాదన్నాడు. దీంతో అతడు తన ఫ్యామిలీ ఫోటో త్యాగం చేసి రీతూకి ఆమె తండ్రి ఫోటో వచ్చేలా చేశాడు.రాను బిగ్బాస్కు రానంటూ..ఇంటిమీద బెంగ పెట్టుకున్న రాము (Ramu Rathod)ను నాగ్ కదిలించగానే.. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. బయటకు వెళ్లిపోతానన్నాడు. హీరోలు ఆట అంతు చూస్తారు, కానీ మధ్యలో వదిలేయరు అని నాగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రాము వినిపించుకోలేదు. క్షమించండి సార్, వెళ్లిపోతాను అని పదేపదే అదే మాట అన్నాడు. వెళ్లిపోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తా.. 10 సెకన్లలో నిర్ణయం చెప్పమంటూ టైమిచ్చినా.. వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. హౌస్మేట్స్ ఆపేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. అలా రాము స్వతాహాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇది సడన్ ఎలిమినేషన్ కావడంతో అతడి జర్నీ వీడియో చూడకుండానే వెళ్లిపోయాడు.చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. హౌస్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రాము రాథోడ్ సడెన్గా సెల్ఫ్ ఎలిమినేషన్ కావడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, షోలో ఉన్నంత కాలం పెద్దగా నెగటివిటీ లేకుండా బయటికి రావడం విశేషం. సుమారు 60 రోజులకు పైగానే బిగ్బాస్లో రాము ఉన్నాడు. దీంతో ఆయన భారీగానే రెమ్యునరేషన్ రూపంలో సంపాధించాడు.యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించిన రాము రాథోడ్ ఫోక్ సింగర్గా బాగా పాపులర్ అయ్యాడు. “రాను బొంబాయికి రాను” అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయనకు చాలా సాంగ్స్ పాడేందేకు అవకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే బిగ్బాస్ ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే, రాము రాథోడ్ ఒక వారానికి రెమ్యునరేషన్గా రూ. 2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్ ఉంది. దీంతో 9వారాలకు గాను బిగ్బాస్తో అతను రూ. 18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.హోస్ట్ నాగార్జునతో పాటు హౌజ్మేట్స్ కూడా బిగ్బాస్లో ఉండాలని రాము రాథోడ్ను కోరారు. కానీ, తన వినకుండా ఇంటిని వీడాడు. ఈక్రమంలో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. 'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని బిగ్బాస్ నుంచి బయటకు వచ్చేశాడు. -
బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్బాస్కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)9వ సీజన్లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన బిగ్ బాస్ వితిక) -
బిగ్బాస్ ప్రోమో: అమలతో డ్యాన్స్ చేసిన నాగార్జున..
టాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ నాగార్జున (Nagarjuna Akkineni)-అమల.. కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో శివ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 1989 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శివ సాంగ్తో ఎంట్రీఅన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీరిలీజ్ (Siva Movie ReRelease) చేస్తున్నారు. దీంతో బిగ్బాస్ స్టేజీపైకి ఆర్జీవీతో పాటు శివ రీల్ కమ్ రియల్ లైఫ్ హీరోయిన్ అమల సైతం వచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నాగార్జున.. బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. పాటతో ఎంట్రీ ఇచ్చాడు. అమలతో నాగ్ డ్యాన్స్ఆ వెంటనే అమల రంగంలోకి దిగి.. నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ జంట కోసం బిగ్బాస్ కంటెస్టెంట్లు సైతం జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. బిగ్బాస్ హౌస్లో వారు డ్యాన్స్ చేస్తుంటే స్టేజీపై అమల ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. నిన్ను బిగ్బాస్ హౌస్లో వంద రోజులు ఉండమంటే ఉంటావా? అని నాగ్.. ఆర్జీవీని అడిగాడు. అందుకాయన.. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటానన్నాడు వర్మ. చదవండి: ఓరీపై ట్రోలింగ్.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు! -
ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు అయింది భరణి పరిస్థితి. దివ్య.. తనూజ గొడవపడి అసలు సంబంధమే లేని భరణిని మధ్యలోకి లాగారు. నాతో మాట్లాడొద్దని తనూజ.. మీ పేరొచ్చినప్పుడు మాట్లాడలేరా? స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి అని దివ్య.. భరణిపై ప్రతాపం చూపించారు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్7వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..తడబడిన సాయికెప్టెన్సీ కంటెండర్స్ను సెలక్ట్ చేసిన బిగ్బాస్ (Bigg Boss Telugu 9).. వారిలో ఎవర్ని సైడ్ చేయాలి? ఎవర్ని ముందుకు తీసుకెళ్లాలన్న బాధ్యతను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో కంటెండర్కు సపోర్ట్గా నిలబడ్డారు. రాము.. తనూజకు సపోర్ట్ చేస్తానని ఇచ్చిన మాట కోసం భరణిని తీసేశాడు. సాయి శ్రీనివాస్ దివ్యను తీసేయబోతే.. నిన్ను కాపాడుకుంటూ వచ్చా, నన్నే తీస్తున్నావా? అని ధమ్కీ ఇచ్చింది.చివరకు ముగ్గురుదెబ్బకు జడుసుకున్న సాయి (Sreenivasa Sayee).. రీతూ పేరెత్తాడు. నేనేం చేశానని ఆమె ఉగ్రరూపం ఎత్తడంతో సుమన్ పేరు ప్రస్తావించాడు. వాళ్లిద్దరూ నోరేసుకుని పడిపోయారని నామీదకు వచ్చావా? అని సుమన్ ఆగ్రహించాడు. దీంతో సాయి మళ్లీ తను మొదట చెప్పినట్లుగా దివ్యను గేమ్లో అవుట్ చేశాడు. నిఖిల్.. సుమన్ను తీశాడు. అలా చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్.. ముగ్గురు మిగిలారు. సరిగ్గా ఇప్పుడే దివ్య చక్రం తప్పింది. టార్గెట్ తనూజతనూజ, రీతూ ఉంటే.. రీతూనే తీస్తానన్న ఆమె సడన్గా మనసు మార్చుకుని తనూజను సైడ్ చేసింది. అది తట్టుకోలేకపోయిన తనూజ.. మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేశావ్.. భరణిగారి వల్లే తీసేశావ్ అని ఆగ్రహించింది. మధ్యలో నా పేరెందుకొచ్చిందని భరణి షాకై చూశాడు. తనూజను తీసేయవనే ఆ కుర్చీ ఇచ్చానని కల్యాణ్ అంటే.. ఆమె ఉంటే ఇమ్మూకి గెలుపు కష్టమవుతుందనే తనూజను తీసేశానని దివ్య బదులిచ్చింది.దివ్యపై భరణి ఉగ్రరూపంమీ పర్సనల్స్ బయట పెట్టుకో, హౌస్లో కాదని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పి ఆవేశంగా లోపలకు వెళ్లిన తనూజ గుక్కపెట్టి ఏడ్చింది. ఆమె మాటలు విన్నారా? ఇప్పుడు హ్యాపీయా? నా గేమ్లో మీ పేరెందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అని అందరి ముందే భరణిపై అరిచింది. కాసేపటికి ఒంటరిగా ఉన్న భరణి దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చా? అని అడిగింది. ఆయన కోపంగా ఉన్నాడని అర్థమై ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అరిచినందుకు సారీ చెప్దామని వచ్చానంది. ఏం మాట్లాడాలి? నామీద అరవడం ఫస్ట్ టైమా? నువ్వేదో అంటావ్.. తనేదో అంటుంది. ఇలాగైతే నేను ఊరుకోనుమధ్యలో నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అవసరమైతే తనతో తర్వాత మాట్లాడతా కదా.. అని భరణి సీరియస్ అయ్యాడు. దీంతో ఆమె సారీ చెప్పి కెప్టెన్ రూమ్లోకి వెళ్లిపోయింది. మా మమ్మీడాడీని చూస్తే కూడా నాకు భయమయలేదు. ఆయన కళ్లలో అంత కోపం చూశాను.. నాకు ఆయన అన్నయ్యే కావచ్చు.. కానీ, అది బయటకెళ్లాక చూసుకుంటానిక.. ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని ఇమ్మాన్యుయేల్తో అంది. తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్కు ఓ గేమ్ పెట్టగా అందులో ఇమ్మూ గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు. దివ్య ఎత్తుగడ వల్ల తనూజకు జనాల్లో సింపతీ రావడం ఖాయం. ఈ ఎపిసోడ్తో తనూజ కప్పు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: హౌస్లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే! -
హౌస్లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో తొమ్మిదోవారం ఎలిమినేషన్కు సమయం ఆసన్నమైంది. ఈసారి భరణి, తనూజ, సుమన్, రాము, సాయి శ్రీనివాస్, సంజన, కల్యాణ్ నామినేషన్స్లో ఉన్నారు. ఎప్పటిలాగే తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెను ఓటింగ్లో అగ్రస్థానలో నిలబెడుతూనే వస్తోంది. రెండో స్థానంలో కామన్ మ్యాన్ కల్యాణ్ దూసుకెళ్తున్నాడు. సుమన్ చిన్నగా నవ్వినా, ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా సరే.. ఓట్లు దానంతటదే వస్తాయి. చివర్లో వాళ్లిద్దరుఅలా అతడికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. సంజన ఎలిమినేషన్ గండానికి కాస్త దూరంలోనే ఉంది. భరణికి ఆమె కంటే తక్కువ ఓట్లే పడుతున్నాయి. చివర్లో రాము (Ramu Rathod), సాయి శ్రీనివాస్ మిగిలారు. ఇద్దరికీ చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. వైల్డ్కార్డ్గా వచ్చిన సాయికి తానేంటో నిరూపించుకునే టాస్క్ ఒక్కటికూడా పడలేదు. కానీ, నామినేషన్స్లో బాగానే మాట్లాడాడు. ఓట్లు పడాలంటే ఇది సరిపోదు. వెళ్లిపోవడానికి రెడీ?కనీసం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో అయినా ఇరగదీద్దాం అనుకుంటే దివ్య, రీతూ.. అతడికి ఆ ఛాన్సు రాకుండా, లేకుండా చేశారు. ఫలితంగా అతడి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఇక రాము విషయానికి వస్తే.. ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నాడు. ప్రతి గేమ్లో తనంతట తానే పక్కకు తప్పుకుంటున్నాడు. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ, ఆడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా పక్కకెళ్లి కూర్చుంటున్నాడు. అన్నింట్లోనూ గివప్ ఇచ్చేస్తున్నాడు. ఇల్లు గుర్తొస్తుందంటూ చాలాసార్లు ఒంటరిగా ఒక్కడే కూర్చుంటున్నాడు. చాలా డల్ అయిపోయాడు. రామును ఎలిమినేట్ చేస్తే బెటర్!ఆరెంజ్ టీమ్లో అందరూ సేఫ్ బ్యాడ్జ్ కోసం పోట్లాడుతుంటే నాకూ కావాలని మాటవరసకైనా అనలేదు. నాకొద్దని సింపుల్గా తేల్చేశాడు. కనీసం కెప్టెన్సీ కంటెండర్ అవుతాననీ వాదించలేదు. తనే స్వయంగా వదిలేసుకున్నాడు. తనకేదీ అవసరమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతడి వాలకం చూసి జనాలకు సైతం చిరాకొస్తోంది. ఇంత హోమ్ సిక్ అయితే రామును పంపించేయండి నాగార్జునగారూ అని కామెంట్లు చేస్తున్నారు. ఇతడికి ఓట్లేసి కాపాడే బదులు ఏదో ఒకటి చేయాలని తాపత్రయం చూపిస్తున్న సాయిని హౌస్లో ఉంచితే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి -
దివ్య ఇచ్చిన షాక్తో బోరుమని ఏడ్చిన తనూజ.. ఎంతో కష్టపడ్డానంటూ..
కెప్టెన్సీ ఎవరు కాదనుకుంటారు? అందరూ కోరుకునేదే, అందరికీ బాగా కావాల్సిందే! బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతోంది. అయితే కంటెండర్లకు డైరెక్ట్గా గేమ్ పెట్టకుండా.. హౌస్మేట్స్ సాయంతో గెలిచే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్లో చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మాత్రమే మిగిలారు. ఏ హౌస్మేట్ అయితే రైలెక్కి కూర్చుంటాడో అతడు ఒకర్ని రేసు నుంచి తీసేయొచ్చు. మోసం చేసిన దివ్య?అలా ఒక్క కుర్చీ కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. కల్యాణ్ చేతిలో కుర్చీ ఉంటే.. నేను చెప్పేది విను అంటూ అతడికి నచ్చజెప్పి కుర్చీలో కూర్చుంది దివ్య. నా సపోర్ట్ ఇమ్మాన్యుయేల్కు అని చెప్తూ.. తనూజను గేమ్లో అవుట్ చేసింది. అది విని షాకైన తనూజ.. నీకు కొంచెమైనా ఉందా? వ్యక్తిగత కారణాలతో ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావ్? అని కోప్పడింది. తనూజను ఎలిమినేట్ చేయవు అన్నందుకే కల్యాణ్ నీకు కుర్చీ ఇచ్చాడని గుర్తు చేసింది. చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లుఇంతలో కల్యాణ్ కూడా మధ్యలో కలగజేసుకుంటూ.. నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద విషయమే కాదు, నిన్ను నమ్మి ఇచ్చానని తలపట్టుకున్నాడు. మళ్లీ కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన బాధలో ఉన్న తనూజ.. నాతో మాట్లాడకు, నీకేమైన పర్సనల్స్ ఉంటే హౌస్ బయట పెట్టుకో అని దివ్యకు చెప్పి, ఆ వెంటనే బోరుమని ఏడ్చేసింది. కెప్టెన్ అవాలని చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి ఓదారుస్తుంటే కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ మాట్లాడొద్దు అని వేడుకుంది. ఇక చివర్లో రీతూ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ! -
నన్ను బెదిరించేవాడే లేడన్న భరణి.. మళ్లీ అతడే కెప్టెన్!
రెండు రోజులుగా ఎపిసోడ్స్ చూస్తుంటే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) నిద్రమత్తులో ఉన్నట్లే కనిపిస్తోంది. ఏదో టాస్కులిచ్చామా? ఆడించామా? అన్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు.. అసలైన రెబల్ను వదిలేసి ఎక్కువమంది రెబల్ అనుకునేవ్యక్తిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడమైతే మరీ దారుణం. ఇక గురువారం (నవంబర్ 6వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్లో చూసేద్దాం..గొడవకు సైపాత రెబల్స్ దివ్య (Divya Nikhita)-సుమన్కు ఇచ్చిన పని పూర్తయిందన్నారు. తర్వాత రీతూను కొత్త రెబల్గా నియమించి ఒకరితో సీరియస్గా గొడవపడమన్నాడు. ఇంకేముంది.. ఇమ్మూతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకర్ని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దాని సాయంతో ఆమె సాయిని తీసేసింది. ఏ గేమ్ పెట్టినా గెలుపు మాత్రం ఆరెంజ్ టీమ్దే అన్నట్లుగా ఉంది పరిస్థితి. గౌరవ్కు బ్యాడ్జ్..మొన్న జరిగిన రెండు టాస్కుల్లో వీరే గెలిచారు. నిన్నటి టాస్కులో ఇమ్మూ, గౌరవ్ ఆడి మరోసారి టీమ్ను గెలిపించారు. ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ నాక్కావాలని గౌరవ్ అడిగితే మొదట్లో కుదరదని వాదించారు. కానీ, చివరకు సరేనని ఇచ్చారు. బంధాల వల్లే బయటకు వెళ్లిన భరణి లోపలకు వచ్చాక కూడా పెద్దగా మారలేదు. దీంతో నాగార్జున క్లాస్ పీకడంతో కాస్త బుద్ధి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాన్ని కాస్త ధైర్యంగా చెప్తున్నాడు. నన్ను బెదిరించేవాడే లేడురెబల్ ఎవరనుకుంటున్నారు? అన్న చర్చలో సంజనాయే అని అనుమానపడ్డాడు. తను మీకు చెప్పిందా? అని దివ్య అడగ్గా.. చెప్పకపోతే నెక్స్ట్ వెళ్లిపోయేది మీ టికెటే అని కల్యాణ్ రెచ్చగొట్టాడు. అందుకు భరణి.. నేను వెళ్లిపోయినా పర్లేదు, హౌస్లో నన్ను బెదిరించేవాడే లేడు. వాడు రెబల్ అయినా.. రెబల్కు బాబు అయినా! ఆల్రెడీ చచ్చి బతికొచ్చినోడ్ని.. అంటూ డైలాగ్ కొట్టాడు.సీక్రెట్ టాస్క్లో ఫెయిల్తర్వాత రీతూకు.. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటో కొట్టేయమని మరో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ టాస్క్ రీతూ పూర్తి చేయలేదు. తర్వాత బిగ్బాస్ అందర్నీ కూర్చోబెట్టి ఎవరు రెబల్ అనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఎక్కువమంది గౌరవ్ పేరు చెప్పడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే బిగ్బాస్ రెబల్స్ దివ్య, సుమన్ శెట్టిని కంటెండర్లుగా ప్రకటించారు. కొత్త కెప్టెన్ ఎవరంటే?సంజన, నిఖిల్, గౌరవ్, డిమాన్, సాయి, కల్యాణ్ రేసులో నుంచి ఇదివరకే ఔట్ అయిపోగా తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూ మిగిలారు. వీరిలో నలుగురికే ఛాన్స్ అనడంతో రాము తాను తప్పుకుంటానని ముందుకొచ్చాడు. అలా కెప్టెన్సీ కోసం తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ, దివ్య, సుమన్ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మళ్లీ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!
డిమాన్ పవన్ టాస్క్ల వీరుడు.. అతడితో పోటీపడితే ఓటమి తథ్యం అని హౌస్మేట్స్కు బాగా తెలుసు. వీళ్లందరికంటే బిగ్బాస్ (Bigg Boss Telugu 9)కు మరీ ఎక్కువ తెలుసు. అందుకే.. అతడ్ని సైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అదెలాగో బుధవారం (నవంబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నిఖిల్ ఔట్రెబెల్స్ దివ్య, సుమన్.. బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను ఎవరికీ అనుమానం రాకుండా చకచకా పూర్తి చేస్తున్నారు. రెండో టాస్కులో భాగంగా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశారు. కానీ, ఉదయాన్నే ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టారు. దివ్య అయితే.. ప్యాకెట్స్ ఎవరు కొట్టేశారో.. ప్లీజ్, ఇచ్చేయండి అని మహానటిలా నటించేసింది. ఈ దొంగతనం టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందున హౌస్లో ఒకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించవ్చన్నాడు బిగ్బాస్. దీంతో దివ్య.. నిఖిల్ను తప్పిస్తున్నట్లు చెప్పింది.కెప్టెన్కు ఎదురుతిరిగిన గౌరవ్పాల ప్యాకెట్లు కనిపించకపోవడంతో రీతూ (Rithu Chowdery) హస్తం ఉందని తనపైనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, రాము సరదాగా.. ఏమో దివ్యనే రెబల్ కావొచ్చేమో అన్నాడు. నిఖిల్ మాత్రం.. సీరియస్గానే దివ్య రెబల్ అని తేల్చేశాడు. మరోవైపు కిచెన్లో మళ్లీ గొడవ మొదలైంది. మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేయమని గౌరవ్కు ఆర్డరేసింది దివ్య. ఇంకా బ్రేక్ఫాస్టే తినలేదు.. అప్పుడే లంచ్కోసం ప్రిపరేషన్ ఏంటి? అని గౌరవ్ వాదించాడు. భోజనమే ఉండదుఈ గొడవ ముదరడంతో.. గౌరవ్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వాష్రూమ్స్ క్లీన్ చేయాలని ఆర్డరేసింది కెప్టెన్ దివ్య. తాను ఆ పని చేయనని గౌరవ్ మొండికేయగా.. అలాగైతే రేపు నీకు భోజనమే ఉండదని దివ్య బెదిరించింది. ఇదిలా ఉంటే ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓటింగ్ వేయాలన్నాడు బిగ్బాస్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారన్నాడు. దీంతో కొందరు కావాలని పవన్ పేరు చెప్పి అతడిని ఈజీగా సైడ్ చేశారు. దెబ్బకు జడుసుకున్న రీతూఅనంతరం ఓ హారర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తనూజ భయపడుతూనే టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత దివ్య.. ధైర్యంగా లోనికి వెళ్లి వచ్చింది. అనంతరం రీతూ.. తనకు భయమనేదే లేదు, ఆడపులి అని బిల్డప్ కొడుతూ లోపలకు వెళ్లింది. కానీ అక్కడున్న దెయ్యాల గెటప్స్ చూసి నిలువెల్లా వణికిపోయింది. చివర్లో మాత్రం ఓ నవ్వు నవ్వి దెయ్యాలు సైతం జడుసుకునేలా చేసింది. ఈ గేమ్లో తనూజ గెలిచింది.చదవండి: జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు.. ఆ రాక్షసుడి వల్ల డిప్రెషన్లో.. నటి -
దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లోనూ రిపీట్ అవుతోంది.ఆడపులి..ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్.. ప్లీజ్.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి! చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్ -
సీక్రెట్ టాస్క్లో ఇరగదీసిన దివ్య.. కల్యాణ్కు అన్యాయం
బిగ్బాస్లో నామినేషన్స్లో మొదలైన గొడవలు పూర్తి అయ్యాక కొత్త కెప్టెన్ కోసం కంటెండర్షిప్ పోటీ మొదలైంది. అయితే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మూడు టీమ్లను బిగ్బాస్ ఏర్పాటు చేశాడు . రీతూ, భరణి, నిఖిల్, డీమాన్ (బ్లూ),దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టి (పింక్),తనూజ, ఇమ్మూ, గౌరవ్, రాము (ఆరెంజ్) అంటూ సభ్యుల ఎంపిక ఛాన్స్ వారికే ఇచ్చాడు. కానీ, హౌస్లో ఇద్దరిని ‘రెబల్స్’గా మార్చిన బిగ్బాస్.. వారికి సీక్రెట్ టాస్క్లను అప్పగించాడు. వారిలో సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. మంగళవారం జరిగిన ఎపిసోడ్లో దివ్య దుమ్మురేపింది. సీక్రెట్ టాస్క్ను సుమన్ శెట్టితో కలిసి గేమ్లో సత్తా చాటింది. కానీ, అదే సమయంలో పెద్ద పొరపాటే చేసింది.రెబల్స్గా సుమన్, దివ్యమంగళవారం ఎపిసోడ్ మొత్తం దివ్య, సుమన్ శెట్టిలదే అని చెప్పాలి. తాజాగా జరిగిన కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసులో రెబల్గా మారి సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్లతో మెప్పించాడు. ఆపై కామనర్గా ఎంట్రీ ఇచ్చిన దివ్య తన పాత్రలో అద్భుతంగా నటించేసింది. అలా ఇద్దరూ సీక్రెట్ టాస్క్లో మెప్పించారు. గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ ఉంచిన బిగ్బాస్.. సమయానుకూలంగా అందరికీ కాల్ చేస్తాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హస్మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరమని చెబుతూ.. హౌస్మేట్స్ అందరి మధ్యలోనే రెబల్స్ ఉన్నారని చెబుతాడు. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి ఆట జాగ్రత్తగా ఆడాలని సూచిస్తాడు. ఈ క్రమంలోనే రెబల్స్ సుమన్ శెట్టి, దివ్యలకు సీక్రెట్ టాస్క్లు ఇస్తాడు. అవి పూర్తి చేస్తే హౌస్మేట్స్లలో ఒక్కరిని ఆట నుంచి తప్పించే ఛాన్స్ వారికి ఉంటుంది.కల్యాణ్కు దివ్య అన్యాయంసీక్రెట్ టాస్కు ప్రకారం సుమన్, దివ్య ఏం చేయాలంటే.. హౌస్లో ఎవరైనా ముగ్గురినీ వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేలా చేసి ఆ ప్లేస్లో వీరు కూర్చోవాలి. అయితే, ఆ ముగ్గురిలోనే ఒక్కరిని ఆట నుంచి తప్పించాలి. ఈ టాస్క్లో భరణి, కళ్యాణ్, గౌరవ్, రీతూలతో దివ్య పూర్తి చేసింది. అయితే , ఇక్కడ భరణిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో తన టీమ్లో ఉన్న కల్యాణ్ను కెప్టెన్ కంటెండర్షిప్ నుంచి తప్పిస్తుంది. ఇదొక్కటే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. దీంతో తర్వాత జరిగిన ఒక గేమ్లో దివ్య టీమ్ ఘోరంగా ఓడిపోతుంది. అదే కల్యాణ్ ఉండివుంటే తప్పకుండా సత్తా చాటేవాడని చెప్పవచ్చు. భరణి కెప్టెన్ రేసులో ఉండాలని కల్యాణ్ను తప్పించి ఆమె చేసిన పొరపాటుతో తన టీమ్ కూడా ఓడిపోయింది.రెండో టాస్క్లో భాగంగా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు దాచమని రెబల్స్కు బిగ్బాస్ ఆదేశించాడు. ఆపై అందులోని ఒక లీటర్ పాలు తాగాల్సి ఉంటుందని కూడా సూచిస్తాడు. అయితే, సుమన్, దివ్య చాలా స్మార్ట్గా ప్లాన్ చేసి టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక సందర్భంలో కల్యాణ్కు అనుమానం వచ్చినా చాలా తెలివిగా దివ్య డైవర్ట్ చేస్తుంది. టాస్క్ పరంగా దివ్య అదరగొట్టింది. కానీ, కల్యాణ్ను ఆట నుంచి తప్పించి కాస్త మైనస్ అయింది. నాగార్జున పనిష్మెంట్.. లెక్కచేయని పవన్, రీతూడీమాన్ పవన్, రీతూ ఇద్దరూ ఈ వారం మాట్లాడుకోవద్దనే పనిష్మెంట్ నాగార్జున ఇచ్చారు. అయితే, డీమాన్ భోజనం తింటున్న సమయంలో రీతూ వచ్చి అతని పక్కనే కూర్చుంది. దీంతో రీతూకు కూడా ఒక ముద్ద తినిపించాడు. నాగార్జున గారు ఇచ్చిన పనిష్మెంట్ మరిచిపోయారా అంటూ దివ్య ప్రశ్నిస్తుంది. రేపు ఒక వీడియో వేసి మళ్లీ నన్నే అంటారు. కెప్టెన్గా ఏం చేశావ్ అని అడుగుతారు అంటూ వారిద్దరిపై దివ్య ఫైర్ అవుతుంది. దీంతో రీతూ, పవన్ ఇద్దరూ కూడా దివ్యపై మండిపడుతారు. మీకు ఉన్న శిక్ష ప్రకారం మాట్లడుకోవద్దు అంటే ఇవన్నీ కూడా చేయొద్దనే వస్తుంది. కుకింగ్ సమయంలో మాత్రమే మీరు మాట్లాడుకోవచ్చు. ఇది సింపుల్ లాజిక్.. ఇందులో కూడా లూప్ హోల్స్ వెత్తుకుంటానంటే నేనేం చేయలేను.. అంటూ దివ్య ఫైర్ అయింది. ఇందులో పూర్తిగా రీతూదే తప్పు. ఆపై పవన్ది కూడా.. ఈవారం హౌస్ట్ నాగార్జున ఈ విషయంపై మాట్లాడే ఛాన్స్ ఉంది. -
