International
-
పాక్కు షాక్.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్
ఇరాన్ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇస్లామాబాద్లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం వెనక్కి తగ్గట్లేదుకాగా పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
F-15 జెట్ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్?
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఆందోళనకరంగా మారింది.నైరుతి ఇరాన్ ప్రాంతంలో (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్టాఫిక్గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అమెరికా వాదన ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం తెలిపినట్లు వైట్హౌస్ కథనాలు పేర్కొన్నాయి.ఇరాన్ వాదన అయితే జెట్ కూల్చివేతతో ఇరాన్లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఢాకా: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ఈ మేరకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగ్లాదేశ్లో ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశం 95 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరగడం, సరఫరా అస్థిరత పెరగడం వల్ల ప్రభుత్వం కఠినమైన ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని కేబినెట్ 180 రోజుల మితవ్యయ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, కొత్త వాహనాలు లేదా కంప్యూటర్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అధికారుల విదేశీ ప్రయాణాలను 50 శాతం తగ్గించడం, సమావేశాలు, సదస్సుల ఖర్చులను పరిమితం చేయడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల్లో అలంకార లైటింగ్ నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భారతదేశం ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేసింది. మరిన్ని సరఫరాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ముందుగానే మూసివేయడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా తగ్గిన సమయానికి పరిమితం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించనున్నాయి.మొత్తం మీద, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినమైన మితవ్యయ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, దీర్ఘకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. -
‘ఫ్రాడ్ జార్’ గా జేడీ వాన్స్..!
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏది చేసినా వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ప్రజల ఆగ్రహానికి గురౌవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్ను ఫ్రాడ్ జార్గా నియమించారు. అమెరికా ప్రభుత్వంలో పెద్దగా యాక్టివ్గా లేని జేడీ వాన్స్కు కావాలనే ఈ పదవి కట్టబెట్టారా? అనే చర్చ నడుస్తుంది.అయితే సాధారణంగా అమెరికాలో ఉపాధ్యక్షుడు, మంత్రి వర్గంలో సభ్యునిగా ఉన్న వ్యక్తికి ఈ పదవిని ఇస్తూ ఉంటారు. విశ్వసనీయ రాజకీయ నాయకుడిగా ఉన్న వారికి కూడా ఈ పదవిని అప్పగిస్తారు. ఫెడరల్ స్థాయిలో మోసాలపై దర్యాప్తు, పర్యవేక్షణ, చర్యలు తీసుకునే అధికారం ఫ్రాడ్ జార్కే ఉంటాయి. ఇవి ప్రత్యేక బాధ్యతలుగా చెబుతూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ను ఈ పదవిలో ప్రకటించడం వెనుక ఆంతర్యం రాజకీయపరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికాలో మోసపూర్వక లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రధానంగా డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడమేనని చర్చ నడుస్తోంది.ఈ పదవిని వాన్స్కు ఇవ్వడం ద్వారా డెమోక్రాటిక్ రాష్ట్రాల్లో అవినీతి, మోసాలు ఎక్కువగా ఉన్నాయనే సందేశం పంపడమే కాకుండా, ఇది ఆయన మద్దతు దారులకు కూడా తాము అవినీతిని అరికడతామనే సంకేతాలు కూడా పంపినట్లయ్యింది.ఇది వాన్స్కు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుంది, కానీ పార్టీ ఆధారిత లక్ష్యాలు ఉన్నాయనే విమర్శలు రావచ్చు.ట్రంప్ ప్రభుత్వానికి ఇది అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నామని బలమైన సంకేతం ఇవ్వొచ్చు కానీ రాజకీయ ఆయుధంగా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. డెమోక్రాటిక్ రాష్ట్రాలు ఇది ఫెడరల్ జోక్యంగా భావించి, చట్టపరమైన–రాజకీయ పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. -
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్ పైలెట్లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్ (IRGC) ప్రకటించింది. అమెరికా వెంటనే సెర్చ్ పార్టీలను పంపి పైలెట్లను వెతికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటనపై అమెరికా అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు, కానీ ఇరాన్ మీడియా ప్రచారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.అదే సమయంలో, ఇరాన్ గగనతలంపై అమెరికా అపాచీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ వర్గాలు ఈ హెలికాప్టర్లను టార్గెట్ చేశామని పేర్కొంటున్నాయి. మరోవైపు, అమెరికా రీ-ఫ్యూయెలింగ్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్-అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న సంకేతాలుగా భావించబడుతున్నాయి.ఈ సంఘటనలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత పొందలేదు. స్వతంత్ర ధృవీకరణ లేకపోవడంతో, ఇరాన్ ప్రకటనలు ప్రచార యుద్ధంలో భాగమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ఈ వార్తలు పశ్చిమాసియా భద్రతా పరిస్థితులను కుదిపేస్తూ, అమెరికా-ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పాకిస్తాన్ మొత్తం షట్డౌన్ కాబోతోందా?
ప్రస్తుతం మళ్ళీ 'లాక్డౌన్' అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్డౌన్ లాంటిది కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా మరియు అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? లాక్ డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్ డౌన్ లో పడ్డ కష్టాలు అటువంటివి మరి. అయితే మళ్ళీ మనం లాక్ డౌన్ లోకి వెళ్ళనున్నామా.. పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కాని ఈ సారి ఈ లాక్ డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో రానుంది. అసలు అక్కడ లాక్డౌన్ ఆలోచన వెనుక ఉన్న ప్రధాన కారణం 'ఇంధన కొరత'. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే, బయట దేశాల నుండి పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వారి దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే, దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి 'స్మార్ట్ లాక్డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తదితర ఉన్నతాధికారులు ఇటీవలే ఒక కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను , వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని వారు ప్రతిపాదించారు. అంటే పాకిస్తాన్లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేసేట్టుగా చూడాలి అని తీర్మానం చేశారు. అలాగే కార్యాలయాలకు వారంలో 5 రోజులు కాకుండా, కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు అలాగే విద్యుత్ వినియోగం తగ్గుతుందని వారి ప్లాన్.పాకిస్తాన్ లోని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాకిస్తాన్లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు (రాష్ట్రాలు) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ , సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేశాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో "కంప్లీట్ వీకెండ్ లాక్డౌన్" విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీనిని ఖండించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్డౌన్ లేదు. కేవలం పొదుపు చర్యలు (Austerity Measures) మాత్రమే అమల్లో ఉన్నాయి. ఫేక్ న్యూస్ని నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ఏ నిమిషమైనా లాక్ డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ఒక పక్క లాక్డౌన్ భయం, మరోపక్క ఆకాశాన్ని తాకుతున్న ధరలు. పాకిస్తాన్లో సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గోధుమ పిండి నుండి పప్పుల వరకు ప్రతి వస్తువు ధర రెండింతలు పెరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్డౌన్ విధిస్తే అది "పుండు మీద కారం చల్లినట్లు" అవుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మెరుగుపడాలంటే ఐఎంఎఫ్ (IMF) నుండి మరో విడత రుణం రావడం చాలా ముఖ్యం. కానీ ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులు సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ యుద్ధం గనుక మరింత ముదిరితే, చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని మూసివేయాల్సి రావచ్చు.మొత్తానికి చూస్తే, పాకిస్తాన్ ప్రస్తుతం ఒక "ఎకనామిక్ లాక్డౌన్"లో ఉంది. అధికారికంగా షాపులు తెరిచి ఉన్నా, కొనే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నా, అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఒక్క పాకిస్తాన్ కే కాదు మనకూ ఓ హెచ్చరికే.అప్పుడెప్పుడో కరోనా వేల కిలోమీటర్ల అవతల ఉంది మనకేం కాదులే అనుకున్న క్షణం పట్టలేదు కరోనా అనే మహమ్మారి మన పై విరుచుకుపడి లాక్ డౌన్ లోకి రోజుల్లో తీసుకువెళ్ళిపోయింది. మరి ఇప్పుడూ కరోనా కన్నా ప్రమాదమైన యుద్ధం క్షణక్షణం ఉత్కంఠతతో ఏ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపనుందో అర్ధం కాని పరిస్థితి. లాక్ డౌన్ అనేది మన లోగిలిలోకి రాకూడదని గట్టిగా అనుకుందాం ప్రార్ధిద్దాం. -
భూమిపై ఏలియన్స్ దాడి చేయబోతున్నాయా?
చీకటి పడితే మనం ఆకాశం వైపు చూస్తాం.. ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో ఏలియన్స్ ఉంటాయని, ఏదో ఒకరోజు అవి భూమిపైకి వస్తాయని మనం నమ్ముతాం. కానీ, ఒకవేళ ఆ ఏలియన్స్ రాక వెనుక ఉన్నది అంతరిక్ష జీవులు కాకుండా.. మన మధ్యే తిరుగుతున్న మనుషులు అయితే? మన కళ్లను మనమే నమ్మలేనంత భయంకరమైన ఒక 'ఫేక్ ఏలియన్ ఇన్వేషన్' (నకిలీ గ్రహాంతరవాసుల దాడి) జరగబోతోందా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజిల్బ్లోయర్ డాక్టర్ స్టీవెన్ గ్రీర్ బాంబు లాంటి నిజం పేల్చారు. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి 'డీప్ స్టేట్' పన్నిన అతిపెద్ద కుట్రను ఆయన బయటపెట్టారు. సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే మనం చూడబోయేది సినిమా కాదు, మానవ చరిత్రలోనే అతిపెద్ద మోసం!ముందుగా ఎవరీ స్టీవెన్ గ్రీర్ ఓ సారి చూద్దాం. అమెరికా ప్రభుత్వంలోని అత్యంత రహస్యమైన 'బ్లాక్ బడ్జెట్' ప్రాజెక్టుల గుట్టు విప్పిన వ్యక్తి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే చర్చ పక్కన పెడితే.. ఏలియన్స్ పేరుతో మనుషులను ఎలా భయపెట్టబోతున్నారో ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఆయన హెచ్చరిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వింత కాంతులు, గ్రహాంతర నౌకలు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. ఇది హాలీవుడ్ గ్రాఫిక్స్ కాదు.. అంతకంటే కొన్ని వందల ఏళ్లు ముందున్న సాంకేతికత! ఈ కుట్రను 'ప్రొజెక్ట్ బ్లూ బీమ్' అని పిలుస్తారు. దీని వెనుక ఉన్నది గ్రహాంతరవాసులు కాదు.. వాషింగ్టన్, లాంగ్లీ , గ్లోబలిస్ట్ కేంద్రాల్లో దాగి ఉన్న శక్తులు. వారు గత కొన్ని దశాబ్దాలుగా విరిగిపోయిన UFOల నుండి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వింత టెక్నాలజీని సంపాదించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనపైనే వాడబోతున్నారు. హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా ఆకాశంలో భారీ గ్రహాంతర నౌకలను సృష్టిస్తారు. అవి 100 శాతం నిజమైనవిగా కనిపిస్తాయి. అంతేకాదు, వారి దగ్గర ఉన్న 'యాంటీ గ్రావిటీ' విమానాలు సైనిక అధికారులను కూడా తికమక పెడతాయి. ఏంటి ఆశ్చర్యపోయారా...అయితే మీరు విన్నది నిజమే! కేవలం నౌకలే కాదు.. కృత్రిమంగా ల్యాబ్లలో తయారు చేసిన ఏలియన్ లాంటి జీవులను కూడా వారు రంగంలోకి దించవచ్చు. వీటిని చూసిన సామాన్య ప్రజలు అది నిజంగానే అన్యగ్రహ జీవుల దాడి అని నమ్ముతారు. గాల్లో నుండి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత భాషలు మనిషి మెదడును స్తంభింపజేస్తాయి. గ్రీర్ మాటల్లో చెప్పాలంటే.. "మన భూమిపై ఒక నకిలీ దాడిని సృష్టించే సామర్థ్యం వారికి ఉంది. అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు? సమాధానం చాలా సింపుల్.. అది 'అపరిమితమైన అధికారం'. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చావు భయం గురిచేసి, "మాకు రక్షణ కావాలి" అని వారు బ్రతిమిలాడేలా చేయడం. అప్పుడు, దేశాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసి, ఒకే ప్రపంచ ప్రభుత్వం (One World Government) ఏర్పాటు చేస్తారు. మీ ప్రతి కదలికపై నిఘా ఉంచుతారు. దేశాల సార్వభౌమాధికారం అంతమైపోతుంది. శాంతి పేరుతో మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారు.గత 20-30 ఏళ్లుగా సినిమాల్లో, వార్తల్లో UFOల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఒక పెద్ద 'సైకలాజికల్ ఆపరేషన్' (Psyop). ప్రజల మనసులను ఏలియన్స్ దాడికి మానసికంగా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ నాటకంలో చివరి అంకం మొదలైంది. ఆకాశంలో కాంతులు కనిపిస్తే, లేజర్ ఆయుధాలు మన నగరాలను నాశనం చేస్తుంటే.. మనం సైలెంట్గా లొంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి.. ఆ దాడి చేస్తున్నది నక్షత్రాల నుండి వచ్చిన వారు కాదు, మన భూమిపై ఉన్న కుట్రదారులు!గ్రీర్ హెచ్చరిక ఒక్కటే.. అప్రమత్తంగా ఉండండి. అసలైన శత్రువు అంతరిక్షంలో లేడు, వాడు మన కళ్ల ముందే అధికార పీఠాల్లో కూర్చుని ఉన్నాడు. వారు మన భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మోసం మీ కళ్ల ముందు జరగబోతోంది. మీరు దానిని నమ్ముతారా? లేక నిజం తెలుసుకుని ఎదురు నిలుస్తారా?వచ్చే కొన్ని ఏళ్లలో ఆకాశంలో వింతలు జరిగితే.. అద్భుతం అని మురిసిపోకండి, అది ఒక మృత్యుపాశం కావొచ్చు. గ్రీర్ బయటపెట్టిన ఈ నిజాలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.చీకటిని చూసి భయపడకండి.. వెలుగు వెనుక ఉన్న నీడను చూసి భయపడండి! -
చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం
చైనా తాజాగా చేసిన భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) గోబీ ఎడారిలోని జియుక్వాన్ సెంటర్ నుంచి ప్రయోగించిన టియాన్లాంగ్-3 రాకెట్ మధ్యలో లోపం రావడంతో మిషన్ విఫలమైంది. ఇది స్పేస్ ఎక్స్ (SpaceX Falcon 9) స్టార్లింక్కు పోటీగా పోటీగా అభివృద్ధి చేసిన చైనాలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడాన్ని ధృవీకరించింది. తాము ప్రయోగించిన టియాన్లాంగ్-3 రాకెట్ ప్రయోగం విఫలమైందని పేర్కొంది.టియాన్లాంగ్-3ను చైనా Starlink వంటి ఇంటర్నెట్ శాటిలైట్ మెగా-కాన్స్టెల్లేషన్లను ఏర్పాటు చేయడానికి కీలకంగా భావించింది. SpaceX Falcon 9కి ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది విఫలం కావడం చైనాలోని ప్రైవేట్ స్పేస్ రంగానికి పెద్ద దెబ్బ, ముఖ్యంగా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులలో ఆలస్యం అవుతుంది.ప్రయోగం వివరాలురాకెట్ పేరు: టియాన్లాంగ్-3అభివృద్ధి సంస్థ: బీజింగ్ ఆధారిత స్టార్టప్ స్పేస్ పయినీర్ప్రయోగ స్థలం: జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్, గోబీ ఎడారిప్రయోగ సమయం: ఏప్రిల్ 3, 2026, మధ్యాహ్నం 12:17 (స్థానిక సమయం)లోపం: మధ్యలో “flight anomaly” కారణంగా రాకెట్ విఫలమైంది -
లీటర్ పెట్రోల్ రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.లీటర్ పెట్రోల్ ధర రూ. 458ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.మన పరిస్థితి మెరుగ్గా ఉందిఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్ ఆఫ్రిది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలిఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్కు శుభవార్త -
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్రెన్ను వివాహం చేసుకుంది. యు, యుచెన్ (రెన్రెన్) ఈ మార్చిలో పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్)ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్ తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో పదేళ్ల రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!వీరిద్దరి పరిచయం ఎలా2025లో లైవ్ స్ట్రీమింగ్లో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు. ఈ పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.నెటిజన్లు స్సందన మల్టీ మిలియన్ డాలర్ల డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా, ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.యు వెన్హాంగ్ సక్సెస్ స్టోరీసామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్కాంగ్లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లతో విస్తరించింది.వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. -
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 1000 మంది మృతి!
జెరూసలేం: లెబనాన్పై ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో లెబనాన్పై జరిపిన దాడుల్లో దాదాపు 1000 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. లెబనాన్లో దాదాపు 3,500కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా స్పందిస్తూ..‘లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అన్ని ప్రధాన కేంద్రాలపై దాడులు జరిగాయి. వైమానికి, సముద్ర, భూ మార్గాల ద్వారా దాడులు చేశాం. దక్షిణ లెబనాన్లో ఐడీఎఫ్ దృఢ నిశ్చయంతో పనిచేస్తోంది. 91వ, 146వ, 36వ, మరియు 162వ డివిజన్లు దక్షిణ లెబనాన్లో లక్షిత కార్యకలాపాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం జరిగింది. అలాగే, ఉగ్రవాదులను నిర్మూలించడంతో పాటు, ఆ సంస్థకు సంబంధించిన సామర్థ్యాలను మరింత దెబ్బతీసి, దానిని ఆ ప్రాంతం నుండి తరిమివేసేందుకు ఒక కేంద్రీకృత భూతల ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాయి.ఇప్పటివరకు, అనేక మంది సీనియర్ కమాండర్లు, వందలాది మంది రద్వాన్ ఫోర్స్ కార్యకర్తలతో సహా సుమారు 1,000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లెబనాన్ వ్యాప్తంగా 3,500కు పైగా ఉగ్రవాద లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ సౌకర్యాలు, ప్రయోగ స్థానాలు, కమాండ్ అండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయాలపై కేంద్రీకరించబడ్డాయి.IDF Clearing Homes in Lebanon pic.twitter.com/pTcG4KWWGq— War Archive Clips (@WarArchiveClips) April 2, 2026దీనికి అదనంగా, లెబనాన్లో సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థగా పనిచేస్తూ, పౌర నిధులను దుర్వినియోగం చేస్తూ, హెబ్జొల్లా ఉగ్రవాద సంస్థకు నిధులు ఇరాన్ నుంచి సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బు అందుకునే ఆర్థిక సంస్థ అయిన “అల్-ఖార్ద్ అల్-హసన్” అసోసియేషన్ కీలక ఆస్తులు, ఆర్థిక నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్కు ఆయుధాలు, శత్రు బలగాలను తరలించడానికి ఉపయోగించే ఐదు ప్రధాన వంతెనలను కూల్చివేశాం. ఈ దాడులు ఉగ్రవాద సంస్థ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి’ అని తెలిపారు. -
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను, పశ్చిమ నగరమైన కరాజ్తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారంఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.పారిశ్రామిక హబ్లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.దేశ ప్రగతికి నిదర్శనాలుభారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్కు ఎంతో కీలకం.ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్వే’?ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ఈస్ట్లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! -
భారత్కు రష్యా గుడ్ న్యూస్
ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్ర తరం చేసింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికా దాడులు.. ఇరాన్లో కూలిన అతి పెద్ద వంతెన
పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం సృష్టిస్తోంది. ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి.ఇరాన్ను రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామంటూ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే.. మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.దాడి జరిగిన ప్రాంతంలో భారీ పొగ అలుముకుంది. వంతెన కూలిపోవడాన్ని చూపే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమ నగరం కరాజ్తో అనుసంధానించేలా నిర్మితమవుతున్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయి’’ అంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలని ఆయన హెచ్చరించారు.అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో తామే విజయం సాధించామని చెప్పుకుంటున్న ట్రంప్.. అమెరికా సైనిక చర్య టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని ధ్వంసం చేసిందన్నారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్పై అత్యంత కఠినంగా దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ఆయన మరోసారి బెదిరింపులకు దిగారు. మన శత్రువులు ఓడిపోతున్నారు. గత ఐదేళ్లుగా నా అధ్యక్షతన అమెరికా సాధించిన విజయాల కంటే ఇప్పుడు మరింత భారీ విజయాన్ని నమోదు చేస్తోంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
అమెరికాలో సంచలనం.. ఆర్మీ సైన్యాధిపతి తొలగింపు!
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో, అమెరికాలో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది. యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.వివరాల మేరకు.. అమెరికా ఆర్మీలోని అత్యున్నత స్థాయి అధికారి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు మీడియాలో కథనాలు తెలిపాయి. తక్షణమే పదవీవిరమణ చేయాలని హెగ్సెత్ ర్యాండీకి తెలిపినట్టు వెల్లడించాయి. కాగా, ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఇలాంటి ఎందుకు తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే, అమెరికా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గతేడాది యద్ధశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొన్నప్పటినుంచి.. డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్ను, అడ్మిరల్స్ను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. ఈ క్రమంలో 2023లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న జార్జ్ను తాజాగా తొలగించారు. ఇక, పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, అఫ్గానిస్థాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాడు జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాఫ్ ఛైర్మన్గా ఉన్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్పై ట్రంప్ వేటు వేశారు. అప్పటినుంచి ఉన్నతస్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో తొలగింపుల నుంచి జార్జ్ బయటపడగా.. తాజాగా పదవి నుంచి దిగిపోవాలని హెగ్సెత్ ఆయన్ను కోరారు. -
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. కాగా, నెల రోజుల వ్యవధిలో పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది రెండోసారి.తాజాగా పెరిగిన ధరల ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458.40 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అలాగే, డీజిల్ ధర లీటరుకు 520.35 పాకిస్తానీ రూపాయలకు వెళ్లింది. ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో డీజిల్పై 54.9%, పెట్రోల్పై 42.7% పెంపు విధించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, ఈ ధరలు పాకిస్తాన్ చరిత్రలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్పందిస్తూ..‘అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమని అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరి అయ్యింది’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను కారణంగా చూపుతూ గత నెలలోనే పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20% పెంచిన సంగతి తెలిసిందే. ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై మరింత భారం మోపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈల నుండి హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #BREAKING : WAR CRISIS ARRIVE IN PAKISTAN:Pakistan announces near 50% spike in fuel prices; long queues at pumps.42.7% increase in petrol54.9% increase in dieselPetrol up $0.49Diesel $0.66#IranWar #Iran #Dubai #ısrael #usa #Saudi #iraq #TelAvivBlast #middleeastunrest… pic.twitter.com/Z80zYCFSWd— The Globe & News (@TheGlobeNewt) April 2, 2026 -
ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను ఆపాలంటూ ఆయన పిలుపునిచ్చారు.'నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయన్న ఐరాస చీఫ్.. తాను సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. ఈ ప్రయత్నాలకు మద్దతుగా తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్ట్ను ఈ ప్రాంతానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులను ఖండించడమే కాకుండా.. హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ఆంటోనియో పునరుద్ఘాటించారు.నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన హెచ్చరించారు. మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని.. ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని.. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. -
హార్మూజ్పై బ్రిటన్ సమావేశం
లండన్: అంతర్జాతీయ నౌకాయాన రంగంలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్షంగా గుత్తాధిపత్యం సాధించి నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బ్రిటన్ కన్నెర్రజేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గళం విప్పేందుకు, దేశాల మధ్య ఐక్యత సాధించేందుకు బ్రిటన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా గురువారం ఏకంగా 40కిపైగా దేశాలతో వర్చువల్ భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. భేటీలో బ్రిటన్ విదేశాంగ శాఖ మహిళా కార్యదర్శి యూవెట్టీ కూపర్ ఇరాన్పై నిప్పులు చెరిగారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగించే దురుద్దేశంతో ఇరాన్ హార్మూజ్ను గుప్పిటపట్టింది. దానిని ఎలాగైనా మనం తెరిపించాల్సిందే. గల్ఫ్ ప్రాంతం గుండా నౌకాయానానికి మార్గం సుగమం చేసేందుకు సమష్టిగా పోరాడేందుకు ఈ భేటీని ఒక వేదికగా మార్చుకుందాం. ఇరాన్పై దౌత్య, రాజకీయ మార్గాల్లో తీవ్రంగా ఒత్తిడి చేసి హార్మూజ్ను తెరిపిద్దాం. లేదంటే పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది’’అని కూపర్ ఆవేదన వ్యక్తంచేశారు. సైనికచర్య ద్వారా హార్మూజ్ను తెరవొచ్చని అమెరికా భావించడం అసంబద్దంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. ‘‘హార్మూజ్ ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్ మొదట్నుంచీ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హార్మూజ్ గుండా వాణిజ్యం మొదలుకావాలి’’అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ వ్యాఖ్యానించారు. బిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, కెనడా, జపాన్, యూఏఈ తదితర 40కిపైగా దేశాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. -
ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్లపై క్షిపణుల వాన
దుబాయ్/టెహ్రాన్/ఇస్లామాబాద్: ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాల అంతమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఆరంభించిన పశ్చిమాసియా యుద్ధం హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో కొత్త మలుపు తీసుకుని ఇప్పుడు అతి క్షిపణుల ప్రయోగాలతో మరింత ఉధృతమైంది. దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో సమాధానం చెబుతోంది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై గురువారం సైతం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అగ్రనాయకత్వాన్ని అంతమొందించినా ఇరాన్ తన శక్తిసామర్థ్యాలతో హార్మూజ్ను ఇంకా గుప్పిటపట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. దీంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ఎన్నడూలేనంత భీకరంగా దాడి చేసి హార్మూజ్ను మేం హస్తగతం చేసుకోగలం.కానీ అమెరికా ఒంటరిగా అలా చేయాలని అనుకోవట్లేదు. హార్మూజ్పై ఆధారపడిన దేశాలన్నీ ఇప్పటికైనా ధైర్యం కూడదీసుకుని,కలసికట్టుగా రణరంగంలోకి దూకండి. హార్మూజ్ను చేజిక్కించుకోండి’’అని పిలుపునిచ్చారు. అపార ఆయుధ సంపత్తి మా సొంతంఇస్ఫహాన్ సమీప క్షిపణి నిల్వ కేంద్రంపై అమెరికా దాడులుచేసింది. నిల్వకేంద్రంలో భారీగా పేలుళ్లు జరిగాయి. కొన్ని నిమిషాలపాట ఆగకుండా నిల్వకేంద్రం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కరాజ్, టెహ్రాన్ నగరాలపైనా అమెరికా దాడులను కొనసాగించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ(81) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య చనిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను ఉధృతంచేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చేపనిలో పడ్డామని ఇజ్రాయెల్ తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ స్థావరంపై ఇరాన్ దాడులుచేసింది. యూఏఈపై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 19 క్షిపణులు, 26 డ్రోన్లను నేలమట్టంచేశామని యూఏఈ తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది. ‘‘అపార ఆయుధ సంపత్తి మా సొంతం. మీరు ఇప్పటిదాకా దాడిచేసినవి మా అసలైన స్థావరాలు కావు. అవి ఎక్కడున్నాయో మీ నిఘా వర్గాలకు కనీసం అవగాహన కూడా లేదు. మాపై ఎంతగా బాంబుల వర్షం కురిపించి నష్టం చేకూర్చినా ఇంకా ఎంతో మందుగుండు, ఆయుధ నిల్వలున్నాయి’’అని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఘరీ అన్నారు. 70 లక్షల మంది సిద్ధం... అమెరికా భూతల దాడులకు దిగితే వారిని మా గడ్డ మీదనే అంతంచేసేందుకు 70 లక్షల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలీబాహ్ హెచ్చరించారు. ఇరాన్ జనాభా 9 కోట్లు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని ఇరాన్ ప్రభుత్వం విస్తృతస్తాయిలో ప్రచారంచేస్తోందని వార్తలొచ్చాయి. -
త్వరలోనే ఖేల్ ఖతం
వాషింగ్టన్: ఇరాన్లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయని, తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పని పూర్తి చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. ట్రంప్ బుధవారం రాత్రి జాతినుద్దేశించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్–టైమ్ ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిందని అన్నారు. తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువే సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్ గుర్తుచేశారు అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. అయితే, ఇరాన్పై భూతల దాడుల గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైనా స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్నిరోజులుగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. హార్మూజ్ను స్వాధీనం చేసుకోండి ‘‘అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్పై పోరు 32 రోజులకు చేరింది. ఈ యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు సంవత్సరాలపాటు కొనసాగాయి. ఇరాక్ యుద్ధభూమిలో అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. ఇరాన్లోని యురేనియం స్వా«దీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్ అణు కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణు ధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వ్రస్తాల ఆలోచన చేస్తే క్షిపణులతో చావుదెబ్బ కొడతాం. హార్మూజ్ విషయంలో ప్రపంచదేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్లి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలి. ఈ యుద్ధం.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి నా అధ్యక్ష పదవీకాలంలో గత ఐదేళ్లుగా అమెరికా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనట్టి ఘన విజయం సాధించబోతున్నాం. అమెరికాతోపాటు ప్రపంచ భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ క్యూరీ ప్రారంభించాం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాంటి ఆయుధాలు ఉండడం మనకు భరించలేని ముప్పు అవుతుంది. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. అయినా సరే అక్కడ అణ్వాయుధ కార్యకలాపాలు ఆగడం లేదు. మరోచోట అణు కేంద్రాలు నిర్మించాలని చూస్తున్నారు. అణ్వాయుధాలపై ఇరాన్కు ఆశలు చావడం లేదు. నేరుగా అమెరికా భూభాగంపై దాడిచేసేలా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోంది. ఇరాన్పై యుద్ధంతో అమెరికాకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అమెరికా మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది మీ పిల్లలు, మీ మనవళ్ల భవిష్యత్తు కోసం పెడుతున్న నిజమైన పెట్టుబడి’’అని ట్రంప్ తమ దేశ పౌరులకు తేల్చిచెప్పారు. అమెరికన్లకు అంత ఓపిక ఉందా? ఇరాన్పై యుద్ధం కొనసాగించడానికి అమెరికా ప్రజలకు ఓపిక ఉందో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. బుధవారం వైట్హౌస్లో ఈస్టర్ విందు కార్యక్రమంలో అతిథులతో ఆయన ముచ్చటించారు. ఇరాన్ చమురును అత్యంత సులభంగా స్వా«దీనం చేసుకోగల సత్తా అమెరికాకు ఉందని చెప్పారు. కానీ, అలాంటి ప్రయత్నం పట్ల అమెరికన్లలో తగినంత సహనం ఉన్నట్లు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ఇరాన్ చమురును తీసుకురావడానికే తాను ఇష్టపడుతున్నానని తెలిపారు. కానీ, తమ ప్రజలు మాత్రం ఇరాన్లో గెలిచేసి, ఇంటికి తిరిగి రండి అంటున్నారని విమర్శించారు. వారే అలా అంటే ఇక తాను చేసేది ఏముంటుందని నిర్వేదం వ్యక్తంచేశారు. నాటో ఒకకాగితం పులి హార్మూజ్ను తెరిపించడానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చొరవ తీసుకోవాలని ట్రంప్ సూచించారు. కొన్ని ఆసియా దేశాలు అమెరికా చమురు కంటే గల్ఫ్ చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటో కూటమిని సైతం దూషించారు. అందులో పనికిమాలిన భాగస్వామ్య దేశాలు ఉన్నాయని మండిపడ్డారు. నాటో ఒక పేపర్ టైగర్ అంటూ ఎద్దేవా చేశారు. నాటోతో తమకు అవసరం లేదని, తమ అవసరమే వారికి ఉంటుందని తేల్చిచెప్పారు. అసలు అమెరికా లేకపోతే నాటో పట్టుకొచ్చేదా? అని ప్రశ్నించారు. ఈస్టర్ విందులో ట్రంప్ మాట్లాడిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల
వాషింగ్టన్: అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల అయ్యాయి. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వేలపేజీల రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ రహస్య పత్రాలను అమెరికా డీవోజే(డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్) బహిర్గతం చేసింది. పారదర్శకత కోసమే ఫైళ్లు విడుదల చేశామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎఫ్బీఐ ఇంటర్వ్యూలు, గ్రాండ్ జ్యూరీ కీలక సాక్ష్యాలు బయటపడ్డాయి. తద్వారా 2008 నాటి వివాదాస్పద ఒప్పందాల వెనక ఉన్న రహస్యాలపై ఉత్కంఠ నెలకొనగా, ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాగా, ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ .. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది.ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.మరోవైపు ట్రంప్ -ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు గతంలోనే బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. మరి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఈ ఫైళ్లలో ఏముందో, ఏమౌతుందో అనే ఆసక్తి నెలకొంది. -
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్తో కలిసి జపాన్లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.బ్రెజిల్ పాస్పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు?కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్లో విభిన్న జాతుల ప్రజలు నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులుకిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్పోర్ట్తో టోక్యో డిస్నీల్యాండ్కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by im just culture (@imjustculture) -
శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది: ఇరాన్
టెహ్రాన్: వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖతమ్ అల్ అన్బియా ప్రకటించింది. ఇరాన్ను అణిచివేసి.. రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి, డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్కు ఏమీ తెలియదంటూ ఖాతమ్ అల్-అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు."మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను నాశనం చేశామని అనుకోవద్దు. అటువంటి అంచనాలు మీరు చిక్కుకున్న ఊబిని మరింత లోతుగా చేస్తాయి. మీరు దెబ్బతీశామని భావిస్తున్న ప్రాంతాలు చాలా స్వల్పమైనవి. మా వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి మీకు తెలియని.. మీరు చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఇరాన్ పేర్కొంది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ.. ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు.. భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్ అల్-అన్బియా ప్రతినిధి హెచ్చరించారు. -
రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్మొదలు పెట్టిన యుద్ధం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మరోసారి అణుదాడి ముప్పు ఉండబోతోందా అన్న ఆందోళన ప్రపంచాన్ని పటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఆయన జీవితం నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం.రెండు విధ్వంసాలనుంచి (1916–2010) మృత్యువును జయించిన ధీశాలి సుటోము యమగుచి (Tsutomu Yamaguchi). ఈయన కథ నిజంగా అద్భుతం. జపాన్కు చెందిన ఒక ఇంజనీర్, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా , నాగసాకి (1945) లో జరిగిన రెండు అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు. ఆగస్టు 6న హిరోషిమాలో బాంబు పేలుడుకు గురై గాయపడిన ఆయన, స్వస్థలమైన నాగసాకికి వెళ్లిపోవాలని ఆరాటపడ్డాడు. కానీ మళ్లీ మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు. సుటోము యమగుచి జీవితం ఒక రకంగా అత్యంత దురదృష్టకరమైనది. మరో విధంగా గొప్ప అదృష్టం. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో, అమెరికా జపాన్పై ఆగస్టు 6, 1945న అణుబాండుదాడులు చేసింది. ఆగస్టు 6న మిత్సుబిషి కంపెనీ ఇంజనీర్గా యమగుచి తన విధినిర్వహణలో భాగంగా హిరోషిమాలో ఉన్నారు. సరిగ్గా ఆయన తిరిగి వెళ్ళే సమయానికి అమెరికా (హిరోషిమా)'లిటిల్ బాయ్' బాంబును ప్రయోగించింది. పేలుడు కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చర్మం కాలిపోయింది, వినికిడి శక్తి దెబ్బతింది. వణుకుతూ, ఒక వైమానిక దాడి ఆశ్రయంలో ఆ భయంకర మైన రాత్రి గడిపాడు. అయినా ప్రాణాలతో బయటపడి, మరుసటి రోజే తన స్వస్థలమైన నాగసాకికి చేరుకున్నారు.ఆగస్టు 9న నాగసాకిలో తన కార్యాలయంలో కూర్చుని, హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి తన పైఅధికారికి వివరిస్తున్నారు.అతని బాస్ అతణ్ని నమ్మలేదు. అతిగా స్పందిస్తున్నాడని యమగుచిని నిందించాడు. ఒక్క బాంబు నగరాన్ని ఎలా నాశనం చేస్తుంది? అని ఆ అధికారి అడుగు తూండగానే, రెండో బాంబు 'ఫ్యాట్ మ్యాన్' నాగసాకిపై పడింది.రెండోసారి కూడా యమగుచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం విశేషం. ఈ రెండు అణుదాడుల్లో నుంచి ప్రాణాలతో బయటపడినట్లు అధికారికంగా గుర్తించబడిన ఏకైక వ్యక్తి ఆయనే. 2009లో జపాన్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా 'ద్విగుణ బాంబు బాధితుడిగా' (Double Hibakusha) గుర్తించింది. యుద్ధం తర్వాత ఆయన, జ్వరాలు, వాంతులు, రేడియేషన్ ప్రభా, అనారోగ్యంతో చాలా కాలం బాధపడ్డారు. కుడి చేయి శాశ్వతంగా దెబ్బతింది. అతను ఒక చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాడు. కానీ ఆయన మనోధైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. కానీ బతికినంత కాలంలో రేడియేషన్ ప్రభావంతో బాధపడినప్పటికీ, ఆయన 93 ఏళ్లు జీవించారు. 2010లో, 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు.జీవితంలో ఎక్కువ కాలం ఈ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఆయన, తన చివరి దశలో ప్రపంచానికి అణు ఆయుధాల ప్రమాదాన్ని వివరించాలని నిర్ణయించుకున్నారు. అణు ఆయుధాల ప్రభావానికి సజీవ సాక్ష్యం తాను అంటూ ప్రపంచ మానవాళిని హెచ్చరించారు. "నా కథను ప్రపంచానికి చెప్పడానికే నేను బతికున్నాను" అని ఆయన తరచూ అనేవారు. కాగా రెండు అత్యంత విధ్వంసకరమైన బాధల్ని అనుభవించి, దాన్నుంచి అంతే సాహసంగా బయటపడి, భవిష్యత్తుకోసం బలాన్ని కూడగట్టుకున్న ఒక సాధారణ ఇంజనీర్ కథ. యుద్ధం తెచ్చే విధ్వంసం అందులోనూ అణ్వాయుధాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో యమగుచి జీవితం కళ్లముందుంచింది. -
పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రకటనవీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్ ఎంబసీ స్పష్టం చేసింది.ఎవరిపై ప్రభావం?ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.ఎందుకీ నిర్ణయంఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదనమరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది! -
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఇరాన్లో ఇంకేం సాధించాల్సి ఉంది?: ఆస్ట్రేలియా ప్రధాని
కాన్బెర్రా: ఇరాన్లో సాధించాల్సింది ఇంకేముందంటూ అమెరికాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశ్నించారు. ‘‘ఇరాన్ సంఘర్షణలో నిర్దేశించుకున్న ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని.. ఇకపై అక్కడ సాధించాల్సింది ఏముందో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది’ అంటూ అల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు.రాజధాని కాన్బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరో రెండు మూడు వారాల పాటు అత్యంత కఠినమైన దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో అల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
ఎ‘వరెస్ట్’ స్కామ్: టూరిస్టులకు ‘విషం’ ఇచ్చి..
