breaking news
International
-
మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!
ప్రపంచానికి తానే పోలీసోడినని.. జడ్జినని ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అనుకుంటోందా?. అందుకే వేరే దేశాల్లోకి చొరబడి మరీ అధినేతలను ఎత్తుకొస్తోందా?. నిన్న వెనెజులా?.. రేపు మరో దేశానికి ఈ పరిస్థితి రాకుండా ఉంటుందా?.. ఇలాంటి ప్రశ్నలతో కూడిన చర్చ నడుస్తోంది ఇప్పుడు. మొన్నటిదాకా అధ్యక్ష హోదాలో గౌరవం అందుకున్న నికొలస్ మదురో.. ఇప్పుడు ఈ భూమ్మీద నరకంగా పేరున్న న్యూయార్క్ బ్రూక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి బయటపడే మార్గం ఉందా?.. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్పై ‘నార్కో-టెర్రరిజం’ కేసు నమోదు చేసింది అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి, మెషీన్ గన్స్, విధ్వంసకర ఆయుధాలను కలిగి ఉండటం వంటి అభియోగాలను మోపారు. డ్రగ్స్ రవాణా కోసం కిడ్నాప్లు, వాళ్లపై దాడులు చేయడంవంటి కేసులనూ పెట్టారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో వారిని హింసించేవారని అదనపు అభియోగాలు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన బయటపడే మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మదురో ముందున్న అమెరికా కోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకోవడం.. ఇది అత్యంత కఠినమైన మార్గం. ఎందుకంటే అది అమెరికా ఫెడరల్ కోర్టు. పైగా ట్రంప్ ప్రభుత్వం ఎలాగైనా సరే బలమైన సాక్ష్యాలు సమర్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో.. ఆయన నేరం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోవడం చాలా కష్టమే. అయితే మరణశిక్ష పడకపోవచ్చని.. అమెరికా చట్టాల ప్రకారం జీవితఖైదే పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండోది.. కుదిరితే రాజకీయ ఒత్తిళ్లు కుదరకుంటే దౌత్య చర్చలు. వెనెజులా తాత్కాలిక ప్రభుత్వం లేదంటే దాని మిత్రదేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి మదురో విడుదల కోసం ప్రయత్నించవచ్చు. మూడోది ప్రత్యేక ఒప్పందం (deal). అమెరికా-వెనెజులా మధ్య ఏదైనా రాజకీయ లేదంటే వ్యూహాత్మక ఒప్పందం కుదరడం. అప్పుడు ఆయన విడుదలకు అవకాశం ఉంటుంది. మూడు ఆప్షన్లలో మూడో దానికే ఎక్కువ ఆస్కారం ఉండొచ్చని విశ్లేషకులూ చెబుతున్నారు. మదురోకు అత్యంత విశ్వసనీయురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ ప్రస్తుతానికి వెనెజులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆమెకు అమెరికా చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో, అలాగే వాల్స్ట్రీట్తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తల్చుకుంటే డీల్ కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముమ్మాటికీ అక్రమ అరెస్టే!ఎక్స్ట్రాడిషన్ అనేది ఒక దేశం నుండి మరొక దేశానికి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అప్పగించే చట్టపరమైన ప్రక్రియ. ఒక దేశాధినేతను మరొక దేశం సైనిక చర్య ద్వారా పట్టుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అయితే అమెరికా దృష్టిలో ఇది తమ దేశానికి సంబంధించిన భద్రతా చర్య. ఇదే విషయంపై ఫెడరల్ కోర్టుల్లో ట్రంప్ సర్కార్ వాదనలు వినిపించొచ్చు. కానీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది ఆ దేశ సార్వభౌమాధికార ఉల్లంఘన.. అక్రమ అరెస్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు . మదురో అక్రమ అరెస్ట్కు మద్దతు కంటే ఆందోళనే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. అమెరికా చర్యను యూరోపియన్ యూనియన్ ఖండించింది. ఛాథమ్ హౌస్ (UK Think Tank).. ఇలాంటి చర్యలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అమెరికా సైనిక చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది. అయితే.. యూఎన్ చార్టర్ ప్రకారం ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్య తీసుకోవడానికి భద్రతా మండలి అనుమతి అవసరం. కానీ, ట్రంప్ అలాంటి అనుమతులు తీసుకోకుండానే వెనెజులా అధ్యక్షుడిని బంధించారు. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి. అదే సమయంలో.. ఇవాళ జరగబోయే అత్యవసర సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా చట్టసభలోనూ..అటు అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్లోనూ).. ఈ అక్రమ అరెస్ట్ చట్టబద్ధతపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా పడవలపై దాడులు చేయడాన్ని డెమొక్రట్లతో పాటు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లూ ఖండించారు. ఇప్పుడు వాళ్లకు తెలియకుండా ఆ దేశంపై విరుచుకుపడటం, అధ్యక్షుడిని తీసుకురావడంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆపరేషన్ను కోర్టుల్లోనూ తేల్చుకునే అవకాశం లేకపోలేదు.ఐసీజేలో..అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో తనంతట తానుగా జోక్యం చేసుకోదు. వెనెజులాగానీ ఏదైనా ఇతర దేశాలుగానీ అమెరికా చర్యపై అధికారికంగా కేసు వేస్తే విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మదురో అరెస్ట్ అమెరికాతో పాటు అంతర్జాతీయ భద్రత కోసం అవసరం అని వాదించే అవకాశం లేకపోలేదు. -
హమాస్కు కోలుకోలేని షాక్.. వీడియో వైరల్
గాజా సిటీ: ఉత్తర గాజాలో హమాస్ ఉగ్రవాద నెట్వర్క్ను నిర్మూలించే లక్ష్యంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎప్) తన ఆపరేషన్ను మరింత ముమ్మరం చేసింది. వ్యూహాత్మక ప్రాంతమైన ‘ఎల్లో లైన్’ వెంబడి ఐడీఎఫ్ దళాలు భారీ స్థాయిలో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం మరో విజయం సాధించింది.ఈ ఆపరేషన్లో భాగంగా తాజాగా భూగర్భంలోని రహస్య హమాస్ నెట్వర్క్ను ఐడీఎఫ్ ఛేదించింది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగ మార్గాన్ని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. దీనిని హమాస్ తన కార్యకలాపాలకు, ఆయుధాల తరలింపునకు ఉగ్రవాదుల ఆశ్రయం కోసం ఉపయోగిస్తున్నట్లు సైనిక వర్గాలు ధృవీకరించాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ సొరంగం విస్తృతిని అంచనా వేసిన ఇజ్రాయెల్ దళాలు దానిని ధ్వంసం చేసే ప్రక్రియను చేపట్టాయి. Hamas thought they were safe underground. Not anymore.The IDF just took out 2km of terror tunnels in northern Gaza. pic.twitter.com/yTWECZ7rpm— Hananya Naftali (@HananyaNaftali) January 4, 2026ఎల్లో లైన్ వెంట జరుగుతున్న ఈ ఆపరేషన్ కేవలం భూగర్భానికే పరిమితం కాలేదు. ఉపరితలంపైన, భూగర్భంలో ఉన్న అన్ని రకాల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను విడతల వారీగా అధికారులు తొలగిస్తున్నారు. హమాస్ స్థావరాలను, ఆయుధ డిపోలను, కమ్యూనికేషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఉత్తర గాజాలో ఉగ్రవాదులపై నియంత్రణ సాధించడం అత్యంత కీలకమని సైనిక నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం కొనసాగుతున్న ఈ క్లీనింగ్ ఆపరేషన్ ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఎల్లో లైన్ వెంబడి ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఉగ్రవాదులు మళ్లీ ప్రవేశించకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఐడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ భారీ సొరంగం విధ్వంసం హమాస్ సామర్థ్యంపై భారీ దెబ్బ అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: అమెరికాలో ‘అహింసా మంత్రం’ -
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తన్నాడు. ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది భారత్లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే కిషోర్ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
అమెరికాలో ‘అహింసా మంత్రం’
‘‘రెండు యుద్ధాల మధ్య విరామమే... శాంతి’’.. అప్పుడెప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్ దౌత్యవేత్త జార్జ్ క్లెమెన్స్కూ అన్నాడట. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూండగానే ఇజ్రాయెల్ - గాజాపై దాడులకు తెగబడటం.. ఇంతలోనే ఇరాన్ - అమెరికా, అమెరికా -వెనిజులాల మధ్య తరచూ ఘర్షణలు, మినీ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మాట వాస్తవమే అనిపిస్తుంది. అయితే.. శాంతి అనేది రెండు యుద్ధాల మధ్య విరామ సమయంగా కాకుండా... శాశ్వతంగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ... అమెరికాలో ఇప్పుడో నిశ్శబ్ధ విప్లవం మొదలైంది. ప్రేమ, శాంతి సందేశాలతో మానవాళిని ఏకం చేసేందుకు మరో మహా ప్రయత్నం మొదలైంది. ‘వాక్ ఫర్ పీస్’ పేరుతో సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేస్తూ అమెరికా పొడవునా ఒక శాంతి ప్రదర్శన మొదలైంది. పోరు నష్టాలు, మనిషి కష్టాలతో చలించిపోయి సర్వం పరిత్యజించి ప్రపంచానికి శాంతి సందేశాన్ని వినిపించిన బుద్ధుడి అనునాయిలు సుమారు 19 మంది ఈ మహా ప్రయత్నానికి నేతృత్వం వహిస్తూండటం... ప్రపంచానికి పెద్దన్నలా అందరిపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించే అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతూండటం సహజంగానే ఆసక్తికరంగా మారింది. 2025, అక్టోబర్ 26న టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో ప్రారంభమైన ఈ యాత్ర కనీసం పది రాష్ట్రాల గుండా సుమారు 2300 మైళ్ల దూరం కొనసాగనుంది. మొత్తం 120 రోజులపాటు జరిగే ఈ శాంతి యాత్ర ఈ ఏడాది ఫ్రిబవరిలో వాషింగ్టన్లో ముగియనుంది. ఇప్పటికే హ్యూస్టన్లోని హాంగ్కాంగ్ సిటీ మాల్లో ఘన స్వాగతం అందుకున్న బౌద్ధ సన్యాసుల బృందం, జార్జియాలోని షార్ప్స్బర్గ్, పీచ్ట్రీ సిటీ, ఫయేట్విల్లే వంటి నగరాల గుండా ప్రయాణిస్తూ శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తోంది. ఈ పాదయాత్రలో అందరి దృష్టిని ఆకర్శిస్తున్న విషయం మరోటి ఉంది. అదే ‘అలోక’. భారతదేశంలో పుట్టి అమెరికా చేరిన ఈ శూనకమిప్పుడు ‘పీస్ డాగ్’గా ప్రపంచం మన్ననలు పొందుతోంది. సన్యాసులతో కలిసి అడుగులు వేస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో బౌద్ధ సన్యాసులు బుద్ధుని బోధనల స్ఫూర్తితో, అపారమైన సహనంతో యాత్రను కొనసాగిస్తున్నారు. దారిపొడవునా అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు వారికి ఘన స్వాగతం పలుకుతూ, భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. శాంతి అంటే నినాదం కాదని, అది ఒక జీవన విధానం అని వారు చెబుతున్నారు. జీవితంలో కరుణను పంచుతూ, ద్వేషాన్ని వీడనాడాలని బౌద్ధ సన్యాసులు పిలుపునిస్తున్నారు. -
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు ఫ్లాట్లో శవమై కనిపించింది. మేరీల్యాండ్లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం యూఎస్ పోలీసులు గాలిస్తున్నారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్శర్మ ఫ్లాట్లో ఆమె డిసెంబర్ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అర్జున్ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్ శర్మ భారత్కు వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్కు వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. అర్జున్ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది. -
భారత్ నన్ను సంతోష పెట్టాలనుకుంటోంది: ట్రంప్
రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తూ ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు సమస్యను పరిష్కరించడంలో భారత్ సహాయం చేయకపోతే ప్రస్తుతం ఉన్న సుంకాలను పెంచే అవకాశం ఉందని ట్రంప్ మరొకసారి హెచ్చరించారు.భారత్తో వాణిజ్య లావాదేవీలపై సుంకాలను పెంచుతామన్నారు. ‘ భారత్ నన్ను సంతోష పెట్టాలనుకుంటోంది. భారత్ ప్రధాని నరేందర మోదీ చాలా మంచి వ్యక్తి.. ఉన్నతమైన వ్యక్తి. భారత్ వైఖరి పట్ల నేను సంతోషంగా లేననే విషయం మోదీకి తెలుసు’ అంటూ పేర్కొన్నారు.#WATCH | On India’s Russian oil imports, US President Donald J Trump says, "... They wanted to make me happy, basically... PM Modi's a very good man. He's a good guy. He knew I was not happy. It was important to make me happy. They do trade, and we can raise tariffs on them very… pic.twitter.com/ANNdO36CZI— ANI (@ANI) January 5, 2026 కాగా, భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు ట్రంప్. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంతో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను పలుమార్లు హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై మాట్లాడారు.. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్పై సుంకాల విధింపుల పెంపుతో తన అక్కసు తీర్చుకుంటున్నారు. మరొకసారి భారత్పై వాణిజ్య సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఒకవైపు మోదీ మంచి వ్యక్తి అంటూనే రష్యా చమురును ఆపకపోతే భారత్ మరొకసారి భారీగా తాము విధించే సుంకాల విధింపును ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. -
ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం
యాషెస్ ఐదో టెస్ట్ సందర్భంగా.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భావోద్వేగ క్షణాలు కనిపించాయి. బాండీ బీచ్ హీరోలకు మైదానంలో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తన ప్రాణాలను పణంగా పెట్టి అనేక మంది ప్రాణాలను రక్షించిన బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్ అహ్మద్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో (SCG) బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్-అహ్మద్, ఇతరులకు ఘనమైన స్వాగతం లభించింది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఈ రియల్ హీరోకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అహ్మద్తో పాటు ఘటనలో ఇద్దరు చిన్నారులను కాపాడి గాయపడ్డ చాయా డాడోన్ కూడా వచ్చింది. ఆమె కాలికి బుల్లెట్ గాయం కావడంతో స్ట్రెచ్చర్ సాయంతో వచ్చారు. అలాగే ఘటన సమయంలో తక్షణమే స్పందించిన(ఫస్ట్రెస్పాండర్స్) వైద్యులు, పోలీసు అధికారులు అందరినీ ప్రత్యేకంగా గౌరవించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్లు ఇంగ్లండ్ ప్లేయర్స్తో కలిసి బౌండరీ వద్ద నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ వీరులంతా మైదానంలోకి వచ్చిన సమయంలో అంతా లేచి నిలబడ్డారు. చప్పట్లతో స్టేడియం మొత్తం మారుమోగించారు. బాండీ బీచ్ ఘటనలో మరణించిన 15 మంది బాధితుల పేర్లను.. మిమ్మల్ని మరువబోం (forever in our hearts)అనే పదాలతో ప్రదర్శించారు. ఆ సమయంలో ప్లేయర్లు సహా పలువురు కంటతడి పెట్టారు.The SCG rises as one to acknowledge the first responders and community heroes who bravely acted during the Bondi attack 🙏 pic.twitter.com/HUl7M34Lcx— 7Cricket (@7Cricket) January 3, 2026గ్రౌండ్ మధ్యలోకి వచ్చాక తన గుండెలపై చేయి ఉంచుకుని.. ఆపై పైకి ప్రదర్శించాడు. ఆ సమయంలో స్టేడియంలో చప్పట్లు మరింత బిగ్గరగా వినిపించాయి. జాతీయ గీతం ఆలాపన జరిగాక.. క్రికెట్ పెద్దలు, ఆటగాళ్లు ఆ వీరులతో చేతులు కలిపారు. అహ్మద్ను ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా ప్రత్యేకంగా అభినందించడం అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది.సిరియాలో పట్టి.. ఆస్ట్రేలియాకు వలస వచ్చిన అహ్మద్ అల్ అహ్మద్(43).. డిసెంబర్ 14న సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి ఘటనలో సూపర్ హీరోగా నిలిచారు. లంచ్ చేస్తున్న సమయంలో తుపాకుల మోత విన్న ఆయన.. ధైర్యం చేసి ముందుకు దూకారు. కాల్పులు జరుపుతున్న సాజిద్ అక్రమ్పైకి దూకి గన్ లాక్కుని నిలువరించారు. ఆ సమయంలో మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ జరిపిన కాల్పుల్లో కాలికి, భుజానికి తూటాలు తగిలి అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటికే భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది. సకాలంలో చికిత్స అందడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ హీరో కోసం జరిపిన ఫండ్ రైజింగ్కు అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అహ్మద్ను పరామర్శించారు. స్థానికురాలైన చాయా డాడోన్ కాల్పులు జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలకు అడ్డుగా నిలబడింది. దీంతో ఆమె కాలికి గాయాలయ్యాయి. ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియా ప్రభుత్వం వీరులుగా గుర్తించింది. -
ట్రంప్ స్నేహితురాలి పోస్ట్ కలకలం.. గ్రీన్ లాండ్కు గ్రీన్ స్నిగ్నల్?
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు గ్రీన్ లాండ్ భవిష్యత్తు దిశగా కదులుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేటీ మిల్లర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.గ్రీన్ లాండ్ భూభాగాన్ని అమెరికా జెండాతో కప్పేసిన మ్యాప్ను షేర్ చేసిన కేటీ మిల్లర్ దానికి ‘త్వరలో’ (Soon) అనే క్యాప్షన్ను జోడించారు. వెనెజువెలాపై అమెరికా దాడుల నేపథ్యంలో, ట్రంప్ సర్కార్ తదుపరి లక్ష్యం గ్రీన్ లాండ్ భూభాగమేనన్న సంకేతాలను ఈ పోస్ట్ మరింత బలపరుస్తోంది. కాగా కేటీ మిల్లర్ పోస్ట్పై డెన్మార్క్ రాయబారి జెస్పర్ మోలర్ సోరెన్సెన్ స్పందించారు. అమెరికా, డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి రక్షణ, స్నేహపూర్వక సంబంధాలను ఆయన గుర్తు చేశారు.గ్రీన్ లాండ్ ఇప్పటికే నాటో (నాటో)లో భాగమని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని జెస్పర్ మోలర్ సోరెన్సెన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతలో గ్రీన్ లాండ్, డెన్మార్క్ల పాత్ర కీలకమని చెబుతూనే, ఆయన ఆ రెండు దేశాలు పరస్పరం గౌరవించుకుంటూ, మిత్రదేశాలుగా మెలగాలని సూచించారు. ఇదే సమయంలో గ్రీన్ లాండ్ ప్రీమియర్ జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.కేటీ మిల్లర్ షేర్ చేసిన ఫొటోపై విస్మయం వ్యక్తం చేస్తూ, గ్రీన్ లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకానికి సిద్ధంగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా సోషల్ మీడియా పోస్టులు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేవని, అయితే ఇలాంటి చర్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికన దేశాల మధ్య సంబంధాలు ఉండాలని ఆయన హితవు పలికారు.కాగా గ్రీన్ లాండ్ విలీనంపై జరుగుతున్న ఈ చర్చ కేవలం ఒక పోస్ట్కే పరిమితం కాలేదు. గతంలో ట్రంప్.. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్ లాండ్ అవసరమని పేర్కొన్నారని, ఆయన ఏదైనా చెబితే, అది కచ్చితంగా చేసి చూపిస్తారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గ్రీన్ లాండ్లో పర్యటించడం ‘రెక్కీ’లో భాగమేనన్న అనుమానాలను బలపరుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు! -
వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు!