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu)లో మాధురి ( Madhuri) కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. అయితే, హౌస్లో ఉన్నన్నిరోజులు తనదైన రీతిలో ముద్రవేశారు. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి 8వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో బిగ్బాస్ షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆపై భరణి, తనను కలిపి ట్రోల్ చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. భరణి రీఎంట్రీ వెనుకు దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి ఓపెన్గా చెప్పారు.భరణితో మీమ్స్.. భగ్గుమన్న మాధురిబిగ్బాస్లో మాధురి ఉన్నన్నిరోజులు తన గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్ అయ్యారు. అయితే, హౌస్లో ఉన్నది కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా కూడా బిగ్బాస్కు సరెండర్ అయి గేమ్ ఆడలేదనిపించేలా సత్తా చాటారు. అయితే.. ఆమె హౌస్లో ఉండగా కొందరు అదేపనిగా భరణి, మాధురి ఫోటోలతో ట్రోల్స్ చేశారు. వాటిపై ఆమె ఇలా ఇరుచుకుపడ్డారు. 'సోషల్మీడియాలో కొందరు బుద్దిలేని ఎదవలు మాత్రమే ఇలాంటి మీమ్స్ వేశారు. దీపావళి పండగ సందర్బంగా హోస్ట్ నాగార్జున చెబితేనే భరణితో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటూనే రెండు స్టెప్పులు వేశాను. కనీసం అతని చేతులు కూడా నేను టచ్ చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేస్తే నీచాతినీచంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తారా..? నాపై ఎవడైతే ట్రోల్స్ చేశాడు వాడు మనిషి కాదు.. ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడూ కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడు.' అని ఆమె ఆవేదన చెందారు.భరణి రీఎంట్రీ వెనుక నాగబాబుబిగ్బాస్లో అత్యంత పేలవమైన కంటెస్టెంట్గా భరణి ఉన్నారు. హౌస్లో అందరితో బాగుండాలనే ఆలోచనతో ఎక్కువగా బాండింగ్స్ పెట్టుకోవడం ప్రేక్షకులకు నచ్చేలేదు. తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని హౌస్ట్ నాగార్జున కూడా చెప్పారు. దీంతో ఆయన 7వ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే, రీఎంట్రీ పేరుతో దమ్ము శ్రీజ, భరణిని హౌస్లోకి పంపారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే హౌస్లో ఉంచుతామని బిగ్బాస్ చెప్పారు. అయితే, దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఎక్కువగా భావించారు. కానీ, ఫైనల్గా ఆ ఛాన్స్ భరణికి దక్కింది. ఈ అంశంలో మాధురి కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులు భరణికి ఉన్నాయని.., అందుకే నాగబాబుకు రెండో ఛాన్స్ ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో దమ్ము శ్రీజ కూడా రియాక్ట్ అయింది. భరణి రీఎంట్రీ కోసం తనను బలి చేశారని ఆమె చెప్పింది. భరణి రీఎంట్రీపై చాలామంది ప్రేక్షకులు కూడా తమ అసంతృప్తి తెలిపారు.భరణి కోసం ట్వీట్ వేసిన నాగబాబుబిగ్బాస్ సీజన్ ప్రారంభంలోనే భరణి కోసం నాగబాబు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'నాకు చాలా సన్నిహితుడైన నా ప్రియమైన భరణి శంకర్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా విజయాన్ని, గుర్తింపును తీసుకురావాలి.' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.తనూజ విన్నర్ అవుతుందిబిగ్బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అవుతుందని మాధురి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె సేఫ్ గేమ్ ఆడటం లేదని క్లారిటీ ఇచ్చారు. 'వాస్తవంగా ఎలిమినేషన్ రౌండ్లో నన్ను సేవ్ చేస్తానని తనూజ కోరింది. నేను వద్దని చెప్పాను. గౌరవ్కు గేమ్ ఆడాలని ఆశ ఉంది కాబట్టి తనను సేవ్ చేయమని తనూజను కోరాను. అంతేకాకుండా హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నా భర్త పుట్టినరోజు ఉందని తనూజకు చెప్పాను. ఎట్టిపరిస్థితిల్లోనూ నన్ను సేవ్ చేయవద్దని ఒట్టు కూడా తనూజతో వేయించుకున్నాను.' అని మాధురి చెప్పారు. -
భరణిపై భగ్గుమన్న తనూజ.. బంధాలకు గుడ్బై
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేషన్ అయిపోయాక సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చుట్టే నడిచిందని చెప్పవచ్చు. తనూజపై దివ్య,భరణి, ఇమ్మాన్యేయల్, సాయి శ్రీనివాస్లు మాటలతో ఎదురుదాడికి దిగారు. సోమవారం జరిగిన ఎపిసోడ్ మొత్తం తనూజ చుట్టే జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. టెడ్డీ బేర్ల టాస్క్ పేరుతో రేసులో చివరగా చేరిన సభ్యులకు నామినేషన్ బాధ్యత ఇచ్చారు. మొదటి రౌండ్లో సంజన నామినేట్ అయితే.. తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధంతో హౌస్ హీటెక్కింది. అయితే.. తనూజ వల్లనే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లానని, ఆమె ఒక్కసారి కూడా తనను సేవ్ చేయలేదని భరణి ఫైర్ అయ్యాడు.మొదటి రౌండ్లోనే అందరికంటే చివరిగా సంజన ఉండటంతో తనకు నామినేషన్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే, సంజనకి తన ఫొటో ఉన్న టెడ్డీయే రావడంతో బిగ్బాస్ ఆదేశాల మేరకు మరోకరితో స్వాప్ చేయాలని సంచాలక్ దివ్యకు అధికారం ఇస్తాడు. దీంతో రీతూతో స్వాప్ చేసే అవకాశం దివ్య ఇస్తుంది. ఇక్కడ సంజన, రీతూ ఇద్దరూ వాదించుకోవాలి. ఫైనల్గా ఎవరి వాదన బలంగా ఉంటే వారిని సంచాలక్ సేవ్ చేస్తారు. బలహీనంగా ఉన్న వారిని నామినేట్ చేస్తారు. అలా ఇద్దరి వాదనలో రీతూ పాయింట్లు చాలా బలంగా ఉన్నాయని అనిపిస్తుంది. సంజన వేసిన కౌంటర్లకు రీతూ చెప్పిన సమాధానాలు బాగానే ఉన్నాయి. దీంతో సంజనని నామినేట్ చేసి.. రీతూని సేవ్ చేసింది దివ్య.తనూజ-భరణి బంధం కట్ తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం మొదలైంది. భరణి మాట్లాడుతూ.. 'తనూజ వల్ల నేనే హౌస్ నుంచి బయటకు వెళ్లాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదు' అని ఫైర్ అయ్యాడు. ఇన్నిరోజులు నాన్న-కూతురు బాండింగ్లో ఉన్న వారిద్దిరూ తమలో ఎవరు హౌస్లో ఉండేందుకు ఎక్కువ అర్హులో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు తనూజ కోసం మూడుసార్లు సపోర్ట్గా టాస్క్లలో నిలబడ్డానని భరణి అంటారు. దీంతో తనూజ కూడా గట్టిగానే వాదించింది. అవన్నీ సపోర్టింగ్ టాస్క్లు కాబట్టే నిలబడ్డారని చెప్పుకొచ్చింది. తనూజ బలమైన పాయింట్లతో భరణిని చిక్కుల్లో పడేసింది. ఇప్పటికీ నీ గేమ్ కూడా మరోకరు ఆడుతున్నారంటూ ఫైర్ అయింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్య కూడా ఏం చేయలేకపోయింది. తనూజ కౌంటర్స్ బలంగా ఉండటంతో తప్పనిసరిగా భరణిని నామినేట్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత భరణి కాస్త రియాలిటీలోకి వచ్చినట్లు ఉన్నాడు. తనూజ, దివ్యల దగ్గరికి వెళ్లి ఇక నుంచి మీరిద్దరూ నా గురించి మాట్లాడకండి. మీ ఆట మీరు ఆడుకోండి అంటూ తమ బంధం ఇంతటితో ముగిసిందని స్పష్టంగా చెప్పేశాడు.పెళ్లి కూతురులా తనూజ.. ఇమ్మాన్యుయేల్ కౌంటర్స్తర్వాతి నామినేషన్లో కూడా ఇమ్మాన్యుయేల్తో తనూజ పోటీ పడాల్సి వచ్చింది. తన నామినేషన్ తనూజ అంటూ ఇమ్ము ఫైర్ అయ్యాడు. తనూజ సేఫ్ గేమ్ ఆడుతోందని అతను గట్టిగానే ఆరోపించాడు. అయితే, ఇమ్ము ప్రశ్నలకు తనూజ సరైన సమాధానం చెప్పలేకపోయింది. కానీ, ఈసారి కూడా సంచాలకులు తనూజని నామినేట్ చేయలేదు. అయితే, నామినేషన్ చేసే ఛాన్స్ తనూజకి రావడంతో తను కూడా ఇమ్మాన్యుయేల్ని నామినేట్ చేసింది. ఇమ్ము చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని.. సపోర్ట్ చేస్తున్నా అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని సేఫ్ ఆడుతున్నాడని తనూజ చెబుతుంది. అయితే, ఇమ్ము కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇచ్చాడు. నువ్వు బెడ్డు టాస్కులో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చుంటే మేము సపోర్ట్ చేశామని గుర్తు చేశాడు. అసులు నువ్వు టాప్-5లోకి ఎలా వచ్చావ్ ఆ గేమ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ఇమ్ము అన్నాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు గట్టిగానే మాటలతో రెచ్చిపోయారు. మరోవైపు రాము, కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఫైనల్గా సంచాలక్గా ఉన్న డీమాన్.. కళ్యాణ్ని నామినేట్ చేసి ఇమ్ముని సేవ్ చేస్తాడు.దివ్య- తనూజ మాటల యుద్ధంచివర్లో బిగ్ బాస్ ఒక సరప్రైజ్ ఇస్తాడు. కెప్టెన్ దివ్యకు ప్రత్యేక అధికారం ఇస్తూ.. ఇప్పటివరకు నామినేట్ కానివారిలో ఒకరిని నామినేట్ చేయాలని కోరుతాడు. దాంతో తనూజను నామినేట్ చేస్తున్నట్లు దివ్య చెప్పింది. ఇక్కడ కూడా భరణి పేరుతో డ్రామ నడిచింది. భరణి, తనూజల బాండ్ దివ్య బ్రేక్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు. అలాంటి ఆరోపణలు రావడానికి కారణం నువ్వే (తనూజ) అంటూ దివ్య నామినేట్ చేసింది. దానికి తనూజ కూడా బలంగానే కౌంటర్ ఇస్తుంది. నేను ఆయన్ని (భరణి) నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్ అంటూ ఫైర్ అయింది. ఆపై వెంటనే దివ్య కూడా మరో పంచ్ విసురుతుంది. తనూజ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటుంది అంటూ ప్రతి టాస్క్లో సింపతీ కోసం చూస్తుందని తనూజపై కామెంట్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే నడిచింది. ఫైనల్గా 9వ వారం నామినేషన్స్లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు. -
విడిపోనున్న తండ్రీకూతురు.. తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణి
మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్బాస్ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజ వర్సెస్ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్ జరగనున్నాయి.తనూజ వర్సెస్ ఇమ్మూతాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఏవైనా ఉంటే బయట చూసుకోండిభరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్ ఎక్కడుంది? ఏదైనా పాయింట్ మాట్లాడితే అది మీ పర్సనల్ అంటున్నారు. పర్సనల్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్లో కాదు అని అరిచేసింది.తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణిఏదైతే బాండింగ్ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది. చదవండి: నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు! -
ఏడ్చేసిన సుమన్.. నామినేషన్స్లో ఎవరంటే?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో తొమ్మిదో వారం నామినేషన్స్కు రంగం సిద్ధమైంది. ఫైర్ బ్రాండ్ మాధురి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్లో 13 మంది మిగిలారు. వీరికి గతంలోని పాత బొమ్మల టాస్కే ఇచ్చారు. బజర్ మోగగానే వేరేవారి ఫోటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్ జోన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆఖరిగా జోన్లో అడుగుపెట్టేవారు, వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫోటో ఉంటుందో వారు నామినేషన్ జోన్లోకి వస్తారు.ఏడ్చేసిన సుమన్తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. సంజనా (Sanjana Galrani) మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్గానే ఉన్నాను. కానీ, రీతూ గేమ్లో డిమాన్ పవన్ సాయం చేస్తున్నాడు. అది అందరికీ కనిపిస్తుందని చెప్పింది. అది విన్న రీతూ.. మీకెలా బాండ్స్ ఉన్నాయో, నాకూ అలాగే హౌస్లో ఒక బాండ్ ఉంది. అది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను అని ఇచ్చిపడేసింది. సుమన్ మాట్లాడుతూ.. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, తనూజను సేవ్ చేసి నేను నామినేట్ అవాలనుకుంటున్నా అని ఏడ్చేశాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు. సుమన్ (Suman Shetty) కళ్లలో నీళ్లు తిరిగేసరికి పవన్, కల్యాణ్ అతడిని ఓదార్చారు.నామినేషన్స్లో ఎవరు?మొత్తానికి ఈ వారం భరణి, సంజనా, తనూజ, రాము, సాయి, కల్యాణ్ నామినేట్ అయ్యారని తెలుస్తోంది. తనూజ.. ఇమ్మాన్యుయేల్ను నామినేట్ చేశారంటున్నారు. అది నిజమేనా? ఏమైనా మార్పులుచేర్పులున్నాయా చూడాలి! బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇమ్మూ నామినేషన్స్లో లేడు. ఇది అతడికే మైనస్ అవుతుంది. నామినేషన్స్లోకి వస్తేనే అతడి అభిమానులకు ఓట్లేయడం అలవాటవుతుంది. తనకు ఏ స్థాయిలో ఓట్లు పడతాయి? దాన్ని పెంచేందుకు ఇంకా ఎలా కృషి చేయాలన్నది ఐడియా వస్తుంది? లేదంటే టాప్ 2కి బదులుగా టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి -
బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) నుంచి ఎలిమినేట్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ మాధురి మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నవంబర్ 4న ఆమె పార్ట్నర్ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజట! ఆయన పుట్టినరోజునాడు పక్కనలేకపోతే ఏం బాగుంటుంది? అందుకే.. అలా పిక్నిక్కు వెళ్లినట్లు బిగ్బాస్కు వెళ్లి ఇలా బర్త్డే సమయానికి బయటకు వచ్చేసింది. బిగ్బాస్ బజ్లో కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తోంది.ఎంట్రీ, ఎలిమినేషన్ అంతా మాధురి చేతిలోనే..తాజాగా రిలీజైన బిగ్బాస్ బజ్ ప్రోమోలో యాంకర్ శివాజీ మాట్లాడుతూ.. 100% తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు. నిజంగా వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? అని ముఖం మీదే అడిగేశాడు. అందుకు మాధురి (Divvala Madhuri).. నేను రావాలనుకున్నాను, కాబట్టే బయటకు వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు, నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. బిగ్బాస్కు వెళ్లాలనుకున్నాను కాబట్టి వెళ్లాను, రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని చాలా క్లారిటీగా బదులిచ్చింది.భయం నా బ్లడ్డులోనే లేదుఒకానొక దశలో శ్రీజకు భయపడినట్లు అనిపించింది అని శివాజీ అడగ్గా.. భయమనేది నా బ్లడ్డులోనే లేదని మాధురి డైలాగ్ పేల్చింది. మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ శివాజీ కూడా ఆమెకు కౌంటరిచ్చాడు. మాధురి బిగ్బాస్ నుంచి వచ్చేముందు కూడా నాగార్జునతో నవంబర్ 4న మా ఆయన బర్త్డే.. ఆ పుట్టినరోజుకల్లా రావాలనుకున్నాను, వచ్చేశాను అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడీ బజ్ ప్రోమో చూస్తుంటే మాధురి పిక్నిక్కు వెళ్లినట్లే కనిపిస్తోంది. మూడు వారాలు హౌస్లో ఉన్న మాధురితనపై ఉన్న నెగెటివిటీ పోగొట్టుకోవడానికి బిగ్బాస్ను ఎంచుకుంది. అక్టోబర్ 12 వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో లేదు. రెండో వారం తననెవరూ నామినేట్ చేయలేదు. కానీ ఆ వారంలో ఆమె రీతూను బండకేసి కొడ్తా.. జుట్టుపట్టుకుని ఈడ్చి కొడ్తా.. అంటూ హద్దులు మీరి మాట్లాడింది. హౌస్మేట్స్ కూడా ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్ అంటూ ఆమె మెడలో ఎక్కువ బోర్డులు వేశారు. దీంతో తనకు డైరెక్ట్ నామినేషన్ అనే పనిష్మెంట్ ఇచ్చింది తనూజ. పిక్నిక్ పూర్తయిందిమాధురి కూడా ఇదే కోరుకుంది. అందుకే తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉన్నప్పటికీ దాన్ని తనకోసం వాడొద్దని మరీమరీ చెప్పింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం భర్త/ పార్ట్నర్ బర్త్డే సమయానికి బయటకు వచ్చేసింది. ఆమె అరుపులు, కేకలు, హద్దులు మీరి మాట్లాడటం చాలామందికి చిరాకు పుట్టించింది. అదే సమయంలో ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్లు చెప్పడంతో తనపై పాజిటివిటీ కూడా వచ్చింది. మొత్తానికి మాధురి ఎలిమినేషన్కు పెద్దగా కారణాలంటూ ఏమీ లేదు. తనే వచ్చింది.. తనే దర్జాగా వెళ్లిపోయింది.చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి -
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి
సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్లో ఏం జరిగాయో చూసేద్దాం..పర్ఫామెన్స్ ఇరగదీశారుది గర్ల్ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్మేట్స్తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్మేట్స్తో ఓ విషయం చెప్పాడు నాగ్. కాళ్లు పట్టుకున్న రాముఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.నా బంగారం తనూజ: మాధురిఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్కు సైతం రోజాలు ఇచ్చింది.100%ఫేక్ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.చదవండి: బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్ -
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu) నుంచి 8వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నామినేషన్స్లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే, వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ మధ్య లాస్ట్ వరకు గట్టి పోటీ నెలకొంది.. కానీ, ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే, బిగ్బాస్ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్బిగ్ బాస్ హౌస్లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. కానీ, చాలా బలంగానే తన మార్క్ వేశారు. అసలైన ఫైర్ బ్రాండ్గా హౌస్లో పేరు పొందారు. తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు. మాధురికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్బాస్ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాలకే రూ. 9 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆమె నిలిచారు. అయితే, ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు. వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు.మాధురికి హౌస్లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్కు గురయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు. ఆమెను ఎందుకు సెలక్ట్ చేశారంటూ బిగ్బాస్ టీమ్ను కూడా తప్పుబట్టారు. అయితే, హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం. తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు. తన గేమ్లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే.. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. విపరీతమైన నెగటివిటీతో హౌస్లోకి అడుగుపెట్టిన మాధురి.. బిగ్బాస్ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఈ సీజన్లో చాలా పాపులర్ కంటెస్టెంట్గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం.నాకు ముందే తెలుసు: మాధురిహౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు. నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబట్టి ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, తనకు బిగ్బాస్ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆమె చాలా స్వీట్ అంటూ కితాబు ఇచ్చారు. తనూజ సీరియల్లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తరువాత కల్యాణ్ ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి.. డిమోన్ పవన్ కూడా చాలా స్వీట్ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు. హౌస్లో 100శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు. -
బిగ్బాస్ స్టేజీపై రష్మిక.. భరణి సిగ్గు చూస్తే నిజంగా చచ్చిపోవాల్సిందే!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి నేషనల్ క్రష్, కాబోయే తెలుగింటి కోడలు రష్మిక మందన్నా (Rashmika Mandanna) వచ్చేస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా దీక్షిత్, రష్మిక బిగ్బాస్ స్టేజీపైకి వచ్చారు.సీన్స్ రీక్రియేషన్వీరుండగానే హౌస్మేట్స్తో ఓ ఫన్గేమ్ ఆడించాడు నాగ్.. కొన్ని పాపులర్ సీన్స్ ప్లే చేసి.. వాటిని రీక్రియేట్ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్మేట్స్ తమ కళనంతా బయటపెట్టారు. పోకిరి, అదుర్స్ వంటి పలు హిట్ సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేశారు. వారి డైలాగులు, యాక్టింగ్ చూస్తుంటే జనాలు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. చివర్లో భరణి (Bharani Shankar) బ్రహ్మానందంలా మారిపోయాడు. వెంటనే మాధురి.. ఆ వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలంట ప్రేమ అని భరణిపై సెటైర్లు వేసింది.బ్రహ్మానందంలా మారిపోయిన భరణిఅందరికీ ఏమైనా సిక్స్ ప్యాక్లు ఉన్నాయా? అని భరణి అంటుంటే.. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని కోపగించుకుంది. దాంతో భరణి.. నువ్వలా హార్ష్గా మాట్లాడకు చందు, హర్టవుతాను అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. అలాగే బామ్మ క్యారెక్టర్లో ఉన్న సంజనాతో.. మీరలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని డైలాగ్ వేశాడు. మొత్తానికి చాలాకాలం తర్వాత ఈ సండే ఫన్డేగా మారుతుందని అర్థమవుతోంది. అయితే, సోషల్ మీడియా లీక్స్ ప్రకారం మాధురి ఎలిమినేట్ అయిందట. అంటే రేపటినుంచి మంచి మాస్ మసాలా గొడవలు మిస్ అవుతామన్నమాట! చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ -
షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు
వీకెండ్ వచ్చిందంటే క్లాసులు పీకడమే నాగార్జున చేసే ఏకైక పని. సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణికి పెద్ద లెక్చర్లే ఇచ్చాడు. కానీ పవన్ను మాత్రం ఏకంగా ఏడిపించేశాడు. ఇంతకీ హౌస్లో ఏం జరిగిందో శనివారం (నవంబర్ 1వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..బెస్ట్ కెప్టెన్రేషన్ మేనేజర్ తనూజ (Thanuja Puttaswamy)కే ఆర్డర్ వేస్తావా? అని కల్యాణ్ను, నామినేషన్ చేసిన పాయింటే తప్పని ఇమ్మాన్యుయేల్ను ఏకిపారేశాడు నాగ్. సుమన్ను అసమర్థ కెప్టెన్ అన్న సంజనాని సైతం తప్పుపట్టాడు. ప్రేక్షకులతో సుమన్ బెస్ట్ కెప్టెన్ అనిపించేలా చేశాడు. కెప్టెన్సీ గేమ్లో భరణి గోడమీద పిల్లిలా సేఫ్ గేమ్ ఆడటాన్ని ఖండించాడు. ఇలాగే ఉంటే ఎక్కువరోజులు ఉండలేవని వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారమంతా ఎప్పుడుపడితే అప్పుడు గొడవలు పెట్టుకుంటూ, దాన్ని సాగదీస్తూ మహా చిరాకు తెప్పించారు పవన్-రీతూ. డోర్స్ ఓపెన్వీళ్లకు నాగార్జున గట్టి క్లాస్ పీకితేకానీ బుద్ధి రాదని ప్రేక్షకులు ఎదురుచూశారు. తీరా నాగార్జున (Nagarjuna Akkineni) ఊహించినదానికన్నా ఎక్కువ సీరియస్ అవడంతో పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడపిల్లను తోసేస్తావా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీ బ్యాగులు సర్దుకో.. డోర్స్ ఓపెన్ అంటూ తక్షణమే వెళ్లిపోవాలన్నాడు. ఆ మాటకు పవన్ నిలువెల్లా వణికిపోయాడు. ఇంకోసారి ఆ తప్పు రిపీట్ చేయను సార్ అని వేడుకున్నాడు. చేతులు జోడించి వేడుకున్న పవన్అటు రీతూ (Rithu Chowdary) కూడా.. ఇద్దరం గొడవపడుతున్నాం.. నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు. ఈసారికి వదిలేయండి అని వేడుకుంది. అయినా నాగ్ కనికరించలేదు. బిగ్బాస్ ఇంటి డోర్ తెర్చుకోవడంతో పవన్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది రీతూ. నువ్వు కోపంలో అలా చేశావ్, నాకు తెలుసు.. స్ట్రాంగ్గా ఉండు.. సార్కు అర్థమయ్యేలా వివరించు.. ఆయనకు సారీ చెప్పు అని బోధించింది. దీంతో అతడు సారీ సర్.. ఇంకోసారి రిపీట్ చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి అని దీనంగా చేతులు జోడించి అడిగాడు. క్షమించేది లేదన్న నాగ్ఈసారి నాగార్జున హౌస్మేట్స్ అభిప్రాయాలు అడగ్గా.. ఎవరూ కూడా అతడికి ఎలిమినేట్ అయ్యేంత పెద్ద శిక్ష విధించాలని కోరుకోలేదు. అప్పుడు నాగ్.. ఇది హౌస్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు, షో ఇమేజ్కు సంబంధించింది. మీ తరువాత వచ్చేవాళ్లు ఈ సంఘటనను చూసి ఇలాగే ప్రవర్తిస్తే షో పడిపోతుంది. కాబట్టి నేను క్షమించలేను అన్నాడు. ఇంతలో రీతూ మాట్లాడుతూ.. వాడు నన్నేదో చేయాలనే ఉద్దేశం కాదు సార్.. ఇద్దరం గొడవపడుతుంటే మాట వినకుండా వెళ్లిపోతున్నాననే అలా నెట్టాడు. అంత చిన్నదానికి హౌస్లో నుంచి పంపించొద్దు అని బతిమాలింది. మోకాళ్లపై కూర్చుని సారీ అందుకు నాగ్ మాట్లాడుతూ.. మాధురి మీది అన్హెల్దీ బాండ్ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. అలా అనడానికి ఆమెకేం హక్కు ఉందనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీది కచ్చితంగా అన్హెల్దీ బాండింగే.. అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రీతూకే కాదు, ఆడియన్స్కు కూడా క్షమాపణ చెప్పాలని పవన్ను ఆదేశించాడు. దీంతో పవన్.. రీతూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. మోకాళ్లపై కూర్చుని.. నేనలా చేసి ఉండకూడదంటూ తలవంచుకుని సారీ చెప్పాడు. అప్పటికి శాంతించిన నాగార్జున.. తెరుచున్న బిగ్బాస్ ఇంటి డోర్లను మూయించేశాడు.చదవండి: పవన్కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే? -
పవన్కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?