ఖాట్మండు: ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలని ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్రమైన వంచనకు గురవుతున్నారు. కొందరు గైడ్లు, హెలికాప్టర్ సంస్థలు కలిసి, పర్యాటకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పర్యాటకులకు తెలియకుండా వారి ఆహారంలో విషం కలిపి, ఆపై అత్యవసర రెస్క్యూ పేరుతో సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 167 కోట్లు) ఇన్సూరెన్స్ స్కామ్కు పాల్పడిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే...నేపాల్లో ట్రెకింగ్ చేసే పర్యాటకుల భోజనంలో గైడ్లు ఉద్దేశపూర్వకంగా ‘బేకింగ్ సోడా’ కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్ల పర్యాటకులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవుతాయి. ఇది చూసి పర్యాటకులు తమకు ‘ఆల్టిట్యూడ్ సిక్నెస్’ (ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యం) వచ్చిందని భ్రమపడతారు. వెంటనే గైడ్లు వారిని భయపెట్టి, అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించాలని ఒత్తిడి చేస్తారు.వందల కోట్ల దోపిడీ ఇలా..ఈ కుట్రలో ట్రెకింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రులు ఒక మాఫియాగా ఏర్పడ్డాయి. పర్యాటకులకు చికిత్స చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేటుగాళ్లు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి నేపాల్ పోలీసులు ఇప్పటివరకు 32 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో హెలికాప్టర్ కంపెనీ యజమానులు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 11.3 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. నేపాల్ టూరిజం రంగంలో ఇలాంటి స్కామ్లు పెరిగిపోతుండటంతో, ఇప్పటికే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ ట్రెక్కర్లకు కవరేజీ ఇవ్వడం నిలిపివేశాయి. ఇది కూడా చదవండి: భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి -
‘ఇవే మా లక్ష్యాలు.. పవర్ఫుల్ స్పీచ్లో ట్రంప్ చెప్పారు’
వాషింగ్టన్: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తమ దేశ లక్ష్యాలను స్పష్టంగా తెలిపిందని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఆ లక్ష్యాలు.. ‘ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయడం, వారి నౌకాదళాన్ని నాశనం చేయడం, వారి వైమానిక దళాన్ని నాశనం చేయడం, ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా అవకాశాలను నాశనం చేయడం’ అని అన్నారు.“మా అధ్యక్షుడి నాయకత్వం ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతోంది. అదే.. అమెరికా తన ప్రజలను, తన ప్రయోజనాలను రక్షించుకుంటుంది. అమెరికా తన శక్తి ద్వారా శాంతి కొనసాగేలా చేస్తుంది” అని రుబియో పేర్కొన్నారు.కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్తో చేసుకున్న ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేదని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారని తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉందని, ఆ దేశాన్ని అణ్వాయుధ దేశంగా మారనివ్వనని అన్నారు. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు.డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇచ్చిన స్పీచ్ను స్వయంగా వినడానికి పలువురు ప్రముఖులు రావడం గమనార్హం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ తో పాటు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు వచ్చారు. ట్రంప్ స్పీచ్ను ప్రపంచం ఆసక్తికరంగా విన్నది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. మరో రెండు-మూడు వారాలు దాడులు కొనసాగుతాయని చెప్పారు. -
అక్కడ శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం మరో 2-3 వారాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. -
చందమామ దిశగా.. దూసుకెళ్లిన ఆర్టీమిస్–2
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదూర గ్రహాలను అందుకునేందుకు జాబిల్లిని కేంద్రంగా చేసుకోవాలన్న లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్–2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన, 32 అంతస్తుల ఎత్తైన, ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’తో కూడిన ‘ఓరియన్’ రాకెట్.. నింగిలోకి దూసుకుపోయింది.ఇక, ‘ఓరియన్’ రాకెట్.. చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి రానుంది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు పది రోజులపాటు రాకెట్లోనే ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులను పంపించే మార్గం సుగమం అవుతుంది. ఈ ఈ ప్రయోగం ద్వారా అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్ వైస్మ్యాన్(కమాండర్), విక్టర్ గ్లోవర్(పైలట్), క్రిస్టినా కూచ్(మహిళా మిషన్ స్పెషలిస్ట్), జెరిమీ హాన్సెన్లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహా సముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు.Liftoff.The Artemis II mission launched from @NASAKennedy at 6:35pm ET (2235 UTC), propelling four astronauts on a journey around the Moon.Artemis II will pave the way for future Moon landings, as well as the next giant leap — astronauts on Mars. pic.twitter.com/ENQA4RTqAc— NASA (@NASA) April 1, 2026రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్లో పయనించారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చినా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. 🚨🇺🇸 This animation reveals NASA’s full Artemis II flight path, a nearly 685,000-mile journey that traces a giant figure-eight from Earth, swings far around the Moon’s far side.pic.twitter.com/GiIj9QQJkF https://t.co/RRRn3UhXuY— Mario Nawfal (@MarioNawfal) April 1, 2026 -
ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తూర్పు ఇండోనేషియాలోని టెర్నేట్ నగరం సమీపంలో ఉత్తర మొలుక్కా సముద్రంలో గురువారం సంభవించిన భారీ భూకంపం పెను ప్రకంపనలు సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్సీఎస్) వెల్లడించింది. 🚨🇮🇩#BREAKING | NEWS ⚠️Watch as a building violently shakes with objects falling onto the ground after a major 7.8⚡️Magnitude Earthquake has struck in Indonesia a tsunami warning was issued for Malaysia🇲🇾 and the Philippines🇵🇭 pic.twitter.com/wGGaTlRUJe— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) April 1, 2026సముద్ర మట్టానికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ద్వీపాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ హెచ్చరికల విభాగం హెచ్చరించింది. సముద్ర అలలు సాధారణ స్థాయి కంటే 0.3 మీటర్ల నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. టెర్నేట్, టిడోర్ తదితర నగరాల్లో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని (ఎవాక్యూషన్) సూచించింది. భూకంప ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నట్లు స్థానిక 'మెట్రో టీవీ' దృశ్యాలను ప్రసారం చేసింది. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. జపాన్, గ్వామ్, పాపువా న్యూగినియా, తైవాన్ తీరాల్లోనూ స్వల్ప స్థాయిలోఅలలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. -
బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నేతలను అంతం చేశామని అన్నారు. బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయని చెప్పారు. ఇరాన్ ఆయుధ కర్మాగారాలను ముక్కలు ముక్కలు చేశామని తెలిపారు. ఇరాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాద ఇరాన్పై తాము యుద్ధాన్ని ప్రకటించామని అన్నారు. వెనెజువెలాలో కూడా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. ‘ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ 45 వేల మంది నిరసకారులను చంపేసింది. అమెరికా భద్రత కోసమే ఎపిక్ ప్యూరీ. ఇరాన్లో శవాల దిబ్బలే మిగిలాయి. బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ నేవీ, ఎయిర్ఫోర్స్లను దెబ్బతీశాం’ అని అన్నారు. ఒబామా చేయలేనిది చేశాను..అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్లో చేయలేనిది తాను చేశానని ట్రంప్ అన్నారు. ‘ఇరాన్తో ఒబామా ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేది. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉంది. ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మారనివ్వను. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా లక్ష్యం. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ను నమ్మలేం. అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రక్షణ కవచం కుప్పకూలింది. ఇరాన్ క్షిపణులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం. ఇరాన్ను రాతియుగానికి తీసుకెళ్తాం. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా టార్గెట్.అమెరికా సైనికులు 13 మంది మరణించారు. యుద్ధాలు వద్దన్నాను.. కానీ, అమెరికా భద్రత కోసం చేయకతప్పలేదు. ఆపరేషన్ ఎపిక్ప్యూరీ సక్సెస్ అవుతోంది. ఇరాన్లో పాలన మార్చడం మా లక్ష్యం కాదు. హార్మూజ్ జలసంధి మాకు అవసరం లేదు. రెండు-మూడు వారాల్లో భీకరదాడులు చేస్తాం. కీలక లక్ష్యాలను పూర్తి చేసే పనిలో ఉన్నాం. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఇరాన్ మిసైళ్లు అమెరికాను తాకలేవు. నా పాలనలో ఎన్నో విజయాలు సాధించాం. మేము అమెరికాను శక్తిమంతమైన దేశంగా మార్చుతున్నాం’ చెప్పారు. -
ట్రంప్ బాల్రూమ్ ప్రాజెక్ట్కు కోర్టు బ్రేక్
వాషింగ్టన్: తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకుంటున్న బాల్రూమ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 400 మిలియన్ డాలర్ల విలువైన బాల్రూమ్ నిర్మాణం కోసం వైట్హౌస్ తూర్పు భాగాన్ని కూల్చివేయడాన్ని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా పనులు చేపట్టాన్ని వాషింగ్టన్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రిచర్డ్ లియోన్ తప్పుపట్టారు. పనులు తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ బాల్రూమ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ‘నేషనల్ ట్రస్టు ఫర్ హిస్టోరిక్ ప్రిజర్వేషన్’గ్రూప్ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జడ్జి రిచర్డ్ లియోన్ విచారణ చేపట్టారు. ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు వైట్హౌస్ సంరక్షకుడు మాత్రమేనని, ఆ భవనానికి యజమాని కాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. భవిష్యత్తులో వైట్హౌస్లోకి రాబోయే అధ్యక్షుడి కుటుంబాల కోసం ఆ భవనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు పదవిలో ఉన్న అధ్యక్షుడిపై ఉందన్నారు. అయితే, కోర్టు నిర్ణయం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా జడ్జి ఉత్తర్వును సవాలు చేస్తూ న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయడానికి శ్వేతసౌధం నోటీసు ఇచ్చింది. వైట్హౌస్ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించామని, వాటికి కాంగ్రెస్ నుంచి ఆమోదం లేదని ట్రంప్ చెప్పారు. ఆయా కట్టడాలకు లేని అభ్యంతరం బాల్రూమ్కు ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేట్ విరాళాలతో నిర్మిస్తున్న భవనాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. కోర్టు ఉత్తర్వుతో సంబంధం లేకుండా బాల్రూమ్ కింద భూగర్భంలో బంకర్తోపాటు ఇతర భద్రతాపరమైన పనులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. బాల్రూమ్ ప్రాజెక్టు పట్ల ట్రంప్ అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ సంస్థల నుంచి, ప్రజల నుంచి నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 90,000 చదరపు అడుగుల బాల్రూమ్ నిర్మాణం కోసం వైట్హౌస్ ప్రాంగణంలోని ఈస్ట్ వింగ్ను కూల్చేశారు. 1945లో హ్యారీ ఎస్.ట్రూమ్యాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్హౌస్ దక్షిణ భాగంలో బాల్కనీ నిర్మించారు. -
త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! యూఎస్ఎస్ జార్జి డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్ బాట పట్టినట్టు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ సైట్లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు. -
ఒప్పందం చేసుకోండి.. ట్రంప్ అసహానానికి గురవుతున్నారు: జేడీవాన్స్
ఇరాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. -
యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు
లండన్: ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది. -
యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్ సెంటర్పై ఇరాన్ దాడి?
ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్లోని అమెజాన్ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. ఇరాన్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.కాగా మరోవైపు, ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది -
యుద్ధంలోకి నేరుగా గల్ఫ్ దేశం?
మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా గల్ఫ్ దేశం నేరుగా యుద్ధంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. హార్మూజ్ జలసంధిపై మూసివేతతో వాణిజ్య సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యుఏఈ నేరుగా యుద్ధంలోకి దిగేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు.ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి సైనిక చర్య చేపట్టాలని UAE నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని బహ్రెయిన్తో కలిసి యూఏఈ పావులు కదుపుతోన్నట్లు వాల్స్ట్రీట్ జనరల్ కథనం పేర్కొంది.హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించడంతో పాటు అక్కడ సైనిక పహారా కాయడానికి ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకవేళ యుఏఈ యుద్ధంలో దిగితే ఆ అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నమెుదటి గల్ఫ్ దేశంగా నిలుస్తోంది. టెహ్రాన్ను ఎదుర్కోవడానికి తమ దేశం ముఖ్యమైన దేశాలతో కొత్త పొత్తులను నిర్మిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన తరువాత యూఏఈ యుద్ధంలోకి దిగుతుందని ప్రచారం జరుగుతుంది. -
కాల్పుల విరమణ కోరిన ఇరాన్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాత పాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంత నయం. హర్మూజ్ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం. హర్మూజ్ తెరిచే వరకు ఇరాన్పై దాడులు కొనసాగిస్తాం. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం.. వారు అన్నట్లుగానే తిరిగి రాతి యుగానికి పంపిస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణ కోరలేదని.. ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా ప్రజల నుండి కూడా యుద్ధానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది. యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధి తెరిచే వరకు దాడులు ఆపబోమని తాజాగా హెచ్చరించడం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది. -
‘నాటో’కు ట్రంప్ బిగ్షాక్!
వాషింగ్టన్: నాటో భాగస్వామ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నాటో దేశాల కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన యుద్ధ చర్యలకు నాటో దేశాలు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని బ్రిటన్ మీడియా సంస్థ డైలీ టెలిగ్రాఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన నాటోను ‘కాగితపు పులి’గా అభివర్ణించారు. ‘అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అన్నది మళ్లీ ఆలోచించే స్థితి దాటి పోయింది. నాటో విశ్వసనీయతపై నాకు ఎప్పటినుంచో సందేహాలున్నాయి. నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వారు కాగితపు పులి అని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.అమెరికా నాటో నుంచి బయటకు వస్తే, అది నాటోకు భారీ దెబ్బ అవుతుంది. ప్రస్తుతం అమెరికా నాటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 70 శాతం వంతు భారం మోస్తోంది. అలాగే అత్యధిక సైనిక శక్తి, అణు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తోంది. అమెరికా లేకుండా నాటో బలహీనమై, యూరప్ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రంప్నకు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ షాక్ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్ అన్నారు.‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి...మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
ఇరాక్లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. వీడియో వైరల్
ఇరాక్లో అమెరికన్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్(Shelly Kittleson) కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న ఓ ఇరాకీ సాయుధ ముఠా బాగ్దాద్లో అమెరికన్ జర్నలిస్ట్ను కిడ్నాప్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రాంతీయ భద్రత క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిటెల్సన్ ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సిరియా, ఇరాక్, లెబనాన్ నుంచి ఆమె విస్తృతంగా వార్తా కథనాలను అందించారు. ఆమెను విడిపించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది.కిడ్నాప్తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూప్ ‘కతైబ్ హెజ్బల్లా’కు చెందిన వ్యక్తిని ఇరాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సహాయ కార్యదర్శి డైలాన్ జాన్సన్ తెలిపారు. నిందితులు పారిపోయే క్రమంలో వాహనం బోల్తా పడటంతో ఇరాక్ భద్రతా దళాలు ఒకరిని అరెస్ట్ చేశాయి. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కిటెల్సన్ రోమ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఇరాక్, సిరియాలోని తెగల మధ్య సంబంధాలు, యుద్ధ ప్రాంతాలపై ఆమెకు లోతైన అవగాహన ఉంది. ఆమె కిడ్నాప్పై 'అల్-మోానిటర్' సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాగ్దాద్ వీధుల్లో నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీటీవి దృశ్యాల ద్వారా వెలుగులోకి వచ్చింది.ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాక్ ప్రభుత్వానికి, అక్కడి ఇరాన్ అనుకూల మిలిటెంట్లకు మధ్య ఘర్షణలు పెరిగాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాక్లో అమెరికన్లకు ముప్పు పెరిగిందని అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2023లో కూడా విద్యావేత్త ఎలిజబెత్ త్సుర్కోవ్ను కిడ్నాప్ చేసి రెండేళ్లపాటు బందీగా ఉంచారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికన్లు, జర్నలిస్టులు ఇరాక్లో అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.🚨🇺🇸🇮🇶BREAKING: The Iraqi government confirms: American freelance journalist Shelly Kittleson, who works for Al-Monitor, has been kidnapped from central Baghdad. https://t.co/VJ8IZqet90 pic.twitter.com/wExlXh0BDY— Eli Afriat 🇮🇱 (@EliAfriatISR) March 31, 2026 -
Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు
కన్యాకుమారి/న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు, కన్యాకుమారికి చెందిన సుమారు 600 మంది మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేశాయి. స్వదేశంలో నెలల తరబడి చెమటోడ్చినా దక్కని ఆదాయం, అక్కడ కేవలం పది రోజుల్లోనే చేతికి అందేది. ఆ ఆశే వారిని ఏడు సముద్రాలు దాటించి, ఇరాన్ తీరానికి చేర్చింది. అయితే నేడు అక్కడ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇరాన్లోని బుషెహర్, దాని పరిసర తీర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ‘స్క్రోల్ ఇన్’కు ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం గత ఫిబ్రవరిలో ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ మరణించిన తర్వాత మొదలైన వైమానిక దాడులు, బాంబుల వర్షం.. ఇరాన్లోని మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం తిండి, నీరు, కనీస వైద్యం అందక పడవలపైనే కాలం వెళ్లదీస్తున్న వీరి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.ఒకే సిమ్ కార్డు.. 12 మంది వినియోగంకన్యాకుమారిలోని మత్స్యకార కుటుంబానికి చెందిన షాజీ.. ఇరాన్లో చిక్కుకున్న భర్త రవికుమార్ నుంచి వచ్చే ఫోను కోసం నిత్యం ఎదురు చూస్తుంటుంది. ఇరాన్లో చిక్కుకున్న బాధితుల వద్ద కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా కరువయ్యాయి. రవికుమార్తో పాటు మరో 12 మంది కలిసి కేవలం ఒకే ఒక్క సిమ్ కార్డును వాడుతున్నారు. ‘బాంబుల శబ్దంతో నిద్ర పట్టడం లేదు.. ఆహారం నిండుకుంది’ అని వారు ఫోన్లో చెబుతుంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎటు నుంచి క్షిపణులు వస్తాయో తెలియని స్థితిలో మత్స్యకారులు కాలం వెళ్లదీస్తున్నారని ‘సౌత్ ఏషియన్ ఫిషర్మెన్ ఫ్రాటర్నిటీ’ ప్రతినిధులు తెలిపారుఅప్పుల ఊబిలో కుటుంబాలుతమ వారిని క్షేమంగా తిరిగి భారత్ రప్పించేందుకు ఇక్కడి మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాయి. మేరీ రాజ్ అనే మహిళ తన 20 ఏళ్ల కుమారుని ఉపాధి కోసం తన ఒంటి మీద ఉన్న నగలను తాకట్టు పెట్టి, రూ.1.5 లక్షలు అప్పు చేసింది. విదేశాల్లో బాగా సంపాదిస్తారని అక్కడికి పంపిస్తే, ఇప్పుడు ప్రాణాలతో కుమారుడు వస్తే చాలని మేరా రాజ్ దేవుడిని వేడుకుంటోంది.అక్కడి సౌకర్యాలే శాపమయ్యాయా?భారతదేశంలో చేపల వేట తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల కొరత ఉండటంతో మత్స్యకారులు ఇరాన్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇరాన్లో అనారోగ్యానికి గురైతే హెలికాప్టర్లు పంపే స్థాయి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం కారణంగా అక్కడి యజమానులు కూడా చేతులెత్తేస్తున్నారు. మత్స్యకారుల పాస్పోర్టులు యజమానుల వద్దే ఉండటం, భాష తెలియకపోవడం వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంపాదన ఆశ చూపి తీసుకెళ్లిన యజమానులు ఇప్పుడు భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేయడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది.ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనయుద్ధ ప్రాంతం నుంచి విద్యార్థులను తరలించిన కేంద్ర ప్రభుత్వం, సముద్రం మధ్యలో చిక్కుకున్న మత్స్యకారుల విషయంలో అలసత్వం వహిస్తోందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోలాహలంలో ఉన్న అధికారులు, ఈ నిరుపేద మత్స్యకారుల గోడును పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. బాంబుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న తమ వారిని కాపాడాలని కన్యాకుమారి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత -
టార్గెట్ ఇరాన్.. నెతన్యాహు కొత్త కూటమి ప్రకటన
జెరూసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు వ్యతిరేకంగా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అయితే, కూటమిలో దేశాల పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా ప్రసంగిస్తూ.. ఇరాన్ వ్యతిరేకంగా కొత్త ప్రాంతీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇజ్రాయెల్ పక్కనే ఉన్న దేశాలు సహా పలు దేశాలతో కొత్త కూటములు కుదుర్చుకుంటున్నాం. త్వరలోనే ఈ ఒప్పందాల గురించి మరింత వివరంగా చెబుతాను. కచ్చితంగా ఆ కూటమి.. ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం కూటమిలో ఉన్న దేశాల పేర్లను వెల్లడించలేదు. అయితే.. ఇరాన్ సైనిక, అణు ఆశయాలపై ఉన్న ఉమ్మడి ఆందోళనల కారణంగా ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని నెతన్యాహు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇక, యుద్ధరంగంలో సాధించిన ప్రధాన విజయాల నేపథ్యంలో, ఈ సంప్రదింపులను ఒక విస్తృత వ్యూహంలో భాగంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ‘మేము గట్టిగా దెబ్బకొట్టి, రెండు అస్తిత్వ ముప్పులను దూరం చేశాము’ అని నెతన్యాహు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్లు అటువంటి ఆయుధాలను ఉత్పత్తి చేసే ఇరాన్ పారిశ్రామిక సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీశాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో, టెహ్రాన్లో దీర్ఘకాలిక మార్పు వస్తుందని అంచనా వేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఇరాన్ పాలన పతనమవుతుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజా పరిణామాలుఇజ్రాయెల్–అరబ్ సహకారం: ఇరాన్ అణు ప్రణాళికలు మరియు ప్రాంతీయ ప్రభావం కారణంగా, ఇజ్రాయెల్ కొన్ని అరబ్ దేశాలతో కొత్త భద్రతా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.ఉగాండా భాగస్వామ్యం: "ఎంటెబ్బే అలయన్స్" పేరుతో ఉగాండా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ వ్యతిరేకంగా నిలబడుతోంది. ఇది 1976లో జరిగిన ఎంటెబ్బే ఆపరేషన్ చరిత్రను తలపిస్తోంది.కూటమి లక్ష్యాలుఇరాన్ అణు ప్రణాళికలను అడ్డుకోవడంహెజ్బుల్లా, హౌతీలు వంటి ఇరాన్ మిత్ర బలగాలను ఎదుర్కోవడంప్రాంతీయ భద్రతా సమీకరణలో ఇజ్రాయెల్ స్థానం బలపరచడంప్రతికూలతలు..ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే అవకాశంచమురు సరఫరా అంతరాయం వల్ల గ్లోబల్ ఆర్థిక సంక్షోభంఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయెల్ మరియు మిత్ర దేశాలపై పెరగడం -
ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు
టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమి నుంచి అందుతున్న మృతుల గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ఇరాన్: మరణాల హోరుయుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల సంస్థ ‘హర్నా’ లెక్కల ప్రకారం, ఇక్కడ ఇప్పటివరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా, కనీసం 236 మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900 గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేస్తోంది. యాక్టివ్ వార్ జోన్ కావడంతో అసలు మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు..యుద్ధం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదులెబనాన్: ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో 1,268 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 124 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు కూడా హతమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు ఇండోనేషియా యూఎన్ శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు.ఇరాక్: ఇక్కడ పౌరులు, మిలిషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు.గల్ఫ్ దేశాలు: యుద్ధం సెగ గల్ఫ్ దేశాలకూ తగిలింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈలో 10 మంది, కువైట్లో ఏడుగురు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్ తదితర ప్రాంతాలుఇటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిస్సైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్లో 19 మంది పౌరులు, సరిహద్దు పోరులో 10 మంది సైనికులు మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్లో ఇరాన్ మిస్సైల్ పడి నలుగురు పాలస్తీనా మహిళలు మృతి చెందగా, సిరియాలో మరో నలుగురు బలయ్యారు. ఇరాక్లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు, ఛిద్రమైన ఎన్నో కుటుంబాల గాథలు. యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో ఈ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. -
క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్కు చైనా ఝలక్?