అమెరికా తన సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ పేరుతో భీకర బాంబులతో తెగబడింది. అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నాయకుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే వెనెజువెలాపై దాడులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపధ్యంలో వెనెజువెలా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ విషయాన్ని అటుంచితే వెనెజువెలాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇవి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పెట్రోల్ ధరలు చవకఅపారమైన చమురు నిల్వలు, ప్రకృతి సౌందర్యానికి దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. వెనెజువెలాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర సుమారు మూడు రూపాయలు (భారత కరెన్సీలో)మాత్రమే. ప్రపంచ పెట్రోల్ ధరల సగటుతో పోలిస్తే ఇది అత్యల్పం.ఆర్కిడ్ పూలు, జీవవైవిధ్యంలో టాప్ప్రకృతి సంపదలోనూ వెనెజువెలా ముందు వరుసరలో నిలుస్తుంది. ప్రపంచంలోని 17 అత్యంత జీవవైవిధ్యం (Megadiverse) కలిగిన దేశాలలో వెనెజువెలా ఒకటి. ఈ దేశంలో 25 వేల జాతులకు పైగా ఆర్కిడ్ పూలు పుష్పిస్తాయి. ఈ దేశపు జాతీయ పుష్పం ‘ఫ్లోర్ డి మేయో ఆర్కిడ్’. వెనెజువెలా భూభాగంలో 53శాతం ప్రాంతాన్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం రక్షిత ప్రాంతంగా కేటాయించడం విశేషం.ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలుఅందగత్తెలకు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు వెనిజులా పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలను గెలుచుకున్న దేశం ఇదే.అత్యంత ఎత్తైన జలపాతంప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ‘ఏంజెల్ ఫాల్స్’ (979 మీటర్లు) ఇక్కడే ఉంది. ఈ జలపాతాన్ని 1950ల నాటి వరకు ఎవరూ గుర్తించలేదు. జేమ్స్ క్రాఫోర్డ్ ఏంజెల్ అనే పైలట్ దీనిని కనుగొన్నారు.రోజూ రాత్రి వేళ లక్షకు పైగా మెరుపులు ఈ దేశంలో కనిపించే మరో అద్భుతం ఏమిటంటే.. కాటాటుంబో నది ముఖద్వారం వద్ద ప్రతి రోజూ రాత్రి లక్షకు పైగా మెరుపులు సంభవిస్తాయి. దీనిని ‘నిత్యం మెరిసే మెరుపు’ (Everlasting Lightning) అని పిలుస్తారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులలో కూడా చోటు సంపాదించుకుంది.స్కేటింగ్ చేస్తూ క్రిస్మస్ వేడుకలువెనెజువెలాలో క్రిస్మస్ వేడుకలు ఎంతో విభిన్నంగా జరుగుతాయి. ఇక్కడి ప్రజలు క్రిస్మస్ రోజున చర్చికి ‘రోలర్ స్కేట్స్’పై వెళ్లడం ఒక ఆచారంగా పాటిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ముందుగా అన్ని రోడ్లను కూడా క్లియర్ చేస్తుంది. క్రిస్మస్ నాడు చిన్న పిల్లలు తాము పడుకునేటప్పుడు ఒక తాడును తమ కాలి వేలికి కట్టుకుని, దానిని కిటికీ బయటకు వేలాడదీస్తారు. ఉదయం స్కేటింగ్ చేస్తూ వెళ్లేవారు ఆ తాడును నెమ్మదిగా లాగి, పిల్లలను నిద్ర నుంచి మేల్కొలుపుతారు.30కి పైగా స్వదేశీ భాషలుదేశ సాంస్కృతిక రంగం విషయానికి వస్తే ‘క్వాట్రో’ (చిన్న గిటార్ వంటిది) వీరి జాతీయ వాయిద్యం. 'జొరోపో' అనేది వీరి జాతీయ నృత్యం. ఇక్కడ స్పానిష్ అధికార భాష అయినప్పటికీ, మరో 30కి పైగా స్వదేశీ భాషలు వాడుకలో ఉన్నాయి.ఘన పోరాట చరిత్రవెనెజువెలా చరిత్ర పోరాటాలతో ముడిపడివుంది. ఫ్రాన్సిస్కో డి మిరాండా తదితర వీరులు స్పెయిన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, తొలి స్వతంత్ర జెండాను రూపొందించారు. 1830లో ఈ దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం పొందింది.ఒకవెపు గన్ ఫైరింగ్.. మరోవైపు రోడ్డు ప్రమాదాలుప్రస్తుతం వెనెజువెలా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచంలో గన్ ఫైరింగ్ సంబంధిత మరణాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల మరణాల రేటు ఇక్కడ ప్రతి లక్ష మందికి 37.2 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాజధాని నగరం కారకస్లోని ‘హెలిక్స్’ అనే భవనం జైలుగా మారగా, ఇక్కడి ‘టవర్ ఆఫ్ డేవిడ్’ ఒకప్పుడు ప్రపంచంలోనే పెద్ద మురికివాడగా పేరొందింది. ఇది కూడా చదవండి: విమానాలకు పవర్ బ్యాంకుల ముప్పు -
వెనెజులాను మేమేం పాలించబోం
వెనెజులా విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. వెనెజులాను తాము పాలించబోమని.. తమ ఉద్దేశాలు వేరని స్పష్టం చేసింది. వెనెజులాను మేమే నడిపిస్తాం.. తర్వాత సురక్షితమైన అధికార బదిలీ చేస్తాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. "నడిపించడం" అంటే నేరుగా పాలన చేపట్టడం కాదు. వెనిజులా చమురు పరిశ్రమపై అమెరికా విధించిన ఆయిల్ బ్లాకేడ్ (oil blockade) ద్వారా ఒత్తిడి తెచ్చి మార్పులు సాధించడం అని అన్నారు. ‘దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించాం’ అని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ ఉద్దేశం వేరని రూబియో అన్నారు. ‘‘అమెరికా ఇప్పటికే వెనెజులా చమురు ట్యాంకర్లపై ఆంక్షలు విధించింది. వాటిని కొనసాగిస్తూ.. డ్రగ్ ట్రాఫికింగ్ ఆపడం, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా చమురు పరిశ్రమను నడపడం మాత్రమే అమెరికా ముందు ఉన్న లక్ష్యం’ అని రూబియో తెలిపారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయి అని ట్రంప్ చెప్పిన విషయాన్ని రూబియో ప్రదానంగా ప్రస్తావించారు. అలాగే.. అమెరికా ప్రస్తుతం ఉన్న సైనిక శక్తి డ్రగ్ బోట్లు, ఆంక్షల ట్యాంకర్లను అడ్డుకోవడానికి సరిపోతుందని.. అవసరమైతే సైనిక ఉనికిని పెంచవచ్చని రూబియో తెలియజేశారు.ట్రంప్ మరో వార్నింగ్.. ఒకవైపు రూబియో ప్రకటన వెలువడిన గంటల వ్యవదిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వెనెజులాను రెండో సైనిక దాడి హెచ్చరికలు జారీ చేశారు. వెనెజులా తాత్కాలిక నాయకత్వం గనుక తమ ఆదేశాలను పాటించకపోతే మరోసారి దాడి జరగవచ్చని స్పష్టం చేశారాయన. ‘‘నికోలాస్ మదురోను అధికారంలో నుండి తొలగించిన తర్వాత వెనెజులా అమెరికా పర్యవేక్షణలోనే ఉంది. ఆ దేశాన్ని సరిచేయడం మా లక్ష్యం. అవసరమైతే మళ్లీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారాయన. ‘‘వాషింగ్టన్ ఇప్పుడు ఆ నేలపై పరిస్థితిని పూర్తిగా నియంత్రిస్తోంది. అయితే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? అని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను చెప్పే సమాధానం చాలా వివాదాస్పదంగా ఉంటుంది’’ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఇదిలా ఉంటే.. మదురోకు నమ్మకస్తురాలిగా పేరున్న డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు సూచన, ఆర్మీ విజ్ఞప్తి, మరోవైపు వెనెజువెలా చట్టాల ప్రకారం ఆమె అధికార బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో పేరిట అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. అయితే.. అమెరికాతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు కొన్ని విశ్లేషణాత్మక కథనాలు వెలువడుతుండడం గమనార్హం.ఇక అమెరికా చేస్తున్న ప్రకటనలను వెనెజులా ఒక్కొక్కటిగా ఖండిస్తూ వస్తోంది. తమ అధ్యక్షుడిని పట్టుకెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం "ఇంపీరియలిస్టు చర్య"గా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్లోని బ్రూక్లిన్ జైల్లో మదురో, ఆయన సతీమణిని అమెరికా ఉంచింది. అక్కడి నుంచే ఆయన్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ అభియోగాలపై విచారణ జరపనుంది ఫెడరల్ కోర్టు.నేడు భద్రతా మండలి భేటీఅమెరికా దాడులపై చర్చించేందుకు సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కానుంది. రష్యా, చైనాల మద్దతుతో.. అత్యవసరంగా సమావేశం కావాలని కొలంబియా చేసిన విజ్ఞప్తితో ఈ సమావేశం ఏర్పాటైంది. -
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
సియోల్: ఉత్తర కొరియా ఆదివారం తన తూర్పు ప్రాంత సముద్ర జలాల మీదుగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్లు ధ్రువీకరించాయి. ఉత్తర కొరియా ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సముద్ర జలాల్లో పడిపోయాయంది. ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు వివరించింది. ఉత్తరకొరియా ఆదివారం కనీసం రెండు బాలిసిŠట్క్ క్షిపణులను ప్రయోగించినట్లు జపాన్ ధ్రువీకరించింది. ఉత్తరకొరియా చర్యలు తమ దేశానికి, ఈ ప్రాంతానికేకాదు, ప్రపంచానికే బెడదగా పరిణమించాయని పేర్కొంది. భద్రతా మండలి తీర్మానాలకు లోబడి, బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని, తమతో చర్చలకు ముందుకు రావాలని, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు తోడ్పడాలని దక్షిణ కొరియా పిలుపునిచి్చంది. ఇలా ఉండగా, ఈ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉత్తరకొరియా అధికార కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కిమ్ ప్రభుత్వం మారనున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలను చేపట్టి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. గతవారం దీర్ఘశ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించిన కిమ్ సైన్యం, అంతకుముందు నిర్మాణంలో ఉన్న అణు జలాంతర్గామికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. దీంతోపాటు, ఒక వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు జరిగిన పక్షంలో పైచేయి సాధించేందుకు సైతం కిమ్ వీటిని ఉపయోగించుకునే వ్యూహం కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ చైనా పర్యటనకు బయలుదేరటానికి కొద్ది గంటల ముందు కిమ్ యంత్రాంగం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను చేపట్టడాన్ని కూడా పరిశీలకులు కీలక పరిణామంగానే భావిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా లీ జే మ్యుంగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన, ఉత్తర కొరియా ఆయుధ పాటవాన్ని పెంచుకోవడంపై అభ్యంతరం తెలపడంతోపాటు, ఆ దేశాన్ని చర్చలకు ఒప్పించాలని కోరే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. శనివారం సియోల్ సమీపంలోని ఆయుధ కాంప్లెక్స్ను సందర్శించిన కిమ్.. ఆయుధాల ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచాలని అధికారులను ఆదేశించినట్లు అధికార మీడియా తెలిపింది. వెనెజువెలా రాజధాని కారకాస్పై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని అమెరికా పట్టుకెళ్లి జైలులో వేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
చమురు అంత ఈజీ కాదు
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అనూహ్య దాడితో బంధించి పట్టితీసుకొచ్చాక ఆ దేశంలోని చమురు నిల్వలపై అమెరికా దిగ్గజ కంపెనీలన్నింటికీ అజమాయిషీ లభించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వెనెజువెలా చమురు పరిశ్రమ కొన్నేళ్లుగా దాదాపుగా పడకేసింది. మదురో హయాంలో చమురు వెలికితీత వ్యవస్థల్లో చాలావరకు పదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయాయి. దాంతో అవేవీ ఇప్పటికిప్పుడు చమురు వెలికితీత పనుల్లోకి దిగే పరిస్థితుల్లో లేవు. వాటిని తిరిగి ఓ రూపానికి తెచ్చి సిద్ధం చేసేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితికి ఒకరకంగా అమెరికాయే కారణం కావడం విశేషం. ఈ దేశంపై అమెరికా విధించిన తీవ్ర ఆంక్షల వల్లే చాలా దేశాలకు వెనెజువెలా చమురును విక్రయించలేకపోయింది. చైనా, భారత్ తదితర కొద్ది దేశాలు మాత్రమే వెనిజువెలా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలకు జడిసి చాలా దేశాలు వెనెజువెలా చమురును కొనేందుకు సాహసించలేదు. కొనేందుకు ఎవరూ రాక, గిరాకీ లేక చమురు వెలికితీతను వెనిజువెలా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం కేవలం రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు వెలికితీస్తోంది. అదే ఆంక్షల ఊసు లేని రోజుల్లో అంటే 1999 ఏడాదిదాకా రోజుకు ఏకంగా 40 లక్షల బ్యారెళ్ల దాకా ముడిచమురును వెలికితీసేది. వెనెజువెలా చమురు క్షేత్రాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, పదేళ్ల శ్రమ అవసరం అవుతాయని అమెరికాలోని ‘రైస్ యూనివర్సిటీ’లో లాటిన్ అమెరికా ప్రాంత ఇంధన విభాగ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో మొనాల్డీ అంచనావేశారు.కంపెనీలు ముందుకొచ్చేనా?వెనిజువెలాలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. కనీసం 303 బిలియన్ బ్యారెళ్ల మేరకు చమురు ఉందని ఒక అంచనా. యావత్ ప్రపంచ చమురు నిల్వల్లో ఇది ఏకంగా 17 శాతానికి సమానం. ఇంతటి అపార చమురు నిల్వలపై అజమాయిషీ, పూర్తిస్థాయి గుత్తాధిపత్యం సాధించేలా అన్ని చర్యలూ తీసుకునేందుకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం తలెత్తితే మాత్రం ట్రంప్ ఎంత నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయన్నది అనుమానమే. రాజకీయ అనిశ్చితి కొనసాగే పరిస్థితుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి రిస్కు తీసుకునేందుకు అవి వెనకాడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో అత్యంత సందిగ్ధ పరిస్థితే నెలకొని ఉంది. దీనికి ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తికరం. ఒకవేళ అమెరికా కంపెనీలు రంగంలోకి దిగి చమురు క్షేత్రాల పునరుద్ధరణపై భారీ మొత్తాలే వెచ్చించినా అవన్నీ సిద్ధమయ్యేందుకు చాలాకా లమే పడుతుందని ఇంధనధరల సరళిపై అధ్యయ నం చేసే గ్యాస్బడ్డీ సంస్థలో ప్రధాన పెట్రోలియం విభాగ నిపుణుడు ప్యాట్రిక్ డీ హాన్ వ్యాఖ్యానించారు. ‘‘చమురు వెలికితీత వ్యవస్థల పునరుద్ధణ ఒక అంశమైతే, రాజకీయ సుస్థిరత అత్యంత కీలకమైన మరో అంశం. తమ పెట్టుడులకు భరోసా కల్పించే సుస్థిరమైన ప్రభుత్వం ఉందని విశ్వసిస్తేనే బడా కంపెనీలు వెనిజువెలాలో అడుగుపెడతాయి. ఆ నమ్మకం లేనంతకాలం పెట్టుబడుల వరద పారడం చాలా కష్టం’’ అని మొనాల్డీ విశ్లేషించారు. బహుశా ఈ పరిస్థితులను ఊహించే మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శనివారం నాటి క్షిపణి, బాంబు దాడుల్లో వెనిజువెలా కీలక చమురు క్షేత్రాల్లో కనీసం ఒక్కటి కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పడింది. వెనెజులా నుంచి ముడిచమురు వెలికితీతను అనూహ్యవేగంగా మొదలెడితే చమురురంగంలో గల్ఫ్ దేశాలను తోసిరాజని అమెరికాయే కింగ్మేకర్గా మారడం ఖాయంగా కన్పిస్తోంది. భారీ పరిమాణంలో చమురు అందుబాటులోకి వస్తుంది గనుక ఇప్పటికే నేలచూపులు చూస్తున్న చమురు ధరలు కనీసం మరికొన్నేళ్లపాటు చౌకగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.నాణ్యమైన చమురువెనెజువెలాలో దొరికేది హెవీ క్రూడ్గా పేర్కొ నే అత్యంత నాణ్యమైన చమురు. దాని నుంచి డీజిల్తో పాటు భారీ పరికరాల కోసం వాడే అస్ఫాల్ట్ తదితర ఇంధనాలు తయా రవుతాయి. అందుకే అక్కడి చమురుపై భారీ ఇంధన కంపెనీలన్నింటికీ మొదటినుంచీ ఆసక్తి. ఒకప్పట్లా మళ్లీ భారీ పరిమాణంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిందంటే ప్రధానంగా నష్టపోయేది రష్యానే. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకుని నిలుస్తోందంటే చమురు విక్రయాల పుణ్యమే. చట్టపరమైన చిక్కులువెనిజువెలా చమురును అమెరికా చేజిక్కించుకోవడం అంత సులువేమీ కాదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ‘‘ట్రంప్ చర్యను వెనిజువెలా కచ్చితంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థల ముందు సవాలు చేయవచ్చు. చమురు ఉత్పత్తి పెరుగుదలతో ప్రధానంగా నష్టపోయే రష్యానో, లేదంటే ఏ ఇతర దేశమో కూడా మదురో నిర్బంధాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆస్కారం లేకపోలేదు. -
వెనెజువెలాపై చర్య అనైతికం
వాషింగ్టన్: వెనెజువెలాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక ఆపరేషన్ను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ నేత కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆపరేషన్ చట్టవిరుద్ధం, అనైతికం అని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో అమెరికాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశం భద్రంగా, సౌభాగ్యవంతంగా, బలంగా ఉండాలంటే వైఖరి మార్చుకోవాలని ట్రంప్కు సూచించారు. నికోలస్ మదురో నిరంకుశ పాలకుడే అయినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించడం సరైంది కాదన్నారు. వెనెజువెలాలో ఉన్న చమురు కోసమే మదురోను నిర్బంధించారని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణ, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ సాకులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఇతర దేశాల్లో బల ప్రయోగంతో ప్రభుత్వాలను మార్చేయడం, చమురు దోచుకోవడం అమెరికాకు నష్టం కలిగిస్తాయన్నారు. అంతిమంగా అమెరికా ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కమలా హారిస్ స్పష్టంచేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, వెనెజువెలాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనే ఆశయాలు ట్రంప్ అజెండాలో లేవన్నారు. ఆయన మనసంతా చమురుపై ఉందని ఆక్షేపించారు. వెనెజువెలాపై సైనిక చర్యను అమెరికా ప్రజలు కోరుకోలేదన్నారు. అబద్ధాలు వినీవినీ వారు ఆలసిపోయారని పేర్కొన్నారు. తనను తాను బలమైన నాయకుడిగా నిరూపించుకోవాలని ట్రంప్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. ప్రాంతీయంగా అస్థిరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని ట్రంప్కు సూచించారు. అమెరికా సైనిక దళాలను ప్రమాదంలోకి నెట్టొద్దని కోరారు. వారి ప్రాణాలను బలి పెట్టాలనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇతర దేశాల్లో ఆపరేషన్ల కోసం కోట్లాది డాలర్లు ఖర్చు వృథా చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
ఇక కొలంబియా వంతు!