గతంతో పోలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్బాస్ హౌసులో కాస్త డ్రామా కనిపిస్తోంది. ఈ వారమంతా కూడా భరణి, శ్రీజ మధ్యలో పోటీ పెట్టి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారనేది తేల్చారు. చివరకు గెలిచిన భరణి.. హౌసులోకి మళ్లీ వచ్చేశాడు. ఇక వీకెండ్ వచ్చిందంటే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి కూడా అలానే ఒకరు బయటకెళ్లిపోయారు. కానీ ఒకరు అనుకుంటే మరొకరు ఔట్ అయ్యారట.8వ వారం నామినేషన్స్లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. వీళ్లలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్.. తొలిసారి నామినేషన్స్లోకి వచ్చారు. దీంతో వీకెండ్ అయ్యేసరికి వీళ్లకే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ ఏర్పడింది. తొలుత గౌరవ్ బయటకొచ్చేశాడని రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోగా లోకేశ్ కనగరాజ్.. మూవీ టీజర్ రిలీజ్)మరోవైపు లేటెస్ట్ ప్రోమోలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. రీతూ-పవన్కి సంబంధించిన ఓ వీడియో చూపించిన హోస్ట్ నాగార్జున.. పవన్పై సీరియస్ అయ్యారు. ఈ వీడియోలో పవన్.. రీతూని బెడ్పైకి తోస్తూ కనిపించాడు. బిగ్బాస్ నిబంధనల ప్రకారం.. తోసేయడం, తన్నడం లాంటివి చేయకూడదు. వీడియో ప్లే చేసిన తర్వాత.. 'ఇలాంటి ప్రవర్తన మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా ఆడియెన్స్' అని నాగ్ అడిగాడు. అలా తోయడం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అనేసరికి.. 'సారీ సర్' అని పవన్ అన్నాడు.సారీ చెబితే బిగ్బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాగ్ సర్దుకే. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగార్జున అన్నాడు. దీంతో పవన్ దీనంగా ముఖం పెట్టి కనిపించాడు. మరోవైపు రీతూ.. 'సార్ సార్ వద్దుసార్' అని నాగార్జునని ప్రాధేయపడుతూ కనిపించింది. అయితే ఇదంతా డ్రామా నడిపించడమే కోసమే అనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లలో ఇలాంటి హంగామా చాలాసార్లు చూపించారు. దీంతో పవన్ బయటకెళ్లడం జరగదులే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) -
మాధురి నోటికాడి కూడు లాక్కుంటారా? దివ్య ఓవరాక్షన్ ఏంటో?
బిగ్బాస్ హౌస్ (Bigg Boss Telugu 9)లో ఏది జరిగినా ఒకరోజు ఆలస్యంగా చూపిస్తారు. అలా శుక్రవారం రోజు జరిగినదాన్ని నేడు ఎపిసోడ్లో చూపించనున్నారు. ఇక ఫ్రైడే అంటే పెద్దగా టాస్కులేవీ ఉండవు. కేవలం ఫన్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇటువంటి ఫన్ గేమ్స్ దగ్గరా గొడవ పడొచ్చని నిరూపించారు తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్స్.తిండి దగ్గర లొల్లితాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ పూర్తయ్యాక అందరూ ప్లేటులో బిర్యానీ వేసుకుని ఆవురావురుమని ఆరగించారు. ఓపక్క అందరూ తింటుంటే మాధురి అప్పుడే వచ్చి ప్లేటులో బిర్యానీ వేసుకోబోయింది. అది చూసిన భరణి, దివ్య వెంటనే ఆపేశారు. వేరే టీమ్కు ఇంకా పీసులు వెయ్యలేదు, వారికి వేశాక మీకు పెడతాను అని భరణి అడ్డుకున్నాడు. దీంతో మాధురి హర్టయిపోయింది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది. ఆయనకు నోరు లేదా?చిన్నచిన్నవాటికెందుకిలా.. అని భరణి (Bharani Shankar) వివరించబోయాడు. ఇంతలో దివ్య.. మధ్యలో కలగజేసుకుని మాట్లాడటంతో మాధురి అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది. ప్లేటు పట్టుకున్నప్పుడు అలా అనేస్తే ఎలా తింటాం? అతడు అడుగుతున్నదానికి సమాధానం చెప్తున్నా.. మధ్యలో ఈమె (దివ్య) వివరణ ఇవ్వడం దేనికి? ఆయనకు నోరు లేదా? మాట్లాడలేడా? అని మాధురి.. కల్యాణ్ ఎదుట తన కడుపులో ఉన్నదంతా కక్కేసింది.మీ గేమ్ మీరు ఆడండిఇక ఈ గొడవయ్యాక తనూజ.. భరణితో ఇది మీ గేమ్ మీరు ఆడండి.. మధ్యలో దివ్య ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంది. నిజమే.. దివ్య ఇలా భరణిపై పెత్తనం చెలాయిస్తే అది అతడికే నెగెటివ్ అయి మళ్లీ ఎలిమినేట్ అవడం ఖాయం. మరి భరణి ఏం చేస్తాడో చూడాలి! చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన -
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9)లో రీఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఆడియన్స్ భరణికే ఓట్లు గుద్దిపడేశారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి నిష్క్రమించింది. పర్మినెంట్ హౌస్మేట్ అయిన భరణికి బిగ్బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదేంటో శుక్రవారం (అక్టోబర్ 31వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి..భరణి చేతిలో పవర్ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయమని భరణి (Bharani Shankar)కి పవర్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో అతడు ఈ వారం తనకు సపోర్ట్ చేసినవారికే ఛాన్స్ ఇస్తానన్నాడు. మాధురి మాత్రం అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వమంది. భరణి మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ అవలేని వారికే ఛాన్స్ ఇస్తానంటూ.. అతడి పేరుతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్ను సెలక్ట్ చేశాడు. రీతూను సెలక్ట్ చేయకపోవడంతో ఆమె కాస్త హర్టయింది.తనూజ వర్సెస్ కల్యాణ్రేషన్ మేనేజర్గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. బెండకాయలు పాడైపోయేలా ఉన్నాయని, వాటితో కూర వండాలంది. చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలూ కుర్మా కావాలని కల్యాణ్ అడిగాడు. అడిగినవన్నీ చేసిపెట్టేందుకు సర్వెంట్లం కాదు, అన్నిట్లో వేలు పెట్టకు.. అంటూ కల్యాణ్పై రెచ్చిపోయింది తనూజ. అతడు కూడా వెనక్కు తగ్గలేదు. అన్నీ నీకు నచ్చినట్లే చేయాలంటే కుదరదంటూ కౌంటరిచ్చాడు. ఇలా కాసేపు వీరిద్దరూ గొడవపడ్డారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లకు డీజే టాస్క్ పెట్టాడు. డీజే డ్యాన్స్ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ప్లాట్ఫామ్పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్ఫామ్పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచినట్లు. రాము సంచాలక్గా వ్యవహరించాడు. ఎలాగో అందరూ ఊహించినట్లే నిఖిల్, సాయికి ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. భరణిని కూడా లైట్ తీసుకున్నారు. దివ్య, తనూజకు మాత్రం పోటాపోటీగా మద్దతు పలికారు. బొమ్మలా నిల్చున్న భరణిదీంతో వీళ్లిద్దరూ రెండో రౌండ్లో పాల్గొన్నారు. అయితే ఈ రౌండ్ ప్రారంభమవడానికి ముందే దివ్య తెలివిగా.. భరణికి సపోర్ట్ చేసేవారి దగ్గరికెళ్లి సాయం చేయమని అడిగింది. దీంతో రాము, సుమన్, సంజన.. ఇలా చాలామంది ఆమెకు మాటిచ్చి ఆ మాటపై నిలబడ్డారు. రెండో రౌండ్లో తనూజ కోసం మాధురి, రీతూ, డిమాన్, కల్యాణ్ నిలబడ్డారు. దివ్య కోసం ఇమ్మూ, గౌరవ్, సుమన్, సాయి, సంజన నిల్చున్నారు. ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. ఈ గేమ్లో భరణి.. ఎటూ తేల్చుకోలేక మధ్యలో నిలబడి సినిమా చూడటం విశేషం!కెప్టెన్గా దివ్యతనూజ.. గతవారం కూడా టాప్ 2దాకా వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తనకు దుఃఖం ఆగలేదు. రీతూ ఓదారుస్తుంటే మాధురి మాత్రం తన దుమ్ము దులిపేసింది. అందరినీ నమ్ము.. అది ఏడిస్తేనే బాగుంటుంది. ఏడవినవ్వవే.. ఎంత దారుణం.. నాన్న నాన్న అని వెళ్లిపట్టుకో అంటూ ఫైర్ అయింది. తనూజ మాత్రం ఏడుస్తూనే.. ఇప్పుడైనా నమ్ముతావా? నా గేమ్ నేను ఆడుతున్నా.. మాటలకు వస్తారు, కానీ సపోర్ట్ చేయరు అంటూ బాధపడింది. అందరినీ బతిమాలుకోవడం అలవాటైన రీతూ.. అదే పని చేసి రేషన్ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది. ఈ మధ్య అరుపులు, ఆజమాయిషీతో ఓవర్ చేస్తున్న దివ్య.. కెప్టెన్గా ఎలా ఉంటుందో చూడాలి!చదవండి: ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్ -
మాధురితో గుంజీలు తీయించిన మహానుభావుడు.. కల్యాణ్తో తనూజ లొల్లి
హౌస్లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూమాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.మరీ ఓవర్ చేస్తున్నారుఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు -
బిగ్బాస్ తనూజపై యష్మి, శ్రీ సత్య ట్రోలింగ్ (వీడియో)
బిగ్బాస్ తెలుగు సీజన్-9 ఇప్పటికే 50రోజులు పూర్తి చేసుకుంది. దీంతో సీజన్ విజేత ఎవరు అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు లేడీ కంటెండర్ ఎవరూ విన్నర్ కాలేదు. కానీ, ఓటీటీ సీజన్లో బిందు మాధవి మాత్రమే విజేతగా నిలిచింది. అయితే, ఈసారి కన్నడ బ్యూటీ తనూజ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి పలు ఓటింగ్ వేదికలలో తనే టాప్లో ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం హౌస్లో ఉన్నవారిలో తనూజ బెటర్ అంటూ చాలామంది బిగ్బాస్ ఫాలోవర్స్ చెప్పడం విశేషం. ఎమోషన్స్, టాస్కులు, ఎక్స్ప్రెషన్స్, ఇతరులతో కన్విన్సింగ్గా మాట్లాడటం వంటి అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె ఆట తీరు నచ్చని వారి నుంచి నెగెటివ్ కూడా సోషల్మీడియాలో కొనసాగుతుంది. ఇలా రెండు కోణాల్లో తనూజ విన్నింగ్పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా బిగ్బాస్ టీమ్ కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, ఈ కామెంట్లు ప్రతి సీజన్లో వస్తూనే ఉంటాయి. విన్నింగ్ రేసులో ఉన్న వారితో పాటు బిగ్బాస్ టీమ్పై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రతిసారి చూసిందే.తనూజపై ట్రోలింగ్కు దిగిన యష్మి, శ్రీ సత్యతాజాగా తనూజపై పాత కంటెస్టెంట్స్ ట్రోలింగ్కు దిగారు. ఒక వీడియోను తమ ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. బిగ్బాస్ సీజన్-8 కంటెస్టెంట్ యష్మి గౌడ, సీజన్-6లో పాల్గొన్న శ్రీ సత్య స్విమ్మింగ్ ఫూల్లో ఉంటూ తనూజపై పరోక్షంగా ట్రోలింగ్కు దిగారు. వారిద్దరూ తనూజను టార్గెట్ చేస్తున్నారని రెగ్యూలర్గా బిగ్బాస్ చూసే వాళ్లకు సులభంగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మర్యాద మనీష్ హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో కల్యాణ్ను నామినేట్ చేసి హెచ్చరిస్తాడు. 'ముద్దుగా మాటలు చెప్పి మందార పూలు పెడుతున్నారు' అంటూ పరోక్షంగా తనూజతో జాగ్రత్త అనేలా హింట్ ఇస్తాడు. ఇప్పుడు ఇదే పాయింట్తో యష్మి గౌడ ఇలా ట్రోలింగ్ మొదలు పెట్టింది. 'అరేయ్.. ఏంట్రా నువ్వు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారం పువ్వులు పెడుతున్నావ్.. నాకు దెబ్బలు తగిలాయి ఫ్రెండ్స్.. ఇదీ (శ్రీ సత్య) ముద్దు ముద్దు మాటలు చెప్పి నా చెవిలో మందార పువ్వులు పెడుతుంది.' అంటూ ఇద్దరూ కలిసి ఒక వీడియో క్రియేట్ చేసి వదిలారు. గతంలో కూడా ఆమె పరోక్షంగా తనూజపై పోస్టులు పెట్టింది. కేవలం పీఆర్ టీమ్ వల్లే తన ఆట కొనసాగుతుంది అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇలా ఏకంగా వీడియో షేర్ చేసింది.S7 #Nikhil mida Soniya vachi blame Veste Enjoy chesav ga niku #Thanuja la stand teeskune ammayi lu endku Nachutaru le #Yashmi 👎🏼😡. Cheap #BiggBossTelugu9 https://t.co/WOcl6esgvl— k®!t|=|i v€®m@ (@Priyaskp77777) October 30, 2025 View this post on Instagram A post shared by Y A S H M I G O W D A (@yashmigowda) -
దివ్య, ఇమ్మూ అసలైన తోపులు.. ఓవర్ చేసిన శ్రీజ.. మరోసారి బైబై!
హౌస్లో టెంపరరీ హౌస్మేట్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. కానీ, బయట వస్తున్న సింపతీ, అభిమానం చూశాక గర్వం తలకెక్కింది. ఇంతకీ హౌస్లో ఏం జరిగిందో గురువారం (అక్టోబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..అన్నం మీద అలిగిన మాధురితనూజ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయిందో కానీ కిచెన్లో ఒకటే గొడవలు.. ఈ సారి ఆ గొడవల్లో మాధురి బలైంది. అన్నం మీద అలిగి కూర్చుంది. తను తినకుండా ఉంటే భరణి (Bharani Shankar) చూసి తట్టుకోలేకపోయాడు. అతడే కాదు, సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. ఇలా అందరూ తినమని బతిమాలారు. అందరూ పదేపదే అడిగేసరికి కాదనలేక తినేసింది. అలక తగ్గిపోయాక తనూజతో కలిసిపోయి తనకు జడేసింది.తనూజకి పొగరు: శ్రీజమధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూర కాస్త మిగిలింది, కావాలనుకున్నవాళ్లు రండని పిలిచింది తనూజ (Thanuja Puttaswamy). దీంతో సాయి సహా మరికొందరు వెళ్లి కూర వేసుకున్నారు. కాసేపటికి శ్రీజ.. కర్రీ ఉందా? అని అడగ్గా తనూజ స్పందించలేదు. దాంతో శ్రీజ.. నేను టెంపరరీ హౌస్మేట్ని అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు.. ఆమె(తనూజ)కు పొగరని ఇందుకే అన్నానంటూ ఫైర్ అయింది. ఇక్కడ పవన్.. తనూజకోసం స్టాండ్ తీసుకోవడం గమనార్హం!కల్యాణ్ను చిత్తు చేసిన ఇమ్మూఇక బిగ్బాస్.. కట్టు-పడగొట్టు టాస్క్ను రద్దు చేసి మరో గేమ్ ఇచ్చాడు. భరణి పరిస్థితి బాలేనందున అతడి కోసం దివ్య ఆడింది. శ్రీజ ఈ గేమ్లో అట్టర్ ఫ్లాప్ అవగా దివ్య అలవోకగా ఆడి గెలిచేసింది. మరో గేమ్లో శ్రీజ కోసం కల్యాణ్, భరణి కోసం రాము బరిలో దిగారు. ఇందులో కల్యాణ్ చకచకా ఆడి గెలిచేశాడు. తర్వాతిచ్చిన టాస్క్లో మాత్రం కల్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు. భరణి కోసం ఆడిన ఇమ్మూ మరోసారి తన పవర్ చూపించాడు. ఇలా భరణి రెండు టాస్కులు గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు.హర్టయిన పవన్అయితే శ్రీజ కోసం తాను ఆడతానన్నా తన పేరు లెక్కలోకి తీసుకోకపోవడంపై డిమాన్ పవన్ హర్టయ్యాడు. టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది. ఈజీ గేమ్.. కల్యాణ్ ఆడలేకపోయాడు అని కామెంట్ చేశాడు. ఈ విషయంలో పవన్-శ్రీజకు గొడవ అయింది. తర్వాత కల్యాణ్.. గేమ్లో ఓడిపోయినందుకు శ్రీజకు సారీ చెప్పాడు. సారీ చెప్తే గూబ పగిలిపోద్ది.. అన్నీ మనమే గెలుస్తామా? అంటూ ఫ్రెండ్ను ఓదార్చింది. శ్రీజ రెండోసారి ఎలిమినేట్గతంలో నామినేషన్స్లో ఉన్నప్పుడు పవన్ సేవ్ చేయడం వల్లే శ్రీజ మరికొన్ని వారాలు హౌస్లో ఉంది. అతడే మొన్నటి టాస్క్లో దెబ్బలు తగిలించుకుని మరీ శ్రీజను గెలిపించాడు. అయినా పవన్ను పక్కనపెట్టడం ఏంటో ఆమెకే తెలియాలి! హౌస్లో ఆమె చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఓట్లు కూడా సరిగా పడలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అవగా భరణి హౌస్లో ఉండిపోయాడని తెలుస్తోంది.చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్ -
బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్
తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, ఆర్జే సూర్య (RJ Surya) జీవితంలో పెళ్లి ఘడియలు వచ్చేశాయి. బుల్లితెర నటి సుధీర చెల్లెలు, ఆర్జే శౌర్యతో అతడి నిశ్చితార్థం జరిగింది. గురువారం జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్జే సూర్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ఈ ఎంగేజ్మెంట్కు బుల్లితెర నటి సుష్మ కిరణ్ సహా పలువురు హాజరయ్యారు. సుధీర.. కథలో రాజకుమారి సీరియల్లో యాక్ట్ చేసింది. ఆర్జే సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మ బీడీలు చుడితే నాన్న తాపీ పని చేసేవాడు. తండ్రి పనికి వెళ్తేనే ఆ కుటుంబానికి పూట గడిచేది. కుటుంబ పరిస్థితి వల్ల సూర్య స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పాన్ షాప్లో సోడా సీసాలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అలా రోజుకు 10 రూపాయలు సంపాదించాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ఓ అమ్మాయితో బ్రేకప్ అయి డిప్రెషన్లో ఉన్న సమయంలో ఆర్జేగా ఆఫర్ వచ్చింది. ఇంకేముంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీరోల గొంతును మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నాడు. వాక్చాతుర్యంతో అబ్బురపరిచాడు. అలా తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొని ఎనిమిది వారాలు హౌస్లో ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో కలిసి బీబీ జోడీ సీజన్ 1లో పాల్గొని విన్నర్గా నిలిచాడు.చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం.. -
స్కిన్ ఇన్ఫెక్షన్, డయేరియా.. బిగ్బాస్లో ఏం జరిగిందో మీకు తెలీదు!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన ఏకైక కంటెస్టెంట్ ఆయేషా. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందని అంతా అనుకున్నారు. నామినేషన్స్లో ఆమె ఊపు, అరుపులు, కేకలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ పనిగట్టుకుని గొడవలు పడటం జనాలకు చిరాకు తెప్పించింది. టైఫాయిడ్, డెంగ్యూ వల్ల పట్టుమని పదిరోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నా అవతారంపై మీమ్స్అదే వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష (Ramya Moksha Kancharla) కూడా ఎలిమినేట్ అయింది. అయితే తాను కూడా బిగ్బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డానని, అవేవీ షోలో చూపించలేదని చెప్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టింది. అందులో రమ్య ఏమందంటే.. నా లుక్పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ వేశారు. వాటిలో కొన్ని నేనూ చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను. ఇంతలో టాన్సిల్స్ అయ్యాయి. దానివల్ల గొంతు, కింది దవడ ఉబ్బిపోయింది.బిగ్బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డా!సడన్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బందిపడ్డా.. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చేతులు, మెడ, మొత్తం శరీరమంతా రాషెస్ వచ్చాయి. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లమ్ ఎదురైంది. ఇది చాలదన్నట్లు జంక్ ఫుడ్ తిని, సోడా తాగడంతో హౌస్లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియా (నీళ్ల విరేచనాలు)తో బాధపడ్డా.. ఇలా నా ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించనేలేదు. అసలు బిగ్బాస్ హౌస్లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను.మేకప్ కూడా వేసుకోనుఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా. నేను ఎలిమినేట్ అయినరోజు నా ముఖం కాస్త సన్నగా కనిపించింది. అదే నిజమైన నేను. టీవీలో చబ్బీగా కనిపించాను. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, నేను బక్కగానే ఉంటాను. స్నాప్చాట్ వంటి యాప్స్ కూడా ఏవీ నేను వాడను. అసలవి ఎలా వాడాలో కూడా తెలీదు. మేకప్ వేసుకుంటే నా కళ్లు ఎర్రబడి, నీళ్లు కారతాయి. జలుబు, తలనొప్పి వస్తుంది. అందుకే మేకప్ కూడా వేసుకోను. ఇకపోతే నెగెటివిటీ గురించి నేనసలు లెక్కచేయను. వాటిని ఎలా గాలికొదిలేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య చెప్పుకొచ్చింది.చదవండి: ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్ -
శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష': ప్రియ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ వీళ్లే.. అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ ఆల్రౌండర్.. కానీ, అసలు నామినేషన్స్లోకే రాకపోవడం తనకే పెద్ద మైనస్ అవుతోంది. రీఎంట్రీఇంతలో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హైప్ తీసుకొచ్చాడు బిగ్బాస్. షో మొదలైన తర్వాత ఎన్ని ఎంట్రీలు వచ్చాయి! అగ్నిపరీక్ష నుంచి మూడోవారం దివ్యను హౌస్లోకి పంపారు. తర్వాత సంజనాను మిడ్వీక్లో ఎలిమినేట్ చేసి వీకెండ్లో మళ్లీ లోనికి పంపించారు. ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్స్ను తీసుకొచ్చారు. వారు లోనికి వస్తూనే శ్రీజను ఎలిమినేట్ చేశారు. ఆ మరుసటి వారమే భరణి ఎలిమినేషన్ కూడా జరిగింది.భరణికే ఎందుకు ప్రాధాన్యత?అయితే భరణికి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయా? అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది. అటు శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. తను రీఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ బిగ్బాస్ దాకా వెళ్లింది. కానీ, అడగ్గానే పంపితే బిగ్బాస్ ఎందుకవుతాడు. ఇంకేదో కొత్తగా.. కాదు, చెత్తగా ఆలోచించాడు. శ్రీజతో పాటు భరణిని హౌస్కి పంపించాడు. వీళ్లకు హౌస్లో గేమ్స్.. బయటేమో ఓటింగ్ పెట్టాడు. ఇదేం వివక్ష?శ్రీజను ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్కార్డులు అన్యాయంగా బయటకు తోసేశారు కాబట్టి తన రీఎంట్రీని పరిగణనలోకి తీసుకోవడం సమంజసం.. మరి భరణిని ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నారన్నదే ప్రశ్న! ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టెంట్లకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వొచ్చుగా! ఇదే ప్రశ్న ప్రియ కూడా లేవనెత్తింది. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ఛాన్స్.. మరి మేమేం పాపం చేశాం? మాకు ఆ ఛాన్స్ పొందే అర్హత లేదా? అందరినీ సమానంగా చూడాలి. అంతేకానీ ఇదేం వివక్ష? అని ఆవేదన వ్యక్తం చేసింది. తను బాధపడటంలో తప్పేం లేదు.మళ్లీ అన్యాయం?ఇక భరణి కోసం తనూజ ఫ్యాన్స్ ఓట్లు గుద్దిపడేస్తున్నారు. శ్రీజ హౌస్లోకి వస్తే కల్యాణ్కు ఎక్కడ పోటీ అవుతుందో అని అటు అతడి ఫ్యాన్స్ కూడా భరణికే ఓట్లేస్తున్నారట.. దీంతో ఓటింగ్లో భరణి లీడ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు హౌస్లో జరుగుతున్న గేమ్స్లో కూడా భరణి తన హవా చూపిస్తున్నాడట! ఈ లెక్కన బిగ్బాస్.. భరణిని పర్మినెంట్ హౌస్మేట్గా ప్రకటించాడని తెలుస్తోంది. దీంతో శ్రీజకు మరోసారి అన్యాయం జరిగినట్లయింది. ఓటింగ్ ద్వారా ఈసారి ప్రేక్షకులు కూడా అన్యాయం చేసినట్లే లెక్క!చదవండి: దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్ -
ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?