బీజింగ్: తమ దేశానికి రావాల్సిన మూడు చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హార్మూజ్ను దాటడంలో ఎంతగానో సహకరించిన ఇరాన్ పేరును ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.మరోవైపు ఇరాన్లో పరిస్థితులపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాన్ దార్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహిత నేత అయిన వాంగ్ యీ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరోలోనూ సభ్యునిగా ఉన్నారు. క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రష్యా ముడిచమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలుచేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురుకష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాంజా నౌకాశ్రయానికి రష్యా చమురునౌక ‘అనటోలీ కొలోడ్కిన్’చేరుకుంది.మార్చి 8న రష్యా నుంచి బయల్దేరి ఇంగ్లిష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్ సముద్రజలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచిచూస్తున్న విషయం తెల్సిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెళ్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన, గనుల మంత్రి విసెంటే లేవీ అమితానందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ క్యూబా తమ చమురుఅవసరాల కోసం అత్యధికంగా వెనెజువెలాపై ఆధారపడేది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్చేశాక ఆ దేశం నుంచి చమురురాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే. -
కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి
మాస్కో: క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తున్న సమయంలో రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలిపోయింది. దీంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలను టాస్ వార్తా సంస్థ బుధవారం ప్రచురించింది.“మార్చి 31న సాయంత్రం 6 గంటలకు ఏఎన్-26 సైనిక రవాణా విమానంతో కమ్యూనికేషన్ కోల్పోయాం” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెస్క్యూ టీమ్ ఏఎన్-26 విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించింది. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా తెలిపింది. ఆ విమానం ఓ కొండ అంచును ఢీకొని కూలిపోయిందని పలు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. సైనిక విమానం కుప్పకూలడం వెనుక ఉన్న కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.మీడియా అడిగిన ఇతర వివరాలపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందించలేదు. ఏఎన్-26 విమానం 1960 దశకం చివర నుంచే సర్వీసులో ఉంది. ఈ మోడల్ను సరుకు రవాణా కోసం ఎయిర్లైన్స్ కూడా ఉపయోగించాయి. గత దశాబ్దంలో ఈ మోడల్కు విమానాలు పలు ప్రమాదాలకు గురయ్యాయి. 2022లోఘుక్రెయిన్ దక్షిణ-తూర్పు జపోరిజ్జియా ప్రాంతంలో విమాన ప్రయాణం సమయంలో ఉక్రెయిన్కు చెందిన ఏఎన్-26 కూలి ఒకరు మరణించారు. 2020లో ఉక్రెయిన్ ఉత్తర-తూర్పు ప్రాంతంలో శిక్షణ విమాన ప్రయాణం సమయంలో అది కూలి 26 మంది మృతి చెందారు. -
కెనడా గ్యాంగ్వార్లో పంజాబ్ యువకుడి హత్య
సర్రే (కెనడా): కెనడాలో గ్యాంగ్వార్ కలకలం రేపింది. పంజాబ్ మూలాలు కలిగిన ఒక యువకుడిని దుండగులు సినిమా ఫక్కీలో వెంటాడి, తూటాలతో హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాంకోవర్ సమీపంలోని సర్రే నగరంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.ఏం జరిగిందంటే?మృతుడిని 27 ఏళ్ల జస్మాన్ సెఖోన్గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ఒక నివాస సముదాయం వద్ద జస్మాన్ను ఒక నల్లటి కారు వెంబడించింది. జస్మాన్ పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, దుండగులు అతడిని చుట్టుముట్టారు. వాహనం నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి జస్మాన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కాపాడే ప్రయత్నం చేసినా, ఫలితం లేకుండా పోయింది.హత్య జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి సమీపంలో ఒక కారు తగలబడుతూ కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా కెనడాలో గ్యాంగ్స్టర్లు తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు, హత్యకు వాడిన వాహనాలను తగులబెడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పులకు, దగ్ధమైన కారుకు సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.డ్రగ్స్ మాఫియా హస్తం?ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ)ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. జస్మాన్ సెఖోన్కు గతంలో డ్రగ్స్ వ్యాపారం, నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన 'టార్గెటెడ్ కిల్లింగ్' అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా గత 48 గంటల్లో ఈ ప్రాంతంలో నాలుగు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా! -
ఇరాన్ ఎఫెక్ట్.. ట్రంప్ కోసం స్పెషల్ బంకర్!
వాషింగ్టన్: ఇరాన్పై భీకర యుద్ధంలో తలమునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ట్రంప్ కోసం ప్రైవేట్ నిధులతో నిర్మిస్తున్న బాల్రూమ్ కింద అత్యంత పటిష్టమైన బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.ఆదివారం రాత్రి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. బాల్రూమ్ కింద భూగర్భంలో ఒక భారీ సముదాయం నిర్మాణ దశలో ఉందని తెలియజేశారు. సాక్షాత్తూ అమెరికా సైన్యమే దీన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త బాల్రూమ్లో బుల్లెట్ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ నిరోధక డిజైన్ వంటి అనేక ఆధునిక భద్రతా సదుపాయాలు ఉంటాయని ట్రంప్ చెప్పారు. ఈ గది అంతర్జాతీయ ప్రముఖులకు, నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతోపాటు ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంది. వైట్హౌస్ అండర్గ్రౌండ్లో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్(పీఈఓసీ) ఉండేది. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే నిర్మించారు. తరచుగా ఆధునీకరించారు. వైట్హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో ఈ సెంటర్ను తొలగించారని, నూతన, ఆధునిక సదుపాయాలతో మరో సముదాయం నిర్మాణంలో ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ వార్తా సంస్థ తెలియజేసింది. THE WHITE HOUSE IS BUILDING A MASSIVE BUNKER UNDER THE NEW BALL ROOM 🚨THIS IS NOT INSURANCEIT IS A WARNINGSOMETHING SERIOUS IS COMING pic.twitter.com/J2UCRFpwav— Matt Wallace (@MattWallace888) March 30, 2026ఎన్సీపీసీ నుంచి అనుమతి లేకుండానే.. ట్రంప్ కొత్త బంకర్ గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టలేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు. అయితే, సైన్యం వైట్హౌస్లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతోందని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ తన అభిరుచులకు అనుగుణంగా బాల్రూమ్ను కట్టించుకుంటున్నారు. దీనికి ప్రైవేట్ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ గానీ, ప్రజా పరిశీలన గానీ లేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్(ఎన్సీపీసీ) నుంచి అనుమతి లేకుండానే బాల్రూమ్ బంకర్ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టోరిక్ ప్రజర్వేషన్’ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో విచారణ జరుగనుంది. BREAKING US military building 'massive complex' beneath White House ballroom project, says Trump pic.twitter.com/reIDNg8qmZ— AFP News Agency (@AFP) March 30, 2026 -
యుద్ధం వేళ ఇజ్రాయెల్ కొత్త చట్టం.. వారికి మరణశిక్ష
జెరూసలేం: గాజాలో ఒకవైపు మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సర్కార్ మరోవైపు పాలస్తీనా పౌరులపై అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేసే దిశగా కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ ప్రజలను హత్యచేస్తే మరణ దండన విధిస్తామని తేల్చిచెప్పింది. హత్య కేసులో దోషిగా తేలితే చావుకు సిద్ధపడాల్సిందేనని వెల్లడించింది.ఈ మేరకు ఇజ్రాయెల్ పార్లమెంట్లో బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేశారు. బిల్లుకు అనుకూలంగా 62, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అంతకముందు బిల్లుపై దాదాపు 12 గంటలపాటు చర్చించారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే పార్లమెంట్లో సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ కొత్త చట్టాన్ని అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ చట్టం వివక్షపూరితమైనదని, అమానుషమైనదని స్పష్టంచేశాయి. ఇజ్రాయెలీయులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడే పాలస్తీనియన్లకు శిక్షలు పెంచాలని అతివాదాలు చాలాఏళ్లుగా డిమాండ్ చేశారు. కొందరు ఉద్యమబాట పట్టారు. వారి ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్లు స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్లో బిల్లుపై ఓటింగ్లో స్వయంగా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ జాతీయులకు మినహాయింపు కొత్త చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్ పౌరుల హత్య కేసులో దోషులుగా తేలిన వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన ఇజ్రాయెల్ పౌరులకు కూడా మరణశిక్ష విధించే అధికారం ఇజ్రాయెల్ కోర్టులకు ఉంటుంది. అయితే, మరణశిక్షను ఇజ్రాయెల్లోని పాలస్తీనా జాతీయులకే పరిమితం చేసి, యూదు జాతీయులకు మినహాయింపు ఇచ్చేలా ఈ చట్టం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కేవలం పాలస్తీనియన్లే శిక్షకు గురవుతారని స్పష్టమవుతోంది. -
యుద్ధంపై ఇరాన్ రెడ్క్రిసెంట్ సంస్థ రిపోర్ట్.. నష్టం ఎంతంటే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు జరుపుతోంది. -
అర్ధశతాబ్దం తర్వాత జాబిలి దిశగా..
కేవ్ కనావరల్(ఫ్లోరిడా): అంతరిక్ష యాత్రలకు జాబిలిని మజిలీగా మార్చుకునే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీమిస్–2 ప్రయోగం నేడు ఫ్లోరిడాలోని కేప్ కనావరల్లోని ‘కెన్నడీ అంతరిక్ష కేంద్రం’వేదికగా జరగనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.24 గంటలకు(భారతకాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 3.54 గంటలకు) నలుగురు వ్యోమగాములతో 32 అంతస్తుల ఎత్తయిన ‘స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్’నింగిలోకి దూసుకుపోనుంది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ సోమవారమే ప్రారంభించారు. దాదాపు 53 ఏళ్ల తర్వాత చందమామ సంబంధ ప్రాజెక్ట్కు నాసా శ్రీకారంచుట్టి శరవేగంగా ఆచరణలో పెట్టింది.అంతా సవ్యంగా సాగితే అమెరికా, కెనడా వ్యోమగాములు రెయిడ్ వైస్మ్యాన్(కమాండర్), విక్టర్ గ్లోవర్(పైలట్), క్రిస్టినా కూచ్(మహిళా మిషన్ స్పెషలిస్ట్), జెరిమీ హాన్సెన్లు చందమామ సమీప కక్ష్యలోకి వెళ్లి వస్తారు. నింగిలోకి దూసుకెళ్లాక తొలిరోజు వీళ్లు భూకక్ష్యలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలెడతారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రజలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు.కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరిశీలించి తిరిగొస్తారు. ఆర్టీమిస్2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారుచేసిన ‘ఇంటిగ్రిటీ’క్యాప్సూల్లో పయనించనున్నారు. ఇది వ్యోమగాములు తిరుగుప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచి్చనా వాళ్లకు ఎలాంటి హాని కల్గకుండా రక్షణనిస్తుంది. వాస్తవానికి ఆర్టిమిస్–2 ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. కానీ రాకెట్ నుంచి హైడ్రోజన్ ఇంధనం లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదాపడింది. తర్వాత సమస్యను పరిష్కరించినా హీలియం పీడనవ్యవస్థ విఫలమవడంతో ప్రయోగం మళ్లీ వాయిదాపడింది. ఎట్టకేలకు బుధవారం ప్రయోగంచేపట్టేందుకు రంగంసిద్ధమైంది. -
మోజ్తాబా ఉంది అక్కడే? రష్యా సంచలన ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ జాడపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కనిపించకపోవడం సైతం దానికి ఒక కారణం. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం ఆయన ఆచూకీపై స్పందించింది. మోజ్తాబా ఎక్కడ ఉన్నారో ఇరాన్లోని రష్యా రాయబారి స్పష్టతనిచ్చారు.మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అమెరికా దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడి ఉండవచ్చునని అన్నారు. ఆయన అసలు బ్రతికున్నారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మోజ్తాబా రష్యాలో తలదాచుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రష్యా స్పందించింది.రష్యా రాయబారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ " మొజ్తాబా ఖమేనీ దేశంలోనే ఉన్నారు, అయితే అర్థం చేసుకోదగిన కారణాల వల్ల బహిరంగంగా కనిపించడం మానుకుంటున్నారు" అని అన్నారు. యుద్ధంలో గాయపడిన ఖమేనీకి చికిత్స అందించేందుకు ఆయనను రష్యాకు విమానంలో తరలించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన తేల్చిచెప్పారు. కాగా అమెరికా-ఇరాన్ యుద్ధంలో రష్యా పాత్రను కూడా అమెరికా పర్యవేక్షిస్తోందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్కు సహాయం చేస్తోందన్న వార్తలను మాస్కో ఖండించినప్పటికీ, హెగ్సెత్ ఇలా అన్నారు కాగా యుద్ధం మెుదలై నెల రోజులు గడిచింది. అయినప్పటికీ ఇరు వర్గాలు ఏ మాత్రం తగ్గడం లేదు. -
యుద్ధానికి త్వరలో తెర!
వాషింగ్టన్: ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.‘‘యుద్ధాన్ని నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే సాగించాలని ముందే నిర్ణయించుకున్నాం. హర్మూజ్ కోసం పట్టుబడితే పోరు మరిన్ని రోజులు కొనసాగేలా ఉంది. కనుక మన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నావికా దళాన్ని, దాని క్షిపణి నిల్వలను పూర్తిగా నేలమట్టం చేసి యుద్ధానికి త్వరగా తెర దించేస్తా’’ అని ట్రంప్ చెప్పుకొచి్చనట్టు పేర్కొంది. మరోవైపు సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు మాత్రం ఇరాన్ పూర్తిగా ఓడేదాకా యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా అమెరికాను కోరుతున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది! నాటో దేశాలపై గుర్రు ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి. మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
ఇస్ఫహాన్ అణు కేంద్రంపై బాంబుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమిస్తోంది. చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్పై అమెరికా కన్నెర్రజేసింది. స్వీయ కాల్పుల విరమణను తుంగలో తొక్కుతూ మంగళవారం ఆ దేశంపై భారీ స్థాయి దాడులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్ నగరంలోని కీలక అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ కేంద్రంలోనే ఇరాన్ దాచి ఉంచినట్టు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజా దాడిలో అక్కడి అణుకేంద్రానికి నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.త్వరగా ఒప్పందానికి రాకపోతే ఇరాన్లోని మౌలిక వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ట్రంప్ సోమవారమే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము వేళ ఇజ్రాయెల్తో కలిసి టెహ్రాన్పైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో ఇరాన్ రాజధాని దద్దరిల్లిపోయింది. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. లెబనాన్పైనా ఇజ్రాయెల్ భారీగా దాడులను కొనసాగించింది. వాటిలో ఐరాస శాంతి పరిరక్షక దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది మరణించినట్టు సమాచారం. మొత్తమ్మీద మంగళవారం ఒక్క రోజే 21 మంది మృతి చెందినట్టు లెబనాన్ పేర్కొంది.మొత్తం మృతుల సంఖ్య 1,268 దాటినట్టు వెల్లడించింది. ఉత్తర గాజాలో కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఒక వ్యక్తి, అతని ఐదేళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా తమ మౌలిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంటున్నాయంటూ ఇరాన్ మండిపడింది. దీనికి తమ సమాధానం భయానకంగా ఉంటుందని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై కూడా బుధవారం నుంచి భారీగా దాడులు చేస్తామని రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్తో పాటు 18 సంస్థల పేర్లను వెల్లడించింది! తక్షణం కార్యాలయాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ కంపెనీల సిబ్బందికి సూచించింది. మండుతున్న చమురు ధరలుయుద్ధం దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు నానాటికీ ఎగబాకుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 107 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధానికి తెర తీసినప్పటితో పోలిస్తే ఇది ఏకంగా 45 శాతం ఎక్కువ కావడం విశేషం! మరోవైపు అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి! మంగళవారం గ్యాలన్ (దాదాపు 3.8 లీటర్ల) పెట్రోల్ ధర 4.02 డాలర్లకు చేరింది. 2022 తర్వాత అమెరికాలో పెట్రోల్ ధర 4 డాలర్లను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలయ్యే నాటికి అమెరికాలో గ్యాలర్ పెట్రోల్ ధర 2.98 డాలర్లుగా ఉంది. డీజిల్ ధర కూడా గ్యాలన్కు 3.75 డాలర్ల నుంచి 5.45 డాలర్లకు పెరిగింది. ఇజ్రాయెల్లో సైరన్ మోతలు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో దుబాయ్ సమీపంలో కువైట్కు చెందిన ఓ చమురు నౌకపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో నౌకలో మంటలు చెలరేగాయి. సిబ్బంది చాలాసేపు శ్రమించి వాటిని ఆర్పేశారు. ఐదు క్షిపణులు, ఏడు డ్రోన్లను కూల్చేసినట్టు కువైట్ పేర్కొంది. దుబాయ్లోని అల్ బదాలో ఓ ఆవాస ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో శకలాలు పడి ఇద్దరు భారతీయులతో పాటు నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలు కూడా దాడుల బారిన పడ్డాయి. ఆ దేశాలతో పాటు ఇజ్రాయెల్ నగరాల్లో కూడా రోజంతా సైరన్ మోతలు విన్పించాయి. ఇరాక్లోని సులేమానియా యూనివర్సిటీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.హార్మూజ్ సుంకం ఖరారుహార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేయాల్సిన సుంకాన్ని ఇరాన్ లాంఛనంగా ఖరారు చేసింది. ఒక్కో నౌక నుంచి గరిష్టంగా రూ.19 కోట్ల దాకా వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు భద్రతా మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. హార్మూజ్పై ఇరాన్ సార్వ¿ౌమాధికారానికి నిదర్శనంగా ఈ చర్య తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు హార్మూజ్ గుండా వెళ్లనివ్వబోమని పేర్కొంది.ఇటలీ సైతం... గగనతలం మూతస్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా అమెరికాకు షాకిచ్చింది. ఇరాన్పై పోరులో అమెరికా వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. సిసిలీలోని తమ వైమానిక స్థావరాన్ని అమెరికా వాడుకునేందుకు కూడా అనుమతి నిరాకరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోమవారం స్పెయిన్ కూడా ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే. -
బాగ్దాద్లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్
ఇరాక్ బాగ్దాద్లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్కు గురైంది. ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ను బాగ్దాద్లో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయాన్ని ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.బాగ్దాద్లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న (మంగళవారం) సాయంత్రం బాగ్దాద్లో రెండుకార్లలో వచ్చిన కిడ్నాపర్లు ఆమెను అపహరించారు. దీనిని గమనించిన భద్రతా బలగాలు వారిని వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల వాహనాల్లో ఒకటి బోల్తా పడగా జర్నలిస్టు ఉన్న కారు మాత్రం బాగ్దాద్ దక్షిణ ప్రాంతం వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇరాక్ నిఘా వర్గాలు మరియు క్షేత్రస్థాయి భద్రతా బలగాలు కిడ్నాపర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కిడ్నాప్కు గల కారణాలు మరియు దీని వెనుక ఉన్న ముఠాల గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఇదివరకే అమెరికాలోని షెల్లీ కిటిల్సన్కు పొంచి ఉన్న ముప్పు గురించి ముందే హెచ్చరించింది. ఇరాక్ పర్యటనకు వెళ్లవద్దని ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాక్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో, అమెరికా రాయబార కార్యాలయం కూడా పౌరులకు కిడ్నాప్ ముప్పు పొంచి ఉందని గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. కాగా షెల్లీ కిటిల్సన్ మధ్యప్రాచ్య వ్యవహారాలపై లోతైన కథనాలు రాసే జర్నలిస్ట్గా గుర్తింపు పొందారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి. -
ఇజ్రాయెల్లో కీలక బిల్లు ఆమోదం.. అలా చేస్తే ఉరిశిక్షే?
ఇజ్రాయెల్ పార్లమెంటు (నాసాట్) పాలస్తీనా నేరస్థులను శిక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద ఇజ్రాయెల్ పౌరుల హత్యలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలస్తీనియన్లు పాల్గొంటే వారికి నేరుగా ఉరిశిక్ష విధించబడుతుంది.ఇజ్రాయెల్లోని కొన్ని గ్రూపులు చాలా కాలంగా ఈ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిప్రకారం పాలస్తీనాకు చెందిన వ్యక్తులు తీవ్రమైన నేరాలకు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం లేకుండా కూడా మరణశిక్షను ప్రకటించగలరు. అప్పీల్ చేసే హక్కు ఉండదు. శిక్ష విధించిన 90 రోజుల్లో ఉరితీయబడతాడు. ఈ చట్టం జాతీయవాద లేదా తీవ్రవాద కారణాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణ శిక్షను జీవిత ఖైదు విధించే హక్కు కూడా కోర్టులకు ఉంటుంది.కాగా మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును జాతిపరంగా వివక్షతగా పేర్కొన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ మానవ హక్కుల, పౌర సమాజ సంస్థలు ఈ చట్టం పాలస్తీనియన్లపై జాతి హింసను ప్రోత్సహిస్తున్నాయని నిరసన తెలుపుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇన్ని సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ధేశంలోమరణశిక్ష విధించబడింది. -
ట్రంప్ పేరుతో విమానాశ్రయం.. కరెన్సీ పై కూడా..?
అమెరికా ఫ్లోరిడాలోని విమానాశ్రయానికి దేశాధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫ్లోరిడా గవర్నర్ ఆ బిల్లుపై సంతకం చేశారు. అన్ని సవ్యంగా సాగితే అధ్యక్షుడి హోదాలో ఉండగానే ఎయిర్ఫోర్టుకు తన పేరు పెట్టుకున్న వ్యక్తిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు.డొనాల్డ్ ట్రంప్కు పబ్లిసిటీ పిచ్చిన పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే అక్కడి కొన్ని ప్రభుత్వ సర్వీసులను తన పేరుమీదుగా అందిస్తోన్న ట్రంప్ ఇప్పుడు తాజాగా విమానాశ్రయానికి తన పేరు పెట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును డోనాల్డ్ ట్రంప్గా మార్చుతూ గవర్నర్ రాన్ డెసాంటిస్ ఒక బిల్లుపై సంతకం చేశారు.ఇప్పుడు ఆ ఫైల్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు పంపబడుతుంది. దీని తరువాత, ఫ్లైట్ చార్ట్, నావిగేషన్ సిస్టమ్ మరియు విమానాశ్రయ సంకేతాలు మార్చబడతాయి. ఈ ఫైలును FAA ఆమోదిస్తే జూలై 1 నుండి ఈ పేరు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే, ట్రంప్ తన పదవీకాలంలోనే అతని పేరు మీద ఎయిర్ఫోర్టు ఉంటుంది. ఇలా పదవికాలంలో విమానాశ్రయం పేరు మీదున్న మొదటి అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టిస్తారు.అయితే ట్రంప్ పేరు మీదకు రాబోతున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయనకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే అతని ప్రధాన నివాసం. ఇదివరకే అనేక ప్రభుత్వ సేవలు ట్రంప్ పేరు మీద ఉన్నాయి. అంతే కాకుండా త్వరలో ట్రంప్ సంతకం అక్కడి కరెన్సీపై కూడా ముద్రించనున్నారు. -
అమెరికా టెక్ కంపెనీలకు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచే ఈ దాడులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సైన్యం ఏప్రిల్ 1 నుంచి వెస్ట్ ఆసియా ప్రాంతంలో అమెరికా కంపెనీలే లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించాయి. ఐఆర్జీసీ ప్రకటించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతీకారంగా సైనిక స్థావరాలకే కాకుండా వాణిజ్య, సాంకేతిక రంగ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ చర్యలు ఏప్రిల్ 1, బుధవారం రాత్రి 8 గంటలకు (టెహ్రాన్ సమయం) ప్రారంభమవుతాయని హెచ్చరించింది. ‘ప్రతి ఉగ్రదాడికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము’ అని ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు జరుపుతోంది. ఈ చర్యలు అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా జరుగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈసారి సాంకేతిక, వాణిజ్య రంగ సంస్థలను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకోవడంతో యుద్దం మరింత ఉద్రిక్తమయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘మీకోసమే ఎదురు చూస్తున్నాం’
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో శత్రు దేశాల సైన్యం భూతల దాడులకు దిగితే తాము ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది.ఇరాన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ సైన్యం తమ కమాండోల క్లిప్లను చూపిస్తూ అమెరికన్ సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించింది. 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఇరాన్ ప్రత్యేక దళాల కదలికలను వేగంగా చూపిస్తూ ‘దగ్గరకు రండి, మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం’అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో పాటు సైనిక సామగ్రితో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు చేయడం, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం చూడొచ్చు. మరో క్లిప్లో ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది. అమెరికా వైపు చర్యలుఅమెరికా వైట్ హౌస్ ప్రకారం..అదనపు సైన్యాన్ని పశ్చిమ ఆసియాకు పంపడం ద్వారా అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలదని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ..‘ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లక్ష్యాలను సాధించడానికి పెంటగాన్ సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది’అని తెలిపారు. పెంటగాన్ ఇరాన్లో కొన్ని వారాలపాటు భూసైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి ఆక్రమణ కాకుండా, లక్ష్యిత దాడుల రూపంలో ఉండవచ్చని సమాచారం. Iran’s Army released footage of its elite commandos, declaring it is ready to confront and defeat American soldiers.Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/gIdaV4W8lI— Press TV 🔻 (@PressTV) March 31, 2026 -
ట్రంప్నకు షాకిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
రోమ్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాక్ తగిలింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలంలో అనుమతి ఇవ్వబోమని కొన్ని దేశాలు స్పష్టంగా ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరింది. అమెరికా యుద్ధ విమానాలకు గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో ఇరాన్పై యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కతూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇరాన్ను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని దేశాలు తమకు కావాల్సిన చమురు అమెరికా నుంచి కొనుగోలు చేయాలి. లేదా హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లి మీకు కావాల్సి వెళ్లి స్వయంగా తెచ్చుకోవాల్సిందే’అని వ్యాఖ్యానించారు.హర్మూజ్ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలు జెట్ ఇంధనం కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వద్ద ఇంధనం ఎక్కువగా ఉంది, కావాలంటే ఆ దేశాలు కొనుగోలు చేసుకోవచ్చు. ‘ధైర్యం చేసి హర్మూజ్కి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండి’ అని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మీరు అమెరికాకు తోడుగా లేరు. ఇకపై అమెరికా సహాయం చేయదు. ఇకనైనా మీరు ఒంటరిగా పోరాడడం నేర్చుకోవాలి’ అని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సాధారణ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ట్రంప్ హెచ్చరిస్తూ ‘తక్షణమే కాల్పుల విరమణ జరగకపోతే, హర్మూజ్ జలసంధి తిరిగి తెరవకపోతే అమెరికా దాడులను విస్తరిస్తుంది. ఖార్గ్ దీవిలోని చమురు ఎగుమతి కేంద్రాన్ని, అవసరమైతే డీసాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. -
ఆకాశాన్ని కమ్మేసిన కాకుల వనం..!
ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే ఈ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూస్తున్నారు. పగలు కాస్తా రాత్రిలా మారిపోయింది. దానికి కారణం సూర్యుడిని కమ్మేసిన మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఇది రాబోయే ముప్పుకు సంకేతమా? మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్ లో కూడా కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే ఒక రకమైన మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో ఈ కాకులు చేస్తున్న వింత ఆకారాలు చూస్తుంటే, స్థానికులు ఇది ఒక ‘చెడు శకునం’ (Bad Omen) అని నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి వింతైన పక్షుల ప్రవర్తన జరిగినప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా నెటిజన్లు చూడటం లేదు. దీనికి మతపరమైన కోణాన్ని జోడిస్తున్నారు. బైబిల్లో చెప్పబడిన ‘అంత్యకాలం’ (End Times) సంకేతాల్లో పక్షుల వింత ప్రవర్తన కూడా ఒకటి అని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి పవిత్ర భూమిపై ఇలాంటి దృశ్యాలు కనిపించడం వెనుక దైవికమైన హెచ్చరిక ఉందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు మరియు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని పాత నిబంధనలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, దీనిని 'ముర్మురేషన్' (Murmuration) అని పిలుస్తారు. ఆహారం కోసం వెతుకుతూ లేదా సురక్షితమైన స్థావరం కోసం పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల ఇది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైన పక్షులు, అవి వేటాడే పక్షుల నుండి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయి.ఒకవైపు మూఢనమ్మకాలు, మరోవైపు శాస్త్రీయ కారణాలు.. ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజల్లో పెరిగిన 'అన్సర్టైనిటీ' (అనిశ్చితి). ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.టెల్ అవీవ్ ఆకాశంలో కనిపించిన ఆ నల్లని నీడలు నిజంగానే ఏదైనా విపత్తుకు సంకేతమా? లేక ప్రకృతిలో జరిగే ఒక సామాన్య ప్రక్రియనా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసరమైన భయాందోళనలకు గురికావద్దు. -
పవిత్ర జెరూసలేంపై క్షిపణి దాడులు: వారి మౌనంపై తీవ్ర చర్చ
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో పవిత్ర వారంలో (Holy Week) పాస్ ఓవర్ (Passover) వేడుకల సమయంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నగరంపై దాడులు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఈ దాడులను ధృవీకరించింది.జెరూసలేం ఆకాశంలో క్షిపణి దాడులుమంగళవారం ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగంపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది. జెరూసలేం అంతటా సైరన్లు మోగాయి. వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్పైకి ప్రయోగించింది. దీంతో జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ (Temple Mount) అల్-అక్సా మసీదు (Al-Aqsa Mosque) వంటి పవిత్ర ప్రదేశాలపై క్షిపణి దాడి దృశ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అయితే పైన 'ఐరన్ డోమ్' , 'ఆరో' (Arrow) రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను అడ్డుకున్నాయి. ఒకవేళ ఇవి నేరుగా తగిలి ఉంటే కోలుకోలేని నష్టం వాటిల్లేది. మరోవైపు ప్రముఖ అమెరికన్ వ్యాఖ్యాతలు టకర్ కార్ల్సన్ (Tucker Carlson) ,క్యాండేస్ ఓవెన్స్ (Candace Owens) ఈ విషయంలో ఇరాన్ను గట్టిగా ఖండించకపోవడమే కాకుండా, విభిన్నమైన, వివాదాస్పదమైన వాదనలు వినిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జెరూసలేం క్రైస్తవులకు, యూదులకు అత్యంత పవిత్రమైనది. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యాతలు ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇరాన్ దాడులను వారు ఖండించకపోవడం వారి మద్దతుదారుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది."అమెరికా ఫస్ట్" (అంటే అమెరికా ఇతర దేశాల యుద్ధాల్లో పక్షం వహించకూడదు) అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నవాళ్లలో వీరు ముఖ్యులు. ఈ క్రమంలో ఇరాన్ దురాక్రమణను నేరుగా ఖండించడం కంటే, అమెరికా ఈ గొడవల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోంది అంటూ విమర్శలు గుప్పించారు. అటు ప్రస్తుతం అమెరికాలోని రైట్ వింగ్లో ఒక పెద్ద చీలిక కనిపిస్తోంది. ఒక వర్గం ఇజ్రాయెల్ను పవిత్ర భూమిగా భావించి బేషరతుగా మద్దతు ఇస్తుంటే,కార్ల్సన్ , ఓవెన్స్ వంటి వారు ఇజ్రాయెల్కు అమెరికా ఇచ్చే ఆర్థిక, సైనిక మద్దతును ప్రశ్నిస్తున్నారు. అయితే జెరూసలేం వంటి పవిత్ర నగరం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా వీరు ఇరాన్ను ఖండించకపోవడం వెనుక వారి "ఐసోలేషనిజం" (Isolationism - అంటే ఇతర దేశాల గొడవల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదనే సిద్ధాంతం). ఇటీవల వారు అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం దాడులు, ప్రతిదాడులతో యావత్ ప్రపంచం దద్దరిల్లుతోంది. పవిత్ర భూమిపై భీకర దాడులు, యుద్ధమేఘాలు కమ్ముకోవడం, అంతర్జాతీయ వేదికలపై దీనిపై జరుగుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
Pakistan: 4 నుంచి లాక్డౌన్?.. ప్రభుత్వం కీలక ప్రకటన
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం దృష్ట్యా లాక్డౌన్ విధించినున్నారన్న వార్తల నడుమ అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీకెండ్ లాక్డౌన్’ ప్లాన్కు ప్రావిన్షియల్ (రాష్ట్ర) ప్రభుత్వాలు గట్టిగా నో చెప్పడంతో ప్రస్తుతానికి లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మండిపోతున్న వేళ, పాక్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా పలు ఆంక్షలను పరిశీలించింది. అయితే, తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా ఎలాంటి షట్డౌన్ ఉండబోదని స్పష్టమైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కోబోతోందని, దీనిని నియంత్రించేందుకు ఏప్రిల్ 4 లేదా 5 నుంచి ‘స్మార్ట్ లాక్డౌన్’ అమలు చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, బహిరంగ సభలపై నిషేధం, రవాణాపై ఆంక్షలు వంటి ప్రతిపాదనలతో ఒక ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన ‘ఐవాన్-ఎ-సదర్’లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. లాక్డౌన్ విధిస్తే సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల మద్దతు లభించకపోవడంతో కేంద్రం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.ప్రస్తుతానికి దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇచ్చారు. లాక్డౌన్ల కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చే చర్యలపైనే తాము దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు, ఇతర ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి -
‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి
బహావల్పూర్: భారత గడ్డపై నెత్తురు ఏరులు పారించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో మృతి చెందాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అనుమానాస్పద స్థితిలో మృతిచాలా కాలంగా జైషే మహమ్మద్ కార్యకలాపాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ తన అధికారిక ఛానల్ ద్వారా ఈ మృతిని ధృవీకరించింది. బహావల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే అతను అనారోగ్యంతో చనిపోయాడా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా అనే విషయంలో సంస్థ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.భారత్కు పక్కలో బల్లెంలా జైషే..భారత పార్లమెంటుపై దాడి (2001), పఠాన్కోట్ ఎయిర్బేస్ స్ట్రైక్ (2016), యూరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి (2019) తదితర దారుణాల వెనుక మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ సంస్థలో తాహిర్ అన్వర్ ఏళ్ల తరబడి కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు.‘ఆపరేషన్ సింధూర్’తో కోలుకోలేని దెబ్బగత ఏడాది ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టాయి. బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ దాడుల్లో అజహర్ సోదరి, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు గత సెప్టెంబర్లోనే ఆ సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా? -
న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా?