వాషింగ్టన్: లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. ‘తర్వాత నీ వంతే కావచ్చు, జాగ్రత్త!’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ ఓ బూతు మాట ప్రయోగించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేయిస్తున్నారు. దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘‘ పలు నేరగాళ్ల ముఠాలకూ ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయి. తీరు మార్చుకోకుంటే వాటికీ వెనిజువెలా గతే పడుతుంది’’ అంటూ అల్టిమేటమిచ్చారు. అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్పై దాడులకు వెనుకడుగు వేయబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరూ వేలెత్తి చూపేందుకు కూడా వీల్లేకుండా చేస్తామన్నారు. ‘‘మా చుట్టూ మంచి మిత్రులుండాలి. స్థిరత్వం, శక్తియుక్తులుండాలి. వెనిజువెలాలో అమితమైన శక్తిసామర్థ్యాలున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరముంది. మా ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలి’’ అంటూ కుండబద్దలు కొట్టారు. వెనెజువెలాలో మా సైన్యం..వెనిజువెలా చమురు కంపెనీలపై తమ నిషేధం ఇకపై కూడా కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ‘‘వెనిజువెలాలో మా సైనిక మోహరింపులు కొనసాగుతాయి. అక్కడ మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేదాకా, మేం పూర్తిగా సంతృప్తి చెందేదాకా అక్కణ్నుంచి వైదొలగేదే లేదు’’ అని స్పష్టం చేశారు.సైన్యంతో మేం సిద్ధం: పెట్రోట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇది కచ్చితంగా మానవతా సంక్షోభానికి దారి తీయగల పరిణామం. ట్రంప్ తీరు చూసి మేమిప్పటికే అప్రమత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. మదురోకు పెట్రో అత్యంత సన్నిహితుడు.క్యూబా పని పడతాంరూబియో సంకేతంవెనిజువెలా తర్వాత ఇక క్యూబాయే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ‘నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే, ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరతా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మరో సార్వభౌమ దేశంపై సైనిక చర్యకు దిగనుందన్న అనుమా నాలు బలపడుతున్నాయి. మెక్సికోకు ట్రంప్ శనివారం హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ‘‘మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. అధ్యక్షురాలు క్లాడియా షేన్బాం మంచి వ్యక్తే. కానీ దేశాన్ని ఆమె పాలించడం లేదు. డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయి’’ అని ఆరోపించారు. -
కరెంటు లేదు.. ఆహారం దొరకదు
కరాకస్: వెనెజువెలా రాజధాని కరాకస్తోపాటు సమీప నగరాలు, పట్టణాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడం, అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి విదేశానికి తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సూపర్ మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా దాడుల్లో విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. మళ్లీ విద్యుత్ సరఫరా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అధికారులు చేతులెత్తేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం లేదు. రాత్రయితే అంధకారంలో జీవించాల్సి వస్తోంది. వీధులు నిర్మానుష్యంగా మారాయి. కొన్నిచోట్ల సరకులు, మందుల దుకాణాలు తెరవడంతో ఆహారం, ఔషధాల కోసం జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా అనిశ్చితి, భయాందోళన కనిపించాయి. ప్రజా రవాణా వ్యవస్థ సేవలను రద్దు చేశారు. జన జీవనం స్తంభించింది. విద్యుత్ సదుపాయం ఉన్నచోట సెల్ఫోన్లను చార్జింగ్ చేసుకొనేందుకు జనం ఎగబడుతున్న దృశ్యాలు కనిపించాయి. చార్జింగ్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని, అంతటా గందరగోళం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరాకస్లో నివసిస్తున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. వారి సూచనలు జారీ చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. నిత్యం రాత్రి, పగలు జనంతో కిటకిటలాడే రాజధాని కరాకస్ సిటీలో ఆదివారం నిశ్శబ్దం, గందరగోళం రాజ్యమేలాయి. -
న్యూయార్క్ జైలుకు మదురో
కరాకస్: ఏళ్ల తరబడి వెనెజువెలాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ చిట్టచివరకు అమెరికా జైలులో విచారణ ఖైదీలుగా మారిపోయారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను పోటెత్తిస్తున్నారన్న ప్రధాన ఆరోపణలతో అపహరించి బందీలుగా పట్టుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం వీళ్లిద్దరినీ న్యూయార్క్లోని బ్లూక్లిన్ ప్రాంతంలోని మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉంచింది. శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి మదురో దంపతులు బంధించి రాత్రి కల్లా విమానంలో న్యూయార్క్ శివారు ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ మన్హట్టన్కు తీసుకెళ్లారు. తర్వాత డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్(డీఈఏ) ఆఫీసుకు చేర్చారు. అక్కడ కొద్దిసేపు ఆయనను ప్రశ్నించారు. ఇద్దరు డీఈఏ ఏజెంట్లు మదురో చేతులు పట్టుకొని తీసుకెళ్తున్న వీడియోను వైట్హౌస్ విడుదల చేసింది. ఇందులో మదురో నవ్వుతూ కనిపిస్తున్నారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో సోమవారం ఆయనను మన్హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చబోతున్నారు. వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం అమెరికాలోకి మాదక ద్రవ్యాలను చేరవేసినందుకు తమ దేశ చట్టాల ప్రకారమే మదురోను విచారించి, శిక్షిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మదురో దంపతులపై త్వరలో విచారణ ప్రారంభించనున్నారు. ట్రంప్పై అమెరికాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడిని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వైట్హౌస్ బయట నిరసనకు దిగారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణం వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆదివారం తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణంచేశారు. అధ్యక్షురాలిగా ఆమెతో సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం చేయించింది. అమెరికాను తామే పాలిస్తామంటూ ట్రంప్ ప్రకటించినప్పటికీ కొత్త అధ్యక్షురాలు ప్రమాణం చేయడం గమనార్హం. మరో దేశానికి తమ దేశం ఒక వలసకాలనీగా ఉండబోదని ఆమె కరాఖండీగా తేల్చి చెప్పారు. అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని రోడ్రిగ్స్ ఆగ్రహంగా మాట్లాడారు. ఎంతమంది అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అమెరికా ఆధిపత్యం తమపై చెల్లదని వెనెజువెలా రక్షణ మంత్రి జనరల్ వ్లాదిమిర్ పాడ్రినో స్పష్టంచేశారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కచ్చితంగా కాపాడుకుంటామని వ్లాదిమిర్ చెప్పారు. సమష్టిగా పాలన: ట్రంప్ మదురోను అదుపులోకి తీసుకొని, పదవి నుంచి దించేయడం ద్వారా ప్రమాదకరమైన డ్రగ్స్ రవాణాను కట్టడి చేసే విషయంలో ముందడుగు వేశామని ట్రంప్ చెప్పారు. ‘‘వెనెజువెలా ప్రభుత్వ పగ్గాలను మరొకరికి భద్రంగా అప్పగించేదాకా సమష్టిగా ఆ దేశాన్ని పరిపాలిస్తాం. ఇందుకు మదురో సన్నిహితుల సాయం కూడా తీసుకుంటాం. పాలనలో వారి భాగస్వామ్యం ఉంటుంది’’ అని అన్నారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్స్కు ట్రంప్ అభినందనలు తెలియజేయడం విశేషం. ముప్పుగా మారిన వారిని శిక్షించక తప్పదు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున చమురు సరఫరా చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై పెత్తనం చెలాయించబోతున్నట్లు సంకేతాలిచ్చారు. వెనెజువెలా ఇప్పటికే తమ అ«దీనంలో ఉందని వెల్లడించారు. అమెరికా సార్వ¿ౌమత్వానికి, ప్రజల జీవితాలకు ముప్పుగా మారిన వారిని శిక్షించి తీరుతామని తేల్చిచెప్పారు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఫ్లోరిడాలో మిన్నంటిన సంబరాలు మదురోను బంధించిన వార్త తెలిసి అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో స్థానికులు ఆనందంలో మునిగిపోయారు. వీరంతా ఒకప్పుడు వెనెజువెలా నుంచి వలసవచ్చిన వాళ్లే. వెనెజువెలా జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. హింసకు తాళలేక స్వదేశం వీడామని, ఇకపై నిర్భయంగా స్వదేశం చేరుకుని బంధువులను కలుస్తామని వాళ్లు ఆనందంతో చెప్పారు. మదురో పతనాన్ని కళ్లారా చూడాలని ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పుడ తమ కల నేరవేరిందన్నారు. తన పాలనను వ్యతిరేకించేవారిపై మదురో ఉక్కుపాదం మోపారు. దాంతో చాలామంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లిపోయారు. భయంకరమైన కారాగారం మదురోను నిర్బంధించిన మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు భయంకరమైన కారాగారంగా పేరుంది. కరడుగట్టిన నేరగాళ్లు ఇక్కడ శిక్ష అనుభవ్చిస్తుంటారు. ప్రస్తుతం 1,336 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరి మధ్యనే మదురో కాలం గడపాల్సి ఉంది. ఈ జైలులో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శుభ్రత, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. ఖైదీల పట్ల సిబ్బంది రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఖైదీల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణం. హంతకులు, రేపిస్టులు, డ్రగ్స్ స్మగ్లర్లను ఈ జైలులో నిర్బంధిస్తుంటారు. వెనెజువెలాలో ఎగసిన జ్వాలలు శత్రుదేశ సైన్యం అమాంతం అధ్యక్షభవనంపై దాడి చేసి మదురోను ఎత్తుకెళ్లడంతో వెనెజువెలా వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా దమనకాండను నిరసిస్తూ వేలాది మంది స్థానికులు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆందోళనలు చేపట్టారు. నిరసన ర్యాలీలు ఆదివారం పెద్ద ఎత్తున కొనసాగాయి. మదురోను పదవీచ్యుతుడిని చేయడంపై ఆయన మద్దతుదారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినదించారు. మదురోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మదురోను అమెరికా నిర్బంధించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తంచేయడం గమనార్హం. కొందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నియంతృత్వపాలన ముగిసిపోయిందని ఆనందం వ్యక్తంచేశారు. వెనెజువెలాలో అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం చర్చ జరుగనున్నట్లు తెలిసింది. యూఎస్ మీడియాకు ముందే తెలుసు!వాషింగ్టన్: వెనెజువెలా రాజధాని కరాకస్పై ట్రంప్ ప్రభుత్వం సైన్యంతో చేయించిన రహస్య మెరుపు దాడి విషయం అమెరికా మీడియాకు ముఖ్యంగా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థలకు ముందే తెలుసని వార్తలొచ్చాయి. తమకు ముందే తెల్సిపోయిందన్న అత్యుత్సాహంలో విషయాన్ని లీక్చేసి కథనాలు ప్రచురించి అందరికీ బహిరంగపరిస్తే ఆ రహస్య ఆపరేషన్లో పాల్గొనే అమెరికా సైనికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని గ్రహించాయి. అందుకే మీడియా సంస్థలు ఈ విషయంలో గోప్యత పాటించినట్టు సమాచారం. అమెరికా అధ్యక్షభవనం వర్గాలకు, మీడియా సంస్థలకు ముందే తెలుసు అని అమెరికా న్యూస్ వెబ్సైట్ ‘సెమఫర్’ ఘటన తర్వాత ఒక కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని బయట పెట్టడమా, లేదా అనే విషయంలో రెండు వార్తా సంస్థల్లో సీనియర్ ఎడిటర్ల స్థాయిలో గట్టి చర్చలే జరిగాయట. చివరికి గుట్టుగానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సెమఫర్ చెప్పుకొచ్చింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో అమెరికా మీడియా సాంప్రదాయికంగా ఈ వైఖరినే పాటిస్తూ వస్తోందని సెమఫర్ గుర్తు చేసింది. ట్రంప్కు, ప్రధాన మీడియా సంస్థలకు నడుమ పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ‘ఆపరేషన్ రిజాల్వ్’ విషయంలో సంయమనం పాటించడం గొప్ప విషయమేనని ఇతర మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి.సవాలు విసిరి దొరికిపోయాడు‘దమ్ముంటే పట్టుకో’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బహిరంగంగా సవాలు విసిరిన నికోలస్ మదురో అదే అమెరికా సేనలకు దొరికిపోయాడు. ఆయన గత ఏడాది ఆగస్టులో తన అధికారిక నివాసంలో ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘రా.. నిజంగా దమ్ముంటే వచ్చి నన్ను అరెస్టు చేసుకో. నీకు కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నా. ఇంకా ఆలస్యం చేయకు.. పిరికిపంద’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో ట్రంప్ సైన్యం అనుకున్నంత పని చేసి చూపించింది. శనివారం మదురోను, ఆయన భార్యను వారి నివాసంలోనే అరెస్టు చేసి, న్యూయార్క్కు తరలించింది. మదురోపై అమెరికాలో సెటైర్లు పేలుతున్నాయి. మదురోపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ వైట్హౌస్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టుచేసింది. ట్రంప్కు మదురో విసిరిన చాలెంజ్తోపాటు అమెరికా సైనిక ఆపరేషన్, ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ దృశ్యం ఇందులో ఉంది. ‘చివరకు ఏం జరిగిందో చూశారుగా, అరెస్టయ్యే అవకాశం మదురోకు దక్కింది’ అంటూ వైట్హౌస్ ముక్తాయింపునిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హ్యాపీ న్యూ ఇయర్ యూఎస్ అధికారులకు మదురో విషెస్ ‘హ్యాపీ న్యూ ఇయర్’! అమెరికా నిర్బంధంలో ఉన్న కొలంబియా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా అధికారులతో పలికిన మాటలివి. శనివారం రాత్రి పొద్దుపోయాక యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయనను న్యూయార్క్లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా వారికి మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తన జైలు గదికి చేరుకున్నాక వారికి గుడ్నైట్ సైతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అందులో మదురో నలుపు రంగు హుడీ షర్టు వేసుకుని చేతులకు బేడీలతో ఓ హాల్ గుండా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి నడుస్తూ కన్పిస్తున్నారు. -
జ్యోతిష్య శాస్త్రం ముందే చెప్పింది.. మదురో పతనం తప్పదని!
లిమా: ప్రపంచ రాజకీయాలపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం మరోసారి చర్చనీయాంశమైంది. బల్గేరియాకు చెందిన వంగాబాబా గతంలో యుద్ధాలు, విపత్తులు, నాయకుల పతనాలను ముందుగానే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే తరహా జోస్యాలతో పెరూ శామన్లు రంగంలోకి వచ్చారు. కొత్త సంవత్సరం ముందు వారు వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో త్వరలో అధికారాన్ని కోల్పోతారని ప్రకటించగా.. ఐదు రోజుల్లోనే అమెరికా ప్రత్యేక దళాలు ఆయనను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిందిఆధ్యాత్మిక జ్యోతిష్యం అనేది ప్రపంచ రాజకీయాలు, నాయకుల భవిష్యత్తు, దేశాల మార్పులు వంటి అంశాలను ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించే ప్రత్యేక పద్ధతి. పెరూ దేశంలోని శామన్లు (ఆధ్యాత్మిక జ్యోతిష్కులు) ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ముందు ఇలాంటి జోస్యాలు చెబుతారు. ఆశ్చర్యకరంగా.. మదురోపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం వెలుగులోకి వచ్చిన ఐదు రోజులకే అమెరికా వెనెజువెలాలో గోప్యంగా ఆపరేషన్ నిర్వహించింది.ఈ చర్యలో మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెద్ద చర్చాంశమైంది. సుదీర్ఘకాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు మదురోకు మధ్య వైరం కొనసాగుతోంది. దీనికి తోడు ఆయన పాలనపై అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభం వంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రత్యేక దళాలు మదురోను అదుపులోకి తీసుకున్నాయి.పెరూ శామన్ల జోస్యం చెప్పిన కొద్ది రోజుల్లోనే మదురోను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకోవడం వెనెజువెలాలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. లాటిన్ అమెరికా దేశాలు ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మదురో పతనాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తుండగా, మరికొందరు అమెరికా జోక్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇలాంటి ఆధ్యాత్మిక జోస్యాలు గతంలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బల్గేరియాకు చెందిన వంగాబాబా ‘బాల్కన్ నోస్ట్రడామస్’గా ప్రసిద్ధి పొందారు. ఆమె చేసిన అనేక జోస్యాలు.. ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు నిజమయ్యాయని అనేక మంది విశ్వసిస్తారు. వంగాబాబా జోస్యాలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినట్లే, ఇప్పుడు పెరూ శామన్ల జోస్యాలు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నాయి. -
లెబనాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు..!
నిన్న-మొన్నటి వరకూ ఇరాక్తో యుద్ధం చేసిన ఇజ్రాయిల్.. ఇప్పుడు లెబనాన్పై యద్ధం చేయడానికి సిద్ధమవుతుందా?, ఇజ్రాయిల్ సైనిక దళాలు తమ సరిహద్దు గోడను దాటి లెబనాన్లోకి వెళ్లడానికి కారణం ఏమిటి?, ఇజ్రాయిల్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక దేశం సైనిక దళాలు.. వేరొక దేశంలోకి ప్రవేశించాయంటే కారణం లేకుండా వెళ్లవు. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా తమ సరిహద్దు గోడను దాటి కేవలం 150 మీటర్ల దూరంలోకి వెళ్లాయి. దక్షిణ లెబనాన్లోని జెజైన్ జిల్లాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో ఇజ్రాయిల్ ఎయిర్క్రాఫ్ట్ దాడులకు కూడా పాల్పడిందని స్థానిక న్యూస్ ఏజెన్సీలు స్పష్టం చేయింది. దీనిపై లెబనాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్ దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని ఆరోపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయిల్ వైమానిక దళాలు స్పందించాయి. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. నెతన్యాహూ తిరిగొచ్చిన తర్వాతే ఈ దాడులుఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మిలటరీకి ప్రత్యేక ఆదేశాల జారీ చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ ఎటువంటి సైనిక చర్యలు ఉండొద్దని పేర్కొన్నారు. అయితే ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. ఆ దేశ సైనిక దళాలు.. లెబనాన్న టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఘోరం.. గ్రామస్థులపై కాల్పులు 30 మంది మృతి
నైజీరియాలో ఘోరం జరిగింది. అక్కడి ఓ గ్రామంపై క్రిమినల్ గ్యాంగులు విరుచుకపడ్డాయి. గ్రామస్థులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి వారి ఇళ్లను దగ్ధం చేశాయి. ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 30 మంది పౌరులు మృతిచెందారు. వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు తెలిపారు. నైజీరియా దేశంలోని నార్త్ నైజిర్ రాష్ట్రంలో కసువాన్జీ గ్రామంలోని ప్రజలపై శనివారం సాయంత్రం దోపిడి దొంగలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం వారి ఇళ్లను తగలబెట్టారు. అక్కడి దుకాణాలను లూటీ చేసి, పిల్లలను ఆడవారిని అపహరించారు. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించగా వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.అపహరించిన వారికోసం గాలింపులు చేపడుతున్నామని దాడులు జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బలగాలను మెహరించామని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే దాడులు జరుగుతున్న సమాచారం పోలీసులకు తెలిపామని అయినప్పటికీ సరైన సమయానికి వారు అక్కడికి చేరుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా నైజిరియాలో చాలాకాలంగా గ్యాంగ్ దాడుల కాల్పులు, పిల్లలు, ఆడవారి అపహరణ చాలా కామన్గా మారింది. ఉత్తర నైజిరియాలో పేదరికం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి యువత క్రిమినల్ గ్యాంగులలో చేరుతూ దోపిడీ అపహరణలు జీవన ఆధారంగా మలుచుకుంటున్నారు. పిల్లలను, ఆడవారికి అపహరించి రాన్సమ్ ( విడుదలకు చెల్లించే డబ్బు) డిమాండ్ చేస్తున్నారు. -
‘ అందాల’ దేశం.. ఏమిటో ఈ పరిస్థితి..!