సెకండ్ ఛాన్స్ కోసం భరణి, శ్రీజ బిగ్బాస్ హౌస్లో పోటీపడుతున్నారు. వీరిలో ఒక్కరికే స్థానం ఉంటుందన్న బిగ్బాస్.. రకరకాల టాస్కులిచ్చాడు. అందులో భరణి గాయాలపాలై ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. అటు రేషన్ మేనేజర్గా ఉన్న తనూజకు గొడవలు తప్పడం లేదు. ఏకంగా రాజు (మాధురి)తో కూడా గొడవ జరిగింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫెయిలైన సంచాలకులుశ్రీజ- భరణి కోసం మొదటగా కట్టు- పడగొట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భరణి, ఇమ్మాన్యుయేల్ను ఒక్కటే కట్టడి చేసి శెభాష్ అనిపించుకున్నాడు డిమాన్ పవన్. కానీ, అతడి కష్టాన్ని ప్రేక్షకులకు కనిపించకుండా ఎపిసోడ్లో సరిగా వేయనేలేదు. ఫస్ట్ రౌండ్లో శ్రీజ గెలిచిందని కల్యాణ్.. కాదు, భరణి గెలిచాడని సుమన్ వాదించారు. దీంతో బిగ్బాస్.. ఈ ఇద్దర్నీ సంచాలకులిగా తప్పించాడు. కొత్త సంచాలక్ మాధురి.. శ్రీజ గెలిచినట్లు ప్రకటించింది.మాధురి వర్సెస్ తనూజరెండో రౌండ్లో భరణి (Bharani Shankar) గాయాలపాలవడంతో పాటు ఎవరూ గెలవలేదు. భరణిని ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ హౌస్లోకి పంపించారు. ఇక కిచెన్లో గొడవ మొదలైంది. చపాతీలు లావుగా వస్తున్నాయని తనూజ అంది. పక్కనే చపాతీ చేస్తున్న మాధురి.. మేమేమీ హోటల్ సర్వర్లము కాము.. మాకు రాదు అంటూ అక్కడ పడేసి వెళ్లిపోయింది. మేము కూడా హోటల్లో పని చేసి రాలేదు, అయినా పని చేస్తున్నాం. రాకపోతే చెప్పండి, వేరేవాళ్లు చేసుకుంటారని తనూజ కౌంటరిచ్చింది.అన్నంపై అలిగిన సంజనాతగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో.. ప్రేమకి తగ్గుతున్నా.. నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు. నేను మాటలు పడటానికి రాలేదు. మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. న్యాయం వైపుంటే నచ్చదు అంటూ మాధురి (Divvala Madhuri) సెటైర్లు వేసింది. మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లకండి.. నాన్నను సేవ్ చేయమని అడిగానా? అంటూ తనూజ వాదించగా కాసేపు గొడవ జరిగింది. అటు అన్నం కొద్దిగానే ఉండటంతో.. అన్నం పెట్టుకునేముందు చెప్పాలిగా అని తనూజ సంజనాను ప్రశ్నించింది. దీంతో ఆమె తినే ప్లేటు మీద నుంచి అలిగి వెళ్లిపోయింది. అందుకే మాధురిపై కోపం లేదుమరోవైపు రీతూ-పవన్ల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్ పవన్కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్ తనను తోసేశాడు.మాధురికి రీతూ తల్లి ఫోన్ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.చదవండి: కల్కి క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు -
టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!
తెలుగు బిగ్బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు, రణరంగమే అన్న ట్యాగ్లైన్కు నేటి ఎపిసోడ్ పూర్తిస్థాయిలో న్యాయం చేయనున్నట్లు కనిపిస్తోంది. రీఎంట్రీ కోసం శ్రీజ, భరణి.. ఇద్దరు రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ హౌస్మేట్స్లో నుంచి కొందరిని ఎన్నుకుని రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుంది. ఆ టీమ్ మెంబర్స్ ఆయా కంటెస్టెంట్ కోసం గేమ్ ఆడి గెలవాలి.కంటెస్టెంట్స్కి దెబ్బలురీఎంట్రీ అంటే మామూలు విషయం కాదు.. అందుకే ఏదో మామూలు టాస్క్లకు బదులుగా మంచి టాస్కులే ప్లాన్ చేశారు. అలా బిగ్బాస్ (Bigg Boss Telugu 9) పెట్టిన గేమ్లో హౌస్మేట్స్ కిందామీదా పడి ఆడి, దెబ్బలు తగిలించుకుని గాయపడ్డారట! భరణిని అయితే ఏకంగా గాయంతో హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఏమైనా ఫ్రాక్చర్ అయ్యారా? అని హాస్పిటల్కు తీసుకెళ్లి స్కానింగ్స్ చేయించారు.మట్టికరిపించిన పవన్అక్కడ బానే ఉందని రిపోర్ట్స్ రావడంతో తిరిగి అతడిని హౌస్కు పంపించారు. అయితే అందరి ఆట ఒకెత్తయితే.. డిమాన్ పవన్ ఆట మాత్రం మరో ఎత్తు. చేతులతో నిఖిల్ను కట్టడి చేస్తే కాళ్లతో భరణిని లాక్ చేసి ముందుకెళ్లనివ్వలేదు. ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీలను ఒక్కడే కట్టడి చేయమనేది మామూలు విషయం కాదు. ఇప్పుడనే కాదు, పవన్ తనకు ఏ టాస్క్ ఇచ్చినా సరే గట్టిగా ఆడతాడు. గెలుపు కోసమే ప్రయత్నిస్తాడు. తోపు కంటెస్టెంట్.. కానీ!ఫిజికల్ టాస్క్లో తాండవం చూపిస్తాడు. కానీ, రీతూతో లవ్ ట్రాక్ వల్ల పవన్పై జనాల్లో చిన్నచూపు ఉంది. అటు బిగ్బాస్ టీమ్, నాగార్జున కూడా అతడిని ఎక్కువగా హైలైట్ చేయరు. ఆ ట్రాక్ గనక లేకుంటే పవన్ కూడా టాప్ 3 రేసులో ఉండేవాడే! మరి శ్రీజను గెలిపించడం కోసం దెబ్బలు తగిలించుకుని మరీ ఆడుతున్నాడు. అతడు కోరుకున్నట్లుగా శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా? వీకెండ్లో నాగార్జున.. పవన్ ఆటను మెచ్చుకుంటాడా? చూడాలి! చదవండి: హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ -
వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్లో శ్రీజ, భరణి రీఎంట్రీ!
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..భరణి రాకతో ఆనందభాష్పాలుభరణి (Bharani Shankar) హౌస్లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.దివ్యను పట్టించుకోని భరణినిఖిల్.. కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.నామినేషన్స్లో ఎనిమిది మందిశ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్లో ఉన్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్లో ఉంటారన్నాడు బిగ్బాస్.రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్ -
తప్పు చేసి సారీ చెప్తే ఎలా.. బిగ్బాస్లో భరణి ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కోక్కరిగా వచ్చి హౌస్లో ఉండే సభ్యులను నామినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ తమ ప్రక్రియను సోమవారం ఎపిసోడ్లో ముగించారు. అయితే, మంగళవారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. భరణితో పాటు శ్రేష్టి వర్మ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.భరణి ఎంట్రీ ఇవ్వగానే దివ్య చాలా సంతోషంగా వెళ్లి హగ్ చేసుకుని తన అభిమానాన్ని చూపింది. ఇంతలో ఇమ్మాన్యేయల్ దగ్గరికి వెళ్లిన భరణి.. కట్టప్ప చంపేశావ్ కదరా అంటూ సరదాగా పలకరిస్తాడు. అయితే, ఫైనల్గా సంజనాను భరణి నామినేట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. 'భరణి అన్నయ్య అంటూ నువ్వు పిలిచిన ప్రతిసారి ఒక సిస్టర్గానే నేను చూశాను. ఏరోజు కూడా ఫేక్ రిలేషన్ కొనసాగించలేదు. తప్పు చేసి సారీ అని చెప్పితే సరిపోతుందా.. 'అంటూ సంజనపై భరణి ఫైర్ అవుతారు. అయితే, దివ్యను రోడ్ రోలర్ అని కామెంట్ చేయడం వల్లనే భరణి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన ఫైట్ ఈ మంగళవారం ఎపిసోడ్లో హైలైట్ కానుంది.శ్రేష్టి వర్మ కూడా సరైన పాయింట్లతోనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ ఆటపై అభ్యంతరం తెలిపింది. రీతూ ట్రాప్లోనే ఉన్నావ్ అంటూ చెప్పింది. గేమ్ పట్ల రీతూకు ఉన్న క్లారిటీ కూడా లేదంటూ పవన్ను శ్రేష్టి నామినేట్ చేసింది. -
శ్రీజ ప్లాన్ ఇదే.. అందుకే కల్యాణ్, తనూజలపై ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది. అక్టోబర్ 27న సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి బజ్తోనే మొదలైంది. సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్బాస్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్బాస్ ఇచ్చారు. దీంతో ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఒక్కొక్కరుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత హౌస్మేట్స్ను నామినేట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్ అయింది. కల్యాణ్, తనూజ, మాధురిని టార్గెట్ చేసి హౌస్లోకి దిగింది.సంజనపై ప్రియ ఫైర్నామినేషన్ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది. దివ్యను రోడ్డు రోలర్ అని కామెంట్ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది. సీజన్ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. తర్వాత హౌస్లోకి మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్మాన్యుయేల్ను్ మోసం చేశావ్ అంటూ కల్యాణ్ను నామినేట్ చేశాడు. కల్యాణ్ చేసిన పని ఒక నమ్మకద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ.. ఎదురుదాడికి దిగింది. రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నావ్ అంటూ మొదట కల్యాణ్ ఆ తర్వాత పవన్లతో గేమ్ ఆడుతుందని తెలిపింది. కనీసం పవన్తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్ చేసింది. రీతూ ఎపిసోడ్ కాగానే సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు. కెప్టెన్ని కూడా సంజన గౌరవించదు. తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్ చేస్తాడు. దీంతో ఈ హౌస్లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది.మాధురిని టార్గెట్ చేసిన శ్రీజబిగ్బాస్లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్తో వెళ్లింది. మొదట కావాలనే మాధురిని గెలికింది. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ మీ పేరు మాధురినా.. మాస్ మాధురినా లేదా రాజు గారా అంటూ ఎటకారం మొదలుపెట్టింది. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచ్లు వేసింది. మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాత గొడవని గుర్తుచేసింది. బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాను ఎవరూ కూడా చెప్పలేదు. ఆమె నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలపెట్టింది. అయితే, అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు. నువ్వు కూడా ఎవరో నాకు ఇంత వరకూ తెలీదు అంటూ చెప్పింది.కల్యాణ్, తనూజలపై టార్గెట్..పక్కా ప్లాన్తో శ్రీజశ్రీజ నామినేట్ చేసింది కల్యాణ్ను మాత్రమే.. కానీ, ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫస్ట్ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కల్యాణ్ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్ను తగ్గించేలా స్కెచ్ వేసి దెబ్బ కొట్టింది. అలా ప్రస్తుతం టాప్లో ఉన్న కల్యాణ్, తనూజలను టార్గెట్ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్ అమలు చేసింది. ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్ వేసినట్లు అర్థం అవుతుంది. ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఇక్కడ శ్రీజ నామినేషన్ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్లా దూసుకుపోయాయి. వాటిలో ఒక్కదానికి కూడా కల్యాణ్ సమాధానం చెప్పలేకపోయాడు. తనూజ, మాధురి కూడా శ్రీజ వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆమె ప్లాన్ విజయవంతమైంది.కల్యాణ్,తనూజలను ఇరికించిన శ్రీజనువ్వు అమ్మాయిల పిచ్చోడివా..? అంటూ కల్యాణ్ను శ్రీజ నామినేట్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావ్.. అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్.. ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావ్ అంటూ సరైన పాయింట్లే పట్టింది. వాటికి కల్యాణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్ చేసింది. ఇక్కడికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ గురించి తప్పుగా మాట్లాడారు. రెండుడు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్ చేశారో అదే పర్సన్తో మీరు తిరుగుతున్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు. ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది. ఇలా కల్యాణ్, తనూజల ఇమేజ్ను తగ్గించాలనే పక్కా ప్లాన్తో ఇరికించేసింది. తన రీ ఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు. -
కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
గత సీజన్లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో (Bigg Boss Telugu 9) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!సంజనాకు క్లాస్ పీకిన ప్రియఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్కు కత్తి గుచ్చాడు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్స్లో ఎనిమిదిమందిసోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్లో అడుగుపెడతారా? చూడాలి! చదవండి: అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే? -
అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే?
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..నో ట్రాక్స్బిగ్బాస్ హౌస్లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య. అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.అదే ముఖ్య కారణంరమ్య (Ramya Moksha) ఎలిమినేషన్కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్గా అనిపించింది.అది మర్చిపోతే ఎలా?తనూజ (Thanuja Puttaswamy) ఎలిమినేషనే టార్గెట్గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది. రెమ్యునరేషన్ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్లో పడేశారు. నామినేషన్స్లో తప్ప గేమ్లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.చదవండి: కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య -
కల్యాణ్ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్బాస్కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్బిన్లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు -
బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్లోకే రాకపోవడం మైనస్గా మారనుంది.తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రాజాతో రీప్లేస్ చేశావా?ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. తోసేసినా వెళ్లనంటోందివచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. మాధురికి క్లాస్ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్కు ఇవ్వడం.. కంటెండర్షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. బయట తోపు.. ఇక్కడ కాదు!బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్బాస్ హౌస్లో కాదు అని కాస్త సాఫ్ట్గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో కల్యాణ్ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్! -
'జట్టు పట్టుకుని నేలకేసి'.. మాధురికి క్లాస్ పీకిన నాగార్జున
బిగ్బాస్ హౌస్లో వీకెండ్ వచ్చిందంటే చాలు మిగతా రోజుల కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. ఆ వారమంతా చేసిన తప్పులు, గొడవల గురించి మాట్లాడుతూ ఆయా కంటెస్టెంట్స్కి ఇచ్చి పడేస్తుంటాడు. ఈసారి అలా మాధురికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?ఈ వారం టాస్క్ల్లో భాగంగా ఇలా గనక బయట ప్రవర్తించుంటే జట్టు పట్టుకుని నేలకేసి కొడతా అని రీతూపై మాధురి కామెంట్ చేసింది. అనుకున్నట్లుగానే ఈవారం ఆ మాటలకు సంబంధించిన పంచాయతీ నాగార్జున దగ్గరకు వచ్చింది. అయితే ఈసారి హౌస్లో పక్కనే బోర్డుపై ఉన్న ట్యాగ్స్లో ఏది సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున సూచించాడు. తొలుత రమ్య.. 'ఫేక్ బాస్' అనే ట్యాగ్ తీసుకొచ్చి మాధురి మెడలో వేసింది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు బంధాలేంటి అని కామెంట్ చేసి ఇప్పుడు బంధాల్లోకి వెళ్తున్నట్లు అనిపించిందని రమ్య చెప్పింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)రీతూ అయితే మాధురి గురించి నాగార్జున దగ్గర చెప్పింది. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను, నీ బిహేవియర్(ప్రవర్తన) బాగోదు అది ఇదీ అని చాలామాటలు అన్నారు సర్ అని తన బాధని బయటపెట్టింది. దీనిపై స్పందించిన మాధురి.. డబ్బులివ్వమని సుమన్, రీతూని అడిగారు సర్, సుమన్కి ఇవ్వకుండా మళ్లీ తీసుకెళ్లి పవన్కి ఇచ్చి అతడిని గెలిపించి కంటెండర్ని చేసింది. ఇలాంటివన్నీ బిగ్బాస్ హౌస్లో కాకుండా బయట చేసుంటే జుట్టు పట్టి నేలకేసి కొట్టేదాన్ని అని అన్నానని మాధురి వివరణ ఇచ్చుకుంది.అయితే మాధురి మాటలపై సీరియస్ అయిన నాగార్జున.. మాధురి ఆఖరిసారి చెబుతున్నాను. నేలకేసి కొడతా, తొక్కుతా, తాటతీస్తా అనొద్దు. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండమ్మా. బిగ్బాస్ హౌస్లో కాదు అని చాలా స్మూత్గానే క్లాస్ పీకారు. శనివారం ఎపిసోడ్లో ఇదే హైలైట్ కానుందని అనిపిస్తుంది. మాధురి ఇంకేం మాట్లాడిందనేది పూర్తి ఎపిసోడ్లో చూడాలి.(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్) -
బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి బిగ్బాస్ షాక్ ఇచ్చాడు. పచ్చళ్ల పాపని బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో రమ్య ఒకరు. రెండు వారాల క్రితం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఒకరిగా 9వ సీజన్లో అడుగుపెట్టింది. కానీ వచ్చిన తొలిరోజు నుంచే టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్ల్లో మగాళ్లతోనే బాగానే పోటీ పడుతున్నప్పటికీ నోటి దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్పై కామెంట్స్ చేయడం లాంటి వాటి వల్ల నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు వచ్చిన మొదటిరోజునే తనూజ-కల్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కూడా ఈమెకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు)ఇకపోతే ఈ వారం రమ్యతో పాటు రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, రాము, సంజన, కళ్యాణ్ నామినేషన్స్లో నిలిచారు. వీళ్లలో చూస్తే రమ్య, సాయి తప్పితే మిగిలిన వాళ్లంతా చాలారోజులుగా హౌస్లో ఉన్నారు. పలుమార్లు నామినేషన్స్లోనూ ఉన్నారు. దీంతో ఈ వారం వీళ్లందరికీ బాగానే ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్లో నిలిచినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కల్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నట్లు టాక్. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉండగా.. రమ్యగా చాలాతక్కువగా ఓటింగ్ రావడంతో ఈమెని ఎలిమినేట్ చేసేశారట.వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమెనే ఆయేషా. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని ఫిక్స్ అయిన నిర్వహకులు.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఎలిమినేట్ చేసేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్) -
బిగ్బాస్లో బాడీ షేమింగ్.. దివ్యపై సంజన వ్యాఖ్యలు
బిగ్బాస్ షో అంటేనే బూతులకు కేరాఫ్ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్ హౌస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.హౌస్లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్ పట్ల సంజన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్ అంటూ 'కల్యాణ్' లో క్లాస్ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కల్యాణ్పై చీప్ కామెంట్లు చేసింది.మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని లైవ్ ఎపిసోడ్స్లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్బాస్ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో సంజనను హోస్ట్ నాగార్జున నిలదీస్తారా..? లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్బాస్లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్బాస్లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b— Edits reposter (@Inspiritmodee) October 24, 2025 -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్కు పిలిచారు. టైఫాయిడ్తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
అయేషా మిడ్ వీక్ ఎలిమినేషన్..! ఆ కారణం వల్లే..!
-
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. కెప్టెన్సీ గేమ్అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది. అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.రీఎంట్రీ?హౌస్మేట్స్తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్బాస్ హౌస్లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. చదవండి: సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్ -
సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీకి చాలా పవర్ ఉంది. అందర్నీ ఆజమాయిషీ చేయడం కన్నా ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందన్న క్రేజే ఎక్కువ. కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఎంచక్కా నామినేషన్స్ తప్పించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చని హౌస్మేట్స్ భావిస్తుంటారు. అలాంటి కెప్టెన్సీని గతంలో ఇమ్మాన్యుయేల్ (Emmanuel) చేతులారా వదిలేసుకున్నాడు.సంజనా కోసం త్యాగంసంజనా (Sanjana Galrani)ను హౌస్మేట్స్ మిడ్వీక్లో ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే కదా! తను హౌస్లోకి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాలని నాగార్జున కండీషన్ పెట్టారు. తనూజ కాఫీ వదిలేయాలని, రీతూ జుట్టు కత్తిరించుకోవాలని, భరణి.. తనకిష్టమైన లాకెట్ స్టోర్ రూమ్లో పెట్టేయాలని, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ వదిలేయాలన్నారు. వీళ్లందరూ ఆ త్యాగాలు చేశారు కాబట్టే సంజనా హౌస్లో ఉంది.మళ్లీ సంపాదించిన ఇమ్మూఅలా ఇమ్మాన్యుయేల్ తన కెప్టెన్సీని కనీసం ఒకరోజైనా ఫీల్ అవలేకపోయాడు. అయితేనేం మళ్లీ ఆడి గెలిచే సత్తా తనకుంది. అది ఈ వారం మరోసారి రుజువు చేసుకున్నాడని తెలుస్తోంది. ఫోకస్ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కెప్టెన్గా ఇమ్మూ రూలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం! చదవండి: బిగ్బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా! -
బిగ్బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా!