ఆక్లాండ్: న్యూజిలాండ్ చరిత్రలోనే అత్యంత భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బల్తేజ్ సింగ్కు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఇప్పుడు అతని వెనుక ఉన్న ఒక సంచలన చరిత్ర అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపిన హంతకుల్లో ఒకరైన సత్వంత్ సింగ్తో బల్తేజ్ సింగ్కు కుటుంబ పరమైన సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందిఎవరీ బల్తేజ్ సింగ్?ఆక్లాండ్ నగరంలో వ్యాపారవేత్తగా చలామణి అవుతున్న బల్తేజ్ సింగ్, తెర వెనుక భారీ అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను నడిపాడు. దాదాపు 700 కేజీల మెతాంఫేటమిన్ (Methamphetamine) అనే మత్తు పదార్థాన్ని న్యూజిలాండ్లోకి అక్రమంగా తరలించినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ అనంతరం మార్చి 30న న్యూజిలాండ్ కోర్టు అతనికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.ఇందిరా గాంధీ హత్యతో లింక్ ఏంటి?శిక్ష ఖరారైన తర్వాత బల్తేజ్ సింగ్ కుటుంబ నేపథ్యంపై ఆసక్తికర చర్చ మొదలైంది. 1984 అక్టోబర్ 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమె నివాసంలోనే అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన ఈ దారుణం దేశాన్ని కుదిపేసింది. అయితే, ఈ హంతకుల్లో ఒకరైన సత్వంత్ సింగ్కు బల్తేజ్ సింగ్ బంధువని దర్యాప్తులో తేలింది.గుట్టు రట్టయిందిలా..బల్తేజ్ సింగ్ నెట్వర్క్ చాలా తెలివిగా డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసేది. బీర్ క్యాన్లలో అత్యంత నాణ్యమైన డ్రగ్స్ను దాచి సరిహద్దులు దాటించేవారు. అయితే 2023లో ఒక వ్యక్తి పొరపాటున డ్రగ్స్ కలిపిన ద్రవాన్ని తాగి ప్రాణాలు కోల్పోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో బల్తేజ్ సింగ్ డ్రగ్ కింగ్ అని తేలింది.బల్తేజ్ సింగ్ వేడుకోలుతన కుటుంబ నేపథ్యం వల్ల భవిష్యత్తులో ముప్పు ఉంటుందని, తన పేరును బయటకు వెల్లడించవద్దని (Name Suppression) బల్తేజ్ సింగ్ కోర్టును ఆశ్రయించాడు. కానీ అందరికీ ఈ కేసు గురించి తెలుసుకునే హక్కు ఉందని భావించిన కోర్టు, అతని విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కేసుతో 1984 నాటి విషాదకర ఘటనలు, ఆ తర్వాతి అల్లర్ల చరిత్ర మరోసారి విదేశీ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక హంతక కుటుంబానికి చెందిన వ్యక్తి, మరో దేశంలో భారీ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘ఎయిర్ ఇండియా’లో ‘పాన్ పాన్’ కాల్... ప్రయాణికులు బెంబేలు -
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్ఫహాన్లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది.మరోవైపు, ఇరాన్కు ట్రంప్ తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. -
కువైట్ ట్యాంకర్పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం
దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ పోర్ట్లో కువైట్కు చెందిన భారీ చమురు ట్యాంకర్పై ఇరాన్ నేరుగా దాడికి తెగబడింది. ఈ మెరుపు దాడితో ట్యాంకర్లో భారీగా మంటలు చెలరేగగా, సముద్రంలో చమురు ఒలికిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?కువైట్ పెట్రోలియం కార్పొరేషన్కు చెందిన ‘అల్ సాల్మీ’ అనే భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ దుబాయ్ పోర్ట్లో ఉండగా ఇరాన్ దళాలు దాడి చేశాయి. కువైట్ అధికారిక వార్తా సంస్థ ‘కునా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిస్థాయి చమురు నిల్వలతో ఉంది. దాడి ప్రభావంతో నౌక తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో మంటలు చెలరేగాయి.వణికిస్తున్న చమురు గండంట్యాంకర్ట్రాకర్స్.కామ్ (TankerTrackers.com) గణాంకాల ప్రకారం.. అల్ సాల్మీ నౌకలో ప్రస్తుతం 12 లక్షల బ్యారెళ్ల సౌదీ క్రూడ్ ఆయిల్, మరో ఎనిమిది లక్షల బ్యారెళ్ల కువైట్ క్రూడ్ ఆయిల్ ఉంది. అంటే మొత్తం 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలో కలిసిపోయే ముప్పు ఏర్పడింది. ఒకవేళ చమురు లీక్ అయితే పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందని కువైట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.క్షేమంగా 24 మంది సిబ్బందిఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నౌకలో ఉన్న మొత్తం 24 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు దుబాయ్ అధికారులు ధృవీకరించారు. దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం నౌకకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, చమురు లీక్ కాకుండా చూడటమే లక్ష్యంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అస్సాం ‘వార్’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ! -
నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యం
గంటల కొద్దీ జిమ్లో కసరత్తు, ఆహార నియమాలు పాటించిన వారికే బరువు తగ్గడం అంత సులువు కావడం లేదు. తాము నటించే పాత్రలకోసం విపరీతంగా బరువు తగ్గిన వారిని చాలామందిని చూశాం. కానీ విచిత్రమైన పద్దతుల్లో కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. వివరాలు ఉన్నాయి.కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల, వారు పాటిస్తున్న కఠినమైన డైట్ ప్లాన్ ఇపుడు నెట్టింట చర్చనీ యాంశంగా మారాయి. ప్రముఖ కొరియన్ నటీమణులు కిమ్ జి-వోన్, హా జి-వోన్, పార్క్ మిన్-యంగ్ ఇటీవల బాగా బరువు తగ్గి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నారు. వీరు గతం కంటే చాలా సన్నగా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు వారి అంకితభావాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు వారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అభిమానులలో ఆందోళన పుట్టిస్తున్న డైట్ వివరాలు ఇలా ఉన్నాయి కిమ్ జి-వోన్ (Kim Ji-won): మిలన్లో జరిగిన బల్గారి (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్లో ఈమె కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి కంటే చాలా సన్నగా మారడంతో అభిమానులు సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) హా జి-వోన్ (Ha Ji-won): తన కొత్త డ్రామా 'క్లైమాక్స్' (Climax) కోసం ఈమె కావాలనే బరువు తగ్గారు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఇమేజ్ ఉన్న ఈమె, తన పాత్ర కోసం కండరాల శాతాన్ని తగ్గించుకుని మరీ బలహీనంగా కనిపించేలా శరీరాన్ని మార్చుకున్నారు. "నన్ను నేను మార్చుకోవడం నటన కంటే కష్టమైంది" అని ఆమె పేర్కొన్నారు.పార్క్ మిన్-యంగ్ (Park Min-young): ఈమె డైట్ పద్ధతి అందరినీ షాక్కు గురిచేసింది. గతంలో 'మ్యారీ మై హస్బెండ్' అనే ప్రాజెక్ట్ కోసం 37 కిలోలకు తగ్గిన ఆమె, తాజా డ్రామా 'సైరన్' (Siren) కోసం అదే పద్ధతిని కొనసాగించారు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!కేవలం నీళ్లు , ఆల్కహాల్ డైట్?పార్క్ మిన్-యంగ్ తన పాత్ర కోసం వివరిస్తూ, "నేను బరువు పెరిగితే ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే కేవలం నీళ్లు , ఆల్కహాల్ను మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. షూటింగ్ సమయంలో రోజుకు 3 లీటర్ల నీరు తాగేదాన్ని" అని వెల్లడించారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.నటీనటులు తమ పాత్రల కోసం ఇలాంటి ప్రాణాంతకమైన డైట్లు చేయడం, చాలా కఠినమైన వ్యాయామాలు చేయడం కేవలం నీటిపైనే ఆధారపడటం వంటివి సమాజంలో ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పుతున్నాయనే చర్చకు దారితీసింది. నటన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
గల్ఫ్ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్ దాడులు
పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. -
గాల్లో పేలిన విమానం.. ఫైలట్ అప్రమత్తతతో 288 మంది సేఫ్
బ్రెజిల్లో డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పేలుడు సంభవించి విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ వివరాలు తెలుసుకున్న ఫైలట్ ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా చాకచాక్యంగా వ్యవహరించారు. విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానంలో 288 మంది ప్రయాణికులున్నారు. ఫైలట్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. -
పాకిస్థాన్ చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేస్తున్నామని పాకిస్థాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనిపై స్పందించింది. ఇస్లామాబాద్లో పాక్ నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని భారత్లోని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు.పాకిస్థాన్ ఉప ప్రధాని ఇటీవల ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అమెరికా, ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడితో కూడా తాము మాట్లాడామని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించింది.ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో తాము నేరుగా ఎటువంటి చర్చలు జరపడం లేదని మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం అహేతుకమైన మితిమీరిన డిమాండ్లను మాత్రమే పంపుతోందని తెలిపారు.అమెరికా దౌత్య విధానం తరచుగా మారుతూ ఉంటుందని కానీ ఇరాన్ మాత్రం మెుదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు. అదే విధంగా పాకిస్థాన్ వారి సొంతంగా సమావేశం నిర్వహించిందని అందులో తాము పాల్గొనలేదని తెలిపారు. యుద్దం ముగింపుకు వారి ప్రయత్నం అభినందనీయమని అదే సమయంలో యుద్ధం ఎవరు మెుదలుపెట్టారో గుర్తుంచుకోవాలని ఈ సందర్బంగా ఇరాన్ రాయబారి అన్నారు. -
భారత్ రావాల్సిన విమానంపై అమెరికా దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమెరికా జరిపిన దాడుల్లో భారత్ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.. ఔషద సేకరణకు ఈ విమానం భారత్ రావాల్సి ఉంది.ఇరాన్లో జరుగుతన్న యుద్ధం కారణంగా మానవతా సహాయం అందించేందుకు భారత్లో విరాళాలు సేకరించారు. ఆ నిధులతో అక్కడి ప్రజలకు కావాల్సిన ఔషదాలు కొనుగోలు చేశారు. ఈ మందులను తీసుకెళ్లడానికి ఇరాన్కు చెందిన (Airbus A340-600)విమానం బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాగా ఇరాన్లోని ఓ ఎయిర్పోర్టు వద్ద అమెరికా జరిపిన దాడుల్లో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.దీంతో మందులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుంది. కాగా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భారతీయులు పంపిన డబ్బుతో ఈ మందులను కొనుగోలు చేశారు. కాగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. -
సాయుధుల దాడిలో 70 మంది మృతి
జుబా: దక్షిణ సూడాన్లో బంగారు గని విషయమై తలెత్తిన వివాదం 70కి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. సెంట్రల్ ఈక్విటోరియా ప్రావిన్స్లోని దేశ రాజధాని జుబా నగర శివారులోని బంగారు గని వద్ద శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. జెబెల్ ఇరాక్లోని బంగారు గనిలో తవ్వకాలపై మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని సాయుధులు గని వద్ద ఉన్న వారిపై మూకుమ్మడిగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రాంతం ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉందని, ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని ప్రతిపక్ష సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మి(ఎస్పీఎల్ఎం) ఆరోపించింది. -
తేల్చకుంటే సర్వనాశనమే
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్లో మేం చేపట్టిన సైనిక చర్యలను తక్షణం ఆపేసే అంశంపై ఇరాన్ దేశ నూతన పాలక వర్గంతో విస్తృతస్థాయిలో సమగ్రంగా సహేతుకంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కానీ ఏదైనా కారణంతో ఈ ఒప్పందం గనక సఫలీకృతంకాకపోతే ఇరాన్ అంతుచూస్తాం. సరుకు రవాణా నౌకల రాకపోకల కోసం హార్మూజ్ను తెరవకపోతే ఇన్నిరోజులు ఇరాన్ విషయంలో మేం చూపించిన సహనం మాలో చచ్చిపోతుంది. వెంటనే ఇరాన్లోని అన్ని చమురు క్షేత్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలు, ఖర్గ్ ద్వీపంసహా ఉప్పునీటిని తాగు నీటిగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లనూ సర్వనాశంచేస్తాం. ఇరాన్ గత 47 ఏళ్ల ఉగ్రపాలనలో వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’అని ట్రంప్ హెచ్చరించారు. ఖర్గ్ను స్వాధీనం చేసుకోవచ్చేమో.. ఇరాన్ చమురు మౌలికరంగంలో గుండెకాయ అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకునే ఆలోచన ఉందని ట్రంప్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. ఈ విషయంలో మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయి. మా పంతం నెగ్గాలంటే ఖర్గ్ ద్వీపం మా అ«దీనంలో ఉంటే మంచిదేమో. దానిని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్ వద్ద లేదు. సులభంగా స్వా«దీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. డిమాండ్లను తప్పుబట్టిన ఇరాన్ అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను ఇరాన్ చెత్త ప్రతిపాదనలుగా అభివరి్ణంచింది. ‘‘గల్ఫ్ అరబ్ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలు ప్రవేశించాయి. కానీ పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లోకి అమెరికా సేనలు అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్నీ సముద్ర మందుపాతరలతో నింపేస్తాం. అమెరికా పంపిన డిమాండ్లు అన్నీ అతిగా, అవాస్తవంగా, ఏమాత్రం హేతుబద్ధత లేకుండా ఉన్నాయి’’ అని ఇరాన్ విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ వ్యాఖ్యానించారు. పాక్ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ‘‘ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటమాటకి మాటిమాటికీ మారుతోంది. మధ్యవర్తిత్వంపై అమెరికా పిల్లిమొగ్గలేస్తోంది. మేం స్థిరంగా ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే. కానీ అసలే పోరు మొదలెట్టింది ఎవరు?’’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. అమెరికా బలగాల కోసం ఇరాన్ సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాగానే కాల్చి బూడిదచేస్తాం. అమెరికా మిత్రదేశాలకూ ఇదే మా హెచ్చరిక’’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాహ్ అన్నారు. ఇరాన్ దాడుల పరంపర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సోమవారం సైతం దాడులను కొనసాగించింది. కువైట్లోని జల, విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్ బాంబులేసింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్పై క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి. దుబాయ్లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్ దాడులుచేసింది. దీంతో ఆ ప్రాంతమంతా హెచ్చరికల సైరన్లతో మోగిపోయింది. అయితే ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,900 మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలోముగ్గురు ఐరాస శాంతివిభాగ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ శివారు టైర్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. మరోవైపు ఇరాక్లోని మొహమ్మద్ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి తమ ఆంటోనోవ్–132 ఆర్మీ రవాణా విమానం ధ్వంసమైందని ఇరాక్ రక్షణ శాఖ తెలిపింది.గగనతలాన్ని మూసేసిన స్పెయిన్ ఇరాన్పై దాడుల కోసం అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న స్పెయిన్ సోమవారం తమ ఎయిర్స్పేస్ను మూసేసింది. ‘‘సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనికస్థావరాలను యుద్ధం కోసం ఉపయోగించకూడదు. కానీ మా మాట అమెరికా వినట్లేదు. అందుకే మా గగనతలాన్ని మూసేస్తున్నాం. ఈ యు ద్ధం చట్టవ్యతిరేకం, అన్యాయం’’అని స్పెయిన్ రక్షణమంత్రి మార్గరీటీ రూబెల్స్ ప్రకటించారు. నేవీ చీఫ్ మరణాన్ని ద్రువీకరించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని నేవీ విభాగ సారథి అలీరెజా తంగసిరి ఇటీవల దాడుల్లో కన్నుమూశారని ఇరాన్ ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ నేవీ రియర్ అడ్మిరల్ను గత గురువారమే అంతంచేశామని ఇజ్రాయెల్ ప్రకటించినా ఇప్పటిదాకా ఇరాన్ ధ్రువీకరించలేదు. ‘‘దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీరెజా అమరుడయ్యారు. దేశసేవలో అత్యున్నత త్యాగం చేశారు’’ అని ఇరాన్ నేవీ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేసింది. కువైట్లో భారతీయుని దుర్మరణం కువైట్లో సముద్రనీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లో పనిచేస్తున్న ఒక భారతీయుడు సోమవారం ఆ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతినడంతో ఇతను చనిపోయాడని కువైట్ విద్యుత్, జల, పునరుత్పాదక ఇంధన శాఖ తెలిపింది. -
ఇరాన్తో చర్చలు.. వైట్హౌస్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ట్రంప్ అదనపు బలగాల్ని యుద్ధ క్షేత్రంలోకి తరలిస్తుంటే.. ఇరాన్ సైతం నరకానికి స్వాగతం అని సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. యుద్ధం ముగింపుకు చర్చలు సజావుగా సాగుతున్నాయని వెల్లడించింది.ఇరాన్లో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మట్లాడారు." ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా చేసే ప్రకటనలకు, తెరవెనుక అమెరికా అధికారులతో జరుపుతున్న చర్చలకు చాలా తేడా ఉంది అని ఆమె పేర్కొంది.అదేవిధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు కొన్నిమీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని ఆమె కొట్టిపడేశారు. ఇరాన్ పాలకుల బహిరంగ హెచ్చరికలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలు మాత్రం సజావుగానే జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.అయితే కరోలిన్ ప్రకటనకు వాస్తవ పరిస్థిలకు చాలా భిన్నంగా ఉంది. ఇరాన్ మాత్రం చర్చలు జరగట్లేదని గట్టిగా చెబుతోంది. ట్రంప్ సైతం వేల సంఖ్యలో అదనపు బలగాల్ని ఇది వరకే మధ్యప్రాచ్యానికి తరలించారు. హార్మూజ్ తెరవకపోతే దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
టెహ్రాన్పై అణుదాడి ప్లాన్? UNO మాజీ అధికారి సంచలన ఆరోపణ
ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్ దౌత్యవేత్త, మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్పై అణు ఆయుధాలను ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఇరాన్ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందించడంతో పరిస్థితులు చేజారిపోయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుఎన్కు చెందిన సీనియర్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తోందన్నారు.ఈ మేరకు మహమ్మద్ సఫా తన రాజీనామా లేఖను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు."ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు, ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ, ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవడం వికృతమైన ఆలోచన. వాషింగ్టన్ లేదా లండన్ వంటి నగరాలపై అణు దాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది" అని హెచ్చరించారు.మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ "నేరానికి" సాక్షిగా ఉండలేక, తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు సఫా పేర్కొన్నారు. టెహ్రాన్ కేవలం ఎడారి కాదని, అక్కడ కోటి మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తివంతమైన లాబీకి తొత్తులుగా మారారని సఫా ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నా, UN అధికారులు వారిని ప్రశ్నించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని ఆయన పిలుపునిచ్చారు.I don't think people understand the gravity of the situation as the UN is preparing for possible nuclear weapon use in Iran.This is a picture of Tehran. For you uneducated, untraveled, never-served, warhawks licking your chops at the thought of bombing it. It's not some low… pic.twitter.com/BnzB4F3001— Mohamad Safa (@mhdksafa) March 29, 2026 -
వీటిని పేల్చేస్తాం.. అంతా స్మాష్: ట్రంప్ అల్టిమేటం
వాషింగ్టన్: పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారే అవకాశాలు కనపడుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (మార్చి 30) ఇరాన్కు మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం త్వరగా కుదరకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఖర్గ్ దీవిని పూర్తిగా పేల్చి నాశనం చేస్తామని అన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్ ద్వారా ఈ హెచ్చరిక జారీచేశారు. ఇరాన్ వెంటనే హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.“ఇరాన్లో మా సైనిక చర్యలను ముగించేందుకు సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. మంచి పురోగతి జరిగింది. కానీ, ఏదైనా కారణంతో ఒప్పందం త్వరగా కుదరకపోతే, అలాగే హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ దీవిని పేల్చి పూర్తిగా నాశనం చేస్తాం. ఇప్పటివరకు మేము కావాలనే వీటి జోలికి వెళ్లలేదు” అని చెప్పారు. ఇరాన్లో గత 47 సంవత్సరాలుగా భయంకర పాలకులు ఉన్న సమయంలో తమ సైనికులు, ఇతరులను ఆ దేశం చంపినందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కాగా, అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలూ జరగలేదని ఇరాన్ అంటోంది. అయితే, ఇరాన్ తస్నీమ్ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికకు పాకిస్థాన్ ద్వారా ఇరాన్ స్పందనను పంపింది.“అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా అన్యాయమైన డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా దౌత్యంలో మార్పులు ఉంటున్నాయి. మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధం ముగించాలని పశ్చిమాసియాలో వస్తున్న విజ్ఞప్తులకు స్వాగతం, కానీ ప్రారంభించినది ఎవరో గుర్తుంచుకోండి” అని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది.ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సోమవారం (మార్చి 30న) కూడా కొనసాగాయి. ఇరాన్లో పెంటగాన్ కొన్ని వారాల పాటు భూతల దాడులు చేయడానికి సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దాదాపు 10,000 మంది సైనికులను పంపే ప్రణాళిక ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గత వారం 3,500 మంది సిబ్బందిని అమెరికా పంపింది. అందులో 2,200 మెరైన్లు ఉన్నారు. ఇంకా వేలాది మంది 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి రాబోతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఖర్గ్ దీవిపై దృష్టి సారించారు. -
శ్రీలంకలో విద్యుత్ షాక్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్ టారిఫ్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పొందిన 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
ట్రంప్నకు షాక్ల మీద షాక్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా ఇరాన్ ఎంతకీ తగ్గకపోవడంతో డొనాల్డ్ ట్రంప్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరింత దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్ నుంచి ఏ ముప్పు వస్తుందోననే భయం ట్రంప్లో నెలకొంది. అలాగని కొన్ని రోజుల పాటు వార్కు గ్యాప్ ఇచ్చారు ట్రంప్. అదే సమయంలో ఇరాన్కు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే మధ్యవర్తిత్వాన్ని జరుపుతున్నారు. ఇందుకు ట్రంప్.. పాకిస్తాన్ను మధ్యలో పెట్టుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం వీటికి ససేమేరా అంటోంది. యుద్ధానికి ఘనమైన ముగింపు ఏంటో తామే ఇస్తామని, ఇటువంటి అర్థం పర్థం లేని మధ్యవర్తిత్వాలు వద్దనే అంటోంది. మధ్యవర్తిగా తమ పాత్ర పట్ల అమెరికా, ఇరాన్లు రెండూ సంతృప్తిగా ఉన్నాయని పాకిస్తాన్ చెప్పిన రోజుల వ్యవధిలోనే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వాదనలను తోసిపుచ్చింది. మధ్యవర్తి ద్వారా తమకు అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అందాయని పేర్కొంది. అమెరికా తమతో నేరుగా చర్చలు జరపలేదని, మధ్యవర్తిత్వాల ద్వారా యుద్ధం ముగింపు అనేది ఉండబోదని తేల్చిచెప్పింది. ఒకవేళ అమెరికా తమతో తాము పెట్టే కండీషన్స్కు డైరెక్ట్గా మాట్లాడి ఒప్పుకుంటేనే అప్పుడు యుద్ధం ముగింపు ఆలోచిస్తామని స్పష్టం చేసింది. తమకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది వద్దే వద్దని, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటోంది, పాక్.. అమెరికా వదిలిన అస్త్రం!పాక్ అనేది అమెరికా వదిలిన అస్త్రమనే విషయమని ఇరాన్కు అర్థమైంది. ఇన్ని ప్రపంచదేశాలు ఉండగా పాకిస్తాన్నే మధ్యవర్తిగా అమెరికా పెట్టుకోవడంపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. తమకు ఏదో రకంగా నష్టం కల్గించాలనే యోచనతోనే పాకిస్తాన్ను అమెరికా వాడుకుంటుందని, ఆ పావులో తాము పడకూడదనే భావన ఇరాన్లో స్పష్టంగా కనబడుతోంది. మాట్లాడితే మీరు డైరెక్ట్గా మాట్లాడండి.. ఇలా మధ్యవర్తిత్వం, అందులోనూ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటే సహించలేకపోతోంది ఇరాన్. యుద్ధం ముగింపు విషయం తమ వైఖరి స్పష్టంగా ఉందని, దౌత్యం విషయంలో అమెరికా తరచు మాటమారుస్తుందని ఇరాన్ అంటోంది. ఒకవేళ తమ మధ్యవర్తిత్వం అనేది చేస్తే అమెరికా తలతూగే ఏ పెద్ద దేశమో చేయాలి కానీ ఇలా పాకిస్తాన్ను మధ్యలో తీసుకురావడం ఏంటనేది ఇరాన్ ప్రశ్నగా ఉంది. అందుకే యుద్ధం విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. డైలమాలో ట్రంప్..ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పాకిస్తాన్తో రాయబారం నడుపుతుంది. ఇరాన్తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్.. అందుకు పాక్ను ఎన్నుకున్నారు. ఇరాన్ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్.. ఇక పాక్ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్ ఇచ్చారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్లో ట్రంప్ పడ్డారని, అందుకే ఇరాన్పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. మరొకవైపు అమెరికాలో తీవ్రస్థాయిలో నిరసనలు కూడా ట్రంప్ను డైలమాలోకి నెట్టేశాయి. ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్ మాట.. ఇరాన్ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్ నిపుణుల అభిప్రాయం. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. అంటే నేరుగా అమెరికానే ఇరాన్తో చర్చలు జరిపితేనే ఇది ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. ట్రంప్కు స్పెయిన్ షాక్..ట్రంప్నకు మరోషాక్ తగిలింది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ అనమతి నిరాకరించింది. ఇరాన్పై యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తన వైఖరిని కఠినతరం చేస్తూ, అమెరికా యుద్ధ విమానాలకు తన గగనతలంతో పాటు సైనిక స్థావరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇరాన్తో యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. -
ట్రంప్కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, ఇరన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దాడిలో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అసలు ప్రాణాలతో లేడని ఇలా పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ఇరాన్ మోజ్తబా గాయపడినా, ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు.కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుత యుద్ధంలో మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ ప్రజలకు తమ నాయకుడు మొజ్తబా ఒక లిఖిత సందేశంలో కృతజ్ఞతలు తెలిపారని ఇరాన్ మీడియా మార్చి 29న తెలిపింది.మొజ్తబా ఖమేనీ స్వయంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు ఆచూకీపై తీవ్ర పుకార్లు చెలరేగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అంశంపై గత వారం మాట్లాడుతూ, తాము ఇరాన్లోని ఒక ముఖ్య వ్యక్తితో చర్చలు జరుపుతున్నామనీ కానీ అది సుప్రీం లీడర్తో మాత్రం కాదు, ఆయన అసలు బతికి ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఈ వ్యాఖ్యల తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సందేశంప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా-ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఒక లేఖను విడుదల చేశారు. అలాగే ఇరాన్పై దురాక్రమణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసు కున్నందుకు ఇరాక్ సుప్రీం మత పెద్ద గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అక్కడి ప్రజలకు ఇరాన్ పట్ల వారు చూపుతున్న మద్దతుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మోజ్తబా ఖమేనీ బయట కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆయన వైమానిక దాడిలో గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు మరియు ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రూహోల్లా ఖొమేనీ మరియు అలీ ఖమేనీల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇరాన్కు మూడవ సుప్రీం లీడర్ అయ్యారు.ఇదీ చదవండి : రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా -
400 కేజీల యురేనియం ఎత్తుకొచ్చేయండి?! : ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే, ట్రంప్ నిప్పుతో చెలగాటం ఆడినట్లే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు చేపట్టకూడదని ఆయన పలు మార్లు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇరాన్లోని 450 కిలోలకుపైగా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక చర్యను పరిశీలిస్తున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ను నిర్వహించాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల్లో, ఇరాన్లో ఉన్న 453.5 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక దళాలను పంపే యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే, అమెరికా సైనికులు ఇరాన్లో కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాల్సి రావచ్చు. -
అమెరికాలో ‘నోకింగ్స్’ ఉద్యమం.. బెంబేలెత్తిస్తున్న ‘సికాడా’ వేరియంట్?!