ప్రపంచవ్యాప్తంగా వెనిజులాకు అందాల భామల దేశంగా పేరుంది. ఇందుకు కారణం. ఆ దేశం ఇప్పటివరకూ 7 మిస్ యూనివర్శ్ టైటిల్స్. 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. ఇదే కాదు.. వెనిజులా ప్రకృతి సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం, లాస్ రోక్యూస్ దీవులు, ఒరినుకో డెల్టి వంటి సహజ అద్భుతాలు ఈ దేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.ఇకపై వెనిజులాను మేమే పాలిస్తాంవెనిజులాలో పాలకుల నియంతృత్వం పోకడలు ఒకటైతే, ఆ దేశాన్ని ఇకపై తామే పాలిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ఏంటి? ఒక దేశాధ్యక్షుడిని నిర్భందించి మరొక దేశంలో ఉంచొచ్చా? అనేది ప్రస్తుత ప్రశ్న. ఇది ట్రంప్ విపరీత ధోరణికి కూడా అద్దం పడుతోంది. ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం అరెస్ట్ చేయొచ్చా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐక్యరాజ్యసమిత భద్రతా మండలి అనుమతి కావాలి. అందుకు సహేతుకమైన కారణాలు ఉండాలి. అయితే ఐక్యరాజ్యసమితికి ట్రంప్ నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ దేశంపై యుద్ధం చేయడం, ఆ దేశాధ్యాక్షుడిని భార్య సమేతంగా అరెస్ట్ చేయడం జరిగిపోయింది. అమెరికా కాంగ్రెస్కు కూడా సమాచారం ఇవ్వలేదు ట్రంప్. అంటే ఇక్కడ నియంతృత్వ పోకడ తనలో కూడా ఉందని ట్రంప్ నిరూపించుకున్నట్లే అయ్యింది. ఒక దేశాన్ని మరొక దేశం పాలించొచ్చా?1945 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ నియమావళిపై అమెరికానే తొలి సంతకం చేసింది. ఆ నియమావళిలో ముఖ్యంగా పేర్కొంది ఏమిటంటే.. ఒక దేశం మరొక దేశంపై సైనిక శక్తిని ఉపయోగించకూడదు. రెండోది ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. మరి వీటిని ట్రంప్ తుంగలో తొక్కారు. ‘ఐక్యరాజ్యసమితి లేదు.. ఏమీ లేదు.. అంతా మేమే’ అనే అగ్రరాజ్య పోకడను ప్రదర్శించారు. ఒక దేశంపై మరొకదేశం బల ప్రయోగం చేయడం నేరం. సహేతుకమైన కారణాలు ఏవీ కూడా యూఎన్ఓకు సమర్పించకుండా ఇలా చేయడం ఇంకా పెద్ద నేరం. పైనిక చర్యలకు ప్రత్యేక పరిస్థితి..ఒక దేశం.. మరొక దేశంపై సైనిక చర్యగా దిగాలంటే.. అది వారిని వారు కాపాడుకునే క్రమంలోనే చేయాలి. అంటే ఒక దేశం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు. ఇక్కడ అదే రూల్ను ట్రంప్ అప్లై చేసినట్లు కనబడుతోంది. వెనిజులాను నార్కో-టెర్రరిస్టుగా అభివర్ణిస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఆ బూచిని వారిపైకి తోసి అందుకే యుద్ధం చేశామని తన వైఖరిని ఐక్యరాజ్యసమితి ముందు సమర్ధించుకోవచ్చు. అయితే ఈ విషయం కూడా యూఎన్ఓకు ముందుగానే చెప్పాలి. మరి ఇలా చేయలేదు కాబట్టి.. అమెరికాపై యూఎన్ఓ ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. వేరే దేశాలు చేస్తే.. శాంతి మంత్రంవేరే దేశాలు ఏమైనా వారి వారి అంతర్గత సమస్యలతో యుద్ధం వరకూ వెళ్తే అక్కడ ట్రంప్ ఎంటర్ అయ్యిపోతారు. ఇప్పటివరకూ అదే జరుగుతూ వస్తుంది. భారత్-పాక్ యుద్ధం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ఇలా ఏమి జరిగినా తాను ఉన్నానంటూ ఒక శాంతి కటింగ్ ఇస్తారు ట్రంప్. మరి ఇప్పుడు ఆ శాంతి మంత్రం పక్కకు వెళ్లిపోయిందా.. అనేది మరొక ప్రశ్న. అమెరికాకు అనుకూలంగా ఉన్నవారికే..ఇప్పుడు తమ అనుకూలరితో వెనిజులాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న ట్రంప్. అందుకు మచాడోను ఎన్నుకోవచ్చు. ఎప్పట్నుంచో ట్రంప్కు మచాడో అనుకూలంగా మాట్లాడటం, నోబెల్ పురస్కారం గెలుచుకున్న సమయంలో కూడా ట్రంప్కు ఆ బహుమతిని ఇస్తానని ఆమె ప్రకటించడం వంటి వ్యాఖ్యలు అమెరికాపై భక్తిని చాటుకున్నాయి. ముందుగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వారితో ఏర్పాటు చేసి తాము చెప్పినట్లు ఉండేలా చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. ట్రంప్ చేతిలో మరింత నలిగిపోయే ప్రమాదం..!మరి ఇప్పుడు ఆ దేశం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకుల కారణంగా గత కొన్నేళ్లుగా వెనిజులా పయనం తిరోగమనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు మధురోను అమెరికా న్యూయార్క్ జైల్లో పెట్టినా అతనికి మద్దతు రాకపోగా, అక్కడ శాంతి వచ్చిందంటూ ఆ దేశానికే చెందని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మచాడో వ్యాఖ్యానించడం ఆ దేశ పాలకుల చర్యలకు అద్దం పడుతోంది. ఇప్పుడు ట్రంప్ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడితే వెనిజులా శాంతి వస్తుందా?, శాంతి బహుమతి గెలిచిన మచాడో దేశాధ్యక్షురాలిగా ఎన్నికతై గాడిలో పెట్టగలరా?, ఆ దేశ చమురు నిల్వలను వెనిజులాకే పరిమితమవుతాయా? లేక అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతాయా? అన్నది కాలమే చెబుతుంది. -
నార్త్ కొరియా మిసైల్స్ ప్రయోగం
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తరకొరియా జపాన్ భూభాగంలో బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా జపాన్ అప్రమత్తమైంది. అత్యవసరంగా సమవేశమై హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ మీడియా కథనాల ప్రకారం.. జపాన్ సముద్ర తీరం నుండి 200 మైళ్ల దూరం వరకూ ఆ దేశానికి చెందిన జలాలుగానే పరిగణిస్తారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు జపాన్ భూభాగంలో పడ్డాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కోయిజుమి తెలిపినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఆ క్షిపణులు దాదాపు 950 కిలోమీటర్ల పాటు ప్రయాణించాయని తెలిపాయి. అమెరికా, జపాన్ దేశాలకు సంబంధించిన కీలకమైన రక్షణ స్థావరాలతో పాటు దక్షిణ జపాన్లోని చాలా ప్రాంతాలను అవి చేరగలవని ఆయన తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ హెచ్చరిక జారీ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.అయితే నార్త్ కొరియా ఇదివరకే జపాన్ మీదుగా తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయంలో ఇది వరకే జపాన్ ఎన్నో సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా అమెరికాకు చెందిన కీలకమైన సైనిక స్థావరాలు జపాన్లో ఉన్నాయి. యుఎస్,నార్త్కొరియాకు అస్సలు పొసగదు. దీంతో జపాన్తో కూడా ఆ దేశం దూరంగా ఉంటుంది.అయితే వెనిజులాపై అమెరికా దాడిని నార్త్ కొరియా తీవ్రంగా ఖండించింది. ఈదాడి అమెరికా క్రూర స్వభావాన్ని మరోసారి తేటతెల్లం చేసిందని అక్కడి ప్రభుత్వవర్గాలు వ్యాఖ్యానించాయి. -
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
కరాకస్: అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరంనికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు.మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు.సత్యసాయి బాబా భక్తుడుమదురోకు భారత్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు. సత్యసాయి బాబా బోధనలు, ఆధ్యాత్మికత ఆయనపై ప్రభావం చూపాయి. మదురో తరచుగా బాబా ఆశ్రమాన్ని సందర్శించేవారని, ఆయన బోధనలను తన జీవితంలో అనుసరించేవారని చెబుతారు. -
థాయ్ మసాజ్కు వెళ్లాడు.. తన్నులు తిన్నాడు
థాయిలాండ్లో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఓ భారత పర్యాటకున్ని అక్కడి ట్రాన్స్జెండర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.థాయిలాండ్లోని పట్టాయాలో 52 ఏళ్ల రాజ్ జసూజా అనే భారత పర్యాటకుడిపై అక్కడి ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా దాడిచేశారు. డిసెంబర్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్ జసూజా అక్కడి ట్రాన్స్ జెండర్ల సర్వీసుకు వారు అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు.దీంతో ఆగ్రహం చెందిన సెక్స్ వర్కర్స్ కారు లోంచి అతనిని లాగి పడేశారు. అనంతరం అతని తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దాడిని గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి అక్కడి భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.అయితే థాయిలాండ్లోని పట్టాయాలో ఇటువంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్లో ఇండియన్ టూరిస్ట్పై అక్కడి సెక్స్ వర్కర్ దాడి చేశాడు. అక్టోబర్లో ముగ్గురు ట్రాన్స్ మహిళలు హోటల్లో ఉన్న ఇద్దరు భారతీయులపై దాడి చేసి వారి వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లారు. -
యుద్ధం అనాథను చేస్తే..సేవతో అందరి మనసులను దోచుకుంది..!
యుద్ధం ఆమెకు విషాదాన్ని మిగిల్చినా..ఆమె సేవతో మనసులను రంజింప చేసింది.అపరిచితుల దయ మధ్య పెరిగి పెద్దదై జీవితాన్ని సార్థకం చేసుకునేలా బతికి చూపించింది. ఓ అనాథ తిరగరాసిన ఈ కథ..యువతకు స్ఫూర్తి, విలువలను నేర్పించే ఓ గొప్ప పాఠం. ఆమె స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..1945లో రెండొవ చైనా-జపనీస్ యుద్ధంలో జపాన్ ఓటమి అనంతరం సుమారు నాలుగువేల మంది జపనీస్ పిల్లలు చైనాలో నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఈశాన్య చైనా, ఇన్నర్ మంగోలియా ప్రాంతాలలో ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామందిని చైనీస్ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ అనాథల్లోని ఒకటే ఈ జు యాన్ చిన్నారి కథ..!.ఆమె లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ నగరంలో సకురా యమమోటోగా జన్మించింది. ఆమె తండ్రి విమానం కూలిపోవడంతో మరణించగా, తల్లి ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. దాంతో ఆమె కనీసం ఏడాది కూడా నిండకమునుపే ఓ చైనీస్ కుటుంబం దత్తత తీసుకుంది. అయితే ఆమె పెంపుడు తండ్రి సైన్యానికి వెళ్లిపోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగా భావించి తన పొరుగింటి వాళ్లకు దత్తతగా ఇచ్చేసింది ఆమెను. అలా ఆమె జు జెన్స్ దంపుతులకు చేరింది. వాళ్లు ఆమెకు జు యాన్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఆమె పుట్టుకతో ఎంతో విషాదాన్ని చూడటంతో బాధను దిగమింగి ఎంతో స్థైర్యవంతురాలిగా పెరగాలన్న ఉద్దేశ్యంతో జు యాన్ అని పేరుపెట్టారట ఆ పెంపుడు తల్లిదండ్రులు. అయితే వాళ్లకు పిల్లలను పెంచిన అనుభవం అంతగా లేకపోవడంతో తన తల్లికి ఇచ్చి పెంచమని చెప్పింది జు పెంపుడు తల్లి. అలా అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగిన ఆమెకు, మంచి ప్రేమ, సంరక్షణ లభించాయి. 1962లో స్థానిక ఆస్పత్రిలో వైద్య శిక్షణ పూర్తి చేసుకుని, తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో వైద్యురాలిగా పనిచేసేందుకు వెళ్లింది. అలా ఆమె ఎన్నో ప్రసవాలు చేసింది. ఆమె పురుడుపోసిన నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు కూడా. తనను చైనీస్ ప్రజలు రక్షించారు, ఫలితంగా శిశువులకు సేవ చేశానని అనుకునేదామె. 1980లో తన బిడ్డతో షెన్యాంగ్కు తిరిగి వచ్చి నిర్మాణ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత స్వయంగా చైనా సంప్రదాయ వైద్యాన్ని నేర్చుకుని మళ్లీ సేవ చేయడం ప్రారంభించింది. అప్పుడే తాను జపనీస్ అనాథనని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. యుద్ధసమయంలో చైనా, జపాన్ వేర్వేరు పద్ధతుల్లో టీకాలు వేసేది. దాని కారణంగానే నాటి చైనా జపాన్ యుద్ధ సమయంలో నిరాశ్రయలైన పిల్లల్లో ఆమె ఒక్కత్తినని తెలుసుకుంటుంది. అయితే ఆమెలాగా యుద్ధం కారణంగా అనాథగా మారిని చాలామంది రెడ్క్రాస్ సొసైటీ సాయంతో తమ వాళ్లను కలుసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే జు యాన్ ఆ పని అస్సలు చేయలేదు. నిజానికి ఆ సమయంలో జపనీస్ యుద్ధ అనాథలు దాదాపు 120 మంది ఉండగా ఇప్పుడు కేవలం ఐదుగురే మిగిలి ఉండటం విశేషం. అయితే జు తనను తాను ఎప్పుడూ చైనీస్గానే భావించాను కాబట్టి తనవాళ్లను కలిసే ప్రయత్నం చేయలేదంటోంది. పైగా తనకు రక్షణ కల్పించిన ఈ నేల నా ఇల్లు తన స్వదేశం అని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! మన హైదరాబాద్కి జస్ట్..) -
‘దమ్ముంటే పట్టుకోమన్న మదురో… పడకగదిలోనే పట్టుకున్న ట్రంప్’
వాషింగ్టన్: ‘.. ప్లేసు నువ్వు చెప్పినా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే… దమ్ముంటే నన్ను పట్టుకో’అంటూ సినిమా స్టైల్లో సవాలు విసిరిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. తమ నివాసంలో నిద్రిస్తున్న మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను అమెరికా సైన్యం ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టి మరి మదరు ఛాలెంజ్ను గుర్తు చేసింది. వెనెజువెలా అప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతి, కరువు, చమురు అమ్మకాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలు విధించడం దేశాన్ని మరింత కుదేలు చేసింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుకోవడం వెనెజువెలా ప్రజలకు మరింత భారంగా మారింది.రివార్డు ప్రకటన, సవాలుఆ తర్వాత మదురోను పట్టుకునేందుకు వీలుగా సమాచారం అందిస్తే భారత కరెన్సీలో రూ.400 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో మదురో మరింత రెచ్చిపోయారు. డొనాల్డ్ ట్రంప్కు బహిరంగంగా సవాలు విసిరారు. ‘పిరికోడా.. నేనిక్కడే మిరాఫ్లోర్స్ (వెనెజువెలా) అధ్యక్ష భవనంలో ఉంటా. ఆలస్యం చేయొద్దు, వచ్చి పట్టుకోండి’అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.Nicolas Maduro had his chance — until he didn’t.The Trump Admin will always defend American citizens against all threats, foreign and domestic. 🇺🇸🦅 pic.twitter.com/eov3GbBXf4— The White House (@WhiteHouse) January 4, 2026 ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్మదురోను పట్టుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్’ పేరుతో సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారు జామున (స్థానిక సమయం) వెనెజువెలా రాజధాని కరాకస్ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, మందమైన స్టీల్డోర్లు, కిటికీలతో కూడిన కోటలాంటి ప్యాలెస్లో ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ మా స్పెషల్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున విమానాలు,ఫైటర్ జెట్లు హెలికాప్టర్లతో దాడులు చేశాయి. మెరుపు వేగంతో టియునా మిలిటరీ కాంపౌండ్ ప్యాలెస్లో పడక గదిలో నిద్రిస్తుండగా మదురో దంపతులను ఎత్తుకొచ్చాయి. చివరికి అమెరికా సైన్యం మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనను ట్రంప్ ప్రెస్మీట్లో ప్రకటించారు. మదురో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించి..‘సవాలు చేసిన వారిని మేం పట్టుకున్నాం’ అంటూ జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి.భార్యపై కేసులువారిపై నార్కో-టెర్రరిజం యునైటెడ్ స్టేట్స్లోకి టన్నుల కొద్దీ కొకైన్ దిగుమతి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ప్రస్తుతం మదురో దంపతులు బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. వారిని విచారిస్తున్నారు. మదురో చేసిన హాస్య వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.‘నన్ను పట్టుకోగలిగితే పట్టుకో’ అన్న సవాలు చివరికి ఆయనను అమెరికా జైలులోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Operation Absolute Resolve. pic.twitter.com/KOtW0C0V1O— The White House (@WhiteHouse) January 3, 2026 -
Bangladesh: హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు
ఢాకా: బంగ్లాదేశ్లో 2026, ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా అక్కడి హిందూ మైనారిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని హిందువులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపధ్యంలో వారి నుంచి ఈ నిర్ణయం వెలువడింది. బంగ్లాదేశ్లోని శరీరత్పూర్కు చెందిన ఔషధ దుకాణదారుడు ఖోకాన్ చంద్ర దాస్ ఉదంతం అక్కడి హిందువుల దుస్థితికి అద్దం పడుతోంది. డిసెంబర్ 31 రాత్రి దుండగులు ఖోకాన్పై పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ మంటల్లో కాలిపోతున్న వ్యక్తి తన తండ్రే అని తెలియక అతని 13 ఏళ్ల కుమారుడు మొబైల్లో చిత్రీకరించడం అందరినీ కలచివేసింది. తీవ్ర గాయాలతో ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ, జనవరి 3న ఆయన మృతిచెందాడు. ఈ ఘటన అక్కడి హిందువులలో తీవ్ర భయాందోళనలను నింపింది.1971 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్లో హిందువుల జనాభా సుమారు 30 శాతంగా ఉండేది. కానీ నేడు అది కేవలం 9 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇటీవలే దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ తదితర హిందువులు మూక దాడులకు బలయ్యారు. ‘గతంలో దాడులు జరిగేవి.. కానీ మనుషులను సజీవ దహనం చేయడం అనేది ఇప్పుడు కనిపిస్తున్న భయంకరమైన కొత్త పోకడ’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కరువైన తరుణంలో పలు మైనారిటీ సంస్థలు రాబోయే ఎన్నికలను బహిష్కరించి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని యోచిస్తున్నాయి.కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), జమాత్-ఏ-ఇస్లామీ తదితర పార్టీలు తమ లౌకిక ముద్రను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢాకా-7 నుంచి పోటీకి దిగిన బీఎన్పీ అభ్యర్థి హమీదుర్ రెహమాన్ హమీద్ ఇటీవల ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించి, సంతాప సభ నిర్వహించారు. అయితే, హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కాగా ఓటింగ్కు రోజులు దగ్గరపడుతుండటంతో హిందూ సంఘాలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. న్యాయమైన రీతిలో ఎన్నికలు జరగాలని కోరుతూ పలు సంఘాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తమ గోడును ప్రపంచానికి చాటిచెప్పడానికి పోలింగ్ బహిష్కరణే ఏకైక మార్గమని బంగ్లాదేశ్లోని పలు హిందూ సంఘాలు చెబతున్నాయి. ఇది కూడా చదవండి: ప్రియాంకపై కాంగ్రెస్ గంపెడాశలు.. ’అస్సాం’ అప్పగిస్తూ.. -
వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగొచ్చింది: మచాడో
నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారిగా స్పందించారు. అమెరికా హామీని నిలబెట్టుకుందన్న మచాడో.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లడంతో వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందంటూ ప్రకటించారు.వెనెజువెలా ప్రజలను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన మచాడో.. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ‘‘మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలు ఉన్నాయి. చర్చలతో సమస్య పరిష్కారానికి ఆయన నిరాకరించాడు. దీంతో అమెరికా తన హామీని నిలబెట్టుకుంది’ అని మచాడో ట్వీట్ చేశారు.ప్రజాస్వామ్యం కోసం కొన్నేళ్లుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్న మచాడో.. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. నెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు. అయినా ఆమె చాలా మంచి మనిషి’’ అని పేర్కొన్నారు. ‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా.. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. -
మరో మూడు దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వెనెజువెలాకు చుక్కలు చూపింది. అనంతరం.. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లింది. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలో న్యూయార్క్కు తరలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడే వారికి ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. ఇదే సమయంలో లాటిన్ అమెరికా దేశాలను ట్రంప్ హెచ్చరించారు.మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాలలోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రయోగశాలపై దాడులు చేయడానికి కూడా వెనుకాడనని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోవతే వారిపై తగిన చర్యలు, దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.మెక్సికోపై ఆరోపణలు: దేశం కార్టెల్ల చేతిలో నడుస్తోందని, అమెరికా జోక్యం అవసరమని అన్నారు.కొలంబియాపై ఇలా: కొకైన్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. మూడు ప్రధాని కొకైన్ ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. కొకైన్ను అమెరికాలోకి సరఫరా చేస్తున్నారు. అమెరికా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.క్యూబాపై తీవ్ర విమర్శలు: విఫలమవుతున్న దేశం అని అన్నారు. క్యూబా ప్రజలను అమెరికా ఆదుకుంటుంది. అమెరికా సైనిక చర్యలు జరగవచ్చని అని సూచించారు.ఇదిలా ఉండగా.. వెనెజువెలా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు.లాటిన్ అమెరికా దేశాలే టార్గెట్.. మరోవైపు.. బ్రిటిష్ పాలన నుంచి 1776లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అమెరికా.. ఆ తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కు పిడికిలి బిగించింది. 1798 మొదలు తాజాగా వెనెజువెలా ఉదంతం వరకు 700లకు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది. మెక్సికో, పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాధి నేతలను మార్చడం, తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా బలప్రయోగానికి పాల్పడింది. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో 65వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. అదృశ్యమైన వ్యక్తులు, లెక్కల్లో చేరని మరణాలు మరింత ఎక్కువ సంఖ్యలోనే ఉంది. -
