International
-
ఫైలట్ పంపిన సందేశంతో.. ఆశ్చర్యపోయిన ట్రంప్
ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా ఫైలట్ను ఆ దేశ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న తర్వాత ఆయన పంపిన తొలి సందేశం అమెరికా అధికారులను ఆశ్చర్యానికి గురి చేసిందని డొనాల్డ్ ట్రంప్ మీడియాతో తెలిపారు. ఈ అంశమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. "ఆ అధికారి పంపిన సందేశం వినడానికి ఒక ముస్లిం వ్యక్తి చెప్పినట్లుగా ఉంది. అందుకే మొదట అది ఇరాన్ పన్నిన కుట్ర ఏమో అని అనుమానించాను. కానీ తర్వాత ఆ అధికారి చాలా దైవచింతన గల వ్యక్తి అని తెలియడంతో ఆ సందేశం నిజమేనని నిర్ధారించుకున్నాను" అని అన్నారు.ఆ సందేశం ఏంటంటే? ఇరాన్ పర్వతాల్లో చిక్కుకున్న ఆ అధికారి తన వద్ద ఉన్న రేడియో ద్వారా పంపిన మొదటి సందేశం 'Power be to God,'" మహిమంతా దేవుడిదే అనే సందేశం తన వద్ద ఉన్న ఒక హ్యాండ్గన్ ద్వారా పంపారు. అనంతరం ట్రాకింగ్ బీకాన్ మరియు కమ్యూనికేషన్ పరికరంతో ఇరాన్ దళాలకు దొరక్కుండా పర్వతాల్లో దాక్కున్నారు. ఒక దశలో శత్రువుల నుండి తప్పించుకోవడానికి 7,000 అడుగుల ఎత్తున్న పర్వత శ్రేణిని కూడా ఆయన ఎక్కినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆపరేషన్ ప్రపంచ రక్షణ వ్యవస్థలో అమెరికాకున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.అమెరికా నిఘా సంస్థ CIA, తనకున్న ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన దాక్కున్న ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించింది. దాదాపు 48 గంటల పాటు ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శనివారం రాత్రి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగి, శత్రువుల మధ్య ఉన్న ఆ అధికారిని సురక్షితంగా రక్షించి వెనక్కి తీసుకువచ్చారు. -
యుద్ధం టెన్షన్.. ఇరాన్, గల్ఫ్తో భారత్ చర్చలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు.చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ప్ దేశాలలో దౌత్య చర్చలు జరిపారు.ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో పాటు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సంక్షోభం వల్ల భారత్పై పడే ప్రభావం గురించి జైశంకర్ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.మరోవైపు ట్రంప్ 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతోనూ సమకాలిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భారత్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా జైశంకర్ దౌత్య పరంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. -
రికార్డు సృష్టించిన ఇరాన్.. 37 రోజులుగా ఆ సేవలు బంద్
ఇరాన్ ప్రస్తుతం యుద్ధంతో అట్టుడుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో విరుచుకపడడంతో ఆ దేశంలోని మౌళిక సదుపాయాలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం ఇంటర్నెట్ నిలిపివేసిన దేశంగా రికార్డు సాధించింది.ఇరాన్ దేశవ్యాప్తంగా విధిస్తున్న ఇంటర్నెట్ షట్డౌన్ ఇప్పుడు 37వ రోజుకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత సుదీర్ఘమైన జాతీయ స్థాయి ఇంటర్నెట్ బ్లాకౌట్గా నివేదికలు పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైన రోజు ఫిబ్రవరి 28నుండి ప్రారంభమైన ఇంటర్నెట్ షట్డౌన్ ఇప్పటికి 864 గంటలకు పైగా కొనసాగుతోంది.అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్షన్ను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే 'వైట్లిస్ట్' విధానం ద్వారా యాక్సెస్ ఇస్తున్నట్లు సమాచారంఅయితే దీనివల్ల యుద్ధ సమయంలో ప్రజలు తమ ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకోలేకపోతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొన్ని సంస్థలు చెబుతున్నప్పటికీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాాగా ఇప్పటి వరకూ మయన్మార్, సుడాన్, ఉక్రెయిన్, గాజా వంటి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తగ్గించారు గాని ఇంత పెద్ద మెుత్తంలో ప్రభుత్వమే దానిపై బ్యాన్ విధించలేదు. -
పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర .. అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి..
కొలంబో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు మరో బిగ్షాక్ తగిలింది. గ్లోబల్ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరల్ని పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్పీజీ గ్యాస్ సంస్థ లిట్రో గ్యాస్ లంక ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి (ఏప్రిల్5)నుంచి అమల్లోకి రానున్నాయి. లిట్రో గ్యాస్ తెలిపిన వివరాల మేరకు.. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం కొలంబోలో కొత్త ధరలు ఇలా ఉన్నాయి 12.5 కిలోల సిలిండర్: రూ. 775 పెరిగి రూ. 4,7655 కిలోల సిలిండర్: రూ. 308 పెరిగి రూ. 1,9102.3 కిలోల సిలిండర్: రూ.140 పెరిగి రూ.840వినియోగదారులపై ప్రభావంఈ పెంపు వల్ల శ్రీలంక ప్రజలకు జీవన వ్యయాలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం (భారత్లో ఉగాది..శ్రీలంకలో పుత్తాండు) సీజన్లో గ్యాస్ ధరలు పెరగడం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అయితే లిట్రో గ్యాస్ లంక వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఉద్యోగులందరికీ వారానికి 2 రోజుల చొప్పున సెలవులు
కాఠ్మాండు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతుండడంతో పలు దేశాల్లో అనేక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం నేపాల్పై బాగా పడుతోంది. సాధారణంగా ఆదివారం సెలవు ఉంటుంది. అయితే, చమురు సంక్షోభం వల్ల నేపాల్ వారానికి రెండు రోజులు సెలవులను అమలు చేయాలని నేపాల్ ప్రభుత్వం ఆదివారం (ఏప్రిల్ 5) నిర్ణయించింది.ఈ నిర్ణయాన్ని కాఠ్మాండులో ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్ 6 నుంచి కొత్త వీకెండ్ షెడ్యూల్ను పాటించనున్నాయని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. పెట్రోలియం సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.పోఖరేల్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలియం సరఫరా అంతరాయాల కారణంగా ఆదివారాల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి.పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన చట్టపరమైన రూపకల్పనను సిద్ధం చేయాలని కూడా నేపాల్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇంధన సరఫరా అనిశ్చితి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోఖరేల్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చడం ద్వారా ఇంధన కొరతను ఎదుర్కోవచ్చని, పర్యావరణహిత రవాణా దిశగా మార్పునకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇరాన్, ఇజ్రాయెల్అ-మెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ పెట్రోలియం సరఫరాను దెబ్బతీసింది. దీని వల్ల నేపాల్లో కొరతతో పాటు ధరలు భారీగా పెరిగాయి.నేపాల్లో పెట్రోలియం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రాష్ట్ర సంస్థ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తాజా సవరణ ప్రకారం.. కాఠ్మాండు లోయలో పెట్రోల్ ధర లీటరుకు ఎన్పీఆర్ 202కి చేరింది. డీజిల్, కిరోసిన్ ధరలు లీటరుకు ఎన్పీఆర్ ఎన్పీఆర్182కి పెరిగింది.గత వారం సంస్థ బోర్డు సమావేశంలో లీటరుకు ఎన్పీఆర్ 15 పెంపునకు ఆమోదించారు. 18 రోజుల్లో మూడోసారి ధరలు పెంచారు. మార్చి 15, మార్చి 25న కూడా ధరలను పెంచారు. -
ముగియనున్న 48 గంటల డెడ్లైన్.. ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ట్రే యింగ్స్ట్కు ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి. లేదంటే అన్నింటిని పేల్చేస్తాం. ఇరాన్ చమురును స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అంతేకాదు.. హర్మూజ్ జలసంధించిన తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ ప్రతినిధులకు పరిమిత క్షమాభిక్ష ప్రసాదించినట్లు తెలిపారు. అయితే, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. చర్చలు విఫలమైతే, కీలక ఆస్తులను ధ్వంసం చేయడం, ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాము ఇరాన్ నిరసనకారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆయుధాలు పంపించాం. ఆ ఆయుధాలు నిజంగా నిరసనకారుల చేతికి చేరలేదని, మధ్యలో కుర్దిష్ మార్గాల ద్వారా వెళ్లి.. కుర్దిష్ సమూహాల దగ్గరే ఉండిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం గడువు ముగియనున్న తరుణంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ తోసిపుచ్చింది . ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ జనరల్ అలీయాబాది, ట్రంప్ బెదిరింపును నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన, అస్థిరమైన, తెలివితక్కువ చర్య అని అన్నారు.ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. శత్రుత్వం పెరిగితే ఇరాన్లో మీకు నరకం కనబడుతోంది. ఇరాన్ను ఓడించాలన్న మీ భ్రమ ఊబిగా మారి మీరు అందులో కూరుకుపోతారు’అని రెచ్చగొట్టారు. మరి రేపటితో ముగియనున్న డెడ్ లైన్ అనంతరం, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. కాగా, హోర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది.ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే, అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అందుకే అమెరికా దీనిని ప్రపంచ ఆర్థిక భద్రతకు ముప్పుగా చూస్తోంది. -
పాక్ మధ్యవర్తిత్వం? ఇరాన్ ఏమందంటే?
పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు."ఈ విషయంలో పాక్కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు."ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు."దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు. -
ఎప్స్టిన్ ఫైల్స్లో అనిల్ అంబానీ.. లైంగిక నేరాల్లో ప్రమేయం ఉందా?
వాష్టింగన్: అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ పత్రాల్లో భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా ప్రస్తావనకు రావడం ఆసక్తి కలిగించింది. దీంతో ఎప్స్టీన్ లైంగిక నేరాల్లో అంబానీ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫైల్స్ను పరిశీలిస్తే, అంబానీకి ఎప్స్టీన్తో ఉన్నది వ్యాపార సంబంధాలే తప్ప లైంగిక సంబంధాలు లేవని స్పష్టమైంది.ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ పేరు ప్రస్తావన రావడం ఆయన వ్యాపార సమస్యల సమయంలో ఎప్స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం, పరిచయాలకే పరిమితమైంది. లైంగిక నేరాల విషయంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టంగా తేలింది. అంటే, ఎప్స్టీన్ వ్యవహారంలో అంబానీ పేరు వినిపించడం ఆయన వ్యాపార సంబంధాల కోణంలో మాత్రమేనని, లైంగిక నేరాలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ పత్రాలు నిర్ధారించాయి.అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ ప్రకారం.. అనిల్ అంబానీ–జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య 2017 నుండి 2019 వరకు సంభాషణలు జరిగాయి. ఈ చర్చలు ప్రధానంగా అమెరికా–భారత్ సంబంధాలు, ట్రంప్ ప్రభుత్వ విధానాలు, అలాగే అంబానీ ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలపై స్నేహపూర్వక సలహాల చుట్టూ తిరిగాయి. అంబానీతో పరిచయం పెంచుకోవడానికి, తాను వైట్ హౌస్లో లోపలి వ్యక్తి అని చూపించుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి.ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా వ్యూహంలో భారత్ స్థానం ఏమిటో తెలుసుకోవాలని అంబానీ ఎప్స్టీన్ను సంప్రదించగా.. ‘వైట్ హౌస్లోని అంతర్గత సమాచారం అందిస్తాను’ అంటూ ఎప్స్టీన్ స్పందించాడు. అలాగే ట్రంప్ నియామకాలపై ముందుగానే సమాచారం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు, 2017లో అంబానీ, డేవిడ్ పేట్రేయస్ను భారత్కు అమెరికా రాయబారిగా నియమిస్తారా అని అడిగితే, ఎప్స్టీన్ లేదని అని చెప్పాడు. అన్నట్లుగా ఆ పదవి కెన్నెత్ జస్టర్కు దక్కింది.తనకి ట్రంప్ సన్నిహితులు స్టీఫెన్ బానన్, థామస్ బారాక్లను పరిచయం చేయాలని ఎప్స్టీన్ సూచించాడు. వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ‘మానసికంగా బలంగా ఉండాలి’ అని సలహా ఇచ్చాడు. నీతో పరిచయం .. డబ్బు కోసం కాదు, స్నేహితుడిగా మాత్రమే’అని పలుమార్లు చెప్పాడు. 2019 ఏప్రిల్లో అంబానీ ‘ట్రాన్సాక్షన్ పూర్తయింది.. కాఫీకి వస్తాను’ అని మెయిల్ పంపించారు. మే 23న న్యూయార్క్లోని ఎప్స్టీన్ ఇంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా వారు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్లలో మాట్లాడుకున్నారు. అంబానీ ‘ఆర్మనీఏ’ అనే హ్యాండిల్తో కనెక్ట్ అయ్యారు.ఎప్స్టీన్ అరెస్టుకు మూడు రోజుల ముందు వరకు ఈ సంభాషణలు కొనసాగాయి. ముఖ్యంగా, అనిల్ అంబానీపై ఎటువంటి లైంగిక దుర్వినియోగ ఆరోపణలు లేవని న్యూయార్క్ టైమ్స్ స్పష్టంచేసింది. ఈ సంబంధం వ్యాపార సమస్యల సమయంలో ఎప్స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం అనే కోణంలో మాత్రమే నిలిచింది. -
ఇక వస్తున్నాం.. నరకం చూపిస్తాం..: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు ఆయన ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో తన ట్రూత్ సోషల్ మీడియా ట్రూత్లో ఓ ప్రకటన చేశారు.‘ఇరాన్లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయి. అలాంటి డే మరొకటి ఉండదు.. ఆ స్ట్రైట్ (హార్మూజ్ జలసంధి) తెరవండి, పిచ్చి దుర్మార్గుల్లారా.. లేకపోతే మీరు నరకంలో జీవిస్తారు.. చూడండి..’ అని అన్నారు. హార్మూజ్ జలసంధి తెరవాలని ట్రంప్ చాలా రోజుల నుంచి ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ జలమార్గం ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోవడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏ మాత్రం బెదరడం లేదు. హార్మూజ్ జలసంధి తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిపై రాకపోకలు సులభతరం చేయడం కోసం ఒమన్, ఇరాన్ ఇవాళ (ఏప్రిల్ 5) చర్చలు నిర్వహించాయని ఒమన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది."ఒమన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు సమావేశం నిర్వహించాయి, ఇరుపక్షాల నిపుణులు హాజరయ్యారు. హార్మూజ్ ద్వారా సజావుగా రాకపోకలు జరిగేలా అవకాశాలను సృష్టించడంపై చర్చించారు" అని ఆ వార్తా సంస్థ ఎక్స్లో పేర్కొంది. ఇరుపక్షాల నిపుణులు దీనిపై అనేక ప్రతిపాదనలు ముందుకు తెచ్చారని పేర్కొంది. -
నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..!
అత్యంత అరుదైన వింత కేసు. నొప్పులు పడుతున్న టైంలో ఎవ్వరైన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భావోద్వేగభరితమైన ఆ సమయంలో విచారణకు హాజరుకావడం విచిత్రం అనుకుంటే..అక్కడ ఆమె వాదన న్యాయమూర్తిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎవ్వరిని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండ కట్టుదిట్టం చేసి అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. చివరికి ఆ మహిళ..ఇప్పటికీ కోర్టుని, వైద్యులపై ఆరోపణలు చేస్తూ తిట్టిపోస్తూనే ఉంది. అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన చెరీస్ డోయ్లిఆస్ప్రతి బెడ్పై నొప్పులు పడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో డెలివరీ అనగా..బలవంతంగా కోర్టు ముందుకు హాజరుపరిచారు వైద్యులు. అంతేగాదు ఆమె అనుమతి లేకుండానే ఇదంతా జరగడం విశేషం. వర్చువల్ కోర్టు విచారణకు ప్రసవ వేదనతో ఉన్న గర్భణీని బలవంతంగా ప్రవేశపెట్టారు. ఈ దురదృష్టకర ఘటన 2024లో చోటుచేసుకుంది. ప్రసవ వేదన మొదలైన వెంటనే రాత్రికి రాత్రే ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ హాస్పిటల్కు చేరుకుంది.అయితే ఆమె 12 గంటల పాటు ప్రసవ నొప్పులు అనుభవిస్తోంది. ఆ సమయంలోనే ఆమెను వర్చువల్ కోర్టు ముందు హాజరుపరిచారు వైద్యులు. తను వర్చువల్ కోర్టు ముందున్న విషయం తెలుసుకుని ఆ నిండు గర్భిణీ కంగుతింది. డోయ్యి వృత్తిపరంగా ప్రసవ సహాయకురాలైన నర్సు. అయితే ఆమె నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు కచ్చితంగా సీసెక్షన్ చేయాల్సిన ఎమర్జెన్సీ. కానీ అందుకు ససేమిరా అంటోంది డోయ్లి. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిగా గతంలో జరిగిన సీ సెక్షన్ల నుంచి కోలుకోవడం కష్టంగా ఉందని, దానివల్ల రక్తస్రావంతో అనేక సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది. ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉన్నా..మొండిగా ప్రవర్తించడంతో అక్కడి ప్రభుత్వ అత్యవసర పిటిషన్ దాఖలు చేసి కోర్టు ముందు హాజరపర్చింది. ఆ విషయాన్నే పేషెంట్ డోయ్లికి వివరించారు కూడా. అందువల్లే డోయ్లి నొప్పులు పడుతూనే కోర్టులో విచారణకు హాజరైంది. అయితే వైద్యులు ఆమె గనుక నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే..గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీ సెక్షన్ చేయక తప్పదని వాదిస్తుండటం గమనార్హం. అంతేగాదు డోయ్లి వైద్యులు గనుక సాధారణ ప్రసవం చేయలేకపోతే గనుక మరొక ఆస్పత్రికి తరలించమని కూడా అభ్యర్థించింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..ఆమెకు తక్షణమే ఆపరేషన్ చేయమని ఆదేశించలేదు గానీ, విపత్కర పరిస్థితి ఎదురైతే ఆమె సమ్మతితో పనిలేకుండానే ఆస్పత్రి శస్త్ర చికిత్స చేయవచ్చని సూచించింది. అయితే రాత్రికి ఆమె బిడ్డ పల్స్ రేట్ పడిపోవడంతో హుటాహుటినా..డోయ్లికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయక తప్పలేదు వైద్యులకు.ఆ తర్వాత ఆమెను మళ్లా కోర్టు ముందు హాజరుపర్చారు. అప్పుడు కూడా, వైద్యులపై మండిపడుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ దాన్ని ఆమె అవమానంగా భావిస్తూ..కోర్టుని, సదరు ఆస్పత్రి వైద్యులను తిట్టిపోస్తుండటం గమనార్హం. View this post on Instagram A post shared by Joel Bervell, MD (@joelbervell) (చదవండి: రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..) -
టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)రంగంలో దిగ్గజ కంపెనీలు ఇప్పుడు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా అనూహ్య నిర్ణయాలతో దూసుకుపోతున్నాయి. గూగుల్ తన సరికొత్త ఓపెన్ సోర్స్ మోడల్ ‘జెమ్మా 4’ను ఉచితంగా అందుబాటులోకి తేగా, తన ఇమేజ్ను మరింతగా పెంచుకునేందుకు ఓపెన్ ఏఐ ఏకంగా ఓ ప్రముఖ మీడియా టాక్ షోను కొనుగోలు చేసింది. మరోవైపు మరో ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ కనీవినీ ఎరుగని భారీ డీల్తో ఏకంగా వైద్య రంగంలోకి అడుగుపెట్టింది. టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ మూడు ప్రధాన పరిణామాల వివరాలలోకి వెళితే..ల్యాప్టాప్లు, ఫోన్లలో పనిచేసే గూగుల్ ‘జెమ్మా 4’ఏఐ సాంకేతికత అనేది డెవలపర్లందరికీ ఉచితంగా, పబ్లిక్ వాడకానికి అనువుగా ఉండాలనే లక్ష్యంతో గూగుల్ అపాచీ 2.0 లైసెన్స్తో ‘జెమ్మా 4’ మోడల్స్ను విడుదల చేసింది. కోడింగ్ రాయడం, సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించడంతో పాటు రియల్ వరల్డ్ టాస్క్లను ఇది సులభంగా చేయగలదు. మొత్తం నాలుగు వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ మోడల్స్ చాలా తేలికైనవి. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే నేరుగా మన స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లలో కూడా సులభంగా రన్ అయ్యేలా వీటిని రూపొందించడం దీని ప్రధాన ఆకర్షణ.మీడియా బిజినెస్లోకి ఓపెన్ ఏఐ ఎంట్రీచాట్జీపీటీ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’తన రూటు మార్చింది. సిలికాన్ వ్యాలీలో విశేష ఆదరణ పొందిన టెక్ టాక్ షో ‘ఐబీపీఎన్’ను సొంతం చేసుకుని మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. జాన్ కూగన్, జోర్డి హేస్ హోస్ట్ చేసే ఈ షో ద్వారా.. చాట్జీపీటీ, అలాగే సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్పై పబ్లిక్లో మరింత సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. కొనుగోలు డీల్ విలువను గోప్యంగా ఉంచినప్పటికీ, ఆ షోకి పూర్తి సంపాదకీయ స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏసీఐ)గురించి ప్రజలతో మరింత మెరుగ్గా కనెక్ట్ అయ్యేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ స్ట్రాటజీ చీఫ్ ఫిడ్జీ సిమో తెలిపారు.ఆంత్రోపిక్ మరో సంచలనంఓపెన్ ఏఐకి ప్రధాన పోటీదారు అయిన ‘ఆంత్రోపిక్’ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా 400 బిలియన్ డాలర్లు వెచ్చించి, బయోటెక్ ఏఐ స్టార్టప్ ‘కోఎఫిషియంట్ బయో’ను కొనుగోలు చేసింది. ఈ రికార్డ్ డీల్తో ఆంత్రోపిక్ హెల్త్కేర్ రంగంలోకి అధికారికంగా ప్రవేశించింది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ టూల్స్ తయారుచేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆంత్రోపిక్ ఈ అడుగు వేసింది. కొత్త మందుల పరిశోధన (డ్రగ్ రీసెర్చ్), ఆవిష్కరణలను వేగవంతం చేయడం, అలాగే రెగ్యులేటరీ స్ట్రాటజీలను అభివృద్ధి చేయడంపై కోఎఫిషియంట్ బయో ప్రధానంగా దృష్టి సారించనుంది.ఇది కూడా చదవండి: Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా? -
ట్రంప్నకు మరో షాకిచ్చిన ఇరాన్?
టెహ్రాన్: ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. అయితే, ఈ యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసి కూల్చివేస్తోంది. ఇందులో భాగంగానే మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.ఇరాన్ ఆదివారం ఓ ప్రకటనలో మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. అమెరికా వైమానిక దళానికి చెందిన C-130 అనే యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇస్ఫహాన్ దక్షిణ భాగంలో కూల్చివేసినట్టు తెలిపింది. అయితే, F-15E పైలట్ను స్వదేశానికి రప్పించేందుకు జరుగుతున్న గాలింపు, సహాయక చర్యల మధ్య, ఇస్ఫహాన్ గగనతలంపై మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.ఇక, అంతకుముందు... ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం ‘F-15E స్ట్రైక్ ఈగల్’ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన రెండో పైలట్ను తాజాగా అమెరికా దళాలు గుర్తించి.. రక్షించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.🇺🇸🇮🇷 WATCH: A U.S. C-130 Hercules is reportedly flying at very low altitude over Iran, deploying flares.▪️ U.S. forces are likely searching for pilots from a downed F-15E fighter jet.See the latest updates with us: @NSTRIKE1231 pic.twitter.com/w8x0TEw13b— NSTRIKE (@NSTRIKE1231) April 3, 2026ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే.. మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్ను 24 గంటలూ గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. పైలట్ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని.. తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. -
Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఏకంగా 30కి పైగా విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ సైన్స్ మంత్రి హొస్సేన్ సిమై సర్రాఫ్ స్వయంగా వెల్లడించారు. విద్యా, వైద్య కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.తాజాగా ఉత్తర టెహ్రాన్లోని ‘షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ’తో పాటు పశ్చిమాన ఉన్న ‘మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం’పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో క్యాంపస్ భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 1960లో స్థాపించిన ఈ వర్సిటీ వేలాది మంది విద్యార్థులకు, పరిశోధకులకు ఓ కీలక కేంద్రం. దాడితో దెబ్బతిన్న ప్రాంతాన్ని శనివారం మంత్రి సర్రాఫ్ పరిశీలించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30కి పైగా వర్సిటీలపై దాడులు జరిగాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, ఆస్పత్రులు, పౌర ఆరోగ్య కేంద్రాలపై జరుగుతున్న దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘన చరిత్ర కలిగిన బయోమెడికల్ కేంద్రం ‘పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్’పై కూడా దాడులు జరిగాయని, భవనాలు భారీగా దెబ్బతినడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హూ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. దాడి జరిగినప్పటికీ పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో అత్యవసర సేవలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి నిరంతరాయంగానే కొనసాగుతున్నాయని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ ఆరోగ్య శాఖ, ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపాయి.ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా దేశాల్లోనూ ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయని, వాటికి తక్షణ సాయం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ భీకర పోరు కారణంగా ఆయా దేశాల్లో ఇప్పటికే 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలసబాట పట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: మ్యాగీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు! -
గల్లంతైన అమెరికన్ పైలట్ ఆచూకీ లభ్యం!
ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే.. ఆ విమానంలో గల్లంతైన మరో పైలెట్ ఆచూకీ లభ్యమైంది. దాదాపు 36 గంటల తర్వాత పైలట్ ఆచూకీ లభించింది. పైలెట్ను అమెరికా భద్రతా బలగాలు రక్షించాయి. గల్లంతైన ఎఫ్-15ఈ ఫైటర్ జెట్ రెండో పైలట్ సేఫ్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతమైందన్నారు.‘‘ప్రస్తుతం పైలట్ అమెరికా బలగాల అధీనంలోనే ఉన్నారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్ను గుర్తించారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే బహిర్గతం చేయలేదు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ను రక్షించడం చాలా గొప్ప విషయం. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టం. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగులేని ఆధిపత్యం సాధించింది’’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్ను కూడా అమెరికా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే వేయగా.. అందులోని ఓ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రంగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. గల్లంతైన రెండో పైలట్ కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగింది. ఆ పైలెట్ ఆచూకీ లభించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తెలిపారు.కాగా, హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘‘హార్మూజ్ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు. -
పాక్లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 459 పాకిస్తానీ రూపాయలకు చేరడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుతో రావల్పిండి, ఇస్లామాబాద్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పెట్రోల్ ధరల పెంపు ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా భారం పెరగడంతో కూరగాయలు, గోధుమ పిండి, మాంసం వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. ఆటో, రిక్షా ఛార్జీల మోతతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. స్కూల్ వ్యాన్ నిర్వాహకులు సైతం నెలవారీ ఫీజులను రూ.1,000 మేర పెంచేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రావల్పిండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఆర్సీసీఐ) అధ్యక్షుడు ఉస్మాన్ షౌకత్ మాట్లాడుతూ.. రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయని, దీనివల్ల ఆహార, నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదన్నారు. అంతర్జాతీయ మార్కెట్తో సంబంధం లేకుండా, ప్రభుత్వమే లీటర్పై రికార్డు స్థాయిలో రూ.160.61 పన్ను విధిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే అనవసర ఖర్చులు తగ్గించుకుని, పన్నుల భారం ప్రజలపై పడకుండా ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరపాలని ఆయన సూచించారు.మరోవైపు రాజకీయ పక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు సఫ్దార్ అలీ అబ్బాసీ, నహీద్ ఖాన్ ఈ పెంపును ‘ఆర్థిక అణచివేత’గా అభివర్ణించారు. సామాన్య, కార్మిక వర్గాల జీవన ప్రమాణాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు ఇస్లామాబాద్లో 30 రోజుల పాటు ప్రయాణికులందరికీ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: 345 మంది భారత మత్స్యకారులకు ఊరట -
ఇరాన్ యుద్ధం.. అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రతీ దాడులో ఇరాన్ సైతం విరుచుకుపడుతోంది. పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. -
ఇరాన్పై అసహనం.. మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్పై అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, అంతర్జాతీయంగా ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్పై విజయం సాధించాం. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు అమెరికా సైన్యం భారీ దాడిలో హతమయ్యారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన పోస్టుతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి వాతావరణంలో విమానాల శబ్దాలు, భారీ పేలుళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి. అయితే, వీడియో విషయంలో స్పష్టత లేకపోవడం, ఎక్కడ దాడి జరిగిందనే విషయాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. దాడి ఎలా జరిగింది? లక్ష్యాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, ఆ వీడియో నిజంగా ఇరాన్పై దాడికి సంబంధించదేనా? అనే విషయంపై అధికారిక ధ్రువీకరణ ఇంకా లేదు.ఏం జరగనుంది?మరోవైపు.. ఇరాన్పై ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్కు 48 గంటల గడువు ఇస్తూ, ఈలోగా ఒప్పందం చేసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిర్ణయం తీసుకోకపోతే భయంకర పరిణామాలు ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. Donald J. Trump Truth Social 04:04.26 04:37 PM ESTMany of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP pic.twitter.com/kn2fwYTjjG— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 4, 2026కాగా, గతంలో కూడా ట్రంప్ ఇరాన్కు 10 రోజుల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇంధన ప్లాంట్లపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా చెప్పారు. అయితే తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. చర్చలు సాగుతున్నాయన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా కఠిన హెచ్చరికల దిశగా అమెరికా మళ్లింది.ఇరాన్ కౌంటర్.. ఇదిలా ఉండగా.. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖండించింది. ఈ క్రమంలో ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ తరఫున జనరల్ అలీ అబ్దొల్లాహి అలియాబాదీ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యల్లో అసహనం కనిపిస్తోందన్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్ ఆత్రుతతో వ్యాఖ్యలు చేశారని కౌంటరిచ్చారు. కాగా, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి అంశం రెండు దేశాల మధ్య ప్రధాన వివాదంగా మారింది. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో దీనిపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. -
కువైట్లో ఉద్రిక్తత: ఆయిల్ కాంప్లెక్స్పై భీకర డ్రోన్ దాడి
కువైట్ సిటీ: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. కువైట్లోని అత్యంత కీలకమైన చమురు కేంద్రంపై ఆదివారం తెల్లవారుజామున అనూహ్య డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళితే..కువైట్ చమురు మంత్రిత్వ శాఖతో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కేపీఎస్) ప్రధాన కార్యాలయాలున్న షువైక్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కువైట్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంధన మౌలిక సదుపాయాలకు మరింత నష్టం వాటిల్లకుండా అడ్డుకున్నారు. శత్రువుల నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాలిలోనే దీటుగా అడ్డుకుంటున్నాయని కువైట్ మిలిటరీ ప్రకటించింది. ఈ దాడులను విజయవంతంగా ఛేదిస్తున్న క్రమంలోనే నగరమంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని సైన్యం ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది.ప్రభుత్వ భవనంపై ఇరాన్ దాడిశనివారం సాయంత్రం కూడా కువైట్ సిటీలోని ఒక ప్రభుత్వ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఫలితంగా భవనానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. ఈ వరుస దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడికి గురైన కాంప్లెక్స్ పరిధిలోని పలు మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఆదివారం ఇంటి నుంచే (రిమోట్ వర్క్) పనిచేయాలని ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా భవనాల్లోకి సందర్శకులకు అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే.. ఇరాన్ ఇప్పుడు కువైట్ సహా పలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. BREAKING: Kuwait’s Ministry of Oil building has been hit in an Iranian attack.Large fire reported at the ministry complex in Shuwaikh. The ministry runs Kuwait’s entire oil sector. Iran is now hitting the buildings that set Gulf oil policy, not just the facilities that produce… pic.twitter.com/OYtFUHb88Y— The Hormuz Letter (@HormuzLetter) April 4, 2026 -
సులేమానీ కోడలు, మనవరాలిని అరెస్టు చేసిన అమెరికా
వాషింగ్టన్: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) మాజీ చీఫ్ ఖాసీం సులేమానీ కోడలు, మనవరాలిని అమెరికా అదుపులోకి తీసుకుంది. ‘‘విదేశాంగ శాఖ శుక్రవారం వారి గ్రీన్ కార్డులను రద్దు చేసింది. ఆ వెంటనే వారిద్దరినీ లాస్ ఏంజెలీస్లో అరెస్టు చేశాం. వారు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదుపులో ఉన్నారు’’అని విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం వెల్లడించారు. ‘‘సులేమానీ కోడలు అఫ్సర్, మనవరాలు లాస్ ఏంజెలెస్లో చాలా ఏళ్లుగా విలాస జీవితం గడుపుతున్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమెరికా వ్యతిరేక దాడులను బాహాటంగా సమర్థిస్తూ వస్తున్నారు. అమెరికాను సైతాన్ దేశంగా అఫ్సర్ అభివరి్ణంచారు!’’అని ఎక్స్ పోస్టులో ఆయన దుయ్యబట్టారు. అమెరికా వ్యతిరేక ఉగ్రవాద దేశాలకు మద్దతిచ్చే వారికి తమ గడ్డను వేదిక కానివ్వబోమన్నారు. సులేమానీ 2020లో అమెరికా వైమానిక దాడుల్లో మరణించడం తెలిసిందే. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు అలీ లారిజానీ కూతురు ఫాతిమా అర్దెషిర్, ఆమె భర్త వీసాలను కూడా కొంతకాలం క్రితమే అమెరికా రద్దు చేసింది. గత డిసెంబర్ నుంచి పలువురు ఇరాన్ దౌత్యవేత్తలకు వీసాల జారీని కూడా నిరాకరిస్తూ వస్తోంది. -
కోల్కతానూ కొట్టగలం
లాహోర్: రెచ్చగొట్టేలా మాట్లాడటమే పనిగా పెట్టుకునే పాకిస్తాన్ మంత్రులు మరోసారి తమ వాచాలత్వాన్ని బయటపెట్టుకున్నారు. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖావాజా ఆసిఫ్ శనివారం ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. ‘‘తప్పుడు ఆపరేషన్ల పేరిట భారత్ మాపై దాడికి దిగితే ఈసారి మేం దాడుల పరిధికి కోల్కతా దాకా విస్తరిస్తాం. కోల్కతాపై దాడిచేయగలం’’అని అన్నారు. శనివారం లాహర్ సమీప సొంత పట్టణం సియాల్కోట్లో ఆసిఫ్ మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తప్పుడు కథనాలు అల్లుతుంది. ఇందుకోసం సొంత వాళ్లను లేదా అక్కడి నిర్బంధంలో ఉన్న పాకిస్తానీలను వాడుకుంటోంది. కొందరిని నేలపై పడుకోబెట్టి ‘వీళ్లందరూ ఉగ్రవాదులు. అందర్నీ అంతంచేశాం’అంటూ ఏవేవో కథనాలు వెలువరుస్తుంది’’అని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ఉద్రికత్తలను సాకుగా చూపి పొరుగుదేశం దాడులకు తెగబడితే తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని భారత రక్షణమంత్రి రాజ్నాథ్ పాక్నుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఆసిఫ్ మాట్లాడారు. -
ట్రంప్ అల్టిమేటం.. ఆయుధాలు సిద్దం చేస్తున్న ఇజ్రాయెల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ను తెరవకపోతే కనీవినీ ఎరుగని విధ్వంసం చూస్తారని ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ట్రంప్ 48 గంటల అల్టిమేటం తర్వాత ఇరాన్కు చెందిన ఇంధన మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల కోసం అమెరికా నుండి 'గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. "ఇరాన్కు ఒక ఒప్పందానికి రావడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్ మీద 'నరకం' కురుస్తుంది " అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇటు ఇరాన్ సైతం అమెరికా షరతులు అంగీకారంగా లేవు అని చర్చలను దాటవేసింది. -
రికార్డుకు చేరువలో ఆర్టిమిస్–2
వాషింగ్టన్: ఒక రోజంతా భూమి చుట్టూ తిరిగిన ఆర్టీమిస్–2 ప్రాజెక్ట్ వ్యోమగాములు ఇప్పుడు చంద్రుని దిశగా సగం దూరం ప్రయాణించి తదుపరి రికార్డ్ను బద్దలు కొట్టేందుకు సంసిద్ధమయ్యారు. 1970 ఏడాదిలో అపోలో–13 మిషన్లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు భూమి నుంచి 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించారు. ఇప్పుడీ రికార్డ్ను ఆర్టీమిస్–2 వ్యోమగాములు బద్దలుకొట్టనున్నారు. ఓరియాన్ వ్యోమనౌకలోని నలుగురు వ్యోమగాములు శనివారం నాటికే భూమి నుంచి చంద్రుని దిశగా 1,36,080 మైళ్లు ప్రయాణించారు. త్వరలోనే చంద్రుడిని దాటి దాదాపు 2,52,000 మైళ్లదూరం వెళ్లనున్నారు. తద్వారా అపోలో–13 వ్యోమగాముల రికార్డ్ను వీళ్లు 53 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరిపేయనున్నారు. తర్వాత వీళ్ల వ్యోమనౌక యూటర్న్ తీసుకుని భూమి దిశగా ప్రయాణం కొనసాగిస్తుంది. ఆర్టిమిస్–2లో భాగంగా తమ దేశీయుడు వెళ్తుండటంపై కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంబరాలు చేసుకుంది. కెనడా వ్యోమగామి జెరిమీ హన్సెన్తో క్యూబెన్ నగరంలోని కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అధ్యక్షురాలు లీసా క్యాంప్బెల్ మాట్లాడి అభినందించారు. -
హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ
న్యూఢిల్లీ: భారత్ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఇప్పటికే భారత్కు చేరుకున్నాయి. గ్రీన్ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. చైనా దిశగా ఇరాన్ నౌకపై భారత్ స్పష్టీకరణ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ దిశగా వస్తున్న ఇరాన్ చమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్కు ఏడేళ్ల తర్వాత గుజరాత్లోని వడినార్కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్తో భారత్కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
దిగిరాకుంటే నరకమే!