వాషింగ్టన్: అమెరికాలో ఇరాన్పై యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ‘నో కింగ్స్’ నినాదంతో సుమారు 8 మిలియన్ల మంది పాల్గొన్న ఈ నిరసన అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇదే సమయంలో, అమెరికాలో కొత్తగా గుర్తించిన కోవిడ్-19 వేరియంట్ ‘సికాడా’ (BA.3.2) ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒమిక్రాన్ జాతికి చెందిన బీఏ.3 వేరియంట్ నుంచి పుట్టినదిగా వైద్యులు నిర్ధారించారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.అయితే, ఇరాన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ప్రజలు ఆందోళన చేస్తుండగా.. జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 వేరియంట్ వ్యాప్తి విజృంభిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024లో దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ అప్పట్లో పెద్దగా వ్యాప్తి చెందలేదు. కానీ 2025లో మోజాంబిక్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మిచిగన్, న్యూయార్క్, మిస్సోరీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ఇది వెలుగులోకి వచ్చింది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదికల ప్రకారం, వేస్ట్వాటర్ సర్వైలెన్స్, క్లినికల్ నమూనాలు, ప్రయాణికుల పరీక్షల ద్వారా ఈ వేరియంట్ గుర్తించబడింది. అమెరికాలో మొత్తం 25 రాష్ట్రాల్లో ఇది ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాల్లో ఇది కనిపించింది.‘సికాడా’ వేరియంట్ లక్షణాలు సాధారణ కోవిడ్ లక్షణాలతో పోలి ఉంటాయి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఇది వాక్సిన్ లేదా గత ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న ‘నో కింగ్స్’ ఆందోళనతో పాటు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. -
ఇక ప్రోగ్రామర్లకు గుడ్బై: గూగుల్ మాజీ సీఈఓ
‘సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఇంజనీర్లు నెలల తరబడి చేసే పనిని, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఏఐ సాయంతో ఒకే రాత్రిలో పూర్తి చేసేస్తున్నాడు’.. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ కిడ్మట్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి.నిద్రపోతున్నప్పుడు పని పూర్తి చేసే ఏఐటాప్ ప్రోగ్రామర్లు ఇప్పుడు స్వయంగా కోడింగ్ రాయడం మానేశారని ఎరిక్ తెలిపారు. దానికి బదులుగా వారు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఫలితాలను సరిచూసే ‘టెస్ట్ ఫంక్షన్స్’ రాస్తున్నారు. మిగతా పనినంతా కృత్రిమ మేధ చూసుకుంటోంది. తన స్టార్టప్లోని ఒక ప్రోగ్రామర్ చేసే పనిని ఆయన ప్రస్తావించారు. ఆ ప్రోగ్రామర్ సాయంత్రం ఏఐకి పని అప్పజెప్పి నిద్రపోతే, తెల్లవారుజామున 4 గంటలకల్లా ప్రాజెక్ట్ పూర్తవుతోంది. ఇదే పనిని గూగుల్లో చేయాలంటే 10 మంది ప్రోగ్రామర్లు, ఆరు నెలల సమయం పట్టేది’ అని ఆయన పేర్కొన్నారు.ఉద్యోగాలు పోతాయా?ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాముఖ్యత తగ్గుతుందని భావిస్తున్న వారికి ఎరిక్ ఒక కొత్త కోణాన్ని చూపారు. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు డిమాండ్ తగ్గకపోగా, మరింత పెరుగుతుందన్నారు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే భవిష్యత్తులో కొత్త ప్రపంచాలను సృష్టిస్తారని చెప్పారు. కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు.. అకౌంటింగ్, బిల్లింగ్, లాజిస్టిక్స్ తదితర ఖర్చుతో కూడిన వ్యాపార కార్యకలాపాలను కూడా ఏఐ సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.2029 నాటికి భారీ మార్పులుఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) 2029 నాటికే అందుబాటులోకి రావచ్చని ఎరిక్ అంచనా వేశారు. స్వయంగా నేర్చుకుని, ప్లాన్ చేసుకునే ఏఐ వ్యవస్థల వల్ల వైద్యం, వాతావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఆయన వివరించారు. మొత్తం మీద, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ‘కోడింగ్’ నుంచి ‘ఆర్కెస్ట్రేటింగ్’ (ఏఐని నడిపించడం) వైపు మారుతోందని ఎరిక్ కిడ్మట్ తెలిపారు.ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా -
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్ దార్ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.#Pakistan के Deputy Prime Minister और Foreign Minister #Ishaq_Dhar ज़मीन पर धड़ाम!इशाक Saudi और Egypt के विदेश मंत्रियों का स्वागत कर रहे थे कि चलते चलते अचानक गिर गए.. pic.twitter.com/0H2aNHdP6i— Ruby Arun रूबी अरुण (@arunruby08) March 29, 2026దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Ishaq Dar sends his regards and slots to the Foreign Ministers of Iran and Egypt like this.It's a new style of slots of Pakistan military regime 😂Note: None should try this kind of slots it's just Pakistan military regime style 😀 😂 pic.twitter.com/QbaXf36Aea— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 29, 2026 -
అమెరికా 'కమాండర్లు, రాజకీయ నాయకుల’ ఇళ్లపై దాడి చేస్తాం: ఇరాన్
టెహ్రాన్: చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు. అయితే, అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ భూభాగాల్లో భూతల దాడులు చేస్తే ఉపేక్షించబోమని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ మానసిక యుద్ధానికి తెరతీసిందిఇరాన్లోని ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సమన్వయంతో సైనిక దాడులు చేస్తామని తెలిపారు. ట్రంప్ ఇరాన్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలనే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘యుద్ధభూమి నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైన్యం, ఇరాన్ యోధుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది’. అమెరికా చర్యలు చివరికి అవమానం, బంధనం, వినాశనం దిశగా తీసుకెళ్తాయి. పర్షియన్ గల్ఫ్లో సొరచేపలకు అమెరికా సైనికులు ఆహారం అవుతారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ కమాండర్ సయ్యద్ మజీద్ మౌసావీ మాట్లాడుతూ.. మా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లోని నియోట్ హోవావ్లోని కెమికల్ ప్లాంట్, ఒక రిఫైనరీ, రెండు స్టీల్ కాంప్లెక్స్లు, రెండు అల్యూమినియం కాంప్లెక్స్లు లక్ష్యంగా దాడులు చేస్తాం. మీరు (అమెరికా-ఇజ్రాయెల్) బాధను అనుభవించే వరకు మా దాడులు కొనసాగుతాయి’ అని అన్నారు.మొత్తం మీద, ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియా భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. -
ఇరాన్ యుద్ధం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయంకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు జరిపిన అమెరికా సైన్యం.. ఇకపై భూతల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు.. ఇరాన్ సైతం ప్రతిదాడులు జరుపుతోంది. ఇక, తాజాగా కువైట్పై ఇరాన్ జరిపిన దాడుల్లో భారత కార్మికుడు మృతి చెందాడు.వివరాల మేరకు.. కువైట్లో ఇరాన్ చేసిన దాడుల్లో ఓ భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఇరాన్ దాడులలో భాగంగా కువైట్లోని ఒక ప్రధాన విద్యుత్, నీటి డీసాలినేషన్ ప్లాంట్లోని సర్వీస్ భవనం లక్ష్యంగా మారింది. ఈ దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందగా, భవనానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి వల్ల ప్లాంట్లోని ఒక భవనం దెబ్బతింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి నష్టం నియంత్రణ చర్యలు చేపట్టాయి.దీంతో పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య కనీసం ఎనిమిదికి చేరింది. ఇక, గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఒక భారతీయుడు క్షిపణి అవశేషాలు పడటంతో మరణించాడు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఏడు భారతీయులు మరణించారని, ఒకరు కనిపించలేదని తెలిపింది. తాజా ఘటనతో సంఖ్య పెరిగింది. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది. -
కువైట్: క్షిపణి దాడిలో భారత కార్మికుడు మృతి
కువైట్ సిటీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా ఎగబాకుతున్నాయి. ఇరాన్ జరిపిన తాజా క్షిపణి దాడిలో కువైట్లో పని చేస్తున్న ఓ భారత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం కువైట్లోని ఒక విద్యుత్, నీటి శుద్ధీకరణ ప్లాంట్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ప్లాంట్పై విరుచుకుపడ్డ క్షిపణులుఇరాన్ జరిపిన ఈ దాడిలో ప్లాంట్లోని ఒక సర్వీస్ భవనం పూర్తిగా ధ్వంసమైందని కువైట్ విద్యుత్, నీటి వనరుల శాఖ ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ మీడియాకు తెలిపారు. ‘ఇరాన్ దురాక్రమణలో భాగంగా జరిగిన ఈ దాడిలో మన భారత సోదరుడు మరణించడం అత్యంత బాధాకరం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నికల్ టీమ్స్, ఎమర్జెన్సీ క్రూ రంగంలోకి దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మతులు చేపడుతున్నాయి.వందలాది క్షిపణులతో దాడులుఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్ రక్షణ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన నెల రోజుల్లో ఆ దేశంపై ఏకంగా 307 బాలిస్టిక్ క్షిపణులు, 2 క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లతో దాడులు జరిగాయి. కేవలం గత 24 గంటల్లోనే 14 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లను కువైట్ సైన్యం అడ్డుకుంది. మరోవైపు ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీ గోడౌన్లతో పాటు ఒక సైనిక స్థావరంపై జరిగిన దాడిలో పది మంది సైనికులు గాయపడ్డారు.‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కువైట్ ప్రభుత్వం తమ పౌరులను, విదేశీ కార్మికులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా దళాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ -
ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపం మాదే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్కు కీలక ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నిజం చెప్పాలంటే, ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు 'మీరెందుకు అలా చేస్తున్నారు?' అని అంటారు. కానీ వాళ్లే మూర్ఖులు’ అంటూ మండిపడ్డారు. అలాగే, ఇరాన్పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని.. మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని.. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ రక్షణ ఏర్పాట్ల గురించి అడగ్గా, ట్రంప్ స్పందిస్తూ.. వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే, ఇరాన్లో పాలనను మార్చేసినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు.అమెరికాకే ముప్పు..?మరోవైపు.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. మధ్యప్రాచ్యానికి వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులు తరలివస్తున్నారు. ఈ సంఘర్షణలో ఖర్గ్ ద్వీపం ఒక వ్యూహాత్మక అమెరికా సైనిక ఎంపికగా ఉందని ఇటీవలి వారాల్లోని నివేదికలు కూడా సూచించాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అధిక భాగం జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఖార్గ్ ద్వీపంపై ఎలాంటి దాడి అయినా అత్యంత ప్రమాదకరమని, అది అమెరికా సైనికుల ప్రాణనష్ణాన్నిపెంచుతుందని, సంఘర్షణను పొడిగించే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకదానికి ముప్పు వాటిల్లుతుందని సైనిక విశ్లేషకులు హెచ్చరించారు.JUST IN: 🇺🇸🇮🇷 President Trump confirms he is considering seizing Iran's Kharg Island, FT reports."My preference would be to take the oil…I don't think they have any defense. We could take it very easily." pic.twitter.com/W7Ze4jj4Zi— BRICS News (@BRICSinfo) March 30, 2026ఇక, పలు నివేదిక ప్రకారం, ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు నిలుపుకోవడం వంటి కార్యకలాపాల కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను మోహరించాలని పెంటగాన్ ఇప్పటికే ఆదేశించింది. దాదాపు 2,200 మంది మెరైన్లతో సహా సుమారు 3,500 మంది సిబ్బంది శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మరో 2,200 మంది మెరైన్లు మార్గంలో ఉన్నారు. వాషింగ్టన్ సాధ్యమయ్యే విస్తరించిన కార్యకలాపాలకు సిద్ధమవుతున్నందున, 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన వేలాది మందిని కూడా మోహరించాలని ఆదేశించారు.పెరుగుతున్న మరణాల సంఖ్యయుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అటు ఇజ్రాయెల్లో 19 మంది మరణించారు. లెబనాన్లో 1,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ఎందరొచ్చినా మసి చేస్తాం : ఇరాన్
-
అమెరికాకు టెన్షన్.. ఉత్తర కొరియా సంచలన క్షిపణి ప్రయోగం
సియోల్: అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకే క్షిపణి ఇంజిన్ను ఉత్తర కొరియా పరీక్షించింది. కార్బన్ ఫైబర్ మెటీరియల్తో రూపొందించిన ఈ ఇంజిన్లో ఘనరూప ఇంధనాన్ని వాడే వీలుందని అధికార వార్తా సంస్థ కేఎస్సీఎన్ తెలిపింది. ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారని తెలిపింది. బాలిస్టిక్ క్షిపణి సంపత్తిని సమకూర్చుకునే క్రమంలో ఈ పరిణామం ఒక మైలురాయి వంటిదని కిమ్ పేర్కొన్నట్లు వెల్లడించింది. 2,500 కిలోటన్నుల బరువైన ఈ ఇంజిన్ను అమర్చిన క్షిపణి సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకగలదని పేర్కొంది. -
ఉక్రెయిన్ దాడితో రష్యా పోర్టులో మంటలు
మాస్కో: రష్యాలోని అతి పెద్ద పెట్రోలియం ఎగుమతుల కేంద్రం ఉస్ట్–లుగా నౌకాశ్రయంపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. పోర్టులో భారీగా మంటలు చెలరేగాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ పోర్టుపై బుధవారం కూడా ఉక్రెయిన్ దాడి జరిపింది.రష్యా కీలక ఆదాయ వనరులైన ఇంధన వ్యవస్థలపై ఉక్రెయిన్ వరుసగా దాడులు చేస్తోంది. నల్ల సముద్ర తీరంలోని నొవొరొస్సియాస్క్, ప్రిమోర్స్క్ పోర్టులపై దాడులతో అక్కడి నుంచి రష్యా ఇంధన వనరుల ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా ఎంతో కీలకంగా ఉంది. -
అది ట్రంప్ జలసంధి
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి పేరు, ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు చర్చనీయాంశాలయ్యాయి. దీంతో ఆ జలసంధికి తన పేరు పెట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్చేశారు. ఆదివారం ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీ నగరంలో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ ప్రసంగిస్తూ హార్మూజ్ జలసంధి అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇరాన్ వెంటనే ట్రంప్ జలసంధిని, అంటే హార్మూజ్ను తెరవాలి.దాన్ని పొరపాటున ట్రంప్ జలసంధి అన్నానని మీడియాలో తప్పుడు కథనాలు వెలువడతాయేమో. అదేమీ లేదు. నేను పొరపాటు చేస్తే అది పెద్ద వార్తే అవుతుంది’’ అని అనగానే మీడియా ప్రతినిధులు ఘొల్లున నవ్వారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ‘‘అవును. అధ్యక్షుడు చెబుతున్న ఆ ‘ట్రంప్ జలసంధి’ సరిగ్గా ఎప్స్టీన్ దీవులకు పక్కనే ఉంది’’ అంటూ ఎద్దేవా చేసింది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో ట్రంప్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుండటం తెలిసిందే. -
ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి
టెహ్రాన్: అమెరికా దాడుల్లో ఓ ప్రాథమిక పాఠశాలలో 168 చిన్నారుల మరణాలకు కారకులైన ఆ దేశ అధికారుల ఫొటోలను ఇరాన్ ఆదివారం విడుదలచేసింది. ‘‘ఈ నేరగాళ్లను గుర్తించుకోండి. వీరి పేర్లు యూఎస్ఎస్ స్ప్రుయన్స్ యుద్ధనౌక కమాండర్ లీగ్ ఆర్ టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ.యార్క్. పాఠశాలపై తోమహాక్ క్షిపణులు ప్రయోగానికి ఆదేశాలిచ్చింది వీళ్లే’’ అంటూ భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఆదివారం ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ‘‘ఇంతటి దారుణానికి పాల్పడ్డాక కూడా వాళ్లు ప్రశాంతంగా ఎలా నిద్రపోయారో.బాధితుల కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం వారికుందా?’’ అని నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రశ్నించింది. మినాబ్లోని షజారాహ్ తయ్యబే స్కూల్పై జరిగిన ఆ దాడితో తమకు సంబంధం లేదని అమెరికా బుకాయించినా తర్వాత తన తప్పిదాన్ని ఒప్పుకుంది. ‘‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్థావరంపై దాడి చేయాలనుకున్నాం. కాలం చెల్లిన నిఘా మ్యాప్ల వల్ల పాఠశాల భవనాన్ని సైనిక స్థావరంగా భావించి పొరపాటున బాంబులేశాం’’ అంటూ తీరిగ్గా చింతించింది! -
ఆకాశంలో కమాండ్ సెంటర్!
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో ‘ఇ–3సీ సెంట్రీ’ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేయడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బే! ఎందుకంటే దాని ప్రత్యేకతలు అలాంటివి. ఇది నిఘా, పర్యవేక్షణ, కమాండ్ బాధ్యతలను ఏకకాలంలో నెరవేర్చగలదు. నావిగేషన్, కమ్యూనికేషన్, కంప్యూటేషన్ సేవలూ అందించగలదు. ఎయిర్బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)గా పిలుచుకునే ఈ ముందస్తు హెచ్చరికల విమానం గగనతలంలో చక్కర్లు కొట్టే కమాండ్ కేంద్రం! దీని తోకపై ఉండే 30 అడుగుల భారీ రాడార్ డిస్క్ అత్యంత శక్తిమంతమైనది.ఈ విమానం గాల్లో ఏకధాటిగా 9,300 కిలోమీటర్ల ప్రయాణిస్తూ వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధ విమానాలు, క్షిపణుల జాడను పసిగట్టి సెకన్లలో సమాచారం చేరవేస్తుంది. భూ, గగనతల యుద్ధక్షేత్రంలో తాజా పరిస్థితులపై ఇదిచ్చే సమాచారంతోనే సైన్యానికి ఓ స్పష్టత వస్తుంది. దీన్ని సైన్యానికి కళ్లు, చెవులుగా చెప్పవచ్చు! భూ, సముద్రతలాలతో పాటు స్ట్రాటో ఆవరణం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూడా ఈ విమానం పసిగట్టి వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. విమానంలోని 14 కంప్యూటర్ తెరలపై తాజా సమాచారాన్ని గ్రాఫిక్ల రూపంలో చూడొచ్చు.తద్వారా క్షిపణులు, బాంబుల ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం వీలవుతుంది. ఆర్సీ–135 నిఘా విమానాలు, విమాన వాహననౌకలతో ఏకకాంలో సమాచారం పంచుకుంటూ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. బోయింగ్ తమ 707–320బీ విమానాన్ని ఆధునీకరించి ఇ–3సీ సెంట్రీ విమానంగా రూపొందించింది. ఒక్కో విమానం ఖరీదు రూ.6,640 కోట్లు. దశాబ్దాల క్రితం అమెరికా అమ్ములపొదిలో ఇవి 30 దాకా ఉండేవి. వీటి తయారీని బోయింగ్ నిలిపేయడంతో ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. 46 మీటర్ల పొడవైన ఈ విమానం గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భారీ నిఘా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లు అమర్చిన ఈ విమానం బరువు 1.57 లక్షల కిలోలు. ఇది గరిష్టంగా 29,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక భూతల యుద్ధం!
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం భూతలానికి విస్తరించేలా కనిపిస్తోంది. ముఖాముఖి పోరుకు అమెరికా, ఇరాన్ సై అంటే సై అంటున్నాయి. అమెరికా ఇప్పటికే వేలాది మంది జవాన్లను పశ్చిమాసియాకు తరలించింది. 3,500 మంది మెరైన్లు, సైనికులు ఆదివారం గల్ఫ్కు చేరుకున్నారు. ఇరాన్తో ప్రధాన భూభాగంతో పాటు ఖర్గ్ ద్వీపంపై దాడి చేసేంత దూరంలోనే మోహరించారు. పశ్చిమాసియాలో 50 వేల మందికి పైగా అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.వీరికి తోడు మరో 10 వేల మంది సైనికులను త్వరలో పశ్చిమసియాకు తరలించాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. తమపై భూతల దాడులకు దిగితే తిరిగి వెళ్లేది శవాలేనంటూ హెచ్చరించింది. ఇరాన్ మిస్సైల్ లాంచింగ్, గగనతల రక్షణ వ్యవస్థలు, నౌకా మార్గాలను దెబ్బకొట్టి వెన్ను విరవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా ఆయువుపట్టైన ఖర్గ్ దీవిని దిగ్బంధిస్తే విధి లేక చర్చలకు దిగొస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. ట్రంప్ బెదిరింపులతో సరిపెట్టబోరని, తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉన్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్ పరిస్థితి నరకప్రాయం అవుతుందని హెచ్చరించారు. దుబాయ్లో రెండు స్థావరాలపై దాడులు పశ్చిమాసియా యుద్ధం 30 రోజులకు చేరింది. దాడులు, ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 3 వేల మందికిపైగా మరణించారు. ఆదివారమూ పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. దాడుల్లో అల్ అరబీ టీవీ చానల్ కార్యాలయం ధ్వంసమైంది. ప్రసారాలు ఆగిపోయాయి. ఇజ్రాయెల్పైనా ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్పై కూడా దాడులు కొనసాగించింది. క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి.యెమెన్ హూతీలు ఇరాన్, లెబనాన్ హెజ్»ొల్లాతో కలిసి ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడ్డారు. జోర్డాన్లో అమెరికా ఎయిర్బేస్తోపాటు ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. దుబాయ్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపైనా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులకు పాల్పడింది. ఒక స్థావరంలో 400 మంది, మరోదాంట్లో 100 మంది జవాన్లున్నారు. వారిలో చాలామంది దాడిలకు బలైనట్టు ఇరాన్ సైన్యం చెబుతోంది. మృతదేహాలను, క్షతగాత్రులను చేరవేస్తూ అంబులెన్స్లు బిజీగా తిరగాయని పేర్కొంది. అమెరికాకు తీవ్ర నష్టం ఇరాన్ దాడుల్లో అమెరికాకు అనూహ్య నష్టం జరిగింది. సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై క్షిపణులు, డ్రోన్ల దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక అవాక్స్ నిఘా విమానంతో పాటు పలు రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. అవాక్స్ విమానాన్ని అమెరికా సైన్యానికి అతిపెద్ద ఆస్తిగా పరిగణిస్తారు. దాడిలో అది పనికిరాకుండా పోయింది. అమెరికాకు ఎంక్యూ–9 డ్రోన్లతో పాటు ఎఫ్–16 యుద్ధ విమానం కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఇజ్రాయెల్ వర్సిటీలు, గల్ఫ్లోని అమెరికా వర్సిటీల శాఖలపైనా దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ⇒ కీలకమైన అణు నిరాయు«దీకరణ ఒప్పందం (ఎన్పీటీ) నుంచి తప్పుకోవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు పెట్టింది. అణు శక్తి విషయంలో కొత్తగా అంతర్జాతీయ ఒప్పందం తేవాలని ఇరాన్ కోరుతోంది. ⇒ పశ్చిమాసియాలో శాంతి సాధనే ధ్యేయంగా పాకిస్తాన్లో ఆదివారం కీలక సమావేశం జరిగింది. సౌదీ అరేబియా, ఈజిప్టు, తుర్కియే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు.మేం వెయిటింగ్ : ఇరాన్ స్పీకర్ తమ భూతలంలోకి అమెరికా సేనల రాక కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ ప్రకటించారు. ‘‘అమెరికా, దాని మిత్రదేశాల సైన్యాన్ని మసి చేస్తాం. ఆ దేశాలను శాశ్వతంగా శిక్షిస్తాం’’ అని హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నంత కాలం యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇరాన్కు రష్యా సాయం: జెలెన్స్కీసౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి వెనుక రష్యా హస్తముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఎయిర్బేస్కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రష్యానే అందజేసిందన్నారు. ‘‘అమెరికా స్థావరాలపై దాడులకు రష్యా ముమ్మాటికీ సహరిస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా సమాచారం చేరవేస్తోంది’’ అని చెప్పారు. -
మోజ్తాబా ఖమేనీ లేఖ విడుదల.. ఏమన్నారంటే?
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా చేస్తున్న దురాక్రమణ ఖండించి ఇరాన్కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ బ్రతికి ఉన్నారో లేదో తెలియదు అని అన్నారు. అమెరికా జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోజ్తాబా ఖమేనీ ఇరాక్కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు.ఆ లేఖలో " అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధంలో మా దేశానికి మద్దతుగా నిలిచిన ఇరాక్ మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అలాగే ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలు". అని లేఖలో పేర్కొన్నారు. ఇరాన్పై జరుగుతున్న దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఇరాక్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవడాన్ని అభినందించారు.కాగా ఆయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ మూడవ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకూ మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం కొన్ని రాతపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు. గతంలో జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. -
గల్ఫ్కు అండగా ఉన్నాం.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉక్రెయిన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ సాయం కోరే దేశం మాత్రమే కాదని ఇతరులకు సాయం శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దుబాయిలో పర్యటనకు వెళ్లారు. ఖతార్తో 10 ఏళ్ల పాటు రక్షణ సహాకార ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. ఇటీవలే గల్ఫ్ దేశాలకు సహాయంగా వెళ్లిన ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో యుఏఈ, ఉక్రెయిన్ ఉమ్మడి సహకారంతో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.కాగా ఈ పర్యటనలో జెలెన్స్కీతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు రక్షణ అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఇరాన్ తమ దేశంలోని ప్రజలు, సంపదనే లక్షంగా చేసుకొని దాడులు జరుపుతుందని యుఏఈ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే ఇటీవల ఇరాన్ దాడులను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టెహ్రాన్ జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్పై నేరుగా దాడి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన సాయం అందిస్తోంది. -
నేపాల్ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం
నేపాల్లో ఇటీవల ఎన్నికైన నూతన ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇక నుంచి ఆ దేశంలో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేదించనున్నట్లు ప్రకటించింది. అక్కడి రాజకీయ నాయకుల ఆస్తులపై విచారణ జరపనున్నట్లు ప్రకటించింది.నేపాల్లో ఇటీవల బాలేంద్ర షా ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం అక్కడ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వ 100 రోజుల కార్యాచరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు 60 రోజుల్లోపు తమ కార్యాలయాలను విద్యా సంస్థల నుండి తొలగించాలని తెలిపింది. వాటి స్థానంలో కేవలం విద్యార్థుల సమస్యల కోసం మాత్రమే పనిచేసే "స్టూడెంట్ కౌన్సిల్" లేదా "వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్" వంటి రాజకీయ రహిత వేదికలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని తెలిపింది.అదేవిధంగా 5వ తరగతి వరకు సంప్రదాయ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదేశంలో విదేశీ పేర్లతో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ఆక్స్ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లతో ఉన్న పాఠశాలలు, కళాశాలలు ఈ ఏడాది లోపు తమ పేర్లను నేపాలీ పేర్లుగా మార్చుకోవాలని ఆదేశించింది. ఇది దేశీయ అస్తిత్వాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య అని ప్రభుత్వం తెలిపింది.2006 తర్వాత కీలక పదవుల్లో ఉన్న నాయకులు, అధికారుల ఆస్తులపై విచారణ జరిపేందుకు 15 రోజుల్లో ఒక శక్తివంతమైన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.కాగా గత ఏడాది జరిగిన 'జెన్ జీ' (Gen-Z) ఉద్యమం సమయంలో జరిగిన హింసకు బాధ్యుడిగా చేస్తూ మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలీని ఇటీవలే అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ దిగిపో.. USAలో 80 లక్షల మంది రోడ్లపైకి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పేరు వింటే చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచాన్నే సంక్షోభంలో నెట్టిపడేసారని ప్రజలంతా ఆయనపై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రికార్డు స్థాయిలో 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు అక్కడి పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ నిర్ణయాల పట్ల అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్దానికి నిరసన తెలపడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా 3,300 చోట్ల ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అమెరికా వ్యాప్తంగా ట్రంప్కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' అనే పేరుతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మీడియా కథనాల ప్రకారం ఈ ప్రదర్శనలు అమెరికా అంతటా 50 రాష్ట్రాల్లో 3,300 కి పైగా ప్రదేశాలలో జరుగగా రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. కాగా ఇదివరకే ట్రంప్కు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. గతేడాది అక్టోబర్లో జరిపిన నిరసన కంటే ఈ సారి దాదాపు 10 లక్షల మంది అధికంగా పాల్గొన్నారని 600కు పైగా అధికంగా ఈవెంట్లు నిర్వహించబడ్డాయని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా మెుదటిసారి జూన్ 2025లో తరువాత అక్టోబర్ 2025 లో రెండవ నిరసన జరిగింది. ట్రంప్, వాన్స్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఫ్లకార్డులు ప్రదర్శన చేపట్టినట్లు నిరసనలు జరిపారని కథనాలు పేర్కొన్నాయి. -
యుద్ద ఉద్రిక్తత.. ఇస్లామిక్ దేశాల కీలక సమావేశం
పశ్చిమాసియా యుద్దం నానాటికీ తీవ్రతరమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం పరిస్థితులు నానాటికీ దిగజారతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కీలక సమావేశం నిర్వహించింది.సౌదీఅరేబియా, టర్కీ, ఈజిప్టు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో నేటినుంచి రెండురోజుల పాటు రౌండ్ టేబుల్ సమావేశం జరపనున్నారు. ప్రస్తుతం యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేలా చర్చలు జరపునున్నట్లు సమాచారం.పాకిస్థాన్కు అటు ఇరాన్, ఇటు అమెరికాతో సత్సంబంధాలు ఉండడంతో ఈ రెండు దేశాల మధ్య "కమ్యూనికేషన్ బ్రిడ్జ్" లా వ్యవహరిస్తోందని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇదివరకే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడివాన్స్ తో ఈ విషయమై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఇస్లామిక్ దేశాల ప్రతిపాదనలను ఇది వరకే వైట్ హౌస్కు పంపారు. ఏప్రిల్ 6 లోపు షిప్పింగ్ మార్గాలను తెరవాలని డోనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల పాక్కు చెందిన చమురు నౌకను ఇరాన్ పేల్చివేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఇరాన్తో సత్సంబంధాలున్నాయని బీరాలు పలుకుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
అమెరికాకు ఎదురుదెబ్బ.. నిఘా విమానం ధ్వంసం
పశ్చిమాసియా యుద్ధంలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా సౌదీ అరేబియాలోని యుఎస్ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక బోయింగ్ సెంట్రీ నిఘా విమానం దెబ్బతినట్లు ఇరాన్ పేర్కొంది. అదేవిధంగా దాదాపు 15మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయని తెలిపింది.ఇరాన్, అమెరికా యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓ వైపు చర్చలు జరుపుతామని ట్రంప్ పేర్కొంటూనే మరోవైపు అమెరికా అదనపు బలగాల్ని ట్రంప్ మిడిల్ ఈస్ట్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. కాగా తాజాగా సౌదీలోని అమెరికా ఎయిర్బేస్పై అమెరికా దాడి చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ 6 బాలిస్టిక్ మిస్సైళ్లు, 29 డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ అటాక్లో దాదాపు $700 మిలియన్ల రూ.5,800 కోట్లు విలువైన బోయింగ్ E-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసమైనట్లు పేర్కొంది. కాగా ఇరాన్ జరిపిన దాడిలో 15 మంది అమెరికా సైనికులు గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అయితే ఈ దాడిపై అమెరికా ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయు. USA తన యుద్ధనౌకలతో పాటు వేలాది మంది సైన్యాన్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. దీంతో కంబాట్ ఆపరేషన్ చేపట్టనుందేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
సొర చేపలకు ఆహారంగా అమెరికా సైనికులు?!