బిగ్బాస్కు కొత్త ఐడియాలు రావడం లేదేమో! కొన్నిసార్లు పిచ్చి టాస్కులిస్తున్నాడు. నీళ్లు ఉమ్మే టాస్క్ అయితే మరీ దారుణం. అమర్దీప్- అర్జున్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఉపశమనంగా కనిపిస్తుంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో గురువారం (అక్టోబర్ 23వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మట్టి కరిపించిన డిమాన్ పవన్సంజనా సైలెన్సర్- మాస్ మాధురి గ్యాంగ్స్కు జెండాలే ఎజెండా టాస్క్ ఇచ్చాడు. ఇందులో సంజనా తరపు నుంచి బరిలో దిగిన డిమాన్-గౌరవ్.. మాధురి గ్యాంగ్ నుంచి వచ్చిన ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ను మట్టి కరిపించారు. డిమాన్ పవన్ మరోసారి టాస్కుల వీరుడు అని నిరూపించుకున్నాడు. సంజనా రాను రాను శృతి, గతి అన్నీ తప్పుతోంది. నోటికి ఏదొస్తే అది అనేస్తోంది. చెత్తబుట్ట తీసుకొచ్చి.. ఇది ఖాళీ చేయలేదు.. పని చేయకుండా పిక్నిక్కు వచ్చారా? అని అరిచేసింది. చెండాలం టాస్క్కెప్టెన్స్ గౌరవ్, సుమన్తోనూ.. నేనేమైనా మీ పనిమనిషినా? నేను మీ సర్వెంట్ కాదంటూ చిందులు తొక్కింది. తర్వాత బిగ్బాస్ ఓ దరిద్రపు టాస్క్ ఇచ్చాడు. నోట్లో నీళ్లు పోసుకుని ఎక్కువ దూరంలో ఉన్న బకెట్లో ఉమ్మితే ఎక్కువ పాయింట్లు అట! ఇదే ఒక చెత్త టాస్క్ అంటే.. మా బకెట్లో చుక్క నీరు పడింది.. అక్కడ పడలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ గేమ్లో సంజన టీమ్ గెలిచింది. మీరు తోపు.. మేము తుప్పాస్దీంతో బిగ్బాస్ చెప్పినట్లుగా మాధురి టీమ్ మెంబర్స్ అంతా మోకాళ్లపై కూర్చుని మీరు తోపు.. మేము తుప్పాస్ అని సంజనాకు చెప్పారు. ఇక ఈ వాంటెడ్పేట గేమ్లో రాము, రమ్య దగ్గర ఒక్క రూపాయి లేకపోవడంతో కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత బిగ్బాస్ 7 కంటెస్టెంట్లు అమర్దీప్-అర్జున్ పోలీస్ గెటప్స్లో హౌస్లో ఎంట్రీ ఇచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వించారు. ఇది నేటి ఎపిసోడ్లో కూడా కొనసాగనుంది.చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోయారు. ఒకరు మళ్లీ తిరిగొచ్చారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీశ్, శ్రీజ, భరణి వరుసగా వెళ్లిపోయారు. మధ్యలో సంజనాను మిడ్వీక్లో హౌస్మేట్స్ ఎలిమినేట్ చేశారు. కానీ, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఆమెను సీక్రెట్ రూమ్కు పంపించాడు. వీకెండ్లో సంజనా వెళ్లిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్లీ హౌస్లోకి పంపించారు.నామినేషన్స్లో 8 మందిఇక ఏడోవారం నామినేషన్స్లో ఎనిమిది మందున్నారు. వారే.. తనూజ, పవన్ కల్యాణ్, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్లోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావొచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్. ఫుల్ జోష్తో హౌస్లో అడుగుపెట్టింది. ఆరోగ్య సమస్యలుఅరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికిమాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించింది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం.. ఆయేషా (Ayesha Zeenath)కు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. రీతూను టార్గెట్ చేసి..నిజానికి ఆమె హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా! కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే వరస్ట్ అనిపించుకుంది. రీతూను టార్గెట్ చేసి ఆమె నెగెటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్స్లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కానీ, వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్లిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్లోనే కొనసాగుతుందా? అనేది చూడాలి!చదవండి: సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి -
సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు దొంగతనాలు చేసే సంజనానే దొంగదెబ్బ తీశారు సుమన్, తనూజ. బిగ్బాస్ ఇంటిని వాంటెడ్ పేట అని దొంగలనివాసంగా మార్చేశారు. బిగ్బాసే చెప్పాక కంటెస్టెంట్లు ఆగుతారా? ఏముంది, దొరికిన డబ్బు దోచేసుకున్నారు. కానీ, ఒక్క చోరీకే రుసరుసలాడింది సంజన.. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..మాస్ మాధురి Vs సంజన సైలెన్సర్బిగ్బాస్ హౌస్ గ్యాంగ్స్టర్ అడ్డాగా మారింది. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ గ్యాంగుల మధ్య పోటీ జరుగుతోంది. సంజన (Sanjana Galrani) డబ్బులు పోవడంతో అందరిపైనా గరమైంది. హౌస్మేట్స్ అసలే గజదొంగల వేషాల్లో ఉన్నారు. అయ్యోపాపం.. అని డబ్బు తిరిగిస్తారా? ఛాన్సే లేదు. అవతలి టీమ్లో ఉన్న తనూజ, సుమన్లు ఆ డబ్బు ఎప్పుడో పంచేసుకున్నారు. కానీ అది జీర్ణించుకోలేని సంజనా.. లాక్కోవడం గీక్కోవడం మన క్లాస్ కాదు. బయట ఆర్టిస్టులం.. అంటూ సంబంధం లేని డైలాగులు వల్లె వేసింది.అమ్ముకోమంటే పూటుగా లాగించేశారుదాన్ని దివ్య మోసుకెళ్లి మాధురి (Divvala Madhuri) చెవిలో పడేసింది. అందుకామె ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమని చెప్పు అని సంజనాపై అసహనం వ్యక్తం చేసింది. తర్వాత రెండు గ్యాంగ్ లీడర్లకు కాఫీ షాప్, పానీపూర్ స్టాల్స్ ఇచ్చాడు బిగ్బాస్. దీని ద్వారా డబ్బు సంపాదించుకోమన్నాడు. కానీ, అమ్మడంపై ఫోకస్ పెట్టడం మానేసి.. తేరగా వచ్చిందని తినడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారంతా! దీంతో బిగ్బాస్ ఆ స్టాల్ టాస్క్ ఎత్తేశాడు.గెలిచిన మాధురికి జేజేలుతర్వాత ధమాకా కిక్.. కాళ్లలో దమ్ము ఉండటం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కాలును ఉపయోగించి చెప్పును గోడపై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతికించాలి. ఇందులో అందరికంటే రీతూ చౌదరి బాగా ఆడింది. ఈ గేమ్లో మాధురి టీమ్ గెలవడంతో ఓడిపోయిన సంజనా టీమ్ మెంబర్స్ ఆమెను ఎత్తుకుని జై కొడుతూ ఇల్లంతా ఊరేగించారు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా -
బిగ్బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్లో ప్రస్తుతానికి తనూజ టాప్లో దూసుకుపోతుంది. ఓటింగ్ పరంగా చాలా పేజీలలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది. అయితే, తెలుగులో ఆమెకు ముద్దమందారం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చింది. బిగ్బాస్లో ఆమె టాప్లో ఉండటంతో ఈ సీరియల్కు సంబంధించిన టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతుంది.తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి. అయితే, సినీ పరిశ్రమలో తనూజ గౌడగా స్థిరపడిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెను ఒక టీచర్గా చూడాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. కానీ, ఆమెకు సినిమా రంగం అంటే ఆసక్తి ఉండటంతో తన కలను సాధించుకోవడం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, తన కాలేజీ రోజుల్లోనే హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.తన కాలేజీ రోజుల్లోనే తనూజకు మొదట కన్నడ హారర్ సినిమా '6-5=2'లో దక్కింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే తెలుగులో తొలి సీరియల్ 'అందాల రాక్షసి'లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ముద్దమందారంలో పార్వతి పాత్రతో మెరిసింది. మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీయల్ టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. తనూజ దెబ్బతో 27 మిలియన్లు దాటేసిందిబిగ్బాస్ సీజన్ ప్రారంభమైన సమయంలో కేవలం 6 మిలియన్ల వ్యూస్తో ఉన్న ఈ పాట.. ఇప్పుడు ఏకంగా 27 మిలియన్లతో దూసుకుపోతుంది. బిగ్బాస్లో తనూజ గేమ్ నచ్చిన వారు ఈ సాంగ్ను ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది. తనూజ వల్ల ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ అదనంగా రీచ్ తెచ్చుకుంది. తనూజ పుట్టస్వామి ఒక రియల్ గేమర్గా ఆడుతుంది. తనలో ఎమోషన్స్తో పాటు సెన్సిటివ్ కూడా ఉంది. మొదటి నుంచి టాస్క్ కూడా వదిలేయలేదు. కన్నడిగ అయినా సరే.., తెలుగులోనే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి తనూజ మాత్రమే టాప్లో ఉంది. -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్ను కల్యాణ్కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
తనూజ, ఇమ్మాన్యేయల్కు గొడవ పెట్టిన కల్యాణ్
బిగ్బాస్ 44వ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. సోమవారం జరిగిన నామినేషన్స్లో కల్యాణ్ చేసిన పనికి తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య గొడవ మొదలైంది. ఇదంత మంగళవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ కానుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను బెలూన్ టాస్క్ల పేరుతో ఇమ్ము, అయేషా చేతిలో బిగ్బాస్ పెట్టడం. అందులో వారిద్దరూ గెలుచుకున్న టికెట్లు తమకు నచ్చిన వారికి ఇవ్వొచ్చు. వాళ్లు వెళ్లి నామినేషన్స్ చేయవచ్చు. అయితే, ఒక టికెట్ కల్యాణ్కు ఇస్తాడు ఇమ్ము. అతను సంజనాను నామినేట్ చేయడంతో ఇమ్ము ఆశ్చర్యపోతాడు. కల్యాణ్.. నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరు ఒకటి.. ఇప్పుడు చేసిందొకటి. ఇదేంటి అంటూ గొడవకు దిగుతాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి నా వద్ద టికెట్ తీసుకున్నావ్.. ఇలా మాట తప్పుతావని అసలు ఊహించలేదంటూ మాట్లాడుతాడు. తనూజను నేను కూడా నామినేట్ చేయాలని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చి చేస్తానని చెప్పడంతో నేను నిన్ను నమ్మి నామినేషన్ టికెట్ ఇచ్చానంటూ కల్యాణ్పై ఫైర్ అవుతాడు.తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య చిచ్చుబిగ్బాస్ సీజన్ ప్రారంభం నుంచి ఇమ్ము, కల్యాణ్తో తనూజ బాగానే క్లోజ్ ఉంది. ఇప్పుడు తనను నామినేషన్ చేసేందుకు ఇలా వారిద్దరూ పోటీ పడటం తనకు నచ్చలేదు. ఇది చాలా మోసం అంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో దివ్యతో చెబుతుంది. ఐదు నామినేషన్స్ టికెట్లు గెలుచుకున్న ఇమ్ము ఒకటి కూడా తన వద్ద ఉంచుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. అదేదో ఒక టికెట్ తనే ఉపయోగించి తనూజను నామినేషన్ చేసి ఉంటే ఇమ్ముకు పాజిటివ్ వచ్చేది. ఇలా సేఫ్గా కల్యాణ్తో ఆట నడిపించే ప్రయత్నం చేసి చెడ్డపేరు తెచ్చుకున్నాడు.తనూజ, ఇమ్ము మధ్య వార్ మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తుంది. నేను ఎవరినీ కేర్ చేయనంటూ ఇమ్ముతో తనూజ అంటుంది. అంతే రేంజ్లో ఇమ్ము కూడా సమాధానం ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేశాననే బాధ నాలో ఉందని ఇమ్ము అనడం.. ఆపై తనూజ కూడా ఆటలో ఎవరు ఎవరి కోసం నిలబడరని చెప్పడం. దానికి ఇమ్ము కూడా చిన్నపిల్లోడిలా అప్పుడు నీ కోసం ఇది చేశాను.. అది చేశాను అని చెబుతూ పాత విషయాలు తెరపైకి తీసుకొచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం చాలా ఫైర్గానే ఉంది. -
నీ ఏజ్కు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్
బిగ్బాస్ హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాండింగ్స్ గురించి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో హౌస్లోని కంటెస్టెంట్స్ అందరూ చాలా అలెర్ట్ అయిపోయారు. దీంతో 7వ వారం నామినేషన్స్లో బిగ్ వార్ కొనసాగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో తనూజ -రమ్య మధ్య జరిగిన వార్తో పాటు రీతూ- ఆయేషాల మధ్య నడిచన మాటల ఫైర్ కూడా బాగానే పేలింది. ఎలిమినేషన్ రౌండ్లో ఇచ్చిన మాట తప్పావంటూ కల్యాణ్పై ఇమ్మాన్యేయల్ చేసిన కామెంట్లు ఆసక్తిగానే ఉన్నాయి. ఇలా ఈ వారం బిగ్ఫైట్తోనే మొదలైంది.రీతూ- ఆయేషాలో ఫైర్ బ్రాండ్ ఎవరుఆయేషా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షో చూసి గేమ్లోకి దిగింది. రీతూ, తనూజలనే టార్గెట్ పెట్టుకుని వచ్చినట్లు అర్ధం అవుతుంది. తానొక ఫైర్ బ్రాండ్ అనే రీతిలో ఆట మొదలు పెట్టింది. అయితే, ఈ వారం నామినేషన్లో రీతూ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను మెప్పించలేదు. కేవలం లవ్లు ఆడేందుకే హౌస్లోకి వచ్చావని పదేపదే రీతూను టార్గెట్ చేస్తూ ఆయేషా మాట్లాడింది. ఇదంతా బయటున్న ప్రేక్షకులకు కూడా తెలిసిందే. మళ్లీ అదే పాయింట్తో నామినేషన్ చేయడం ఆయేషా చేసిన రాంగ్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రీతూ పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే, రీతూ కూడా ఏంతమాత్రం తగ్గలేదు. కౌంటర్కు ధీటుగానే సమాధానం చెప్పకుంటూ పోయింది. రీతూ కేవలం లవ్ ట్రాక్తో మాత్రమే గేమ్ అడుతుందని చెప్పడవం చాలా రాంగ్.. గతంలో ఆమె చాలా బలంగా టాస్క్లు ఆడింది. అమ్మాయిల్లో శ్రీజ తర్వాత అంత గట్టిగా గేమ్స్ ఆడే సత్తా తనకు మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే. వీరిద్దరి మధ్య జరిగిన వార్లో రీతూనే ఫైర్ బ్రాండ్గా నిలిచిందని చెప్పవచ్చు.వయసుకు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్నామినేషన్స్ ప్రక్రియలో మొదట తనూజను టార్గెట్ చేస్తూ రమ్య హీట్ పెంచింది. తనూజ టాప్లో ఉందని హైపర్ ఆది కూడా హింట్ ఇచ్చేశాడు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తే కాస్త గేమ్ ట్రాక్లోకి వచ్చేస్తామనే ప్లాన్లో రమ్య ఉంది. అయితే, ఆట చూసే బరిలోకి దిగిన రమ్య పసలేని పాయింట్లతో తనూజను నామినేట్ చేసింది. తనూజ గురించి గత ఐదు వారాలుగా వస్తున్న వాటినే లేవనెత్తి మాట్లాడటం ఆపై తన గురించి బ్యాక్బిచ్చింగ్ చేయడం రమ్యకు నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయి.నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకూ ఒక్క టాస్క్ కూడా ఆడలేదు.. మరోకరి సాయంతో మాత్రమే నిలబడుతున్నావ్ అంటూ తనూజ గురించి రమ్య అంటుంది. కేవలం బాండిగ్స్ కోసం మాత్రమే వచ్చావని, వాటి వల్లే ఇంట్లో ఉంటున్నావని కామెంట్స్ చేసింది. నువ్వు ఇంకా ముసుగులోనే ఉన్నావ్.. దాని నుంచి బయటికిరా.. ఫుల్ డ్రామా క్వీన్లా నటిస్తున్నావ్.. అంతా ఫేక్ అంటూ గట్టిగానే రమ్య మాట్లాడింది. తనూజ కూడా అంతే రేంజ్లో సమాధానం ఇచ్చింది.నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ముందు నీ మాస్క్ నువ్వు చూసుకో.. కన్ఫెషన్ రూమ్లో నువ్వు ఏం అనిపించుకున్నావో అందరికీ తెలుసు. కాస్త వయసుకు తగినట్లు మాట్లాడు. ఫస్ట్ బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడటం ఆపేయ్. అంటూ తనూజ ఫైర్ అయింది. అప్పుడు రమ్య కూడా.. అవును, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ మాటలు తూలింది. అలా ఇద్దరూ హౌస్లో హీట్ పెంచేశారు.రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాట్లాడిన నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ఇది బిగ్బాస్లా లేదు లవర్స్ పార్క్లా ఉంది అన్నావ్.. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో.. ఒకరికి మంట పెట్టాలని ఇంకొకరికి కోపం తెప్పించేలా మాట్లాడటానికే ఇక్కడికి వచ్చావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది.తనూజకు సరైన సమాధానం చెప్పలేక పర్సనల్ అటాక్ చేసేందేకు రమ్య దిగింది. నువ్వు జెలస్ రాణివి.. ఫేక్ పిల్లవి.. ఒకరు వెళ్లిపోయారు ఇంకొకర్ని వెతుక్కోనే పనిలో ఉంటావ్ .. అంటూ రమ్య వేసిన కౌంటర్కు తనూజ కూడా గట్టిగానే తిరిగిచ్చేసింది. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా.. ఒక్కోసారి రెండు చేతుల క్లాప్ నుంచి వచ్చే శబ్ధం కన్నా ఒక్క చేతితో వేసే విజిల్ గట్టిగా వినిపిస్తుందంటూ.. విజిల్ వేసి మరీ తనూజ బదులిచ్చింది .చెయ్ వెయ్ రా.. కల్యాణ్తనూజ- కల్యాణ్ గురించి రమ్య చేసిన బ్యాక్బిచ్చింగ్కు తనూజ ఓపెన్గానే సమాధానం ఇచ్చింది. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి.. వెనుకచాటు మాటలు ఎందుకంటూ రమ్యను ప్రశ్నించింది. నామినేషన్ టైమ్లోనే కళ్యాణ్ దగ్గరికెళ్లి.. ఒరేయ్ ఒకసారి నా భుజం మీద చెయ్ వెయ్ రా.. లాస్ట్ టైమ్ నువ్వు హ్యాండ్ వేయడానికి వస్తే ఛీ తియ్ అని అన్నాను. ఇప్పుడు వేయరా చూద్దాం. ఏమైనా జరగని అంటూ తన తల మీద చెయ్ పెట్టమని కూడా తనూజ కోరుతుంది. ఈ సీన్ బాగా వైరల్ అయింది. తనూజకు బాగా కలిసొచ్చేలా ఈ ఎపిసోడ్ ఉంది. ఫైనల్గా ఈ వారం నామినేషన్లో తనూజ, రమ్య, కల్యాణ్, రాము, దివ్య, రాము, సంజన, శ్రీనివాస్ సాయి ఉన్నారు. -
నాన్న అందుకే వెనకబడ్డాడు! ఆకాశానికెత్తి పాతాళంలో పడేశారు!
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్బాస్ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్కు తొలి, చివరి కారణం! తన కోసం తగ్గిన భరణిబిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ కూడా చేశాడు.టాప్ 1 అని..కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్కార్డ్గా సరాసరి హౌస్లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్ అవుతున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఆ పని చేసుంటే..కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్ ఆడుంటే ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, ఇక అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి! -
నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా..
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్, శ్రీజ, భరణి వరుసగా హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పుడు మరొకరిని పంపించేందుకు నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది.కెప్టెన్ల చేతిలో పవర్నామినేషన్ చేసే హక్కును కూడా పోరాడి గెలవాల్సి ఉంటుందన్నాడు బిగ్బాస్. ఆ పోరాటానికి ఇద్దర్ని ఎంపిక చేసుకోమని కెప్టెన్స్కు పవర్స్ ఇచ్చారు. దీంతో గౌరవ్.. ఆయేషాను, సుమన్.. ఇమ్మాన్యుయేల్ను ఎంపిక చేశాడు. ఆయేషా, ఇమ్మూకి బిగ్బాస్ బెలూన్ల టాస్క్ ఇచ్చాడు. బెలూన్ పగలగొట్టినప్పుడు అందులో ఓ చిట్టీ వస్తుంది. దానిపై రాసున్నదాని ప్రకారం నామినేషన్స్ ముందుకు సాగుతాయి. ఈ క్రమంలో ఆయేషా.. రీతూను డైరెక్ట్గా నామినేట్ చేసింది. నామినేషన్స్నువ్వు, నీ ఓవరాక్షన్ నచ్చలేదు. నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ పర్సనల్ అటాక్ చేసింది. దానికి రీతూ.. నేను లవ్ చేస్తున్నానని చెప్పానా? అని నిలదీసింది. అప్పటికీ తగ్గని ఆయేషా... నీకంత యాటిట్యూడ్ ఎందుకే? నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని మండిపడింది. చూస్తుంటే వీరిమధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. రమ్య, సాయి, రీతూ, తనూజ, దివ్య, రాము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయేషా నామినేషన్లో ఉండాల్సింది. కానీ గౌరవ్ సేవ్ చేయడంతో ఆమె గండం గట్టెక్కింది. -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్మేట్స్కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్మేట్స్పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్సెట్ తీసేసి పాజిటివ్గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
బిగ్బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే..
బిగ్బాస్ 9 తెలుగు నుంచి బుల్లితెర నటుడు భరణి ఎలిమినేట్ అయిపోయారు. సుమారు వారాల పాటు ఆయన హౌస్లో కొనసాగారు. ఆదివారం జరిగిన దీపావళి ఎపిసోడ్లో నటుడు నాగార్జున (Nagarjuna) వ్యాఖ్యతగా వ్యవహరించారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారంగా భరణి ఎలిమినేట్ అయ్యారని నాగ్ ప్రకటించారు. దీంతో ఆయన హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే, ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో బిగ్బాస్ నుంచి ఆయన ఎంత సంపాదించారనేది సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.బిగ్ బాస్లోకి వెళ్లే కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఎంత అనేది ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఉన్నారు. అందుకే ఈ సీజన్లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్బాస్లో ఉన్న 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే ఆయన అందుకున్నట్లు సమాచారం. డబ్బు కంటే ఎక్కువ ఆయన మంచి పేరు సంపాదించాడని చెప్పవచ్చు. అయితే, హౌస్లో చాలామందితో ఎక్కువ బంధాలు పెట్టుకోవడం వల్లే ఎలిమినేట్ అయ్యారని తెలిసిందే.ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరూ సేవ్ అవుతూ.. ఫైనల్గా భరణి, రాము రాథోడ్ నిలిచారు. వీరిద్దరిలో భరణి ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. దీంతో తనూజ, దివ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న పవర్ అస్త్ర భరణి కోసం ఉపయోగించి ఉండుంటే సేవ్ అయిండేవాడు. కానీ, అతను రాము రాథోడ్కు ఉపయోగించడం.. ఆపై ఓట్ల పరంగా కూడా రాము సేఫ్ జోన్లో ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. -
ఏంటి సంజనా.. నీకు, నాకు పెళ్లిచూపులా?: నాగార్జున
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో నేడు దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. పండగ పూట హౌస్మేట్స్కు కొత్త బట్టలు కానుకగా పంపించాడు నాగ్. అలాగే వారి ఫ్యామిలీస్తో వీడియో కాల్ మాట్లాడించాడు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. భర్త, ఇద్దరు పిల్లల్ని చూడగానే సంజనా కళ్లలో నీళ్లు తిరిగాయి.ఎమోషనల్గా దీపావళి స్పెషల్ ఎపిసోడ్అటు డిమాన్ పవన్, సుమన్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు నెలన్నర తర్వాత ఇంట్లోవాళ్లను స్క్రీన్పై చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కుర్తాపైజామాలో ఉన్న నాగార్జునను చూసి సంజనా ఓ డైలాగ్ వేసింది. పెళ్లిచూపులకు రెడీ అయినట్లుగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు నాగ్.. ఏంటి? నీకు, నాకా? అని సరదాగా అన్నాడు. అది విని హౌస్మేట్స్ ఆశ్చర్యపోయారు. ఈ దీపావళి ఎపిసోడ్ నేడు రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్ -
బిగ్బాస్ కోసం జాబ్ వదిలేశాను.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ
బిగ్బాస్ 9 నుంచి దమ్ము శ్రీజను ఎలిమినేషన్ పేరుతో కావాలనే హౌస్ నుంచి పంపించేశారని ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో రీఎంట్రీ కోసం ఆమెకు మద్ధతు కూడా తెలిపారు. అయితే, బిగ్బాస్ మనసు మాత్రం కరగలేదు. తనకు నచ్చిన వారిని మాత్రమే హౌస్లో ఉంచుతాననే సంకేతాన్ని ఈ సీజన్తో బిగ్బాస్ ఇచ్చేశాడు. దీంతో ఈ షో అంతా ఒక ఫేక్ అంటూ ఓట్లేసిన వారే అంటున్నారు. తమ ఓటింగ్తో సంబంధం లేకుండా శ్రీజను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఫైర్ అయ్యారు. అయితే, ఎన్నో ఆశలతో బిగ్బాస్లోకి అడుగుపెట్టిన శ్రీజ మాత్రం ఇప్పటికీ ఆ ట్రామా నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో షేర్ చేసింది.శ్రీజ తండ్రి విశాఖ మున్సిపాలిటీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. చిన్న తనం నుంచే కష్టాలతో పెరిగిన శ్రీజ కూడా చాలా కష్టపడి చదవి ఉన్నత చదువులు పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు రెండు లక్షలకు పైగా జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్తో బిగ్బాస్ వైపు అడుగులేసింది. అందులో ఛాన్స్ రాగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ, బిగ్బాస్ మాత్రం ప్రేక్షకుల ఓటింగ్స్తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేశాడు. దీంతో ఆమె జీవితంలో తీరని నష్టాన్ని బిగ్బాస్ మిగిల్చాడని చెప్పవచ్చు.ఉద్యోగం కూడా వదిలేశాను: శ్రీజబిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైమ్లో హౌస్లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష దాటుకునేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్బాస్ కోసం ఒక పర్మినెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్ను కూడా వదులుకున్నాను. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేసిన సరే లక్ కలిసిరాలేదు. ఎలిమినేషన్ రౌండ్లో కూడా ప్రతి టాస్క్లో చివరి వరకు వెళ్లాను. కానీ, గెలుపు మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్బాస్ సీజన్స్లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. 5వారాలు హౌస్లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను. అని కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by Srija Dammu (@srija_sweetiee) -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్కార్డ్స్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్
బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత షో పరుగులు పెడుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని వ్యక్తి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే గతవారంలో ప్రేక్షకుల ఓటింగ్తో ప్రమేయం లేకుండానే షాకింగ్ ఎలిమినేషన్తో శ్రీజ దమ్ము బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లిస్ట్లో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్లలో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అందరూ దివ్య, రాములలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ, బిగ్బాస్ అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశాడు. ఒక టాప్ కంటెస్టెంట్ను హౌస్ నుంచి పంపించేశాడు.ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అదివారం బిగ్బాస్ నుంచి బయటకు రానున్నారు. కేవలం ఎక్కువ బాండిగ్స్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్ తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆపై అతని గేమ్ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టాప్లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండటంతో గేమ్పై పట్టు కోల్పోయారు. ముఖ్యంగా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై అతనితోనే దివ్య ఉండటంతో నమ్మేశాడు. దీంతో ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఏకంగా తనను నామినేట్ చేసిన వారందరూ హౌస్ నుంచి వెళ్లిపోయారని కూడా కామెంట్ చేశారు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్లిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట పతనానికి దారి తీసింది. కేవలం తన స్వయం కృతాపరాధం వల్లే భరణ ఎలిమినేట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే, ఎలాంటి నెగటివిటి లేకుండా బిగ్బాస్ నుంచి వచ్చేశారు. -
అమ్మాయిల పిచ్చి! నువ్వు చూశావా? రమ్యకు నాగ్ కౌంటర్
బిగ్బాస్ షోలో (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది. రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్నిజానికి కల్యాణ్ (Pawan Kalyan Padala) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. ఫుల్ క్లారిటీకల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్లో దూసుకుపోవడం ఖాయం! చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక! -
మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్కార్డ్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది. వాయించేసిన నాగ్మాధురి (Divvala Madhuri).. హౌస్కు రెండో బిగ్బాస్లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్ సుమన్ను అడిగాడు నాగ్. అందుకు సుమన్ తడుముకోకుండా మాధురిదే తప్పన్నాడు. ఆరోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి క్లాస్ పీకాడు. నా గొంతే అలా ఉంటుందని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్ ఖండించాడు.సూపర్ పవర్ నిర్వీర్యంమరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్ను రద్దు చేసే పవర్ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్ ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. చదవండి: ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్మేట్స్ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్ను కెప్టెన్స్గా ప్రకటించాడు బిగ్బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా!
బోల్డ్ సినిమాల్లో నటించి పాపులర్ అయింది వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ (Rekha Boj). సినిమా అవకాశాలు ఎక్కువ పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేస్తోంది. ఆ మధ్య పుష్ప మూవీలోని సామి సామి.. పాట కవర్ సాంగ్ చేసేందుకు రెండు గాజులు అమ్ముకుంది. అంతటితో ఆగడం లేదు.. కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను కానీ యాక్టింగ్ను మాత్రం వదిలేది లేదని తెగేసి చెప్తోంది.షార్ట్ఫిలింతో జర్నీ మొదలురేఖా భోజ్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం 'లవ్ ఇన్ వైజాగ్'. షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి యాక్ట్ చేశాను. తర్వాత డర్టీ పిక్చర్ అనే లఘు చిత్రం చేశాను. కాలాయా తస్మై నమః సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాను. నా జీవితంలో ఫస్ట్ కవర్ సాంగ్ సామి సామి.. బంగారు గాజులు అమ్మి మరీ ఈ పాట చేశాను. ఈ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది.కమిట్మెంట్స్ ఇచ్చుంటే..గత ఐదారేళ్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ కమిట్మెంట్స్ అడుగుతున్నారు. బంగ్లా రాసిస్తా.. అవి కొనిస్తా.. అదీ ఇదీ అని మభ్యపెట్టేవారు. కమిట్మెంట్ అడిగినవాళ్లకు గట్టిగానే కౌంటర్లిచ్చాను. అలాంటివి చేసుంటే ఈపాటికి చాలా సంపాదించేదాన్ని. నేనేదో.. నా దగ్గరున్న వస్తువులు అమ్ముకుంటూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేను. నాతో పనిచేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోతే నా ఆస్తి అమ్మేసైనా సరే.. ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. గాజులమ్మగా వచ్చిన రూ.4 లక్షలతో సామి సామి పాట ఎలా చేశానో.. కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో సినిమా చేద్దామనుకుంటున్నా.. నాలుగేళ్లుగా బిగ్బాస్కు వెళ్లేందుకు..ఎందుకంటే సినిమానే నా ప్రపంచం. ఇకపోతే పాపులారిటీ కోసం బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కి వెళ్లేందుకు ప్రయత్నించాను. గత నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది. అంతా ఓకే అన్నారు.. ఇంకో వారంలో షో స్టార్ట్ అన్న సమయంలో రిజెక్ట్ చేశారు. ముక్కూమొహం తెలియనివాళ్లు కూడా షోకి వస్తున్నారు. మరి నన్నెందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నాకు అవకాశం ఇచ్చుంటే దాన్ని బాగా ఉపయోగించుకునేదాన్ని. బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్కు సైతం వీడియో పంపించాను. కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని రేఖా బోజ్ చెప్పుకొచ్చింది.చదవండి: ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం! -
ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం!