దుబాయ్: హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే కనీవినీ ఎరగని వినాశనానికి ఆ దేశం సిద్ధపడాల్సి ఉంటుందన్నారు. శనివారం ఈ మేరకు స్వీయ సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘హార్మూజ్ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు! టెహ్రాన్పై బాంబుల వర్షం ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్, అమెరికా ముమ్మరంగా దాడులు కొనసాగించాయి. బుషెహర్లోని అణు విద్యుత్కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్లాంటుపై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. ‘‘దాడిలో సెక్యూరిటీ గార్డు మరణించాడు. కాకపోతే రేడియేషన్ లీకేజీ వంటిదేమీ సంభవించకపోవడం కాస్త ఊరట’’అని తెలిపింది. ఇది ఇటీవలి కాలంలో ఇరాన్ అణుకేంద్రాలపై జరిగిన నాలుగో దాడి. టెహ్రాన్లో ఒక పెట్రో కెమికల్ ప్లాంట్పైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. రాజధాని టెహ్రాన్ దాడులతో దద్దరిల్లింది. నగరంలోని పలు క్షిపణి నిల్వ కేంద్రాలను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై భారీగా ప్రతి దాడులకు దిగింది. దుబాయ్లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భవనానికి భారీ రంధ్రం పడ్డ ఫుటేజీ వైరల్గా మారింది. తమపైకి ఇరాన్ ప్రయోగించిన 23 బాలిస్టిక్ క్షిపణులు, 56 డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమపై 8 డ్రోన్ దాడులు జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది.పైలట్ కోసం వేట! శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్ను కూడా అమెరికా కోల్పోయిట్టు తెలుస్తోంది. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు’’అని అమెరికాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే కూల్చేయడం తెలిసిందే. అందులోని పైలట్తో పాటు గన్నర్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. మరొకరి కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఇరాన్ కూడా అతన్ని ఎలాగైనా నిర్బంధించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా రెండు అమెరికా హెచ్హెచ్–60డబ్లు్య జాలీ గ్రీన్–2 బ్లాక్హాక్ హెలికాప్టర్లు కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు సమాచారం. అవి కష్టమ్మీద ఇరాన్ భూభాగాన్ని దాటి సురక్షిత స్థానానికి చేరినా వాటి పైలట్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారమే మరో కె–10 యుద్ధ విమానం కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి వార్తా సంస్థలు పేర్కొనడం విశేషం. ‘‘ఒక ఇంజన్ విఫలమైంది. దాంతో అది సింగిల్ ఇంజన్తోనే అతి కష్టమ్మీద గల్ఫ్లోని వైమానిక స్థావరానికి చేరుకుంది’’అని వెల్లడించాయి! అయితే ఈ ఉదంతం చర్చల ప్రక్రియను ప్రభావితం చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంపై అమెరికా యుద్ధవిమానాలను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం! అగ్ర రాజ్యం చివరిసారిగా 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో ఏ–10 థండర్బోల్ట్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది.మీ కుమారులకు ట్రంప్తోనే ముప్పు హాని తలపెట్టొద్దన్న పైలట్ తల్లి విజ్ఞప్తికి ఇరాన్ కౌంటర్ టెహ్రాన్: శత్రు దేశ పైలట్ అనే ప్రతీకారేచ్ఛతో తన కుమారుడికి హాని తలపెట్టొద్దని అమెరికా పైలట్ తల్లి చేసిన విజ్ఞప్తికి ఇరాన్ తనదైన రీతిలో బదులిచ్చింది. దాడి కోసం వచ్చి తమ గగనతలంపై చక్కర్లు కొడుతున్న అమెరికా యుద్ధవిమానాలను ఇరాన్ శుక్రవారం నేలకూల్చడం తెల్సిందే. దీంతో పైలట్లు బయటకు దూకేయగా ఒకరిని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు రక్షించి వెంటతీసుకెళ్లాయి. మరో పైలట్జాడ తెలీడం లేదు. అతడిని ఇరాన్ బంధించిందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒక పైలట్ తల్లి విజ్ఞప్తిచేశారు. ‘‘ఎఫ్–15 ఫైటర్జెట్ పైలట్లకు హాని తలపెట్టకండి. వారిలో ఒకతను నా కుమారుడు’’అని ఆమె వేడుకున్నారు. దీంతో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు దీటుగా స్పందించాయి. ‘‘ఇరాన్ కస్టడీకంటే మీ కుమారులకు డొనాల్డ్ జూనియర్ ట్రంప్తోనే ముప్పు ఉంది. అమెరికా రెస్క్యూ టీమ్లకు దొరక్కుండా మా కస్టడీలోనే వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకోండి. అమెరికాకు దొరికితే ఏమేం రహస్యాలు వెల్లడించారని చెప్పి చిత్రవధ చేస్తారు. ముస్లింలుగా, నాగరికత తెల్సిన ఇరానియన్లుగా మాకు మీ వాళ్లను ఎలా చూసుకోవాలో తెలుసు. మర్యాదతో, గౌరవప్రదంగా చూసుకుంటాం. అమానవీయ యూదనీతుల కంటే యుద్ధనీతులు మాకు బాగా తెలుసు. యుద్ధఖైదీలను పద్ధతిగా చూసుకుంటాం. మేం ఆలోచనల్లో అమెరికా మాదిరి రాతియుగంలో బతకట్లేము’’అని ఎంబసీలు బదులిచ్చాయి. బోర్ కొడుతోంది, ఏమన్నా మాట్లాడండి! ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ ఎద్దేవా ట్రంప్ తాజా హెచ్చరికలను ఇరాన్ తేలిగ్గా తీసిపడేసింది. అమెరికాతో చర్చలకు తామే దిగొచ్చామన్న ట్రంప్ వ్యాఖ్యలను మరోసారి ఖండించింది. అధ్యక్షుని మాటలకు ఇప్పుడెవరూ పెద్దగా విలువ ఇవ్వడం లేదనే అర్థం వచ్చేలా జింబాబ్వేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం శనివారం ఎక్స్లో పోస్టు పెట్టింది! ‘‘మాకు బాగా బోర్ కొడుతోంది. ఏదో ఒకటి మాట్లాడండి’’అంటూ ట్రంప్ మాటతీరును ఎద్దేవా చేసింది. చర్చలకు ఇరాన్ సుముఖత! అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు ఇప్పటిదాకా ససేమిరా అంటూ వచ్చిన ఇరాన్ ఎట్టకేలకు అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చర్చల నిమిత్తం పాక్ వెళ్లేందుకు తామెప్పుడూ తిరస్కరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం స్పష్టం చేశారు. -
"నాకుమారుడిని రక్షించండి".. ట్రంప్ కంటే మేమే బెటర్: ఇరాన్
ఇరాన్ నిన్న ( శుక్రవారం) అమెరికా ఫైటర్ జెట్ను కూల్చివేయడంతో దాని ఫైలట్ ఇరాన్ భూభాగంలో దూకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఫైలట్ తల్లి ఎక్స్ వేదికగా తన గోడు వెల్లగక్కింది. దీనిపై పాకిస్థాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.నిన్న (శుక్రవారం) జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇరాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వీరిలో ఒక పైలట్ ఆచూకీ లభించగా, మరో పైలట్ గల్లంతయ్యారు. అయితే తన కుమారుడు కూడా ఫైటర్ పైలట్ అని, అతని గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదని ఆందోళన చెందుతూ ఒక అమెరికన్ మహిళ X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. "నా కుమారుడి కోసం, ఇతర పైలట్ల కోసం ప్రార్థించండి" అని ఆవేదన వెల్లగక్కింది.దీనిపై పాక్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. పాక్లోని కార్యాలయం "డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉండటం కంటే, ఇరాన్ కస్టడీలో ఉండటమే మీ కుమారునికి సురక్షితం. అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే ఇరాన్ అతన్ని బందీగా పట్టుకోవాలని ప్రార్థించండి. ముస్లింలుగా, నాగరికత కలిగిన ఇరానియన్లుగా మేము యుద్ధ ఖైదీలను గౌరవంగా చూస్తాము," అని పేర్కొంది.దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ: "అమెరికా లేదా వారి మిత్రదేశాల వలె మేము అనాగరికంగా ప్రవర్తించము. మాకు గొప్ప నాగరికత ఉంది, యుద్ధ ఖైదీల హక్కుల గురించి మాకు బాగా తెలుసు," అని విమర్శించింది. అయితే యుద్ధం మెుదలై నెలరోజులు దాటినా ఇంకా పరిస్థితులు ఉదృతంగానే కొనసాగుతున్నాయి. -
భారత్తో మాది వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే భారత్ నౌకలు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ ఎల్పీజీ ట్యాంకర్ జలసంధి గుండా భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ ధన్యవాదాలు తెలుపగా ఇరాన్ దానికి స్పందించింది.చమురు నౌక గుజరాత్ చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ ట్యాంకర్ ప్రయాణాన్ని భారతీయ దౌత్య విజయంగా అభివర్ణించారు. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. "భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, మా ఉమ్మడి చరిత్రలో ఒక మధురమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారిని మీరు సాదరంగా ఆహ్వానించారు. ఈ నాగరికత సంబంధాల ఆధారంగా, మన మధ్య స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని తెలిపింది.కాగా ఇరాన్ కాన్సులేట్ తన సందేశంలో సింధూ నాగరికతకు చెందిన లోథల్ ఓడరేవును ఉద్దేశించి మాట్లాడింది. సుమారు 4,000 ఏళ్ల క్రితమే సింధు లోయ నాగరికతకు మరియు పర్షియా తీరానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఇది గుర్తుచేస్తుంది. కాగా గ్రీన్ సాన్వీ అనే నౌక 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్తో హర్ముాజ్ జలసంధిని దాటింది.అయితే హర్మూజ్ జలసంధి విషయమై ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దానిని ఎట్టిపరిస్థితుల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తుండగా ఇరాన్ ససేమిరా అంటుంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ కేవలం 5 మిత్ర దేశాలకు భారతదేశం,రష్యా, చైనా, ఇరాక్,పాకిస్థాన్ అనుమతినిచ్చింది. -
ప్రళయానికి సమయం ఆసన్నమవుతోంది: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల సమయమే మిగిలి ఉందని చెప్పారు. ఒప్పందం చేసుకోవాలని లేదా హార్మూజ్ తెరవాలని గడువు విధించామన్నారు. సమయం మించిపోతోందంటూ ట్రూత్లో పోస్ట్ చేశారు. ప్రళయానికి మరో 48 గంటలే మిగిలి ఉందని ట్రంప్ చెప్పారు. ‘ఇరాన్కు నేను 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒప్పందం చేసుకోవాలి లేదా హార్మూజ్ జలసంధిని తెరవాలి. సమయం ముగియనుంది. ఇంకా 48 గంటల తర్వాత అన్నీ విధ్వంసం అవుతాయి’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పేర్కొన్నారు.కాగా, అమెరికా సైనిక విమానాలకు జరిగిన నష్టం ఇష్యూ ఇరాన్తో దౌత్య చర్చలపై ప్రభావం చూపదని ఇవాళ ఉదయం ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విమానాల కూల్చివేత ఘటన చర్చలను దెబ్బతీస్తుందనే వాదనలను ట్రంప్ తిరస్కరించారు.మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం స్పందిస్తూ.. ఇరాన్ రాజధానిలో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. తమ వైమానిక దళం టెహ్రాన్లో బాలిస్టిక్, వైమానిక రక్షణ క్షిపణి నిల్వ కేంద్రాలపై దాడి చేసిందని చెప్పింది. అదే దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, సైనిక పరిశోధన అభివృద్ధి సదుపాయాలు కూడా ఉన్నాయి అని తెలిపింది. -
ఇరాన్ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం?
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధంలో ఇరాన్ ఇప్పటివరకు ఎఫ్-35 రెండు యుద్ధ విమానాలను కూల్చివేయడం సంచలనం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన జెట్గా ప్రచారంలో ఉన్న ఎఫ్-35, ఇరాన్లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలో విఫలమైందా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎఫ్-35 ప్రత్యేకత దాని స్టెల్త్ టెక్నాలజీ. ఇరాన్తో అమెరికా యుద్ధంలో ఇది రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఆ టెక్నాలజీపైనే ప్రశ్నలు తలెత్తాయి. ఇంతటి అత్యాధునిక విమానాలను ఎలా కూల్చగలిగింది? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రతి దాడుల్లో ఎఫ్-35 ఫైటర్ తుస్సు మందా? అసలేంటీ దీని కథ?ఇరాన్పై యుద్ధంలో ఎఫ్-35 ఫైటర్ ప్రతిష్టకు దెబ్బశుక్రవారం ఇరాన్ చేసిన ప్రకటనల ప్రకారం, రెండో ఎఫ్-35ను కూల్చివేశాయి.(అంతకుముందు, మార్చి 19న). దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను కోల్పోవడం లేదా దెబ్బతినడం అనేది డబ్బు పరంగా, ప్రతిష్ట పరంగా కూడా ఒక పెద్ద దెబ్బ. ఎఫ్-35 లైట్నింగ్ అనేది ఐదవ తరం స్టెల్త్ జెట్. ఇది శత్రు రాడార్లకు దాదాపు కనిపించకుండా, సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ, ఇతర విమానాలు, భూతల దళాలతో ప్రత్యక్ష సమాచారాన్ని పంచుకునేలా తయారుచేశారు. కానీ స్టెల్త్ జెట్ సామర్థ్యాలపై, ఇరాన్తో యుద్ధంలో అమెరికా అతివిశ్వాసంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది .ఇరాన్తో అమెరికా సంఘర్షణలో, అమెరికా అతివిశ్వాసమే అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.కెనడా పునరాలోచనప్రధాన సంస్థలైన లాక్హీడ్ మార్టిన్ , నార్త్రోప్ గ్రుమ్మన్, ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందిన ఎఫ్-35 జెట్ను నిర్మించాయి, కానీ దాని ప్రతిష్ట ఎంతగా దెబ్బతిందంటే, అమెరికన్ ఎఫ్-35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలనే తన ప్రణాళికను కెనడా సమీక్షిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్లు, విడిభాగాల లభ్యత వంటి అంశాల వల్ల కెనడా ఆందోళన చెందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఇరాన్లో జెట్లు, అత్యాధునిక రాడార్లు విఫలమైన తర్వాత, అమెరికన్ రక్షణ పరికరాలపై ఆధారపడటం గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి. యుద్ధం కొనసాగు తున్నందున, జెట్లు ఎలా దెబ్బతిన్నాయనే దానిపై విచారణ కొనసాగుతోంది. కానీ ప్రస్తుతానికి, యుద్ధభూమిలో కొన్ని ఊహించని దెబ్బల నేపథ్యంలో F-35 కేవలం కాగితాలమీదే టాపర్గా భావించాల్సి వస్తోంది.ఘఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్ ఎఫ్-35 ఫీచర్స్F-35 అనేది ఒకే సీటు, ఒకే ఇంజిన్ కలిగిన యుద్ధ విమానం. దీని ప్రాట్ & విట్నీ ఇంజిన్ సుమారు 43,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గంటకు 1,200 మైళ్ల వేగమైన మాక్ 1.6ను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని రెక్కల విస్తీర్ణం సుమారు 35 అడుగులు . ఇది కేవలం అంతర్గత ఇంధనంతోనే 1,350 మైళ్లకు పైగా ప్రయాణించగలదు. గాలిలోనే ఇంధనం నింపుకోవడంతో, దీని పరిధి దాదాపు అపరిమితం .దీని టెక్నాలజీ కారణంగా శత్రువులు దీన్ని గుర్తించడం, లాక్ చేయడం కష్టమని భావించారు, కానీ ఇరాన్ దీన్ని పటాలపంచలు చేసింది.ఎఫ్-35లో శక్తివంతమైన సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి రాడార్, ఇన్ఫ్రారెడ్ , ఇతర వ్యవస్థల నుండి డేటాను మిళితం చేసి, పైలట్కు యుద్ధభూమి స్పష్టమైన 360-డిగ్రీల చిత్రాన్ని అందిస్తాయి. స్టెల్త్ రూపాన్ని స్పష్టంగా ఉంచడానికి ఈ జెట్ బాడీ లోపల ఆయుధాలను మోయగలదు. చెప్పాలంటే ఎఫ్-35 రహస్యంగా చొరబడి, కచ్చితంగా దాడి చేసి, సురక్షితంగా బయటపడగలదు. విధానాన్ని బట్టి,ఈ ఎఫ్-35 విమానాల ఖరీదు 82 నుండి 110 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది.ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?మరి ఈ టాప్ జెట్ను ఇరాన్ ఎలా కూల్చింది?రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్న అత్యంత ఆధునికమైనవి కానప్పటికీ ఇరాన్, అధిక ఎత్తులకు చేరుకోగల , రాడార్ లేదా ఇన్ఫ్రారెడ్ ఉపయోగించి లక్ష్యాలను ట్రాక్ చేసే, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. ముఖ్యంగా 'మజిద్' ఇన్ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా భుజంపై ఉంచుకుని ప్రయోగించే క్షిపణులను వాడుతోంది ప్రధానంగా ఇవి రాడార్లకు చిక్కవు. అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు వీటి ద్వారా లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. గత మార్చి 19న శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ ఎఫ్-35ను దెబ్బతీసింది కూడా ఈ మజిద్ వ్యవస్థేనని భావిస్తున్నారు. F-35లకు సరిసమానమైన యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద లేకపోయినా, అది ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలదు. టెహ్రాన్ పని అయిపోయింది, ఇరాన్ గగనతలం మాదే అన్న మార్చి 24న ట్రంప్ అతివిశ్వాస ప్రకటన అమెరికాకే ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. -
ఇది భూమి అంతానికి ఆరంభమా?
ఊహించండి.. మీరు పొద్దున్నే నిద్రలేచి కిటికీ తెరిచారు. బయట సూర్యకాంతి లేదు, తెల్లటి ఆకాశం లేదు. మీకు కనిపిస్తున్నదల్లా రక్తం లాంటి ఎర్రటి రంగు! మీ చుట్టూ ఉన్న భవనాలు, రోడ్లు, చెట్లు అన్నీ అంగారక గ్రహం (Mars) మీద ఉన్నట్లుగా మారిపోయాయి. ఇది ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్ కాదు.. కొన్ని గంటల క్రితం గ్రీస్ దేశంలో ప్రజలు కళ్లారా చూసిన భయంకర నిజం! అసలు గ్రీస్ ఆకాశం ఎందుకు ఎర్రగా మారింది? ఇది ప్రళయానికి సంకేతమా? లేక ప్రకృతి మనుషులపై తీర్చుకుంటున్న పగనా? గ్రీస్ రాజధాని ఏథెన్స్.. పర్యాటకులకు స్వర్గధామం. కానీ అకస్మాత్తుగా అక్కడ కాలం ఆగిపోయింది. మధ్యాహ్నం సమయం అయినా సరే, నగరం మొత్తం చీకటిగా, ఎర్రటి పొగమంచుతో నిండిపోయింది. ప్రజలు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు చూసి ప్రపంచం మొత్తం వణికిపోయింది. "మనం భూమి మీద ఉన్నామా లేక మార్స్ మీద ఉన్నామా?" అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశం రంగు మారడమే కాదు, గాలి పీల్చుకోవడం కూడా నరకంలా మారిపోయింది. ముందుగా శాస్త్రవేత్తలు దీనిని చూసి షాక్ అయ్యారు. దీనికి కారణం సహారా ఎడారి! అవును, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికాలోని సహారా ఎడారి నుండి వీచిన భారీ ధూళి తుపాను (Dust Storm) గ్రీస్ ఆకాశాన్ని కమ్మేసింది. బలమైన గాలులు ఎడారిలోని ఇసుకను, ధూళిని వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి, భూమధ్య సముద్రాన్ని దాటించి గ్రీస్ మీద కుమ్మరించాయి. సూర్యరశ్మి ఆ ధూళి కణాల మీద పడినప్పుడు, కేవలం ఎరుపు రంగు మాత్రమే పరావర్తనం చెంది, నగరాన్ని ఒక రక్తపు సరస్సులా మార్చేసింది. ఇది చూడటానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న ప్రమాదం చాలా పెద్దది. గాలిలో చేరిన ఈ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రాణాపాయం తప్పదు. గ్రీస్ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు అడుగు బయట పెట్టవద్దని హెచ్చరించింది. ఆకాశం నుండి కురుస్తున్నది వర్షం కాదు.. ఇసుక రేణువులు! కార్లు, ఇళ్లు అన్నీ ఎర్రటి దుమ్ముతో నిండిపోయాయి. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, మనుషుల మనుగడకు ఒక హెచ్చరిక.గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ధూళి తుపాను రావడం ఇదే మొదటిసారి. శాస్త్రవేత్తల ప్రకారం, గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కుతోంది, దీనివల్ల ఎడారులు విస్తరిస్తున్నాయి అలాగే గాలుల వేగం అసాధారణంగా మారుతోంది. ఈరోజు గ్రీస్.. రేపు మరే దేశం? ప్రకృతి ప్రకోపిస్తే మనిషి నిర్మించిన నాగరికత క్షణాల్లో మసి అయిపోతుందని ఈ ఘటన నిరూపించింది. ఏథెన్స్ లోని పురాతన కట్టడాలు ఆ ఎర్రటి వెలుగులో చూస్తుంటే, ఏదో గ్రహాంతర వాసుల నగరంలా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే మనకు ఒకటే అనిపిస్తుంది.. మనం ప్రకృతిని కాపాడకపోతే, ప్రకృతి మనల్ని శిక్షించడం మొదలుపెడుతుంది. గ్రీస్ లో ఆకాశం మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు, కానీ ఆ ఎర్రటి రంగు మిగిల్చిన భయం మాత్రం ప్రజల గుండెల్లో అలాగే ఉంటుంది. ఇది అంతానికి ఆరంభమా? లేక మనల్ని మనం మార్చుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఆఖరి అవకాశమా? మిత్రులారా, ఈ భయంకరమైన దృశ్యాల గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ప్రకృతి వైపరీత్యమా లేక మనుషుల తప్పిదమా? -
20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై తొలిసారిగా దాడులు చేసిన ఐదు వారాల తర్వాత ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గత 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేయగా, మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ దాడి చేసింది. గత 20 ఏళ్లకు పైగా కాలంలో అమెరికాకు జరగని అత్యంత అరుదైన దాడిగా నిలిచింది. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే టెహ్రాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గి పోయిందని, ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వెంటనే జరిగిన ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2003 తర్వాత శత్రువుల కాల్పులకు అమెరికా జెట్లు కూలిపోవడం ప్రస్తుతం యుద్ధంపై మరింత ఉత్కంఠను పెంచింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గత 20 ఏళ్లలో అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ఇదే మొదటిసారి.20 ఏళ్ల తర్వాత తొలిసారి: ఇరాన్ చేతిలో కూలిన అమెరికా యుద్ధ విమానాలుశుక్రవారం ఇరాన్ ఒక F15-E స్ట్రైక్ ఈగిల్ (Strike Eagle) యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇందులో ఉన్న ఒక సైనికుడిని రక్షించగా, రెండో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, ఇరాన్ రక్షణ దళాల దాడిలో అమెరికాకు చెందిన A-10 అటాక్ ఎయిర్క్రాఫ్ట్ కూడా కూలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. చివరిసారిగా 2003లో ఇరాక్ దండయాత్ర సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్బోల్ట్ II విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అదీ ట్రంప్ హయాంలో జరగడం గమనార్హం. ఎందుకంటే అమెరికా ప్రజలు సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగని యుద్ధాలకే అలవాటు పడ్డారు. ఇప్పుడు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు. ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?చావో రేవో- ఇరాన్ వ్యూహంప్రస్తుతం ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా పోరాడుతోందని, చావో రేవో అన్న రీతిలో ఎదురు దాడులకు దిగుతోందని చెబుతున్నారు. ఫిబ్రవరి 28 మొదలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు గత ఐదు వారాలుగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు దెబ్బతిన్నాయని ట్రంప్ ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందీ అనడానికి ఈ దాడులే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.ఇరాన్పై అమెరికా సాగిస్తున్న వైమానిక యుద్ధం ఇప్పటివరకు భారీ విజయం అన్నారు రిటైర్డ్ మెరైన్ కల్నల్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో సీనియర్ రక్షణ సలహాదారు మార్క్ కాన్సియన్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాల నష్టాల రేటు ఒకానొక దశలో 3 శాతంగా ఉండేదని, ఇది ఇరాన్పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సుమారు 350 యుద్ధ విమానాలకు సమానమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!అమెరికా విమానాలను కూల్చడానికి రాడార్లకు కూడ ఆ చిక్కని భుజంపై నుండి ప్రయోగించే (Shoulder-fired) క్షిపణులను వాడి ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేస్తున్నాయి. ఇదే ఇరాన్కు వరంగా మారిందని ఇరాన్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ బెహ్నామ్ బెన్ తలేబ్లు అన్నారు. కాగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా దళాలు ఇప్పటివరకు 13,000 కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించాయి. 12,300 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. -
ఇరాన్లోని బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి
టెహ్రాన్: ఇరాన్లో శనివారం (ఏప్రిల్ 4న) ఉదయం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిధి సమీపంలో ఒక క్షిపణి పడింది. దీంతో అక్కడి ఒక భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరానియన్ వార్త సంస్థ తస్నీమ్ తెలిపింది. ఈ ఘటనలో అణు విద్యుత్ కేంద్రం ప్రధాన భాగాలు దెబ్బతినలేదు. కానీ, సహాయక భవనం దెబ్బతింది. అణు విద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం పడలేదు.బుషెహర్ దక్షిణ ఇరాన్లో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది ఆ దేశపు మొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఇరాన్ మౌలిక వసతులు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘అమెరికా సైన్యం ఇరాన్లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు" అని అన్నారు. ఇంతలోనే ఇవాళ ఈ దాడి జరగడం గమనార్హం."మా సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనది, ఇరాన్లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు. తర్వాత వంతెనలు, ఆపై విద్యుత్ కేంద్రాలు నాశనం చేస్తాం. ఇరాన్లోని కొత్త పాలకులకు చేయాల్సిన పనుల గురించి తెలుసు, వెంటనే చేయాలి’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అవసరమైతే ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్లేలా బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇవాళ ఉదయం ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం.. అమెరికా, పశ్చిమాసియాలోని దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఖాతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం ప్రతినిధి ఇబ్రాహీం జోల్ఫఘారి ఓ ప్రకటన విడుదల చేసి.. అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని దేశాలపై యుద్ధం చేస్తూనే సొంత దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షిస్తోంది ఇరాన్. ఇరాన్ నిషేధిత ప్రతిపక్ష గగ్రూప్ పీపుల్స్ మొజాహెదిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ (పీఎంఓఐ/ఎంఈకే) సభ్యులుగా తేలిన ఇద్దరు పురుషులను ఉరి తీసింది. ఈ వివయాలను ఇరాన్ న్యాయవ్యవస్థ వెబ్సైట్ మిజాన్ ఆన్లైన్లో తెలిపింది. -
వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్?