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
కరాకస్: వెనెజువెలాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైమానిక దాడుల అనంతరం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 150 యుద్ధ విమానాలతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధ్యక్షుడు నికోలస్ మదురో అందుబాటులో లేని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో.. వెనెజువెలా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) ఆరోపణల కింద మదురో దంపతులను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మదురో దంపతులు తమకు లొంగిపోయారని, ప్రస్తుతం వారు అమెరికా రక్షణ విభాగం అదుపులో ఉన్నారని జనరల్ డాన్ కేన్ వెల్లడించారు.పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్వెనెజువెలా పరిపాలనా కొనసాగింపును, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం తప్పనిసరి అయ్యిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్, నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలు. 1969లో కారకాస్లో జన్మించిన ఈమె, విప్లవ నేత జార్జ్ ఆంటోనియో రోడ్రిగ్జ్ కుమార్తె. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ, గత దశాబ్ద కాలంలో వెనెజువెలా రాజకీయాల్లో కీలక మహిళా నేతగా పేరొందారు.గతంలో సమాచార మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సేవలందించిన డెల్సీ రోడ్రిగ్జ్ 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన సోదరుడు, నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్తో కలిసి ఆమె మదురో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. డెల్సీ రోడ్రిగ్జ్ కేవలం రాజకీయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైనా పట్టు సాధించారు. 2024 ఆగస్టులో ఆమెకు చమురు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అమెరికా ఆంక్షల నడుమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేశారు.ఇది కూడా చదవండి: వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన -
వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించింది.‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు.అయినా ఆమె చాలా మంచి మనిషి’’అని అన్నారు. ‘‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. ‘‘గగనతల, భూతల, సముద్రమార్గాల్లో వెనెజువెలాపై అమెరికా తన అమేయ సాయుధశక్తి, యుక్తులను అసాధారణ స్థాయిలో ఉపయోగించింది. వెనెజువెలా సైనికకోట అయిన కరాకస్లో శత్రు దుర్భేద్యమైన సైనికస్థావరం నుంచి విజయవంతంగా మదురోను బంధించి తీసుకొచ్చి అమెరికా న్యాయదేవత ఎదుట నిలబెట్టాం. అమెరికా చేసిన ఘనకార్యాన్ని ప్రపంచంలో గతంలో ఏ దేశమూ చేయలేకపోయింది. మా ధాటికి వెనెజువెలా సైనికశక్తి నిర్వీర్యమైంది. నిజానికి మేం రెండో దఫా దాడి చేయాలనుకున్నాం.కానీ తొలిదెబ్బకే వెనెజువెలా బలగాలు గుడ్లు తేలేశాయి. దీంతో మా రెండో దఫా దాడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. మదురో దంపతులను సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో విచారిస్తాం. సముద్రమార్గంలో అమెరికాలోకి వచ్చే మాదకద్రవ్యాల్లో 97 శాతాన్ని అడ్డుకున్నాం. ఒక్కో పడవలో వచ్చే డ్రగ్స్ కారణంగా సగటున 25,000 మంది అమెరికన్లు చనిపోతున్నారు. వెనెజువెలాలోని ముడిచమురు కుంభస్థలాన్ని అమెరికా కొట్టబోతోంది. అమెరికా కంపెనీలు అక్కడికెళ్లి వ్యాపారం మొదలెట్టి చమురు తవ్వకం, అమ్మకాలతో వెనెజువెలా ‘చమురు మౌలికవసతి’ని పునరుద్ధరిస్తాయి. చమురు అమ్మకాలతో వచ్చిన సంపదతో వెనెజువెలాను బాగుచేస్తాయి. అమెరికా భాగస్వామ్యంతో వెనెజువెలా వాసులు ఇకపై ధనవంతులుగా, స్వతంత్రంగా, సురక్షితంగా జీవిస్తారు. అమెరికా పాలనలో వెనెజువెలా ఎంతో సంతోషంగా ఉండబోతోంది. వాళ్ల కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. అమెరికాలోకి ప్రమాదకర డ్రగ్స్ను సరఫరాచేసే మదురో నిజానికి ఒక నియంత. డీ లోస్ సోలెస్ డ్రగ్స్ ముఠాకు మదురోనే పెద్ద. మదురోను బంధించాక వెనెజువెలా ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు. మా చట్టాల ప్రకారం శిక్షిస్తాం..మదురోను తమ అదుపులోకి తీసుకున్నాక అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డ్రగ్స్ మాఫియాతో మదురో దంపతులకూ సంబంధం ఉంది. అందుకే వాళ్లను బంధించి తీసుకొచ్చాం. న్యూయార్క్ చట్టాల ప్రకారం అమెరికా చట్ట నిబంధనల మేరకే అమెరికా గడ్డపై మదురో దంపతులకు శిక్ష పడేలా చేస్తాం’’ అని పామ్ అన్నారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శనివారం మదురో దంపతులపై నేరారోపణలు చేసింది. ‘‘అవినీతి సర్కార్ దశాబ్దాల తరబడి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యాల రవాణా ముఠాలతో స్వయంగా దేశ ప్రభుత్వం చేతులు కలిపింది’’ అని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. మరోవైపు సముద్రమార్గంలో అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలిస్తున్న నౌకలపై దాడులు పెంచామని శుక్రవారం నాటికి మొత్తంగా 35 నౌకలను నాశనం చేశామని.. సిబ్బంది సహా అందులోని సాయుధులను మొత్తంగా 115 మందిని అంతమొందించామని అమెరికా శనివారం ప్రకటించింది. కరాకస్లో మొదలైన ఆందోళనలు దేశాధ్యక్షుడిని బందీగా అమెరికా పట్టుకెళ్లడంపై కరాకస్ సిటీలో పౌరులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని నిరసన మొదలెట్టారు. వెనెజువెలాపై దాడి నేపథ్యంలో సమీప దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చి పడే వెనెజువెలావాసులను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గస్తోవ్ పెట్రో జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ అమెరికాపై, ట్రంప్పై విమర్శలు గుప్పించే గస్తోవ్ తమ దేశం మీదా దాడి జరగొచ్చన్న అంచనాతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. అమెరికా సైతం వెనెజువెలాలో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ‘‘అమెరికన్లు ఎవరైనా వెనెజువెలాలో ఉంటే తక్షణం వెనక్కి వచ్చేయాలి. ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దు’’ అని పేర్కొంది. -
వెనెజువెలాపై దాడి.. ట్రంప్కు చైనా హెచ్చరిక
బీజింగ్: వెనెజువెలాపై అమెరికా దాడులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘అమెరికా దుస్సాహసానికి తెగబడింది. సార్వభౌమ దేశమైన వెనెజువెలాపై సైనికశక్తిని దుర్వినియోగం చేయడం నేరం. ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది.అలాగే, అమెరికా పాల్పడే ఇలాంటి చర్యలు లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు గొడ్డలిపెట్టుగా తయారవుతున్నాయి. మేం ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ నిబంధనలను అమెరికా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఐరాస నిబంధనలు, చట్టాలు, చార్టర్కు విలువ ఇచ్చి తదనుగుణంగా నడుచుకోవాల్సిందే. తమతో విబేధించే దేశాల సార్వభౌమత్వం, భద్రతను ముప్పువాటిల్లేలా ప్రవర్తించే పెడపోకడలకు అమెరికా స్వస్తిపలకాలి’’ అని చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలను ప్రపంచదేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. సార్వభౌమదేశంపై ఏకపక్షంగా దాడులు చేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని నిలదీశాయి. దాడులపై ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా.. మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది. -
మదురో దంపతుల.. యుద్ధనౌకలో న్యూయార్క్కు తరలింపు
కరాకస్: ఎన్నో యుద్ధాలను ఆపానంటూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని జబ్బలు చరుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు పూర్తి భిన్నంగా సమీప దేశంపై ఏకపక్షంగా దాడి చేసి ఏకంగా దేశాధినేతను బందీగా పట్టుకొని ప్రపంచ దేశాలను విస్మయపరిచారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల సరఫరాను హోరెత్తించి పరోక్షంగా హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నివాసంపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా సైన్యం మెరుపుదాడులు చేసింది. మదురోతోపాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్నూ బందీలుగా పట్టుకుంది. కరాకస్ సిటీలోని ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని సొంతింట్లో ఉన్న మదురో దంపతులను అమెరికా సైన్యం బందీలుగా పట్టుకున్నట్లు వెనెజువెలా అధికార పార్టీ నేత నహూమ్ ఫెర్నాండెజ్ వెల్లడించారు. అంతకుముందు కరాకస్ సిటీపై అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారీ స్థాయిలో క్షిపణులు, రాకెట్లను ప్రయోగించి వెనెజువెలా సైనిక స్థావరాలు, జనావాసాలను భూస్థాపితం చేశాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, పెద్ద సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని వార్తలొచ్చాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న కరాకస్వాసులు పేలుళ్ల కారణంగా నిద్రలోనే కన్నుమూశారు. ఒక్కసారిగా బాంబులు పేలుతున్న శబ్దాలు, నేలమట్టమవుతున్న భవనాలతో జనం ప్రాణభయంతో పరుగులుతీశారు. సైనిక స్థావరాలు, పలు భవనాలు అగ్నికి ఆహుతవుతున్న, దట్టంగా పొగలు వెలువుడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాడుల ధాటికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గాఢాందకారం అలుముకుంది. ‘‘అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీకి వెళ్లి తిరిగొస్తూ బంధువులతో కలిసి రోడ్డుపై నడుస్తుంటే హఠాత్తుగా బాంబుల వర్షం కురిసింది. అవి పేలిన ధాటికి భూమి కూడా కంపించింది. ప్రతి ఒక్క వస్తువు కదిలిపోయింది. మిస్సైళ్లు, మంటలు, విమాన శబ్దాలతో మా ప్రాంతం ఒక్కసారిగా యుద్దభూమిగా మారిపోయింది’’అని 21 ఏళ్ల కార్మీకురాలు కార్మెన్ హిదాల్గో ఏడుస్తూ చెప్పారు. మాదకద్రవ్యాల రవాణా కట్టడికి, ద్వైపాక్షిక చర్చలుజరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మదురో ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటలకే అమెరికా దాడులు చేయడం గమనార్హం. సైనిక ఆపరేషన్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమెరికా నుంచి వీక్షిస్తున్న ట్రంప్ యుద్ధనౌకలో తరలిస్తున్నాం: వెనెజువెలాపై సైనిక దాడి విష యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తన సొంత సా మాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘వెనెజువెలాపై అమెరికా అతిపెద్ద దాడిని విజయవంతంగా పూర్తిచేసింది. వాళ్ల అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని బంధించి వెనెజులా నుంచి దూరంగా వేరే దేశానికి మా ‘అయోమా జిమా’ యుద్ధ నౌకలో తరలిస్తున్నాం. నౌక న్యూయార్క్కు చేరుకోబోతోంది. వాళ్లను న్యూయార్క్ చట్టాల ప్రకారం శిక్షిస్తాం. దాడి సందర్భంగా అమెరికా సైనికులు సైతం గాయపడ్డారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఒక హెలికాప్టర్ బాగా దెబ్బతింది. అయినాసరే మా సైనికులు అందరూ క్షేమంగా తిరిగొచ్చారు. దాడులు చేయక తప్పలేదు. ఎందుకంటే ఇది యుద్ధం’’ అని ట్రంప్ పెట్టిన పోస్ట్ను అమెరికా శ్వేతసౌధం తన ‘ఎక్స్’ ఖాతాలో జతచేసింది. ‘‘మదురోను అదుపులోకి తీసుకున్నాక వెనెజువెలాను అలా వదిలేయలేం. మదురో మాకు ముఖ్యం కాదు. ఆ దేశం నుంచి డ్రగ్స్ ఆగడమే మాకు కావాలి. డ్రగ్స్ ముఠాలను కట్టడిచేసే దమ్మున్న ప్రభుత్వం అక్కడ నెలకొనాలి. ఇంకెవరో అనామకుడు పరిపాలిస్తామంటూ ఊరుకునేది లేదు. అక్కడ ఎవరు పరిపాలించాలనేదే మేం నిర్ణయిస్తాం. దాడులపై అమెరికా కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదన్న డెమొక్రాట్ల వాదనలో పసలేదు. డెమొక్రాట్లు అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు. నిజానికి గొప్ప పని చేశావని నన్ను పొగడాలి. కానీ చట్టవ్యతిరేకమని తిడుతున్నారు. ఏళ్ల తరబడి ఇవే మాటలు వినీవినీ చెవుడు వచ్చేస్తోంది’’ అని తర్వాత ఫాక్స్న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఎగతాళిగా మాట్లాడారు. ఒక పరాయిదేశంపై దాడి చేసి ఏకంగా అగ్రనేతను అపహరిచడం అమెరికా చరిత్రలో గత 4 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 36 ఏళ్ల క్రితం పనామా దేశ నాటి సైనిక పాలకుడు ఆంటోనియో నోరిగాను అమెరికా సైన్యం దాడిచేసి పట్టుకొచ్చింది. ‘‘మెక్సికో సైతం డ్రగ్స్ భరతం పడితే మంచిది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బమ్ చేతులు ముడుచుకుని కూర్చుంటే మెక్సికో మీద సైనిక చర్యకు అమెరికా రంగంలోకి దిగక తప్పదేమో’’అని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. మదురో దంపతుల జాడ తెలీదు..: అమెరికా వైమానిక దాడుల తర్వాత మదురో దంపతుల జాడ తెలియకుండా పోయిందని వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్ శనివారం ఉదయం ప్రకటించారు. ‘‘శత్రుదేశం దాడుల తర్వాత మదురో, ఫ్లోరెస్ల జాడ తెలియడం లేదు. వాళ్ల క్షేమ సమాచారం అందుబాటులో లేదు. వాళ్ల యోగక్షేమాల వివరాలను అమెరికా తక్షణం బయటపెట్టాలి. దేశంపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలన్నింటినీ రంగంలోకి దింపుతున్నాం. సైనిక చర్యకు దీటుగా స్పందిస్తాం. ప్రజలు సైతం దేశాధ్యక్షుడి కిడ్నాప్ను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలి’’ అని రోడ్రెజ్ పిలుపునిచ్చారు. అత్యయిక విదేశీ విధ్వంసక స్థితిని రోడ్రెజ్ ప్రకటించారు.పడక గది నుంచి బరబరా లాక్కెళ్లి..వాషింగ్టన్: కరాకస్లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనికస్థావరంలోని ఇంట్లో అర్ధరాత్రి పడగదిలో నిద్రిస్తున్న మదురో దంపతులను అమెరికా సైనికులు మెరుపువేగంతో బంధించి హెలికాప్టర్లోకి ఎక్కించి అక్కడి నుంచి యుద్ధనౌకలోకి తరలించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ వీకెండ్ కార్యక్రమంలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ అమెరికా సైన్యంలోని డెల్టా ఫోర్స్ విభాగం నేతృత్వంలో ఈ ఆపరేషన్ మొత్తం జరిగింది. అధ్యక్ష ప్రాసాదాన్ని సైనికబలగాలతో శత్రుదుర్బేధ్య కోటలా మార్చేశారు. అలాంటి చోట కూడా మా బలగాలు అద్భుతంగా అరగంటలో పని ముగించాయి’’ అని అన్నారు. ఆపరేషన్ పూర్తి వివరాలనుఅమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డ్యాన్ కెయిన్ వెల్లడించారు. ‘‘ ఈ ఆపరేషన్కు అబ్సల్యూట్ రిసాల్వ్ అని పేరుపెట్టాం. ఏదైనా తేడా జరిగి భారీ ప్రతిదాడి చేయాల్సి వస్తే స్పందించేందుకు వీలుగా పశ్చిమార్థగోళంలో ఎఫ్–18, ఎఫ్–22, ఎఫ్–35 యుద్ధ విమానాలు సహా బీ–1 బాంబర్లు, డ్రోన్లను మొహరించాం. ట్రంప్ ఆదేశించగానే శుక్రవారం రాత్రి 10.46 గంటలకు ఆపరేషన్ మొదలెట్టాం. అర్ధరాత్రి దాటాక సరిగ్గా 1.01 గంటలకు మదురో ఉంటున్న అధికారభవనం ప్రాంగణంలోకి అమెరికా డెల్టా ఫోర్స్ సైనికులు అడుగుపెట్టారు. మెరికల్లాంటి సైనికులు ఇందులో పాల్గొన్నారు. సరైన సమయం కోసం వేచి ఉండి తర్వాత మదురో ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న దంపతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈలోపే వెనెజులా సైనికులు మాపైదాడి చేశారు. మా హెలికాప్టర్ ఒకటి దారుణంగా దెబ్బతింది. అయినాసరే వేగంగా స్పందించి వాళ్ల సైనికులను నిలువరించాం. 3.29 గంటలకు మా హెలికాప్టర్లోకి మదురో దంపతులను ఎక్కించాం. వెంటనే హెలికాప్టర్ యుద్దనౌక వైపు మెరుపువేగంతో వెళ్లిపోయింది. అంతా అనుకున్నట్లే జరిగింది. చాలాకాలం క్రితమే ఇందుకు ప్లాన్ చేశాం. మళ్లీ మళ్లీ రిహార్సల్స్ చేశాం. చివరకు విజయం సాధించాం’’ అని ఆయన అన్నారు. ఆలోపే పట్టేసుకున్నాం: ‘‘మదురో అధికార భవనంలో ఒక సురక్షిత గదిని ఏర్పాటు చేసుకున్నారు. అందులోకి వెళ్తే పట్టుకోవడం అసాధ్యం. అది అత్యంత కఠినమైన ఉక్కు గోడలతో తయారుచేసి ఉంటుంది. అందులోకి ఆయన వెళ్లేలోపే పట్టేసుకున్నాం. అతను రోజూ ఏం చేస్తాడు? ఎన్ని గంటలకు నిద్రపోతాడు? ఏం తింటారు? ఆయనకు పెంపుడు జంతువులు ఏమేం ఉన్నాయి? ఆయన ఎలాంటి బట్టలేసుకుంటాడు? ఇలా ప్రతీది మాకు తెలుసు’’అని ట్రంప్ చెప్పారు. -
నొరిగా.. సద్దాం.. ఇప్పుడు మదురో
నచ్చని దేశాలను నయానో భయానో లొంగదీసుకోవడం, మాట వినకపోతే ఆయా దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు పరిపాటిగా మారింది. పనామా సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగా, ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ను శిక్షించింది. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుంది. ఆయన భవిష్యత్తు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. 1989లో అమెరికా సైన్యం టాటిన్ అమెరికా దేశమైన పనామాపై దండయాత్ర సాగించింది. అప్పటి సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగాను గద్దె దించింది. అవినీతి, మాదక ద్రవ్యాలు, ప్రజాస్వామిక విధానాల నుంచి పనామాలోని తమ పౌరులను రక్షించడానికే ఈ చర్య తీసుకున్నామని అమెరికా సమర్థించుకుంది. 1988లో మియామీలో నొరిగా డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడ్డారని ఆరోపించింది. మరోవైపు పనామాలో అమెరికా వ్యతిరేక ఉద్యమాలకు నొరిగా మద్దతిచ్చారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఆయనపై నేరారోపణలు నమోదు చేసింది. అరెస్టు చేసి, జైలులో నిర్బంధించింది. 2010 దాకా నొరిగా జైలులోనే ఉన్నారు. మరో కేసులో విచారణ కోసం ఫ్రాన్స్కు తరలించింది. ఏడాది తర్వాత మళ్లీ పనామాకు తీసుకొచ్చింది. నొరీగా తన నేరాలకు శిక్ష అనుభవిస్తూ 2017లో జైలులోనే మరణించారని అమెరికా ప్రకటించింది. మరోవైపు అమెరికా కుట్రకు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. ఇరాన్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయంటూ అమెరికా సర్కారు కన్నెర్ర చేసింది. 2003లో ఇరాక్పై యుద్ధం ఆరంభించింది. అదే సంవత్సరం డిసెంబర్ 13న అమెరికా సేనలు సద్దాం హుస్సేన్ను బంధించాయి. నిజానికి ఇరాక్లో ఎలాంటి సామూహిక జన హనన ఆయుధాలు లభించలేదు. అయినప్పటికీ సద్దాం హుస్సేన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాక్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్కు ఉరిశిక్ష అమలు చేశారు. గిట్టని వారిని గద్దె దించి, శిక్షించడం అమెరికాకు కుట్రల్లో ఒక భాగంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నికోలస్ మదురోకు జైలుశిక్ష విధిస్తారా? లేక మరణశిక్ష విధిస్తారా? ఆయన గతి ఏమిటన్నది వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డెల్టా ఫోర్స్దే కీలక పాత్ర
వాషింగ్టన్: వెనెజువెలాపై దాడుల్లో అమెరికా డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. ఇది అమెరికా సైన్యంలో అత్యున్నత ప్రత్యేక మిషన్ యూనిట్. 1977లో డెలాŠట్ దళాన్ని స్థాపించారు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థత కలిగిన, రహస్య మిలటరీ యూనిట్గా డెల్టా ఫోర్స్కు పేరుంది. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్కు జవాబుదారీగా ఉంటోంది. అమెరికా సైనికాధికారి కల్నల్ చార్లెస్ బెక్విత్ బ్రిటన్కు చెందిన 22వ స్పెషల్ ఎయిర్ సరీ్వసెస్ రెజిమెంట్ను స్ఫూర్తిగా తీసుకొని డెల్టా దళాన్ని స్థాపించారు. ఈ దళం డెల్టా అని కాకుండా కొన్ని సందర్భాల్లో వేర్వేరు పేర్లతో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులపై ఆపరేషన్ల కోసం.. డెల్టా ఫోర్స్కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధిక రిస్్కతో కూడిన భారీ ఆపరేషన్లకు ఈ దళాన్ని రంగంలోకి దించుతారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, బందీలను విడిపించడం, ఉగ్రవాద ముప్పును నిర్మూలించడం, ఉగ్రవాదులను ప్రాణాలతో అదుపులోకి తీసుకోవడం వంటివి ప్రధాన బాధ్యతలు. ఉగ్రవాదులపై పోరాటం కోసం సృష్టించిన దళాన్ని వెనెజువెలాలో సైనిక ఆపరేషన్కు ఉపయోగించడం గమనార్హం. సంప్రదాయేతర యుద్ధ రీతుల్లోనూ ఈ దళానికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. విమానాలు, నౌకలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడంలో డెల్టా దళానికి గుర్తింపు ఉంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది. డెల్టా ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ల గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. చాలావరకు ఆపరేషన్లు రహస్యంగానే పూర్తయిపోయాయి. 2001లో ఆపరేషన్స్ ప్రైమ్ చాన్స్ను ఈ దళం నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగించింది. 2019లో ఐసిస్ ఉగ్రవాది అబూ బాకర్ అల్–బగ్దానీని అంతం చేసింది. డెల్టా ఫోర్స్లో చేరడం అంత సులభం కాదు. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, 75వ రేంజర్ రెజిమెంట్ నుంచి జవాన్లను ఈ దళంలోకి తీసుకుంటారు. అందుకోసం రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి సమర్థత, అంకితభావం ఉన్నవారికే డెల్టా దళంలో ప్రవేశం లభిస్తుంది. -