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధానికి నెల రోజుల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ సైన్యం ఆదివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యాన్ని పర్షియన్ గల్ఫ్లోకి పంపితే వారు ‘సొరచేపలకు ఆహారంగా’ మారతారని హెచ్చరించారు. ఇరాన్ సైనికులు ఈ అవకాశాన్ని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ట్రంప్ను ‘ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస’గా అభివర్ణించారు.అదే సందర్భంలో ట్రంప్ను ‘ప్రపంచ దేశాల మధ్య అత్యంత అసత్యవాది అధ్యక్షుడు’గా పిలుస్తూ, ఆయన నిర్ణయాలు స్థిరంగా లేవని విమర్శించారు. ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారని, వెంటనే యుద్ధం చేయాలని నిర్ణయిస్తారని ధ్వజమెత్తారు. ట్రంప్పై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఒత్తిడి పెంచుతోందన్నారు. ట్రంప్ గత సంబంధాలు, ప్రత్యేకంగా జెఫ్రీ ఎప్స్టిన్ కేసుతో అనుబంధం కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగిందని ఆరోపించారు.అమెరికా ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి. ఖార్గ్ దీవి, హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాల్లో దాడులు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా తన సైన్యాన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్ కూడా ఇరాన్ సైన్యం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మిసైళ్ళు, వీధి నిరసనలు, హోర్ముజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఈ పరిణామాలు ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్ స్పష్టంగా తెలిపినట్లుగా, భూ తల దాడి జరిగితే అది అమెరికాకు ఘోర పరాజయాన్ని తెస్తుందని, పర్షియన్ గల్ఫ్లోని సొరచేపలు అమెరికా సైనికుల కోసం ఎదురుచూస్తున్నాయని పునరుద్ఘాటిస్తోంది. -
భారత్ నుంచి భారీగా ఇంధనం వచ్చింది: శ్రీలంక అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ‘పశ్చిమాసియా’ సంక్షోభం వేళ భారత్ నుంచి 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని అందుకుంది శ్రీలంక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన ‘పొరుగు దేశాల పాలసీ’లో భాగంగా శ్రీలంకకు ఇంధనాన్ని పంపింది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఆదివారం (మార్చి 29) భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.“పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇంధన సరఫరాల విషయంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. భారత్ త్వరితగతిన సాయం చేసింది.. కృతజ్ఞతలు. నిన్న 38,000 ఎంటీ ఇంధనం కొలంబోకు చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోఆర్డినేషన్కు కూడా ధన్యవాదాలు” అని దిస్సానాయకే ఎక్స్లో పేర్కొన్నారు.ఈ వారం ప్రారంభంలో, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై దిస్సానాయకేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. “భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంచే కీలక కార్యక్రమాల పురోగతిని సమీక్షించాం. సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ఇరుదేశాలు సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన్న స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాం” అని మోదీ ఎక్స్లో తెలిపారు. కాగా, ఈ 38,000 మెట్రిక్ టన్నుల్లో 20,000 ఎంటీ డీజిల్.. 18,000 ఎంటీ పెట్రోల్ ఉన్నాయి.మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధంపై వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం. Spoke with PM @narendramodi a few days ago about the fuel supply disruptions Sri Lanka is facing due to the Middle East conflict. Grateful for India’s swift support. 38,000 MT of fuel arrived in Colombo yesterday. My thanks also to EAM @DrSJaishankar for his close coordination.— Anura Kumara Dissanayake (@anuradisanayake) March 29, 2026 -
ఇరాన్పై యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ
రియాద్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధంలో శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారం అందించే ఈ-3 సెంట్రీ ఎయిర్బోర్న్ విమానాన్ని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విమానాన్ని మార్చి 27న రియాద్కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి లక్ష్యంగా చేసిందని ది జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడిలో 10–12 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.దాడిలో ధ్వంసమైన విమానం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నష్టం తీవ్రంగా ఉండటంతో, దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించలేదు.ఈ-3సెంట్రీ ఎయిర్బోర్న్ కేవలం విమానం మాత్రమే కాదు. యుద్ధరంగంలో అమెరికాకు వెన్నెముకలాంటిది. తరచుగా ‘ఎగిరే కమాండ్ సెంటర్’గా వర్ణించబడే ఈ విమానం వందల మైళ్ల మేర గగనతలాన్ని పర్యవేక్షిస్తూ, దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దళాలకు ముందస్తు సమాచారం అందిస్తుంది. నిఘా నుండి అడ్డుకోవడం వరకు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ స్థావరంపై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘రోరింగ్ లయన్’ వంటి సైనిక ఆపరేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి అనేక సార్లు దాడులు జరిగాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన మరో క్షిపణి దాడిలో 14 మంది గాయపడ్డారు. ఈ-3 సెంట్రీ ఎయిర్బోర్న్ ధ్వంసం కావడం చాలా పెద్ద విషయం అని మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జాన్ జేవీ వెనబుల్ వ్యాఖ్యానించారు. ‘గల్ఫ్ ప్రాంతంలో ఏం జరుగుతుందో గమనించే సామర్థ్యానికి, అలాగే అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండే వీలుకు ఇది విఘాతం కలిగిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు. 🚨 JUST IN: 🇮🇷🇺🇸Reports suggest a U.S. Air Force aircraft may have been damaged or destroyed following Iranian strikes at Prince Sultan Air Base in Saudi Arabia. pic.twitter.com/8Gigwrq7tx— IranDefenceForce (@IranDefenceForc) March 29, 2026అమెరికా ఖరీదైన విమానాలపై ఇరాన్ దాడులుఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. 21 రోజుల యుద్ధంలో కనీసం 17 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి.కూలిన విమానాల వివరాలుఈ దాడుల్లో ఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్, ఎఫ్‑18 జెట్, అలాగే అత్యంత కీలకమైన ఈ‑3 సెంట్రీ అవాక్స్ వంటి విమానాలు ఉన్నాయి. ఇవి అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన, వ్యూహాత్మక ఆస్తులుగా గుర్తింపు పొందాయి. ధర అంచనాలుఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్: ఒక్కో విమానం ధర సుమారు 80–100 మిలియన్ డాలర్లు (రూ.6,600– రూ.8,300 కోట్లు). ఎఫ్‑18 జెట్: ధర సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ.5,000 కోట్లు).ఈ‑3 సెంట్రీ అవాక్స్ : అప్గ్రేడ్లతో కలిపి 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు)ఆర్థిక ప్రభావంఈ నష్టాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆర్థిక దెబ్బ తగిలింది. ఒక్కో విమానం ధర వందల మిలియన్ల డాలర్లలో ఉండటంతో, మొత్తం నష్టం విలువ విపరీతంగా పెరిగింది. -
‘వారిని తగలబెట్టేందుకు ఎదురుచూస్తున్నాం’
టెహ్రాన్: అమెరికా ఓ వైపు ‘చర్చలు’ జరుపుతున్నామని చెబుతూనే.. రహస్యంగా భూతల దాడులకు ప్రణాళికలు వేస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ అన్నారు. అమెరికా సైన్యం రాకను తిప్పికొట్టేందుకు ఇరాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. “అమెరికా సైనికులు మా భూభాగంపైకి వస్తే వారిని తగలబెట్టేందుకు మా సైనికులు ఎదురుచూస్తున్నారు” అని అన్నారు.కాగా, ఇరాన్లో కొన్ని వారాల పాటు భూతలదాడులు చేసేందుకు పెంటగాన్ సిద్ధమవుతోందని అమెరికా మీడియా తెలిపింది. అమెరికా సైన్యం 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ నుంచి 3,500 సైనికులు పంపిందని చెప్పింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలు వ్యూహాత్మక ప్రణాళికలను మరింత వేగవంతంగా అమలు చేస్తున్నాయి. వైమానిక దాడులు, సముద్రంలో సైనిక మోహరింపులతో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు భూతల దాడుల వైపు విస్తరించే దిశగా వెళుతోంది.ఇరాన్లోని కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పెంటగాన్ దాడులు జరిపే అవకాశం ఉంది. అందులో తీర రక్షణ వ్యవస్థలు, చమురు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలు సైనిక వ్యూహంలో మార్పును సూచిస్తున్నాయి. ఇరాన్పై నేరుగా ఒత్తిడిని పెంచడమే దీని లక్ష్యం.అయితే, భూతల చర్యలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదంపై ఆధారపడుతుంది. ప్రస్తుతం ప్రణాళికలు కొనసాగుతున్నాయని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.ఇరాన్లో భూతల దాడులకు ప్లాన్ నిజమేనా?పెంటగాన్ ఇరాన్ లోపల పరిమిత, లక్ష్యిత భూతల చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుందని ఇది సూచిస్తోంది. ఈ చర్యల్లో ప్రత్యేక దళాలు, సాధారణ సైన్యం ఉండే అవకాశం ఉంది.పూర్తిస్థాయి ఆక్రమణ ఇందులో లేదని అధికారులు స్పష్టం చేశారు. అందుకు బదులుగా కచ్చితమైన లక్ష్యాలపై అమెరికా దృష్టి పెట్టింది. నిర్దిష్ట సైనిక లక్ష్యాలను సాధించడమే దీని ఉద్దేశం. ఆయుధ వ్యవస్థలను నిలిపివేయడం లేదా ముఖ్య ప్రదేశాలను స్వాధీనం చేసుకోవడం ఇందులో ఉండవచ్చు. ఇలాంటి చర్యలకు భారీ సన్నాహాలు, సమన్వయం అవసరమని సైనిక నిపుణులు చెబుతున్నారు.హార్మూజ్ జలసంధిపై దాడి చేస్తుందా?హార్మూజ్ జలసంధికి ఉన్న ప్రపంచ వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా అమెరికా సైనిక ప్రణాళికలో ఇది కీలకంగా మారింది. ఈ జలసంధి సమీపంలో ఇరాన్ తీర ప్రాంతాల్లో లక్ష్యిత దాడులు చేయాలని అమెరికా ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం. ఈ దాడుల లక్ష్యం సముద్ర మార్గాలకు ముప్పు కలిగించే ఆయుధ వ్యవస్థలను గుర్తించి ధ్వంసం చేయడం. ప్రమాదాలను తగ్గించేలా ఈ చర్యలు వేగంగా, సమన్వయంతో జరుగుతాయి. -
వైట్హౌస్ అధికారులకు ఇరాన్ హెచ్చరిక
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ను టార్గెట్ చేసిన యూఎస్ సైన్యం విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్లోని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్ విద్యాసంస్థలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ అనుబంధ విశ్వవిద్యాలయాలు సరైన లక్ష్యాలు అవుతాయని వార్నింగ్ ఇచ్చింది.ఈ సందర్భంగా ఐఆర్జీసీ స్పందిస్తూ.. ఇరాన్లో యూనివర్సిటీలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఖండిస్తున్నాం. దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా-ఇజ్రాయెల్ యూనివర్సిటీలు మా లక్ష్యాలుగా మారతాయి. వైట్హౌస్లోని నిర్లక్ష్య పాలకులు ఈ విషయం తెలుసుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్కు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీలు అన్ని లక్ష్యాలుగా పరిగణిస్తామని పేర్కొంది. ప్రతీకార చర్యలలో భాగంగా రెండు యూనివర్సిటీలను ధ్వంసం చేయవచ్చని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది, సమీప నివాసితులు ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలని తెలిపింది. ఆ విద్యా సంస్థలపై ప్రతీకార చర్యలు ఉండకూదని కోరుకుంటే అమెరికా ప్రభుత్వం సోమవారం (మార్చి 30) మధ్యాహ్నం లోపు ఇరాన్ విశ్వవిద్యాలయాలపై జరిగిన దాడులను అధికారికంగా ఖండించాలని తెలిపింది.మరోవైపు.. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయేల్ బఖాయి కూడా అమెరికా-ఇజ్రాయెల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, చారిత్రక కట్టడాలు లక్ష్యంగా మారాయి. శాస్త్రవేత్తలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇరాన్ శాస్త్రీయ వ్యవస్థను దెబ్బతీయడానికే చేస్తున్న ప్రయత్నం అని ఆయన ఆరోపించారు. అలాగే, ఇజ్రాయెల్ తన సైన్యంలో ఉన్న బలహీనతలను దాచిపెట్టేందుకు ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఇరాన్ పరిశ్రమలపై దాడులు చేస్తున్నారని అన్నారు. -
అమెరికా దాడుల దృశ్యాలు.. ప్రపంచమంతా హడల్!
వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింతగా ఎగసిపడుతున్నాయి. తాజాగా ఇరాన్ నౌకలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ నౌకాయానాన్ని వేధిస్తున్న ఇరాన్ ఆగడాలకు ఇక కాలం చెల్లిందని అమెరికా ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేసింది.దుబాయ్లో భారీ దాడులు.. ఇరాన్ సంచలన ప్రకటనమరోవైపు అమెరికా దాడులకు ధీటుగా బదులిచ్చామని ఇరాన్ ప్రకటించింది. దుబాయ్లోని రెండు అమెరికా సైనిక ‘రహస్య స్థావరాల’పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డామని ఇరాన్ స్టేట్ మీడియా ‘తస్నిమ్’ వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికాకు భారీ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) పేర్కొంది. For decades, Iranian naval vessels have threatened and harassed global shipping in regional waters, but those days are over. pic.twitter.com/J4WUwpfU24— U.S. Central Command (@CENTCOM) March 28, 2026హజ్రత్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్లోని రెండు స్థావరాలలో సుమారు 500 మంది అమెరికా సైనికులు ఉండగా, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మృతులను, క్షతగాత్రులను తరలించేందుకు దుబాయ్లోని అంబులెన్సులు గంటల తరబడి శ్రమించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం అమెరికా సైనికులకు స్మశానవాటికగా మారుతుందని, ట్రంప్తో పాటు అమెరికా సైనిక కమాండర్లు తలవంచక తప్పదని హెచ్చరించారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ‘మీ దేశాల అభివృద్ధి, భద్రతను కాపాడుకోవాలంటే.. అమెరికా, ఇజ్రాయెల్ శక్తులు మీ గడ్డపై నుంచి ఇరాన్పై దాడులు చేయకుండా అడ్డుకోండి’ అని ఆయన సూచించారు. ఇరాన్ ఎప్పుడూ ముందుగా దాడులకు దిగదని, అయితే తమ దేశ మౌలిక సదుపాయాలపై ఒక్క దాడి జరిగినా దానికి ప్రతిచర్య అత్యంత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ప్రతిక్షణం గమనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం? -
భూతల దాడులకు అమెరికా రహస్యంగా ప్రణాళికలు: ఇరాన్
ఇరాన్ యుద్ధంలోకి హౌతీల రాకతో అమెరికా, ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్నాయి. -
అమెరికాలో మళ్లీ 'నో కింగ్స్'.. ట్రంప్నకు నిరసన సెగ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరసన సెగ గట్టిగానే తగులుతోంది. ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ‘నో కింగ్స్ (No Kings) నిరసనలు చేపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నిరసనలు చేపట్టారు. మిన్నెసోటాలోని కాలిపాట్ లాన్కు భారీగా నిరసన కారులు వీధులోకి వచ్చారు.అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్, పారిస్, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3,200 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో జరిగిన రెండు 'నో కింగ్స్' ఈవెంట్లకు లక్షలాది మంది హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే నిరసనగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్టీన్, జోన్ బేజ్ మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ వద్ద ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇక్కడ సుమారు లక్ష మంది మంది పాల్గొంటారని అంచనా. మిడ్టౌన్ మాన్హాటన్లో వేలాది మంది వీధులోకి చేరుకున్నారు. నటుడు రాబర్ట్ డి నీరో మాట్లాడుతూ.. గతంలో చాలామంది అధ్యక్షులు తమ రాజ్యాంగ పరిమితులను పరీక్షించారు, కానీ మన స్వేచ్ఛకు, భద్రతకు ఇంతటి ముప్పుగా ఎవరూ మారలేదంటూ వ్యాఖ్యానించారు.వాషింగ్టన్లోని నేషనల్ మాల్ వద్ద నిరసనకారులు ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ.. ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు. మేరీల్యాండ్లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీల్లో ఉన్న వృద్ధులు కూడా నిరంకుశత్వాన్ని ఎదిరించండి అంటూ బోర్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసనలు.. ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయంటూ వైట్ హౌస్ కొట్టిపారేసింది. -
నేపాల్ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలీ అరెస్టు
కఠ్మాండు: నేపాల్ మాజీ ప్రధానమంత్రి, కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) చైర్మన్ కె.పి.శర్మ ఓలీ అరెస్టయ్యారు. గత ఏడాది జెన్ జెడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని కఠ్మాండుకు 12 కిలోమీటర్ల దూరంలోని భక్తపూర్ జిల్లా గుండూ ఏరియాలో పోలీసులు శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుటి రోజే కె.పి.శర్మ ఓలీ అరెస్టు కావడం గమనార్హం.ఇదే కేసులో హోంశాఖ మాజీ మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నేత రమేశ్ లేఖక్ సైతం అరెస్టయ్యారు. భక్తపూర్ జిల్లాలోని సూర్యబినాయక్ మున్సిపాల్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓలీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ప్రజలపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది యువతీ యువకులు సహా 76 మంది మరణించారు.తర్వాత ఓలీ ప్రభుత్వం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జెన్ జెడ్ ఉద్యమంలో హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కె.పి.శర్మ ఓలీతోపాటు రమేశ్ లేఖక్లను ఇందుకు బాధ్యులుగా కమిషన్ గుర్తించింది. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ తమ నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. మూడేళ్ల నుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష విధించాలని సూచించింది. చట్టానికి ఎవరూ అతీతం కాదు ప్రధానిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన బాలెంద్ర షా తన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే.. విచారణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కె.పి.శర్మ ఓలీ, రమేశ్ లేఖక్లను పోలీసులు అరెస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని నూతన హోంమంత్రి సుధాన్ గురూంగ్ తేలి్చచెప్పారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశం ఇకపై కొత్త దిశలో పయనిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, కె.పి.శర్మ ఓలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్న తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉంది. సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తల ఆందోళన ఓలీ అరెస్టు పట్ల సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓలీతోపాటు రమేశ్ లేఖక్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఓలీపై బాలెంద్ర షా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. -
రంగంలోకి హూతీలు!
దుబాయ్: పశ్చిమాసియాలో కల్లోలం నానాటికీ విస్తరిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెర తీసి నెల రోజులైనా ఉద్రిక్తతలు చల్లారకపోగా నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇరాన్కు దన్నుగా యెమన్కు చెందిన హూతీలు కూడా యుద్ధరంగంలోకి అడుగు పెట్టారు. దక్షిణ ఇజ్రాయెల్లోని కీలక సైనిక స్థావరాలపై శనివారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగినట్టు ప్రకటించారు. వారికి మద్దతుగా హెజ్బొల్లా ఉగ్ర సంస్థ కూడా ఇజ్రాయెల్పై ఎడాపెడా క్షిపణులు ప్రయోగించింది. దాంతో పరిస్థితి మరింతగా విషమించేలా కన్పిస్తోంది. ఎర్రసముద్రంలో ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్ ఎల్మందెబ్ జలసంధిని కూడా హూతీలు మూసేసే సూచనలు కన్పిస్తున్నాయి.అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరా మరింతగా కుదేలవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ఏకంగా 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించింది. దాంతో కనీసం 15 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు వారాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 25 దాటింది. మొత్తమ్మీద ఈ యుద్ధంలో క్షతగాత్రులైన వారి సంఖ్య 300 దాటింది. మూడు రీ ఫ్యూయలింగ్ విమానాలతో పాటు అమెరికాకు చెందిన పలు యుద్ద విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్టు స్థానిక అధికార వర్గాలు తెలిపాయి.దుబాయ్లో ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ డ్రోన్ సిస్టమ్స్ నిల్వ కేంద్రంపైనా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ సమయంలో అందులో 20 మంది దాకా ఉక్రేనియన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ సమీపంలో ఒక అమెరికా నౌకపై కూడా దాడి చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా సైనికులు తలదాచుకున్నారన్న సమాచారంతో దుబాయ్లో ఒక హోటల్పై కామికాజ్ క్షిపణితో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. కువైట్పై దాడుల్లో పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి.దక్షిణ లెబనాన్లో యుద్ధాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు! యూఏఈలోని ఖలీఫా ఎకనామిక్ జోన్పై ఇరాన్ క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా అల్లాడిపోయింది. జెరూసలేం, టెల్ అవీవ్, బీర్ షెబాతో పాటు పలు నగరాల్లో నిర్విరామంగా సైరన్లు మోగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఎషో్టల్లో కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 3,500 మంది అమెరికా సైనికులు గల్ఫ్కు చేరుకున్నట్టు సమాచారం! దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు శనివారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పలు ప్రాంతాల్లో మంటలు, పొగ కనిపించాయి. మీనాబ్ నగరంలో ఒక క్లినిక్పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదని స మాచారం. తమ దేశంలో మృతుల సంఖ్య 1,900 దాటినట్టు ఇరాన్ పేర్కొంది. లెబనాన్లో 1,100కు పైగా, ఇజ్రాయెల్లో 19 మంది, గల్ఫ్ దేశాల్లో 20 మంది మరణించారు. లెబనాన్లోనూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా క్షిపణి దాడుల్లో కనీసం 9 మంది సైనికులు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వారి్నంగ్ యుద్ధం ఆగి శాంతి నెలకొనాలంటే గల్ఫ్ దేశాలు తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్పై దాడులకు వారి గగనతలాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతించరాదన్నారు. శత్రువుకు సహకరించేవారిని వదలబోమని పునరుద్ఘాటించారు. భూతల దాడులకు అమెరికా 10 వేల సైన్యాన్ని పంపుతోందన్న వార్తలపై ఇరాన్ మీడియా వ్యంగ్యంగా స్పందించింది. ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికలతో దీనిపై వార్తలు ప్రచురించింది. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టే ప్రతి అమెరికా సైనికుడూ శవపేటికలోకి చేరడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ఇరాన్కు వరంగా మారుతోంది. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశం రోజుకు ఏకంగా రూ.1,319 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభనఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించడం లేదు. చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిపై తమకు నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం కుండబద్దలు కొట్టారు! ఈ నేపథ్యంలో యుద్ధానికి తెర దించే మార్గాలను అన్వేషించేందుకు పలు గల్ఫ్ దేశాల నడుమ ఆదివారం కీలక సమావేశం జరగనుంది.ఇందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుంది. మరోవైపు ఐరాస విజ్ఞప్తి మేరకు హార్మూజ్ గుండా మానవీయ సాయం, వ్యవసాయోత్పత్తులతో కూడిన నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. హార్మూజ్ను తెరిచేందుకు ఆ దేశానికి విధించిన డెడ్లైన్ను ఏప్రిల్ 6 దాకా ట్రంప్ పొడిగించడం తెలిసిందే. ఇరాన్పై దాడి ద్వారా తాము ఆశించిన లక్ష్యాలను భూతల దాడులతో నిమిత్తం లేకుండానే సాధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వెలిబుచ్చారు. -
ఇరాన్పై అమెరికా కంబాట్ ఆపరేషన్?.. 50 వేలకు పైగా బలగాలు
పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపుగా నెలరోజులు గడుస్తోంది. అయినప్పటికీ ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా యుఎస్ భారీగా సైనికులను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. తాజాగా అమెరికా భారీగా తమ సైనిక బలగాలను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో మరింతగా టెన్షన్ వాతావరణం నెలకొంది.పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏం జరగనుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఓ వైపేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మాటెత్తుతూనే.. భారీ సంఖ్యలో సైన్యాన్ని మిడిల్ఈస్ట్కు తరలిస్తున్నారు. ఇదివరకే దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు అక్కడ ఉండగా ఇప్పుడు దానికి తోడుగా దాదాపు 3,500 మంది బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఇంత పెద్ద మెుత్తంలో మధ్యప్రాచ్యంలో బలగాలు మోహరించడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని పత్రికా కథనాలు పేర్కొన్నాయిజపాన్ తీరంలోని తైవాన్ సమీపంలో విన్యాసాలు చేస్తున్న అమెరికా ట్రిపోలీ నౌకను అత్యవసరంగా మధ్యప్రాచ్యానికి తరలించారు. దీనితో పాటు శాన్ డియాగో నుండి USS బాక్సర్ మరియు ఇతర యుద్ధ నౌకలు కూడా మధ్యప్రాచ్యానికి బయిలుదేరాయి. ఈ యుద్ధ నౌకలలో మెరైన్ సైనికులతో పాటు రవాణా విమానాలు, స్ట్రైక్ ఫైటర్ జెట్లు ఇతరాత్రా యుద్ధ సామాగ్రి ఉన్నాయి. ఈ అదనపు సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు లేదా చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీప సమీపంలో సమీపంలో మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ అమెరికా సేనల రాకపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' తన ప్రధాన శీర్షికలో "నరకానికి స్వాగతం" అని ప్రచురించింది. ఏ ఒక్క అమెరికా సైనికుడు ఇరాన్ భూభాగంపై అడుగు పెట్టినా, వారు కేవలం శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
ఇజ్రాయిల్ దాడుల్లో జర్నలిస్టులు మృతి
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్లు ఆదేశ సైన్యం ప్రకటించింది.ఇజ్రాయెల్ లెబనాన్పై విరుచుకపడుతుంది. ఆ దేశంపైకి కంబాట్ ఆపరేషన్ చేపడుతూ పెద్దఎత్తున హిజ్బుల్లా ఫైటర్స్ను హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దాదాపు 400కు పైగా హిజ్బుల్లా ఫైటర్స్ అంతం చేసినట్లు ప్రకటించింది. తాజాగా శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన ఛానెల్ షుయబ్-అల్- మనార్ ఛానెల్కు చెందిన జర్నలిస్టుతో పాటు మరో మహిళా జర్నలిస్టు, కెమెరామెన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన జర్నలిస్టు దశాబ్దకాలంగా యుద్ధవార్తలు కథనాలు ప్రచురిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ దాడులను లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కాగా 2023 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది పాత్రికేయులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. -
పాకిస్తాన్పై అమెరికా ఏజెన్సీ సర్వే.. రిపోర్టులో ఏముందంటే?
పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలైంది. అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారత్ను టార్గెట్గా చేసుకునే ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన భూభాగంలో ఆశ్రయం కల్పిస్తోందని నివేదిక తెలిపింది. పాకిస్థాన్ తీరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలంగా ఆదేశం భారత్పై విషం చిమ్మూతూనే ఉంది. మనం దేశం పైకి దాడి చేయడానికి పరోక్షంగా ఉగ్రమూకలకు మద్ధతిచ్చి భారత్పైకి ఊసిగొల్పడం ఆ దేశానికి సాధారణ విషయమే. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ సర్వేలోని ఇవే అంశాలు వెల్లడయ్యాయి. 2008 ముంబై దాడులకు కారణమైన లష్కరే ఏ తోయిబా, 2001 భారత పార్లమెంటు దాడికి పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఇప్పటికీ పాక్ భూభాగం నుండి పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గత పదకొండేళ్లుగా ఆ దేశంలో ఉగ్రవాదం ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుందని తెలిపింది. 2019లో 365గా ఉన్న మరణాల సంఖ్య, 2025 నాటికి 4,001కి చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో ఇదే అత్యధికమంది.ఆ దేశంలో ఐదు రకాలైన ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని వాటిలో పాకిస్థాన్ ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైన సంస్థగా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) నిలిచిందని పేర్కొంది. వీరు పాక్ ప్రభుత్వాన్ని పడగొట్టి షరియా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికా పాక్తో అంటగాచుకొని తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదేశానికి చెందిన ఏజెన్సీ రిపోర్టు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కాగా ఇటీవల టెర్రరిజం గ్లోబల్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలోనూ పాక్ మెుదటి స్థానంలో నిలిచింది. CRS అనేది అమెరికా కాంగ్రెస్ సభ్యులకు సమాచారం అందించే స్వతంత్ర పరిశోధనా విభాగం. దీని నివేదికలను అమెరికా ప్రభుత్వ అధికారిక నిర్ణయాలుగా పరిగణించలేము, కానీ ఇవి విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి. -
ట్రంప్, మోదీ ఫోన్ కాల్లో మస్క్.. భారత్ స్పందన ఇదే..!
మార్చి 24 మంగళవారం రోజు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంపై చర్చలు జరిపారు. అయితే ఈ హైలెవల్ కాల్లో టెస్లా అధినేత మస్క్ చేరాడంటూ కథనాలు వచ్చాయి. కాగా తాజాగా భారత్ ఈ అంశంపై స్పందించింది.ట్రంప్, మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన హైలెవల్ మీటింగ్లో ఎటువంటి అధికార హోదా లేని సభ్యుడు రావడంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఎంత బిలియనీర్ అయితే మాత్రం ప్రోటోకాల్ పాటించరా అని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.కాగా తాజాగా దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. "ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలను మేము గమనిస్తున్నాం. మార్చి 24న జరిగిన ఫోన్ సంభాషణ కేవలం ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్యే జరిగింది". అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.కాగా హర్మూజ్ జలసంధి మూసివేతపై ట్రంప్, మోదీ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ పరమైన నిర్ణయాల లోపంతో ట్రంప్, మస్క్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ట్రంప్ని మస్క్ బహిరంగంగానే విమర్శించారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం హైలెవల్ ఫోన్కాల్ మీటింగ్లో మస్క్ చేరాడంటూ వార్తలు రావడం చర్చనీయాంశమైంది. -
మా ఆశ, శ్వాస... అణ్వస్త్రమే!
అమెరికా-ఇజ్రాయెల్ కలసికట్టుగా తనపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు వీలు కల్పించే ఓ ‘ఫాస్ట్ ట్రాక్’ బిల్లును ఇరాన్ పార్లమెంటు చురుగ్గా పరిశీలిస్తోంది. ఎన్పీటీకి బైబై చెప్పే పక్షంలో ఇరాన్ అణు విధానంలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయి. అణుబాంబు ఇరాన్ వద్ద గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. అయినా ఎన్పీటీపై ఇరాన్ 1968 జులైలో సంతకం చేసింది. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనంటూ ఓ అణ్వస్త్రరహిత దేశంగా అది 1970 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని ధృవీకరించింది కూడా. 1967 జనవరి 1 నాటికి అణ్వస్త్రాలను పరీక్షించిన ఐదు దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలను ఈ ఒప్పందం అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. ఆ ఐదు దేశాలు క్రమంగా నిరాయుధం కావాలని, ఇతర అణ్వస్త్రరహిత దేశాలు అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని లేదా వాటిని సేకరించకూడదని ఎన్పీటీ ఉద్బోధిస్తోంది. ఈ ఒడంబడిక వివక్షాపూరితమని విమర్శకులు వాదిస్తారు. ఎన్పీటీలో 191 దేశాలు పార్టీలుగా ఉన్నాయి. ఆయుధ నియంత్రణలో ఈ ఒప్పందానికి విస్తృత ప్రాముఖ్యం ఉంది. విశేషమేంటంటే... అణ్వాయుధాలు కలిగిన భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఎన్పీటీలో భాగస్వాములు కాదు. భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ సూడాన్ ఎన్నడూ ‘ఎన్పీటీ కూటమి’లో సభ్యదేశాలుగా చేరనేలేదు. ఉత్తర కొరియా మాత్రం 1985లో సభ్యత్వం స్వీకరించినా 2003లో నిష్క్రమించింది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ప్రోత్సహించడానికి, అణ్వాయుధాల విస్తరణను అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అతి ముఖ్యమైన ఒప్పందాల్లో ఎన్పీటీ ఒకటి. దీని ప్రకారం ఇరాన్ ప్రస్తుతం అణు పారదర్శకత, కఠిన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఎన్పీటీకి ఇరాన్ చెల్లుచీటీ ఇచ్చే పక్షంలో ఆ పరిణామం ప్రపంచ అణు రాజకీయాల్లో ఓ ప్రధాన మలుపు అవుతుంది. ఎన్పీటీ నుంచి బయటికొచ్చేస్తే అణు కార్యక్రమం పరంగా పలు కీలక బాధ్యతల నుంచి ఇరాన్ విముక్తమవుతుంది. అప్పుడిక అణ్వాయుధం తయారుచేయబోమని అది ఎవరికీ ప్రమాణాలు చేయాల్సిన పని లేదు. అంతేకాదు... ఇరాన్ అణుకేంద్రాలపై ఐక్యరాజ్యసమితి కాపలాదారైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణ, నిపుణుల తనిఖీలు కూడా ఉండబోవు! అంటే... ఇరాన్ అణు కార్యకలాపాలు ఇకపై అంతగా ప్రపంచ దేశాల కంటబడవు. అసాధారణ పరిణామాలు తమ మహోన్నత జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడవేశాయని ఏ దేశమైనా భావించినప్పుడు మూడు నెలలు ముందుగా నోటీసు ఇచ్చి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి ఎన్పీటీలోని ‘ఉపసంహరణ క్లాజు’ వీలు కల్పిస్తోంది. ఒప్పందంలో 11 ఆర్టికల్స్ ఉండగా వాటిలో ఒకటి సభ్యత్వ ఉపసంహరణ గురించి వివరిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ఆరంభమైన గత నెల 28 నుంచి ఇరాన్ పార్లమెంటు ఇప్పటివరకు సమావేశమవలేదు. ఎన్పీటీ ‘ఉపసంహరణ బిల్లు’ను పార్లమెంటుకు సమర్పించారని ఇరాన్ ఎంపీ మాలిక్ షరియతి తాజాగా వెల్లడించారు. అయితే ఆ బిల్లుపై ఎప్పుడు లాంఛనంగా చర్చిస్తారు? అది ఎప్పుడు ఆమోదం పొందుతుంది? వంటి అంశాలపై అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా నిరోధించాలంటే అణ్వాయుధాలు కలిగివుండటం అవసరమా? అనే అంశంపై ఇరాన్ అంతర్గతంగా చర్చించింది. తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ అనూహ్య దాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశంతో సైనిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నందున ఎన్పీటీ నుంచి వైదొలగాలని ఇరాన్ నిరుడే భావించింది. ఒకవైపు పౌర అణు కార్యక్రమానికి కట్టుబడుతూనే సాధ్యమైనంత త్వరగా ఎన్పీటీ నుంచి ఇరాన్ తప్పుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) అనుబంధ తస్నిమ్ వార్తాసంస్థ గురువారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్పీటీకి ఇరాన్ టాటా చెబితే అందరికీ అర్థమయ్యేదొకటే... ఆ దేశానికి అణుబాంబే ముఖ్యమని! అణ్వస్త్రాన్ని తయారుచేయడమే దాని లక్ష్యమని!!- జమ్ముల శ్రీకాంత్ -
7 కోట్ల పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా?