అమెరికాలోని ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చర్రిత సృష్టించారు. వాషింగ్టన్ డీసీ (Washington, DC) మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా 31 ఏళ్ల రినీ సంపత్ చరిత్ర సృష్టించారు. 'అమెరికన్ డ్రీమ్' సాకారం కోసం ఏడేళ్ల వయసులోనే అమెరికాకు వలస వచ్చిన ఆమె ఇపుడు 2026 మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నామినేషన్ అర్హతను ఆమె సాధించడం విశేషం.తమిళనాడులో తేనిలో జన్మించిచారు రినీ సంపత్. తన ఏడవ ఏట తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్లో పట్టా పొందారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు మరియు ప్రభుత్వ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 'థారోస్' (Tharros) అనే సంస్థకు డైరెక్టరీగా వ్యవహరిస్తున్నారు. రినీప్రచారాస్త్రాలు -నినాదాలుగత పదేళ్లుగా వాషింగ్టన్ డీసీలోనే నివసిస్తున్న రినీ మేయర్ పదవికి జరిగే ఎన్నికల బ్యాలెట్లో స్థానం సంపాదించారు. నగరంలోని ప్రాథమిక సేవలను మెరుగుపరచడమే తన లక్ష్యమని సంపత్ నొక్కి చెప్పారు. ‘ఫిక్స్ ద బేసిక్స్’ (Fix the Basics) “కొత్త డీసీ” (A new DC) అనే నినాదంతో అంటూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం.పోటోమాక్ నదిలో మురుగునీరు కలవకుండా అడ్డుకోవడం.ధరలను తగ్గించడం.911 అత్యవసర సేవల వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!తమ కుటుంబం అమెరికాకు రావాలని తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చివేసిందని రినీ చెబుతారు. తన మూలాలే ప్రజా సేవకు తన ప్రేరణకు కేంద్రమన్నారు. తన తాతగారు తనకెప్పుడూ పెద్ద స్ఫూర్తి అని, ప్రజా సేవలో ఆయన మార్గమే తనను నడిపిస్తుందంటారామె. "నేను రాజకీయ నాయకురాలిని కాదు. నాకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజన గ్రూపులతో సంబంధం లేదు. నగర ప్రాథమిక సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే ఒక బయటి వ్యక్తి అవసరం ఉందని రినీ పేర్కొన్నారు.కాగా ఈసారి ఎన్నికల్లో రినీ సంపత్.. జనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్డఫీ, గ్యారీ గుడ్వెదర్, రాబర్ట్ ఎల్ గ్రాస్, రోండా హామిల్టన్ వంటి వారితో తలపడుతున్నారు. ఆమె నామినేషన్ పత్రాలపై 4,500 కంటే ఎక్కువ మంది ప్రజలు సంతకాలు చేసి మద్దతు తెలపడం విశేషం.ఇదీ చదవండి : ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్! -
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అతలాకుతలమవుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..ఫ్రాన్స్లో 'ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు'పెరుగుతున్న ఇంధన భారంతో సతమతమవుతున్న వ్యాపారుల కోసం ‘ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు’ (Flash Fuel Loans) పేరుతో ఒక అత్యవసర రుణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫ్రాన్స్ శుక్రవారం ప్రకటించింది.లోన్ల ముఖ్య విశేషాలురుణ పరిమితి: అర్హత కలిగిన సంస్థలు 50,000 యూరోల (సుమారు రూ. 53.64 లక్షలు) వరకు రుణం పొందవచ్చు.ప్రధాన లబ్ధిదారులు: రవాణా, వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.వడ్డీ రేటు: మూడేళ్ల కాలపరిమితి గల ఈ రుణాలపై 3.8 శాతం వడ్డీ వసూలు చేస్తారు.త్వరితగతిన నిధులు: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 'బీపీఐఫ్రాన్స్' (Bpifrance) ద్వారా డిజిటల్ పద్ధతిలో కేవలం ఏడు రోజుల్లోనే రుణ ప్రక్రియ పూర్తి చేసి నిధులు మంజూరు చేస్తారు.ప్రధాని హామీ అమలుఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అరికడతామని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను గత వారం ఇచ్చిన హామీని ఈ పథకం ద్వారా నెరవేర్చారు. యుద్ధ ప్రభావం వల్ల సామాన్యులపై, వ్యాపారాలపై పడుతున్న భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.రిఫైనరీల తీరుపై విచారణకు డిమాండ్మరోవైపు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని యూరప్లోని రిఫైనరీలు ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ "దుర్వినియోగం"పై విచారణ జరపాలని కోరుతూ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్ యూరోపియన్ కమిషన్కు లేఖ రాశారు.యుద్ధం పేరుతో కంపెనీలు అక్రమంగా లాభాలు గడిస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఇంధన సంక్షోభం నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడుకునేందుకు ఫ్రాన్స్ తీసుకున్న ఈ చర్యలు ప్రస్తుతం ఐరోపాలో చర్చనీయాంశంగా మారాయి. -
అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!
ఇండియానా: అమెరికాలో ట్రక్కు డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకుని స్థిరపడిన వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా పంజాబీ సిక్కులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇండియానా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టం కారణంగా భారీ సంఖ్యలో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు (సీడీఎల్) రద్దయ్యాయి. 2026, ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావడంతో వందలాది మంది భారతీయుల ఉపాధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ కొత్త చట్టం?ఇండియానా బ్యూరో ఆఫ్ మోటార్ వెహికల్స్ (బీఎంవీ) ‘హౌస్ ఎన్రోల్డ్ యాక్ట్ 1200’ ప్రకారం మొత్తం 1,790 నాన్-డొమిసైల్డ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది. గతంలో చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఉన్న విదేశీయులకు ఈ లైసెన్సులు ఇచ్చేవారు. అయితే తాజా మార్పుల ప్రకారం కేవలం మూడు రకాల వీసా కేటగిరీలకు (H-2A - వ్యవసాయ కార్మికులు, H-2B - తాత్కాలిక కార్మికులు, E-2 - ఇన్వెస్టర్లు) మాత్రమే ఈ లైసెన్సులు పొందే అర్హత ఉంటుంది. మిగిలిన వీసాలపై ఉన్న డ్రైవర్లందరినీ అనర్హులుగా ప్రకటిస్తూ, మార్చి 16నే నోటీసులు జారీ చేశారు.ఎందుకు ఈ కఠిన నిర్ణయం?ఇటీవల కాలంలో నాన్-డొమిసైల్డ్ డ్రైవర్ల వల్ల జరిగిన ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ రికార్డుల పరిశీలన, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, సరైన శిక్షణ వంటి అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించారు.భారతీయులపై ప్రభావంఅమెరికాలో లాంగ్-హాల్ ట్రక్కు రవాణా రంగంలో భారతీయ సంతతికి చెందిన వారు, ముఖ్యంగా పంజాబీ కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోంది. తాజా రద్దుతో చాలా మంది డ్రైవర్లు తమ స్థాయిని కోల్పోయి, కేవలం సాధారణ డ్రైవింగ్ లైసెన్సులకే (Regular DL) పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటికే కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు వేల సంఖ్యలో లైసెన్సులను రద్దు చేయగా, ఇప్పుడు ఇండియానా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా సరఫరా గొలుసు (Supply Chain)పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: గుండె గుభేల్: యుద్ధం మరో 20 రోజులు? -
ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!
చైనాలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళ, అనూహ్య పరిస్థితిలో రైలులో రక్త వాంతి చేసుకుంది. అయితేతన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఆమె చేసిన పని లక్షలాది మంది మనసులను గెలుచుకుంది. అంతేకాదు ఆమె పరిస్థితి వారిని కదిలించి, కోట్ల రూపాయలను భారీ విరాళాలను ఆమెకు అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగింది? స్థానిక మీడియా కథనం ప్రకారం చైనాకు చెందిన హు జిన్యావో (Hu Xinyao) అనే 23 ఏళ్ల యువతికి చిన్న వయసులోనే ANCA-అసోసియేటెడ్ వాస్కులైటిస్' (ANCA-associated vasculitis) అనే అరుదైన రక్తనాళాల వ్యాధితో బాధపడుతోంది. ఇంజెక్షన్ తీసుకోవడానికి హు జిన్యావో ఆసుపత్రికి వెళ్తుండగా జీర్ణవ్యవస్థలో అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల అనుకోకుండా రక్తం కక్కుకుంది. దీంతో వెంటనే తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన కోట్తోనే నెమ్మదిగా ఆ రక్తాన్ని శుభ్రపర్చింది. ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయ్యారు.జియుపాయ్ న్యూస్ ప్రకారం, మార్చి 23న, చాంగ్కింగ్లోని మెట్రో రైలులో ఒక ప్రయాణికుడు ఆ మహిళను చిత్రీకరించగా, ఆ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె వైద్యం కోసం భారీగా విరాళాలు అందాయి. సుమారు 4,00,000 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.7 కోట్లు విరాళాలు సమకూరాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!నెటిజనుల రియాక్షన్స్"ఆమె మనసు చాలా మంచిది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "నేను ధన వంతుడ్ని కాకపోయినా, ఆమె చికిత్స కోసం నా వంతు సాయం చేస్తాను" అని మరొకరు తన వంతు సాయం చేశారు. ఇలా వారంలోపే ఆమెకు భారీగా విరాళాలు అందాయి. ఎంతలా అంటే, ఆమె సోషల్ మీడియా ఖాతాకు విరాళాలు వెల్లువెత్తడంతో ప్లాట్ఫారమ్ తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో స్పందించిన ప్రతీ ఒక్కరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. "నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు, వారు పంపిన మొత్తాన్ని నేను నోట్ చేసుకున్నాను. ప్రజలు నాపై చూపిన ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో వారు కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా సాయం చేయాలని ఆశిస్తున్నాను," అని హు భావోద్వేగంతో చెప్పింది. ఎవరీ హు హు ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుండి వచ్చింది. 2018లో స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఫలితంగా వైద్య ఖర్చులు భరించలేక చదువు మధ్యలోనే ఆపేసింది. ఆపై రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించింది. Hu కుటుంబం ఆమె అనారోగ్య చికిత్స కోసం లక్షల కొద్దీ ఖర్చుపెడుతోంది. గత ఏడాది కాలంలోనే ఆమెకు ఆసుపత్రి నుండి 20 సార్లు 'క్రిటికల్ ఇల్నెస్' (ప్రాణాపాయ స్థితి) నోటీసులు వచ్చాయి. అయినా జీవితాన్ని నెట్టుకొస్తూ ప్రస్తుతం ఆన్లైన్ నవలలు రాస్తూ నెలకు 5,000 నుండి 6,000 యువాన్లు సంపాదిస్తుండటం గమనార్హం.ప్రియుడితో బ్రేకప్ ఇలాగత సెప్టెంబర్లో ఆమె మాజీ ప్రియుడు 'సియావో' ప్యాంక్రియాటైటిస్తో మరణిస్తూ, తన దగ్గర ఉన్న 50,000 యువాన్ల పొదుపు మొత్తాన్ని హు చికిత్స కోసం ఇచ్చి వెళ్ళాడు. తమ బంధం కేవలం రెండు నెలలే అయినప్పటికీ, తన అనారోగ్యం వల్ల అతడి జీవితం పాడవకూడదని హు అంతకుముందే అతడికి బ్రేకప్ చెప్పింది. వారి మధ్య ఉన్న ఆ నిస్వార్థమైన బంధం కూడా ప్రజలను ఎంతగానో కదిలించింది.గొప్పమనసుపెద్ద నగరాల్లో వైద్య చికిత్స పొందుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ,వారి బంధువులు బస చేయడానికి వీలుగా ఒక "రోగుల గృహం" నిర్మించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని హు మీడియాకు తెలిపింది. ఇటీవల ఆమె పరిస్థితి కిడ్నీ వైఫల్యానికి దారితీసింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏప్రిల్ ప్రారంభంలో తూర్పు జియాంగ్సు ప్రావిన్స్లోని నాన్జింగ్లో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రిని సందర్శించాలని యోచిస్తోంది. -
గుండె గుభేల్: యుద్ధం మరో 20 రోజులు?
న్యూఢిల్లీ: అమెరికా- ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఆహార భద్రతకు గుదిబండలా మారాయి. అగ్రరాజ్యం అమెరికా అంచనా ప్రకారం ఈ యుద్ధం మరో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశం ఉండటంతో, సామాన్యుని సరుకుల బిల్లు తడిసి మోపెడయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన ధరలను పెంచడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి.రికార్డు స్థాయిలో ఆహార ధరల సూచీఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ (ఎఫ్ఏఓ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ప్రపంచ ఆహార ధరల సూచీ 2.4 శాతం మేరకు పెరిగింది. ఇది గత ఏడాది సెప్టెంబర్ తర్వాత నమోదైన గరిష్ట స్థాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, వ్యవసాయ పెట్టుబడి వ్యయాలు భారం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ యుద్ధం గనుక మరో 20 రోజులకు పైగా కొనసాగితే.. రైతులు సాగును తగ్గించడం లేదా తక్కువ ఎరువులు వాడే పంటల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఎఫ్ఏఓ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో ఆందోళన వ్యక్తం చేశారు.చుక్కలు చూపిస్తున్న నూనె, పంచదార..వంట నూనెలు, పంచదార ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు 5.1శాతం పెరగగా, పామాయిల్ ధరలు 2022 నాటి గరిష్ట స్థాయికి చేరాయి. పంచదార ధర కూడా 7.2శాతం మేరకు పెరిగి రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. మరోవైపు గోధుమల ధరలు కూడా 4.3 శాతం పెరగడం గమనార్హం.భారత రైతులకు ఎరువుల కష్టంఈ యుద్ధం భారతీయ రైతాంగంపై నేరుగా ప్రభావం చూపనుంది. భారత్ తన ఎరువుల అవసరాల్లో దాదాపు 26 శాతం పశ్చిమ ఆసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా ఎరువుల కొరత తప్పదని ‘కేర్ ఎడ్జ్’ రేటింగ్స్ హెచ్చరించింది. మరోవైపు భారత్లో పొద్దుతిరుగుడు నూనె వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మేరకు తగ్గే అవకాశం ఉందని ‘క్రిసిల్’ అంచనా వేసింది.ఎల్పీజీపై ఐఓసీ (ఐఓసీ) క్లారిటీవంట గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 28 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నామని తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, సరఫరా స్థిరంగా ఉందని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. ఏదిఏమైనప్పటికీ యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ‘ధరల మంట’ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని చంపేయండి’.. పాక్లో అల్లకల్లోలం -
‘మమ్మల్ని చంపేయండి’.. పాక్లో అల్లకల్లోలం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం, ఆపై ప్రధాని దిగిరావడం.. వెరసి పాకిస్తాన్ ప్రస్తుతం ఒక అగ్ని గుండంలా మారిపోయింది.యుద్ధం మొదలై నెల రోజులు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. 85 శాతం చమురును ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా దిగుమతి చేసుకునే పాకిస్తాన్కు ఇది శాపంగా మారింది. శుక్రవారం రాత్రి పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఏకంగా 42.7 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 485కి చేరుకుంది. ఈ నిర్ణయంతో జనం బెంబేలెత్తిపోయారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెనక్కి తగ్గక తప్పలేదు. పెంచిన ధరను అదే రోజు రూ. 378కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ తగ్గిన ధర కనీసం నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. మీ జీవితాలు సాధారణ స్థితికి వచ్చే వరకు నేను విశ్రమించను’ అని ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పెట్రోల్ ధర తగ్గించినప్పటికీ, డీజిల్ ధర సామాన్యుడిని వణికిస్తోంది. లీటర్ డీజిల్ ధరను రూ. 335.86 నుంచి ఏకంగా రూ. 520.35కి పెంచారు. అయితే, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దానిపై విధించే లెవీని తొలగించింది. మరోవైపు బంగ్లాదేశ్లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఎల్పీజీ (ఎల్పీజీ), సీఎన్జీ (సీఎన్జీ)ధరలను 29 శాతం మేర పెంచారు.పాక్ ప్రభుత్వం ప్రకటించిన ఊరట చర్యలుపాకిస్తాన్లో ప్రజా నిరసనల సెగను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక రాయితీలను ప్రకటించిందిఉచిత ప్రయాణం: ఇస్లామాబాద్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ బస్సుల్లో 30 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.సబ్సిడీలు: సింధ్ ప్రభుత్వం మోటార్ సైకిలిస్టులకు, చిన్న రైతులకు ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది.రవాణా ఛార్జీలు: పెరిగిన ధరల భారాన్ని ప్రయాణికులపై వేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ రవాణాదారులను కోరారు.వీధుల్లోకి జనం: ‘మమ్మల్ని చంపేయండి’లాహోర్ వంటి నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ‘ప్రభుత్వం మాపై పెట్రోల్ బాంబు వేసింది. మమ్మల్ని చంపేయండి. ఈ భారాన్ని మేము భరించలేము’ అని నిరసనకారుడు నవీద్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నిరసనకారుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. ఇది కేవలం యుద్ధం వల్ల వచ్చిన ధరల పెరుగుదల కాదని, ఐఎంఎఫ్ (ఐఎంఎఫ్)ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.ముందున్నది గడ్డు కాలమే..పాకిస్తాన్ జనాభాలో దాదాపు 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంధన ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. మార్చి 28న ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రాథమిక ఒప్పందం కుదిరినప్పటికీ, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే వారాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటివే. యుద్ధం సద్దుమణగకపోతే దాయాది దేశ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.ఇది కూడా చదవండి: స్కూల్లో దెయ్యం?... పిల్లల చందాలతో గుడి కట్టి.. -
ట్రంప్ పాచిక పారేనా?
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నుంచి సులభంగా నిష్క్రమించగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లు విలువ పరంగా ఇటీవల కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.వ్యూహాత్మక ఆధిపత్యం: ఇరాన్ ఎందుకు కీలకం?గత కొంతకాలంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి గాజా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులను క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు సానుభూతి తెలుపుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల అమెరికా రక్షణ గొడుగు కిందకే చేరుతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా మారుతూ యూఎస్ ఆర్థిక ఆధిపత్యాన్ని బలపరుస్తోంది.అయితే, ఈ పూర్తిస్థాయి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది ఇరాన్, దాని ప్రాక్సీలు (హిజ్బుల్లా, హౌతీలు). హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం ద్వారా చైనా వంటి ఆసియా దేశాల ఇంధన సరఫరాను నియంత్రించే ‘ట్రంప్ కార్డ్’ అమెరికాకు ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగడం అంటే ఇరాన్ సామీప్య శక్తులకు తలవంచడమే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ ప్రతిఘటిస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడుపడడం లేదు. దాంతో యూఎస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఇరాన్లోని మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. అందుకు తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది.ఆర్థిక సంక్షోభంఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బదీస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ హెచ్చరించినట్లుగా, ఐదు దశాబ్దాల్లో ప్రపంచం చూడని అతిపెద్ద స్టాగ్ఫ్లేషనరీ ముప్పు (ఆర్థిక మందగమనం + అధిక ద్రవ్యోల్బణం) దిశగా ఈ యుద్ధం దారితీస్తోంది. మార్చి నెల జేపీ మోర్గాన్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ప్రకారం, ఇన్పుట్ ధరల ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్టానికి చేరింది. ఇది వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, చమురు, ఎరువుల సరఫరాలో అంతరాయం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్లు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రతిచర్యగా ఆర్బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.భారత మార్కెట్లు - రంగాల వారీ విశ్లేషణవిమానయానం, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు పెరిగిన ఇంధన, ముడిసరుకు ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. యుద్ధతంత్రంలో మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే భారతీయ రక్షణ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.రసాయన, సిరామిక్ రంగాల్లో కొన్ని బలహీనమైన సంస్థలు నిష్క్రమించి, పటిష్టమైన కంపెనీలకు మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది.ట్రంప్ ఏం చేయబోతున్నారు?ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంత దారుణంగా నిర్వహించినా చివరకు తనే గెలిచినట్లు ప్రకటించుకుని వైదొలిగే అవకాశం ఉంది. ఆయనకు ఓటమిని అంగీకరించే అలవాటు లేదు. యుద్ధం ముగిసినా దాని వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి ఉత్తమం.ఇదీ చదవండి: వైద్యరంగానికి ‘సహకారి’ కరవు -
ఏఐతో వ్యాక్సిన్ రెడీ.. జీవ ఆయుధాల ముప్పు తప్పదా?
ఆధునిక సాంకేతికత సాయంతో అసాధ్యం సుసాధ్యం అవుతుందని మరోసారి నిరూపితమైంది. సైన్స్ లేదా మెడిసిన్ నేపథ్యం లేని ఒక సామాన్యుడు కేవలం కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో శాస్త్రవేత్తగా మారి, తన పెంపుడు కుక్కను ప్రాణాపాయం నుండి కాపాడుకున్న వైనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.చాట్ జీపీటీతో వ్యాక్సిన్ రూపకల్పనఈ ఆసక్తికరమైన ఉదంతాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ స్వయంగా ‘మోస్ట్లీ హ్యూమన్’ పాడ్కాస్ట్లో వెల్లడించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క క్యాన్సర్తో బాధపడుతుంటే, దానిని రక్షించేందుకు చాట్ జీపీటీని ఆశ్రయించాడు. ఎటువంటి వైద్య పరిజ్ఞానం లేకపోయినా, ఏఐ టూల్ సాయంతో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సంక్లిష్టమైన ‘mRNA వ్యాక్సిన్’ను రూపొందించే విధానాన్ని అర్థం చేసుకున్నాడు.ప్రయోగం విజయవంతంవ్యాక్సిన్ తయారీకి కావాల్సిన జన్యు క్రమాలను (Genetic sequences) గుర్తించడంలో చాట్ జీపీటీ అతనికి పూర్తిస్థాయిలో మార్గనిర్దేశం చేసింది. ఒక పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేయాల్సిన పనిని అతను ఒంటరిగా ఏఐ సాయంతో పూర్తి చేయడం విశేషం. అనంతరం యూనివర్సిటీ పరిశోధకుల సహకారంతో ల్యాబ్లో ఆ వ్యాక్సిన్ను సిద్ధం చేసి, తన కుక్కకు చికిత్స అందించాడు. ఈ ప్రయోగం విజయవంతమై, ఆ మూగజీవి ప్రాణాలు నిలబడటంతో, ఇప్పుడు ఇదే పద్ధతిని ఇతర జంతువుల చికిత్స కోసం కూడా ఉపయోగించే మార్గాలను అతను అన్వేషిస్తున్నాడు.అవకాశాలు.. అంతకు మించిన ఆందోళనలుఈ విజయం ఏఐకున్న అపారమైన సామర్థ్యాన్ని చాటిచెబుతున్నప్పటికీ, దీనివల్ల కలిగే ముప్పుల గురించి కూడా చర్చ మొదలైంది. సామాన్యులు కూడా వ్యాక్సిన్లు తయారు చేయగలిగే స్థాయికి సాంకేతికత చేరితే, ఇదే పరిజ్ఞానంతో ప్రమాదకరమైన జీవ ఆయుధాలను (Biological agents) సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ విషయంలో భద్రతా పరమైన అంశాలపై సామ్ ఆల్ట్మాన్ స్పందిస్తూ.. ‘ఏఐ రెసిలియెన్స్’ (స్థితిస్థాపకత) పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేలా భద్రతా వలయాలను రూపొందించడమే కాకుండా, ఏదైనా పొరపాటు జరిగితే తక్షణమే గుర్తించి చికిత్సలు అందించేలా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: ‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్! -
యుద్ధంలో ట్విస్ట్.. ట్రంప్నకు ఇరాన్ మరో ఝలక్!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ స్పష్టంగా తిరస్కరించింది. మధ్యవర్తి దేశం పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదన పంపినప్పటికీ, టెహ్రాన్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తూ ఆ ఆఫర్ను అంగీకరించలేదు. దీంతో, యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా.. ఇరాన్ రక్షణ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇరాన్ ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా వాదనలను తప్పుబట్టింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో, మరో అమెరికా యుద్ధ విమానం కూలిపోయినట్లు వార్తలు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అలాగే, ఒక F-15E స్ట్రైక్ ఈగుల్ విమానం కూలిన ఘటనలో ఒక సిబ్బందిని రక్షించగా, మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. మొత్తంగా, ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.మరోవైపు.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై(IAEA) ఇరాన్ అణు శక్తి సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఐఏఈఏ ఖండించకపోవడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అణు శక్తి కేంద్రాలు శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నవని, వాటిపై దాడులను ఖండించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఐఏఈఏ మౌనం పాటించడం అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, దాడులు చేసిన దేశాలకు మద్దతు ఇచ్చినట్టే అని ఘాటు విమర్శలు చేసింది. ముఖ్యంగా IAEA పర్యవేక్షణలో ఉన్న కేంద్రాలపైనే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.కాగా, మార్చి 27న ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్పై జరిగిన దాడిలో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు IAEA ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ పనిచేయలేని స్థితిలో ఉందని వెల్లడించింది. ఇదే రోజు ఆర్దకాన్ ప్రాంతంలోని యెల్లోకేక్ ఉత్పత్తి కేంద్రం కూడా దాడికి గురైంది. ఈ తరహా దాడులు రేడియోధార్మిక లీకేజీకి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రాలపై దాడులు కొనసాగితే, ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, మానవీయ విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి. -
అమెరికా ఎయిర్క్రాఫ్ట్స్ కూల్చివేత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులు చేస్తోంది.. -
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది! ముందుగా నిర్దేశించిన మేరకు ఈ చమురు నౌక గుజరాత్లోని వదినార్ రేవుకు చేరాల్సి ఉంది. మూడు రోజులుగా నౌక ప్రయాణం వదినార్ వైపే సాగింది. అక్కడికి కొద్ది దూరంలో ఉండగా శుక్రవారం ఉన్నట్టుండి చైనాలోని డోంగ్యింగ్ కేసి మళ్లినట్టు నౌకల ప్రయాణాన్ని గమనించే ‘కోలా డేటా’పేర్కొంది. పింగ్ షున్ తాజాగా తన గమ్యస్థానాన్ని డోంగ్యింగ్గానే చూపుతున్నట్టు తెలిపింది. ఈ నౌక గనక భారత్ చేరితే ఏడేళ్ల అనంతరం ఇరాన్ నుంచి మన దేశానికి తొలిసారి చమురు దిగుమతి జరిగేది. ఈ నౌకలోని చమురు తాలూకు క్రయ, విక్రయదార్ల వివరాలు వెల్లడి కాలేదు. ఎస్వాతిని దేశపు జెండాతో కూడిన ఈ చమురు నౌక ఈ వారం మొదట్లో భారత్కు బయల్దేరింది. ఇప్పుడిలా సముద్ర మధ్యంలో ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు మళ్లిందన్నది తెలియాల్సి ఉంది. బహుశా చెల్లింపుల అంశమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని కోలా అభిప్రాయపడింది. ‘‘చమురు చెల్లింపులకు సరఫరా కంపెనీలు గతంలో కనీసం 30 నుంచి 60 రోజుల గడువిచ్చేవి. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు సరఫరా పూర్తిగా అడుగంటి డిమాండ్ చుక్కలనంటింది. దాంతో కంపెనీలు తక్షణ చెల్లింపులను డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముందుకొచ్చే దేశాలకే పెద్దపీట వేస్తున్నాయి’’అని పేర్కొంది. ఇరాన్ చము రును సరఫరా చేస్తోందంటూ పింగ్ షున్ నౌకపై 2025లో అమెరికా నిషేధం విధించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం తెలిసిందే. దాంతో ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై మన చమురు కంపెనీలన్నీ జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలోనే పింగ్ షున్ ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరి తాజాగా ఉన్నట్టుండి చైనా బాట పట్టింది. అయితే, చెల్లింపు సంబంధిత అంశాలు కొలిక్కి వచ్చే పక్షంలో ఈ నౌక భారత్కే వచ్చే అవకాశాలూ లేకపోలేదని ‘కోలా’లో ప్రధాన పరిశోధకునిగా పని చేస్తున్న సుమిత్ రిటోలియా చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్ల కోసం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముమ్మర పోటీకి ఈ ఉదంతం తాజా నిదర్శనమన్నారు. 2018 వరకు భారత్కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఇరాన్ కూడా ఉండేది. మన చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5 శాతం దాకా ఉండేది. 2019లో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేసింది. -
రెండు అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం.. ట్రంప్ రియాక్షన్ ఇదే..!
అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ విరుచుకపడుతోంది. ఒక రోజు వ్యవధిలోనే ఆ దేశానికి చెందిన రెండు కీలక ఫైటర్ జెట్లను టెహ్రాన్ కూల్చివేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.అమెరికా ఫైటర్ జెట్లు టార్గెట్గా ఇరాన్ దాడులు జరుపుతోంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశానికి చెందిన ఎఫ్ 15, ఎఫ్ 10 జెట్లను కూల్చివేయడంతో పాటు ఎఫ్ 35 హెలికాప్టర్పై దాడి జరిపింది. F-15 జెట్లో ఫైలట్ సైతం ఇరాన్ భూభాగంలో పడిపోగా ప్రస్తుతం ఫైలట్ కోసం ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "మనం యుద్ధంలో ఉన్నాం విమానం కూలిపోయినంత మాత్రాన ఇరాన్తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలు ఆగిపోవు. యుద్ధంలో ఇలాంటివి సహజం" అని ఆయన అన్నారు. అదే సమయంలో ఇరాన్ భూభాగంలో చిక్కుకపోయిన ఫైలట్ గాలింపు విషయమై స్పందించడానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపడానికి ఇరాన్ నిరాకరించింది. ఈ మేరకు తమ అధికారులను ఎట్టిపరిస్థితుల్లో ఇస్లామాబాద్ పంపేది లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో చర్చల ప్రయత్నానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ దాడులు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. -
అమెరికా ఆర్మీ చీఫ్పై వేటు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా 41వ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జితోపాటు మరో ఇద్దరు సైనికాధికారులపై వేటు పడింది. తక్షణమే రాజీనామా చేయాలంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వారిని ఆదేశించినట్లు పెంటగాన్ గురువారం వెల్లడించింది. అయితే, ఈ ఉద్వాసనకు కారణం ఏమిటన్నది బయటపెట్టలేదు. ర్యాండీ జార్జి జో బైడెన్ హయాంలో ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. 2023 ఆగస్టు నుంచి పదవిలో కొనసాగుతున్నారు. కనీసం నాలుగేళ్లపాటు సైన్యాధిపతిగా పనిచేయాల్సి ఉండగా, ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత పది మందికిపైగా అత్యున్నత సైనిక జనరల్స్, అడ్మిరల్స్ను తొలగించారు. అదే కోవలో ర్యాండీ జార్జిని సైతం పక్కనపెట్టినట్లు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్పై భీకర యుద్ధం జరుగుతుండగానే మరోవైపు ఆర్మీ చీఫ్ను హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్, ట్రైనింగ్ కమాండ్ చీఫ్ జనరల్ డేవిడ్ హడ్నీ, చీఫ్ ఆఫ్ కంప్లెయింట్స్ మేజర్ జనరల్ విలియమ్ గ్రీన్పైనా హెగ్సెత్ వేటు వేశారు. క్షేత్రస్థాయి యుద్ధాల్లో అనుభవం జనరల్ ర్యాండీ జార్జికి అనేక యుద్ధాల్లో క్షేత్రస్థాయిలో పాల్గొన్న అనుభవం ఉంది. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. మొదటి గల్ఫ్ యుద్ధంతోపాటు ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో ఇన్ఫాంట్రీ ఆఫీసర్గా సేవలందించారు. 2021, 2022లో అప్పటి రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ వద్ద సైనిక సహాయకుడిగా పనిచేశారు. నిజానికి 2025 ఫిబ్రవరిలోనే సైనికాధికారుల తొలగింపు మొదలైంది. తొలి విడతలో పలువురు కీలక అధికారులకు ఇంటిదారి పట్టారు. అప్పట్లో వేటు నుంచి తప్పించుకున్న ర్యాండీ జార్జి ఏడాది తర్వాత ఉద్వాసనకు గురికాక తప్పలేదు. హెగ్సెత్ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ర్యాండీ జార్జి అందించిన సేవలను కొనియాడుతూ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో కాదు.. అమెరికాలోనే ఆ మార్పు ఇరాన్లో పాలకులను మార్చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆరంభించారు. ట్రంప్ ఆశిస్తున్న ఆ మార్పు ఇరాన్లో కాకుండా అమెరికాలోనే జరుగుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్లో దాడులు ప్రారంభం కాగా, ఆ తర్వాత అమెరికాలో చాలామంది కీలక నేతలు, అధికారులు పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరిలో ట్రంప్ సన్నిహితులు కూడా ఉన్నారు. తాజాగా క్రిస్టీ నోయెమ్, పామ్ బాండీపై ట్రంప్ వేటేశారు. కీలక సైనికాధికారులు కూడా తొలగింపునకు గురయ్యారు. త్వరలోనే మరికొందరిని ఇంటికి పంపబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు లేకపోవడం ట్రంప్ను కలవరపరుస్తోంది. ఆయన పట్ల జనాదరణ తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. నూతన సైన్యాధిపతిగా క్రిస్టోఫర్ లానీవ్ జనరల్ ర్యాండీ జార్జి స్థానంలో తాత్కాలిక సైన్యాధిపతిగా జనరల్ క్రిస్టోఫర్ లానీవ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలియజేశాయి. గత ఏడాది అక్టోబర్లో క్రిస్టోఫర్ను ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ఆ సమయంలో హెగ్సెత్కు క్రిస్టోఫర్ అగ్రశ్రేణి సైనిక సహాయకుడిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం టూ–స్టార్ జనరల్ హోదా కలిగిన క్రిస్టోఫర్ ఇప్పుడు సైన్యాధిపతిగా పదోన్నతి పొందడం విశేషం. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా సైన్యం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వేలాది మెరైన్లతోపాటు 82వ ఎయిర్బార్న్ డివిజన్ ట్రూపర్లు పశ్చిమాసియా దిశగా కదులుతున్నారు.అటార్నీ జనరల్ పామ్ బాండీకి ఉద్వాసన అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీని అధ్యక్షుడు ట్రంప్ పదవి నుంచి తొలగించారు. తన పాలనను గట్టిగా సమరి్థంచే దీర్ఘకాల స్నేహితురాలిపై అకస్మాత్తుగా వేటు వేశారు. బాండీ పనితీరు పట్ల ట్రంప్ కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్స్టీన్ ఫైల్స్ ఉదంతంలో తనపై దర్యాప్తు విషయంలో ఆమె సరిగ్గా వ్యవహరించలేదని ట్రంప్ భావిస్తున్నారు. బాండీ స్థానంలో టాడ్ బ్రాంచ్ను ఏజీగా నియమించారు. తన ఉద్వాసనపై బాండీ స్పందించారు. ‘‘ఏజీ పదవి లభించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ట్రంప్కు, ఆయన ప్రభుత్వానికి సేవలు అందిస్తూనే ఉంటా’’ అని తెలిపారు. గత నెలలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్టీ నోయెమ్నూ ట్రంప్ తొలగించారు. -
కువైట్లో ప్రధాన చమురు కేంద్రంపై... ఇరాన్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీగా దాడులు కొనసాగించింది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లో ఒక నీటి శుద్ధి కేంద్రంపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. దానికి భారీ నష్టమే వాటిల్లినట్టు సమాచారం. బహ్రెయిన్లోనూ నిర్విరామంగా సైరన్లు మోతలు విన్పించాయి. పలు డ్రోన్లను అడ్డుకుని నేలకూల్చినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. యూఏఈలో కూడా ఒక చమురు క్షేత్రానికి మంటలు అంటుకున్నాయి. దాంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ నౌకపైనా దాడులు! అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహంలింకన్ యుద్ధ నౌకపైనా భారీగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. సౌదీలోని పాటు అలీ అల్ సలేం డ్రోన్ స్థావరంపై కూడా బాంబుల వర్షం కురిపించినట్టు పేర్కొంది. అమెరికా తమ విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే యూఏఈలో అమెరికాకు చెందిన కీలకమైన స్టార్గేట్ ఏఐ సెంటర్ను నేలమట్టం చేసేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లో అమెజాన్, ఒరాకిల్ వంటి పలు టెక్ దిగ్గజ కంపెనీల కార్యాలయాలపై ఇరాన్ ఇప్పటికే దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో రాపిడ్ సెంట్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. -
రెండు ఫైటర్ జెట్ల కూల్చివేత
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఒక్క రోజే రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోయింది. ఇరాక్లో ఒక బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా కోల్పోయినట్టు సమాచారం! అత్యాధునిక ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను తమ గగనతలంపై కూల్చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఎఫ్–35 పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్టేనని పేర్కొంది. ఎఫ్–15ఇ పైలట్తో పాటు గన్నర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం. వారు ఇరాన్ భూభాగంపై సురక్షితంగా దిగినట్టు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. దాంతో వారిని కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కమాండో దళాలు, బంధించేందుకు ఇరాన్ సైన్యాలు ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగాయి. వారిలో ఒకరిని అమెరికా దళాలు సురక్షితంగా కాపాడి ఇరాన్ బయటికి తరలించినట్టు ఇజ్రాయెల్కు చెందిన చానల్ 12 పేర్కొంది. రెండో వ్యక్తి విషయమై గందరగోళం నెలకొంది. అతను ఇప్పటికే ఐఆర్జీసీకి చిక్కినట్టు ఇరాన్కు చెందిన టాస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. అదేమీ లేదని, అతన్ని కూడా కాపాడేందుకు అమెరికా ప్రత్యేక దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ కూడా సదరు ‘అమెరికా సైనికుడు’కనిపించిన వెంటనే కాల్చేయాల్సిందిగా స్థానిక ప్రజలకు పిలుపునిచ్చింది. కాసేపటికే, ‘‘అతన్ని ప్రాణాలతో పోలీసులకు పట్టించండి. అందుకు భారీ బహుమానం కూడా ఉంటుంది’’అంటూ ప్రకటించింది! రెస్క్యూ ఆపరేషన్లో బాగంగా ఘటనా స్థలిపై అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అమెరికా యుద్ధ విమానం తాలూకు శకలాలను ఇరాన్ సైన్యం ట్రక్కుల్లో తరలిస్తున్న దృశ్యాలు ఇరాన్ వార్తా చానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. మరోవైపు అమెరికాకు చెందిన యూహెచ్–60 బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా ఇరాక్లో నేలకూల్చినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాక్ వర్గాలను ఉటంకిస్తూ టాస్నిం వార్తా సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. ఎఫ్–15ఇ యుద్ధ విమానం కూల్చివేత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నివేదించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలిపారు. ఎఫ్–35, బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా కోల్పోయామన్న వార్తలపై మాత్రం అమెరికా అధికారికంగా స్పందించలేదు. ఒక్కో విమానం రూ. 940 కోట్లు! ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు సైనికంగానే గాక ఆర్థికంగా కూడా ఎదురు దెబ్బే. ఇవి ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు. ఒక్కదాని ఖరీదు 10 కోట్ల డాలర్ల (రూ.940 కోట్ల) దాకా ఉంటుంది! ఎఫ్–35 యుద్ధ విమానాన్ని శుక్రవారం ఉదయమే సెంట్రల్ ఇరాన్లో కూల్చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ అధునాతన డిఫెన్స్ సిస్టం దన్నుతో అత్యంత కచ్చితత్వంతో పని పూర్తి చేసినట్టు పేర్కొంది. సదరు విమానం లాకెన్హీత్ స్క్వాడ్రన్కు చెందినదని కూడా తెలిపింది. ‘‘మా దాడిలో విమానం పూర్తిగా దెబ్బ తిని కుప్పకూలింది. పైలట్ సురక్షితంగా బయట పడే అవకాశం లేనట్టే’’అని చెప్పుకొచ్చింది. మార్చి 19న కూడా ఒక అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం తెలిసిందే. దాంతో ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే రెండు ఎఫ్–35లను నష్టపోయింది. ఇక ఎఫ్–15ఇ యుద్ధ విమానం దక్షిణ ఇరాన్లోని పర్వతమయ కోహ్కిలోయే, బోయర్–అహ్మద్ ప్రాంతంలో నేలకూలినట్టు సమాచారం. ఇది రాజదాని టెహ్రాన్కు 500 కి.మీ. దూరంలో ఉంటుంది. పొరుగునున్న చహర్మహల్, భక్తియారీ ప్రావిన్స్లో కూడా శత్రు పైలట్ కోసం వెదకాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. యుద్ధంలోకి ఇరానీ బాలలు బాలలను కూడా ఇరాన్ యుద్ధ రంగంలోకి పంపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘12 ఏళ్ల పసివాళ్లకు కూడా రివల్యూషనరీ గార్డ్, బసిజ్ ఫోర్స్ తదితర విభాగాల్లో చేర్చుకుంది. వారి చేతికి ఆయుధాన్నిచ్చి కీలక ప్రాంతాల్లో పహారా విధుల్లో నియమించింది’’ అని పేర్కొంది.మొసాద్ భవనం ధ్వంసంఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం నాటి దాడుల్లో నేలమట్టం చేసినట్టు ఇరాన్ పేర్కొంది. టెల్ అవీవ్లో మంటల్లో కాలిపోతున్న భవనం తాలూకు ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ విడుదల చేసింది. దానిపై ఇరాన్ సైన్యం అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడి జరిపినట్టు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు.జోర్డాన్లోనూ అమెరికా యుద్ధ విమానాలపై దాడిజోర్డాన్లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా యుద్ధ విమానాలపై భారీగా దాడులు జరిపినట్టు ఇరాన్ ప్రకటించింది. గురువారం రాత్రి వాటిపై డ్రోన్లతో విరుచుకుపడ్డట్టు పేర్కొంది. ఈ దాడిలో విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందీ వెల్లడించలేదు. అమెరికా నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. యూఎస్ రాడార్ ధ్వంసం! ఇరాన్ దాడుల్లో అత్యంత ఖరీదైన ఏఎన్/టీపీవై–2 రాడార్ను అమెరికా నష్టపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఇ–3 విమానం, మరో రీ ఫ్యూయలింగ్ విమానంతో పాటు ఈ రాడార్ కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ రాడార్ అభివృద్ధికి అమెరికా 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,200 కోట్లు) వెచ్చించింది. భారతీయులకు గాయాలు అబుదాబిలోని అజ్బాన్ ప్రాంతంలో సహజవాయు క్షేత్రంపై ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు దిగింది. వాటి శకలాలు తగిలి ఐదుగురు భారతీయులు, ఆరుగురు నేపాలీలు స్వల్పంగా గాయపడ్డారు. మరో నేపాలీ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు అబుదాబి మీడియా ఎక్స్ పోస్టులో వెల్లడించింది. రంగంలోకి జెరాల్డ్ ఫోర్డ్ అమెరికా విమానవాహక యుద్ధ నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ యుద్ధ విధుల్లో చేరినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మార్చిలో జరిగిన అగ్నిప్రమాదంలో నౌక పాక్షికంగా దెబ్బ తినడం తెలిసిందే. దాంతో మరమ్మతుల నిమిత్తం దాన్ని గ్రీస్కు తరలించారు. హార్మూజ్ దాటిన ఫ్రెంచి నౌక ఫ్రాన్స్కు చెందిన ఒక కంటైనర్ నౌక శుక్రవారం హార్మూజ్ జలసంధిని దాటింది! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జలసంధిని దాటిన తొలి యూరప్ నౌకగా ఇది నిలిచింది. ఇరాన్లో బ్రిడ్జి పేల్చివేత ఉత్తర ఇరాన్లో అల్బోర్జ్ ప్రావిన్స్లోని కరాజ్లో నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జిపై అమెరికా, ఇజ్రాయెల్ రెండు దఫాలుగా దాడులు జరిపాయి. దాంతో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బ తింది. ఎనిమిది మంది మరణించారు. ఇందుకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని కీలక బ్రిడ్జిలను నేలమట్టం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే 8 బ్రిడ్జిలను హిట్లిస్ట్లో చేర్చినట్టు ప్రకటించింది. వీటిలో షేక్ జబార్ అల్ అహ్మద్ సీ బ్రిడ్జి (కువైట్), కింగ్ ఫాద్ కాజ్వే (సౌదీ–బహ్రెయిన్ లింక్), షేక్ జాయేద్ బ్రిడ్జ్, షేక్ ఖలీఫా, బ్రిడ్జి (యూఏఈ); కింగ్ హుసేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దౌన్ బ్రిడ్జ్ (జోర్డాన్) ఉన్నాయి. బ్రిడ్జిపై దాడి తాలూకు వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. ‘‘సమయం మించిపోకముందే తమతో ఒప్పందానికి రండి. లేదంటే ఇలాంటి భారీ దాడులను మరింతగా చవిచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఇరాన్ను హెచ్చరించారు. -
USA సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు
ఇరాన్తో దాడులు తీవ్రతరమైన వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్ స్టాప్ జనరల్ రాండీ జార్జ్ను పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే అతని తొలగింపుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.పశ్చిమాసియా యుద్ధం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం భీకర దాడులు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం అమెరికా బలగాలు పెద్దఎత్తున మధ్య ప్రాచ్యంలో మోహరించబడ్డాయి. ఇంత ఉద్రిక్తతల నడుమ ఆ దేశ ఆర్మీ చీఫ్ను తొలగిస్తూ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన పదవి నుండి తప్పుకున్నారు.అయితే 2024 ఆగస్టులో పదవి బాధ్యతలు చేప్టటిన రాండీ జార్జ్ పదవికాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఉంది. అయితే రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పీట్స్ హెగెత్ భారీ స్థాయిలో ప్రక్షాళనలు చేపడుతున్నారు. గత సంవత్సరం డజనుకు పైగా కీలక అధికారులను పదవి నుంచి తొలగించారు. కాగా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా ప్రస్తుతం యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో ఒక దేశ ఆర్మీ చీఫ్ను పదవినుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంమైంది. ఇరాన్పై అమెరికా భూతల దాడులు చేపట్టనుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. -
పాక్కు షాక్.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్
ఇరాన్ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇస్లామాబాద్లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం వెనక్కి తగ్గట్లేదుకాగా పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
F-15 జెట్ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్?
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఆందోళనకరంగా మారింది.నైరుతి ఇరాన్ ప్రాంతంలో (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్టాఫిక్గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అమెరికా వాదన ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం తెలిపినట్లు వైట్హౌస్ కథనాలు పేర్కొన్నాయి.ఇరాన్ వాదన అయితే జెట్ కూల్చివేతతో ఇరాన్లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఢాకా: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ఈ మేరకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగ్లాదేశ్లో ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశం 95 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరగడం, సరఫరా అస్థిరత పెరగడం వల్ల ప్రభుత్వం కఠినమైన ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని కేబినెట్ 180 రోజుల మితవ్యయ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, కొత్త వాహనాలు లేదా కంప్యూటర్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అధికారుల విదేశీ ప్రయాణాలను 50 శాతం తగ్గించడం, సమావేశాలు, సదస్సుల ఖర్చులను పరిమితం చేయడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల్లో అలంకార లైటింగ్ నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భారతదేశం ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేసింది. మరిన్ని సరఫరాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ముందుగానే మూసివేయడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా తగ్గిన సమయానికి పరిమితం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించనున్నాయి.మొత్తం మీద, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినమైన మితవ్యయ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, దీర్ఘకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. -
‘ఫ్రాడ్ జార్’ గా జేడీ వాన్స్..!
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏది చేసినా వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ప్రజల ఆగ్రహానికి గురౌవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్ను ఫ్రాడ్ జార్గా నియమించారు. అమెరికా ప్రభుత్వంలో పెద్దగా యాక్టివ్గా లేని జేడీ వాన్స్కు కావాలనే ఈ పదవి కట్టబెట్టారా? అనే చర్చ నడుస్తుంది.అయితే సాధారణంగా అమెరికాలో ఉపాధ్యక్షుడు, మంత్రి వర్గంలో సభ్యునిగా ఉన్న వ్యక్తికి ఈ పదవిని ఇస్తూ ఉంటారు. విశ్వసనీయ రాజకీయ నాయకుడిగా ఉన్న వారికి కూడా ఈ పదవిని అప్పగిస్తారు. ఫెడరల్ స్థాయిలో మోసాలపై దర్యాప్తు, పర్యవేక్షణ, చర్యలు తీసుకునే అధికారం ఫ్రాడ్ జార్కే ఉంటాయి. ఇవి ప్రత్యేక బాధ్యతలుగా చెబుతూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ను ఈ పదవిలో ప్రకటించడం వెనుక ఆంతర్యం రాజకీయపరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికాలో మోసపూర్వక లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రధానంగా డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడమేనని చర్చ నడుస్తోంది.ఈ పదవిని వాన్స్కు ఇవ్వడం ద్వారా డెమోక్రాటిక్ రాష్ట్రాల్లో అవినీతి, మోసాలు ఎక్కువగా ఉన్నాయనే సందేశం పంపడమే కాకుండా, ఇది ఆయన మద్దతు దారులకు కూడా తాము అవినీతిని అరికడతామనే సంకేతాలు కూడా పంపినట్లయ్యింది.ఇది వాన్స్కు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుంది, కానీ పార్టీ ఆధారిత లక్ష్యాలు ఉన్నాయనే విమర్శలు రావచ్చు.ట్రంప్ ప్రభుత్వానికి ఇది అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నామని బలమైన సంకేతం ఇవ్వొచ్చు కానీ రాజకీయ ఆయుధంగా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. డెమోక్రాటిక్ రాష్ట్రాలు ఇది ఫెడరల్ జోక్యంగా భావించి, చట్టపరమైన–రాజకీయ పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. -
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్ పైలెట్లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్ (IRGC) ప్రకటించింది. అమెరికా వెంటనే సెర్చ్ పార్టీలను పంపి పైలెట్లను వెతికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటనపై అమెరికా అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు, కానీ ఇరాన్ మీడియా ప్రచారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.అదే సమయంలో, ఇరాన్ గగనతలంపై అమెరికా అపాచీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ వర్గాలు ఈ హెలికాప్టర్లను టార్గెట్ చేశామని పేర్కొంటున్నాయి. మరోవైపు, అమెరికా రీ-ఫ్యూయెలింగ్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్-అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న సంకేతాలుగా భావించబడుతున్నాయి.ఈ సంఘటనలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత పొందలేదు. స్వతంత్ర ధృవీకరణ లేకపోవడంతో, ఇరాన్ ప్రకటనలు ప్రచార యుద్ధంలో భాగమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ఈ వార్తలు పశ్చిమాసియా భద్రతా పరిస్థితులను కుదిపేస్తూ, అమెరికా-ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పాకిస్తాన్ మొత్తం షట్డౌన్ కాబోతోందా?
ప్రస్తుతం మళ్ళీ 'లాక్డౌన్' అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్డౌన్ లాంటిది కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా మరియు అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? లాక్ డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్ డౌన్ లో పడ్డ కష్టాలు అటువంటివి మరి. అయితే మళ్ళీ మనం లాక్ డౌన్ లోకి వెళ్ళనున్నామా.. పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కాని ఈ సారి ఈ లాక్ డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో రానుంది. అసలు అక్కడ లాక్డౌన్ ఆలోచన వెనుక ఉన్న ప్రధాన కారణం 'ఇంధన కొరత'. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే, బయట దేశాల నుండి పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వారి దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే, దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి 'స్మార్ట్ లాక్డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తదితర ఉన్నతాధికారులు ఇటీవలే ఒక కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను , వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని వారు ప్రతిపాదించారు. అంటే పాకిస్తాన్లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేసేట్టుగా చూడాలి అని తీర్మానం చేశారు. అలాగే కార్యాలయాలకు వారంలో 5 రోజులు కాకుండా, కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు అలాగే విద్యుత్ వినియోగం తగ్గుతుందని వారి ప్లాన్.పాకిస్తాన్ లోని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాకిస్తాన్లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు (రాష్ట్రాలు) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ , సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేశాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో "కంప్లీట్ వీకెండ్ లాక్డౌన్" విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీనిని ఖండించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్డౌన్ లేదు. కేవలం పొదుపు చర్యలు (Austerity Measures) మాత్రమే అమల్లో ఉన్నాయి. ఫేక్ న్యూస్ని నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ఏ నిమిషమైనా లాక్ డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ఒక పక్క లాక్డౌన్ భయం, మరోపక్క ఆకాశాన్ని తాకుతున్న ధరలు. పాకిస్తాన్లో సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గోధుమ పిండి నుండి పప్పుల వరకు ప్రతి వస్తువు ధర రెండింతలు పెరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్డౌన్ విధిస్తే అది "పుండు మీద కారం చల్లినట్లు" అవుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మెరుగుపడాలంటే ఐఎంఎఫ్ (IMF) నుండి మరో విడత రుణం రావడం చాలా ముఖ్యం. కానీ ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులు సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ యుద్ధం గనుక మరింత ముదిరితే, చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని మూసివేయాల్సి రావచ్చు.మొత్తానికి చూస్తే, పాకిస్తాన్ ప్రస్తుతం ఒక "ఎకనామిక్ లాక్డౌన్"లో ఉంది. అధికారికంగా షాపులు తెరిచి ఉన్నా, కొనే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నా, అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఒక్క పాకిస్తాన్ కే కాదు మనకూ ఓ హెచ్చరికే.అప్పుడెప్పుడో కరోనా వేల కిలోమీటర్ల అవతల ఉంది మనకేం కాదులే అనుకున్న క్షణం పట్టలేదు కరోనా అనే మహమ్మారి మన పై విరుచుకుపడి లాక్ డౌన్ లోకి రోజుల్లో తీసుకువెళ్ళిపోయింది. మరి ఇప్పుడూ కరోనా కన్నా ప్రమాదమైన యుద్ధం క్షణక్షణం ఉత్కంఠతతో ఏ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపనుందో అర్ధం కాని పరిస్థితి. లాక్ డౌన్ అనేది మన లోగిలిలోకి రాకూడదని గట్టిగా అనుకుందాం ప్రార్ధిద్దాం. -
భూమిపై ఏలియన్స్ దాడి చేయబోతున్నాయా?
చీకటి పడితే మనం ఆకాశం వైపు చూస్తాం.. ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో ఏలియన్స్ ఉంటాయని, ఏదో ఒకరోజు అవి భూమిపైకి వస్తాయని మనం నమ్ముతాం. కానీ, ఒకవేళ ఆ ఏలియన్స్ రాక వెనుక ఉన్నది అంతరిక్ష జీవులు కాకుండా.. మన మధ్యే తిరుగుతున్న మనుషులు అయితే? మన కళ్లను మనమే నమ్మలేనంత భయంకరమైన ఒక 'ఫేక్ ఏలియన్ ఇన్వేషన్' (నకిలీ గ్రహాంతరవాసుల దాడి) జరగబోతోందా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజిల్బ్లోయర్ డాక్టర్ స్టీవెన్ గ్రీర్ బాంబు లాంటి నిజం పేల్చారు. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి 'డీప్ స్టేట్' పన్నిన అతిపెద్ద కుట్రను ఆయన బయటపెట్టారు. సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే మనం చూడబోయేది సినిమా కాదు, మానవ చరిత్రలోనే అతిపెద్ద మోసం!ముందుగా ఎవరీ స్టీవెన్ గ్రీర్ ఓ సారి చూద్దాం. అమెరికా ప్రభుత్వంలోని అత్యంత రహస్యమైన 'బ్లాక్ బడ్జెట్' ప్రాజెక్టుల గుట్టు విప్పిన వ్యక్తి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే చర్చ పక్కన పెడితే.. ఏలియన్స్ పేరుతో మనుషులను ఎలా భయపెట్టబోతున్నారో ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఆయన హెచ్చరిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వింత కాంతులు, గ్రహాంతర నౌకలు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. ఇది హాలీవుడ్ గ్రాఫిక్స్ కాదు.. అంతకంటే కొన్ని వందల ఏళ్లు ముందున్న సాంకేతికత! ఈ కుట్రను 'ప్రొజెక్ట్ బ్లూ బీమ్' అని పిలుస్తారు. దీని వెనుక ఉన్నది గ్రహాంతరవాసులు కాదు.. వాషింగ్టన్, లాంగ్లీ , గ్లోబలిస్ట్ కేంద్రాల్లో దాగి ఉన్న శక్తులు. వారు గత కొన్ని దశాబ్దాలుగా విరిగిపోయిన UFOల నుండి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వింత టెక్నాలజీని సంపాదించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనపైనే వాడబోతున్నారు. హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా ఆకాశంలో భారీ గ్రహాంతర నౌకలను సృష్టిస్తారు. అవి 100 శాతం నిజమైనవిగా కనిపిస్తాయి. అంతేకాదు, వారి దగ్గర ఉన్న 'యాంటీ గ్రావిటీ' విమానాలు సైనిక అధికారులను కూడా తికమక పెడతాయి. ఏంటి ఆశ్చర్యపోయారా...అయితే మీరు విన్నది నిజమే! కేవలం నౌకలే కాదు.. కృత్రిమంగా ల్యాబ్లలో తయారు చేసిన ఏలియన్ లాంటి జీవులను కూడా వారు రంగంలోకి దించవచ్చు. వీటిని చూసిన సామాన్య ప్రజలు అది నిజంగానే అన్యగ్రహ జీవుల దాడి అని నమ్ముతారు. గాల్లో నుండి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత భాషలు మనిషి మెదడును స్తంభింపజేస్తాయి. గ్రీర్ మాటల్లో చెప్పాలంటే.. "మన భూమిపై ఒక నకిలీ దాడిని సృష్టించే సామర్థ్యం వారికి ఉంది. అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు? సమాధానం చాలా సింపుల్.. అది 'అపరిమితమైన అధికారం'. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చావు భయం గురిచేసి, "మాకు రక్షణ కావాలి" అని వారు బ్రతిమిలాడేలా చేయడం. అప్పుడు, దేశాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసి, ఒకే ప్రపంచ ప్రభుత్వం (One World Government) ఏర్పాటు చేస్తారు. మీ ప్రతి కదలికపై నిఘా ఉంచుతారు. దేశాల సార్వభౌమాధికారం అంతమైపోతుంది. శాంతి పేరుతో మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారు.గత 20-30 ఏళ్లుగా సినిమాల్లో, వార్తల్లో UFOల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఒక పెద్ద 'సైకలాజికల్ ఆపరేషన్' (Psyop). ప్రజల మనసులను ఏలియన్స్ దాడికి మానసికంగా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ నాటకంలో చివరి అంకం మొదలైంది. ఆకాశంలో కాంతులు కనిపిస్తే, లేజర్ ఆయుధాలు మన నగరాలను నాశనం చేస్తుంటే.. మనం సైలెంట్గా లొంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి.. ఆ దాడి చేస్తున్నది నక్షత్రాల నుండి వచ్చిన వారు కాదు, మన భూమిపై ఉన్న కుట్రదారులు!గ్రీర్ హెచ్చరిక ఒక్కటే.. అప్రమత్తంగా ఉండండి. అసలైన శత్రువు అంతరిక్షంలో లేడు, వాడు మన కళ్ల ముందే అధికార పీఠాల్లో కూర్చుని ఉన్నాడు. వారు మన భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మోసం మీ కళ్ల ముందు జరగబోతోంది. మీరు దానిని నమ్ముతారా? లేక నిజం తెలుసుకుని ఎదురు నిలుస్తారా?వచ్చే కొన్ని ఏళ్లలో ఆకాశంలో వింతలు జరిగితే.. అద్భుతం అని మురిసిపోకండి, అది ఒక మృత్యుపాశం కావొచ్చు. గ్రీర్ బయటపెట్టిన ఈ నిజాలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.చీకటిని చూసి భయపడకండి.. వెలుగు వెనుక ఉన్న నీడను చూసి భయపడండి! -
చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం
చైనా తాజాగా చేసిన భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) గోబీ ఎడారిలోని జియుక్వాన్ సెంటర్ నుంచి ప్రయోగించిన టియాన్లాంగ్-3 రాకెట్ మధ్యలో లోపం రావడంతో మిషన్ విఫలమైంది. ఇది స్పేస్ ఎక్స్ (SpaceX Falcon 9) స్టార్లింక్కు పోటీగా పోటీగా అభివృద్ధి చేసిన చైనాలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడాన్ని ధృవీకరించింది. తాము ప్రయోగించిన టియాన్లాంగ్-3 రాకెట్ ప్రయోగం విఫలమైందని పేర్కొంది.టియాన్లాంగ్-3ను చైనా Starlink వంటి ఇంటర్నెట్ శాటిలైట్ మెగా-కాన్స్టెల్లేషన్లను ఏర్పాటు చేయడానికి కీలకంగా భావించింది. SpaceX Falcon 9కి ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది విఫలం కావడం చైనాలోని ప్రైవేట్ స్పేస్ రంగానికి పెద్ద దెబ్బ, ముఖ్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులలో ఆలస్యం అవుతుంది.ప్రయోగం వివరాలురాకెట్ పేరు: టియాన్లాంగ్-3అభివృద్ధి సంస్థ: బీజింగ్ ఆధారిత స్టార్టప్ స్పేస్ పయినీర్ప్రయోగ స్థలం: జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్, గోబీ ఎడారిప్రయోగ సమయం: ఏప్రిల్ 3, 2026, మధ్యాహ్నం 12:17 (స్థానిక సమయం)లోపం: మధ్యలో “flight anomaly” కారణంగా రాకెట్ విఫలమైంది -
లీటర్ పెట్రోల్ రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.లీటర్ పెట్రోల్ ధర రూ. 458ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.మన పరిస్థితి మెరుగ్గా ఉందిఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్ ఆఫ్రిది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలిఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్కు శుభవార్త -
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్రెన్ను వివాహం చేసుకుంది. యు, యుచెన్ (రెన్రెన్) ఈ మార్చిలో పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్)ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్ తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో పదేళ్ల రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!వీరిద్దరి పరిచయం ఎలా2025లో లైవ్ స్ట్రీమింగ్లో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు. ఈ పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.నెటిజన్లు స్సందన మల్టీ మిలియన్ డాలర్ల డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా, ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.యు వెన్హాంగ్ సక్సెస్ స్టోరీసామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్కాంగ్లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లతో విస్తరించింది.వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. -
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 1000 మంది మృతి!
జెరూసలేం: లెబనాన్పై ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో లెబనాన్పై జరిపిన దాడుల్లో దాదాపు 1000 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. లెబనాన్లో దాదాపు 3,500కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా స్పందిస్తూ..‘లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అన్ని ప్రధాన కేంద్రాలపై దాడులు జరిగాయి. వైమానికి, సముద్ర, భూ మార్గాల ద్వారా దాడులు చేశాం. దక్షిణ లెబనాన్లో ఐడీఎఫ్ దృఢ నిశ్చయంతో పనిచేస్తోంది. 91వ, 146వ, 36వ, మరియు 162వ డివిజన్లు దక్షిణ లెబనాన్లో లక్షిత కార్యకలాపాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం జరిగింది. అలాగే, ఉగ్రవాదులను నిర్మూలించడంతో పాటు, ఆ సంస్థకు సంబంధించిన సామర్థ్యాలను మరింత దెబ్బతీసి, దానిని ఆ ప్రాంతం నుండి తరిమివేసేందుకు ఒక కేంద్రీకృత భూతల ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాయి.ఇప్పటివరకు, అనేక మంది సీనియర్ కమాండర్లు, వందలాది మంది రద్వాన్ ఫోర్స్ కార్యకర్తలతో సహా సుమారు 1,000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లెబనాన్ వ్యాప్తంగా 3,500కు పైగా ఉగ్రవాద లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ సౌకర్యాలు, ప్రయోగ స్థానాలు, కమాండ్ అండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయాలపై కేంద్రీకరించబడ్డాయి.IDF Clearing Homes in Lebanon pic.twitter.com/pTcG4KWWGq— War Archive Clips (@WarArchiveClips) April 2, 2026దీనికి అదనంగా, లెబనాన్లో సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థగా పనిచేస్తూ, పౌర నిధులను దుర్వినియోగం చేస్తూ, హెబ్జొల్లా ఉగ్రవాద సంస్థకు నిధులు ఇరాన్ నుంచి సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బు అందుకునే ఆర్థిక సంస్థ అయిన “అల్-ఖార్ద్ అల్-హసన్” అసోసియేషన్ కీలక ఆస్తులు, ఆర్థిక నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్కు ఆయుధాలు, శత్రు బలగాలను తరలించడానికి ఉపయోగించే ఐదు ప్రధాన వంతెనలను కూల్చివేశాం. ఈ దాడులు ఉగ్రవాద సంస్థ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి’ అని తెలిపారు. -
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను, పశ్చిమ నగరమైన కరాజ్తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారంఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.పారిశ్రామిక హబ్లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.దేశ ప్రగతికి నిదర్శనాలుభారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్కు ఎంతో కీలకం.ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్వే’?ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ఈస్ట్లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! -
భారత్కు రష్యా గుడ్ న్యూస్
ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్ర తరం చేసింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికా దాడులు.. ఇరాన్లో కూలిన అతి పెద్ద వంతెన
పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం సృష్టిస్తోంది. ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి.ఇరాన్ను రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామంటూ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే.. మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.దాడి జరిగిన ప్రాంతంలో భారీ పొగ అలుముకుంది. వంతెన కూలిపోవడాన్ని చూపే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమ నగరం కరాజ్తో అనుసంధానించేలా నిర్మితమవుతున్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయి’’ అంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలని ఆయన హెచ్చరించారు.అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో తామే విజయం సాధించామని చెప్పుకుంటున్న ట్రంప్.. అమెరికా సైనిక చర్య టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని ధ్వంసం చేసిందన్నారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్పై అత్యంత కఠినంగా దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ఆయన మరోసారి బెదిరింపులకు దిగారు. మన శత్రువులు ఓడిపోతున్నారు. గత ఐదేళ్లుగా నా అధ్యక్షతన అమెరికా సాధించిన విజయాల కంటే ఇప్పుడు మరింత భారీ విజయాన్ని నమోదు చేస్తోంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
అమెరికాలో సంచలనం.. ఆర్మీ సైన్యాధిపతి తొలగింపు!