తప్పుడు సందేశం
న్యూఢిల్లీ: వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడికి దిగి అధ్యక్షుడు నికొలస్ మదురోను నిర్బంధించి విచారణ పేరిట తమ దేశానికి తరలించిన తీరును అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణులు పూర్తిగా తప్పుబడుతున్నారు. ‘‘ఇది అస్సలు సరికాదు. అత్యంత దారుణమైన, అంతకుమించిన ప్రమాదకరమైన చర్య. ప్రపంచానికే తప్పుడు సంకేతాలు పంపే ఉదంతం. ఒక దేశం మరో సార్వభౌమ దేశ రాజధానిపై ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడి దేశాధినేతను భార్యాసమేతంగా ఎత్తుకెళ్లిపోవడమా? దీన్నసలు ఎలాంటి నీతిగా అర్థం చేసుకోవాలి? అమెరికాను చూసి స్ఫూర్తి పొంది ఇతర శక్తిమంతమైన దేశాలు తమ ఇరుగు పొరుగు ప్రత్యర్థి దేశాల్లో కంట్లో నలుసుగా మారిన అధినేతలను అడ్డు తప్పించుకునేందుకు ఈ మార్గాన్నే అందిపుచ్చుకునే ప్రమాదముంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు చెలరేగుతాయి’’అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగింది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ భారత మాజీ దౌత్యవేత్త, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు రాజీవ్ డోగ్రా విస్మయం వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ చట్టాలు, సంప్రదాయాలు, పద్ధతులను పూర్తిగా తుంగలో తొక్కుతూ పొరుగు దేశాధినేతను ఎత్తుకెళ్లిపోవడమా? అమెరికా చర్య ఎవరికీ ఇంకా పూర్తిగా జీర్ణం కావడం లేదు. ఇటువంటివి బహుశా ఓ వందేళ్ల క్రితం దాకా రాజుల జమానాలో జరిగి ఉంటాయేమో! ఇటీవలి కాలంలో మాత్రం కచ్చితంగా కనీవినీ ఎరుగని సంఘటనే ఇది’’అని అన్నారాయన. మదురోను బందీకృతుణ్ణి చేసే క్రమంలో ట్రంప్ అన్ని సంప్రదాయాలను, చట్టాలనూ అడ్డంగా కాలదన్నారంటూ డోగ్రా దుయ్యబట్టారు. ‘‘మదురో పట్ల వెనెజువెలావాసులకు ఎలాంటి అభిప్రాయముందన్నది పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడి ప్రజలే. కానీ తనకు ఇలాంటివేవీ అస్సలు పట్టవని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు, చాలా విషయాల్లో రుజువు చేసుకున్నారు. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన ఏకపక్ష పోకడలతో ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నారు’’అని ఆయన విమర్శించారు. ఇంత దారుణంగా వ్యవహరించేందుకు మదురో కనీసం సైనిక నియంత కూడా కాదని మరో వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రిగేడియర్ రాహుల్ కె.¿ోంస్లే గుర్తు చేశారు. ట్రంప్ తన మతిలేని దూకుడును సమర్థించుకోవడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు. -
డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా
అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం... నికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు. మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు. 1998లో చావెజ్తో పాటు తానూ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత అసెంబ్లీ అధ్యక్షుడయ్యారు. చావెజ్ అధ్యక్షుడయ్యాక ఆయన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రపంచమంతా కలియదిరిగి అంతర్జాతీయంగా వెనెజువెలాకు మద్దతు పెంచడంలో మదురో కీలకపాత్ర పోషించారు. అమెరికా కర్రపెత్తనాన్ని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు లాటిన్ అమెరికా–కరీబియన్ కూటమి ఏర్పాటు చేశారు. ఈ దశలోనే చావెజ్కు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఫలితంగా 2012లో వెనెజువెలా ఉపాధ్యక్షుడయ్యారు. మదురోను తన రాజకీయ వారసునిగా చావెజ్ ప్రకటించారు. 2013లో అనారోగ్యంతో చావెజ్ మరణించడంతో మదురో తొలుత తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని పదిలపరుచుకున్నారు. నాటినుంచి పాలకునిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఆ క్రమంలో ప్రతి ఎన్నికల్లోనూ విపరీతమైన అక్రమాలకు పాల్పడ్డారన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. 2013 నాటి తొలి ఎన్నికల నుంచే ఆయనపై ఈ ఆరోపణలున్నాయి. చివరకు ఇలా నేలకు! చావెజ్ మరణానంతరం అధ్యక్షుడు కాగలిగినా పరిస్థితులన్నీ క్రమంగా మదురోకు ప్రతికూలించసాగాయి. అసలు ఆయన అధ్యక్ష జీవితమంతా వివాదాలు, సమస్యలమయంగానే సాగింది. ముఖ్యంగా వెనెజువెలా ఆర్థిక పతనం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. అమెరికా ఆంక్షలకు తోడు అంతర్జాతీయ చమురు ధరలు పతనం కావడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆర్థిక సంస్కరణలు, భారీగా నోట్ల ప్రింటింగ్ వంటివి మరిన్ని సమస్యలకే దారితీశాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. తిండి గింజలు కూడా లేక జనం అలమటించారు. దాంతో లక్షలాదిగా పొట్ట చేతపట్టుకుని పొరుగు లాటిన్ అమెరికా దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో 2014, 2017ల్లో వెనెజువెలా చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వాటన్నింటినీ ఉక్కుపాదంతో అణచేసి మదురో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. నిరసనలన్న మాటే విని్పంచకుండా లక్షలాది మందిని జైళ్లలో కుక్కేశారు. రాజకీయ ప్రత్యర్థులను తీవ్రాతి తీవ్రంగా హింసించారు. మానవ హక్కుల హననానికి దేశాన్ని మారుపేరుగా మార్చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు 2020లో అమెరికా మదురోను అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్యే 2024 ఎన్నికల్లో కిందామీదా పడి వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారాయన. కానీ ఆ క్రమంలో కనీవినీ ఎరగని అక్రమాలకు పాల్పడి అభాసుపాలయ్యారు. ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు చాలాచోట్ల ఏకంగా 85 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్టు తేలినా మదురో మాత్రం తానే గెలిచానని ప్రకటించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడే ప్రయత్నం చేశారు. దాంతో గొంజాలెజ్తో పాటు జనాదరణ ఉన్న విపక్ష నేత మరియా కొరీనా మచాడో వంటివారు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. 2018లో సైనిక పరేడ్లో ప్రసంగిస్తుండగా డ్రోన్ల సాయంతో జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. చివరికి ఓ పెద్ద దేశాధ్యక్షుడెవరూ ఇప్పటిదాకా ఎదుర్కోని దయనీయ పరిస్థితుల్లో అమెరికా సైన్యానికి భార్యాసమేతంగా పట్టుబడి నిస్సహాయునిగా దేశం వీడారు.భర్తకు చేదోడువాదోడుగా... రాజకీయాల్లో ఫ్లోరెస్ ఉత్థాన పతనాలు కరాకస్: సిలియా ఫ్లోరెస్. అప్రతిష్టాకర రీతిలో అమెరికాకు పట్టుబడ్డ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో భార్య. రాజకీయాల్లో భర్త అడుగుజాడల్లోనే నడిచారామె. మదురో మాదిరిగానే ఆమెదీ అతి సాధారణ నేపథ్యమే. వాయవ్య వెనెజువెలాలో టినాక్విలో అనే చిన్న పట్టణంలో 1956లో ఒక పేద కుటుంబంలో పుట్టారు ఫ్లోరెస్. జరుగుబాటు కోసం ఆమె కుటుంబం కరాకస్కు మారింది. అక్కడే ఆమె న్యాయ పట్టా పుచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లో పార్ట్టైం జాబ్ చేసే క్రమంలో ఓ డిటెక్టివ్ను పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కన్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వ్యక్తిగత లాయర్గా మారడం ఆమె జీవితంలో కీలక మలుపు. అక్కడినుంచీ రాజకీయంగా క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కారు. 2000లో తొలిసారి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన ఫ్లోరెస్, 2007కల్లా దాని ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో మదురోతో జరిగిన పరిచయం కాస్తా ప్రణయంగా మారింది. రెండు దశాబ్దాల సన్నిహిత జీవితం అనంతరం 2013లో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి ఒకటయ్యారు. మదురో అధ్యక్షుడయ్యాక ఆయన నిర్ణయాలన్నింట్లోనూ ఫ్లోరెస్ కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ చీఫ్గా బలమైన అధికార కేంద్రంగా వ్యవహరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పంతం నెగ్గించుకున్న ట్రంప్
ఒక అగ్రరాజ్యపు దురాశ. సొంత పాలకుల నియంతృత్వ, పెడపోకడలు. ఫలితంగా దశాబ్దాలుగా నలిగిపోతూ సాగుతున్న వెనెజువెలా ప్రస్థానం కాస్తా, ఏకంగా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో తాజాగా మరో మలుపు తిరిగింది. అత్యాశ, అధికార లాలస నడుమ జరిగిన ఆరాట పోరాటాల్లో అక్కడి ప్రజల స్వేచ్ఛాకాంక్షలు మరోసారి సమాధయ్యాయి. ట్రంప్ విపరీత మనస్తత్వం దృష్ట్యా ఇకపై వెనెజువెలా భవితవ్యం ఎలా ఉండనుందన్నది ఎవరి అంచనాలకూ అందని పరిస్థితి... ఆది నుంచీ అంతంతే... అమెరికాతో వెనెజువెలా సంబంధాలు ముందునుంచీ ఉప్పూ నిప్పుగానే సాగుతూ వస్తున్నాయి. వెనెజువెలాలోని అపార చమురు నిల్వలపై అమెరికాకు తొలి నుంచీ కన్నుంది. అగ్రరాజ్యపు చమురు దోపిడీని 1999లో వెనెజువెలా అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ అడ్డుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. నాటినుంచీ పరిస్థితి క్రమంగా దిగజారుతూనే వస్తోంది. వెనెజువెలాపై అమెరికా ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ, వాటిని నానాటికీ పెంచేస్తూ వస్తోంది. తొలుత చావెజ్, ఆ తర్వాత తాజాగా పదవీచ్యుతుడైన నికొలస్ మదురో ఇద్దరూ నియంతృత్వ పోకడలతోనే పాలించారు. దాంతో పాతికేళ్లకు పైగా దేశం తిరోగమన బాటలోనే సాగుతూ వస్తోంది. అమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్ కార్టెల్స్ మూలాలన్నీ వెనెజువెలాలోనే ఉన్నాయన్నది ట్రంప్ ఆరోపణ. ఇది చాలదన్నట్టు వెనెజువెలా నుంచి తమ దేశంలోకి జనం విపరీతంగా వలస వచ్చిపడుతున్నారంటూ కొంతకాలంగా ఆయన మండిపడుతున్నారు. డ్రగ్స్ మోసుకెళ్తున్నాయనే సాకుతో కొన్నాళ్లుగా వెనెజువెలా చమురు నౌకలను అడ్డుకుంటూ, పేల్చేస్తూ వస్తున్న అమెరికా చివరికి తాజాగా అధ్యక్షుడే లక్ష్యంగా సైనిక చర్యకే దిగి భార్యాసమేతంగా నిర్బంధంలోకి తీసుకుంది. వ్యతిరేకులతో దోస్తీ! వెనెజువెలా విషయంలో అమెరికా దూకుడును అడ్డుకోవడానికి ఆ దేశాధ్యక్షులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. చావెజ్ తన హయాంలో యూఎస్ వ్యతిరేక శక్తులైన రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో చెలిమి చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారకుండా చూసుకోగలిగారు. అలా తనపై జనాగ్రహం ప్రబలకుండా జాగ్రత్త పడ్డారు. చమురు విక్రయాలతో వచ్చే మొత్తాలతో దేశంలో పేదరికాన్ని చాలావరకు తగ్గించారు. కానీ మదురోలో ఆ ముందుచూపు లోపించిందంటారు పరిశీలకులు. ఆయన హయాంలో దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇటు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. అటు ట్రంప్ రాకతో అమెరికా దూకుడు పెరిగింది. దాంతో రాజకీయంగానే గాక ఆర్థికంగానూ వెనెజువెలా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక దశలో దేశంలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. దాంతో బతుకుదెరువు కోసం జనం భారీగా దేశం వీడటం పరిపాటిగా మారింది. గత పదేళ్లలో కోటిమందికి పైగా విదేశాల బాట పట్టినట్టు అంచనా. విచ్చలవిడిగా పెరిగిపోయిన అధికారుల అవినీతిని అదుపు చేయడం మదురో తరం కాలేదు. దీనికితోడు వెనెజువెలా చమురు అమ్మకాలన్నింటినీ అమెరికా దాదాపుగా అడ్డుకుంది. దాంతో ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోయి మదురో సమస్యలు రెట్టింపయ్యాయి. కొంతకాలంగా చైనా వంటి దేశాలకు కారుచౌకగా చమురు విక్రయించుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి. అంతర్గత సమస్యలు ఇలా చేయి దాటుతుండగానే ట్రంప్ ఒక్కసారిగా రూటు మార్చి వెనెజువెలాపై గత సెప్టెంబర్ నుంచే సైనిక చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనెజువెలా గగనతలాన్ని మూసేస్తున్నట్టు గత నవంబర్లో ప్రకటించారు. వెనెజువెలా చుట్టూ సైన్యం మోహరింపులను పెంచేశారు. చివరికి మదురోను క్రిమినల్గా పేర్కొనడమే గాక, ఆయన్ను పట్టిస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల నజరానా ప్రకటించారు. మచాడో ఫ్యాక్టర్! మదురో దంపతులను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందన్న వార్తలపై వెనెజువెలాలో ఆగ్రహావేశాలు దేవుడెరుగు, పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం లేదు. ఇది మదురో స్వయంకృతమే అయినా, ఆయన పట్ల జనంలో నెలకొన్న వ్యతిరేకతను ఆగ్రహావేశాలుగా మార్చడంలో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో పాత్ర కీలకమే. మదురో హయాంలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలన్నీ గగ్గోలు పెట్టే పరిస్థితి. మదురోకు వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా రాత్రికి రాత్రే మాయం కావడం, తీవ్ర నిర్బంధానికి గురవడం షరామామూలుగా మారింది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన మచాడో ప్రజా గళంగా మారారు. మదురో నియంతృత్వ పోకడలపై ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ప్రజల సొత్తయిన అపార వనరులన్నింటినీ మదురో, ఆయన అనుయాయులు అయినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలకు ప్రజల్లో గొప్ప స్పందన వచ్చింది. చూస్తుండగానే మచాడోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమనే దాకా వెళ్లింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన మదురో, మచాడోపై హాస్యాస్పదమైన అవినీతి, దాంతోపాటు దేశద్రోహం తదితర ఆరోపణలు మోపారు. చివరికి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా అనర్హత వేటు వేయించారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ తదితరాల సాయంతో తిరిగి ఎన్నికయ్యారు. అవి అత్యంత ఏకపక్ష ఎన్నికలంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగినా పట్టించుకోలేదు. మచాడోపై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. దాంతో ప్రాణరక్షణ కోసం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది తనకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమానం అందుకునేందుకు మారువేషంలో నార్వే వెళ్లే ప్రయత్నంలో మచాడో పడవ ప్రమాదానికి గురై గాయపడ్డారు. అమెరికా దన్ను మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజువెలా.. టార్గెట్ ఆయిలా
డ్రగ్స్ .. వలసలపై పోరు, దేశ భద్రతకు ముప్పు మొదలైన అంశాల వల్లే వెనెజువెలాపై దాడికి పాల్పడినట్లు అమెరికా చెబుతున్నప్పటికీ నిజంగా కారణాలు అవేనా? లేక వేరే ఏవైనా ఉన్నాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. వెనెజువెలాలో పుష్కలంగా ఉన్న చమురు నిల్వలే టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పోరుకు తెరతీసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో ఒపెక్ (ఆయిల్ ఎగుమతి దేశాల) ఆధిపత్యానికి గండి కొట్టి, అమెరికా కొత్త ఆయిల్ కింగ్గా మారే ప్రయత్నం చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనెజువెలాపై అమెరికా దాడి దరిమిలా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో చోటు చేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలపై కథనం. – సాక్షి, బిజినెస్ డెస్క్అమెరికాకు ఎందుకు ఆసక్తి..ప్రపంచంలోనే అమెరికా అత్యధికంగా రోజుకు 20–22 మిలియన్ బ్యారెళ్లు (ఎంఎంబీపీడీ) ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వెనెజువెలా తయారు చేసే రకం ఆయిల్ని కొంత దిగుమతి చేసుకుంటోంది. అమెరికా తయారు చేసే లైట్ స్వీట్ రకం ముడిచమురు.. పెట్రోల్లాంటి వాటి తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. డీజిల్తో పాటు ఫ్యాక్టరీలు ఇతరత్రా అవసరాలకు కావాల్సిన ప్రొడక్టులను ఉత్పత్తి చేయాలంటే వెనెజువెలా సరఫరా చేసే హెవీ, సోర్ రకం క్రూడాయిల్ ముఖ్యం. పలు అమెరికన్ రిఫైనరీలు.. వెనెజువెలా హెవీ ఆయిల్ని ప్రాసెస్ చేయడానికి అనువుగా నిర్మితమై ఉన్నాయి.తమ దేశపు ఆయిల్తో పోలిస్తే వెనెజువెలా ఆయిల్తోనే అవి సమర్ధవంతంగా పని చేయగలవు. దానికి తగ్గట్లుగానే మిగతా దేశాలతో పోలిస్తే సమీపంలోనే ఉన్న వెనెజువెలా నుంచి అమెరికా రోజుకు 1.02 లక్షల బ్యారెళ్ల ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఈ దాడి వల్ల అగ్రరాజ్యానికి, దాని మిత్ర దేశాలకు, ముఖ్యంగా వెనెజువెలా ఎకానమీకి కూడా ప్రయోజనాలు చేకూరవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా తదితర దేశాలకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఆ దేశంలో ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధరలు అదుపులో ఉంటాయంటున్నారు.అపార ఆయిల్.. ఖనిజ నిల్వలుప్రపంచంలోనే అత్యధికంగా వెనెజువెలాలో 303 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు నిక్షేపాల్లో ఇది అయిదో వంతు. అదే అమెరికా, రష్యాలో చెరి 80 బిలియన్ బ్యారెళ్లు ఉండగా.. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్ల మేర నిక్షేపాలు ఉన్నాయి. అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేక వెనెజువెలా ఆయిల్ పరిశ్రమ అనేక సంవత్సరాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సరైన నాయకత్వం లేకపోవడం, అవినీతి, అమెరికా ఆంక్షలు, పరిశ్రమలోకి పెట్టుబడులు రాకపోవడం మొదలైనవి ఇందుకు కారణం.ఫలితంగా, 25 ఏళ్ల క్రితం రోజుకు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసిన వెనెజువెలా ప్రస్తుతం ఒక మిలియన్ బ్యారెళ్ల స్థాయికి పడిపోయింది. ఇలా ఉత్పత్తి చేసే ఆయిల్లో సింహభాగాన్ని (రోజుకు 6,00,000 బ్యారెళ్లు) చైనా దిగుమతి చేసుకుంటోంది. వెనెజువెలా ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడం ద్వారా ఆ దేశపు ఆయిల్ రంగంలో చైనా గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. ఇక వెనెజువెలాలో ముడిచమురుతో పాటు అరుదైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజ సంపద విలువ దాదాపు 1.36 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా.రష్యాకు చెక్..రష్యా ఆయిల్ కూడా దాదాపు వెనెజువెలా క్రూడాయిల్ తరహాలోనే ఉంటుంది. అందుకే భారత్, చైనాలాంటి దేశాలు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వెనెజువెలాలో ఉత్పత్తి పెరిగితే అది రష్యాకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఇప్పటిదాకా రష్యా దగ్గర కొంటున్న దేశాలు నెమ్మదిగా వెనెజువెలావైపు మళ్లుతాయి. ఫలితంగా రష్యా ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే ఉక్రెయిన్ మీద యుద్ధం చేసే సామర్థ్యాలు కూడా సన్నగిల్లుతాయి. ఆ విధంగా రష్యాని అమెరికా కట్టడి చేసినట్లవుతుంది.అదే సమయంలో అత్యధిక నిల్వలున్న వెనెజువెలాను గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా క్రూడాయిల్ మార్కెట్పైనా ఆధిపత్యం దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో షెల్ ఆయిల్ ఉత్పత్తి బూమ్ వల్ల మార్కెట్ ఆధిపత్యం ఒపెక్ దేశాల నుంచి కొంత అమెరికాకు వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారుగా అమెరికా మారింది. రాబోయే రోజుల్లో వెనెజువెలాలోని చమురు నిక్షేపాలు, అమెరికా, దాని మిత్ర దేశాల చేతిలోకి వెళ్తే.. అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్ తీరుతెన్నులు మారిపోవచ్చు. భవిష్యత్తులో ఒపెక్, దాని మిత్ర దేశాల సామర్థ్యాలను బలహీనపర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మనపై ఎఫెక్ట్ ఏంటంటే..భారత్కి కూడా వెనెజువెలా నుంచి రోజుకు సుమారు 60,000 నుంచి 1,00,000 బ్యారెళ్ల (బీపీడీ) మేర సరఫరా అవుతోంది. మనం క్రూడాయిల్ దిగుమతుల్లో ఇది సుమారు 2–3 శాతం ఉంటుంది. 2024లో వెనెజువెలా నుంచి 1.76 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఒకవేళ వెనెజువెలా ఆయిల్పై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలైతే మధ్యప్రాచ్యదేశాల నుంచి ఖరీదైన ప్రత్యామ్నాయాలను కొనుగోలు చేయాల్సి రావచ్చు.దీనితో సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు దిగుమతుల బిల్లు భారం పెరగొచ్చని అంచనా. అటు వెనెజువెలా కోవకి చెందినది కాకపోయినప్పటికీ రష్యా నుంచి కూడా చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా లోటును భర్తీ చేసుకునే వీలున్నా, ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ మనపై అమెరి కా ఒత్తిడి తెస్తున్న కారణంగా ఇలాంటి అవకాశాలపై కొంత సందేహాలు నెలకొన్నాయి.తాత్కాలికంగా రేట్లకు రెక్కలు..వెనెజువెలా సరఫరా చేసేది స్వల్పమే అయినా అది కూడా నిల్చిపోతే చమురు రేట్లు తాత్కాలికంగా, బ్యారెల్కి 3–5 డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మార్కెట్లో ఓవర్–సప్లై నెలకొనడంతో పాటు ఒపెక్ దేశాలు ఆ మేరకు అదనంగా ఉత్పత్తి పెంచితే ధరలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి రావచ్చు. అయితే, వెనెజువెలా ఉత్పత్తి చేసే క్రూడాయిల్ రకం ప్రత్యేకమైనది కావడం వల్ల దానిపైనే ఆధారపడిన వర్గాలపై కొంత ప్రభావం పడనుంది. -
ఇంతకీ ఆ లేఖలో ఏముంది?.. అసలేం జరిగింది?