పిల్లలూ! ప్రపంచంలో అత్యధిక పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా? అదే అమెరికా. యునైటెడ్ స్టేట్స్లో సుమారు ఏడు కోట్ల పెంపుడు కుక్కలున్నాయి. అంతేకాదు, ఇక్కడ 7.4 కోట్ల పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఆ దేశంలో కుక్కలు పిల్లుల పట్ల ప్రేమను చూపించడంలో వారు ఏమాత్రం వెనుకాడరు. అక్కడి పెంపుడు జంతువుల యజమానులు వాటికి ప్రొఫెషనల్ ఫోటోలు తీయిస్తారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. తమ ఇళ్లలో కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేక నివాస స్థలాలను ఏర్పాటు చేస్తారు. యునైటెడ్ స్టేట్స్లోని సగానికి పైగా కుటుంబాల ఇళ్లలో కనీసం ఒక కుక్క లేదా ఒక పిల్లి ఉంటుంది.అమెరికా తర్వాత పెంపుడు జంతువులు అధికంగా ఉన్న దేశంగా చైనా ముందుంది. గత పదేళ్లలో చైనాలో పెంపుడు జంతువుల పరిశ్రమ విపరీతంగా పెరిగింది. 2019లో పెంపుడు జంతువుల పెంపకంలో చైనా కొద్దికాలం యునైటెడ్ స్టేట్స్ను అధిగమించింది. (రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్లాండ్ ట్రిప్)చైనా జనాభా అమెరికా జనాభా కంటే ఐదు రెట్లు ఎక్కువ. పెంపుడు పిల్లులు ఉన్న దేశాల సంఖ్యలో చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. చైనా సరిహద్దుల్లో సుమారు 5.3 కోట్ల పెంపుడు పిల్లులు ఉన్నాయి. చైనాతోపాటు బ్రెజిల్లోనూ పెంపుడు జంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో ? -
అలా చేస్తేనే.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: శాంతి కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని గల్ప్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ గగనతలాలను యూఎస్, ఇజ్రాయెల్ వినియోగించుకోకుండా నిషేధం విధించాలని.. తాము చెప్పినట్టు చేస్తేనే గల్ఫ్పై దాడులు ఆపుతామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. తమ దేశాల్లో అభివృద్ధి, భద్రతను కోరుకుంటే.. ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా-ఇజ్రాయెల్లు తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా-ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ముందస్తు దాడులు చేయదని మేము చాలాసార్లు చెప్పాం. కానీ మా మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మేము గట్టిగా సమాధానం ఇస్తాం. గల్ఫ్ దేశాలకు నేను చెప్పేది ఒక్కటే.. మీకు అభివృద్ధి, భద్రత కావాలంటే మా శత్రువులను మీ గడ్డల నుండి యుద్ధం చేయనివ్వకండి’’ అంటూ పెజెష్కియాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దుబాయ్లోని రెండు అమెరికా సైనిక "దాగుడు స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' నివేదించింది.మరోవైపు, హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. -
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న యుద్ధ వ్యయం, విస్తరిస్తున్న బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని (Physical Gold) విక్రయించడం ప్రారంభించింది. 'బిఎన్ఈ ఇంటెల్లిన్యూస్' (bne IntelliNews) నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.నివేదికలోని ముఖ్యాంశాలుభారీగా విక్రయాలు: 2022 నుంచి 2025 మధ్య కాలంలో రష్యా సుమారు 150 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని విక్రయించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలను వదులుకుంది.రికార్డు స్థాయి విక్రయం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. 2002 తర్వాత రెండు నెలల కాలంలో జరిగిన అతిపెద్ద విక్రయం ఇదే కావడం గమనార్హం.లోటు బడ్జెట్ సెగ: 2025 నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరింది. వాస్తవానికి ఇది 0.5% మాత్రమే ఉంటుందని అంచనా వేసినా, యుద్ధ పరిస్థితుల వల్ల అంచనాలు తలకిందులయ్యాయి.వ్యూహం మారింది..గతంలో రష్యా తన బంగారు నిల్వలపై కేవలం ఆర్థిక లావాదేవీలు (Speculative transfers) మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు నేరుగా భౌతిక బంగారాన్ని (Physical Bullion) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల రష్యా బంగారం నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అత్యల్ప స్థాయి.తగ్గిన చమరు ఆదాయం అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో రష్యా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రష్యా మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ వాటా సగభాగం ఉండగా, ఇప్పుడది 20 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటడంతో, ఆ గరిష్ట ధరల వద్ద బంగారాన్ని అమ్మి నగదు సమీకరించుకోవాలని రష్యా భావిస్తోంది.ప్రపంచంలో ఐదో స్థానంవరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో కొనసాగుతోంది. 2014 (క్రిమియా ఆక్రమణ) నుంచి డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.ఆర్థిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంయుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తోంది. వాటిలో.. నేషనల్ వెల్ఫేర్ ఫండ్: ఇందులో ఉన్న నిధులను యుద్ధ అవసరాలకు వాడుకుంటోంది.పన్నుల పెంపు: వ్యాట్ (VAT) రేట్లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.బాండ్ల జారీ: దేశీయంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తోంది.ఉక్రెయిన్తో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, రష్యా తన అత్యంత విలువైన 'బంగారు' నిల్వలను విక్రయించడం ప్రారంభించడం ఆ దేశ ఆర్థిక స్థితిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
గ్రేట్ ప్లాన్ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు
చదువు పూర్తి అయినా ఉద్యోగాలు దొరక్క యువత నానా పాట్లు పడుతోంది. దీంతో చైనాలోని "యీయాంగ్ సీనియర్ హౌస్" వినూత్నంగా ఆలోచించింది. ఈ ప్లాన్తో చైనాలో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, ఇటు నిరుద్యోగ యువతకు కూడా భారీ ఉపశమనం లభిస్తోంది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలని ఉందా? పదండి మరి,చైనాలోని సుజౌ (Suzhou) నగరానికి చెందిన 25 ఏళ్ల జాంగ్ జిన్ (Zhang Jin) అనే యువతి, నేటి తరం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని, ఒంటరితనాన్ని అధిగమించేలా సరికొత్త నిర్ణయం తీసుకని వార్తల్లో నిలిచింది. నెలకు కేవలం 200 యువాన్ల (సుమారు రూ.2,820) మాత్రమే అద్దె చెల్లిస్తోంది. సాధారణంగా అక్కడి మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 10 రెట్లు తక్కువ. దీనికి ఆమె చేయాల్సిందల్లా ఏమిటంటే వృద్ధాశ్రమంలో నివసిస్తూ, అక్కడి వృద్ధులకు తోడుగా ఉండటమే.తూర్పు చైనాలోని తూర్పు జియాంగ్జీ ప్రావిన్స్ నుండి కొత్తగా పట్టభద్రురాలైన జాంగ్, అక్కడ ఉద్యోగం సంపాదించిన తర్వాత జియాంగ్సు ప్రావిన్స్లోని సుజౌకు మారింది.జాంగ్ వారంలో ఐదు రోజులు ఆఫీసుకి వెళ్తుంది. సాయంత్రం వేళల్లో ,వారాంతాల్లో (Weekends) వృద్ధులతో కలిసి డ్యాన్స్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్లో పాల్గొంటుంది. తద్వారా తక్కువ అద్దెకు ఇల్లు, పెద్దవారితో అనుబంధంతోపాటు, మానసిక ఉల్లాసాన్ని బోనస్గా అందుకుంటోంది.ఈ ఆశ్రమం స్వచ్ఛంద సేవ కోసం దరఖాస్తు చేసుకునే వారు 35 ఏళ్లలోపు వారై ఉండాలి, నగరంలో సొంత ఇల్లు ఉండకూడదు . పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రతి మూడు నెలలకు కనీసం 45 గంటల పాటు వృద్ధులకు సేవ చేయాల్సి ఉంటుంది. పెద్దలతో ఆత్మీయ అనుబంధంఈ క్రమంలో ఆశ్రమంలోని పెద్దవాళ్లతో యువతకు అనుబంధం, ఇటు వృద్ధులకు కూడా మంచి కాలక్షేపం తద్వారా చక్కటి ఆరోగ్యం కూడా అంటుంది జాంగ్. ఆశ్రమంలో ఆమెకు 89 ఏళ్ల వృద్ధుడిని పార్ట్నర్గా కేటాయించారు. ఆయన ఆమెను తన సొంత మనవరాలిలా చూసుకుంటారు. ఒకసారి జాంగ్ అనారోగ్యానికి గురైతై, ఆయన తెల్లవారుజామున 5 గంటలకే లేచి ఆమె కోసం వేడి వేడి సూప్ తయారు చేసి ఇచ్చారట. "ఈ నగరంలో నాకు ఎవరూ తెలియదు. కానీ ఈ ఆశ్రమం నాకు సొంత ఇల్లులా అనిపిస్తోంది. ఇక్కడ నాకు లభించే ప్రేమాభిమానాలు నా ఒత్తిడిని తగ్గిస్తున్నాయి," అంటుంది సంతోషంగా.ఇదీ చదవండి: ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడిఎందుకు ఈ నిర్ణయం?చైనాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా మరియు యువతపై ఉన్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ "యీయాంగ్ సీనియర్ హౌస్" (Yiyang Senior House) ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనివల్ల యువతకు అద్దె భారం తగ్గుతుంది. వృద్ధులకు ఒంటరితనం పోయి కొత్త ఉత్సాహం లభిస్తుంది. అలాగే నగరంలో ఒంటరిగా ఉండే యువతకు ఒక కుటుంబం దొరికినట్లు అవుతుంది.ప్రస్తుతం ఆ ఆశ్రమంలో ఉన్న ఏకైక వాలంటీర్ జాంగ్ మాత్రమే (మిగిలిన వారు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు). అందుకే యాజమాన్యం మరికొంత మంది వాలంటీర్లను చేర్చుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు -
యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు
ఘజియాబాద్కు హరీష్ రాణా దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా నిలిచారు. 13 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా బతికిన ఆయనకు సుప్రీంకోర్టు అనుమతితో ఎయిమ్స్ వైద్యులు చికిత్స నిలిపివేయగా, ఇటీవల తుదిశ్వాస విడిచారు. దాదాపు ఇలాగే చట్ట అనుమతితో కారుణ్య మరణం పొందిన స్పానిష్ యువతి గురించి తెలుసా? వేదన భరించలేక కారుణ్య మరణం ఎంచుకున్న అత్యాచార బాధితురాలి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.స్పానిష్ యువతి నోలియా కాస్టిల్లో (Noelia Castillo) ఉదంతం చాలా హృదయవిదారకమైన గాథ. మృత్యువు అంచుల వద్ద కూడా ఎలాగైనా బతకాలనే కోరుకుంటారు ఎవరైనా. కానీ కోరి కోరి మృత్యువును ఎంచుకోవడం అంటే ఆ నరకయాతన, మానసిక క్షోభను, కుటుంబం భావోద్వేగ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నోలియా కాస్టిల్లో కారుణ్య మరణంస్పానిష్ ప్రభుత్వ ప్రసార సంస్థ TVE , ఇతర స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బార్సిలోనాకు చెందిన 25 ఏళ్ల నోలియా కాస్టిల్లో, కాటలోనియాలోని శాంట్ పెరె డి రిబ్స్లోని ఒక ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఈ ప్రక్రియ పూర్తి అయింది. దీన్ని ఎలాగైనా ఆపాలని ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పెయిన్, యూరప్లోని న్యాయస్థానాల అనుమతితో మూడు రకాల మందుల మిశ్రమంతో చేసే ఇంజెక్షన్ ద్వారా 15 నిమిషాల చికిత్సా ప్రక్రియలో ఆమె ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. నోలియా మరణం స్పెయిన్లో కారుణ్య మరణంపై మళ్ళీ చర్చను లేవనెత్తింది. మతసంస్థలు, సంప్రదాయ వాదులు ఇది వైద్య వ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. అయితే స్వచ్ఛంద మరణం కోసం పోరాడే సంఘాలు, గౌరవప్రదమైన మరణాన్ని ఎంచుకునే హక్కు అంటూ ఈ ప్రక్రియను సమర్థించాయి.భరించలేని హింస , బాధ2022లో ఒక ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు నోలియాపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి జారిపోయింది. ఆపై తాను ఉంటున్న భవనంలోని ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తృటిలో ప్రాణాలతో బయటపడింది కానీ పక్షవాతానికి గురైంది. ఇక అప్పటినుంచి మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించిన నోలియా, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తానుకున్నట్టుగానే మనశ్శాంతిగా కన్నుమూసింది. ఆ గాయం నుండి కోలుకోలేక ఆమె ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి, ఆమె వీల్చైర్కే పరిమితమై, శారీరక , మానసిక వేదనతో కుమిలిపోయింది.శారీరక వేదనతోపాటు,అత్యాచారం తాలూకూ చేదు జ్ఞాపకాలు ఆమెను నిరంతరం వెంటాడేవి. "నేను ఏమీ చేయలేకపోతున్నాను, కనీసం నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది. తన బాధ కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, తీవ్రమైన భావోద్వేగపరమైంది అందుకే ఈ నరకం నుంచి విముక్తి కావాలి. ఇక ఈ బాధ భరించలేను, నేను అనుభవించిన ప్రతీ బాధను మననం చేసుకుంటూ జీవించడం నావల్లకాదు ఇక వెళ్లిపోవాలను కుంటున్నాను, నాకు విముక్తి కావాలి శాంతి కావాలి” అని ఆమె మరణానికి ముందు రోజు ప్రసారమైన మరో ఇంటర్వ్యూలో చెప్పింది.తండ్రి అభ్యంతరంఏప్రిల్ 2024లో నోలియా దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆరోగ్య బోర్డు అందుకు అనుమతించింది. కానీ నోలియా తండ్రి దీనిని ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఇది సరైన నిర్ణయం కాదని, చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. ఈ పోరాటంలో సుప్రీంకోర్టు నుండి ఐరోపా మానవ హక్కుల కోర్టు వరకు వెళ్లినా, ఆయన విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది.తల్లి యోలాండా రామోస్ నిస్సహాయత: "నేను ఆమె నిర్ణయంతో ఏకీభవించడం లేదు, కానీ నా బిడ్డ పడుతున్న బాధను చూడలేను. చివరి వరకు ఆమె పక్కనే ఉంటాను" అని భావోద్వేగంగా చెప్పారు.చివరి కోరిక"నేను అందంగా కనిపిస్తూ మరణించాలని అనుకుంటున్నాను. నాకిష్టమైన డ్రెస్ వేసుకుని, మేకప్ వేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతాను" అని ఆమె తన చివరి కోరికను వెల్లడించారు. ఆమె కోరుకున్నట్టుగా, చట్ట నియమాల మేరకు ఆమె తనువు చాలించారు.స్పెయిన్ 2021లో కారుణ్య మరణాన్ని (Euthanasia) చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం నయం చేయలేని వ్యాధులు లేదా దీర్ఘకాలిక అశక్తత ఉన్నవారు మరణాన్ని కోరుకోవచ్చు. -
భయాందోళనల్లో ప్రవాస భారతీయులు
అబుదాబీ: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. శనివారం అబుదాబీ లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ రక్షణ వ్యవస్థ గగనతలంలోనే కూల్చివేసింది. అయితే ఈ క్రమంలో క్షిపణి శకలాలు కింద పడటంతో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. అబుదాబీ మీడియా కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖలీఫా ఎకనామిక్ జోన్స్ అబుదాబీ పారిశ్రామిక ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గగనతలంలో క్షిపణిని అడ్డుకున్న తర్వాత, దాని శకలాలు పారిశ్రామిక జోన్పై పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురు భారతీయులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.రంగంలోకి అత్యవసర బృందాలుక్షిపణి శకలాలు పడటంతో పారిశ్రామిక ప్రాంతంలో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే ఈ క్షిపణి ఎక్కడి నుంచి ప్రయోగించారనే విషయాన్ని యూఏఈ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.వదంతులను నమ్మవద్దుఈ ఘటన నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని యూఏఈ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అన్ వెరిఫైడ్ వార్తలను, ఊహాగానాలను నమ్మవద్దని.. కేవలం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, తాజా దాడితో ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ! -
యుద్దంలో భారీ ట్విస్ట్.. హౌతీల సంచలన ప్రకటన
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో -
సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్!
ప్రపంచ దేశాలను మరో భారీ సంక్షోభం ముంచెత్తబోతోందా? పశ్చిమ ఆసియాలో ముదిరిన యుద్ధ భయాలు ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘డిజిటల్ కేబుళ్ల’ను తెంచేలా కనిపిస్తున్నాయా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్ర గర్భంలోని డేటా కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.ఏమిటీ వివాదం?ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95% నుంచి 97% వరకు సముద్ర గర్భంలో అమర్చిన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం (రెడ్ సీ), హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను అనుసంధానిస్తున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికలతో ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు ఈ హెచ్చరికలు?2026 ఫిబ్రవరి చివర్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా నేతృత్వంలోని దళాలకు గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తే ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ‘గ్రే జోన్ వార్ఫేర్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎవరు ప్రభావితమవుతారు?ఒకవేళ ఇరాన్ అనుకున్న పనిచేస్తే ఈ ముప్పు కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. భారత్ నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లే డేటా ట్రాఫిక్లో దాదాపు మూడో వంతు ఈ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఇది ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూఏఈ, సౌదీ అరేబియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లు, డేటా సెంటర్లు నేరుగా ప్రభావితమవుతాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు ఇప్పటికే తమ కేబుల్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ‘2ఆఫ్రికా పర్ల్స్’ వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి.ఎలాంటి ప్రభావం ఉంటుంది?ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే అది కేవలం ఇంటర్నెట్లో అవాంతరం కలగడమే కాకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు స్తంభిస్తాయి. క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్, అంతర్జాతీయ సమాచార మార్పిడి నిలిచిపోతుంది. యుద్ధ ప్రాతిపదికన వీటిని బాగు చేయడం చాలా కష్టంతో కూడుకుంది. సముద్ర గర్భంలో వీటిని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు కావాలి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఆ నౌకలు అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.భారత ప్రభుత్వం అప్రమత్తంఈ పరిణామాల నేపథ్యంలో భారత టెలికాం శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వంటి సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ‘సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు ఆధునిక ప్రపంచానికి ప్రాణధారలు. వీటిపై దాడి జరిగితే అది కేవలం ఒక భౌగోళిక దాడి కాదు, ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై జరిగే అతిపెద్ద దాడి అవుతుంది. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ముప్పును నివారించడం ఒక్కటే ప్రస్తుతానికి మార్గం’ అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు -
నేపాల్లో సంచలనం.. మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్
ఖాట్మాండ్: నేపాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం తెల్లవారుజామున అరెస్టు అయ్యారు. నేపాల్లో జెన్ జెడ్ నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన ఘటనకు సంబంధించి, నరహత్య కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక, నేపాల్ ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజే ఆయన అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.ఇక, ఇదే కేసులో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా అరెస్టు అయ్యారు. భక్తపూర్లోని వారి నివాసాల నుండి ఈ ఇద్దరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగల నిబంధనల కింద అభియోగాలు మోపే అవకాశం ఉంది. నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) నాయకుడైన ఓలీపై విచారణ జరపాలని నేపాల్లోని ఒక ఉన్నత స్థాయి కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది.This is how it’s started to arrest Nepal Ex Prime Minister KP Sharma Oli. New Prime Minister Balendra Shah cabinet’s Home Minister Sudhan Gurung also confirmed! पूर्वप्रधानमन्त्री केपी शर्मा ओली पक्राउ ! #Nepal #KPSharmaOli #KPOli Gen Z pic.twitter.com/jfTvZzI4cN— Jitan Katwal 𝕏 (@JitanKatwal) March 28, 2026కాగా, కేపీ శర్మ ఓలీ హయాంలో పాలనా వైఫల్యాలు, అవినీతి, నిరుద్యోగం, రాజకీయ అస్థిరతపై ప్రజల్లోని ఆగ్రహంతో 2025 సెప్టెంబర్లో ‘జెన్ జెడ్ విప్లవం’గా పిలవబడే భారీ యువత తిరుగుబాటు నేపాల్ను అట్టుడికింది. డిజిటల్ స్వేచ్ఛ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం, త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణమించడంతో ప్రభుత్వం తీవ్ర అణచివేతకు పాల్పడింది. తత్ఫలితంగా జరిగిన హింసా కాండలో కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. #WATCH | Former Nepal Prime Minister KP Sharma Oli taken into custody from his residence in Gundu, Bhaktapur, by Nepal Police. According to the Kathmandu Post, "he has been arrested in connection with a culpable homicide-related case linked to the alleged suppression of the… pic.twitter.com/S0zrAmPUFV— ANI (@ANI) March 28, 2026నేపాల్ ప్రధానిగా షా..ఇదిలా ఉండగా.. నేపాల్లో రాప్ నుంచి నవతరం నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా ‘బాలెన్’ (35) శుక్రవారం నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేశారు. శీతల్ నివాస్లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలెన్తో దేశ అధ్యక్షుడు రామ్ చంద్రపౌడెల్ ప్రమాణం చేయించారు. గతంలో ఖాట్మాండ్ నగర మేయర్గా పనిచేసిన బాలెన్... ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇక, కొత్తగా ఏర్పాటైన బాలేంద్ర షా మంత్రివర్గం తొలిరోజే సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. గత సెప్టెంబరు నెలలో జరిగిన జెన్ జెడ్ ఉద్యమంపై దర్యాప్తు జరిపిన ఉన్నతస్థాయి కమిషన్ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని నిర్ణయించింది. -
4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా!
కొలంబో: పశ్చిమాసియా కల్లోలం పుణ్యమా అని పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోలును ఇంట్లో దాచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా కటకటాలపాలు కావాల్సి వచ్చింది! ఈ వింత ఉదంతం శ్రీలంకలో చోటుచేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందిన లసంత కుమార బాలసూర్య (48) ఇంట్లో సోదాల్లో 4 లీటర్ల పెట్రోల్ దొరికింది. దాంతో పోలీసులు మనవాడిని అరెస్టు చేసి బోనెక్కించారు. తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ నిమిత్తం ఇంటి పరిసరాల్లోని చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోలు తెచ్చుకున్నానని మొత్తుకున్నా లాభం లేకపోయింది.అతనికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన అక్రమ నిల్వలపై లంక కఠిన నిషేధం విధించింది. కనుక, దాచింది నాలుగు లీటర్లే అయినా నేరం నేరమే పొమ్మంటూ చట్టం ఇలా తన పని తాను చేసుకుపోయింది! పౌరుల పెట్రోల్, డీజిల్ వాడకంపై లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలుకు మార్చి 15 నుంచి క్యూఆర్ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతిస్తారు. -
రష్యా కీలక నిర్ణయం.. పెట్రో ఎగుమతుల నిషేదం
పశ్చిమాసియా యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సరఫరాకు ప్రాధాన్యతనిచ్చేందుకు ఏప్రిల్ 1 నుంచి గ్యాసోలిన్ ఎగుమతులను నిషేదించనున్నట్లు ప్రకటించింది.ఇరాన్పై హర్మూజ్ జలసంధిని మూసివేసిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ప్రపంచ క్రూడాయిల్ రవాణా 20 శాతం మేర హర్మూజ్ మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు దానిని ఇరాన్ క్లోజ్ చేయడంతో ఇప్పుడు సప్లై చైన్ దెబ్బతిని చమురు కొరత ఏర్పడింది.ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. కాగా ఇప్పుడు రష్యా సైతం గ్యాసోలిన్ ఉత్పత్తుల ఎగుమతులను ఏప్రిల్ 1 నుంచి నిషేదించనున్నట్లు ప్రకటించింది. దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల మార్కెట్లోని పరిస్థితిని సమీక్షించడానికి రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. అనంతరం ఈ ప్రకటన వెలువడింది.అంతర్గత డిమాండ్ను తీర్చడానికి పారిశ్రామిక సంస్థల వద్ద తగినంత గ్యాసోలిన్ మరియు డీజిల్ నిల్వలతో పాటు అధిక రిఫైనరీ సామర్థ్య వినియోగం ఉందని నోవాక్ తెలిపారు. .దేశీయ ఇంధన ధరలు అంచనాలకు మించి పెరగకుండా నిరోధించాలని అధ్యక్షడు పుతిన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. -
ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి
దుబాయ్: పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించే చర్చల విషయంలో సందిగ్ధత, ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు శుక్రవారంతో ముగిసింది. దాన్ని మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ఇరాన్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పడం విశేషం! ‘‘ఏప్రిల్ 6 నాటికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవాల్సిందే. లేదంటే ఆ దేశ ఇంధన క్షేత్రాలన్నింటినీ సర్వనాశనం చేస్తా’’ అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు నిర్నిరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఇరుపక్షాలు ముమ్మరంగా దాడులు చేసుకున్నాయి.ఇరాన్లోని యజ్ద్ ప్రావిన్స్లో అర్డకాన్ యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది! సెంట్రల్ ఇరాన్లోని ఒక భార జల కేంద్రంపై కూడా దాడులు చేసింది. దాడులను మరింతగా విస్తరిస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు 2,500 మంది మరైన్లు, 1,000 మంది పారా ట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్కు చేరువవుతున్నాయి. ఇంకో 10 వేల మంది సైనికులను గల్ఫ్కు తరలించాలని ట్రంప్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్తో చర్చించినట్టు ఈజిప్టు పేర్కొంది. గల్ఫ్లో దాడుల మోత ఇరాన్లోని ఆయుధోత్పత్తి, నిల్వ కేంద్రాలే లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరిల్లిపోయాయి. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తారిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ పెద్ద పెట్టున దాడులు చేసింది. శుక్రవారం వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. లితానీ నదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుంటాని ప్రకటించింది! బీరూట్లో పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఎటు చూసినా అగ్నికీలలు, పొగ కన్పించాయి. దాడులకు ఇద్దరు పౌరులు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీస్తూ కన్పించారు. గల్ఫ్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైనా ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. అష్దోద్లోని చమురు నిల్వ కేంద్రాలు, మొదీన్లోని సైనిక స్థావరాలతో పాటు అమెరికాకు చెందిన అల్ దాఫ్రా, అల్ ఉదెయ్రీ, అలీ అల్ సలేం ఎయిర్ బేస్, షేక్ ఇసా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ సిటీలోని షువైక్ రేవు, ఉత్తరాన ముబారక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్టు కువైట్ తెలిపింది. అల్ కబీర్ చైనా సహకారంతో నిర్మిస్తున్న రేవు కావడం విశేషం. మరోవైపు ఇరాన్కు మిత్ర దేశం రష్యా 313 టన్నుల మేరకు ఔషధ నిల్వలను పంపింది.హార్మూజ్ వద్ద ‘అధికారిక’ంగా టోల్!త్వరలో చట్టం చేసే యోచనలో ఇరాన్హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’ఇజ్రాయెల్పై ప్రయోగించిన ఇరాన్ ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. ఇరాన్కు దన్నుగా జమ్మూ కశ్మీర్ వాసులు నగదు మొదలుకుని నగల దాకా పలురకాలైన మానవతా సాయాన్ని విరాళాల రూపంలో సేకరించి పంపడం తెలిసిందే.ఎఫ్బీఐ చీఫ్ ఈ మెయిల్ హ్యాకింగ్తమ పనేనన్న ఇరాన్ అనుకూల గ్రూపు వాషింగ్టన్: ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ మెయిల్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. ఇది తమ పనేనని హందాలా అనే ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. అందులోని రెజ్యుమేతో పాటు పలు వ్యక్తిగత డాక్యుమెంట్లతో పాటు కాష్ పటేల్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అవన్నీ కనీసం పదేళ్ల నాటివిగా కనిపిస్తున్నాయి. హ్యాకింగ్ను ఎఫ్బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. -
400 మంది హిజ్బుల్లా ఫైటర్స్ మృతి
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఇప్పటివరకు 400 మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్లు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. దానితో పాటు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది.ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్పై దాడులు చేస్తూనే ఇటు లెబనాన్పై విరుచుకపడుతుంది. ఆ దేశంలోని నేరుగా సాయుధబలగాల్ని రంగంలోకి దింపింది. ఈ నేఫథ్యంలోనే ఆ ప్రాంతంలో భారీగా దాడులు చేస్తోంది. ఈ అటాక్స్ వల్ల ఇప్పటికే లక్షలో సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా 400కు పైగా హిజ్బుల్లా తీవ్రవాదులు మృతిచెందినట్లు నివేదికలు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ వివరాల్ని హిజ్బుల్లా సమూహానికి చెందిన వ్యక్తులు అందజేసినట్లు తెలిపింది.అయితే హిజ్బూల్లా మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక వివరాలను ప్రచురించలేదు. కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు మరణించిన సందర్భంలో వారి వివరాలను వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడులలో కనీసం 700 మంది హిజ్బుల్లా ఫైటర్లను మరణించినట్లు పేర్కొంది. ఇందులో వందలాది మంది ఆ సమూహానికి చెందిన ఎలైట్ 'రాద్వాన్ ఫోర్స్' సభ్యులు ఉన్నారని తెలిపింది.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడులు మరియు భూతల కార్యకలాపాల వల్ల లెబనాన్లో ఇప్పటివరకూ 1,142 మంది మరణించారని, వీరిలో 122 మంది పిల్లలు, 83 మంది మహిళలు మరియు 42 మంది వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొంది. కాగా 2023-2024లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో దాదాపు 5 వేల వరకూ హిజ్బుల్లా ఫైటర్స్ మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది. -
ట్రంప్, మోదీ కాల్.. మధ్యలో ఎలాన్ మస్క్ ఎంట్రీ?
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ సంభాషణలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం చేరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. అమెరికా అధ్యక్షుడిపై మస్క్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన చమురు సంక్షోభం, హర్మూజ్ జలసంధి తదితర అంశాలపై అమెరికా, భారత్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి ఫోన్ సంభాషణ జరిగింది. అయితే ఆ కాల్లో మస్క్ చేరినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన కీలక సంభాషణలో ఎటువంటి అధికారిక హోదా లేని వ్యక్తి పాల్గొనడం ఏంటని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత బిలియనీర్ అయితే ఇటువంటి పని చేయడం ఏంటని పలువురు వ్యతిరేకిస్తున్నారు. అయితే మస్క్ను ఎందుకు చేర్చారు. ఈ చర్చలో ఆయన ఏమైనా మాట్లాడారా అనే పూర్తి వివరాలు తెలియరాలేదు.కాగా సున్నితమైన జాతీయ భద్రతా అంశాలు చర్చించబడే దేశాధినేతల కాల్స్లో ప్రైవేట్ పౌరులను చేర్చుకోవడం చాలా అరుదని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ అంశంపై వైట్ హౌస్ కానీ భారత అధికారులు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ట్రంప్, మస్క్ మధ్య విభేదాల తర్వాత ప్రస్తుతం సంబంధాలు మెరుగు పడి ఉండవచ్చని అందుకోసమే మస్క్ ఈ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి ఉండవచ్చని న్యూయార్క్ కథనం పేర్కొంది. -
తప్పుదారి పట్టించావు.. నెతన్యాహుపై మండిపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు?
పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది. ట్రంప్ ఏమో చర్చల ఫలప్రదమవుతున్నాయని ప్రచారం చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చకుండా యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం విషయంలో ఇరాన్ని తక్కువ అంచనా వేశాడనేది కాదనలేని వాస్తవం. ఆయన అనుకున్న విధంగా యుద్ధం కొద్ది రోజుల్లో ముగియలేదు కదా నానాటికీ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో జేడీవాన్స్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం, ఇరాన్లో అధికార మార్పుపై ఉన్న అవకాశాలపై నెతన్యాహుకు ఉన్న విశ్వాసం గురించి వాన్స్ ఆయనను నిలదీసినట్లు కథనాలుపేర్కొన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానికి చేసిన ఫోన్కాల్లో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలడం చాలా సులభమని, యుద్ధం త్వరగా ముగుస్తుందని నెతన్యాహు గతంలో ఇచ్చిన హామీలు తప్పని వాన్స్ మండిపడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జేడీ వాన్స్ను బలహీనపరిచేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఒక సీనియర్ అమెరికా అధికారి ఆరోపించారు. ఇరాన్ ప్రతినిధులు వాన్స్లో చర్చలుకే మెుగ్గుచూపుతన్నారని వస్తున్న వార్తలు వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందని ఇది వాన్స్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడితో చర్చలు జరపకపోతే ఎవరితోనూ జరపలేదని ఆయన పేర్కొన్నారు.అయితే సాధారణంగా జేడీ వాన్స్ విదేశీ యుద్ధాల్లో అమెరికా పాత్రపై వ్యతిరేకంగా ఉంటారు. అయితే గతంలోనూ అధ్యక్షుడు ట్రంప్ ఆపరేషన్ 'ఎపిక్ ఫ్యూరీ' విషయంలో తనకు, వాన్స్కు మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే గతంలో యుద్ధాల విషయంలో అమెరికా చేసిన తప్పులు పునరావృతం కాకూడదని వాన్స్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం మరో ముగింపు లేని యుద్ధం కాకూడదని అందుకే నెతన్యాహు దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. -
నాటో, ఈయూ సమాచారం కోసం .. చైనా లింక్డిన్ వల ?
యూరోపియన్ భద్రతా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లను ఉపయోగించి నాటో (NATO) ఐరోపా సమాఖ్య (EU) సంస్థల నుండి రహస్య సమాచారాన్ని సేకరించడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.నకిలీ లింక్డిన్ ఖాతాల ద్వారా సైనిక కూటమి (నాటో) లేదా ఐరోపా సమాఖ్య (EU) సంస్థలకు చెందిన డజన్ల కొద్దీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో రిక్రూట్ చేసుకున్నవారిని చిన్నపాటి నివేదికలు రాయాలని కోరుతూ కొంత మొత్తం నగదు చెల్లిస్తారని వారిపై నమ్మకం కుదిరిన తర్వాత క్రమంగా బహిరంగంగా లభ్యం కాని సమాచారం లేదా అత్యంత రహస్యమైన డేటా కోసం ఒత్తిడి చేస్తారని పేర్కొన్నాయి.ఇందులో ప్రధానంగా "కెవిన్ జాంగ్" అనే పేరుతో ఉన్న ఒక అకౌంట్ ద్వారా ఈ కుట్ర సాగినట్లు ఈయూ అధికారులు గుర్తించారు. ఇతను హాంకాంగ్కు చెందిన "ఓరియంటల్ కన్సల్టింగ్" అనే నకిలీ సంస్థ అధిపతిగా చెలామణి అయినట్లు పేర్కొన్నారు. చైనా నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఈ నెట్వర్క్ నిర్వహిస్తున్నారని దీని వెనుక ప్రధానంగా చైనా 'స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ' ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. కాగా బ్రిటన్ గూఢచారి సంస్థ MI5 కూడా గతంలో ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. -
పాక్కు షాకిచ్చిన ఇరాన్.. చమురు నౌకపై బాంబుల దాడి
పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్కు చెందిన చమురు షిప్ను పేల్చేసింది. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ బీరాలు పలుకుతున్న వేళ ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.పశ్చిమాసియా యుద్ధం ఇంతట్లో శాంతించేలా లేదు. ఇరాన్ చర్చలకు ఎట్టి ససేమిరా అంటూ దాడులకు తెగబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఓ వైపు ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. అమెరికా ఆర్మీ సైతం తమ దేశంలో దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తాజాగా పాకిస్థాన్కు చెందిన ఓ చమురు నౌకను ఇరాన్ ధ్వంసం చేసింది. దుబాయ్, అబుదాబీ సముద్ర తీరంలో ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండురోజుల క్రితం హర్మూజ్లో పాకిస్థాన్ నౌకను ఇరాన్ అడ్డుకోవడం తెలిసిందే. అనుమతి లేకుండా నౌక జల సంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతోదానిని అడ్డుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. తాజాగా పాక్కు చెందిన మరో చమురు నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే ఇరాన్తో తమకు సత్సంబంధాలున్నాయని యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకపైనే దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తోందో తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్కు చెందిన నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటడానికి అనుమతిస్తోంది.🚨🚨 Just in Breaking 🇵🇰 Iran destroys Pakistan oil tanker that attempted to pass through the Strait of Hormuz without permission.....See more pic.twitter.com/kvYfaniJeJ— INN Iran National News (@INNewx) March 27, 2026 -
‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్పైకి..