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో, అమెరికాలో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది. యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.వివరాల మేరకు.. అమెరికా ఆర్మీలోని అత్యున్నత స్థాయి అధికారి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు మీడియాలో కథనాలు తెలిపాయి. తక్షణమే పదవీవిరమణ చేయాలని హెగ్సెత్ ర్యాండీకి తెలిపినట్టు వెల్లడించాయి. కాగా, ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఇలాంటి ఎందుకు తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే, అమెరికా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గతేడాది యద్ధశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొన్నప్పటినుంచి.. డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్ను, అడ్మిరల్స్ను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. ఈ క్రమంలో 2023లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న జార్జ్ను తాజాగా తొలగించారు. ఇక, పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, అఫ్గానిస్థాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాడు జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాఫ్ ఛైర్మన్గా ఉన్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్పై ట్రంప్ వేటు వేశారు. అప్పటినుంచి ఉన్నతస్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో తొలగింపుల నుంచి జార్జ్ బయటపడగా.. తాజాగా పదవి నుంచి దిగిపోవాలని హెగ్సెత్ ఆయన్ను కోరారు. -
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. కాగా, నెల రోజుల వ్యవధిలో పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది రెండోసారి.తాజాగా పెరిగిన ధరల ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458.40 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అలాగే, డీజిల్ ధర లీటరుకు 520.35 పాకిస్తానీ రూపాయలకు వెళ్లింది. ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో డీజిల్పై 54.9%, పెట్రోల్పై 42.7% పెంపు విధించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, ఈ ధరలు పాకిస్తాన్ చరిత్రలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్పందిస్తూ..‘అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమని అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరి అయ్యింది’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను కారణంగా చూపుతూ గత నెలలోనే పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20% పెంచిన సంగతి తెలిసిందే. ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై మరింత భారం మోపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈల నుండి హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #BREAKING : WAR CRISIS ARRIVE IN PAKISTAN:Pakistan announces near 50% spike in fuel prices; long queues at pumps.42.7% increase in petrol54.9% increase in dieselPetrol up $0.49Diesel $0.66#IranWar #Iran #Dubai #ısrael #usa #Saudi #iraq #TelAvivBlast #middleeastunrest… pic.twitter.com/Z80zYCFSWd— The Globe & News (@TheGlobeNewt) April 2, 2026 -
ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను ఆపాలంటూ ఆయన పిలుపునిచ్చారు.'నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయన్న ఐరాస చీఫ్.. తాను సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. ఈ ప్రయత్నాలకు మద్దతుగా తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్ట్ను ఈ ప్రాంతానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులను ఖండించడమే కాకుండా.. హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ఆంటోనియో పునరుద్ఘాటించారు.నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన హెచ్చరించారు. మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని.. ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని.. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. -
హార్మూజ్పై బ్రిటన్ సమావేశం
లండన్: అంతర్జాతీయ నౌకాయాన రంగంలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్షంగా గుత్తాధిపత్యం సాధించి నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బ్రిటన్ కన్నెర్రజేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గళం విప్పేందుకు, దేశాల మధ్య ఐక్యత సాధించేందుకు బ్రిటన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా గురువారం ఏకంగా 40కిపైగా దేశాలతో వర్చువల్ భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. భేటీలో బ్రిటన్ విదేశాంగ శాఖ మహిళా కార్యదర్శి యూవెట్టీ కూపర్ ఇరాన్పై నిప్పులు చెరిగారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగించే దురుద్దేశంతో ఇరాన్ హార్మూజ్ను గుప్పిటపట్టింది. దానిని ఎలాగైనా మనం తెరిపించాల్సిందే. గల్ఫ్ ప్రాంతం గుండా నౌకాయానానికి మార్గం సుగమం చేసేందుకు సమష్టిగా పోరాడేందుకు ఈ భేటీని ఒక వేదికగా మార్చుకుందాం. ఇరాన్పై దౌత్య, రాజకీయ మార్గాల్లో తీవ్రంగా ఒత్తిడి చేసి హార్మూజ్ను తెరిపిద్దాం. లేదంటే పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది’’అని కూపర్ ఆవేదన వ్యక్తంచేశారు. సైనికచర్య ద్వారా హార్మూజ్ను తెరవొచ్చని అమెరికా భావించడం అసంబద్దంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. ‘‘హార్మూజ్ ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్ మొదట్నుంచీ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హార్మూజ్ గుండా వాణిజ్యం మొదలుకావాలి’’అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ వ్యాఖ్యానించారు. బిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, కెనడా, జపాన్, యూఏఈ తదితర 40కిపైగా దేశాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. -
ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్లపై క్షిపణుల వాన
దుబాయ్/టెహ్రాన్/ఇస్లామాబాద్: ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాల అంతమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఆరంభించిన పశ్చిమాసియా యుద్ధం హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో కొత్త మలుపు తీసుకుని ఇప్పుడు అతి క్షిపణుల ప్రయోగాలతో మరింత ఉధృతమైంది. దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో సమాధానం చెబుతోంది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై గురువారం సైతం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అగ్రనాయకత్వాన్ని అంతమొందించినా ఇరాన్ తన శక్తిసామర్థ్యాలతో హార్మూజ్ను ఇంకా గుప్పిటపట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. దీంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ఎన్నడూలేనంత భీకరంగా దాడి చేసి హార్మూజ్ను మేం హస్తగతం చేసుకోగలం.కానీ అమెరికా ఒంటరిగా అలా చేయాలని అనుకోవట్లేదు. హార్మూజ్పై ఆధారపడిన దేశాలన్నీ ఇప్పటికైనా ధైర్యం కూడదీసుకుని,కలసికట్టుగా రణరంగంలోకి దూకండి. హార్మూజ్ను చేజిక్కించుకోండి’’అని పిలుపునిచ్చారు. అపార ఆయుధ సంపత్తి మా సొంతంఇస్ఫహాన్ సమీప క్షిపణి నిల్వ కేంద్రంపై అమెరికా దాడులుచేసింది. నిల్వకేంద్రంలో భారీగా పేలుళ్లు జరిగాయి. కొన్ని నిమిషాలపాట ఆగకుండా నిల్వకేంద్రం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కరాజ్, టెహ్రాన్ నగరాలపైనా అమెరికా దాడులను కొనసాగించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ(81) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య చనిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను ఉధృతంచేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చేపనిలో పడ్డామని ఇజ్రాయెల్ తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ స్థావరంపై ఇరాన్ దాడులుచేసింది. యూఏఈపై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 19 క్షిపణులు, 26 డ్రోన్లను నేలమట్టంచేశామని యూఏఈ తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది. ‘‘అపార ఆయుధ సంపత్తి మా సొంతం. మీరు ఇప్పటిదాకా దాడిచేసినవి మా అసలైన స్థావరాలు కావు. అవి ఎక్కడున్నాయో మీ నిఘా వర్గాలకు కనీసం అవగాహన కూడా లేదు. మాపై ఎంతగా బాంబుల వర్షం కురిపించి నష్టం చేకూర్చినా ఇంకా ఎంతో మందుగుండు, ఆయుధ నిల్వలున్నాయి’’అని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఘరీ అన్నారు. 70 లక్షల మంది సిద్ధం... అమెరికా భూతల దాడులకు దిగితే వారిని మా గడ్డ మీదనే అంతంచేసేందుకు 70 లక్షల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలీబాహ్ హెచ్చరించారు. ఇరాన్ జనాభా 9 కోట్లు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని ఇరాన్ ప్రభుత్వం విస్తృతస్తాయిలో ప్రచారంచేస్తోందని వార్తలొచ్చాయి. -
త్వరలోనే ఖేల్ ఖతం
వాషింగ్టన్: ఇరాన్లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయని, తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పని పూర్తి చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. ట్రంప్ బుధవారం రాత్రి జాతినుద్దేశించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్–టైమ్ ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిందని అన్నారు. తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువే సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్ గుర్తుచేశారు అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. అయితే, ఇరాన్పై భూతల దాడుల గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైనా స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్నిరోజులుగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. హార్మూజ్ను స్వాధీనం చేసుకోండి ‘‘అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్పై పోరు 32 రోజులకు చేరింది. ఈ యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు సంవత్సరాలపాటు కొనసాగాయి. ఇరాక్ యుద్ధభూమిలో అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. ఇరాన్లోని యురేనియం స్వా«దీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్ అణు కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణు ధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వ్రస్తాల ఆలోచన చేస్తే క్షిపణులతో చావుదెబ్బ కొడతాం. హార్మూజ్ విషయంలో ప్రపంచదేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్లి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలి. ఈ యుద్ధం.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి నా అధ్యక్ష పదవీకాలంలో గత ఐదేళ్లుగా అమెరికా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనట్టి ఘన విజయం సాధించబోతున్నాం. అమెరికాతోపాటు ప్రపంచ భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ క్యూరీ ప్రారంభించాం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాంటి ఆయుధాలు ఉండడం మనకు భరించలేని ముప్పు అవుతుంది. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. అయినా సరే అక్కడ అణ్వాయుధ కార్యకలాపాలు ఆగడం లేదు. మరోచోట అణు కేంద్రాలు నిర్మించాలని చూస్తున్నారు. అణ్వాయుధాలపై ఇరాన్కు ఆశలు చావడం లేదు. నేరుగా అమెరికా భూభాగంపై దాడిచేసేలా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోంది. ఇరాన్పై యుద్ధంతో అమెరికాకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అమెరికా మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది మీ పిల్లలు, మీ మనవళ్ల భవిష్యత్తు కోసం పెడుతున్న నిజమైన పెట్టుబడి’’అని ట్రంప్ తమ దేశ పౌరులకు తేల్చిచెప్పారు. అమెరికన్లకు అంత ఓపిక ఉందా? ఇరాన్పై యుద్ధం కొనసాగించడానికి అమెరికా ప్రజలకు ఓపిక ఉందో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. బుధవారం వైట్హౌస్లో ఈస్టర్ విందు కార్యక్రమంలో అతిథులతో ఆయన ముచ్చటించారు. ఇరాన్ చమురును అత్యంత సులభంగా స్వా«దీనం చేసుకోగల సత్తా అమెరికాకు ఉందని చెప్పారు. కానీ, అలాంటి ప్రయత్నం పట్ల అమెరికన్లలో తగినంత సహనం ఉన్నట్లు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ఇరాన్ చమురును తీసుకురావడానికే తాను ఇష్టపడుతున్నానని తెలిపారు. కానీ, తమ ప్రజలు మాత్రం ఇరాన్లో గెలిచేసి, ఇంటికి తిరిగి రండి అంటున్నారని విమర్శించారు. వారే అలా అంటే ఇక తాను చేసేది ఏముంటుందని నిర్వేదం వ్యక్తంచేశారు. నాటో ఒకకాగితం పులి హార్మూజ్ను తెరిపించడానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చొరవ తీసుకోవాలని ట్రంప్ సూచించారు. కొన్ని ఆసియా దేశాలు అమెరికా చమురు కంటే గల్ఫ్ చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటో కూటమిని సైతం దూషించారు. అందులో పనికిమాలిన భాగస్వామ్య దేశాలు ఉన్నాయని మండిపడ్డారు. నాటో ఒక పేపర్ టైగర్ అంటూ ఎద్దేవా చేశారు. నాటోతో తమకు అవసరం లేదని, తమ అవసరమే వారికి ఉంటుందని తేల్చిచెప్పారు. అసలు అమెరికా లేకపోతే నాటో పట్టుకొచ్చేదా? అని ప్రశ్నించారు. ఈస్టర్ విందులో ట్రంప్ మాట్లాడిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల
వాషింగ్టన్: అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల అయ్యాయి. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వేలపేజీల రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ రహస్య పత్రాలను అమెరికా డీవోజే(డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్) బహిర్గతం చేసింది. పారదర్శకత కోసమే ఫైళ్లు విడుదల చేశామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎఫ్బీఐ ఇంటర్వ్యూలు, గ్రాండ్ జ్యూరీ కీలక సాక్ష్యాలు బయటపడ్డాయి. తద్వారా 2008 నాటి వివాదాస్పద ఒప్పందాల వెనక ఉన్న రహస్యాలపై ఉత్కంఠ నెలకొనగా, ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాగా, ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ .. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది.ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.మరోవైపు ట్రంప్ -ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు గతంలోనే బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. మరి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఈ ఫైళ్లలో ఏముందో, ఏమౌతుందో అనే ఆసక్తి నెలకొంది. -
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్తో కలిసి జపాన్లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.బ్రెజిల్ పాస్పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు?కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్లో విభిన్న జాతుల ప్రజలు నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులుకిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్పోర్ట్తో టోక్యో డిస్నీల్యాండ్కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by im just culture (@imjustculture) -
శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది: ఇరాన్
టెహ్రాన్: వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖతమ్ అల్ అన్బియా ప్రకటించింది. ఇరాన్ను అణిచివేసి.. రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి, డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్కు ఏమీ తెలియదంటూ ఖాతమ్ అల్-అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు."మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను నాశనం చేశామని అనుకోవద్దు. అటువంటి అంచనాలు మీరు చిక్కుకున్న ఊబిని మరింత లోతుగా చేస్తాయి. మీరు దెబ్బతీశామని భావిస్తున్న ప్రాంతాలు చాలా స్వల్పమైనవి. మా వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి మీకు తెలియని.. మీరు చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఇరాన్ పేర్కొంది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ.. ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు.. భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్ అల్-అన్బియా ప్రతినిధి హెచ్చరించారు. -
రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్మొదలు పెట్టిన యుద్ధం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మరోసారి అణుదాడి ముప్పు ఉండబోతోందా అన్న ఆందోళన ప్రపంచాన్ని పటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఆయన జీవితం నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం.రెండు విధ్వంసాలనుంచి (1916–2010) మృత్యువును జయించిన ధీశాలి సుటోము యమగుచి (Tsutomu Yamaguchi). ఈయన కథ నిజంగా అద్భుతం. జపాన్కు చెందిన ఒక ఇంజనీర్, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా , నాగసాకి (1945) లో జరిగిన రెండు అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు. ఆగస్టు 6న హిరోషిమాలో బాంబు పేలుడుకు గురై గాయపడిన ఆయన, స్వస్థలమైన నాగసాకికి వెళ్లిపోవాలని ఆరాటపడ్డాడు. కానీ మళ్లీ మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు. సుటోము యమగుచి జీవితం ఒక రకంగా అత్యంత దురదృష్టకరమైనది. మరో విధంగా గొప్ప అదృష్టం. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో, అమెరికా జపాన్పై ఆగస్టు 6, 1945న అణుబాండుదాడులు చేసింది. ఆగస్టు 6న మిత్సుబిషి కంపెనీ ఇంజనీర్గా యమగుచి తన విధినిర్వహణలో భాగంగా హిరోషిమాలో ఉన్నారు. సరిగ్గా ఆయన తిరిగి వెళ్ళే సమయానికి అమెరికా (హిరోషిమా)'లిటిల్ బాయ్' బాంబును ప్రయోగించింది. పేలుడు కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చర్మం కాలిపోయింది, వినికిడి శక్తి దెబ్బతింది. వణుకుతూ, ఒక వైమానిక దాడి ఆశ్రయంలో ఆ భయంకర మైన రాత్రి గడిపాడు. అయినా ప్రాణాలతో బయటపడి, మరుసటి రోజే తన స్వస్థలమైన నాగసాకికి చేరుకున్నారు.ఆగస్టు 9న నాగసాకిలో తన కార్యాలయంలో కూర్చుని, హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి తన పైఅధికారికి వివరిస్తున్నారు.అతని బాస్ అతణ్ని నమ్మలేదు. అతిగా స్పందిస్తున్నాడని యమగుచిని నిందించాడు. ఒక్క బాంబు నగరాన్ని ఎలా నాశనం చేస్తుంది? అని ఆ అధికారి అడుగు తూండగానే, రెండో బాంబు 'ఫ్యాట్ మ్యాన్' నాగసాకిపై పడింది.రెండోసారి కూడా యమగుచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం విశేషం. ఈ రెండు అణుదాడుల్లో నుంచి ప్రాణాలతో బయటపడినట్లు అధికారికంగా గుర్తించబడిన ఏకైక వ్యక్తి ఆయనే. 2009లో జపాన్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా 'ద్విగుణ బాంబు బాధితుడిగా' (Double Hibakusha) గుర్తించింది. యుద్ధం తర్వాత ఆయన, జ్వరాలు, వాంతులు, రేడియేషన్ ప్రభా, అనారోగ్యంతో చాలా కాలం బాధపడ్డారు. కుడి చేయి శాశ్వతంగా దెబ్బతింది. అతను ఒక చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాడు. కానీ ఆయన మనోధైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. కానీ బతికినంత కాలంలో రేడియేషన్ ప్రభావంతో బాధపడినప్పటికీ, ఆయన 93 ఏళ్లు జీవించారు. 2010లో, 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు.జీవితంలో ఎక్కువ కాలం ఈ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఆయన, తన చివరి దశలో ప్రపంచానికి అణు ఆయుధాల ప్రమాదాన్ని వివరించాలని నిర్ణయించుకున్నారు. అణు ఆయుధాల ప్రభావానికి సజీవ సాక్ష్యం తాను అంటూ ప్రపంచ మానవాళిని హెచ్చరించారు. "నా కథను ప్రపంచానికి చెప్పడానికే నేను బతికున్నాను" అని ఆయన తరచూ అనేవారు. కాగా రెండు అత్యంత విధ్వంసకరమైన బాధల్ని అనుభవించి, దాన్నుంచి అంతే సాహసంగా బయటపడి, భవిష్యత్తుకోసం బలాన్ని కూడగట్టుకున్న ఒక సాధారణ ఇంజనీర్ కథ. యుద్ధం తెచ్చే విధ్వంసం అందులోనూ అణ్వాయుధాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో యమగుచి జీవితం కళ్లముందుంచింది. -
పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రకటనవీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్ ఎంబసీ స్పష్టం చేసింది.ఎవరిపై ప్రభావం?ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.ఎందుకీ నిర్ణయంఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదనమరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది! -
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఇరాన్లో ఇంకేం సాధించాల్సి ఉంది?: ఆస్ట్రేలియా ప్రధాని
కాన్బెర్రా: ఇరాన్లో సాధించాల్సింది ఇంకేముందంటూ అమెరికాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశ్నించారు. ‘‘ఇరాన్ సంఘర్షణలో నిర్దేశించుకున్న ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని.. ఇకపై అక్కడ సాధించాల్సింది ఏముందో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది’ అంటూ అల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు.రాజధాని కాన్బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరో రెండు మూడు వారాల పాటు అత్యంత కఠినమైన దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో అల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
ఎ‘వరెస్ట్’ స్కామ్: టూరిస్టులకు ‘విషం’ ఇచ్చి..
ఖాట్మండు: ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలని ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్రమైన వంచనకు గురవుతున్నారు. కొందరు గైడ్లు, హెలికాప్టర్ సంస్థలు కలిసి, పర్యాటకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పర్యాటకులకు తెలియకుండా వారి ఆహారంలో విషం కలిపి, ఆపై అత్యవసర రెస్క్యూ పేరుతో సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 167 కోట్లు) ఇన్సూరెన్స్ స్కామ్కు పాల్పడిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే...నేపాల్లో ట్రెకింగ్ చేసే పర్యాటకుల భోజనంలో గైడ్లు ఉద్దేశపూర్వకంగా ‘బేకింగ్ సోడా’ కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్ల పర్యాటకులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవుతాయి. ఇది చూసి పర్యాటకులు తమకు ‘ఆల్టిట్యూడ్ సిక్నెస్’ (ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యం) వచ్చిందని భ్రమపడతారు. వెంటనే గైడ్లు వారిని భయపెట్టి, అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించాలని ఒత్తిడి చేస్తారు.వందల కోట్ల దోపిడీ ఇలా..ఈ కుట్రలో ట్రెకింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రులు ఒక మాఫియాగా ఏర్పడ్డాయి. పర్యాటకులకు చికిత్స చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేటుగాళ్లు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి నేపాల్ పోలీసులు ఇప్పటివరకు 32 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ కంపెనీ యజమానులు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 11.3 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. నేపాల్ టూరిజం రంగంలో ఇలాంటి స్కామ్లు పెరిగిపోతుండటంతో, ఇప్పటికే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ ట్రెక్కర్లకు కవరేజీ ఇవ్వడం నిలిపివేశాయి. ఇది కూడా చదవండి: భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి -
‘ఇవే మా లక్ష్యాలు.. పవర్ఫుల్ స్పీచ్లో ట్రంప్ చెప్పారు’
వాషింగ్టన్: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తమ దేశ లక్ష్యాలను స్పష్టంగా తెలిపిందని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఆ లక్ష్యాలు.. ‘ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయడం, వారి నౌకాదళాన్ని నాశనం చేయడం, వారి వైమానిక దళాన్ని నాశనం చేయడం, ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా అవకాశాలను నాశనం చేయడం’ అని అన్నారు.“మా అధ్యక్షుడి నాయకత్వం ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతోంది. అదే.. అమెరికా తన ప్రజలను, తన ప్రయోజనాలను రక్షించుకుంటుంది. అమెరికా తన శక్తి ద్వారా శాంతి కొనసాగేలా చేస్తుంది” అని రుబియో పేర్కొన్నారు.కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్తో చేసుకున్న ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేదని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారని తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉందని, ఆ దేశాన్ని అణ్వాయుధ దేశంగా మారనివ్వనని అన్నారు. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు.డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇచ్చిన స్పీచ్ను స్వయంగా వినడానికి పలువురు ప్రముఖులు రావడం గమనార్హం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ తో పాటు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు వచ్చారు. ట్రంప్ స్పీచ్ను ప్రపంచం ఆసక్తికరంగా విన్నది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. మరో రెండు-మూడు వారాలు దాడులు కొనసాగుతాయని చెప్పారు. -
అక్కడ శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం మరో 2-3 వారాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. -
చందమామ దిశగా.. దూసుకెళ్లిన ఆర్టీమిస్–2
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదూర గ్రహాలను అందుకునేందుకు జాబిల్లిని కేంద్రంగా చేసుకోవాలన్న లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్–2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన, 32 అంతస్తుల ఎత్తైన, ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’తో కూడిన ‘ఓరియన్’ రాకెట్.. నింగిలోకి దూసుకుపోయింది.ఇక, ‘ఓరియన్’ రాకెట్.. చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి రానుంది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు పది రోజులపాటు రాకెట్లోనే ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులను పంపించే మార్గం సుగమం అవుతుంది. ఈ ఈ ప్రయోగం ద్వారా అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్ వైస్మ్యాన్(కమాండర్), విక్టర్ గ్లోవర్(పైలట్), క్రిస్టినా కూచ్(మహిళా మిషన్ స్పెషలిస్ట్), జెరిమీ హాన్సెన్లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహా సముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు.Liftoff.The Artemis II mission launched from @NASAKennedy at 6:35pm ET (2235 UTC), propelling four astronauts on a journey around the Moon.Artemis II will pave the way for future Moon landings, as well as the next giant leap — astronauts on Mars. pic.twitter.com/ENQA4RTqAc— NASA (@NASA) April 1, 2026రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్లో పయనించారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చినా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. 🚨🇺🇸 This animation reveals NASA’s full Artemis II flight path, a nearly 685,000-mile journey that traces a giant figure-eight from Earth, swings far around the Moon’s far side.pic.twitter.com/GiIj9QQJkF https://t.co/RRRn3UhXuY— Mario Nawfal (@MarioNawfal) April 1, 2026 -
ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తూర్పు ఇండోనేషియాలోని టెర్నేట్ నగరం సమీపంలో ఉత్తర మొలుక్కా సముద్రంలో గురువారం సంభవించిన భారీ భూకంపం పెను ప్రకంపనలు సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్సీఎస్) వెల్లడించింది. 🚨🇮🇩#BREAKING | NEWS ⚠️Watch as a building violently shakes with objects falling onto the ground after a major 7.8⚡️Magnitude Earthquake has struck in Indonesia a tsunami warning was issued for Malaysia🇲🇾 and the Philippines🇵🇭 pic.twitter.com/wGGaTlRUJe— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) April 1, 2026సముద్ర మట్టానికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ద్వీపాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ హెచ్చరికల విభాగం హెచ్చరించింది. సముద్ర అలలు సాధారణ స్థాయి కంటే 0.3 మీటర్ల నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. టెర్నేట్, టిడోర్ తదితర నగరాల్లో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని (ఎవాక్యూషన్) సూచించింది. భూకంప ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నట్లు స్థానిక 'మెట్రో టీవీ' దృశ్యాలను ప్రసారం చేసింది. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. జపాన్, గ్వామ్, పాపువా న్యూగినియా, తైవాన్ తీరాల్లోనూ స్వల్ప స్థాయిలోఅలలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. -
బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నేతలను అంతం చేశామని అన్నారు. బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయని చెప్పారు. ఇరాన్ ఆయుధ కర్మాగారాలను ముక్కలు ముక్కలు చేశామని తెలిపారు. ఇరాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాద ఇరాన్పై తాము యుద్ధాన్ని ప్రకటించామని అన్నారు. వెనెజువెలాలో కూడా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. ‘ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ 45 వేల మంది నిరసకారులను చంపేసింది. అమెరికా భద్రత కోసమే ఎపిక్ ప్యూరీ. ఇరాన్లో శవాల దిబ్బలే మిగిలాయి. బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ నేవీ, ఎయిర్ఫోర్స్లను దెబ్బతీశాం’ అని అన్నారు. ఒబామా చేయలేనిది చేశాను..అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్లో చేయలేనిది తాను చేశానని ట్రంప్ అన్నారు. ‘ఇరాన్తో ఒబామా ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేది. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉంది. ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మారనివ్వను. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా లక్ష్యం. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ను నమ్మలేం. అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రక్షణ కవచం కుప్పకూలింది. ఇరాన్ క్షిపణులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం. ఇరాన్ను రాతియుగానికి తీసుకెళ్తాం. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా టార్గెట్.అమెరికా సైనికులు 13 మంది మరణించారు. యుద్ధాలు వద్దన్నాను.. కానీ, అమెరికా భద్రత కోసం చేయకతప్పలేదు. ఆపరేషన్ ఎపిక్ప్యూరీ సక్సెస్ అవుతోంది. ఇరాన్లో పాలన మార్చడం మా లక్ష్యం కాదు. హార్మూజ్ జలసంధి మాకు అవసరం లేదు. రెండు-మూడు వారాల్లో భీకరదాడులు చేస్తాం. కీలక లక్ష్యాలను పూర్తి చేసే పనిలో ఉన్నాం. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఇరాన్ మిసైళ్లు అమెరికాను తాకలేవు. నా పాలనలో ఎన్నో విజయాలు సాధించాం. మేము అమెరికాను శక్తిమంతమైన దేశంగా మార్చుతున్నాం’ చెప్పారు. -
ట్రంప్ బాల్రూమ్ ప్రాజెక్ట్కు కోర్టు బ్రేక్
వాషింగ్టన్: తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకుంటున్న బాల్రూమ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 400 మిలియన్ డాలర్ల విలువైన బాల్రూమ్ నిర్మాణం కోసం వైట్హౌస్ తూర్పు భాగాన్ని కూల్చివేయడాన్ని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా పనులు చేపట్టాన్ని వాషింగ్టన్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రిచర్డ్ లియోన్ తప్పుపట్టారు. పనులు తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ బాల్రూమ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ‘నేషనల్ ట్రస్టు ఫర్ హిస్టోరిక్ ప్రిజర్వేషన్’గ్రూప్ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జడ్జి రిచర్డ్ లియోన్ విచారణ చేపట్టారు. ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు వైట్హౌస్ సంరక్షకుడు మాత్రమేనని, ఆ భవనానికి యజమాని కాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. భవిష్యత్తులో వైట్హౌస్లోకి రాబోయే అధ్యక్షుడి కుటుంబాల కోసం ఆ భవనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు పదవిలో ఉన్న అధ్యక్షుడిపై ఉందన్నారు. అయితే, కోర్టు నిర్ణయం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా జడ్జి ఉత్తర్వును సవాలు చేస్తూ న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయడానికి శ్వేతసౌధం నోటీసు ఇచ్చింది. వైట్హౌస్ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించామని, వాటికి కాంగ్రెస్ నుంచి ఆమోదం లేదని ట్రంప్ చెప్పారు. ఆయా కట్టడాలకు లేని అభ్యంతరం బాల్రూమ్కు ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేట్ విరాళాలతో నిర్మిస్తున్న భవనాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. కోర్టు ఉత్తర్వుతో సంబంధం లేకుండా బాల్రూమ్ కింద భూగర్భంలో బంకర్తోపాటు ఇతర భద్రతాపరమైన పనులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. బాల్రూమ్ ప్రాజెక్టు పట్ల ట్రంప్ అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ సంస్థల నుంచి, ప్రజల నుంచి నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 90,000 చదరపు అడుగుల బాల్రూమ్ నిర్మాణం కోసం వైట్హౌస్ ప్రాంగణంలోని ఈస్ట్ వింగ్ను కూల్చేశారు. 1945లో హ్యారీ ఎస్.ట్రూమ్యాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్హౌస్ దక్షిణ భాగంలో బాల్కనీ నిర్మించారు. -
త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! యూఎస్ఎస్ జార్జి డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్ బాట పట్టినట్టు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ సైట్లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు. -
ఒప్పందం చేసుకోండి.. ట్రంప్ అసహానానికి గురవుతున్నారు: జేడీవాన్స్
ఇరాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. -
యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు
లండన్: ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది. -
యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్ సెంటర్పై ఇరాన్ దాడి?
ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్లోని అమెజాన్ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. ఇరాన్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.కాగా మరోవైపు, ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది -
యుద్ధంలోకి నేరుగా గల్ఫ్ దేశం?
మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా గల్ఫ్ దేశం నేరుగా యుద్ధంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. హార్మూజ్ జలసంధిపై మూసివేతతో వాణిజ్య సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యుఏఈ నేరుగా యుద్ధంలోకి దిగేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు.ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి సైనిక చర్య చేపట్టాలని UAE నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని బహ్రెయిన్తో కలిసి యూఏఈ పావులు కదుపుతోన్నట్లు వాల్స్ట్రీట్ జనరల్ కథనం పేర్కొంది.హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించడంతో పాటు అక్కడ సైనిక పహారా కాయడానికి ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకవేళ యుఏఈ యుద్ధంలో దిగితే ఆ అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నమెుదటి గల్ఫ్ దేశంగా నిలుస్తోంది. టెహ్రాన్ను ఎదుర్కోవడానికి తమ దేశం ముఖ్యమైన దేశాలతో కొత్త పొత్తులను నిర్మిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన తరువాత యూఏఈ యుద్ధంలోకి దిగుతుందని ప్రచారం జరుగుతుంది. -
కాల్పుల విరమణ కోరిన ఇరాన్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాత పాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంత నయం. హర్మూజ్ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం. హర్మూజ్ తెరిచే వరకు ఇరాన్పై దాడులు కొనసాగిస్తాం. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం.. వారు అన్నట్లుగానే తిరిగి రాతి యుగానికి పంపిస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణ కోరలేదని.. ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా ప్రజల నుండి కూడా యుద్ధానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది. యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధి తెరిచే వరకు దాడులు ఆపబోమని తాజాగా హెచ్చరించడం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది. -
‘నాటో’కు ట్రంప్ బిగ్షాక్!