దేశంలోని తీహార్ జైలులో UAPA అంటే Unlawful Activities Prevention Act కింద ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తికి అమెరికాలోని న్యూయార్క్ మేయర్ లేఖ రాయడం విచిత్రంగా ఉంది కదూ.. కానీ అది వాస్తవం.. ఆ లేఖలో.. మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాం అని రాశారు. అసలు జైల్లో ఉన్న వ్యక్తికి... మేయర్ మధ్య స్నేహం, బంధుత్వాలు లేవు.. అసలు ఒకరినొకరు ఎప్పుడూ కలవలేదు. అయినా జైలులో ఉన్న వ్యక్తి అమెరికా, యూరప్లలో చర్చలకు కేంద్ర బిందువయ్యాడు.జైల్లో ఉన్న వ్యక్తితో పాటు.. అదే కేసులో జైల్లో ఉన్న మరికొందరిని బెయిల్ ఇవ్వకుండా UAPA చట్టం కింద బంధించడం మానవ హక్కులను హరించినట్టేనని... వారిని విడుదల చేయాలని ప్రపంచదేశాల నుంచి సందేశాలు రావడం గమనార్హం... అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. మనం ఓ సారి 2020లోకి వెళ్లి రావాల్సిందే..సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అదే సమయంలో 2020 ఫిబ్రవరిలో ఉత్తర–తూర్పు ఢిల్లీలో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ గొడవల్లో53 మంది మరణించగా.. వందలాది సంఖ్యలో గాయపడ్డారు. ఆ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ఈ కుట్రలో ఉమర్ ఖాలిద్ కూడా భాగస్వామి అని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టారు. జామియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా... అల్లర్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారని... రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసను ప్రేరేపించారంటూ UAPA, IPC ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉమర్ ఖాలిద్ను, ఆయనతో పాటు షర్జీల్ ఇమాంలను 2020 సెప్టెంబర్లో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు అదే జైలులో ఉన్నారు.బెయిల్ కోసం వారి తరపు న్యాయవాదులు తొలుత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఢిల్లీ కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపిస్తూ.. పిటిషన్దారులు అకస్మాత్తుగా అల్లర్లకు పాల్పడలేదని.. పూర్తి ప్రణాళికతోనే అల్లర్లు జరిగాయని.. కోర్టుకు నివేదించారు.నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రాలు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్.., అంజారియాల ధర్మా సనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, ప్రభుత్వాన్ని విమర్శించే స్వరాలను అణచివేయడమే లక్ష్యం అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మానవ హక్కుల సంస్థలు దీన్ని ప్రజాస్వామ్య సంక్షోభంగా అభివర్ణిస్తున్నాయి.ఐదేళ్ల నుంచి బెయిల్ దొరక్క.. జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్కు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి అందుతోంది. ఆధారాల్లేకుండానే ఉమర్ ఖాలిద్ ఇండియన్ జైల్లో మగ్గుతున్నాడని... న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ఢిల్లీ అల్లర్ల కేసులో తీహార్ జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన “మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని పేర్కొంటూ.. ఖాలిద్కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాశారు.తన లేఖలో ఖాలిద్కు మానసిక ధైర్యం ఇవ్వాలని ప్రయత్నించారు. ఆయన “మీరు ఒంటరిగా లేరు, మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని రాశారు.ఈ లేఖతో ఖాలిద్ కేసు అంతర్జాతీయ వేదికపై మరింత చర్చకు వచ్చింది. అమెరికాలోని రాజకీయ నాయకులు కూడా భారతదేశంలో మానవ హక్కుల అంశాల గురించి చర్చిస్తున్నారనడనికి ఈ లేఖ ఓ ఉదాహరణ.జోహ్రాన్ మమ్దానీ ఉగాండా దేశంలోని కంపాలలో 1991 అక్టోబర్ 18, జన్మించారు. 2021 నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2025 ఎన్నికల్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇతర దేశానికి చెందిన ఓ ఉన్నత స్థాయి నాయకుడు జైల్లో ఉన్న వ్యక్తికి లేఖ రాయడంతో.. ఉమర్ ఖాలిద్కు మరింత గుర్తింపు తెచ్చిఇచ్చింది.లేఖ సాధారణమే.. అయినప్పటికీ.. రాసిన లేఖ ఎఫెక్ట్ ప్రపంచంపై పడే అవకామంది. ఖాలిద్ వంటి కార్యకర్తలకు ఇది మానసిక ధైర్యం ఇస్తుంది. భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్- అమెరికాల సంబంధంపైనా ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా మాత్రమే కాకుండా... అమెరికా, యూరప్లోని కొన్ని రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంస్థలు ఖాలిద్కు మద్దతు తెలుపుతూ... ఆయనపై కేసు రాజకీయ ప్రయోజనాలకోసం పెట్టారని ఆరోపించారు. -
ఇంటర్నెట్పై ఇరాన్ కీలక నిర్ణయం
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో తగ్గినట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై కఠిన ఆంక్షలు విధించిన దేశాల్లో ఇరాన్ టాఫ్ ప్లేసులో ఉందని అక్కడి సర్వేలు పేర్కొన్నాయి.ఇరాన్లో ప్రస్తుతం ఆర్థికసంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, మానవహక్కుల ఉల్లంఘన తదితర కారణాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ వాడకంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోషల్ మీడియాలతో పాటు ఇతర సాధనాలపై బ్యాన్ విధించింది.దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు ఉండడంతో ప్రధాన సోషల్ మీడియా సాధనాలైన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర వాటిపై పూర్తిస్థాయిలో నిషేదం విధించింది. అదే ఇరాన్- ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో దాదాపు పూర్తి స్థాయిలో దాదాపు 90 నుంచి 97శాతం ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కంటెంట్పై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్లను ప్రసారం కాకుండా ఆంక్షలు విధించింది.డిజిటల్ అపార్థైడ్ అంతేకాకుండా ఇరాన్లో ఇప్పుడు అనుమతి ఉన్న వ్యక్తులు, సంస్థలకు మాత్రమే వైట్ సిమ్ కార్డులు ఇస్తున్నారు. ఇవి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇంటర్నెట్కు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలు పొందగలరు. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ వాడకంపై కొన్ని పరిమితులు కల్పించబడ్డాయి. దీంతో ఈనియమంపై అక్కడ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.ఇలా నిరంతరంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతో ఆదేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ ట్రెండ్ నడస్తున్న నేపథ్యంలో రోజువారీ దైనందిన అవసరాలకు ఇంటర్నెట్ అవసరమైన నేపథ్యంలో ఆంక్షలు నేపథ్యంలో ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.అంతేకాకుండా ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ నుండి దేశాన్ని వేరుచేసి ఇరాన్కు చెందిన ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
పాక్ కొంప ముంచిన.. ఛాయ్.. చక్కెర
ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ అంటూ.. తేనీటిపై పాటలు విన్నాం..! ఛాయ్ వాలా ప్రధాని కావడం.. ఆపై ‘ఛాయ్ పే చర్చా’తో దేశ ప్రజలను ఆకట్టుకోవడం చూశాం..! కానీ, ఆ ఛాయ్ ఇప్పుడు పాకిస్థాన్ కొంప ముంచిందంటే నమ్ముతారా?? మీరు ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం..! పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా.. ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైతే.. చక్కెర ఎక్కువగా వాడితే ఏమౌతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడడం గమనార్హం..!పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! ఇంటికి చుట్టమొచ్చినా.. మిత్రులొచ్చినా.. టీతో ట్రీట్ జరగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్.. ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్కు నిత్యం దిగుమతి అవుతుంది. తేయాకును పండించే వాతావరణం పాక్లో లేకపోవడంతో.. ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు.పాకిస్థాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగు ఉన్నా.. గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా..! ఛాయ్తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్లలో సోడాలు అవసరం. ఏదైనా సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీల ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.ఇక పాకిస్థాన్లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెబుతున్నాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని కోల్పోతోందంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఇక పాకిస్థాన్లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయి. సింధూ నాగరికత ఆనవాళ్లు పాకిస్థాన్ మొహంజోదారోలోనే ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ::: హెచ్.కమలాపతిరావు -
వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది మేమే: ట్రంప్
కరాకస్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా వెనెజువెలాపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. వెనెజువెలా రాజధాని కరాకస్తో సహా నాలుగు నగరాలను అమెరికా శనివారం రాత్రి లక్ష్యంగా చేసుకుంది. వీటిలో కరాకస్తో పాటు మిరాండా, అరగ్వా,లా గ్వైరా రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా ఏడు వైమానిక దాడులు చేసింది. ఫలితంగా వెనెజువెలాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం అధికారిక ప్రకటన చేసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొలి దాడి జరిగింది. అమెరికా మీడియా సీబీఎస్ న్యూస్ ప్రకారం, వెనెజువెలా లోపల సైనిక స్థావరాలు, అనేక నిర్దిష్ట ప్రదేశాలపై దాడికి ట్రంప్ ఆదేశించారు. ఈ దాడికి సంబంధించిన వైరల్ వీడియోలో సుమారు పదుల సంఖ్యలో హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టాయి. -
Bangladesh: గాయపడ్డ హిందూ వ్యాపారి మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఆందోళనకారులు చేసిన దాడిలో గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకాన్ దాస్ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(జనవరి 3వ తేదీ) కన్నుమూశాడు. భర్త కన్నుమూయడంతో భార్య సీమా దాస్ కన్నీరుమున్నీరవుతుంది. తన భర్తపై దాడి ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు ఈ ప్రాంతంలో ఎవరూ శత్రువులు లేరని, కానీ తన భర్తపై దారణంగా దాడి చేసి చావుకు కారణం కావడం తనకు అంతులేని ఆవేదన మిగిల్చిందన్నారు. కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. రెండు రోజల క్రితం ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూర్చింది. -
అమెరికా దాడులు.. వెనెజులాలో ఎమర్జెన్సీ విధింపు
అమెరికా వైమానిక దాడులతో దక్షిణి అమెరికా దేశం వెనెజులా దద్దరిల్లింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఆ దేశ రాజధాని కరాకస్తో దాడులు మొదలయ్యాయి. అసలేం జరగుతుందో అర్థంకాక జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ పేలుళ్ల తర్వాత.. కరాకస్ సిటీ అంధకారంగా మారింది. కీలకమైన పోర్ట్, ఎయిర్పోర్టులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కరాకస్ నుంచి మొదలైన దాడులు.. క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ(మిరాండా, అరాగ్వా, లా గువైరా) కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడులు అమెరికా పనేనని ఆరోపించిన వెనెజులా జాతీయ అత్యవసర పరిస్థితి(Emergency in Venezuela) ప్రకటించింది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైనా దాడులు జరుగుతున్నట్లు చెబుతోంది. పలుచోట్ల రక్షణ దళాలను మోహరింపజేసింది. అమెరికా సైన్యం వెనిజులాపై దాడులు ప్రారంభించిందని ఫాక్స్ న్యూస్ వర్గాలు వాషింగ్టన్ అధికారులను ఉటంకిస్తూ నివేదించాయి. ఈ దాడుల లక్ష్యం దేశంలోని చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడం కోసమేనని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీయడం అని వెనెజులా ఆరోపించింది. అయితే, గతంలోలాగే ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు కూడా విఫలమవుతాయని అంటోంది. అయితే అమెరికా ఈ దాడులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వేకువజామున కరాకస్లో మొత్తం ఏడు చోట్ల పేలుళ్లు సంభవించినట్లు ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించింది. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు శబ్దాలూ వినిపించాయని స్థానికులు చెప్పినట్లు ఆ కథనం ఉటంకించింది.que dios bendiga a todas las personas inocentes que quedaron en medio del bombardeo en caracas - venezuela pic.twitter.com/etH1wbo1sa— haaland erling (@gxldehaalandd) January 3, 2026ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ ఆదేశాల మేరకు డ్రగ్స్ను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై దాడుల్ని ముమ్మరం చేసింది. కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. దీనికి కౌంటర్గా అమెరికన్ పౌరులను వెనెజులా అరెస్ట్ చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ పరిణామాల నడుమ వైమానిక దాడులకు దిగడం గమనార్హం.వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.. చైనా ప్రత్యేక దౌత్యవేత్త క్వీ గ్సియాగితో భేటీ అయిన కొద్దిగంటలకే ఈ దాడులు జరిగాయి. వెనెజులా అధ్యక్ష భవనం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్ల ఆ చుట్టుపక్కల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.ఈ పేలుళ్ల గురించి ట్రంప్నకు స్పష్టమైన సమాచారం ఉందని సీబీఎస్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. పేలుళ్ల నేపథ్యంతో అమెరికా తమ దేశ విమానాలు వెనెజులా గగనతలం నుంచి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. స్థానికంగా ఉండే సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఒకరు పేలుడుకు సంబంధించిన పోస్ట్ ఒకటి చేశారు. శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయని.. ఆ ధాటికి తాను ఉంటున్న కిటికీ అద్దాలు పగిలిపోయాయని చెప్పుకొచ్చారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ పేలుళ్లపై స్పందించారు. వెనెజులా రాజధాని క్షిఫణుల దాడులతో మారుమోగుతోందని.. ప్రపంచం ఈ విషయం గమనించాలని అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్(OAS), ఐక్యరాజ్య సమితి తక్షణమే సమావేశం నిర్వహించాల్సి ఉందంటూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్చేశారాయన. -
రెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు!
ఇరాన్లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. -
బలూచిస్తాన్పై చైనా కన్నుపడిందా?