టెహ్రాన్: ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. వాటిని ఇజ్రాయెల్పైకి వదిలింది ఇరాన్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా ప్రెస్ టీవీతో పాటు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్ట్ చేశాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది క్షిపణులపై బ్లూ మార్కర్లతో “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి వాక్యాలు రాస్తున్నట్లు కనిపించింది. స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఇలాంటి సందేశాలే రాసినట్లు సమాచారం. ఇరాన్కు అనుకూలంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.దీన్ని “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4”లో భాగంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన చర్యగా ఇరాన్ నెట్వర్క్ ప్రెస్ టీవీ తెలిపింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో అష్డోడ్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, మోడీన్ సమీపంలోని సైనిక స్థావరాలు, అమెరికా సైనిక సమాచార మార్పిడి కేంద్రం ఉన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.అల్-ధఫ్రా, అల్-ఉదైరి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, అలాగే అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షేఖ్ ఈసా బేస్లపై దాడులు జరిగాయని పేర్కొంది. ఇరాన్, దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లను వినియోగించిందని, ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.భారత్కు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు?భారత్-ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరాన్ తాజాగా, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్ను స్నేహపూర్వక దేశంగా పేర్కొని, యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత నౌకలను అడ్డుకోబోమని చెప్పారు.మరొక కారణం ఏంటంటే, భారత ప్రజల నుంచి ఇరాన్కు మానవతా సాయం అందింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం నుంచి. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇరాన్కు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. నగదు, ఆభరణాలు, గృహ సంబంధిత వస్తువులు వంటి సాయం అందించారు. ఒక కశ్మీరీ మహిళ తన భర్త జ్ఞాపకంగా దాదాపు 3 దశాబ్దాలుగా దాచుకున్న బంగారాన్ని ఇచ్చేసింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ చర్యలను గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. Iran launches WAVE 83 missile AND drone attack on ‘Zionist soldiers’ — IRIBTHANK YOUS written on missiles in English to people across globe pic.twitter.com/wjjVietkAo— RT (@RT_com) March 26, 2026 -
చంపే లిస్ట్లోనుంచి వారిని తీసేసిన అమెరికా -ఇజ్రాయెల్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై కాలుదువ్విన సంగతి తెలిసిందే. అయితే మూడు వారాల యుద్ధం తర్వాత ఈ యుద్దం నుంచి అమెరికా కాస్త విరామం తీసుకుంది. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని, అందుకే యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల క్రితం ప్రకటించారు .అదే సమయంలో పశ్చిమాసియాలో శాంతి స్థాపన లక్ష్యం అంటూ యూటర్న్ తీసుకున్నారు ట్రంప్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్- ఇరాన్ల యుద్ధమైతే ఆగలేదు. ట్రంప్ ప్రకటనతో అమెరికా వెనక్కి తగ్గినా, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే ట్రంప్ను నమ్మడానికి వీలు లేదనే ఇరాన్ ప్రకటనను కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే అమెరికా దాడులు చేయకుండా ఆగిపోయి, ఇజ్రాయెల్తో యుద్ధం చేయిస్తుందనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంచితే, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధరీతిలో భాగంగా వారి హిట్ లిస్ట్లో నుంచి ఇద్దరు ఇరాన్ కీలక నేతల పేర్లను తొలగించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీతో పాటు పలువురు కీలన నేతలను, అధికారులను చంపేసిన ఆ ఇరు దేశాలు.. ఇప్పుడు తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్సాస్ అరగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘలిబాఫ్ పేర్లను హిట్ లిస్ట్ నుంచి తొలగించింది. ఇవే కారణాలు..వారిని అమెరికా-ఇజ్రాయెల్ హిట్ లిస్టులో నుంచి తొలగించడానికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు ఇరాన్తో చర్చలు అంటున్న అమెరికా.. ఇంకా మిగిలి ఉన్న ఇరాన్ నేతలను కూడా చంపేస్తే ఎవరితో చర్చలు జరుపుతారు అనే చర్చ వచ్చింది. ఇరాన్లోఅబ్బాస్ అరగ్చీతో పాటు స్పీకర్ ఘలిబాఫ్లు ప్రస్తుతం కీలక నేతలు. ఒకవైపు చర్చలు అంటూ వారి పేర్లను ఇంకా హిట్ లిస్ట్లోనే ఉంచితే తప్పుడు సంకేతం అవుతుందని వారి పేర్లను ఇజ్రాయెల్ తొలగించింది. అమెరికా ఆదేశాలతో వారి పేర్లను హిట్ లిస్ట్ జాబితా నుంచి తీసేసింది. పాక్ రాయబారం..!ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పాకిస్తాన్ ఆయా దేశాల మధ్య రాయబారం నడుపుతుంది. ఇరాన్తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్.. అందుకు పాక్ను ఎన్నుకున్నారు. ఇరాన్ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్.. ఇక పాక్ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్లో ట్రంప్ పడ్డారని, అందుకే ఇరాన్పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. ఆ క్రమంలోనే ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పేశారు. కానీ ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని, తమతో ఎవరూ చర్చలకు రాలేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ను తెరపైకి తీసుకొచ్చింది అమెరికా. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించే క్రమంలో ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్న అరగ్చీ, ఘలిబాఫ్ల పేర్లను తీసేయమని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.ఇరాన్.. పాక్ మాట వింటుందా..?ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్ మాట.. ఇరాన్ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనే చర్చ మొదలైంది. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. మరి ఆ విషయంలో అమెరికాను పాక్ ఎలా ఒప్పిస్తుందనేది మరొక ప్రశ్న. ప్రస్తుతానికి హిట్ లిస్టులో నుంచి వారి పేర్లను తొలగించారు కానీ చర్చలు సఫలం కాకపోతే మాత్రం మరొకసారి తీవ్రస్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటున్న సమయంలో మరి పరిస్థితి ఎటుపోతుందో అనే భయం కూడా ప్రపంచ దేశాల్లో ఉంది. -
‘యుద్ధంలోకి నాటో దిగాల్సిందే.. లేదంటే..’
ఇరాన్ యుద్ధం ప్రపంచ సంక్షోభంగా మారకముందే ఈ ఘర్షణను ముగించేందుకు అమెరికాతో నాటో కలవాలని పలువురు నిపుణులు అంటున్నారు. ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే సూచనలు కనపడుతుండడంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టు మారియో నాఫల్తో ఓ ఇంటర్వ్యూలో తాజాగా హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఆర్బాన్ మాట్లాడారు. ఆ దేశ ప్రధానిగా విక్టర్ 2010 నుంచి కొనసాగుతున్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు అమెరికాకు నాటో మద్దతు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఆలస్యం జరిగితే పెను సంక్షోభంగా మారి యూరప్తో పాటు ప్రపంచంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. హంగేరీ కూడా యూరప్ దేశమే.ఇరాన్ యుద్ధం విషయంలో, అలాగే గ్రీన్లాండ్పై ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో నాటోలో విభేదాలు కొనసాగుతున్న సమయంలో విక్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. “ఈ యుద్ధం త్వరగా ముగిస్తే విజయం, లేదంటే విపత్తు” అని విక్టర్ చెప్పారు.కాగా, యుద్ధం ప్రారంభమైనప్పుడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే.. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలను బహిరంగంగా ప్రశంసించారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను తగ్గించడంలో ఇది ముఖ్యమని చెప్పారు. సభ్య దేశాలు అమెరికా చర్యలకు సహకరించవచ్చని సూచించారు.అయితే, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్.. ఈ యుద్ధం యూరప్ యుద్ధం కాదని చెప్పారు. నాటో నేరుగా పాల్గొనడాన్ని తిరస్కరించారు.విక్టర్ ఆర్బాన్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ హింసాత్మక, యూదు వ్యతిరేక, స్వేచ్ఛా వ్యతిరేక నెట్వర్క్ కేంద్రంగా ఉంది. దాని మిలిటరీ సామర్థ్యాన్ని ధ్వంసం చేస్తే శాంతికి దోహదం చేసినట్లు అవుతుందని అన్నారు.9 కోట్ల జనాభా అస్థిరమైతే..అయితే ఇది త్వరగా సాధ్యం కాకపోతే మరింత పెద్ద, సంక్లిష్ట, దీర్ఘకాలిక యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధం ఇంధన ధరలను పెంచుతుందని, ఇరాన్ నుంచి యూరప్నకు వలసలను పెంచుతుందని చెప్పారు. 90 మిలియన్ల (9 కోట్ల) జనాభా ఉన్న ఇరాన్ అస్థిరమైతే.. టర్కీ, బాల్కన్ మార్గాల ద్వారా వలసలు హంగేరీ సరిహద్దులకు చేరుతాయని చెప్పారు. 2015లో జరిగిన యూరోపియన్ శరణార్థి సంక్షోభం సమయంలో 1.3 మిలియన్ మంది శరణార్థులు వచ్చిన పరిస్థితి ఇప్పటికే అనేక దేశాలను తీవ్రమైన సమస్యల్లోకి నెట్టిందని అన్నారు.సహజ వనరులు లేని హంగేరీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇంధన దిగుమతుల ఖర్చులు పెరగడంతో 10 బిలియన్ యూరోల ఆర్థిక నష్టం చవిచూసింది. హార్మూజ్ జలసంధి ఇష్యూ వల్ల మళ్లీ చమురు ధరలు పెరిగితే మరో దెబ్బ తగులుతుందని చెప్పారు. అమెరికాకు మద్దతు ఇవ్వాలని ఆర్బాన్ సూచించారు. అమెరికా చాలా ఏళ్లుగా యూరప్ భద్రతకు మద్దతు ఇచ్చిందని, అందుకే ఇప్పుడు యూఎస్కు సహకారం అందించడం అవసరమని చెప్పారు. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాస్త విరామం ఇచ్చినా, ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే, ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్లను పలు గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేశాలపై దాడులకు దిగిన ఇరాన్.. మరోసారి వారిని హెచ్చరించింది. తమతో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, అవి మానుకోవాలని సూచించింది. ఒకవేళ అలా కాకుండా తమపై దాడి చేసే వారికి మీ(గల్ఫ్ దేశాల్లోని) హోటళ్లలో ఉండేందుకు అవకాశం కల్పిస్తే మాత్రం మరోసారి తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్పై దాడి చేసిన స్థావరాలను విడిచిపెట్టిన చాలా మంది అమెరికా సైనికులు, ఐరోపా అంతటా ఉన్న హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లి, దూరంగా ఉంటూనే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉంది. మేం వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెబుతున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు. కాని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంచితే,. ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. ఇరాన్ ప్రధాన నావికా క్షిపణి, సముద్ర మైన్ల తయారీ కేంద్రంతో పాటు బాలిస్టిక్ క్షిపణి, వాయు రక్షణ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అదే సమయంలో ఇరాన్ సైతం దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్ వాయు రక్షణ దళం సమర్థవంతంగా అడ్డుకుంది. -
అంగరంగ వైభవంగా ప్రమాణం, కనిపించని మాజీ ప్రధాని
ర్యాపర్గా కెరీర్ ప్రారంభించి, అతి చిన్న వయసులోనే నేపాల్ రాజకీయాలను మలుపు తిప్పిన యువనేత బాలేంద్ర షా (Balen Shah)నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. శుక్రవారం నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అట్టహాసంగా, రాజకీయ సందడి నెలకొంది. ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేపాల్ రాజకీయ దిగ్గజాలు హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఒకరు మాత్రం గైర్హాజరు కావడం గమనార్హం.కేపీ శర్మ ఓలీ గైర్హాజరుఈ కార్యక్రమానికి పుష్ప కమల్ దహల్ “ప్రచండ”, మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖనాల్, , బాబురామ్ భట్టారాయ్లతో సహా పలువురు మాజీ ప్రధానమంత్రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి , తాత్కాలిక ప్రభుత్వ అధిపతి అయిన ఖిల్ రాజ్ రెగ్మీ కూడా హాజరయ్యారు. విదేశాలలో ఉన్నందున హాజరు కాలేకపోయిన నేపాలీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా కూడా ఈ సమావేశానికి హాజరుకాని వారిలో ముఖ్యమైనవారు.కా నీ మాజీ ప్రధానమంత్రి, యూఎంఎల్ ఛైర్మన్,కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యపరిచింది.ఇదీ చదవండి: బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!బోర్న్ లీడర్ బాలెన్ముగ్గురు తోబుట్టువులలో చిన్నవాడైన బాలేన్, అక్క బావ సుజాత , కౌశల్ షాల వద్ద పెరిగాడు. వారు అతనిలోని నాయకత్వ లక్షణాలను చిన్నప్పుడే గుర్తించారు. అందుకే అతను "బాలెన్ పుట్టుకతోనే నాయకుడు అంటారు. బాలెన్ మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి, అతను ఎల్లప్పుడూ దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నామనంటూ సుజాత, కౌశల్ దంపతులు అభిలషించారు. కానీ మొదట రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఆశ్చర్యం కలిగించింది. నాయకుడుగా బాలెన్ ఎదిగిన తీరు చూశాక తాము తీసుకున్న అత్యంత సరైన నిర్ణయమని ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ సుజాత ఆనందాన్ని వెలిబుచ్చారు. కాగా తన సొంత కంచుకోటలో ఓలీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు. నాలుగు సార్లు ప్రధాని అయిన ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం కారణంగా చెలరేగిన విస్తృత నిరసనల నేపథ్యంలో, ఓలీ 2025 సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!
ర్యాపర్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువకెరటం బాలేంద్ర షా (Balen Shah) నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. బాలెన్గా పాపులర్ అయిన బాలేంద్రషా గత ఏడాది జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోనిపార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. 1999 తర్వాత తొలిసారిగా ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించింది కూడా బాలేంద్రనే. దీంతో దశాబ్దాల కాలం తర్వాత భారత్ సరిహద్దుల్లోని దక్షిణ మైదాన ప్రాంతానికి చెందిన 'మధేసీ' వ్యక్తి నేపాల్ పగ్గాలు చేపట్టడం ఒక విశేషంఅవినీతి రహిత పాలన కోరుతూ గత ఏడాది జరిగిన జెన్ జెడ్ విప్లవం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో, నేపాల్ సంప్రదాయ పార్టీలను చిత్తుగా ఓడించాడు ఖాఠ్మండు మాజీ మేయర్ బాలేన్. మార్చి 5న జరిగిన ఈ ఎన్నికల్లో బాలేన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ 182 సీట్లు (మొత్తం 275లో) సాధించి రికార్డు సృష్టించింది. దీంతో 35 ఏళ్ల వయసులో నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ఖాట్మండులోని 'శీతల్ నివాస్'లో ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ సమక్షంలో బాలేన్ షా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Kathmandu: Rastriya Swatantra Party (RSP) leader Balendra Shah takes oath as Prime Minister of NepalVideo source: Nepal Television/YouTube pic.twitter.com/Th6NxTZWwm— ANI (@ANI) March 27, 2026చారిత్రాత్మక విజయం ప్రమాణ స్వీకారం పూజారుల వేద మంత్రాలమధ్య ఎర్రని వస్త్రాలు ధరించిన బౌద్ధ సన్యాసుల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణ స్వీకారం చేయించారు. బాలేంద్ర షా తన మార్కు స్టైల్ స్కిన్-టైట్ ప్యాంటు, మ్యాచింగ్ జాకెట్,నల్ల కళ్లజోడు ధరించి దేశం, ప్రజల తరఫున, రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని, ప్రధానమంత్రిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు బాలేన్ షా. నేపాల్ చరిత్రలో మధేసీ ప్రాంతానికి చెందిన వ్యక్తి తొలి ప్రధాని కావడంతో దేశంలోని మధేసీ ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేసింది.మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి షాక్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ర్యాపర్గా పాపులర్ అయిన బాలేన్ రాజకీయ ఆరంగేట్రం2022లో జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖాట్మండు మేయర్గా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని సుమారు 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించడం విశేషం. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కేవలం 38 స్థానాలతో పరిమితమూ రెండో స్థానానికి పడిపోయింది. జెన్ జెడ్ ఆందోళనల తర్వాత రాజీనామా చేయవలసి వచ్చిన ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) 25 సీట్లను గెల్చుకుంది. ముందున్న సవాళ్లు3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఉద్యోగాల కొరత, పాతుకుపోయిన అవినీతి కారణంగా యువత నేతృత్వంలోని నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జనాభాలో ఐదవ వంతు మంది పేదరికంలో జీవిస్తుండగా, ప్రతిరోజూ సుమారు 1,500 మంది పని కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. దేశంలో రాజకీయ అస్థిరత కూడా ఒక శాపంగా మారింది. 1990 నుండి 32 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా, వాటిలో ఏదీ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు.సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవడం , క్షేత్రస్థాయిలో అవినీతిపై పోరాటమే కీలకమైన బలంగా అధికారంలోకి వచ్చిన బాలేన్ ముందు అస్థిరతను తొలగించడం, ఉద్యోగాల కల్పన, అవినీతి నిర్మూలన లాంటి అనేక సవాళ్లను ఏ మేరకు అధిగమించగలడు అనేది కాలమే చెప్పాలి. -
అమెరికా సంచలన నిర్ణయం!
వాషింగ్టన్: అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, అమెరికా ట్రెజరీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇకపై ముద్రించనున్న అన్ని కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనున్నట్లు వెల్లడించింది. దీంతో 165 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికినట్టైంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ‘చారిత్రాత్మక సంస్కరణ’గా అభివర్ణించింది. ఇప్పటివరకు అమెరికా కరెన్సీపై ట్రెజరర్, ట్రెజరీ సెక్రటరీ సంతకాలు మాత్రమే ఉండేవి. అధ్యక్షుడి సంతకం నేరుగా నోట్లపై ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.ట్రెజరీ శాఖ ప్రకటన ప్రకారం.. కొత్త డిజైన్తో విడుదలయ్యే నోట్లపై ట్రంప్ సంతకం 2026 చివరి త్రైమాసికం నుంచి కనిపించనుంది. ఈ మార్పు అమెరికా కరెన్సీకి ‘జాతీయ గుర్తింపు,నాయకత్వ ప్రతీక’గా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, విమర్శకులు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయీకరణగా అభివర్ణిస్తూ, కరెన్సీ వ్యవస్థను అధ్యక్షుడి వ్యక్తిగత బ్రాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.అమెరికా చరిత్రలో కరెన్సీ డిజైన్ మార్పులు చాలా అరుదుగా జరుగుతాయి. ముఖ్యంగా సంతకాల విషయంలో 1861 నుంచి కొనసాగుతున్న విధానాన్ని మార్చడం పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ మార్పు అమెరికా కరెన్సీపై ప్రజల దృష్టిని మరింత ఆకర్షించవచ్చు. దీనికి రాజకీయ ప్రభావం కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.ట్రంప్ సంతకం ఉన్న నోట్లను ప్రజలు ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటారన్న దానిపై ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు. కానీ కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమైనట్లు ట్రెజరీ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం అమెరికా కరెన్సీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా భావిస్తున్నారు. -
అమెరికాకు నరకం అంటే ఏంటో చూపిస్తాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని అమెరికాకు హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నీమ్.. ‘ఇరాన్లో లక్ష మందికిపైగా అమెరికాతో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. బసిజ్, ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, ఆర్మీ నిర్వహిస్తున్న కేంద్రాల్లో యువకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే వారికి నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.’ అని నివేదించింది. అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వ పాలనపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు సాధించింది.ఈ క్రమంలో ఇరాన్లో అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో దేశం తన న్యూక్లియర్ విధానాన్ని కఠినతరం చేయాలని ఐఆర్జీసీలోని ప్రముఖులు బహిరంగంగా ఒత్తిడి పెంచుతున్నారు. అధికారికంగా ఇరాన్ ఇంకా అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నప్పటికీ.. ఇరాన్లోని రాజకీయ, సైనిక వర్గాల్లో అణ్వస్త్రాల వైపు వెళ్లాలా? అనే ప్రశ్న ఇప్పటివరకు లేనంతగా బలంగా, బహిరంగంగా చర్చకు వస్తోంది. అంటే అణు విధానంలో కఠిన మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని తస్నీమ్ తెలిపింది. అమెరికా సైనిక కదలికలుఅమెరికా 82వ ఎయిర్బోర్న్ డివిజన్ దళాలు త్వరలో పశ్చిమాసియా భూభాగంలోకి అడుగు పెట్టనున్నాయి. ఇప్పటికే వేలాది మంది సైనికులు మెరైన్లతో అక్కడికి చేరారు. ఈ కదలికలు ఇరు దేశాల మధ్య భూతల దాడులు సంభవించే అవకాశాలను మరింత బలపరుస్తున్నాయి.ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించేలా ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ ఖండించింది. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. -
250 మంది విద్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్
పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది. సౌదీ అరేబియా గగనతంలోకి ప్రవేశించాక సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానం మళ్లీ ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చిందని ఎయిర్ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. గతవారం రోజుల వ్యవధిలో ఎయిర్ఇండియా విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవడం ఇది రెండోసారి. ‘‘గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏ350–900 రకం వీటీ–జేఆర్ఎఫ్ సిరీస్ ఎయిర్ఇండియా విమానం లండన్కు బయల్దేరింది. నాలుగు గంటల్లో 3,300 కిలోమీటర్లు ప్రయాణించి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించింది. అప్పుడు విమానంలో కొన్ని శబ్దాలు పెద్దగా విని్పంచాయి. దీంతో ముందుజాగ్రత్తగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముందుకు, వెనక్కి అలా మొత్తంగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ అయింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారు. ఘటనపై సాంకేతిక బృందం సమగ్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తవడానికి మరింత సమయం పడుతుంది’’అని అధికార ప్రతినిధి వివరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ఇదే విమానం సరిగ్గా 11 రోజుల క్రితం న్యూయార్క్లోని జాన్ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ మార్గమధ్యంలో సాంకేతికసమస్యల బారినపడింది. దీంతో గమ్యస్థానం ఢిల్లీకి బదులుగా మధ్యలోనే ఐర్లాండ్లోని షానన్ నగరంలో ల్యాండ్ అయింది. ఏ350–900 రకం విమానాలను గత ఏడాది జనవరి నుంచి ఎయిర్ఇండియా నడుపుతోంది. గత వారం ఢిల్లీ నుంచి బయల్దేరి కెనడాలోని వాంకోవర్కు చేరుకోవాల్సిన ఎయిర్ఇండియా విమానం చైనా గగనతలంలోకి చేరుకోగానే సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ ఢిల్లీకే తిరిగిరావడం తెల్సిందే. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
ఇక భీకర యుద్ధమే!
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరుపక్షాలు తమ వైఖరి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హార్మూజ్పై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. జలసంధి గుండా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి దారి సుంకం(టోల్ ఫీజు) వసూలు చేస్తోంది. కనీసం రెండు నౌకలు చైనా కరెన్సీ యువాన్లలో ఇరాన్కు చెల్లింపులు చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. పార్లమెంట్లో ఆమోదం పొంది టోల్ వసూలును అధికారం చేయబోతున్నట్లు సమాచారం. నౌకలు క్షేమంగా జలసంధిని దాటాలంటే రుసుము చెల్లించక తప్పదని ఇరాన్ అధికారులు అంటున్నారు. హార్మూజ్లో ఇరాన్ టోల్ బూత్ తెరిచినట్లు ఆరు గల్ఫ్ అరబ్ దేశాల కూటమి అయిన గల్ఫ్ సహకార మండలి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అల్–బుదైవీ నిర్ధారించారు. నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే హార్మూజ్ నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గల్ఫ్లో క్షిపణుల మోత మరోవైపు యుద్ధం గురువారం 27వ రోజుకు చేరుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్సైతం ప్రతీకార దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ సైనిక స్థావరాలకు కేంద్రమైన ఇస్పహాన్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరి అంతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. యుద్ధంలో ఉమ్మడి లక్ష్య సాధన విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయానికి ఈ ఆపరేషన్ మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోనూ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఇజ్రాయెల్లోని నహరియా ఏరియాలో ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు తెలిసింది. మరో ఏడుగురు గాయపడినట్లు సమాచారం. ఇరాన్లోనూ మృతుల సంఖ్య పెరుగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటిదాకా 1,900 మందికిపైగా మరణించినట్లు ఇరాన్ మంత్రి అలీ జఫారియన్ చెప్పారు. ఇజ్రాయెల్లో 18 మంది, లెబనాన్లో ముగ్గురు ఇజ్రాయెల్ జవాన్లు, 1,100 మంది సాధారణ ప్రజలు, గల్ఫ్ దేశాల్లో 13 మంది అమెరికా సైనికులు మృతిచెందారు. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లను ఖతం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని అక్కడికి తరలిస్తోంది. భారతీయుడు సహా ఇద్దరి బలి అబూదాబీపై ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. యూఈఏ గగనతల వ్యవస్థ వాటిని గాల్లోనే నిర్వీర్యం చేసే క్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్షిపణుల శకలాలు నేలకూలి మంటలు చెలరేగడంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు మరణించారు. మరో భారతీయు డు సహా ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందిన రెండో వ్యక్తిని పాకిస్తాన్ జాతీయుడిగా గుర్తించారు. పశ్చిమాసియా యుద్ధంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. 169 మంది గాయపడ్డారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అబూ దాబీ రక్షణ శాఖ ప్రకటించింది. ఇరాన్లో 10 వేల టార్గెట్లపై దాడులు ఇరాన్లో ఇప్పటిదాకా 10 వేలకుపైగా టార్గెట్లపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఇజ్రాయెల్తో కలిసి మరిన్ని లక్ష్యాలపై గురి పెడతామని అన్నారు. కచ్చితత్వంతో కూడిన దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థపై పైచేయి సాధిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నావికాదళంలో 92 శాతం భారీ నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. యూఎస్ఎస్ ట్రిపోలి సహా పలు నౌకలు పశ్చిమాసియా సమీపానికి చేరుకుంటున్నాయి. వీటిలో 2,500 మంది జవాన్లు ఉన్నారు. అలాగే 1,000 మంది పారాట్రూపర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. సంధానకర్తగా పని చేస్తున్నాం: పాక్ పశ్చిమాసియాలో సంక్షోభ పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ చెప్పారు. యుద్ధానికి తెరదించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తాము సంధానకర్తగా పని చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ఒక దేశం సందేశాన్ని మరో దేశానికి చేరవేస్తున్నామని పేర్కొన్నారు. శాంతి సాధన విషయంలో తుర్కియే, ఈజిప్టు కూడా తమకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.అంచెలంచెలుగా ఉన్నతస్థాయికిఅలీ రెజా తంగ్సిరి మృతితో ఇరాన్కు భారీ నష్టం జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత శక్తివంతమైన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నావికాదళం చీఫ్ అలీ రెజా తంగ్సిరి మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్లోని తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్లో వైమానిక దాడుల్లో తంగ్సిరితోపాటు ఐఆర్జీసీకి చెందిన ఇతర సీనియర్ నావల్ కమాండర్లు కూడా హతమైనట్లు తెలిపారు. అయితే, దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. హార్మూజ్ జలసంధి మూసివేతను తంగ్సిరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాంటి కీలక అధికారి మృతిచెందడం ఇరాన్కు భారీ నష్టంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తంగ్సిరి దక్షిణ ఇరాన్లోని బుషెహర్ ప్రావిన్స్లో 1962లో జన్మింంచారు. 1980వ దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇరాన్ సైన్యంలో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. 2010 నుంచి 2018 దాకా ఐఆర్జీసీ నేవీ డిప్యూటీ కమాండర్గా పనిచేశారు. అనంతరం ఈ దళం అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అక్కడ విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ఇదంతా తంగ్సిరి నేతృత్వంలోనే జరిగింది. ఇజ్రాయెలీలు యూదులని, అమెరికన్లు క్రైస్తవులని, వారు తమకు మిత్రులు కాదని మత గ్రంథం ఖురాన్ బోధిస్తోందని ఒక సందర్భంలో తంగ్సిరి వ్యాఖ్యానించారు. యుద్ధంలో ఇరాన్ కీలక నేతలు, అధికారులు ఒక్కొక్కరుగా మరణిస్తుండడం ఆ దేశానికి నష్టదాయకంగా పరిణమించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఐఆర్జీసీ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ తదితరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. తంగ్సిరి చేతులకు చాలా రక్తం అంటింది: నెతన్యాహు అలీ రెజా తంగ్సిరి మృతిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ధ్రువీకరించారు. ఈ మేరకు వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. బుధవారం రాత్రి ఐఆర్జీసీ నేవీ కమాండర్ తంగ్సిరిని అంతం చేసినట్లు తెలిపారు. అతడి చేతులకు చాలా రక్తం అంటిందని, హార్మూజ్ జలసంధిని మూసివేయడానికి నాయకత్వం వహించింది కూడా అతడేనని తేల్చిచెప్పారు. ఇరాన్ నేతలు, అధికారులే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ ఉగ్రవాద పాలనపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒప్పందం కోసం ఇరాన్ బతిమాలుతోంది: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ రెండో మాటకు తావులేకుండా తిరస్కరించింది. దీనిపై ట్రంప్ గురువారం స్పందించారు. ఒప్పందం కోసం ఇరాన్ తమను బతిమాలుతోందని అన్నారు. చర్చల కోసం తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై జరిగే చర్చలను సీరియస్గా తీసుకోవాలని టెహ్రాన్కు సూచించారు. ఇరాన్ ఒక బహుమతి ఇచ్చిందని ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ బహుమతి ఏమిటన్నది ఇప్పుడు బయటపెట్టారు. 10 చమురు నౌకలు హార్మూజ్ గుండా వెళ్లడానికి ఇరాన్ అనుమతి ఇచ్చిందని చెప్పారు. చర్చల విషయంలో ఇదొక సానుకూల ముందడుగు అని అభివరి్ణంచారు. అనుమతి పొందిన నౌకలు పాకిస్తాన్కు చెందినవిగా ట్రంప్ సంకేతాలిచ్చారు. తదుపరి సుప్రీంలీడర్గా ఉండాలంటూ ఇరాన్ తనను వేడుకుందని, అందుకు తిరస్కరించానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ పదవి తనకు ఇష్టం లేదన్నారు. -
ఇరాన్పై దాడులకు నాటో చీఫ్ పూర్తి మద్దతు
ఇరాన్పై దాడులకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలను బహిరంగంగా సమర్థించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలతో ఐరోపా భద్రతకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నాటోపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాటో కార్యదర్శి జనరల్ మార్క్ రుట్టే ప్రతిస్పందిస్తూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంలో కూటమి పాత్రను సమర్థించారు. ఆ ప్రాంతంలో ఇటీవల చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారు.రుట్టే తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం సమయంలో టర్కీ వైపు దూసుకెళ్తున్న మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో అడ్డుకుంది. అంతేకాదు, హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్టు తర్వాత వచ్చాయి. ట్రంప్ నాటోను విమర్శిస్తూ ఇరాన్తో జరుగుతున్న యుద్ధంతో తమకు మద్దతు ఇవ్వకపోవడాన్ని అమెరికా మర్చిపోదని చెప్పారు.