వాషింగ్టన్: నాటో భాగస్వామ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నాటో దేశాల కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన యుద్ధ చర్యలకు నాటో దేశాలు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని బ్రిటన్ మీడియా సంస్థ డైలీ టెలిగ్రాఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన నాటోను ‘కాగితపు పులి’గా అభివర్ణించారు. ‘అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అన్నది మళ్లీ ఆలోచించే స్థితి దాటి పోయింది. నాటో విశ్వసనీయతపై నాకు ఎప్పటినుంచో సందేహాలున్నాయి. నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వారు కాగితపు పులి అని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.అమెరికా నాటో నుంచి బయటకు వస్తే, అది నాటోకు భారీ దెబ్బ అవుతుంది. ప్రస్తుతం అమెరికా నాటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 70 శాతం వంతు భారం మోస్తోంది. అలాగే అత్యధిక సైనిక శక్తి, అణు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తోంది. అమెరికా లేకుండా నాటో బలహీనమై, యూరప్ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రంప్నకు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ షాక్ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్ అన్నారు.‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి...మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
ఇరాక్లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. వీడియో వైరల్
ఇరాక్లో అమెరికన్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్(Shelly Kittleson) కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న ఓ ఇరాకీ సాయుధ ముఠా బాగ్దాద్లో అమెరికన్ జర్నలిస్ట్ను కిడ్నాప్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రాంతీయ భద్రత క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిటెల్సన్ ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సిరియా, ఇరాక్, లెబనాన్ నుంచి ఆమె విస్తృతంగా వార్తా కథనాలను అందించారు. ఆమెను విడిపించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది.కిడ్నాప్తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూప్ ‘కతైబ్ హెజ్బల్లా’కు చెందిన వ్యక్తిని ఇరాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సహాయ కార్యదర్శి డైలాన్ జాన్సన్ తెలిపారు. నిందితులు పారిపోయే క్రమంలో వాహనం బోల్తా పడటంతో ఇరాక్ భద్రతా దళాలు ఒకరిని అరెస్ట్ చేశాయి. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కిటెల్సన్ రోమ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఇరాక్, సిరియాలోని తెగల మధ్య సంబంధాలు, యుద్ధ ప్రాంతాలపై ఆమెకు లోతైన అవగాహన ఉంది. ఆమె కిడ్నాప్పై 'అల్-మోానిటర్' సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాగ్దాద్ వీధుల్లో నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీటీవి దృశ్యాల ద్వారా వెలుగులోకి వచ్చింది.ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాక్ ప్రభుత్వానికి, అక్కడి ఇరాన్ అనుకూల మిలిటెంట్లకు మధ్య ఘర్షణలు పెరిగాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాక్లో అమెరికన్లకు ముప్పు పెరిగిందని అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2023లో కూడా విద్యావేత్త ఎలిజబెత్ త్సుర్కోవ్ను కిడ్నాప్ చేసి రెండేళ్లపాటు బందీగా ఉంచారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికన్లు, జర్నలిస్టులు ఇరాక్లో అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.🚨🇺🇸🇮🇶BREAKING: The Iraqi government confirms: American freelance journalist Shelly Kittleson, who works for Al-Monitor, has been kidnapped from central Baghdad. https://t.co/VJ8IZqet90 pic.twitter.com/wExlXh0BDY— Eli Afriat 🇮🇱 (@EliAfriatISR) March 31, 2026 -
Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు
కన్యాకుమారి/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు, కన్యాకుమారికి చెందిన సుమారు 600 మంది మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశాయి. స్వదేశంలో నెలల తరబడి చెమటోడ్చినా దక్కని ఆదాయం, అక్కడ కేవలం పది రోజుల్లోనే చేతికి అందేది. ఆ ఆశే వారిని ఏడు సముద్రాలు దాటించి, ఇరాన్ తీరానికి చేర్చింది. అయితే నేడు అక్కడ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇరాన్లోని బుషెహర్, దాని పరిసర తీర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ‘స్క్రోల్ ఇన్’కు ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం గత ఫిబ్రవరిలో ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ మరణించిన తర్వాత మొదలైన వైమానిక దాడులు, బాంబుల వర్షం.. ఇరాన్లోని మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం తిండి, నీరు, కనీస వైద్యం అందక పడవలపైనే కాలం వెళ్లదీస్తున్న వీరి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.ఒకే సిమ్ కార్డు.. 12 మంది వినియోగంకన్యాకుమారిలోని మత్స్యకార కుటుంబానికి చెందిన షాజీ.. ఇరాన్లో చిక్కుకున్న భర్త రవికుమార్ నుంచి వచ్చే ఫోను కోసం నిత్యం ఎదురు చూస్తుంటుంది. ఇరాన్లో చిక్కుకున్న బాధితుల వద్ద కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా కరువయ్యాయి. రవికుమార్తో పాటు మరో 12 మంది కలిసి కేవలం ఒకే ఒక్క సిమ్ కార్డును వాడుతున్నారు. ‘బాంబుల శబ్దంతో నిద్ర పట్టడం లేదు.. ఆహారం నిండుకుంది’ అని వారు ఫోన్లో చెబుతుంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎటు నుంచి క్షిపణులు వస్తాయో తెలియని స్థితిలో మత్స్యకారులు కాలం వెళ్లదీస్తున్నారని ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపారుఅప్పుల ఊబిలో కుటుంబాలుతమ వారిని క్షేమంగా తిరిగి భారత్ రప్పించేందుకు ఇక్కడి మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాయి. మేరీ రాజ్ అనే మహిళ తన 20 ఏళ్ల కుమారుని ఉపాధి కోసం తన ఒంటి మీద ఉన్న నగలను తాకట్టు పెట్టి, రూ.1.5 లక్షలు అప్పు చేసింది. విదేశాల్లో బాగా సంపాదిస్తారని అక్కడికి పంపిస్తే, ఇప్పుడు ప్రాణాలతో కుమారుడు వస్తే చాలని మేరా రాజ్ దేవుడిని వేడుకుంటోంది.అక్కడి సౌకర్యాలే శాపమయ్యాయా?భారతదేశంలో చేపల వేట తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో మత్స్యకారులు ఇరాన్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇరాన్లో అనారోగ్యానికి గురైతే హెలికాప్టర్లు పంపే స్థాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం కారణంగా అక్కడి యజమానులు కూడా చేతులెత్తేస్తున్నారు. మత్స్యకారుల పాస్పోర్టులు యజమానుల వద్దే ఉండటం, భాష తెలియకపోవడం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంపాదన ఆశ చూపి తీసుకెళ్లిన యజమానులు ఇప్పుడు భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేయడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది.ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనయుద్ధ ప్రాంతం నుంచి విద్యార్థులను తరలించిన కేంద్ర ప్రభుత్వం, సముద్రం మధ్యలో చిక్కుకున్న మత్స్యకారుల విషయంలో అలసత్వం వహిస్తోందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోలాహలంలో ఉన్న అధికారులు, ఈ నిరుపేద మత్స్యకారుల గోడును పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న తమ వారిని కాపాడాలని కన్యాకుమారి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత -
టార్గెట్ ఇరాన్.. నెతన్యాహు కొత్త కూటమి ప్రకటన
జెరూసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు వ్యతిరేకంగా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అయితే, కూటమిలో దేశాల పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా ప్రసంగిస్తూ.. ఇరాన్ వ్యతిరేకంగా కొత్త ప్రాంతీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇజ్రాయెల్ పక్కనే ఉన్న దేశాలు సహా పలు దేశాలతో కొత్త కూటములు కుదుర్చుకుంటున్నాం. త్వరలోనే ఈ ఒప్పందాల గురించి మరింత వివరంగా చెబుతాను. కచ్చితంగా ఆ కూటమి.. ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం కూటమిలో ఉన్న దేశాల పేర్లను వెల్లడించలేదు. అయితే.. ఇరాన్ సైనిక, అణు ఆశయాలపై ఉన్న ఉమ్మడి ఆందోళనల కారణంగా ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని నెతన్యాహు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇక, యుద్ధరంగంలో సాధించిన ప్రధాన విజయాల నేపథ్యంలో, ఈ సంప్రదింపులను ఒక విస్తృత వ్యూహంలో భాగంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ‘మేము గట్టిగా దెబ్బకొట్టి, రెండు అస్తిత్వ ముప్పులను దూరం చేశాము’ అని నెతన్యాహు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్లు అటువంటి ఆయుధాలను ఉత్పత్తి చేసే ఇరాన్ పారిశ్రామిక సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీశాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో, టెహ్రాన్లో దీర్ఘకాలిక మార్పు వస్తుందని అంచనా వేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఇరాన్ పాలన పతనమవుతుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజా పరిణామాలుఇజ్రాయెల్–అరబ్ సహకారం: ఇరాన్ అణు ప్రణాళికలు మరియు ప్రాంతీయ ప్రభావం కారణంగా, ఇజ్రాయెల్ కొన్ని అరబ్ దేశాలతో కొత్త భద్రతా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.ఉగాండా భాగస్వామ్యం: "ఎంటెబ్బే అలయన్స్" పేరుతో ఉగాండా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ వ్యతిరేకంగా నిలబడుతోంది. ఇది 1976లో జరిగిన ఎంటెబ్బే ఆపరేషన్ చరిత్రను తలపిస్తోంది.కూటమి లక్ష్యాలుఇరాన్ అణు ప్రణాళికలను అడ్డుకోవడంహెజ్బుల్లా, హౌతీలు వంటి ఇరాన్ మిత్ర బలగాలను ఎదుర్కోవడంప్రాంతీయ భద్రతా సమీకరణలో ఇజ్రాయెల్ స్థానం బలపరచడంప్రతికూలతలు..ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే అవకాశంచమురు సరఫరా అంతరాయం వల్ల గ్లోబల్ ఆర్థిక సంక్షోభంఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయెల్ మరియు మిత్ర దేశాలపై పెరగడం -
ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు
టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమి నుంచి అందుతున్న మృతుల గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ఇరాన్: మరణాల హోరుయుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల సంస్థ ‘హర్నా’ లెక్కల ప్రకారం, ఇక్కడ ఇప్పటివరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా, కనీసం 236 మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900 గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేస్తోంది. యాక్టివ్ వార్ జోన్ కావడంతో అసలు మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు..యుద్ధం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదులెబనాన్: ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో 1,268 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 124 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు కూడా హతమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు ఇండోనేషియా యూఎన్ శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు.ఇరాక్: ఇక్కడ పౌరులు, మిలిషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు.గల్ఫ్ దేశాలు: యుద్ధం సెగ గల్ఫ్ దేశాలకూ తగిలింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈలో 10 మంది, కువైట్లో ఏడుగురు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్ తదితర ప్రాంతాలుఇటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిస్సైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్లో 19 మంది పౌరులు, సరిహద్దు పోరులో 10 మంది సైనికులు మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్లో ఇరాన్ మిస్సైల్ పడి నలుగురు పాలస్తీనా మహిళలు మృతి చెందగా, సిరియాలో మరో నలుగురు బలయ్యారు. ఇరాక్లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు, ఛిద్రమైన ఎన్నో కుటుంబాల గాథలు. యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో ఈ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. -
క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్కు చైనా ఝలక్?
బీజింగ్: తమ దేశానికి రావాల్సిన మూడు చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హార్మూజ్ను దాటడంలో ఎంతగానో సహకరించిన ఇరాన్ పేరును ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.మరోవైపు ఇరాన్లో పరిస్థితులపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాన్ దార్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహిత నేత అయిన వాంగ్ యీ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరోలోనూ సభ్యునిగా ఉన్నారు. క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రష్యా ముడిచమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలుచేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురుకష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాంజా నౌకాశ్రయానికి రష్యా చమురునౌక ‘అనటోలీ కొలోడ్కిన్’చేరుకుంది.మార్చి 8న రష్యా నుంచి బయల్దేరి ఇంగ్లిష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్ సముద్రజలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచిచూస్తున్న విషయం తెల్సిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెళ్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన, గనుల మంత్రి విసెంటే లేవీ అమితానందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ క్యూబా తమ చమురుఅవసరాల కోసం అత్యధికంగా వెనెజువెలాపై ఆధారపడేది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్చేశాక ఆ దేశం నుంచి చమురురాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే. -
కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి
మాస్కో: క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తున్న సమయంలో రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలిపోయింది. దీంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలను టాస్ వార్తా సంస్థ బుధవారం ప్రచురించింది.“మార్చి 31న సాయంత్రం 6 గంటలకు ఏఎన్-26 సైనిక రవాణా విమానంతో కమ్యూనికేషన్ కోల్పోయాం” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెస్క్యూ టీమ్ ఏఎన్-26 విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించింది. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా తెలిపింది. ఆ విమానం ఓ కొండ అంచును ఢీకొని కూలిపోయిందని పలు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. సైనిక విమానం కుప్పకూలడం వెనుక ఉన్న కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.మీడియా అడిగిన ఇతర వివరాలపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందించలేదు. ఏఎన్-26 విమానం 1960 దశకం చివర నుంచే సర్వీసులో ఉంది. ఈ మోడల్ను సరుకు రవాణా కోసం ఎయిర్లైన్స్ కూడా ఉపయోగించాయి. గత దశాబ్దంలో ఈ మోడల్కు విమానాలు పలు ప్రమాదాలకు గురయ్యాయి. 2022లోఘుక్రెయిన్ దక్షిణ-తూర్పు జపోరిజ్జియా ప్రాంతంలో విమాన ప్రయాణం సమయంలో ఉక్రెయిన్కు చెందిన ఏఎన్-26 కూలి ఒకరు మరణించారు. 2020లో ఉక్రెయిన్ ఉత్తర-తూర్పు ప్రాంతంలో శిక్షణ విమాన ప్రయాణం సమయంలో అది కూలి 26 మంది మృతి చెందారు. -
కెనడా గ్యాంగ్వార్లో పంజాబ్ యువకుడి హత్య
సర్రే (కెనడా): కెనడాలో గ్యాంగ్వార్ కలకలం రేపింది. పంజాబ్ మూలాలు కలిగిన ఒక యువకుడిని దుండగులు సినిమా ఫక్కీలో వెంటాడి, తూటాలతో హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాంకోవర్ సమీపంలోని సర్రే నగరంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.ఏం జరిగిందంటే?మృతుడిని 27 ఏళ్ల జస్మాన్ సెఖోన్గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ఒక నివాస సముదాయం వద్ద జస్మాన్ను ఒక నల్లటి కారు వెంబడించింది. జస్మాన్ పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, దుండగులు అతడిని చుట్టుముట్టారు. వాహనం నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి జస్మాన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కాపాడే ప్రయత్నం చేసినా, ఫలితం లేకుండా పోయింది.హత్య జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి సమీపంలో ఒక కారు తగలబడుతూ కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా కెనడాలో గ్యాంగ్స్టర్లు తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు, హత్యకు వాడిన వాహనాలను తగులబెడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పులకు, దగ్ధమైన కారుకు సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.డ్రగ్స్ మాఫియా హస్తం?ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ)ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. జస్మాన్ సెఖోన్కు గతంలో డ్రగ్స్ వ్యాపారం, నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన 'టార్గెటెడ్ కిల్లింగ్' అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా గత 48 గంటల్లో ఈ ప్రాంతంలో నాలుగు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా! -
ఇరాన్ ఎఫెక్ట్.. ట్రంప్ కోసం స్పెషల్ బంకర్!
వాషింగ్టన్: ఇరాన్పై భీకర యుద్ధంలో తలమునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ట్రంప్ కోసం ప్రైవేట్ నిధులతో నిర్మిస్తున్న బాల్రూమ్ కింద అత్యంత పటిష్టమైన బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.ఆదివారం రాత్రి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. బాల్రూమ్ కింద భూగర్భంలో ఒక భారీ సముదాయం నిర్మాణ దశలో ఉందని తెలియజేశారు. సాక్షాత్తూ అమెరికా సైన్యమే దీన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త బాల్రూమ్లో బుల్లెట్ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ నిరోధక డిజైన్ వంటి అనేక ఆధునిక భద్రతా సదుపాయాలు ఉంటాయని ట్రంప్ చెప్పారు. ఈ గది అంతర్జాతీయ ప్రముఖులకు, నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతోపాటు ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంది. వైట్హౌస్ అండర్గ్రౌండ్లో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్(పీఈఓసీ) ఉండేది. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే నిర్మించారు. తరచుగా ఆధునీకరించారు. వైట్హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో ఈ సెంటర్ను తొలగించారని, నూతన, ఆధునిక సదుపాయాలతో మరో సముదాయం నిర్మాణంలో ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ వార్తా సంస్థ తెలియజేసింది. THE WHITE HOUSE IS BUILDING A MASSIVE BUNKER UNDER THE NEW BALL ROOM 🚨THIS IS NOT INSURANCEIT IS A WARNINGSOMETHING SERIOUS IS COMING pic.twitter.com/J2UCRFpwav— Matt Wallace (@MattWallace888) March 30, 2026ఎన్సీపీసీ నుంచి అనుమతి లేకుండానే.. ట్రంప్ కొత్త బంకర్ గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టలేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు. అయితే, సైన్యం వైట్హౌస్లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతోందని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ తన అభిరుచులకు అనుగుణంగా బాల్రూమ్ను కట్టించుకుంటున్నారు. దీనికి ప్రైవేట్ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ గానీ, ప్రజా పరిశీలన గానీ లేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్(ఎన్సీపీసీ) నుంచి అనుమతి లేకుండానే బాల్రూమ్ బంకర్ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టోరిక్ ప్రజర్వేషన్’ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో విచారణ జరుగనుంది. BREAKING US military building 'massive complex' beneath White House ballroom project, says Trump pic.twitter.com/reIDNg8qmZ— AFP News Agency (@AFP) March 30, 2026 -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ కొత్త చట్టం.. వారికి మరణశిక్ష
జెరూసలేం: గాజాలో ఒకవైపు మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సర్కార్ మరోవైపు పాలస్తీనా పౌరులపై అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేసే దిశగా కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ ప్రజలను హత్యచేస్తే మరణ దండన విధిస్తామని తేల్చిచెప్పింది. హత్య కేసులో దోషిగా తేలితే చావుకు సిద్ధపడాల్సిందేనని వెల్లడించింది.ఈ మేరకు ఇజ్రాయెల్ పార్లమెంట్లో బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేశారు. బిల్లుకు అనుకూలంగా 62, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అంతకముందు బిల్లుపై దాదాపు 12 గంటలపాటు చర్చించారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే పార్లమెంట్లో సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ కొత్త చట్టాన్ని అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ చట్టం వివక్షపూరితమైనదని, అమానుషమైనదని స్పష్టంచేశాయి. ఇజ్రాయెలీయులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడే పాలస్తీనియన్లకు శిక్షలు పెంచాలని అతివాదాలు చాలాఏళ్లుగా డిమాండ్ చేశారు. కొందరు ఉద్యమబాట పట్టారు. వారి ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్లు స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్లో బిల్లుపై ఓటింగ్లో స్వయంగా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ జాతీయులకు మినహాయింపు కొత్త చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్ పౌరుల హత్య కేసులో దోషులుగా తేలిన వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన ఇజ్రాయెల్ పౌరులకు కూడా మరణశిక్ష విధించే అధికారం ఇజ్రాయెల్ కోర్టులకు ఉంటుంది. అయితే, మరణశిక్షను ఇజ్రాయెల్లోని పాలస్తీనా జాతీయులకే పరిమితం చేసి, యూదు జాతీయులకు మినహాయింపు ఇచ్చేలా ఈ చట్టం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కేవలం పాలస్తీనియన్లే శిక్షకు గురవుతారని స్పష్టమవుతోంది. -
యుద్ధంపై ఇరాన్ రెడ్క్రిసెంట్ సంస్థ రిపోర్ట్.. నష్టం ఎంతంటే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు జరుపుతోంది. -
అర్ధశతాబ్దం తర్వాత జాబిలి దిశగా..
కేవ్ కనావరల్(ఫ్లోరిడా): అంతరిక్ష యాత్రలకు జాబిలిని మజిలీగా మార్చుకునే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్–2 ప్రయోగం నేడు ఫ్లోరిడాలోని కేప్ కనావరల్లోని ‘కెన్నడీ అంతరిక్ష కేంద్రం’వేదికగా జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.24 గంటలకు(భారతకాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 3.54 గంటలకు) నలుగురు వ్యోమగాములతో 32 అంతస్తుల ఎత్తయిన ‘స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్’నింగిలోకి దూసుకుపోనుంది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ సోమవారమే ప్రారంభించారు. దాదాపు 53 ఏళ్ల తర్వాత చందమామ సంబంధ ప్రాజెక్ట్కు నాసా శ్రీకారంచుట్టి శరవేగంగా ఆచరణలో పెట్టింది.అంతా సవ్యంగా సాగితే అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్ వైస్మ్యాన్(కమాండర్), విక్టర్ గ్లోవర్(పైలట్), క్రిస్టినా కూచ్(మహిళా మిషన్ స్పెషలిస్ట్), జెరిమీ హాన్సెన్లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు.కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్లో పయనించనున్నారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచి్చనా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు బుధవారం ప్రయోగంచేపట్టేందుకు రంగంసిద్ధమైంది. -
మోజ్తాబా ఉంది అక్కడే? రష్యా సంచలన ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ జాడపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కనిపించకపోవడం సైతం దానికి ఒక కారణం. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం ఆయన ఆచూకీపై స్పందించింది. మోజ్తాబా ఎక్కడ ఉన్నారో ఇరాన్లోని రష్యా రాయబారి స్పష్టతనిచ్చారు.మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అమెరికా దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడి ఉండవచ్చునని అన్నారు. ఆయన అసలు బ్రతికున్నారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మోజ్తాబా రష్యాలో తలదాచుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రష్యా స్పందించింది.రష్యా రాయబారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ " మొజ్తాబా ఖమేనీ దేశంలోనే ఉన్నారు, అయితే అర్థం చేసుకోదగిన కారణాల వల్ల బహిరంగంగా కనిపించడం మానుకుంటున్నారు" అని అన్నారు. యుద్ధంలో గాయపడిన ఖమేనీకి చికిత్స అందించేందుకు ఆయనను రష్యాకు విమానంలో తరలించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన తేల్చిచెప్పారు. కాగా అమెరికా-ఇరాన్ యుద్ధంలో రష్యా పాత్రను కూడా అమెరికా పర్యవేక్షిస్తోందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్కు సహాయం చేస్తోందన్న వార్తలను మాస్కో ఖండించినప్పటికీ, హెగ్సెత్ ఇలా అన్నారు కాగా యుద్ధం మెుదలై నెల రోజులు గడిచింది. అయినప్పటికీ ఇరు వర్గాలు ఏ మాత్రం తగ్గడం లేదు. -
యుద్ధానికి త్వరలో తెర!
వాషింగ్టన్: ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.‘‘యుద్ధాన్ని నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే సాగించాలని ముందే నిర్ణయించుకున్నాం. హర్మూజ్ కోసం పట్టుబడితే పోరు మరిన్ని రోజులు కొనసాగేలా ఉంది. కనుక మన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నావికా దళాన్ని, దాని క్షిపణి నిల్వలను పూర్తిగా నేలమట్టం చేసి యుద్ధానికి త్వరగా తెర దించేస్తా’’ అని ట్రంప్ చెప్పుకొచి్చనట్టు పేర్కొంది. మరోవైపు సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు మాత్రం ఇరాన్ పూర్తిగా ఓడేదాకా యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా అమెరికాను కోరుతున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది! నాటో దేశాలపై గుర్రు ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి. మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
ఇస్ఫహాన్ అణు కేంద్రంపై బాంబుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమిస్తోంది. చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్పై అమెరికా కన్నెర్రజేసింది. స్వీయ కాల్పుల విరమణను తుంగలో తొక్కుతూ మంగళవారం ఆ దేశంపై భారీ స్థాయి దాడులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్ నగరంలోని కీలక అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ కేంద్రంలోనే ఇరాన్ దాచి ఉంచినట్టు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజా దాడిలో అక్కడి అణుకేంద్రానికి నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.త్వరగా ఒప్పందానికి రాకపోతే ఇరాన్లోని మౌలిక వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ట్రంప్ సోమవారమే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము వేళ ఇజ్రాయెల్తో కలిసి టెహ్రాన్పైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో ఇరాన్ రాజధాని దద్దరిల్లిపోయింది. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. లెబనాన్పైనా ఇజ్రాయెల్ భారీగా దాడులను కొనసాగించింది. వాటిలో ఐరాస శాంతి పరిరక్షక దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది మరణించినట్టు సమాచారం. మొత్తమ్మీద మంగళవారం ఒక్క రోజే 21 మంది మృతి చెందినట్టు లెబనాన్ పేర్కొంది.మొత్తం మృతుల సంఖ్య 1,268 దాటినట్టు వెల్లడించింది. ఉత్తర గాజాలో కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఒక వ్యక్తి, అతని ఐదేళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా తమ మౌలిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంటున్నాయంటూ ఇరాన్ మండిపడింది. దీనికి తమ సమాధానం భయానకంగా ఉంటుందని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై కూడా బుధవారం నుంచి భారీగా దాడులు చేస్తామని రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్తో పాటు 18 సంస్థల పేర్లను వెల్లడించింది! తక్షణం కార్యాలయాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ కంపెనీల సిబ్బందికి సూచించింది. మండుతున్న చమురు ధరలుయుద్ధం దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు నానాటికీ ఎగబాకుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 107 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధానికి తెర తీసినప్పటితో పోలిస్తే ఇది ఏకంగా 45 శాతం ఎక్కువ కావడం విశేషం! మరోవైపు అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి! మంగళవారం గ్యాలన్ (దాదాపు 3.8 లీటర్ల) పెట్రోల్ ధర 4.02 డాలర్లకు చేరింది. 2022 తర్వాత అమెరికాలో పెట్రోల్ ధర 4 డాలర్లను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలయ్యే నాటికి అమెరికాలో గ్యాలర్ పెట్రోల్ ధర 2.98 డాలర్లుగా ఉంది. డీజిల్ ధర కూడా గ్యాలన్కు 3.75 డాలర్ల నుంచి 5.45 డాలర్లకు పెరిగింది. ఇజ్రాయెల్లో సైరన్ మోతలు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో దుబాయ్ సమీపంలో కువైట్కు చెందిన ఓ చమురు నౌకపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో నౌకలో మంటలు చెలరేగాయి. సిబ్బంది చాలాసేపు శ్రమించి వాటిని ఆర్పేశారు. ఐదు క్షిపణులు, ఏడు డ్రోన్లను కూల్చేసినట్టు కువైట్ పేర్కొంది. దుబాయ్లోని అల్ బదాలో ఓ ఆవాస ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో శకలాలు పడి ఇద్దరు భారతీయులతో పాటు నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలు కూడా దాడుల బారిన పడ్డాయి. ఆ దేశాలతో పాటు ఇజ్రాయెల్ నగరాల్లో కూడా రోజంతా సైరన్ మోతలు విన్పించాయి. ఇరాక్లోని సులేమానియా యూనివర్సిటీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.హార్మూజ్ సుంకం ఖరారుహార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేయాల్సిన సుంకాన్ని ఇరాన్ లాంఛనంగా ఖరారు చేసింది. ఒక్కో నౌక నుంచి గరిష్టంగా రూ.19 కోట్ల దాకా వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు భద్రతా మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. హార్మూజ్పై ఇరాన్ సార్వ¿ౌమాధికారానికి నిదర్శనంగా ఈ చర్య తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు హార్మూజ్ గుండా వెళ్లనివ్వబోమని పేర్కొంది.ఇటలీ సైతం... గగనతలం మూతస్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా అమెరికాకు షాకిచ్చింది. ఇరాన్పై పోరులో అమెరికా వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. సిసిలీలోని తమ వైమానిక స్థావరాన్ని అమెరికా వాడుకునేందుకు కూడా అనుమతి నిరాకరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోమవారం స్పెయిన్ కూడా ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే. -
బాగ్దాద్లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్
ఇరాక్ బాగ్దాద్లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్కు గురైంది. ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ను బాగ్దాద్లో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.బాగ్దాద్లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న (మంగళవారం) సాయంత్రం బాగ్దాద్లో రెండుకార్లలో వచ్చిన కిడ్నాపర్లు ఆమెను అపహరించారు. దీనిని గమనించిన భద్రతా బలగాలు వారిని వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల వాహనాల్లో ఒకటి బోల్తా పడగా జర్నలిస్టు ఉన్న కారు మాత్రం బాగ్దాద్ దక్షిణ ప్రాంతం వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇరాక్ నిఘా వర్గాలు మరియు క్షేత్రస్థాయి భద్రతా బలగాలు కిడ్నాపర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కిడ్నాప్కు గల కారణాలు మరియు దీని వెనుక ఉన్న ముఠాల గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఇదివరకే అమెరికాలోని షెల్లీ కిటిల్సన్కు పొంచి ఉన్న ముప్పు గురించి ముందే హెచ్చరించింది. ఇరాక్ పర్యటనకు వెళ్లవద్దని ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాక్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో, అమెరికా రాయబార కార్యాలయం కూడా పౌరులకు కిడ్నాప్ ముప్పు పొంచి ఉందని గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. కాగా షెల్లీ కిటిల్సన్ మధ్యప్రాచ్య వ్యవహారాలపై లోతైన కథనాలు రాసే జర్నలిస్ట్గా గుర్తింపు పొందారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి. -
ఇజ్రాయెల్లో కీలక బిల్లు ఆమోదం.. అలా చేస్తే ఉరిశిక్షే?
ఇజ్రాయెల్ పార్లమెంటు (నాసాట్) పాలస్తీనా నేరస్థులను శిక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద ఇజ్రాయెల్ పౌరుల హత్యలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలస్తీనియన్లు పాల్గొంటే వారికి నేరుగా ఉరిశిక్ష విధించబడుతుంది.ఇజ్రాయెల్లోని కొన్ని గ్రూపులు చాలా కాలంగా ఈ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిప్రకారం పాలస్తీనాకు చెందిన వ్యక్తులు తీవ్రమైన నేరాలకు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం లేకుండా కూడా మరణశిక్షను ప్రకటించగలరు. అప్పీల్ చేసే హక్కు ఉండదు. శిక్ష విధించిన 90 రోజుల్లో ఉరితీయబడతాడు. ఈ చట్టం జాతీయవాద లేదా తీవ్రవాద కారణాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణ శిక్షను జీవిత ఖైదు విధించే హక్కు కూడా కోర్టులకు ఉంటుంది.కాగా మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును జాతిపరంగా వివక్షతగా పేర్కొన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ మానవ హక్కుల, పౌర సమాజ సంస్థలు ఈ చట్టం పాలస్తీనియన్లపై జాతి హింసను ప్రోత్సహిస్తున్నాయని నిరసన తెలుపుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇన్ని సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ధేశంలోమరణశిక్ష విధించబడింది. -
ట్రంప్ పేరుతో విమానాశ్రయం.. కరెన్సీ పై కూడా..?
అమెరికా ఫ్లోరిడాలోని విమానాశ్రయానికి దేశాధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫ్లోరిడా గవర్నర్ ఆ బిల్లుపై సంతకం చేశారు. అన్ని సవ్యంగా సాగితే అధ్యక్షుడి హోదాలో ఉండగానే ఎయిర్ఫోర్టుకు తన పేరు పెట్టుకున్న వ్యక్తిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు.డొనాల్డ్ ట్రంప్కు పబ్లిసిటీ పిచ్చిన పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అక్కడి కొన్ని ప్రభుత్వ సర్వీసులను తన పేరుమీదుగా అందిస్తోన్న ట్రంప్ ఇప్పుడు తాజాగా విమానాశ్రయానికి తన పేరు పెట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును డోనాల్డ్ ట్రంప్గా మార్చుతూ గవర్నర్ రాన్ డెసాంటిస్ ఒక బిల్లుపై సంతకం చేశారు.ఇప్పుడు ఆ ఫైల్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు పంపబడుతుంది. దీని తరువాత, ఫ్లైట్ చార్ట్, నావిగేషన్ సిస్టమ్ మరియు విమానాశ్రయ సంకేతాలు మార్చబడతాయి. ఈ ఫైలును FAA ఆమోదిస్తే జూలై 1 నుండి ఈ పేరు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే, ట్రంప్ తన పదవీకాలంలోనే అతని పేరు మీద ఎయిర్ఫోర్టు ఉంటుంది. ఇలా పదవికాలంలో విమానాశ్రయం పేరు మీదున్న మొదటి అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టిస్తారు.అయితే ట్రంప్ పేరు మీదకు రాబోతున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయనకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే అతని ప్రధాన నివాసం. ఇదివరకే అనేక ప్రభుత్వ సేవలు ట్రంప్ పేరు మీద ఉన్నాయి. అంతే కాకుండా త్వరలో ట్రంప్ సంతకం అక్కడి కరెన్సీపై కూడా ముద్రించనున్నారు. -
అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచే ఈ దాడులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సైన్యం ఏప్రిల్ 1 నుంచి వెస్ట్ ఆసియా ప్రాంతంలో అమెరికా కంపెనీలే లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించాయి. ఐఆర్జీసీ ప్రకటించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతీకారంగా సైనిక స్థావరాలకే కాకుండా వాణిజ్య, సాంకేతిక రంగ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ చర్యలు ఏప్రిల్ 1, బుధవారం రాత్రి 8 గంటలకు (టెహ్రాన్ సమయం) ప్రారంభమవుతాయని హెచ్చరించింది. ‘ప్రతి ఉగ్రదాడికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము’ అని ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు జరుపుతోంది. ఈ చర్యలు అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా జరుగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈసారి సాంకేతిక, వాణిజ్య రంగ సంస్థలను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకోవడంతో యుద్దం మరింత ఉద్రిక్తమయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘మీకోసమే ఎదురు చూస్తున్నాం’
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో శత్రు దేశాల సైన్యం భూతల దాడులకు దిగితే తాము ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది.ఇరాన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ సైన్యం తమ కమాండోల క్లిప్లను చూపిస్తూ అమెరికన్ సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించింది. 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఇరాన్ ప్రత్యేక దళాల కదలికలను వేగంగా చూపిస్తూ ‘దగ్గరకు రండి, మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం’అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో పాటు సైనిక సామగ్రితో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు చేయడం, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం చూడొచ్చు. మరో క్లిప్లో ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది. అమెరికా వైపు చర్యలుఅమెరికా వైట్ హౌస్ ప్రకారం..అదనపు సైన్యాన్ని పశ్చిమ ఆసియాకు పంపడం ద్వారా అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలదని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ..‘ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లక్ష్యాలను సాధించడానికి పెంటగాన్ సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది’అని తెలిపారు. పెంటగాన్ ఇరాన్లో కొన్ని వారాలపాటు భూసైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి ఆక్రమణ కాకుండా, లక్ష్యిత దాడుల రూపంలో ఉండవచ్చని సమాచారం. Iran’s Army released footage of its elite commandos, declaring it is ready to confront and defeat American soldiers.Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/gIdaV4W8lI— Press TV 🔻 (@PressTV) March 31, 2026 -
ట్రంప్నకు షాకిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
రోమ్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాక్ తగిలింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలంలో అనుమతి ఇవ్వబోమని కొన్ని దేశాలు స్పష్టంగా ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరింది. అమెరికా యుద్ధ విమానాలకు గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో ఇరాన్పై యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కతూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇరాన్ను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని దేశాలు తమకు కావాల్సిన చమురు అమెరికా నుంచి కొనుగోలు చేయాలి. లేదా హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లి మీకు కావాల్సి వెళ్లి స్వయంగా తెచ్చుకోవాల్సిందే’అని వ్యాఖ్యానించారు.హర్మూజ్ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలు జెట్ ఇంధనం కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వద్ద ఇంధనం ఎక్కువగా ఉంది, కావాలంటే ఆ దేశాలు కొనుగోలు చేసుకోవచ్చు. ‘ధైర్యం చేసి హర్మూజ్కి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండి’ అని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మీరు అమెరికాకు తోడుగా లేరు. ఇకపై అమెరికా సహాయం చేయదు. ఇకనైనా మీరు ఒంటరిగా పోరాడడం నేర్చుకోవాలి’ అని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సాధారణ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ట్రంప్ హెచ్చరిస్తూ ‘తక్షణమే కాల్పుల విరమణ జరగకపోతే, హర్మూజ్ జలసంధి తిరిగి తెరవకపోతే అమెరికా దాడులను విస్తరిస్తుంది. ఖార్గ్ దీవిలోని చమురు ఎగుమతి కేంద్రాన్ని, అవసరమైతే డీసాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. -
ఆకాశాన్ని కమ్మేసిన కాకుల వనం..!
ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే ఈ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూస్తున్నారు. పగలు కాస్తా రాత్రిలా మారిపోయింది. దానికి కారణం సూర్యుడిని కమ్మేసిన మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఇది రాబోయే ముప్పుకు సంకేతమా? మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్ లో కూడా కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే ఒక రకమైన మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో ఈ కాకులు చేస్తున్న వింత ఆకారాలు చూస్తుంటే, స్థానికులు ఇది ఒక ‘చెడు శకునం’ (Bad Omen) అని నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి వింతైన పక్షుల ప్రవర్తన జరిగినప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా నెటిజన్లు చూడటం లేదు. దీనికి మతపరమైన కోణాన్ని జోడిస్తున్నారు. బైబిల్లో చెప్పబడిన ‘అంత్యకాలం’ (End Times) సంకేతాల్లో పక్షుల వింత ప్రవర్తన కూడా ఒకటి అని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి పవిత్ర భూమిపై ఇలాంటి దృశ్యాలు కనిపించడం వెనుక దైవికమైన హెచ్చరిక ఉందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు మరియు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని పాత నిబంధనలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, దీనిని 'ముర్మురేషన్' (Murmuration) అని పిలుస్తారు. ఆహారం కోసం వెతుకుతూ లేదా సురక్షితమైన స్థావరం కోసం పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల ఇది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైన పక్షులు, అవి వేటాడే పక్షుల నుండి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయి.ఒకవైపు మూఢనమ్మకాలు, మరోవైపు శాస్త్రీయ కారణాలు.. ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజల్లో పెరిగిన 'అన్సర్టైనిటీ' (అనిశ్చితి). ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.టెల్ అవీవ్ ఆకాశంలో కనిపించిన ఆ నల్లని నీడలు నిజంగానే ఏదైనా విపత్తుకు సంకేతమా? లేక ప్రకృతిలో జరిగే ఒక సామాన్య ప్రక్రియనా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసరమైన భయాందోళనలకు గురికావద్దు. -
పవిత్ర జెరూసలేంపై క్షిపణి దాడులు: వారి మౌనంపై తీవ్ర చర్చ
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో పవిత్ర వారంలో (Holy Week) పాస్ ఓవర్ (Passover) వేడుకల సమయంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నగరంపై దాడులు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఈ దాడులను ధృవీకరించింది.జెరూసలేం ఆకాశంలో క్షిపణి దాడులుమంగళవారం ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగంపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది. జెరూసలేం అంతటా సైరన్లు మోగాయి. వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పైకి ప్రయోగించింది. దీంతో జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ (Temple Mount) అల్-అక్సా మసీదు (Al-Aqsa Mosque) వంటి పవిత్ర ప్రదేశాలపై క్షిపణి దాడి దృశ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అయితే పైన 'ఐరన్ డోమ్' , 'ఆరో' (Arrow) రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను అడ్డుకున్నాయి. ఒకవేళ ఇవి నేరుగా తగిలి ఉంటే కోలుకోలేని నష్టం వాటిల్లేది. మరోవైపు ప్రముఖ అమెరికన్ వ్యాఖ్యాతలు టకర్ కార్ల్సన్ (Tucker Carlson) ,క్యాండేస్ ఓవెన్స్ (Candace Owens) ఈ విషయంలో ఇరాన్ను గట్టిగా ఖండించకపోవడమే కాకుండా, విభిన్నమైన, వివాదాస్పదమైన వాదనలు వినిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జెరూసలేం క్రైస్తవులకు, యూదులకు అత్యంత పవిత్రమైనది. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యాతలు ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇరాన్ దాడులను వారు ఖండించకపోవడం వారి మద్దతుదారుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది."అమెరికా ఫస్ట్" (అంటే అమెరికా ఇతర దేశాల యుద్ధాల్లో పక్షం వహించకూడదు) అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నవాళ్లలో వీరు ముఖ్యులు. ఈ క్రమంలో ఇరాన్ దురాక్రమణను నేరుగా ఖండించడం కంటే, అమెరికా ఈ గొడవల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోంది అంటూ విమర్శలు గుప్పించారు. అటు ప్రస్తుతం అమెరికాలోని రైట్ వింగ్లో ఒక పెద్ద చీలిక కనిపిస్తోంది. ఒక వర్గం ఇజ్రాయెల్ను పవిత్ర భూమిగా భావించి బేషరతుగా మద్దతు ఇస్తుంటే,కార్ల్సన్ , ఓవెన్స్ వంటి వారు ఇజ్రాయెల్కు అమెరికా ఇచ్చే ఆర్థిక, సైనిక మద్దతును ప్రశ్నిస్తున్నారు. అయితే జెరూసలేం వంటి పవిత్ర నగరం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా వీరు ఇరాన్ను ఖండించకపోవడం వెనుక వారి "ఐసోలేషనిజం" (Isolationism - అంటే ఇతర దేశాల గొడవల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదనే సిద్ధాంతం). ఇటీవల వారు అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం దాడులు, ప్రతిదాడులతో యావత్ ప్రపంచం దద్దరిల్లుతోంది. పవిత్ర భూమిపై భీకర దాడులు, యుద్ధమేఘాలు కమ్ముకోవడం, అంతర్జాతీయ వేదికలపై దీనిపై జరుగుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
Pakistan: 4 నుంచి లాక్డౌన్?.. ప్రభుత్వం కీలక ప్రకటన
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం దృష్ట్యా లాక్డౌన్ విధించినున్నారన్న వార్తల నడుమ అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీకెండ్ లాక్డౌన్’ ప్లాన్కు ప్రావిన్షియల్ (రాష్ట్ర) ప్రభుత్వాలు గట్టిగా నో చెప్పడంతో ప్రస్తుతానికి లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మండిపోతున్న వేళ, పాక్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా పలు ఆంక్షలను పరిశీలించింది. అయితే, తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా ఎలాంటి షట్డౌన్ ఉండబోదని స్పష్టమైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కోబోతోందని, దీనిని నియంత్రించేందుకు ఏప్రిల్ 4 లేదా 5 నుంచి ‘స్మార్ట్ లాక్డౌన్’ అమలు చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, బహిరంగ సభలపై నిషేధం, రవాణాపై ఆంక్షలు వంటి ప్రతిపాదనలతో ఒక ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన ‘ఐవాన్-ఎ-సదర్’లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. లాక్డౌన్ విధిస్తే సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల మద్దతు లభించకపోవడంతో కేంద్రం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.ప్రస్తుతానికి దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇచ్చారు. లాక్డౌన్ల కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చే చర్యలపైనే తాము దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు, ఇతర ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి -
‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి
బహావల్పూర్: భారత గడ్డపై నెత్తురు ఏరులు పారించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో మృతి చెందాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అనుమానాస్పద స్థితిలో మృతిచాలా కాలంగా జైషే మహమ్మద్ కార్యకలాపాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ తన అధికారిక ఛానల్ ద్వారా ఈ మృతిని ధృవీకరించింది. బహావల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే అతను అనారోగ్యంతో చనిపోయాడా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా అనే విషయంలో సంస్థ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.భారత్కు పక్కలో బల్లెంలా జైషే..భారత పార్లమెంటుపై దాడి (2001), పఠాన్కోట్ ఎయిర్బేస్ స్ట్రైక్ (2016), యూరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి (2019) తదితర దారుణాల వెనుక మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ సంస్థలో తాహిర్ అన్వర్ ఏళ్ల తరబడి కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు.‘ఆపరేషన్ సింధూర్’తో కోలుకోలేని దెబ్బగత ఏడాది ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టాయి. బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ దాడుల్లో అజహర్ సోదరి, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు గత సెప్టెంబర్లోనే ఆ సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా? -
న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా?
ఆక్లాండ్: న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యంత భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బల్తేజ్ సింగ్కు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఇప్పుడు అతని వెనుక ఉన్న ఒక సంచలన చరిత్ర అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపిన హంతకుల్లో ఒకరైన సత్వంత్ సింగ్తో బల్తేజ్ సింగ్కు కుటుంబ పరమైన సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందిఎవరీ బల్తేజ్ సింగ్?ఆక్లాండ్ నగరంలో వ్యాపారవేత్తగా చలామణి అవుతున్న బల్తేజ్ సింగ్, తెర వెనుక భారీ అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను నడిపాడు. దాదాపు 700 కేజీల మెతాంఫేటమిన్ (Methamphetamine) అనే మత్తు పదార్థాన్ని న్యూజిలాండ్లోకి అక్రమంగా తరలించినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ అనంతరం మార్చి 30న న్యూజిలాండ్ కోర్టు అతనికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.ఇందిరా గాంధీ హత్యతో లింక్ ఏంటి?శిక్ష ఖరారైన తర్వాత బల్తేజ్ సింగ్ కుటుంబ నేపథ్యంపై ఆసక్తికర చర్చ మొదలైంది. 1984 అక్టోబర్ 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమె నివాసంలోనే అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన ఈ దారుణం దేశాన్ని కుదిపేసింది. అయితే, ఈ హంతకుల్లో ఒకరైన సత్వంత్ సింగ్కు బల్తేజ్ సింగ్ బంధువని దర్యాప్తులో తేలింది.గుట్టు రట్టయిందిలా..బల్తేజ్ సింగ్ నెట్వర్క్ చాలా తెలివిగా డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసేది. బీర్ క్యాన్లలో అత్యంత నాణ్యమైన డ్రగ్స్ను దాచి సరిహద్దులు దాటించేవారు. అయితే 2023లో ఒక వ్యక్తి పొరపాటున డ్రగ్స్ కలిపిన ద్రవాన్ని తాగి ప్రాణాలు కోల్పోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో బల్తేజ్ సింగ్ డ్రగ్ కింగ్ అని తేలింది.బల్తేజ్ సింగ్ వేడుకోలుతన కుటుంబ నేపథ్యం వల్ల భవిష్యత్తులో ముప్పు ఉంటుందని, తన పేరును బయటకు వెల్లడించవద్దని (Name Suppression) బల్తేజ్ సింగ్ కోర్టును ఆశ్రయించాడు. కానీ అందరికీ ఈ కేసు గురించి తెలుసుకునే హక్కు ఉందని భావించిన కోర్టు, అతని విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కేసుతో 1984 నాటి విషాదకర ఘటనలు, ఆ తర్వాతి అల్లర్ల చరిత్ర మరోసారి విదేశీ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక హంతక కుటుంబానికి చెందిన వ్యక్తి, మరో దేశంలో భారీ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు -
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్ఫహాన్లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది.మరోవైపు, ఇరాన్కు ట్రంప్ తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. -
కువైట్ ట్యాంకర్పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం
దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ పోర్ట్లో కువైట్కు చెందిన భారీ చమురు ట్యాంకర్పై ఇరాన్ నేరుగా దాడికి తెగబడింది. ఈ మెరుపు దాడితో ట్యాంకర్లో భారీగా మంటలు చెలరేగగా, సముద్రంలో చమురు ఒలికిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?కువైట్ పెట్రోలియం కార్పొరేషన్కు చెందిన ‘అల్ సాల్మీ’ అనే భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ దుబాయ్ పోర్ట్లో ఉండగా ఇరాన్ దళాలు దాడి చేశాయి. కువైట్ అధికారిక వార్తా సంస్థ ‘కునా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిస్థాయి చమురు నిల్వలతో ఉంది. దాడి ప్రభావంతో నౌక తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో మంటలు చెలరేగాయి.వణికిస్తున్న చమురు గండంట్యాంకర్ట్రాకర్స్.కామ్ (TankerTrackers.com) గణాంకాల ప్రకారం.. అల్ సాల్మీ నౌకలో ప్రస్తుతం 12 లక్షల బ్యారెళ్ల సౌదీ క్రూడ్ ఆయిల్, మరో ఎనిమిది లక్షల బ్యారెళ్ల కువైట్ క్రూడ్ ఆయిల్ ఉంది. అంటే మొత్తం 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలో కలిసిపోయే ముప్పు ఏర్పడింది. ఒకవేళ చమురు లీక్ అయితే పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందని కువైట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.క్షేమంగా 24 మంది సిబ్బందిఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నౌకలో ఉన్న మొత్తం 24 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు దుబాయ్ అధికారులు ధృవీకరించారు. దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం నౌకకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, చమురు లీక్ కాకుండా చూడటమే లక్ష్యంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ! -
నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యం
గంటల కొద్దీ జిమ్లో కసరత్తు, ఆహార నియమాలు పాటించిన వారికే బరువు తగ్గడం అంత సులువు కావడం లేదు. తాము నటించే పాత్రలకోసం విపరీతంగా బరువు తగ్గిన వారిని చాలామందిని చూశాం. కానీ విచిత్రమైన పద్దతుల్లో కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. వివరాలు ఉన్నాయి.కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల, వారు పాటిస్తున్న కఠినమైన డైట్ ప్లాన్ ఇపుడు నెట్టింట చర్చనీ యాంశంగా మారాయి. ప్రముఖ కొరియన్ నటీమణులు కిమ్ జి-వోన్, హా జి-వోన్, పార్క్ మిన్-యంగ్ ఇటీవల బాగా బరువు తగ్గి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నారు. వీరు గతం కంటే చాలా సన్నగా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు వారి అంకితభావాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు వారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అభిమానులలో ఆందోళన పుట్టిస్తున్న డైట్ వివరాలు ఇలా ఉన్నాయి కిమ్ జి-వోన్ (Kim Ji-won): మిలన్లో జరిగిన బల్గారి (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్లో ఈమె కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి కంటే చాలా సన్నగా మారడంతో అభిమానులు సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) హా జి-వోన్ (Ha Ji-won): తన కొత్త డ్రామా 'క్లైమాక్స్' (Climax) కోసం ఈమె కావాలనే బరువు తగ్గారు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఇమేజ్ ఉన్న ఈమె, తన పాత్ర కోసం కండరాల శాతాన్ని తగ్గించుకుని మరీ బలహీనంగా కనిపించేలా శరీరాన్ని మార్చుకున్నారు. "నన్ను నేను మార్చుకోవడం నటన కంటే కష్టమైంది" అని ఆమె పేర్కొన్నారు.పార్క్ మిన్-యంగ్ (Park Min-young): ఈమె డైట్ పద్ధతి అందరినీ షాక్కు గురిచేసింది. గతంలో 'మ్యారీ మై హస్బెండ్' అనే ప్రాజెక్ట్ కోసం 37 కిలోలకు తగ్గిన ఆమె, తాజా డ్రామా 'సైరన్' (Siren) కోసం అదే పద్ధతిని కొనసాగించారు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!కేవలం నీళ్లు , ఆల్కహాల్ డైట్?పార్క్ మిన్-యంగ్ తన పాత్ర కోసం వివరిస్తూ, "నేను బరువు పెరిగితే ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే కేవలం నీళ్లు , ఆల్కహాల్ను మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. షూటింగ్ సమయంలో రోజుకు 3 లీటర్ల నీరు తాగేదాన్ని" అని వెల్లడించారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.నటీనటులు తమ పాత్రల కోసం ఇలాంటి ప్రాణాంతకమైన డైట్లు చేయడం, చాలా కఠినమైన వ్యాయామాలు చేయడం కేవలం నీటిపైనే ఆధారపడటం వంటివి సమాజంలో ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పుతున్నాయనే చర్చకు దారితీసింది. నటన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
గల్ఫ్ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్ దాడులు
పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. -
గాల్లో పేలిన విమానం.. ఫైలట్ అప్రమత్తతతో 288 మంది సేఫ్
బ్రెజిల్లో డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పేలుడు సంభవించి విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ వివరాలు తెలుసుకున్న ఫైలట్ ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా చాకచాక్యంగా వ్యవహరించారు. విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానంలో 288 మంది ప్రయాణికులున్నారు. ఫైలట్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. -
పాకిస్థాన్ చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేస్తున్నామని పాకిస్థాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనిపై స్పందించింది. ఇస్లామాబాద్లో పాక్ నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని భారత్లోని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు.పాకిస్థాన్ ఉప ప్రధాని ఇటీవల ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అమెరికా, ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడితో కూడా తాము మాట్లాడామని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించింది.ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో తాము నేరుగా ఎటువంటి చర్చలు జరపడం లేదని మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం అహేతుకమైన మితిమీరిన డిమాండ్లను మాత్రమే పంపుతోందని తెలిపారు.అమెరికా దౌత్య విధానం తరచుగా మారుతూ ఉంటుందని కానీ ఇరాన్ మాత్రం మెుదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. అదే విధంగా పాకిస్థాన్ వారి సొంతంగా సమావేశం నిర్వహించిందని అందులో తాము పాల్గొనలేదని తెలిపారు. యుద్దం ముగింపుకు వారి ప్రయత్నం అభినందనీయమని అదే సమయంలో యుద్ధం ఎవరు మెుదలుపెట్టారో గుర్తుంచుకోవాలని ఈ సందర్బంగా ఇరాన్ రాయబారి అన్నారు. -
భారత్ రావాల్సిన విమానంపై అమెరికా దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమెరికా జరిపిన దాడుల్లో భారత్ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.. ఔషద సేకరణకు ఈ విమానం భారత్ రావాల్సి ఉంది.ఇరాన్లో జరుగుతన్న యుద్ధం కారణంగా మానవతా సహాయం అందించేందుకు భారత్లో విరాళాలు సేకరించారు. ఆ నిధులతో అక్కడి ప్రజలకు కావాల్సిన ఔషదాలు కొనుగోలు చేశారు. ఈ మందులను తీసుకెళ్లడానికి ఇరాన్కు చెందిన (Airbus A340-600)విమానం బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాగా ఇరాన్లోని ఓ ఎయిర్పోర్టు వద్ద అమెరికా జరిపిన దాడుల్లో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.దీంతో మందులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుంది. కాగా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భారతీయులు పంపిన డబ్బుతో ఈ మందులను కొనుగోలు చేశారు. కాగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. -
సాయుధుల దాడిలో 70 మంది మృతి
జుబా: దక్షిణ సూడాన్లో బంగారు గని విషయమై తలెత్తిన వివాదం 70కి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. సెంట్రల్ ఈక్విటోరియా ప్రావిన్స్లోని దేశ రాజధాని జుబా నగర శివారులోని బంగారు గని వద్ద శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. జెబెల్ ఇరాక్లోని బంగారు గనిలో తవ్వకాలపై మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని సాయుధులు గని వద్ద ఉన్న వారిపై మూకుమ్మడిగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రాంతం ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉందని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని ప్రతిపక్ష సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మి(ఎస్పీఎల్ఎం) ఆరోపించింది. -
తేల్చకుంటే సర్వనాశనమే
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్లో మేం చేపట్టిన సైనిక చర్యలను తక్షణం ఆపేసే అంశంపై ఇరాన్ దేశ నూతన పాలక వర్గంతో విస్తృతస్థాయిలో సమగ్రంగా సహేతుకంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కానీ ఏదైనా కారణంతో ఈ ఒప్పందం గనక సఫలీకృతంకాకపోతే ఇరాన్ అంతుచూస్తాం. సరుకు రవాణా నౌకల రాకపోకల కోసం హార్మూజ్ను తెరవకపోతే ఇన్నిరోజులు ఇరాన్ విషయంలో మేం చూపించిన సహనం మాలో చచ్చిపోతుంది. వెంటనే ఇరాన్లోని అన్ని చమురు క్షేత్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలు, ఖర్గ్ ద్వీపంసహా ఉప్పునీటిని తాగు నీటిగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లనూ సర్వనాశంచేస్తాం. ఇరాన్ గత 47 ఏళ్ల ఉగ్రపాలనలో వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’అని ట్రంప్ హెచ్చరించారు. ఖర్గ్ను స్వాధీనం చేసుకోవచ్చేమో.. ఇరాన్ చమురు మౌలికరంగంలో గుండెకాయ అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకునే ఆలోచన ఉందని ట్రంప్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. ఈ విషయంలో మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయి. మా పంతం నెగ్గాలంటే ఖర్గ్ ద్వీపం మా అ«దీనంలో ఉంటే మంచిదేమో. దానిని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్ వద్ద లేదు. సులభంగా స్వా«దీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. డిమాండ్లను తప్పుబట్టిన ఇరాన్ అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను ఇరాన్ చెత్త ప్రతిపాదనలుగా అభివరి్ణంచింది. ‘‘గల్ఫ్ అరబ్ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలు ప్రవేశించాయి. కానీ పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లోకి అమెరికా సేనలు అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్నీ సముద్ర మందుపాతరలతో నింపేస్తాం. అమెరికా పంపిన డిమాండ్లు అన్నీ అతిగా, అవాస్తవంగా, ఏమాత్రం హేతుబద్ధత లేకుండా ఉన్నాయి’’ అని ఇరాన్ విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ వ్యాఖ్యానించారు. పాక్ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ‘‘ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటమాటకి మాటిమాటికీ మారుతోంది. మధ్యవర్తిత్వంపై అమెరికా పిల్లిమొగ్గలేస్తోంది. మేం స్థిరంగా ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే. కానీ అసలే పోరు మొదలెట్టింది ఎవరు?’’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. అమెరికా బలగాల కోసం ఇరాన్ సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాగానే కాల్చి బూడిదచేస్తాం. అమెరికా మిత్రదేశాలకూ ఇదే మా హెచ్చరిక’’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాహ్ అన్నారు. ఇరాన్ దాడుల పరంపర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సోమవారం సైతం దాడులను కొనసాగించింది. కువైట్లోని జల, విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్ బాంబులేసింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్పై క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి. దుబాయ్లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్ దాడులుచేసింది. దీంతో ఆ ప్రాంతమంతా హెచ్చరికల సైరన్లతో మోగిపోయింది. అయితే ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,900 మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలోముగ్గురు ఐరాస శాంతివిభాగ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ శివారు టైర్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. మరోవైపు ఇరాక్లోని మొహమ్మద్ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి తమ ఆంటోనోవ్–132 ఆర్మీ రవాణా విమానం ధ్వంసమైందని ఇరాక్ రక్షణ శాఖ తెలిపింది.గగనతలాన్ని మూసేసిన స్పెయిన్ ఇరాన్పై దాడుల కోసం అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న స్పెయిన్ సోమవారం తమ ఎయిర్స్పేస్ను మూసేసింది. ‘‘సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనికస్థావరాలను యుద్ధం కోసం ఉపయోగించకూడదు. కానీ మా మాట అమెరికా వినట్లేదు. అందుకే మా గగనతలాన్ని మూసేస్తున్నాం. ఈ యు ద్ధం చట్టవ్యతిరేకం, అన్యాయం’’అని స్పెయిన్ రక్షణమంత్రి మార్గరీటీ రూబెల్స్ ప్రకటించారు. నేవీ చీఫ్ మరణాన్ని ద్రువీకరించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని నేవీ విభాగ సారథి అలీరెజా తంగసిరి ఇటీవల దాడుల్లో కన్నుమూశారని ఇరాన్ ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ నేవీ రియర్ అడ్మిరల్ను గత గురువారమే అంతంచేశామని ఇజ్రాయెల్ ప్రకటించినా ఇప్పటిదాకా ఇరాన్ ధ్రువీకరించలేదు. ‘‘దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీరెజా అమరుడయ్యారు. దేశసేవలో అత్యున్నత త్యాగం చేశారు’’ అని ఇరాన్ నేవీ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేసింది. కువైట్లో భారతీయుని దుర్మరణం కువైట్లో సముద్రనీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లో పనిచేస్తున్న ఒక భారతీయుడు సోమవారం ఆ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతినడంతో ఇతను చనిపోయాడని కువైట్ విద్యుత్, జల, పునరుత్పాదక ఇంధన శాఖ తెలిపింది. -
ఇరాన్తో చర్చలు.. వైట్హౌస్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ట్రంప్ అదనపు బలగాల్ని యుద్ధ క్షేత్రంలోకి తరలిస్తుంటే.. ఇరాన్ సైతం నరకానికి స్వాగతం అని సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. యుద్ధం ముగింపుకు చర్చలు సజావుగా సాగుతున్నాయని వెల్లడించింది.ఇరాన్లో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మట్లాడారు." ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా చేసే ప్రకటనలకు, తెరవెనుక అమెరికా అధికారులతో జరుపుతున్న చర్చలకు చాలా తేడా ఉంది అని ఆమె పేర్కొంది.అదేవిధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు కొన్నిమీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని ఆమె కొట్టిపడేశారు. ఇరాన్ పాలకుల బహిరంగ హెచ్చరికలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలు మాత్రం సజావుగానే జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.అయితే కరోలిన్ ప్రకటనకు వాస్తవ పరిస్థిలకు చాలా భిన్నంగా ఉంది. ఇరాన్ మాత్రం చర్చలు జరగట్లేదని గట్టిగా చెబుతోంది. ట్రంప్ సైతం వేల సంఖ్యలో అదనపు బలగాల్ని ఇది వరకే మధ్యప్రాచ్యానికి తరలించారు. హార్మూజ్ తెరవకపోతే దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
టెహ్రాన్పై అణుదాడి ప్లాన్? UNO మాజీ అధికారి సంచలన ఆరోపణ
ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్ దౌత్యవేత్త, మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్పై అణు ఆయుధాలను ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఇరాన్ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందించడంతో పరిస్థితులు చేజారిపోయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుఎన్కు చెందిన సీనియర్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తోందన్నారు.ఈ మేరకు మహమ్మద్ సఫా తన రాజీనామా లేఖను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు."ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు, ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ, ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవడం వికృతమైన ఆలోచన. వాషింగ్టన్ లేదా లండన్ వంటి నగరాలపై అణు దాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది" అని హెచ్చరించారు.మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ "నేరానికి" సాక్షిగా ఉండలేక, తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు సఫా పేర్కొన్నారు. టెహ్రాన్ కేవలం ఎడారి కాదని, అక్కడ కోటి మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తివంతమైన లాబీకి తొత్తులుగా మారారని సఫా ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నా, UN అధికారులు వారిని ప్రశ్నించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని ఆయన పిలుపునిచ్చారు.I don't think people understand the gravity of the situation as the UN is preparing for possible nuclear weapon use in Iran.This is a picture of Tehran. For you uneducated, untraveled, never-served, warhawks licking your chops at the thought of bombing it. It's not some low… pic.twitter.com/BnzB4F3001— Mohamad Safa (@mhdksafa) March 29, 2026 -
వీటిని పేల్చేస్తాం.. అంతా స్మాష్: ట్రంప్ అల్టిమేటం
వాషింగ్టన్: పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారే అవకాశాలు కనపడుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (మార్చి 30) ఇరాన్కు మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం త్వరగా కుదరకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఖర్గ్ దీవిని పూర్తిగా పేల్చి నాశనం చేస్తామని అన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్ ద్వారా ఈ హెచ్చరిక జారీచేశారు. ఇరాన్ వెంటనే హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.“ఇరాన్లో మా సైనిక చర్యలను ముగించేందుకు సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. మంచి పురోగతి జరిగింది. కానీ, ఏదైనా కారణంతో ఒప్పందం త్వరగా కుదరకపోతే, అలాగే హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ దీవిని పేల్చి పూర్తిగా నాశనం చేస్తాం. ఇప్పటివరకు మేము కావాలనే వీటి జోలికి వెళ్లలేదు” అని చెప్పారు. ఇరాన్లో గత 47 సంవత్సరాలుగా భయంకర పాలకులు ఉన్న సమయంలో తమ సైనికులు, ఇతరులను ఆ దేశం చంపినందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కాగా, అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలూ జరగలేదని ఇరాన్ అంటోంది. అయితే, ఇరాన్ తస్నీమ్ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికకు పాకిస్థాన్ ద్వారా ఇరాన్ స్పందనను పంపింది.“అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా అన్యాయమైన డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా దౌత్యంలో మార్పులు ఉంటున్నాయి. మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధం ముగించాలని పశ్చిమాసియాలో వస్తున్న విజ్ఞప్తులకు స్వాగతం, కానీ ప్రారంభించినది ఎవరో గుర్తుంచుకోండి” అని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది.ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సోమవారం (మార్చి 30న) కూడా కొనసాగాయి. ఇరాన్లో పెంటగాన్ కొన్ని వారాల పాటు భూతల దాడులు చేయడానికి సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దాదాపు 10,000 మంది సైనికులను పంపే ప్రణాళిక ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గత వారం 3,500 మంది సిబ్బందిని అమెరికా పంపింది. అందులో 2,200 మెరైన్లు ఉన్నారు. ఇంకా వేలాది మంది 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి రాబోతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఖర్గ్ దీవిపై దృష్టి సారించారు. -
శ్రీలంకలో విద్యుత్ షాక్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్ టారిఫ్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పొందిన 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
ట్రంప్నకు షాక్ల మీద షాక్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా ఇరాన్ ఎంతకీ తగ్గకపోవడంతో డొనాల్డ్ ట్రంప్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరింత దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్ నుంచి ఏ ముప్పు వస్తుందోననే భయం ట్రంప్లో నెలకొంది. అలాగని కొన్ని రోజుల పాటు వార్కు గ్యాప్ ఇచ్చారు ట్రంప్. అదే సమయంలో ఇరాన్కు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే మధ్యవర్తిత్వాన్ని జరుపుతున్నారు. ఇందుకు ట్రంప్.. పాకిస్తాన్ను మధ్యలో పెట్టుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం వీటికి ససేమేరా అంటోంది. యుద్ధానికి ఘనమైన ముగింపు ఏంటో తామే ఇస్తామని, ఇటువంటి అర్థం పర్థం లేని మధ్యవర్తిత్వాలు వద్దనే అంటోంది. మధ్యవర్తిగా తమ పాత్ర పట్ల అమెరికా, ఇరాన్లు రెండూ సంతృప్తిగా ఉన్నాయని పాకిస్తాన్ చెప్పిన రోజుల వ్యవధిలోనే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వాదనలను తోసిపుచ్చింది. మధ్యవర్తి ద్వారా తమకు అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అందాయని పేర్కొంది. అమెరికా తమతో నేరుగా చర్చలు జరపలేదని, మధ్యవర్తిత్వాల ద్వారా యుద్ధం ముగింపు అనేది ఉండబోదని తేల్చిచెప్పింది. ఒకవేళ అమెరికా తమతో తాము పెట్టే కండీషన్స్కు డైరెక్ట్గా మాట్లాడి ఒప్పుకుంటేనే అప్పుడు యుద్ధం ముగింపు ఆలోచిస్తామని స్పష్టం చేసింది. తమకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది వద్దే వద్దని, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటోంది, పాక్.. అమెరికా వదిలిన అస్త్రం!పాక్ అనేది అమెరికా వదిలిన అస్త్రమనే విషయమని ఇరాన్కు అర్థమైంది. ఇన్ని ప్రపంచదేశాలు ఉండగా పాకిస్తాన్నే మధ్యవర్తిగా అమెరికా పెట్టుకోవడంపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. తమకు ఏదో రకంగా నష్టం కల్గించాలనే యోచనతోనే పాకిస్తాన్ను అమెరికా వాడుకుంటుందని, ఆ పావులో తాము పడకూడదనే భావన ఇరాన్లో స్పష్టంగా కనబడుతోంది. మాట్లాడితే మీరు డైరెక్ట్గా మాట్లాడండి.. ఇలా మధ్యవర్తిత్వం, అందులోనూ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటే సహించలేకపోతోంది ఇరాన్. యుద్ధం ముగింపు విషయం తమ వైఖరి స్పష్టంగా ఉందని, దౌత్యం విషయంలో అమెరికా తరచు మాటమారుస్తుందని ఇరాన్ అంటోంది. ఒకవేళ తమ మధ్యవర్తిత్వం అనేది చేస్తే అమెరికా తలతూగే ఏ పెద్ద దేశమో చేయాలి కానీ ఇలా పాకిస్తాన్ను మధ్యలో తీసుకురావడం ఏంటనేది ఇరాన్ ప్రశ్నగా ఉంది. అందుకే యుద్ధం విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. డైలమాలో ట్రంప్..ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పాకిస్తాన్తో రాయబారం నడుపుతుంది. ఇరాన్తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్.. అందుకు పాక్ను ఎన్నుకున్నారు. ఇరాన్ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్.. ఇక పాక్ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్ ఇచ్చారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్లో ట్రంప్ పడ్డారని, అందుకే ఇరాన్పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. మరొకవైపు అమెరికాలో తీవ్రస్థాయిలో నిరసనలు కూడా ట్రంప్ను డైలమాలోకి నెట్టేశాయి. ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్ మాట.. ఇరాన్ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్ నిపుణుల అభిప్రాయం. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. అంటే నేరుగా అమెరికానే ఇరాన్తో చర్చలు జరిపితేనే ఇది ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ట్రంప్కు స్పెయిన్ షాక్..ట్రంప్నకు మరోషాక్ తగిలింది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ అనమతి నిరాకరించింది. ఇరాన్పై యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తన వైఖరిని కఠినతరం చేస్తూ, అమెరికా యుద్ధ విమానాలకు తన గగనతలంతో పాటు సైనిక స్థావరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇరాన్తో యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. -
ట్రంప్కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, ఇరన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దాడిలో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అసలు ప్రాణాలతో లేడని ఇలా పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ఇరాన్ మోజ్తబా గాయపడినా, ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు.కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుత యుద్ధంలో మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ ప్రజలకు తమ నాయకుడు మొజ్తబా ఒక లిఖిత సందేశంలో కృతజ్ఞతలు తెలిపారని ఇరాన్ మీడియా మార్చి 29న తెలిపింది.మొజ్తబా ఖమేనీ స్వయంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు ఆచూకీపై తీవ్ర పుకార్లు చెలరేగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అంశంపై గత వారం మాట్లాడుతూ, తాము ఇరాన్లోని ఒక ముఖ్య వ్యక్తితో చర్చలు జరుపుతున్నామనీ కానీ అది సుప్రీం లీడర్తో మాత్రం కాదు, ఆయన అసలు బతికి ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఈ వ్యాఖ్యల తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సందేశంప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా-ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఒక లేఖను విడుదల చేశారు. అలాగే ఇరాన్పై దురాక్రమణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసు కున్నందుకు ఇరాక్ సుప్రీం మత పెద్ద గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అక్కడి ప్రజలకు ఇరాన్ పట్ల వారు చూపుతున్న మద్దతుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మోజ్తబా ఖమేనీ బయట కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆయన వైమానిక దాడిలో గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు మరియు ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రూహోల్లా ఖొమేనీ మరియు అలీ ఖమేనీల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇరాన్కు మూడవ సుప్రీం లీడర్ అయ్యారు.ఇదీ చదవండి : రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా -
400 కేజీల యురేనియం ఎత్తుకొచ్చేయండి?! : ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే, ట్రంప్ నిప్పుతో చెలగాటం ఆడినట్లే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు చేపట్టకూడదని ఆయన పలు మార్లు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇరాన్లోని 450 కిలోలకుపైగా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక చర్యను పరిశీలిస్తున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ను నిర్వహించాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల్లో, ఇరాన్లో ఉన్న 453.5 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక దళాలను పంపే యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే, అమెరికా సైనికులు ఇరాన్లో కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాల్సి రావచ్చు. -
అమెరికాలో ‘నోకింగ్స్’ ఉద్యమం.. బెంబేలెత్తిస్తున్న ‘సికాడా’ వేరియంట్?!