దివ్వెల మాధురి బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంటి మహారాణిలా ఫీలైపోతుంది. సున్నితంగా చెప్పేదగ్గర కూడా ఆర్డర్లు జారీ చేస్తోంది. అటు భరణి-దివ్యల బంధం రోజురోజూకి బలపడుతోంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నా ఆరోగ్యం పాడైపోతోందిలైట్లు ఆఫ్ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్ పెట్టింది మాధురి (Divvala Madhuri). ఇదేమైనా బిగ్బాస్ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు... నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.దొంగతనాలకు రెడీ అవుతున్న రమ్యఇక రమ్య ఆర్డర్ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్బాస్. సుమన్తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది.ఏడ్చేసిన భరణి- దివ్యచెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది. తర్వాత బిగ్బాస్ వైల్డ్కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్ చేసుకుని గేమ్ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్షిప్ కాపాడుకోవాలన్నారు. ఇద్దరు కెప్టెన్స్అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్ (Suman Shetty)ను ఎంపిక చేసుకుని బాల్ టాస్క్ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్, శ్రీనివాస్.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్ కార్డులతో పాటు చివరి వరకు సుమన్ నిలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సూపర్ పవర్ ఉన్న నిఖిల్ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్లో కెప్టెన్సీ టాస్క్ ఈపాటికే అయిపోయింది. గౌరవ్, సుమన్ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు. ఒకేసారి ఇద్దరు కెప్టెన్లు ఉండటమనేది తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం!చదవండి: సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే! -
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్మేట్స్తో తలపడి గెలిచి కంటెండర్షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
బిగ్బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. ప్రేమికుడు చేసిన సంచలన ఆరోపణ
బిగ్బాస్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన ఆయేషా దుమ్మురేపుతుంది. కేరళకు చెందిన ఆమె అసలు పేరు ఆయేషా జీనత్.. అయితే, కోలీవుడ్లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో ఆమె నటించిన సత్య సీరియల్ తమిళ్లో పాపులర్ అయింది. దీంతో ఏకంగా సత్య-2 కూడా రన్ చేశారు. అలా తమిళ్ బిగ్బాస్-6లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్మా సీరియల్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్ట్లతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్బాస్లో కూడా తన స్టైల్లోనే పవర్ఫుల్గా టాలెంట్ చూపుతుంది.రెండుసార్లు నిశ్చితార్థంఆయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాపర్గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్ బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమె పంచుకుంది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్మెంట్తోనే అతనికి కూడా ఆమె గుడ్బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. కెరీర్ మీద మాత్రమే తన ఫోకస్ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని ఒక క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపింది.మోసం చేసిందని ఆయేషాపై కామెంట్ చేసిన మొదటి ప్రేమికుడుఆయేషా హీరోయిన్గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్బాస్లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్ను ఆవేశంతో దూషించడం వల్ల తను చెడ్డపేరు మూటకట్టుంది. దీంతో హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఒకసారి హౌస్ట్గా ఉన్న కమల్ హాసన్నే ఎదిరించి వైరల్ అయింది. అయితే, ఆమె తమిళ్ బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయేషాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందని కామెంట్ చేశాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా.. కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని మరో ఇద్దరితో ఆమె ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే, అతను చేసిన ఆరోపణల గురించి ఆయేషా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఫైనల్గా ఆయేషా జీవితంలో మూడు ప్రేమకథలు బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. -
బిగ్బాస్లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్!
(Bigg Boss Telugu 9) వైల్డ్కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్ 15వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం...ప్రాంక్ పేరుతో..సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది. లైవ్లో హౌస్మేట్స్ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపోరాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్ నచ్చకపోతే బిగ్బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి!ఓవరాక్షన్ ఆపవే..కిచెన్లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్ కరెక్ట్గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్.. నీకో స్టాండ్ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపేయ్ ఫస్ట్.. అంటూ రీతూను వాయించేసింది.పెద్ద లిస్ట్ చదివిన పచ్చళ్ల రమ్యమరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్ పవర్ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ, ఐస్క్రీమ్ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ.. లంచ్లోకి ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, వెజ్ టిక్కా పిజ్జా.. సాయంత్రం బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్క్రీమ్, చాక్లెట్స్.. డిన్నర్కు చికెన్, వెజ్ పికిల్స్, నాన్వెజ్ పికిల్స్.. ఇలా పేద్ద లిస్ట్ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్ను హౌస్మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి.చదవండి: దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. -
చాంతాడంత లిస్ట్ ఆర్డర్ చేసిన రమ్య.. తిన్న వెంటనే వాంతులు!
వైల్డ్కార్డులు హౌస్లో అడుగుపెట్టేముందు ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఇచ్చాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). అలా పచ్చళ్లమ్ముకునే రమ్య మోక్షకు బంపరాఫర్ ఇచ్చాడు. తనకు ఎప్పుడంటే అప్పుడు.. ఏది కావాలంటే అది.. నచ్చిన వంటకాలను అడిగితే బిగ్బాస్ కాదనుకుండా పంపిస్తాడని నాగార్జున చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్ రమ్య (Ramya Moksha) వదులుకుంటుందా? సమస్యే లేదు.పెద్ద లిస్ట్ ఇచ్చిన రమ్యటిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరీ, మైసూర్ బజ్జీ.. లంచ్కి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, వెజ్ టిక్కా పిజ్జా, బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు కావాలంటూ సరుకుల లిస్ట్ చదువుతూనే ఉంది. ఈ లిస్ట్ విని బిగ్బాస్ గుడ్లు తేలేయడం ఖాయం. ఈ ఫుడ్ను సుమన్తో షేర్ చేసుకుంటానంది. అక్కడితో ఆగలేదట! 5 కిలోల చికెన్ కూడా అడిగేసిందట! పనిలో పనిగా చికెన్ పచ్చడి పెడుతుందేమో మరి!తినలేక తంటాలుదొరికిందే ఛాన్స్ అని ఆర్డర్ పెట్టింది కానీ ఆ వంటకాలన్నీ తినలేక నానా అవస్థ పడినట్లు తెలుస్తోంది. ఏకంగా వాంతులు కూడా చేసుకుందంటున్నారు. మరి ఆర్డర్ చేసిన వంటకాలను మిగతా హౌస్మేట్స్కు పంచారా? లేదంటే రమ్య కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని బిగ్బాస్ ఏమైనా ఆర్డర్లు వేశారా చూడాలి! చదవండి: అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. -
భరణి దివ్య రిలేషన్.. అన్నయ్య అంటుంది కానీ.. నాకు డౌటే
-
బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో జైలు జీవితం అంటే ఎవరైనా బాధపడతారు, అవమానంగా ఫీలవుతారు. కానీ, ఫ్లోరా మాత్రం తెగ సంబరపడిపోయింది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా జైల్లో అడుగుపెట్టింది. ఆమెను రిలీజ్ చేయమని బిగ్బాస్ కెప్టెన్ను ఆదేశించినప్పుడు మాత్రం తెగ బాధపడిపోయింది. అప్పుడే అయిపోయిందా! అని నిరాశచెందింది.ఐదో వారం ఎలిమినేట్దానికి కారణం.. హౌస్మేట్స్తో పెద్దగా కలవదు. తన పనేదో తను చేసుకుపోతోంది. హౌస్లో ఉండాలన్న ఆసక్తి కూడా తనకేమంత లేదు. ప్రతివారం ఎలిమినేషన్కు రెడీగా ఉంది. ఒకానొక సమయంలో తను సేవ్ అయినట్లు నాగార్జున చెప్పగానే ఏంటి? నిజమా! అని నోరెళ్లబెట్టింది. తను కోరుకున్నట్లుగా ఐదో వారం హౌస్ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేసింది. తాజాగా సాక్షి ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లోరా పెళ్లి గురించి ఓపెన్ అయింది. అందుకే నాకు పెళ్లొద్దు'నాకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న రెండుమూడేళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా నా ఫ్రెండ్స్ను చాలామందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్లకూడదనుకుంటున్నా.. రిలేషన్షిప్లోనే సంతోషంగా ఉన్నాను' అని ఫ్లోరా సైనీ చెప్పుకొచ్చింది. ఫ్లోరా సైనీ మరో పేరు ఆశా సైనీ. ఈ బ్యూటీ తెలుగులో ప్రేమ కోసం, నువ్వు నాకు నచ్చావ్, చాలా బాగుంది, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు వంటి పలు సినిమాలు చేసింది. పదేళ్లుగా హిందీలోనే చిత్రాలు చేస్తోంది.చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి అయితే ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. బుధవారం అటు సంజనతో ఇటు దివ్యతో గొడవలు పెట్టేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చూస్తుంటే 38వ రోజు గట్టిగానే డ్రామా ఉండబోతుందనిపిస్తోంది.ఉదయం లేవడం లేవడమే.. వంటగదిలోకి వచ్చిన మాధురి, బాత్రూమ్లో ఉంచిన తన స్టిక్కర్స్ని ఎవరు తీశారని సీరియస్ అయింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో.. నావి ఎందుకు తీస్తున్నావ్? అయినా నీకు దొంగతనం అలవాటేగా అని రెచ్చిపోయింది. మరోచోట కెప్టెన్ కల్యాణ్తో దివ్య మాట్లాడుతూ.. వీళ్లంతా మెంటల్ గాళ్లు అని రెండు మూడు రోజుల క్రితం వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి నోరు జారింది. స్మార్ట్, మెంటలో కాదు ఏదోటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చంది.(ఇదీ చదవండి: తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!)దీని తర్వాత కిచెన్లో ఉన్న ఎగ్ దోశలు వేసుకున్న మాధురి, కొంత కూర కూడా ప్లేటులో వేసుకుంది. నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారని దివ్య అడిగేసరికి.. కొద్దిగా వేసుకున్నాను అని మాధురి సమాధానమిచ్చింది. ఒక్క సెకన్ అరవకండి అని దివ్య అనేసరికి.. వచ్చిన నుంచి గొడవ పడాలని చూస్తున్నావా అంటూ మాధురి సీరియస్ అయింది. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పింది.పర్సనల్గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే.. నాకు అస్సలు అవసరం లేదమ్మా, మీ బాండింగ్లు నాకెందుకు వాట్ ఏ జోక్, మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? నాన్న నాన్న అనుకుంటూ అని దివ్యని ఎగతాళి చేస్తున్నట్లు మాధురి మాట్లాడింది. ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని మాధురి సామెత చెబుతూ తనూజవైపు చూసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?) -
తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?సగం నామినేషన్స్తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)ఈసారి బంతి గౌరవ్కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం) -
శ్రీజ ఎలిమినేషన్ .. సర్ఫ్ ఎక్సెల్తో కడిగినా సరే మరక పోదు.. ఇలా అవమానిస్తారా?
బిగ్బాస్ 9 నుంచి దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గురించి సోషల్మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఆడియన్స్ ఓట్స్తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేయడంతో షో పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్లలో శ్రీజ చాలా స్ట్రాంగ్ అని షో చూస్తున్న వారికి ఎక్కువగా అభిప్రాయం ఉంది. టోటల్లీ అన్ఫెయిర్ బిగ్బాస్ అంటూ కొందరు.. ఇదంతా దొంగాట అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.వాస్తవంగా శ్రీజ ఆట మొదటి రెండు వారాలు పరమ చెత్తగా ఉండేది. అయితే, ప్రియ ఎలిమినేషన్ తర్వాత తన పంతా పూర్తిగా మార్చేసుకుంది. ఒక శివంగిలా ప్రతి టాస్క్లలో దూసుకుపోయింది. ఎదురుగా ఎంత మంది ఉన్నా సరే సమాధానం చెబుతుంది. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంటుగా తనను తాను మార్చుకుంది. కానీ, హౌస్లోకి కొత్తగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో ఆమెను తరిమేయడం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. హౌస్లోకి వచ్చిన ఆరుగురిలో నలుగురు శ్రీజ వద్దు అనగానే ఇలా పంపించేయడం ఏంటి..? అలాంటప్పుడు ఓట్లు, పోల్స్, వీకెండ్లో నాగార్జున షో ఎందుకు అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రజాభిప్రాయం అనేది లేనప్పుడు ఈ షో ఎందుకు అంటూ బిగ్బాస్ను తప్పుబడుతున్నారు. బిగ్బాస్లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమె జర్నీని కూడా చూపించకుండా చాలా అవమానకరంగా ఇలా గెంటేయడం ఏంటి దుమ్మెత్తిపోస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్తో కడిగినా సరే బిగ్బాస్ చరిత్రలో ఈ మరక పోదని అంటున్నారు. మా ఇష్టం వచ్చిన వాల్లను ఇంటికి పంపించేస్తామనే దోరణిలో తెలుగు బిగ్బాస్ ఉంది. కేవలం రేటింగ్ కోసమే కామనర్స్ను తీసుకున్నారా.. ఏడుగురు హౌస్లోకి వెళ్తే ఇప్పటికే నలుగురు ఇంటి బాట పట్టించారు. కనీసం శ్రీజకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చి హౌస్లోకి రప్పించాలని , అలాగైన బిగ్బాస్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రీఎంట్రీపై దమ్ము శ్రీజ కామెంట్శ్రీజ ఎలిమినేషన్ వంద శాతం కావాలనే చేశారని ఎవరైనా చెబుతారు. దీంతో ఆమె రీ ఎంట్రీ కోసం చాలా సోషల్ మీడియా ఖాతాలు ఓటింగ్ పెట్టాయి. ప్రతి దానిలో ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ గురించి ఆమె ఇలా మాట్లాడారు. దేవుని దయ వల్ల రీ ఎంట్రీ వుంటే తప్పకుండా హౌస్లోకి వెళ్తాను. నా కోసం ఇంత సపోర్ట్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సామాన్యులకు హౌస్లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన బిగ్బాస్కు ధన్యవాదాలు. నేను ఎలిమినేషన్ అవుతానని కూడా ఊహించలేదు. సీక్రెట్ రూమ్ ఉంటుంది అనుకున్నాను. ఎప్పుడైతే నన్ను బజ్ ప్రోగ్రామ్కు పంపించారో అర్థం అయింది. సడెన్గా తీసుకున్న నిర్ణయం వల్ల నా జర్నీని కూడా టెలికాస్ట్ చేయలేదు. అని శ్రీజ అన్నారు. -
నా మీద చెయ్యేస్తే కిందేసి తొక్కుతా.. కల్యాణ్పై రమ్య చీప్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్(ఫ్లోరా సైనీ, శ్రీజ) తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వచ్చేశారు. అయితే, సోమవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల హంగామా కనిపించింది. వాళ్ల రాకతో బిగ్బాస్లో వైల్డ్ తుపాన్ మొదలౌతుందని నాగార్జున సూచించారు. కానీ, అక్కడ అంత సీన్ ఏమీ లేదు. వచ్చిన వారందరూ కూడా పూర్తి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష పక్కా ప్లాన్తోనే కల్యాణ్, తనూజలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. టాప్లో ఉన్న వీరిద్దరిని టార్గెట్ చేస్తే వారిని ఇష్టపడని ఓటర్స్ను తమ వైపు లాగేయవచ్చనే స్ట్రాటజీ మొదలుపెట్టారనిపిస్తుంది.సోమవారం ఎపిసోడ్లో కెప్టెన్గా ఉన్న కల్యాణ్ను మాధురితో పాటు రమ్య టార్గెట్ చేశారు. మొదట కల్యాణ్తో దివ్వెల మాధురి గొడవ పెట్టుకున్నారు. కూర్చోండి మేడం అని చాలా మర్యాదగా ఆమెకు గౌరవం ఇచ్చాడు కల్యాణ్. కానీ, ఇంత చిన్న విషయానికి ఆమె గొడవకు దిగారు. నువ్వేమైనా నా బాస్ అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. కుర్చుంటేనే మాట్లాడుతారా అంటూ వెటకారంగా అనేశారు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఈ గొడవను భరణి ఆపాలని చూసినా మాధురి మాత్రం తగ్గలేదు. అయితే, కల్యాణ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత సమయం తర్వాత మాధురి మేడం సారీ అంటూ కల్యాణ్ కోరాడు. మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. నేను చిన్నపిల్లోడినే క్షమించేయండి అంటూ కోరుతాడు. దీంతో మాధురి కూడా మంచిగానే రియాక్ట్ అయి ఆ గొడవను క్లోజ్ చేస్తారు.నోరుజారిన రమ్య మోక్షసోమవారం ఎపిసోడ్ మొత్తం కల్యాణ్ చుట్టే నడిచింది. అతనిపై రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగానే ఉన్నాయి. ఒక సందర్భంలో మాధురితో కూర్చొని మాట్లాడుతూ.. కల్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ పెద్ద కామెంట్ చేసింది. శ్రీజ ఎలిమినేషన్ రౌండ్లో తన బెలూన్ కట్ చేశానని ఆ అబ్బాయి కల్యాణ్ ప్రవర్తన వేరేలా ఉందంటూ చెప్పింది. అసలు తనతో కల్యాణ్ మాట్లాడట్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎదురు పడితే ముఖం తిప్పుకోవడమే కాకుండా కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని మోక్ష చెప్పింది. అయితే, ఈ సమయంలో మాధురి కూడా రమ్యకు వంత పాడుతుంది. ఆ అబ్బాయితో మాట్లాడానికి ఇక్కడికి వచ్చామా లేదు కదా అని మాధురి చెబుతుంది. అతనికి (కల్యాణ్) అమ్మాయిల పిచ్చి ఫస్ట్.. అంటూ రమ్య మళ్లీ పైర్ అవుతుంది. ఈ సమయంలో మాధురి కూడా నోరు జారుతుంది. ఆ అబ్బాయి ప్రొఫెషన్ (ఆర్మీ) ఏంటో కూడా మర్చిపోయి ఇలా అమ్మాయిలతో చేస్తున్న బిహేవ్ బాగాలేదంటుంది.నా మీద చెయ్యి వేస్తే కిందేసి తొక్కేస్తా: రమ్యరమ్య బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చాక కల్యాణ్, తనూజలనే టార్గెట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం టాప్లో ఉన్నారు. కాబట్టి వారిని ట్రిగ్గర్ చేస్తే.. తనకు లాభం అనే స్ట్రాటజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎవరైతే కల్యాణ్, తనూజలను ఇష్టపడరో వారందరూ రమ్య వైపు తిప్పుకునేందుకే ఇలా స్కెచ్ వేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలోనే తనూజతో కల్యాణ్ బిహేవ్ చేస్తున్న తీరుపై రమ్య గట్టిగానే రియాక్ట్ అయింది. వారిద్దరి బాండింగ్ గురించి ఆమె ఇలా కామెంట్ చేసింది. " తనూజ, కల్యాణ్లను చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆమె (తనూజ) మీద కల్యాణ్ చేతులు ఇలా వేసేసి తడుముతుంటే చూసేందుకు నాకే ఏదోలా ఉంది. అదే విధంగా నాతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా.. ఈ విషయంలో తనూజ ఎందుకు ఊరుకుంటుదో తెలియడం లేదు. కల్యాణ్ను కూడా ఆమె ఆపేయడం లేదు. హేహే అంటుందే కానీ.. అతన్ని ఆపదు. అందుకే కదా అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. వారిద్దరి కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు. అంటూ రమ్య కామెంట్స్ చేసింది. అదంతా విన్న తర్వాత అక్కడే ఉన్న మాధురి కూడా నిజమే కదా అంటూ తల ఊపడం మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది.ఈ వారం నామినేషన్స్లో ఎవరు..?ఎపిసోడ్ చివరలో నామినేషన్ ప్రారంభమైంది. అయితే, వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు నామినేషన్లో లేరు. కానీ, వారి నుంచే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇప్పటి వరకు తనూజ వల్ల సుమన్ శెట్టి, రామూ రాథోడ్ వల్ల పవన్, సంజన వల్ల భరణి నామినేట్ అయ్యారు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో చూపించనున్నారు. అయితే.. తనూజ , దివ్య, రాము కూడా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఈసారి నామినేషన్స్లో ఎవరంటే?
ఆదివారం ఎపిసోడ్తో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూవస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ నటి)వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే 'ఫైర్ బాల్' అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్.. పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ.. సుమన్ శెట్టి, రాము.. పవన్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.అయితే 'ఫైర్ బాల్' పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరవరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్లోకి వస్తాడా? లేదంటే బయటకొచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటు పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఈ వారం నామినేట్ అయినోళ్లుభరణిపవన్దివ్యరాముసుమన్తనూజ(ఇదీ చదవండి: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!) -
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్మేట్స్కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.కెప్టెన్తో గొడవకిచెన్లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. ఎవర్నీ లెక్క చేయని మాధురినేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా -
నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్ట్రాక్ ఫేక్!
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ఐదోవారం ఎలిమినేషన్ పూర్తయింది. జనాల ఓటింగ్స్ తక్కువ రావడంతో ఫ్లోరా ఎలిమినేట్ అయింది. స్వయంకృతపరాధం + వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వల్ల శ్రీజ (Srija Dammu) ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత వీరిద్దరూ నటుడు శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఎంత టార్చర్ చేస్తే..ఈ సందర్భంగా శివాజీ.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నది మనసులో బలంగా పెట్టుకున్నావని, నీకు అదే పెద్ద మైనస్ అయిందని శ్రీజకు చెప్పాడు. ఇక శ్రీజ.. ఒక మనిషిని నువ్వు నెగెటివ్.. నెగెటివ్.. నువ్వు ఎవరికీ సెట్ కావు, నీతో మాట్లాడకూడదు అంటే ఆటోమేటిక్గా ఎక్కడో డౌన్ అవుతాం. పైగా నేను కొందరి దగ్గర కూర్చుంటే వాళ్లు అక్కడుండేవారు కాదు, వెళ్లిపోయేవారు అని తెలిపింది. అందుకు శివాజీ.. హౌస్మేట్స్ నిన్ను చూసి పారిపోతున్నారంటే ఆ రెండువారాలు ఎంత టార్చర్ చేసుంటావు? అని కౌంటరిచ్చాడు.కంటెంట్ కోసం లవ్ ట్రాక్డిమాన్ పవన్ (Demon Pawan) గురించి చెప్తూ.. 'నేను వెళ్తే లవ్ యాంగిల్ ఏదైనా ట్రై చేయొచ్చు, నాకు లవ్ యాంగిల్ వేయొచ్చేమో.. అని డిమాన్ బిగ్బాస్కు వెళ్లేముందు నాతో అన్నాడు. కంటెంట్ కోసం అలా చేస్తున్నాడు!' అంటూ పవన్-రీతూల లవ్ యాంగిల్ ఫేక్ అని బయటపెట్టింది. నిజానికి హౌస్లో డిమాన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడతాడు. కానీ రీతూతో లవ్ ట్రాక్ వల్ల తనపై అనవసరమైన నెగెటివిటీ వస్తోంది. తను ఎంత కష్టపడ్డా సరే అది హైలైట్ కాకుండా పోతోంది. పవన్కు ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్ అయిన శ్రీజ.. అతడిది ప్రీప్లాన్డ్ లవ్ ట్రాక్ అని బయటపెట్టింది.చదవండి: 'నువ్వే కావాలి'@25.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ, వదిలేసిన స్టార్ హీరో -
తన గోతిలో తనే పడ్డ శ్రీజ.. ఆడపులి రెమ్యునరేషన్ ఎంతంటే?
వరుసగా సామాన్యులను బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మనీష్, ప్రియ, హరిత హరీశ్.. ఇప్పుడు శ్రీజ! అందదరూ తమ చేతులారా ఎలిమినేషన్ను కొనితెచ్చుకున్నవాళ్లే! మొదటి రెండువారాల్లో శ్రీజను చూసిన జనాలు ఈమె ఎప్పుడు వెళ్లిపోతుందిరా బాబూ.. నోరేసుకుని పడిపోతుంది! అని అసహనం వ్యక్తం చేశారు. శ్రీజ ఎలిమినేట్ కావాల్సిందే! అని బలంగా కోరుకున్నారు.అన్ఫెయిర్ ఎలిమినేషన్కానీ ఇప్పుడు సీన్ మారింది. శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కదా విజయం అంటే! తన తప్పులు తెలుసుకుంది. నాగార్జున చెప్పిన హింట్స్ను, వీకెండ్లో స్టూడియోలో జనాల రెస్పాన్స్ను అన్నింటినీ శ్రద్ధగా గమనించింది. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చింది.వరస్ట్ నుంచి తోపు కంటెస్టెంట్గా..అరవడం తగ్గించింది. అవసరమైనచోట మాత్రం ఆడపులిలా నిలబడి మాట్లాడింది. ఆటలో అయితే ఆడ,మగ తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడింది. గెలుపొక్కటే నా లక్ష్యం అన్నచందంగా ఆడింది. చెత్త కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్టెంట్గా నిలిచింది. స్నేహితుడు పవన్ కల్యాణ్కు ఇచ్చిన మాట ప్రకారం అతడిని కెప్టెన్ను చేసింది. ఈ క్రమంలో తనే బలిపశువైంది. గతవారం ఇంటిసభ్యులను జంటలుగా విడిపోమంటే శ్రీజ అతి తెలివితో కల్యాణ్తో జత కట్టలేదు. వైల్డ్కార్డ్స్ వల్ల గేమ్ నుంచి అవుట్ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని.. చివర్లో మనిద్దర్లో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. అలా పవన్.. తనూజతో, శ్రీజ.. సుమన్తో జత కట్టింది. గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్-తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ-సుమన్ డేంజర్ జోన్లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్ల పవన్కు కలిసొచ్చింది కానీ శ్రీజ చిక్కులో పడింది. ఇప్పుడేకంగా వైల్డ్ కార్డ్స్ ఆమెను గడ్డిపోచలా ఆటలో నుంచి తీసేశారు. ఆడపులి రెమ్యునరేషన్గెలిచే వస్తానని కొండంత ఆశలు పెట్టుకున్న శ్రీజకు ఇది జీర్ణించుకోలేని విషయం. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడమంటే ఆషామాషీ కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజకు సైతం వారానికి రూ.60-70 వేల మేర రెమ్యునరేషన్ అందింది. ఈ లెక్కన ఐదు వారాలకుగానూ రూ.3 లక్షల నుంచి రూ. 3.50 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు -
నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు!
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో దివ్వెల మాధురి (Madhuri Divvala) వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే బంధాలు, బంధుత్వాలు జాన్తానై.. ఆడేందుకు వచ్చా, గెలిచే పోతా అని ధీమాగా చెప్తోంది. అంతేకాదు, తన పేరును దువ్వాడ మాధురిగా మార్చేసుకుంది. తన ఇంట్రో వీడియోలో ఇంకా ఏమందంటే.. నాది ముక్కుసూటిగా ఉండేతత్వం.. అందుకే ఫైర్బ్రాండ్ అని పిలుస్తుంటారు. నాకు ఇంటర్లోనే పెళ్లి చేశారు. ఆరాధ్య, అర్హ, అఖిల.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వీళ్లే నా ప్రపంచం.కలిసుందామని ప్రయత్నించా..మొదటినుంచీ నాకు, నా భర్తకు మధ్య అండర్స్టాండింగ్ తక్కువ. అయినా సరే కలిసుండేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. కానీ, అస్సలు కుదురలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారు. తనతో నా జర్నీ మొదలైంది. మాధురి అంటే శ్రీనివాస్.. శ్రీనివాస్ అంటే మాధురిగా నాలుగేళ్లుగా కలిసి బతుకుతున్నాం.అర్థమైందా రాజాఅయితే ఈ నాలుగేళ్లలో నేను నరకం చూడని రోజంటూ లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నాపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలని చూడకుండా నా కూతుర్లని ట్రోల్ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్బాస్ హౌస్లో చూస్తారు, అర్థమైందా రాజా.. అని ఇంట్రో వీడియోలో పేర్కొంది. ఆయన వద్దంటే షోకి రాకపోయేదాన్నినాగార్జున దగ్గర కూడా మాట్లాడుతూ.. సమాజమంతా ఒకవైపు నిలబడితే.. నేనొకవైపు నిలబడ్డాను. నా జీవితం నాకు నచ్చితే చాలు, ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దాదాపు 80% మంది నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకా 20% మంది ఎందుకు నాకు నెగెటివ్గా ఉండాలి. వారిని కూడా నావైపు తిప్పుకోవడానికే బిగ్బాస్ హౌస్కు వెళ్తున్నా.. దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే ఈ షోకి వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. మరి దువ్వాడ మాధురి హౌస్లో ఎలా ఉంటుంది? వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందా? అనేది చూడాలి!చదవండి: పవన్ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా -
ఆరోజు షూటింగ్కి వెళ్లా.. నాన్న చనిపోయారు: రమ్య మోక్ష
బిగ్బాస్ 9లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా రమ్య మోక్ష (Ramya Moksha) హౌస్లో అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ.. తన జర్నీ గురించి ఏవీ వీడియోలో చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్మిల్క్ ఎంత ఫేమస్సో నేనూ అంతే ఫేమస్.. మాదొక చిన్న ఫ్యామిలీ. అమ్మా నాన్న.. రమ్య, అలేఖ్య, సుమ. ఇదే మా కుటుంబం. షూటింగ్కు వెళ్లిన రోజే..నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. నేను చేసిన ఫిట్నెస్ వీడియోలకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడంతో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించాం. తక్కువ సమయంలోనే మా వ్యాపారం బాగా ఎదిగింది. ఒకరోజు సినిమా షూటింగ్ ఉందని కొడైకెనాల్ వెళ్లాను. ఆరోజు ఉదయం ఐదు గంటలకు నాన్న చనిపోయారు. నేను వచ్చేసరికి నాన్నను తీసుకెళ్లిపోయారు. సినిమా చేయకుండా ఉండాల్సిందినేను ఎంతో బతిమాలి చివరకు రెండు నిమిషాలు నాన్నను కడసారి చూసుకున్నాను. నేను ఆరోజు షూట్కు వెళ్లకుండా ఉండాల్సింది. అసలు ఆ సినిమాయే చేయకుండా ఉండాల్సింది అనిపించింది. నాన్న చనిపోయిన తర్వాతి వారమే ఆడియో రిలీజ్లంటూ వివాదాల్లో చిక్కుకున్నాం. ఎవరెవరో వచ్చి ఊరికనే తిట్టేవాళ్లు. చాలా ఫేస్ చేశాం. అప్పుడు మా అక్క కోపం తట్టుకోలేక రివర్స్లో తిట్టింది. కెరీర్పై ఫోకస్ పెట్టా..క్షణికావేశంలో జరిగిన తప్పు వల్ల మా జీవితాలు తారుమరయ్యాయి. బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు బిగ్బాస్లాంటి ప్లాట్ఫామ్లో అవకాశం దొరికితే నేను వదలుకుంటానా? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ అని చెప్పుకొచ్చింది. మరి బిగ్బాస్ షోలో రమ్య మెప్పిస్తుందా? ట్రోలర్స్కు ఛాన్స్ ఇస్తుందా? చూడాలి! -
పవన్ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఐదోవారం నామినేషన్స్ పూర్తవగానే ఎలిమినేట్ అయ్యేదెవరనేది ఫిక్స్ అయిపోయింది. కానీ రీతూ, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నట్లు కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేశాడు నాగ్. హౌస్లో ఉంచినా సరే, పంపించినా సరే అన్నట్లుగా ఫ్లోరా చాలా కూల్గా ఉంది. కానీ, రీతూ మాత్రం ఏడుపందుకుంది. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్కు పిలిచిన నాగ్.. చివరిసారి మీ మనసులోని మాటలు చెప్పమన్నాడు.ఆ విషయం సంజనాకు మాత్రమే తెలుసుఅప్పుడు ఫ్లోరా (Flora Saini) మాట్లాడుతూ.. బిగ్బాస్ హౌస్లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నేను నా బెడ్పై చాలాసార్లు ఏడ్చాను. ఆ విషయం సంజనా ఒక్కరికే తెలుసు. తను మాత్రమే నా దగ్గరకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా సంజనా ఒక్కరే వచ్చింది. సంజనాను నేను మిస్ అవుతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ గేమ్ ఎంజాయ్ చేయ్ అంటూ కాస్త ఎమోషనలైంది. రీతూ వంతు రాగా ఏడుస్తూనే మాట్లాడింది.వెళ్లి పవన్ను హగ్ చేసుకో..పవన్, నిన్ను చాలా మిస్ అవుతా.. నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. బాగా ఆడు.. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏకధాటిగా ఏడ్చేసింది. తర్వాత నాగ్.. ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అప్పటికీ రీతూ ఏడుపు ఆపకపోయేసరికి ఫ్లోరా.. నువ్వు సేఫ్ అయ్యావ్, ఎందుకేడుస్తున్నావ్.. హ్యాపీగా వెళ్లు, పవన్ను హగ్ చేసుకో అని చెప్పింది. సంజన, ఇమ్మాన్యుయేల్, దివ్య, శ్రీజలకు థంబ్స్ అప్ ఇచ్చి తనూజ, భరణికి థంబ్స్ డౌన్ సింబల్ ఇచ్చింది. సుమన్ శెట్టి.. థంబ్స్ అప్, థంబ్స్ డౌన్కు మధ్యలో ఉన్నాడంది. అందరికీ గుడ్బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
లక్స్ పాప ఇమేజితో బిగ్బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయింది. ఐదో వారంలో బయటకొచ్చేసింది. అయితే ఈమెతో పాటు రీతూ కూడా ఎవిక్షన్ రూంలో ఉన్న టైంలో.. రీతూ నిజంగా ఎలిమినేట్ అయిపోతానేమోనని భయంతో తెగ ఏడ్చేసింది. కానీ ఫ్లోరా బయటకొచ్చేయడంతో రీతూ ఊపిరి పీల్చుకుంది.తొలివారం సంజనతో గొడవపడి కాస్త హడావుడి చేసిన ఫ్లోరా.. తర్వాత వారం నుంచి మాత్రం చాలా సైలెంట్ అయిపోయింది. గేమ్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోవడం, అలానే హౌస్మేట్స్తోనూ పెద్దగా ఇంటరాక్ట్ కాకపోవడం లాంటి కారణాలతో ప్రతివారం నామినేట్ అవుతూ వస్తున్నప్పటికీ సేవ్ అవుతూనే వచ్చింది. కామనర్స్ మనీష్, ప్రియ, హరీశ్.. వరస వారాల్లో ఎలిమినేట్ కావడం ఈమెకు కాస్త ప్లస్ అయింది. ఐదో వారం మాత్రం తప్పించుకోలేకపోయింది.(ఇదీ చదవండి: బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్)రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి రూ.2.1 లక్షల చొప్పున ఫ్లోరా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐదు వారాలు ఉన్నందుకుగానూ రూ.10.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇన్నిరోజులు ఉన్నప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. రెమ్యునరేషన్ పరంగా బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది.ఇక వెళ్తూవెళ్తూ సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజకి థమ్ అప్ ఇచ్చింది. భరణి, తనూజకి థమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం అటుఇటుకి మధ్యలో పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) -
బిగ్బాస్ 9 తెలుగు.. 'వైల్డ్ కార్డ్' ఎపిసోడ్ హైలైట్స్
బిగ్బాస్ 9వ సీజన్లో అప్పుడే ఐదు వారాలు గడిచిపోయింది. ప్రతిసారిలానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఏకంగా ఆరుగురు హౌస్లోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఆదివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది లైవ్ అప్డేట్స్లో చూద్దాం. -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్బాస్ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్లు హౌస్లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి
బిగ్బాస్ 9వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు హౌస్లోకి వెళ్లబోతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మాధురి అనే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. దానికి తోడు ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే తన ఎంట్రీ గురించి ఈమె బయటపెట్టేసింది. వైల్డ్గా ఉండేవాళ్లే వైల్డ్ కార్డ్గా వెళ్తారని, హౌస్లోకి వెళ్లిన తర్వాత నేనేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!)'వైల్డ్గా ఉండేవాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇలా వెళ్తున్నా. బిగ్బాస్ నుంచి కాల్ రాగానే ముందు వద్దని అనుకున్నా, కానీ చాలామంది ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి. ప్లీజ్ మేడమ్ మిమ్మల్ని షోలో చూడాలనుకుంటున్నాం అని చాలామంది అనడం వల్ల వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. అనుభవం, జనాలకు ఇంకా చేరువ కావాలి అనే ఉద్దేశం కూడా నాకు ఉంది' అని మాధురి చెప్పుకొచ్చింది.'హౌస్లో ఉన్నవాళ్లందరూ మాస్క్లు వేసుకుని ఉన్నారు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఫేక్గా ఉంటున్నారు. కొద్దోగొప్పో ఇమ్మాన్యుయేల్ బెటర్గా అనిపిస్తున్నాడు. ఉన్నవాళ్లలో ఎవరూ నాకు టఫ్ ఫైట్ ఇస్తారని అనుకోవట్లేదు. ఇకపోతే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కామనర్స్ ఓవరాక్షన్ చేస్తున్నారు. అందుకే ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటారనే ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక రోజులో బయటకొచ్చేసినా పశ్చాత్తపపడను. టాప్-5కి వెళ్లినా ఏం అనుకోను. కప్ గెలుచుకున్నా సరే పొంగిపోను. అన్ని టాస్కులు ఆడగలను నేను. నా ఆట నచ్చితే ఓట్లు వేయండి లేదంటే వద్దు' అని షోపై మాధురి తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
భరణికి గట్టిగానే హెచ్చరిక.. కెప్టెన్సీ కోసం కల్యాణ్, పవన్ల మోసం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రణరంగంలానే ఉంది. గతంలోకంటే ఎక్కువ టాస్క్లు పెడుతూ బిగ్బాస్ జోరు పెంచాడు. తాజాగా శనివారం ఎపిసోడ్ నాగార్జున ఎంట్రీతో మరింత హీట్ పెరిగింది. ఈ వారంలో భరణి చేసిన తప్పులతో పాటు రితూ, పవన్లను కూడా నాగ్ ఎండగట్టారు. తనూజాకు ఒక వీడియో చూపించి అసలు విషయం తెలుసుకోవాలంటూ సూచన ఇచ్చారు. ఇకనైన గేమ్ మీద ఏకాగ్రత పెట్టాలని నాగ్ సలహా ఇచ్చారు.ఈ వారం ఉత్తమ ప్రదర్శనతో ఇమ్మాన్యుయేల్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గోల్డెన్ స్టార్ల మనసు కూడా గెలుచుకున్నాడు. దీంతో పవర్ అస్త్ర పోటీలో కూడా ఇమ్మూ తనదైన ముద్రవేశాడు. తనూజ,దివ్య రాము, కళ్యాణ్,భరణిలతో కలిసి పవర్ అస్త్ర పోటీలో ఇమ్మూ ఉన్నారు. ఈ టాస్క్లో పవర్ అస్త్రను అతను గెలుచుకున్నాడు.భరణిని గట్టిగానే హెచ్చిరించిన తెలంగాణ అమ్మాయితెలంగాణ అమ్మాయి శ్రుతి ప్రస్తుతం యూకేలో ఉంటుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఆమె ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొంది. ఈ క్రమంలోనే షో గురించి మాట్లాడాలని ఆమెకు నాగార్జున మైక్ ఇచ్చారు. తనకు ఫేవరేట్ ఇమ్మానుయేల్ అని చెప్పిన ఆమె భరణి ఆట మాత్రం నచ్చదని సూటిగానే చెప్పేసింది. ఇదే విషయాన్ని భరణితోనే డైరెక్ట్గానే అనేసింది. మీ ఆట మార్చుకోండి లేదంటే బిగ్బాస్లో మేము ఉంచమని పేర్కొంది. బంధాలు పెట్టుకున్నవాళ్లతోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పింది. బంధాలు పెట్టుకోని వాళ్లను మాత్రం కిందకు తోసేస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీజాని కూడా తోసేశారని చెప్పింది. అది ఎంతమాత్రం ఆడియన్స్కు నచ్చలేదని క్లారిటీ ఇచ్చింది.పవన్, కల్యాణ్ల మోసంబిగ్బాస్లో చాలామందిని మెప్పించిన కంటెస్టెంట్ తనూజ.. ఈ వారంలో ఆమె ఆట బాగున్నప్పటికీ బంధాల విషయంలో కాస్త ఇబ్బంది పడిందని చెప్పాలి. ఈ క్రమంలోనే నాగార్జున ఆమెను కన్ఫెషన్ రూమ్కు పిలిచి మాట్లాడారు. కెప్టెన్గా కల్యాణ్ గెలిచాడు కదా అందుకు సబంధించిన వీడియో ఒకటి చూడాలని ప్లే చేస్తాడు. అందులో కల్యాణ్ గెలుపు కోసం డెమాన్ పవన్ తన షూస్తో చేసిన పనిని వీడియోలో నాగ్ చూపించారు. ఈ వీడియోలో ఏం గమనించావ్ అని తనూజని నాగ్ కోరుతారు. అతను (పవన్) కాలితో ఎటు వైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపిస్తున్నట్లు ఉందన్ని తనూజ చెబుతుంది. దాంతో నాగార్జున అసలు విషయం చెప్తాడు. నాన్నా నాన్నా అంటూ బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడని డెమాన్ పవన్ క్లియర్గా కళ్యాణ్కి అలా తన లెగ్తో చూపించాడని క్లారిటీ ఇస్తాడు. కళ్యాణ్ కూడా దీని ఆధారంగానే సమాధానం చెప్పాడని నాగ్ అంటారు. కానీ, ఈ విషయం నీతో ఎవరూ చెప్పలేదని క్లారిటీ ఇస్తారు. ఇకనైనా సరే జాగ్రత్తగా ఆట ఆడాలని తనూజను నాగ్ కోరుతారు.ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా కిందపడిపోయిన భరణికొన్ని గేమ్స్లలో భరణి ఆడిన తీరు మెచ్చి నాగార్జున గోల్డెన్ స్టార్ ఇస్తారు. దానిని దివ్య చేతుల మీదుగా తీసుకుంటానని ఆయన కోరతాడు. దీంతో తనూజలో కనిపించని బాధను వ్యక్తం చేస్తుంది. దివ్య ఎంట్రీ తర్వాత భరణి కూడా తనూజకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బెడ్ టాస్క్ గురించి నాగార్జున మాట్లాడుతారు. శ్రీజాని అలా తోసేయడం కరెక్ట్ అనిపించిందా భరణి అని నాగ్ అడుగుతారు. డెమాన్ పవన్ కంటే ముందే నువ్వు బెడ్ నుంచి పడిపోయావ్ కదా అని నాగ్ వీడియోతో చూపిస్తాడు. దీంతో చేసేది ఏం లేక స్వార్ధంగా ఆలోచించాను సార్ అని తప్పును ఒప్పుకుంటాడు. దీంతో నాగార్జున కూడా చురకలు అంటిస్తాడు. ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు.. మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావ్ అంటారు. మహాభారతంలో ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావ్ అంటూ క్లాస్ తీసుకున్నారు. ఆటలో ముందుకు వెళ్లాల్సిన శ్రీజాను కిందకు తోసేశావ్. నీవల్ల ఆమె ఆటే ఆగిపోయింది. కేవలం పొరపాటు వల్లే జరిగింది. అని భరిణిపై గట్టిగానే నాగ్ హెచ్చరించారు. Demon Pavan gave a shoe signal to Kalyan Padala in the captaincy taskI really doubt you r a real soldierKalyan can't win a single task on his own without cheatingWorst to the coreShame on the BB team for encouraging this shit#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja pic.twitter.com/b1XToXizj3— Aadarshini Aadarshini (@a_aadarshini) October 11, 2025 -
బిగ్బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు లీకులు వచ్చేశాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది.లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశారట. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా ఆరుగురు రాబోతున్నారట. వీళ్లలో ముగ్గురు సీరియల్ నటులే కావడం విశేషం. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరెవరు వస్తున్నారు? వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూద్దాం.రమ్య మోక్షసోషల్ మీడియాలో పికెల్స్ (ఊరగాయలు) బిజినెస్తో పాపులారిటీ తెచ్చుకున్న రమ్య మోక్ష.. వైల్డ్ కార్డ్గా రాబోతుందట. చెప్పాలంటే రమ్యతో పాటు ఈమెకు మరో ఇద్దరు అక్కలు ఉన్నారు. వీళ్లంతా కలిసి ఆన్లైన్లో పికెల్స్ బిజినెస్ చేస్తుంటారు. అయితే ఈమె ఫిజికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గొడవల విషయంలో ఎక్కడా తగ్గదు. ఈమెని ఇన్ స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హౌస్లోకి వస్తే చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశముంది.శ్రీనివాస్ సాయి'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ అవి ఏ మాత్రం ఇతడి కెరీర్కి ఉపయోగపడలేదు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. దీంతో బిగ్బాస్ వాళ్లు అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేసినట్లున్నాడు. కుర్రాడు కాబట్టి హౌసులోకి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్స్ లాంటివి ఉండొచ్చు.నిఖిల్ నాయర్'గృహలక్ష్మి' సీరియల్తో తెలుగు ప్రేక్షకులు తెలిసిన ఇతడు.. 'పలుకే బంగారమాయెనా' సీరియల్లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు. సిక్స్ ప్యాక్ కూడా ఉంది. హౌస్లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ. సీరియల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి బాగా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులున్నాయి.గౌరవ్ గుప్తాప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ చేస్తున్నారు. ఇతడు కూడా సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తున్నాడు. హౌసులోకి వెళ్లిన తర్వాత అటు లవ్ ట్రాక్స్తో పాటు ఫిజికల్గానూ మంచి పోటీ ఇచ్చే ఛాన్సుంది. చూడాలి మరి ఏం చేస్తాడో?ఆయేషా జీనత్వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్తో ఇక్కడ కాస్త పాపులరే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్లోనూ పాల్గొంది. గతంలో తమిళ బిగ్బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన అనుభవం ఈమెకుంది. ఈమె వైల్డ్ కంటెస్టెంట్గా వైల్డ్ ఫైర్ చూపించే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఆటనే కాదు గ్లామర్ పరంగానూ హౌసులోకి చాలామందికి పోటీ ఇవ్వడం గ్యారంటీ.దివ్వల మాధురిసోషల్ మీడియాలో రీల్స్తో పాపులారిటీ తెచ్చుకున్న దివ్వల మాధురి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిన్నటి వరకు సందేహంగానే ఉంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. -
ఈసారి డబుల్ ఎలిమినేషన్.. ఫ్లోరాతో పాటు ఆమె కూడా!
అనుకున్నదే జరిగినట్లు కనిపిస్తుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్బాస్లో ప్రస్తుతం ఐదో వారం నడుస్తోంది. గత నాలుగు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్, ప్రియ, హరీశ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరవుతారోనని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఈసారి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో ఇప్పుడు ఇద్దరు బయటకెళ్లిపోయారట.బిగ్బాస్ నుంచి ఈ వారం.. తొలి వికెట్గా ఫ్లోరా బయటకెళ్లిపోయినట్లు ఖరారైపోయింది. లెక్క ప్రకారం తొలి రెండు వారాల్లోనే ఈమె ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే పెద్దగా యాక్టివ్గా ఉండదు, నామినేట్ చేసినా సరే పెద్దగా వాదులాడటం లాంటివి చేయకుండా సరే సరే అని అనడం, గత కొన్నిరోజుల నుంచి అయితే సంజనకు సేవకురాలిగా ఉండటం తప్పితే పెద్దగా చేసినట్లు కనిపించలేదు. దీంతో ఈ వారం ఫ్లోరాని బిగ్బాస్ బయటకు పంపేశాడు.(ఇదీ చదవండి: ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?)ప్రతి సీజన్లోనూ ఐదో వారం దాదాపుగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుంది. ఈసారి కూడా ఆరుగురు రాబోతున్నారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండటం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఫ్లోరాతో పాటు నామినేట్ అయిన వాళ్లలో ఎవరి వికెట్ పడుతుందా అనుకున్నారు. డేంజర్ జోన్లో అయితే శ్రీజ, దివ్య, రీతూ, పవన్, సుమన్ శెట్టి ఉన్నట్లు తెలిసింది. వీళ్లలో నుంచి ఇప్పుడు శ్రీజని కూడా బయటకు పంపేశారట. అయితే ఈ ఎలిమినేషన్ కాస్త విచిత్రంగా సాగింది.మామూలుగా అయితే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే పంపిస్తుంటారు. కానీ శ్రీజని మాత్రం.. హౌస్లోకి రాబోతున్న వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ముకుమ్మడిగా బయటకు పంపేశారట. డేంజర్ జోన్లో ఉన్నవాళ్లలో ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలని అడగ్గా.. ఎక్కువమంది శ్రీజ పేరు చెప్పారట. దీంతో ఈమెని డబుల్ ఎలిమినేషన్లో బయటకు పంపేశారని తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్స్తో పాటు వైల్డ్ కార్డ్స్ ఎవరనేది కూడా క్లారిటీ రానుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
ఫ్లోరా ఎలిమినేషన్ ఫిక్స్? బిగ్బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా!