వాషింగ్టన్: అమెరికాలో ఇరాన్పై యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ‘నో కింగ్స్’ నినాదంతో సుమారు 8 మిలియన్ల మంది పాల్గొన్న ఈ నిరసన అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇదే సమయంలో, అమెరికాలో కొత్తగా గుర్తించిన కోవిడ్-19 వేరియంట్ ‘సికాడా’ (BA.3.2) ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒమిక్రాన్ జాతికి చెందిన బీఏ.3 వేరియంట్ నుంచి పుట్టినదిగా వైద్యులు నిర్ధారించారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.అయితే, ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ప్రజలు ఆందోళన చేస్తుండగా.. జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 వేరియంట్ వ్యాప్తి విజృంభిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024లో దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ అప్పట్లో పెద్దగా వ్యాప్తి చెందలేదు. కానీ 2025లో మోజాంబిక్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మిచిగన్, న్యూయార్క్, మిస్సోరీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ఇది వెలుగులోకి వచ్చింది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదికల ప్రకారం, వేస్ట్వాటర్ సర్వైలెన్స్, క్లినికల్ నమూనాలు, ప్రయాణికుల పరీక్షల ద్వారా ఈ వేరియంట్ గుర్తించబడింది. అమెరికాలో మొత్తం 25 రాష్ట్రాల్లో ఇది ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాల్లో ఇది కనిపించింది.‘సికాడా’ వేరియంట్ లక్షణాలు సాధారణ కోవిడ్ లక్షణాలతో పోలి ఉంటాయి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఇది వాక్సిన్ లేదా గత ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న ‘నో కింగ్స్’ ఆందోళనతో పాటు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. -
ఇక ప్రోగ్రామర్లకు గుడ్బై: గూగుల్ మాజీ సీఈఓ
‘సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇంజనీర్లు నెలల తరబడి చేసే పనిని, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఏఐ సాయంతో ఒకే రాత్రిలో పూర్తి చేసేస్తున్నాడు’.. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ కిడ్మట్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి.నిద్రపోతున్నప్పుడు పని పూర్తి చేసే ఏఐటాప్ ప్రోగ్రామర్లు ఇప్పుడు స్వయంగా కోడింగ్ రాయడం మానేశారని ఎరిక్ తెలిపారు. దానికి బదులుగా వారు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఫలితాలను సరిచూసే ‘టెస్ట్ ఫంక్షన్స్’ రాస్తున్నారు. మిగతా పనినంతా కృత్రిమ మేధ చూసుకుంటోంది. తన స్టార్టప్లోని ఒక ప్రోగ్రామర్ చేసే పనిని ఆయన ప్రస్తావించారు. ఆ ప్రోగ్రామర్ సాయంత్రం ఏఐకి పని అప్పజెప్పి నిద్రపోతే, తెల్లవారుజామున 4 గంటలకల్లా ప్రాజెక్ట్ పూర్తవుతోంది. ఇదే పనిని గూగుల్లో చేయాలంటే 10 మంది ప్రోగ్రామర్లు, ఆరు నెలల సమయం పట్టేది’ అని ఆయన పేర్కొన్నారు.ఉద్యోగాలు పోతాయా?ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాముఖ్యత తగ్గుతుందని భావిస్తున్న వారికి ఎరిక్ ఒక కొత్త కోణాన్ని చూపారు. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు డిమాండ్ తగ్గకపోగా, మరింత పెరుగుతుందన్నారు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే భవిష్యత్తులో కొత్త ప్రపంచాలను సృష్టిస్తారని చెప్పారు. కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు.. అకౌంటింగ్, బిల్లింగ్, లాజిస్టిక్స్ తదితర ఖర్చుతో కూడిన వ్యాపార కార్యకలాపాలను కూడా ఏఐ సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.2029 నాటికి భారీ మార్పులుఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) 2029 నాటికే అందుబాటులోకి రావచ్చని ఎరిక్ అంచనా వేశారు. స్వయంగా నేర్చుకుని, ప్లాన్ చేసుకునే ఏఐ వ్యవస్థల వల్ల వైద్యం, వాతావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఆయన వివరించారు. మొత్తం మీద, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ‘కోడింగ్’ నుంచి ‘ఆర్కెస్ట్రేటింగ్’ (ఏఐని నడిపించడం) వైపు మారుతోందని ఎరిక్ కిడ్మట్ తెలిపారు.ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా -
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్ దార్ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.#Pakistan के Deputy Prime Minister और Foreign Minister #Ishaq_Dhar ज़मीन पर धड़ाम!इशाक Saudi और Egypt के विदेश मंत्रियों का स्वागत कर रहे थे कि चलते चलते अचानक गिर गए.. pic.twitter.com/0H2aNHdP6i— Ruby Arun रूबी अरुण (@arunruby08) March 29, 2026దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Ishaq Dar sends his regards and slots to the Foreign Ministers of Iran and Egypt like this.It's a new style of slots of Pakistan military regime 😂Note: None should try this kind of slots it's just Pakistan military regime style 😀 😂 pic.twitter.com/QbaXf36Aea— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 29, 2026 -
అమెరికా 'కమాండర్లు, రాజకీయ నాయకుల’ ఇళ్లపై దాడి చేస్తాం: ఇరాన్
టెహ్రాన్: చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు. అయితే, అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ భూభాగాల్లో భూతల దాడులు చేస్తే ఉపేక్షించబోమని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ మానసిక యుద్ధానికి తెరతీసిందిఇరాన్లోని ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సమన్వయంతో సైనిక దాడులు చేస్తామని తెలిపారు. ట్రంప్ ఇరాన్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలనే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘యుద్ధభూమి నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైన్యం, ఇరాన్ యోధుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది’. అమెరికా చర్యలు చివరికి అవమానం, బంధనం, వినాశనం దిశగా తీసుకెళ్తాయి. పర్షియన్ గల్ఫ్లో సొరచేపలకు అమెరికా సైనికులు ఆహారం అవుతారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ కమాండర్ సయ్యద్ మజీద్ మౌసావీ మాట్లాడుతూ.. మా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లోని నియోట్ హోవావ్లోని కెమికల్ ప్లాంట్, ఒక రిఫైనరీ, రెండు స్టీల్ కాంప్లెక్స్లు, రెండు అల్యూమినియం కాంప్లెక్స్లు లక్ష్యంగా దాడులు చేస్తాం. మీరు (అమెరికా-ఇజ్రాయెల్) బాధను అనుభవించే వరకు మా దాడులు కొనసాగుతాయి’ అని అన్నారు.మొత్తం మీద, ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియా భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. -
ఇరాన్ యుద్ధం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయంకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు జరిపిన అమెరికా సైన్యం.. ఇకపై భూతల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు.. ఇరాన్ సైతం ప్రతిదాడులు జరుపుతోంది. ఇక, తాజాగా కువైట్పై ఇరాన్ జరిపిన దాడుల్లో భారత కార్మికుడు మృతి చెందాడు.వివరాల మేరకు.. కువైట్లో ఇరాన్ చేసిన దాడుల్లో ఓ భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఇరాన్ దాడులలో భాగంగా కువైట్లోని ఒక ప్రధాన విద్యుత్, నీటి డీసాలినేషన్ ప్లాంట్లోని సర్వీస్ భవనం లక్ష్యంగా మారింది. ఈ దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందగా, భవనానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి వల్ల ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి నష్టం నియంత్రణ చర్యలు చేపట్టాయి.దీంతో పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య కనీసం ఎనిమిదికి చేరింది. ఇక, గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఒక భారతీయుడు క్షిపణి అవశేషాలు పడటంతో మరణించాడు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఏడు భారతీయులు మరణించారని, ఒకరు కనిపించలేదని తెలిపింది. తాజా ఘటనతో సంఖ్య పెరిగింది. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది. -
కువైట్: క్షిపణి దాడిలో భారత కార్మికుడు మృతి
కువైట్ సిటీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా ఎగబాకుతున్నాయి. ఇరాన్ జరిపిన తాజా క్షిపణి దాడిలో కువైట్లో పని చేస్తున్న ఓ భారత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం కువైట్లోని ఒక విద్యుత్, నీటి శుద్ధీకరణ ప్లాంట్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ప్లాంట్పై విరుచుకుపడ్డ క్షిపణులుఇరాన్ జరిపిన ఈ దాడిలో ప్లాంట్లోని ఒక సర్వీస్ భవనం పూర్తిగా ధ్వంసమైందని కువైట్ విద్యుత్, నీటి వనరుల శాఖ ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ మీడియాకు తెలిపారు. ‘ఇరాన్ దురాక్రమణలో భాగంగా జరిగిన ఈ దాడిలో మన భారత సోదరుడు మరణించడం అత్యంత బాధాకరం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నికల్ టీమ్స్, ఎమర్జెన్సీ క్రూ రంగంలోకి దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మతులు చేపడుతున్నాయి.వందలాది క్షిపణులతో దాడులుఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్ రక్షణ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన నెల రోజుల్లో ఆ దేశంపై ఏకంగా 307 బాలిస్టిక్ క్షిపణులు, 2 క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లతో దాడులు జరిగాయి. కేవలం గత 24 గంటల్లోనే 14 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లను కువైట్ సైన్యం అడ్డుకుంది. మరోవైపు ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీ గోడౌన్లతో పాటు ఒక సైనిక స్థావరంపై జరిగిన దాడిలో పది మంది సైనికులు గాయపడ్డారు.‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కువైట్ ప్రభుత్వం తమ పౌరులను, విదేశీ కార్మికులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా దళాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ -
ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపం మాదే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్కు కీలక ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నిజం చెప్పాలంటే, ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు 'మీరెందుకు అలా చేస్తున్నారు?' అని అంటారు. కానీ వాళ్లే మూర్ఖులు’ అంటూ మండిపడ్డారు. అలాగే, ఇరాన్పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని.. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని.. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ రక్షణ ఏర్పాట్ల గురించి అడగ్గా, ట్రంప్ స్పందిస్తూ.. వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే, ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు.అమెరికాకే ముప్పు..?మరోవైపు.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులు తరలివస్తున్నారు. ఈ సంఘర్షణలో ఖర్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక అమెరికా సైనిక ఎంపికగా ఉందని ఇటీవలి వారాల్లోని నివేదికలు కూడా సూచించాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అధిక భాగం జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఖార్గ్ ద్వీపంపై ఎలాంటి దాడి అయినా అత్యంత ప్రమాదకరమని, అది అమెరికా సైనికుల ప్రాణనష్ణాన్నిపెంచుతుందని, సంఘర్షణను పొడిగించే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకదానికి ముప్పు వాటిల్లుతుందని సైనిక విశ్లేషకులు హెచ్చరించారు.JUST IN: 🇺🇸🇮🇷 President Trump confirms he is considering seizing Iran's Kharg Island, FT reports."My preference would be to take the oil…I don't think they have any defense. We could take it very easily." pic.twitter.com/W7Ze4jj4Zi— BRICS News (@BRICSinfo) March 30, 2026ఇక, పలు నివేదిక ప్రకారం, ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు నిలుపుకోవడం వంటి కార్యకలాపాల కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను మోహరించాలని పెంటగాన్ ఇప్పటికే ఆదేశించింది. దాదాపు 2,200 మంది మెరైన్లతో సహా సుమారు 3,500 మంది సిబ్బంది శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మరో 2,200 మంది మెరైన్లు మార్గంలో ఉన్నారు. వాషింగ్టన్ సాధ్యమయ్యే విస్తరించిన కార్యకలాపాలకు సిద్ధమవుతున్నందున, 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన వేలాది మందిని కూడా మోహరించాలని ఆదేశించారు.పెరుగుతున్న మరణాల సంఖ్యయుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అటు ఇజ్రాయెల్లో 19 మంది మరణించారు. లెబనాన్లో 1,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ఎందరొచ్చినా మసి చేస్తాం : ఇరాన్
-
అమెరికాకు టెన్షన్.. ఉత్తర కొరియా సంచలన క్షిపణి ప్రయోగం
సియోల్: అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకే క్షిపణి ఇంజిన్ను ఉత్తర కొరియా పరీక్షించింది. కార్బన్ ఫైబర్ మెటీరియల్తో రూపొందించిన ఈ ఇంజిన్లో ఘనరూప ఇంధనాన్ని వాడే వీలుందని అధికార వార్తా సంస్థ కేఎస్సీఎన్ తెలిపింది. ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారని తెలిపింది. బాలిస్టిక్ క్షిపణి సంపత్తిని సమకూర్చుకునే క్రమంలో ఈ పరిణామం ఒక మైలురాయి వంటిదని కిమ్ పేర్కొన్నట్లు వెల్లడించింది. 2,500 కిలోటన్నుల బరువైన ఈ ఇంజిన్ను అమర్చిన క్షిపణి సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకగలదని పేర్కొంది. -
ఉక్రెయిన్ దాడితో రష్యా పోర్టులో మంటలు
మాస్కో: రష్యాలోని అతి పెద్ద పెట్రోలియం ఎగుమతుల కేంద్రం ఉస్ట్–లుగా నౌకాశ్రయంపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. పోర్టులో భారీగా మంటలు చెలరేగాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ పోర్టుపై బుధవారం కూడా ఉక్రెయిన్ దాడి జరిపింది.రష్యా కీలక ఆదాయ వనరులైన ఇంధన వ్యవస్థలపై ఉక్రెయిన్ వరుసగా దాడులు చేస్తోంది. నల్ల సముద్ర తీరంలోని నొవొరొస్సియాస్క్, ప్రిమోర్స్క్ పోర్టులపై దాడులతో అక్కడి నుంచి రష్యా ఇంధన వనరుల ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా ఎంతో కీలకంగా ఉంది. -
అది ట్రంప్ జలసంధి
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి పేరు, ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు చర్చనీయాంశాలయ్యాయి. దీంతో ఆ జలసంధికి తన పేరు పెట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్చేశారు. ఆదివారం ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీ నగరంలో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ ప్రసంగిస్తూ హార్మూజ్ జలసంధి అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇరాన్ వెంటనే ట్రంప్ జలసంధిని, అంటే హార్మూజ్ను తెరవాలి.దాన్ని పొరపాటున ట్రంప్ జలసంధి అన్నానని మీడియాలో తప్పుడు కథనాలు వెలువడతాయేమో. అదేమీ లేదు. నేను పొరపాటు చేస్తే అది పెద్ద వార్తే అవుతుంది’’ అని అనగానే మీడియా ప్రతినిధులు ఘొల్లున నవ్వారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ‘‘అవును. అధ్యక్షుడు చెబుతున్న ఆ ‘ట్రంప్ జలసంధి’ సరిగ్గా ఎప్స్టీన్ దీవులకు పక్కనే ఉంది’’ అంటూ ఎద్దేవా చేసింది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో ట్రంప్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుండటం తెలిసిందే. -
ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి
టెహ్రాన్: అమెరికా దాడుల్లో ఓ ప్రాథమిక పాఠశాలలో 168 చిన్నారుల మరణాలకు కారకులైన ఆ దేశ అధికారుల ఫొటోలను ఇరాన్ ఆదివారం విడుదలచేసింది. ‘‘ఈ నేరగాళ్లను గుర్తించుకోండి. వీరి పేర్లు యూఎస్ఎస్ స్ప్రుయన్స్ యుద్ధనౌక కమాండర్ లీగ్ ఆర్ టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ.యార్క్. పాఠశాలపై తోమహాక్ క్షిపణులు ప్రయోగానికి ఆదేశాలిచ్చింది వీళ్లే’’ అంటూ భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ‘‘ఇంతటి దారుణానికి పాల్పడ్డాక కూడా వాళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోయారో.బాధితుల కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం వారికుందా?’’ అని నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రశ్నించింది. మినాబ్లోని షజారాహ్ తయ్యబే స్కూల్పై జరిగిన ఆ దాడితో తమకు సంబంధం లేదని అమెరికా బుకాయించినా తర్వాత తన తప్పిదాన్ని ఒప్పుకుంది. ‘‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్థావరంపై దాడి చేయాలనుకున్నాం. కాలం చెల్లిన నిఘా మ్యాప్ల వల్ల పాఠశాల భవనాన్ని సైనిక స్థావరంగా భావించి పొరపాటున బాంబులేశాం’’ అంటూ తీరిగ్గా చింతించింది! -
ఆకాశంలో కమాండ్ సెంటర్!
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో ‘ఇ–3సీ సెంట్రీ’ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే! ఎందుకంటే దాని ప్రత్యేకతలు అలాంటివి. ఇది నిఘా, పర్యవేక్షణ, కమాండ్ బాధ్యతలను ఏకకాలంలో నెరవేర్చగలదు. నావిగేషన్, కమ్యూనికేషన్, కంప్యూటేషన్ సేవలూ అందించగలదు. ఎయిర్బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)గా పిలుచుకునే ఈ ముందస్తు హెచ్చరికల విమానం గగనతలంలో చక్కర్లు కొట్టే కమాండ్ కేంద్రం! దీని తోకపై ఉండే 30 అడుగుల భారీ రాడార్ డిస్క్ అత్యంత శక్తిమంతమైనది.ఈ విమానం గాల్లో ఏకధాటిగా 9,300 కిలోమీటర్ల ప్రయాణిస్తూ వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు, క్షిపణుల జాడను పసిగట్టి సెకన్లలో సమాచారం చేరవేస్తుంది. భూ, గగనతల యుద్ధక్షేత్రంలో తాజా పరిస్థితులపై ఇదిచ్చే సమాచారంతోనే సైన్యానికి ఓ స్పష్టత వస్తుంది. దీన్ని సైన్యానికి కళ్లు, చెవులుగా చెప్పవచ్చు! భూ, సముద్రతలాలతో పాటు స్ట్రాటో ఆవరణం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూడా ఈ విమానం పసిగట్టి వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. విమానంలోని 14 కంప్యూటర్ తెరలపై తాజా సమాచారాన్ని గ్రాఫిక్ల రూపంలో చూడొచ్చు.తద్వారా క్షిపణులు, బాంబుల ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం వీలవుతుంది. ఆర్సీ–135 నిఘా విమానాలు, విమాన వాహననౌకలతో ఏకకాంలో సమాచారం పంచుకుంటూ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. బోయింగ్ తమ 707–320బీ విమానాన్ని ఆధునీకరించి ఇ–3సీ సెంట్రీ విమానంగా రూపొందించింది. ఒక్కో విమానం ఖరీదు రూ.6,640 కోట్లు. దశాబ్దాల క్రితం అమెరికా అమ్ములపొదిలో ఇవి 30 దాకా ఉండేవి. వీటి తయారీని బోయింగ్ నిలిపేయడంతో ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. 46 మీటర్ల పొడవైన ఈ విమానం గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భారీ నిఘా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లు అమర్చిన ఈ విమానం బరువు 1.57 లక్షల కిలోలు. ఇది గరిష్టంగా 29,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక భూతల యుద్ధం!
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం భూతలానికి విస్తరించేలా కనిపిస్తోంది. ముఖాముఖి పోరుకు అమెరికా, ఇరాన్ సై అంటే సై అంటున్నాయి. అమెరికా ఇప్పటికే వేలాది మంది జవాన్లను పశ్చిమాసియాకు తరలించింది. 3,500 మంది మెరైన్లు, సైనికులు ఆదివారం గల్ఫ్కు చేరుకున్నారు. ఇరాన్తో ప్రధాన భూభాగంతో పాటు ఖర్గ్ ద్వీపంపై దాడి చేసేంత దూరంలోనే మోహరించారు. పశ్చిమాసియాలో 50 వేల మందికి పైగా అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.వీరికి తోడు మరో 10 వేల మంది సైనికులను త్వరలో పశ్చిమసియాకు తరలించాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది శవాలేనంటూ హెచ్చరించింది. ఇరాన్ మిస్సైల్ లాంచింగ్, గగనతల రక్షణ వ్యవస్థలు, నౌకా మార్గాలను దెబ్బకొట్టి వెన్ను విరవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా ఆయువుపట్టైన ఖర్గ్ దీవిని దిగ్బంధిస్తే విధి లేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. ట్రంప్ బెదిరింపులతో సరిపెట్టబోరని, తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉన్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్ పరిస్థితి నరకప్రాయం అవుతుందని హెచ్చరించారు. దుబాయ్లో రెండు స్థావరాలపై దాడులు పశ్చిమాసియా యుద్ధం 30 రోజులకు చేరింది. దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 3 వేల మందికిపైగా మరణించారు. ఆదివారమూ పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. దాడుల్లో అల్ అరబీ టీవీ చానల్ కార్యాలయం ధ్వంసమైంది. ప్రసారాలు ఆగిపోయాయి. ఇజ్రాయెల్పైనా ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్పై కూడా దాడులు కొనసాగించింది. క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి.యెమెన్ హూతీలు ఇరాన్, లెబనాన్ హెజ్»ొల్లాతో కలిసి ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడ్డారు. జోర్డాన్లో అమెరికా ఎయిర్బేస్తోపాటు ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. దుబాయ్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపైనా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులకు పాల్పడింది. ఒక స్థావరంలో 400 మంది, మరోదాంట్లో 100 మంది జవాన్లున్నారు. వారిలో చాలామంది దాడిలకు బలైనట్టు ఇరాన్ సైన్యం చెబుతోంది. మృతదేహాలను, క్షతగాత్రులను చేరవేస్తూ అంబులెన్స్లు బిజీగా తిరగాయని పేర్కొంది. అమెరికాకు తీవ్ర నష్టం ఇరాన్ దాడుల్లో అమెరికాకు అనూహ్య నష్టం జరిగింది. సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై క్షిపణులు, డ్రోన్ల దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక అవాక్స్ నిఘా విమానంతో పాటు పలు రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. అవాక్స్ విమానాన్ని అమెరికా సైన్యానికి అతిపెద్ద ఆస్తిగా పరిగణిస్తారు. దాడిలో అది పనికిరాకుండా పోయింది. అమెరికాకు ఎంక్యూ–9 డ్రోన్లతో పాటు ఎఫ్–16 యుద్ధ విమానం కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఇజ్రాయెల్ వర్సిటీలు, గల్ఫ్లోని అమెరికా వర్సిటీల శాఖలపైనా దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ⇒ కీలకమైన అణు నిరాయు«దీకరణ ఒప్పందం (ఎన్పీటీ) నుంచి తప్పుకోవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు పెట్టింది. అణు శక్తి విషయంలో కొత్తగా అంతర్జాతీయ ఒప్పందం తేవాలని ఇరాన్ కోరుతోంది. ⇒ పశ్చిమాసియాలో శాంతి సాధనే ధ్యేయంగా పాకిస్తాన్లో ఆదివారం కీలక సమావేశం జరిగింది. సౌదీ అరేబియా, ఈజిప్టు, తుర్కియే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు.మేం వెయిటింగ్ : ఇరాన్ స్పీకర్ తమ భూతలంలోకి అమెరికా సేనల రాక కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ప్రకటించారు. ‘‘అమెరికా, దాని మిత్రదేశాల సైన్యాన్ని మసి చేస్తాం. ఆ దేశాలను శాశ్వతంగా శిక్షిస్తాం’’ అని హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇరాన్కు రష్యా సాయం: జెలెన్స్కీసౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి వెనుక రష్యా హస్తముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఎయిర్బేస్కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రష్యానే అందజేసిందన్నారు. ‘‘అమెరికా స్థావరాలపై దాడులకు రష్యా ముమ్మాటికీ సహరిస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా సమాచారం చేరవేస్తోంది’’ అని చెప్పారు. -
మోజ్తాబా ఖమేనీ లేఖ విడుదల.. ఏమన్నారంటే?
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా చేస్తున్న దురాక్రమణ ఖండించి ఇరాన్కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ బ్రతికి ఉన్నారో లేదో తెలియదు అని అన్నారు. అమెరికా జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోజ్తాబా ఖమేనీ ఇరాక్కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు.ఆ లేఖలో " అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధంలో మా దేశానికి మద్దతుగా నిలిచిన ఇరాక్ మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అలాగే ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలు". అని లేఖలో పేర్కొన్నారు. ఇరాన్పై జరుగుతున్న దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఇరాక్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవడాన్ని అభినందించారు.కాగా ఆయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ మూడవ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకూ మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం కొన్ని రాతపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు. గతంలో జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. -
గల్ఫ్కు అండగా ఉన్నాం.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉక్రెయిన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ సాయం కోరే దేశం మాత్రమే కాదని ఇతరులకు సాయం శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దుబాయిలో పర్యటనకు వెళ్లారు. ఖతార్తో 10 ఏళ్ల పాటు రక్షణ సహాకార ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. ఇటీవలే గల్ఫ్ దేశాలకు సహాయంగా వెళ్లిన ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో యుఏఈ, ఉక్రెయిన్ ఉమ్మడి సహకారంతో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.కాగా ఈ పర్యటనలో జెలెన్స్కీతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు రక్షణ అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఇరాన్ తమ దేశంలోని ప్రజలు, సంపదనే లక్షంగా చేసుకొని దాడులు జరుపుతుందని యుఏఈ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే ఇటీవల ఇరాన్ దాడులను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టెహ్రాన్ జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్పై నేరుగా దాడి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన సాయం అందిస్తోంది. -
నేపాల్ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం
నేపాల్లో ఇటీవల ఎన్నికైన నూతన ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇక నుంచి ఆ దేశంలో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేదించనున్నట్లు ప్రకటించింది. అక్కడి రాజకీయ నాయకుల ఆస్తులపై విచారణ జరపనున్నట్లు ప్రకటించింది.నేపాల్లో ఇటీవల బాలేంద్ర షా ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం అక్కడ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వ 100 రోజుల కార్యాచరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు 60 రోజుల్లోపు తమ కార్యాలయాలను విద్యా సంస్థల నుండి తొలగించాలని తెలిపింది. వాటి స్థానంలో కేవలం విద్యార్థుల సమస్యల కోసం మాత్రమే పనిచేసే "స్టూడెంట్ కౌన్సిల్" లేదా "వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్" వంటి రాజకీయ రహిత వేదికలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని తెలిపింది.అదేవిధంగా 5వ తరగతి వరకు సంప్రదాయ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదేశంలో విదేశీ పేర్లతో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ఆక్స్ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లతో ఉన్న పాఠశాలలు, కళాశాలలు ఈ ఏడాది లోపు తమ పేర్లను నేపాలీ పేర్లుగా మార్చుకోవాలని ఆదేశించింది. ఇది దేశీయ అస్తిత్వాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య అని ప్రభుత్వం తెలిపింది.2006 తర్వాత కీలక పదవుల్లో ఉన్న నాయకులు, అధికారుల ఆస్తులపై విచారణ జరిపేందుకు 15 రోజుల్లో ఒక శక్తివంతమైన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.కాగా గత ఏడాది జరిగిన 'జెన్ జీ' (Gen-Z) ఉద్యమం సమయంలో జరిగిన హింసకు బాధ్యుడిగా చేస్తూ మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలీని ఇటీవలే అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ దిగిపో.. USAలో 80 లక్షల మంది రోడ్లపైకి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పేరు వింటే చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచాన్నే సంక్షోభంలో నెట్టిపడేసారని ప్రజలంతా ఆయనపై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రికార్డు స్థాయిలో 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు అక్కడి పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ నిర్ణయాల పట్ల అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్దానికి నిరసన తెలపడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా 3,300 చోట్ల ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అమెరికా వ్యాప్తంగా ట్రంప్కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' అనే పేరుతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మీడియా కథనాల ప్రకారం ఈ ప్రదర్శనలు అమెరికా అంతటా 50 రాష్ట్రాల్లో 3,300 కి పైగా ప్రదేశాలలో జరుగగా రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. కాగా ఇదివరకే ట్రంప్కు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. గతేడాది అక్టోబర్లో జరిపిన నిరసన కంటే ఈ సారి దాదాపు 10 లక్షల మంది అధికంగా పాల్గొన్నారని 600కు పైగా అధికంగా ఈవెంట్లు నిర్వహించబడ్డాయని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా మెుదటిసారి జూన్ 2025లో తరువాత అక్టోబర్ 2025 లో రెండవ నిరసన జరిగింది. ట్రంప్, వాన్స్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఫ్లకార్డులు ప్రదర్శన చేపట్టినట్లు నిరసనలు జరిపారని కథనాలు పేర్కొన్నాయి.