ఫ్లోరా సైనీ (Flora Saini).. ఈపాటికే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్! అలా అని తనపై జనాల్లో అంత వ్యతిరేకత ఉందా? అంటే రవ్వంతైనా లేదు. కానీ, తనపై పాజిటివిటీ కూడా లేదు. హౌస్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించకపోవడమే ఫ్లోరాకు పెద్ద మైనస్. అయితే కామనర్స్ చేసిన ఓవరాక్షన్ వల్ల ఫ్లోరాకు ఓట్లు పడ్డాయి. తనను లేటుగానైనా పంపించొచ్చు, ముందు తలనొప్పిగా తయారైన కంటెస్టెంట్లను తరిమేద్దాం అన్న ఉద్దేశంతో మనీష్, ప్రియ, హరీశ్లను బయటకు తోసేశారు.స్కెచ్ వర్కవుట్ అయినట్లేనా?కానీ, తన వల్ల షోకి ఎటువంటి ప్లస్ లేకపోయేసరికి బిగ్బాస్ (Bigg Boss Telugu 9).. ఫ్లోరా ఎలిమినేషన్కు పెద్ద స్కెచ్ వేశాడు. తనను రెండువారాలు డైరెక్ట్గా నామినేట్ చేశాడు. పైగా ఈవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురిని హౌస్లో దింపుతున్నారు. కాబట్టి తనతో పనేం లేనందున ఫ్లోరాను హౌస్ నుంచి సాగనంపుతున్నారు.ఫ్లోరా ఏం చేసింది?ఫ్లోరా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతుంది. తిన్నామా, పడుకున్నామా, గేమ్స్ ఆడామా.. అంతే! అంతకుమించి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు. సంచాలక్గా ఉన్నప్పుడైతే తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఎవరైనా తనను నామినేట్ చేసినా, ప్రశ్నించినా సైలెంట్గా ఉంటుందే తప్ప తిరిగి కౌంటర్లివ్వడం చాలా అరుదు. ఇలాంటి సైలెంట్ కంటెస్టెంట్ జనాలకు అంతగా నచ్చరు. అందుకే లక్స్ పాప ఈ వారం బయటకు వచ్చేస్తోందన్నమాట!చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్: బిగ్బాస్ కంటెస్టెంట్ -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్కు పంపించేందుకు బిగ్బాస్ చివరి ఛాన్స్గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్గా నిలిచాడు.కల్యాణ్ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
బంధాల్లో చిక్కుకుపోయిన భరణి.. కొత్త కెప్టెన్ అతడే!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) బంధాల షోగా మారిపోయింది. మీరంతా రిలేషన్స్ పెట్టుకోవడానికి హౌస్కి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చారని నాగ్ చురకలంటించినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతవారం తనూజ ఫేవరెట్ వస్తువులను భరణితో.. భరణికి ముఖ్యమైన వస్తువులను తనూజతో పగలగొట్టించి.. ఈ రిలేషన్స్కు ఫుల్స్టాప్ పెట్టమని డైరెక్ట్గా చెప్పారు. అబ్బే, తలకెక్కితే కదా!కనుక్కోండి చూద్దాంఈ బంధాల మధ్యలో ఎక్కువ నలిగిపోతుంది భరణియే (Bharani Shankar)! దానివల్ల ఇప్పుడేకంగా కెప్టెన్సీ కూడా చేజారింది. సేఫ్ జోన్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, రాము, భరణి, దివ్య, పవన్ కల్యాణ్, తనూజ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వీళ్లందరి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. తమ తలపై ఉన్న బల్బును ఎవరు ఆఫ్ చేశారో కరెక్ట్గా చెప్తే వాళ్లు ఎలిమినేట్!కెప్టెన్గా కల్యాణ్అలా దివ్య మొదటగా రామును తీసేసింది. కల్యాణ్ వంతు వచ్చేసరికి.. భరణి పేరు గెస్ చేశాడు. ఆయన తనూజ, దివ్యను ఎలాగో తీయడు. ఇమ్మాన్యుయేల్పై కొంత అనుబంధం ఉంది. కాబట్టి నన్ను తీసేయాలనుకున్నాడు అని కరెక్ట్గా గెస్ చేశాడు. అలా ఈ కనుక్కోండి చూద్దాం ఆటలో గెలిచి పవన్ కల్యాణ్ ఐదో కెప్టెన్గా నిలిచాడు. చదవండి: కమల్ హాసన్పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్బాస్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ -
కమల్ హాసన్పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్బాస్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్బాస్లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్ఫైర్లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె -
ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు
ఇమ్యూనిటీ కోసం గేమ్స్ పెడితే ఇమ్మాన్యుయేల్ గెలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. రాము కెప్టెన్ కాబట్టి దర్జాగా ఉన్నాడు. మిగిలినవారందరికీ గేమ్స్ పెట్టకుండా ఖాళీగా వదిలేస్తే రియాలిటీ షోను కాస్త ఫ్యామిలీ సీరియల్ డ్రామాగా మార్చేలా ఉన్నారని బిగ్బాస్కు భయం పట్టుకుంది. అమ్మ, నాన్న, అన్న, కొడుకు ఇలా ఏవేవో బంధుత్వాలు కలిపేసుకుని అక్కడే ఆగిపోయారు. అందుకే వీళ్లకు కొన్ని గేమ్స్ పెట్టారు. మరి హౌస్లో నిన్న (అక్టోబర్ 9న) ఏం జరిగిందో చూసేద్దాం..కూతుర్ని బుజ్జగించిన నాన్నతనూజ నాన్న (భరణి)పై అలక బూనింది. దీంతో అతడు కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఈ హౌస్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కాసేపు మాట్లాడాడు. ఇంతలో బిగ్బాస్ నాచోరే నాచోరే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్లో కల్యాణ్ గెలిచాడు. తర్వాతి స్థానాల్లో దివ్య, డిమాన్, సుమన్ ఉన్నారు. సంజనా టీమ్కు ఒక్క పాయింట్ కూడా రాలేదు. లీడర్ బోర్డ్లో మొదటి స్థానంలో ఉన్న దివ్య- భరణికి బిగ్బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నావల్ల కాదు: సంజనాపట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఫ్లోరా- సంజనా, శ్రీజ- సుమన్లలో నుంచి ఒక జట్టును రేసు నుంచి తొలగించవచ్చన్నాడు. దీంతో వాళ్లు ఫ్లోరా- సంజనాను తీసేశారు. తన కష్టమంతా వృథా కావడంతో సంజనా తట్టుకోలేకపోయింది. ఒంటరి కూర్చుని ఏడ్చేసింది. ఫిజికల్ టాస్కులు ఉంటాయని నాకు తెలీదు. అబ్బాయిల శరీరంపై నుంచి ఎలా దూకాలి బిగ్బాస్? నేనెప్పుడూ అలా చేయలేదు. ఇలాగైతే నేనుండలేను, ఇంటికెళ్లిపోతాను. తనూజ గెలుపు.. ఏడ్చేసిన రీతూసుమన్ శెట్టిపై నేనెలా దూకాలి? అమ్మాయిలతో అయితే పర్లేదు కానీ, అబ్బాయిలతో ఎలా? ఇలాగైతే నన్ను ఇంటికి పంపించండి అని ఏడ్చింది. తర్వాత పిరమిడ్ కట్టు-పాయింట్స్ పట్టు గేమ్లో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఈ గేమ్లో డిమాన్- రీతూ నాలుగో స్థానంలో నిలబడ్డారు. గేమ్ నీ వల్లే పోయిందన్నట్లుగా డిమాన్ చిరాకుపడటంతో రీతూ ఏడ్చింది. ఇక ఇంతటితో గేమ్స్ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్బాస్. లీడర్ బోర్డ్లో దివ్య- భరణి ఫస్ట్ ప్లేస్లో , తనూజ- పవన్ కల్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు.తనూజ త్యాగంమొదటి స్థానంలో ఉన్నవారు డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్కి వెళ్లొచ్చన్నారు. రెండో ప్లేస్లో ఉన్న జట్టులో ఒక్కరికే సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. సేఫ్ జోన్లో ఉంటానని కల్యాణ్ అనగానే తనూజ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఇక్కడ శ్రీజ ప్లాన్ వర్కవుట్ అయింది. శ్రీజ- కల్యాణ్ ఒక టీమ్గా జత కడితే ఎవరో ఒకరు నష్టపోయే ఛాన్స్ ఉంటుందని ముందే ఆలోచించింది. అందుకనే ఇద్దరూ వేర్వేరు టీమ్స్గా ఏర్పడ్డారు. దాంతో ఇప్పుడు కల్యాణ్ సేఫ్ జోన్లో ఎంటరయ్యాడు. ఇక కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ గెలిచిన ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య, కల్యాణ్ మాత్రమే ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలినవారంతా డేంజర్ జోన్లో ఉన్నారు.చదవండి: అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. ఒకరోజు గ్యాప్తో మళ్లీ షురూ -
షూటింగ్కి వెళ్తే..ఆ హీరో నా చేతులు గట్టిగా పట్టుకొని.. : సంజనా
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే టాక్ ఇప్పటికీ ఉంది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. అవకాశాల పేరుతో కొంతమంది..అవసరాలకు మరికొంత మంది వారిని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటున్నారు. టాలెంట్తో చాన్స్ దక్కించుకొని షూటింగ్కి వెళ్తే..అక్కడ కూడా వేధింపులు తప్పవు. చాలా మంది అలాంటి వేధింపులను భరించలేక..ఇండస్ట్రీనే వదిలేశారు. కొంత మంది మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్ పరంగా ముందుకు సాగారు. అలాంటి వారిలో సంజన గల్రానీ ఒకరు. తన కెరీర్లో ఎంతో మందితో వేధింపులు ఎదురయ్యాయని..వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది.తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలతో అలరించిన ఈ బ్యూటి.. ఇప్పుడు బిగ్బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ నటి బిగ్బాస్ హౌస్లోనే ఉంది. అయితే ఈమెకు సంబంధించిన ఓ పాట ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. అందులో ఆమె కెరీర్లో ఓ హీరోతో ఎదురైన ఇబ్బందిని పంచుకుంది. కన్నడ సినిమా షూటింగ్లో ఓ హీరో తనను టార్చర్ చేశాడట. తన చేతులను పట్టుకొని గట్టిగా నొక్కాడట. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్ చేసుకో అని దురుసుగా మాట్లాడినట్లు సంజనా చెప్పింది.‘కన్నడలో ఓ సినిమా షూటింగ్ నాకు ఇబ్బందిగా అనిపించింది. పేరు చెప్పలేను కానీ ఓ హీరో నన్ను టార్చర్ పెట్టాడు. ఆ మూవీ డైరెక్టర్తో అతనికి గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో షూటింగ్ జరపగా.. హీరో వచ్చిన నా చేతులు గట్టిగా నొక్కాడు. వాస్తవానికి ఆ సీన్లో హీరో నా చేతులు పట్టుకొని ముందుకు మూవ్ అవ్వాలి. కానీ ఆయన కోపంతో వచ్చి గట్టి గట్టిగా నొక్కాడు. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్ చేసుకో అని సీరియస్ లుక్తో చెప్పాడు. నేను కాసేపు షూటింగ్నే ఆపేశా. ‘ నేను దెబ్బలు తినడానికి రాలేదు..ఇదేం యాక్షన్ సీన్ కాదు.. నేను విలన్ కాదు..ఈ సీన్కి తగ్గట్టుగా నీ మైండ్సెట్ మార్చుకో.. ఆ తర్వాతే షూట్ చేద్దాం’ అని అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్ చేశాం. ఇలాంటి క్రాక్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు దొరుకుతారు. వారిని పట్టించుకోకుండా..మన పని చేసుకొని పోవాలి’ అని సంజన చెప్పుకొచ్చింది.టాలీవుడ్ చిత్రం సోగ్గాడు(2005) ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజనా.. తమిళంలో ఒరు కధల్ సేవిర్తో తొలి విజయం అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రం సంజన జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది. -
ప్రపోజ్ చేసిన కల్యాణ్.. కానీ చివరకు వరస్ట్ ఆటగాడిగా
బిగ్బాస్ షో ప్రేమ, రిలేషన్ లాంటి వాటికి పెట్టింది పేరు. ప్రతి సీజన్లోనూ ఏదో ఓ జంట తెగ కెమిస్ట్రీ పండించేస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాంటి జంటలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నిరోజుల ముందు వరకు ట్రయాంగిల్ ప్రేమకథ కనిపించింది. కానీ ఇప్పుడు రెండు జంటల మధ్య సరదా ముచ్చట్లు కనిపిస్తున్నాయి. బుధవారం ఎపిసోడ్లో జంటల్లో ఒకటైన తనూజ-కల్యాణ్ 'ప్రపోజల్' కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి ఈ విషయంపై దృష్టి పెట్టడం వల్లో ఏమో గానీ చివరకొచ్చేసరికి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్గా మిగిలాడు. ఇంతకీ 31వ రోజు ఏమేం జరిగింది?హౌస్మేట్స్ ఇమ్యూనిటీ సాధించేందుకు బిగ్బాస్.. మంగళవారం ఎపిసోడ్లో పట్టు వదలకు, బెలూన్ టాస్క్ పోటీలు పెట్టారు. బుధవారం నేరుగా గేమ్స్ కాకుండా కాసింత డ్రామా నడిచింది. ఉదయం లేచిన తర్వాత బయట అలా తిరుగుతూ ఇమ్మూ, తనుజ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. నేను నీ బ్రదర్గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ అంటూ తనూజతో ఇమ్మూ... సినిమా డైలాగ్స్ కొట్టాడు. దీంతో నీ వయసెంత అని తనూజ అడిగింది. నీ కన్నా రెండు సంవత్సరాలు పెద్దే అని ఇమ్మూ చెప్పాడు. ఫర్లేదు ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడివని చెప్పేస్తానని తనూజ పంచ్ వేసింది. చెప్పాల్సినోళ్లకి చెప్పెయ్ తమ్ముడని, నాకెందుకు అని ఇమ్మూ.. కల్యాణ్ వైపు చూసి ఫన్ చేసేశాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ హౌస్కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు)కాసేపటి తర్వాత తనూజతో డిస్కషన్ పెట్టిన కల్యాణ్.. ఏదైనా ఛాన్స్ ఉంది, నాలాంటోడు అయితే నీకు ఓకేనా? అని నేరుగా ప్రపోజల్ పెట్టేశాడు. దీంతో తనూజ.. అందుకే నిన్ను పిల్లాడు అనేది అని నవ్వుకుంది. ఏ పరిస్థితుల్లోనైనా కూల్, కామ్గా డీల్ చేసే పర్సన్.. ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి, ఆ టాపిక్ని తెగ్గొట్టే సత్తా, అన్నింటినీ మించి నా మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యే వ్యక్తి అంటే నాకు ఇష్టం అని తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో తనూజ చెప్పింది. దీంతో కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇమ్మూ-రీతూ చౌదరి కౌంటర్స్ వేసి నవ్వుకున్నారు.మళ్లీ గేమ్స్ మొదలుపెట్టిన బిగ్బాస్.. 'మ్యాచ్ ఇట్ విన్ ఇట్' అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా జట్టు సభ్యుల్లోని ఒకరు.. యాక్టివిటీ ఏరియాలోని మ్యూజియంకు వెళ్లి అక్కడున్న వస్తువుల్ని గమనించి.. మళ్లీ లివింగ్ ఏరియాకు వచ్చి బోర్డుపై దాని బొమ్మ గీస్తారు. జట్టులోని మరో సభ్యుడు.. ఆ వస్తువు లేదా బొమ్మ ఏంటని సరిగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ పోటీలోని తొలి రౌండ్లో దివ్య-భరణి గెలిచారు. తర్వాత వరస రౌండ్లలో ఫ్లోరా-సంజన, శ్రీజ-సుమన్, రీతూ-పవన్ గెలిచారు. తనూజ-కల్యాణ్ జోడీ మాత్రం ఓడిపోయారు. తనూజ బొమ్మలు బాగానే వేసినప్పటికీ కల్యాణ్ వాటిని గుర్తుపట్టలేకపోయాడు.దీని తర్వాత 'హోల్డ్ ఇట్ లాంగ్' అనే మరో టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా కేటాయించిన ఫ్లాట్ఫామ్ రెండు వైపుల నిలబడి, తాళ్లతో ఉన్న హ్యాండిల్స్తో ఫ్లాట్ఫామ్ని గాలిలో ఉంచి పట్టుకోవాలి. టాస్క్ ముగిసేవరకు ఏ జట్టు.. ఫ్లాట్ఫామ్ని గాలిలో ఉంచగలుగుతారో వాళ్లు గెలిచినట్లు. అయితే ఈ గేమ్లోనూ కల్యాణ్-తనూజ ఓడిపోయారు. లెక్క ప్రకారం పవన్-రీతూతో పాటు వీళ్లు చాలాసేపు ఉన్నారు. కానీ కల్యాణ్.. మాట్లాడి తనూజని డిస్టర్బ్ చేశాడు. దీంతో ఓడిపోయారు. తర్వాత తనూజ.. కల్యాణ్పై గట్టిగా అరిచేసింది. కళ్యాణ్ ఫోకస్ ఉండాల్సింది దానిపైన కద కళ్యాణ్.. నా ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది అని గట్టిగానే ఇచ్చేసింది. లీడర్ బోర్డ్లో పవన్-రీతూ (190 పాయింట్స్), సంజన-ఫ్లోరా (180), దివ్య-భరణి (180), తనూజ-కల్యాణ్ (110), శ్రీజ-సుమన్ శెట్టి(90) వరస స్థానాల్లో నిలిచారు. ఇక డేంజర్ జోన్లో కల్యాణ్, శ్రీజ, సుమన్ నిలిచారు. అందరూ కలిసి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్ అని డిసైడ్ చేశారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్బాస్ సంజనా గల్రానీ ఆవేదన!
ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ సీజన్-9 నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో ఏకంగా బిగ్బాస్ తెలుగు సీజన్-9కి తొలి కెప్టెన్గా నిలిచింది. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా రాణిస్తోంది. ఈ సందర్భంగా సంజనా గల్రానీకి సంబంధించిన ఓ వీడియోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తన జర్నీతో పాటు డ్రగ్స్ కేసు గురించి కూడా సంజనా మాట్లాడింది. తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఎమోషనలైంది.ఈ వీడియోలో సంజనా మాట్లాడుతూ.. 'హాయ్ నా పేరు అర్చన.. నేను మీ బుజ్జిగాడు సంజనా అంటూ పరిచయం చేసుకుంది. ఏడో తరగతిలోనే ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరి జగన్నాధ్ నాకు బుజ్జిగాడులో అవకాశం ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నా. ఒకరోజు సడన్గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? ఆ రోజు డిసైడ్ అయిపోయా. ఆ రోజు గురించి తలుచుకుంటేనే చాలా బాధేస్తోంది. ఒక్కొక్కరు వారికి నచ్చినట్లు రాసుకున్నారుని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ క్లీన్ చీట్ ఎవరికీ కనిపించలేదు. చూసేవారికి బిగ్బాస్ కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కావొచ్చు. కానీ నా లైఫ్లో ఈ బిగ్బాస్ షో నాకు పెద్ద ఛాన్స్. మీ మనసుల్లో నాకు గురించి ఎంత తప్పుగా అనుకున్నారో.. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. ఈ షో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. కానీ మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్బాస్కు వచ్చాను" అంటూ ఫుల్ ఎమోషనలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. 1989లో అక్టోబర్ 10న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. టాలీవుడ్ చిత్రపరిశ్రమతోనే తొలి ఛాన్స్ అందుకున్నారు. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో ఒరు కధల్ సేవిర్లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.కాగా.. శాండిల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజనా గల్రానీ పేరు తైరపైకి వచ్చింది. విచారణకు పిలిచిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆమెను జైల్లోనే ఉంచారు.Cleared the blame, now she’s in the game, #SanjanaGalrani is here to claim the fame ❤️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/ZjX4leeZAN— Starmaa (@StarMaa) October 7, 2025 -
రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి
బిగ్బాస్ షోలో ప్రస్తుతం ఐదోవారం నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. మరోవైపు డేంజర్ జోన్ వల్ల రీతూ చావు తెలివితేటలు చూపించింది. దీంతో బిగ్బాస్ కోపం వచ్చింది. రీతూ చేసిన పనివల్ల మిగతా వాళ్లందరూ బలి అయిపోయారు. ఇంతకీ హౌస్లో 30వ రోజు ఏమేం జరిగింది? ఈసారి నామినేషన్లలో ఉన్నది ఎవరు?మంగళవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్ట్ ఎంట్రీల గురించి చెప్పిన బిగ్బాస్.. కెప్టెన్ రాము, ఇమ్మాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా డేంజర్లో ఉన్నారు. అయితే ఈ వారం డేంజర్లో ఉన్నవాళ్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్లో ఉన్నవాళ్లని కుదిపేస్తుంది. అదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్లు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్ని ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెప్పాడు. అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.ఇకనుంచి హౌసులో ఓనర్స్, టెనెంట్స్ ఉండరని చెప్పిన బిగ్బాస్.. ఇప్పటినుంచి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మంచి ప్రదర్శన చేసి ఎవరైతే పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్లు సేవ్ అవుతారు. అయితే ఈ పోటీల కోసం జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో పవన్-రీతూ, సంజన-ఫ్లోరా, భరణి-దివ్య, శ్రీజ-సుమన్, కల్యాణ్-తనూజ జట్టుకట్టారు. తొలుత 'పట్టువదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇసుకని తీసుకొచ్చి నచ్చని జట్టు పట్టుకున్న ఓ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇసుక నిండితే బాక్స్ కిందకు తగులుతుంది. అలా తగలకుండా ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్లు గెలిచినట్లు అని బిగ్బాస్ చెప్పాడు. ఈ గేమ్లో పవన్-రీతూ విజయం సాధించారు.అయితే ఇసుక టాస్క్లో భరణికి జంటగా ఉన్న దివ్య.. ఇసుకని తీసుకొచ్చి తనూజ టీమ్ బకెట్లో వేసింది. గేమ్ అయిపోయిన తర్వాత తనూజ హర్ట్ అయిపోయింది. దీంతో భరణి వచ్చి ఆమెని సముదాయించేందుకు తెగ ప్రయత్నించాడు. కానీ వినలేదు. దీంతో ఆమె చెబుతున్నంతసేపు భరణి సైలెంట్గానే ఉండిపోయాడు. రెండో పోటీగా బెలూన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలోని ఓ కంటెస్టెంట్ ఓ బాక్స్లో సూదులతో ఉన్న మాస్క్ పెట్టుకుని తల పెట్టాల్స ఉంటుంది. మరో కంటెస్టెంట్ బెలూన్ని లోపల వేయాలి. బాక్స్ లోపల ఉన్న సభ్యులు ఆ బెలూన్స్ తమ మాస్క్కి ఉన్న నీడిల్స్కి తగిలి పగలకుండా ఉండేలా పైకి ఊదుతూ గాల్లో ఉంచాలి అదే సమయంలో ఆ బెలూన్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెప్పాడు.అయితే ఈ పోటీలో రీతూ చావు తెలివితేటలు చూపించింది. పవన్ వెనక బెలూన్ ఉంచేసింది. ఈమెని శ్రీజ, తనూజ టీమ్స్ కూడా అదే ఫాలో అయిపోయారు. దీంతో బిగ్బాస్కి కోపం వచ్చింది. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య తేడా బిగ్బాస్కి చాలా బాగా తెలుసు. మీరు చదివిన స్కూల్కి చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేను. కానీ అత్యంత పేలవమైన ఆట ఇది. ఆట స్ఫూర్తికే విరుద్ధం అని ఏకిపారేశాడు. ఈ క్రమంలో ఈ గేమ్లో ఆడిన సంజన-ఫ్లోరాకి తప్పితే మిగిలిన వాళ్లందరూ ఉన్న పాయింట్లలో సగం కట్ చేసి పడేశాడు. దీంతో గేమ్ ఆడినా సరే పాయింట్ల్ రాలేదే అని సంజన ఏడ్చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్, దివ్య, రీతూ డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. -
ఎలిమినేషన్ తర్వాత ఇంత డేరింగ్ గా నిజాలు బయటపెట్టిన కంటెస్టెంట్ ఇతనే..
-
విలన్గా భరణి.. తనూజ కోసం శ్రీజ బలి
బిగ్బాస్ తెలుగు సీజన్ 5వ వారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తి అయింది. అయితే, కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్లోకి బిగ్బాస్ తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ వారికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడంతో అందరూ గందరగోళంలో పడ్డారు. ఫైనల్గా ఇమ్మాన్యుయేల్ (Emmanuel) టాస్క్లో గెలిచి ఇమ్యూనిటీని సాధించుకున్నాడు.బిగ్బాస్ రణరంగంలో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిపించారు. ఇమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ బెడ్పై ఎక్కువ సమయం ఉంటారో వారు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారని చెప్తారు. ఈ గేమ్లో బలమైన కంటెస్టెంట్స్ డీమాన్, కళ్యాణ్, ఇమ్మూ, భరణి ఒక టీమ్గా అయిపోయి.. వారి ప్రయారటీ ప్రకారం వరుసుగా బెడ్పై నుంచి కిందకు తోసేస్తారు. మొదటి రౌండ్లో సంజన, తర్వాతి రౌండ్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత దివ్య,డీమాన్, శ్రీజ ఆట నుంచి విరమిస్తారు.శ్రీజను బలంగా నెట్టేసిన భరణిచివరి రౌండ్లో భరణి, శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరిని మాత్రమే కిందకు తోసేయాలి. అయితే, గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చిందని తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది. ఆ మాటలకు కళ్యాణ్తో పాటు ఇమ్మూ కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, భరణి, తనూజకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇలా వారందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. ఈ క్రమంలో శ్రీజకి గాయం కూడా అయింది. దీంతో శ్రీజను ఓదార్చేందుకు భరణి వెళ్తాడు. ఇలా మంచితనంగా నటించకండి అన్నా అంటూ భరణిపై శ్రీజ పైర్ అవుతుంది. చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా తోసేయడం ఏంటి అంటూ సీరియస్ అయింది. మంచోడిలా నటించకండి. నీలా మంచిదానిలా నటించడం నాకు రాదన్నా.. అంటూ బాధ పడుతుంది. రేలంగి మావయ్యలా నటిస్తున్నావంటూ భరణిని శ్రీజ దుమ్ములేపింది. ఇక్కడ గెలిచిన భరణి, తనూజ, కళ్యాణ్, ఇమ్మూలకు గాలి- నిప్పు- నీరు టాస్క్ను బిగ్బాస ఇస్తాడు. ఇందులో విజేతగా ఇమ్మాన్యుయేల్ నిలుస్తాడు.కన్నీళ్లు పెట్టుకున్న దివ్యఈ టాస్క్లో అమ్మాయిల నుంచి ఎక్కువగా పోరాడింది దివ్య మాత్రమే... నమ్మిన భరణి కూడా తనకు సాయం చేయకపోవడంతో ఆమె బాధ పడింది. భరిణి ఎక్కువగా తనూజకు మాత్రమే అండగా నిలబడటం దివ్య సహించలేకపోయింది. బెడ్ మీద నుంచి తనను తోసేస్తున్నా కూడా భరణి అడ్డు పడలేదు. ఆపై అమ్మాయిలు ఎవరూ కూడా ఆమె కోసం నిలబడలేదు. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.విలన్గా భరణి..బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో చివర రౌండ్ జరుగుతున్న సమయంలో మాటల్లో పెట్టి శ్రీజను భరణి తోసేశారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. గతంలో తనూజకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమె కిందకు పంపితే బాగుంటుందని శ్రీజ చెబుతుంది. అందరూ శ్రీజ కరెక్ట్ అంటున్న సమయంలో తనూజ కోసం భరణి చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ టాస్క్లో దివ్య తర్వాత ఎక్కువగా గేమ్ ఆడింది కూడా శ్రీజానే.. కానీ, తనూజ మాత్రం కనీసం ఆటలో భాగం కాకుండా అలా ఉండిపోయింది. ఆమెను సేవ్ చేసి శ్రీజను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. గతంలో సుమన్కు ఇమ్యూనిటీ వచ్చిందనే కదా కిందకు తోసేశారు.. మరి తనూజాను ఎందుకు తోయలేదంటూ భరణిని ప్రశ్నిస్తుంది. ఇలా బుల్లెట్ లాంటి ప్రశ్నలతో శ్రీజ దుమ్ములేపుతుంది. రేలంగి మామయ్య రూపంలో ఉన్న విలన్ భరణి అంటూ విమర్శలు వస్తున్నాయి.