విదేశీ భూభాగాలపై కన్నేయడం చైనాకు పరిపాటి. అది పొరుగు దేశమైతే చైనా చర్యలు మరీ అతిగా ఉంటాయి. ఈ క్రమంలోనే వేరే దేశం భూభాగాన్ని తమ మ్యాప్లో కూడా చూపించడానికి చైనా వెనుకాడదు. ముందు ఒక రాయి వేసి.. తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ని పదే పదే చైనా తమ భూభాగంలో చూపించడం ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ భారత్ బలమైన దేశం అనేది ఒకటైతే, ఇప్పుడు చైనాకు భారత్ సాయం అవసరం ఉంది కాబట్టి వారు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. గత కొన్నేళ్లుగా భారత్పై దూకుడుగా ఉండే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు వేరే దేశాలపై పడింది. అందులో ఒకటి రష్యా అయితే, మరొకటి పాకిస్తాన్.కొన్ని రోజుల క్రితం రష్యా భూభాగాన్ని తమ మ్యాప్లో చూపించిన చైనా.. ఇప్పుడు పాకిస్తాన్ను టార్గెట్ చేసింది. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశమే కానీ, అవకాశం వస్తే తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనే నైజం చైనాది. ఆ క్రమంలోనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ భూభాగంపై చైనా కన్నేసినట్లు కనబడుతోంది. ఎప్పుట్నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్.. సుదీర్ఘ పోరాటం చేస్తుంది. తమ హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని, అందుకు తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఎక్కువైంది. పాక్పై ప్రేమా..యురేనియం నిల్వలే టార్గెటా?బలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయనేది కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో చైనా ఆచితూచి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్కు సైనిక సాయం పేరుతో ముందుగా వారి భూభాగంలోకి ప్రవేశించాలని చైనా కుట్ర రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అందిందే జుట్ట.. అందకపోతే స్నేహం అనేది చైనా వైఖరి. ఇప్పడు భారత్ విషయంలో చైనా అదే చేస్తంది. మరి పాకిస్తాన్ విషయంలో చైనా అలా ఎందుకు ఆలోచించదని నిపుణులు చెబుతున్న మాట,. ప్రస్తుతం పాకిస్తాన్క సైనిక సాయం పేరుతో చైనా ఒక అడుగు ముందకేసి, ఆ తర్వాత మిగతాది చూసుకోవచ్చనే దృష్టితో ఉందని అంటున్నారు.బలూచిస్తాన్లో యురేనియం నిల్వల పరిస్థితిబలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు కూడా భద్రతా, భౌగోళిక రాజకీయ పరంగా ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ స్థాయి యురేనియం నిల్వల జాబితాలో పాకిస్తాన్ పేరు ఉన్నప్పటికీ, బలూచిస్తాన్లోని నిల్వల ఖచ్చితమైన పరిమాణం అంతర్జాతీయ నివేదికల్లో స్పష్టంగా ఇవ్వబడలేదు. ఈ వనరుల కారణంగా స్థానిక ప్రజల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా తవ్వకాలు, వినియోగం కష్టతరంగా మారాయి. ఓవరాల్గా చూస్తే ఈ వనరులు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనా పెట్టుబడులు, స్థానిక అసంతృప్తి, మరియు అంతర్జాతీయ ఆసక్తి కారణంగా ఇవి సున్నితమైన అంశంగా మారాయి.బలూచిస్తాన్ నేతల్లో అదే ఆందోళన..ప్రస్తుతం బలూచిస్తాన్ నేతల్లో అదే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడటానికే తాము ఆపసోపాల పడుతుంటే, మరొకవైప చైనా గోల ఏమిటో వారికి అంతుపట్టడం లేదు. తమ భూభాగంలోకి చైనా సైనిక దళాలు వస్తాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు భారత్ సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అందుకోసమే భారత్ సాయాన్ని పదే పదే కోరుతున్నారు. అయితే బలూచిస్తాన్కు సాయం విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ను కూడా పూర్తిగా నమ్మలేం. అసలే ఉగ్రవాద మూలాలున్న బలూచిస్తాన్కు సాయం చేస్తే తర్వాత భారత్కు విపత్కర పరిస్థితుల ఏర్పడవచ్చు.అందుకోసమేనా ఎదురుచూపులు?తమకు అవకాశం వచ్చినప్పుడల్ల పాకిస్తాన్తో యద్ధానికి కూడా సై అంటోంది బలూచిస్తాన్. అయితే జనాభా పరంగా చూసినా, బలూచిస్తాన్ రెబల్స్ ప్రకారం చూసినా.. ఒక దేశంతో పోరాడాలంటే వారి శక్తి సరిపోదు. ఈ తరుణంలో తమ భూభాగంలోకి చైనా వైమానిక దళాలు త్వరలో రాబోతున్నాయని బలూచిస్తాన్ అగ్రనేత మిర్ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం భారత్ సాయాన్ని కూడా అభ్యర్థించారు. దశాబ్దాల క్రితం పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ తరహాలో తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ నేతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఎలా అయితే భారత్ సాయం చేసిందో ఇప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్కు సైతం బలూచిస్తాన్ నుంచి లేఖ వచ్చింది.బలూచిస్తాన్ సాయం విషయంలో భారత్ ఎటువంటి దూకడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్కు సైనిక బలం కావాలి కాబట్టి. భారత్ సాయాన్ని కోరుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ తరుణంలో బలూచిస్తాన్కు భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ నుంచి మరొకసారి ముప్పు ఎదురైన పక్షంలో భారత్ తమ ఉన్న వనురులను ఉపయోగించుకునే ముందుకెళ్తుంది. అది బలూచిస్తాన్కు పరోక్షంగా కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే త్వరలో ఆపరేషన్ 2.0 అని వార్త ఇప్పుడు మరొక ఆసక్తిని పెంచుతుంది. మార్చి నెలలో పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0ను చేపట్టనుందనే ఇప్పుడు దాయాది దేశం ఉగ్రవాదుల్లో గుబుల పుట్టిస్తోంది. మరొకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే, సందట్లో సడేమియా అన్నట్లు తాము కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపించాలని బలూచిస్తాన్ రెబల్స్ భావిస్తున్నారు. -
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
అమెరికాలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయ్యింది. ఐసిస్తో సంబంధాలున్న ఓ టీనేజర్ను ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుంది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా దాడులకు అతను ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థ చీఫ్ కాష్ పటేల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా యువత ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా సారిస్తామని ప్రకటించారాయన. పక్కా సమాచారంతో నార్త్ కరోలినాలోని షార్లెట్ సమీపంలో మింట్ హిల్ ప్రాంతానికి చెందిన ఓ టీనేజర్ను ఎఫ్ఐబీ అదుపులోకి తీసుకుంది. అతని నుంచి దాడికి సంబంధించిన ప్రణాళికను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా రద్దీగా ఉండే ఓ గ్రాసరీ స్టోర్, మరో ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లో మారణహోమం జరపాలని చూశాడని కాష్ పటేల్ మీడియాకు వెల్లడించారు. ఐసిస్ లింకులుఎఫ్బీఐ అదుపులో ఉన్న టీనేజర్ పేరు క్రిస్టియన్ స్టర్డివాంట్. వయసు 18 ఏళ్లు. ఐసిస్ ప్రేరణతోనే అతను దాడులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా విదేశీ ఉగ్రసంస్థ అతనికి బ్రెయిన్వాష్ చేసిందని ఎఫ్బీఐ ప్రకటించింది. ‘‘మూడేళ్లుగా అతనిపై నిఘా ఉంచాం. యూరప్లోని ఓ ఐసిస్ సభ్యుడితో కాంటాక్ట్లో ఉన్నాడు. అక్కడి నుంచి అతనికి ఆన్లైన్లో ఆదేశాలు అందేవి. నల్ల దుస్తుల్లో దాడులకు పాల్పడాలని అతనికి సమాచారం అందింది. తనను తాను ఐసిస్ సైనికుడిగా ప్రకటించుకుని.. దాడికి సిద్ధమంటూ అవతలి వాళ్లకు డిసెంబర్ 12వ తేదీన ఓ సందేశం పంపాడు. ఈ దాడికి తాను పని చేసే చోట్లనే ఎంచుకున్నాడు. ముస్లింయేతర గ్రూపులు, ఎల్జీబీటీక్యూలను, యూదులు, క్రిస్టియన్లపై దాడుల చేయాలని తన బుక్లో రాసుకున్నాడు. ఐసిస్కు సంబంధించి టిక్టాక్ వీడియోలను ఇతను ప్రొత్సహించాడు. అతని మానసిక స్థితి కూడా బాగోలేదు. గతంలో చికిత్స తీసుకున్నట్లు ఆధారలు లభించాయి’’ అని అధికారులు తెలిపారు.అయితే తుపాకులు, బాంబులతో కాకుండా కత్తులు, హ్యమర్లతో దాడికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయుధాల్ని ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు.. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ (US Justice Department) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యువతలో ఈ తరహా సంబంధాలపై నిఘా, దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సూచించింది.ఆ పేపర్పై.. మింట్హిల్లోని క్రిస్టియన్ ఇంటిని తనిఖీలు నిర్వహించినప్పుడు “New Years Attack 2026” అనే టైటిల్తో ఉన్న ఒక బుక్ను గమనించారు. అందులో దాడి ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలి.. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అనే వివరాలు ఉన్నట్లు ఎఫ్ఐబీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన అతనిపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి.. నిన్న కోర్టులో హాజరు పరిచారు. నార్త్ కరోలినా వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ యుఎస్ అటార్నీ రస్ ఫెర్గుసన్ ‘‘క్రిస్టియన్ స్టిర్టివాంట్ జిహాద్కు సిద్ధమయ్యాడు. కాస్తుంటే అమాయకులు ప్రాణాలు పోయేవే’’ అని వ్యాఖ్యానించారు. స్టర్డివాంట్ తనపై ఆరోపణలకు ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం కస్టడీలోనే ఉన్న అతన్ని.. వచ్చే వారం ఎఫ్బీఐ కోర్టులో హాజరు పర్చనుంది. -
అర్ధరాత్రి, వణికించే చలిలో క్యాబ్లోనే ప్రసవం
టొరంటో: అర్ధరాత్రి. ఎముకలు కొరికే చలి. ఏకంగా మైనస్ 23 డిగ్రీల అతి శీతల వాతావరణం. వెనక సీట్లో నిండు గర్భిణి ప్రసవ వేదన. టైర్లకు అస్సలు పట్టు దొరక్క రోడ్డుపై నుంచి పక్కలకు జారిపోతున్న కారు. ఇంకోవైపు నొప్పులు భరించలేక సీటును తంతూ, కేకలు పెడుతూ ఆమె పడుతున్న వేదన. పక్కనే కూచుని బిక్కచచ్చిపోయి చూస్తున్న భర్త. ఆ అరుపుల్ని ఉంటూ, ఆమె బాధను వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ, అత్యంత ప్రతికూలమైన ఆ పరిస్థితుల్లో తనను తక్షణం ఆస్పత్రికి చేర్చాల్సిన బాధ్యత. కెనడాలో (Canada) భారత సంతతికి చెందిన హర్ దీప్ సింగ్ తూర్ అనే క్యాబ్ డ్రైవర్ తన వృత్తి జీవితంలోనే ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇది. దీనికి తోడు ప్రతి జంక్షన్ లోనూ రెడ్ సిగ్నల్స్. అయినా అన్నింటికీ తట్టుకుంటూ పళ్ల బిగువున దూసుకెళ్లారాయన. అయితే ఆస్పత్రి కనుచూపు మేరలో ఉండగానే కారు వెనక సీటులోనే ప్రసవించిందా మహిళ. అనంతరం కొన్ని క్షణాల్లోనే తల్లీబిడ్డా ఇద్దరినీ భద్రంగా ఆస్పత్రికి చేరవేసి ఊపిరి పీల్చుకున్నారు హర్ దీప్. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గత శనివారం టొరంటోలో జరిగింది. ఆ అనుభవాన్ని ఆయన స్థానిక మీడియాతో పంచుకున్నారు. ‘ఇక ఇంటిముఖం పడదామని అనుకుంటుండగా ఓ బుకింగ్ వచ్చింది. అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. తీరా పికప్కు వెళ్లాక నిండు గర్భిణిని ఆమె సహచరుడు అతి కష్టమ్మీద తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టాడు. కార్లో ప్రయాణం ఆమెకు సేఫ్ కాదనిపించింది. అంబులెన్స్ పిలుద్దామా అని ఆలోచించా. కానీ అర్ధరాత్రి, అంత చలిలో అది రావడానికి సమయం పడుతుంది. అంత ఆలస్యం చేస్తే ప్రమాదమని తెగించి బయల్దేరా. ఆ అరగంట డ్రైవ్ నా జీవితంలోనే అతి సుదీర్ఘమైనదిగా తోచింది. ఎలాగైతేనేం, చివరికి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది‘ అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరిని ఎక్కించుకుని ముగ్గురిని దించిన ఘనత తనకే దక్కిందంటూ నవ్వులు పూయించారు.చదవండి: ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి! -
నేడు మరో నూతన సంవత్సరం.. కోలాహలానికి భిన్నంగా..
క్యాలెండర్లో పేజీలు మారడం అనేది కేవలం కాలగమన సూచిక మాత్రమే కాదు.. అది మనిషి తనను తాను పునరావిష్కరించుకునేందుకు ఏర్పడిన ఒక అద్భుత అవకాశం. దానిని గుర్తు చేసేదే ‘మహాయాన నూతన సంవత్సరం’ నేడు(జనవరి 3) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ అనుచరులు ‘మహాయాన నూతన సంవత్సరం’ జరుపుకుంటున్నారు. ఈ రోజున వారంతా అంతర్గత మౌనం, ఆత్మపరిశీలనకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని, కరుణను బోధించే మహాయాన బౌద్ధులు నూతన సంవత్సర వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026, జనవరి 3వ తేదీన చైనా, జపాన్, టిబెట్, కొరియా తదితర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాయాన బౌద్ధులు ఆధ్యాత్మిక వెలుగుల మధ్య ఈ పర్వదినాన్ని చేసుకుంటున్నారు.'మహాయాన'.. అందరికీ విముక్తి మార్గంసంస్కృతంలో ‘మహాయాన’ అంటే ‘గొప్ప వాహనం’ అని అర్థం. కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరికీ జ్ఞానోదయం పొందే అవకాశం ఉందని ‘మహాయాన’ సిద్ధాంతం బలంగా నమ్ముతుంది. సన్యాసులతో పాటు సామాన్య గృహస్థులు కూడా తమ దైనందిన జీవితంలోనే నిర్వాణాన్ని సాధించవచ్చని మహాయానశాఖ బోధిస్తుంది.ఆత్మపరిశీలనతో..బౌద్ధ నూతన సంవత్సరం అంటే కేవలం బాహ్య సంబరాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది అంతర్గత శుద్ధికి ప్రతీక. గత ఏడాది చేసిన పొరపాట్లన్నింటినీ సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరంలో మరింత ఉత్తమమైన వ్యక్తిగా ఎదగాలని సంకల్పించడం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని. తనను తాను తెలుసుకోవడమే నిజమైన విజయమని చెప్పిన బుద్ధుని బోధనలను అతని అనుచరులు ఈ సందర్భంగా స్మరించుకుంటారు.బౌద్ధ విహారాల్లో ఆధ్యాత్మిక కోలాహలంఈ పర్వదినాన బౌద్ధ విహారాలు భక్తులతో నిండిపోతాయి. దేవతామూర్తుల విగ్రహాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించడం ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. కొవ్వొత్తుల వెలుగులో ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ, లోకంలోని అజ్ఞాన చీకట్లు తొలగిపోవాలని భక్తులు ప్రార్థిస్తారు.అదృష్టానికి చిహ్నంగా గృహాలంకరణమహాయాన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బౌద్ధులు తమ ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల దీపాలతో, అలంకరణలతో ముస్తాబు చేస్తారు. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూలతను ఆహ్వానిస్తుందని వారు నమ్ముతారు. స్నేహితులు, బంధువులు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటారు. తద్వారా తమలోని ప్రేమను, ఐక్యతను చాటుకుంటారు.సంప్రదాయ విందులు ఈ పండుగలో భక్తితో పాటు వినోదం కూడా తోడవుతుంది. బౌద్ధ అనుచరులు రాత్రి వేళ కుటుంబ సభ్యులందరితో కలిసి విందు భోజనాలు ఆరగిస్తారు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో బాణసంచా వెలుగులు విరజిమ్ముతుండగా, సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.చారిత్రక వారసత్వంక్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో సిద్ధార్థుడు జన్మించాడు. క్రీ.పూ. 528లో బోధగయలో జ్ఞానోదయం పొందిన ఆయన ‘బుద్ధుడు’గా అవతరించాడు. అశోక చక్రవర్తి హయాంలో ఆసియా ఖండమంతటా విస్తరించిన బౌద్ధ జీవన విధానం.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శాంతిని అందించే మార్గదర్శిగా నిలిచింది.మతం కాదు.. జీవన విధానంప్రస్తుత ఆధునిక కాలంలో బౌద్ధాన్ని ఒక మతంగా కంటే ఒక సైకాలజీగా (మనస్తత్వ శాస్త్రం) ప్రపంచం గుర్తిస్తోంది. ఆడంబరాలకు దూరంగా, కేవలం మానసిక ప్రశాంతత, అహింస, కరుణ ప్రాతిపదికన ఈ పండుగ చేసుకుంటారు. ఏ దేశానికి ఉన్న ఆచారాల ప్రకారం వారు ఈ ఉత్సవాన్ని జరుపుకున్నా, దాని పరమార్థం మాత్రం ఒక్కటే.. అదే శాంతియుత జీవనం విధానం.శాంతి మంత్రమే రక్షప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న నేటి తరుణంలో, మహాయాన నూతన సంవత్సరం శాంతి సందేశాన్ని అందరికీ అందిస్తోంది. ‘అప్పో దీపో భవ’ (నీకు నీవే కాంతివి కావాలి) అన్న బుద్ధుడి మాటలను స్మరించుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జ్ఞానమనే జ్యోతిని తమలో వెలిగించుకోవాలని బౌద్ధ మతం మనకు చెబుతోంది.ఇది కూడా చదవండి: తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా.. -
ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు
మనూళ్లో తాగిన మైకంలో వేరే వాళ్ల చెప్పులు వేసుకుని వెళ్లేవారిని చూస్తుంటాం, అమెరికాలో ఒక ఘరానా దొంగ మందు మత్తులో మ్యూజిక్ దుకాణంలోకి దూరాడు. రెండు ఖరీదైన మ్యాండోలిన్లను లేపేశాడు. సీన్ కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత దొంగగారిలో జ్ఞానోదయం కలిగింది. అసలేం జరిగిందంటే.. న్యూజెర్సీలోని ఒక పాతకాలపు మ్యూజిక్ దుకాణంలోకి డిసెంబర్ 22న ఒక దొంగ ప్రవేశించాడు. సుమారు రూ.7 లక్షల రూపాయల విలువైన రెండు మ్యాండోలిన్లను గుట్టుచప్పుడు కాకుండా తన కోటు లోపల దాచేసి చెక్కేశాడు.మైకం దిగాక పశ్చాత్తాపం పాపం, ఆ దొంగగారికి మత్తు దిగాక తాను ఏం చేశానో తెలిసి గుండె ఝల్లుమంది! వెంటనే ఆ రెండు వాయిద్యాలను రెండు క్యారీ బ్యాగుల్లో సర్దుకుని, నేరుగా మ్యూజిక్ దుకా ణం గుమ్మం ముందు పెట్టేసి పరుగు లంఘించుకున్నాడు. అంతేనా.. దాంతో పాటు క్షమాపణ లేఖ కూడా రాసి పెట్టాడు. అందులో మేటర్ చూసి షాపు యజమా ని బజ్జీ లెవిన్ బుర్ర పాడైపోయింది. ‘అయ్యా క్షమించండి! ఆ రోజు ఫుల్లుగా తాగి ఉన్నాను. అందుకే ఇలా జరిగింది. మెర్రీ క్రిస్మస్! మీరు చాలా మంచోళ్ళు సార్!’.. ఇదీ లేఖ సారాంశం.ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అది చూసిన యజమాని బజ్జీ లెవిన్, ‘వీడెవడ్రా బాబూ ఇంత వెరైటీగా ఉన్నాడు’.. అని ఆశ్చర్యపోయాడు. వస్తువులు పెట్టేసి దొంగ పరిగెడుతుంటే, యజమాని కూడా వెనకాలే పరుగు అందుకున్నాడు. కానీ ఆ దొంగగారు ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా మాయమైపోయారు. ‘నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదు బాబోయ్’.. అని యజమాని నెత్తీనోరు కొట్టుకుంటున్నాడు. చిలిపి దొంగ కోసం గాలింపు చివరికి 911కి ఫోన్ చేస్తే, పోలీసులు ఇప్పుడు ఆ మందుబాబు కోసం గాలిస్తున్నారు. మందులో ఉన్నప్పుడు మ్యాండోలిన్ గుర్తొచ్చింది.. మత్తు దిగాక మాత్రం మనస్సాక్షి గుర్తొచి్చంది’.. అని జనం నవ్వుకుంటున్నారు. పాపం.. మందు కొట్టి దొంగతనం చేసినా, ’మెర్రీ క్రిస్మస్’ చెప్పడం మాత్రం మర్చి పోలేదు మన చిలిపి దొంగ. -
మళ్లీ కిమ్ కుమార్తె హల్ చల్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించారు. గురువారం కొత్త సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి తాత, ముత్తాతల సమా«ధిని ఆమె తొలిసారి బహిరంగంగా సందర్శించారు. తల్లిదండ్రులతో ముందు వరుసలో నిలబడి ‘కుముసుసన్’స్మారకానికి నమస్కరిస్తున్న చిత్రం శుక్రవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాలో ప్రచురితమైంది. 41 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాను పరిపాలిస్తున్న తన కుటుంబంలోని మూడోతరం నాయకుడు. 2022 నవంబర్లో మొదటిసారిగా కిమ్ కుమార్తె ప్రభుత్వ మీడియాలో కనిపించారు. అప్పటినుంచి పైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాలతో సహా అనేక కార్యక్రమాల్లో తన తండ్రితో పాటు పాల్గొంటున్నారు. గతేడాది సెప్టెంబర్లోకిమ్ చైనా పర్యటనలోనూ ఆమె వెంట ఉన్నారు. కిమ్ ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఆయనకెలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. దానికి తోడు ఉత్తర కొరియా అత్యంత పురుషాధిక్య స్వభావం కలిగిన దేశం. అలాంటిది కిమ్ తన కుమార్తెను బయటి ప్రపంచానికి పదేపదే కనిపించేలా చేయడం ఆశ్చర్యం కలిగిండచంతోపాటు చర్చనీయాంశం కూడా అయ్యింది. కుటుంబ పాలనను విస్తరించాలనే ఆలోచనలకు ప్రజల మద్దతును పెంచుకోవడం కోసమే కిమ్ ఇలా కూతురును ముందుకు తెస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. -
మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం
న్యూయార్క్: ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్కు అమెరికాలోని న్యూయార్క్ నూతన మేయర్ జొహ్రాన్ మమ్దానీ మద్దతు తెలపడం తీవ్ర వివాదం రేపుతోంది. ‘డియర్ ఉమర్, విద్వేషం, చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటలను, అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరును నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ తల్లిదండ్రులను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’అని ఆ నోట్లో ఉంది. మమ్దానీ స్వయంగా రాసి సంతకం చేసిన ఆ నోట్ను ఆయన భాగస్వామి బనోజ్యోత్స్న లాహరి ఎక్స్లో.. ‘జైళ్లు ఒంటరిని చేయడానికి ప్రయతి్నస్తే మాటలు ప్రయాణిస్తాయి. ఉమర్ ఖలీద్కు జొహ్రాన్ మమ్దానీ ఇలా రాశారు..’అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. ఢిల్లీలో 2020 లో చెలరేగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది క్షతగాత్రులయ్యారు. ఈ గొడవలకు ఖలీద్, తదితరులు కుట్ర పన్నారనే ఆరోపణలపై అధికారులు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)తోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత రాయబారికి ప్రజా ప్రతినిధులు లేఖ ఉమర్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అమెరికా చట్ట సభల ప్రతినిధులు 8 మంది అక్కడి భారత రాయబారి వినయ్ క్వాత్రా ఒక లేఖ రాశారు. ‘2020 నాటి ఢిల్లీ హింసకు సంబంధించి అరెస్టయిన ఉమర్ ఖలీద్ సహా పలువురి సుదీర్ఘ నిర్బంధంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, స్వేచ్ఛ, చట్టబద్ధత, మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్య ఉంది. ఇదే ఉద్దేశంతో ఖలీద్ నిర్బంధం అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండటం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు’అని వారు అందులో పేర్కొన్నారు. అప్పుడెందుకు మాట్లాడలేదు?: వీహెచ్పీ ఉమర్ ఖలీద్ను విడిచిపెట్టాలంటూ న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీ, అమెరికా ప్రజా ప్రతినిధులు చేసిన వినతిపై బీజేపీ, వీహెచ్పీ తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. భారత్ విభజన గురించి మాట్లాడిన నేరగాడికి మద్దతివ్వడం ఖురాన్ను అగౌరవపర్చడమే అవుతుందని వీహెచ్పీ వ్యాఖ్యానించింది. ఖురాన్పై ప్రమాణం చేసిన మమ్దానీ, ఉమర్ ఖలీద్కు మద్దతు తెలపడం ద్వారా ఆ ఖురాన్ను అవమానించారని పేర్కొంది. బీజేపీ కూడా మమ్దానీ నోట్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. మమ్దానీతోపాటు అమెరికా చట్టసభల ప్రతినిధులు భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. -
ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచి్చ, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. బుధవారం, గురువారం నాలుగు నగరాల్లో నిరసనకారులకు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోంది. మరోవైపు నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. దాంతో రాజధాని టెహ్రాన్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తోంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలని, ధరలు తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వ్యాపార వర్గాలు సైతం ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నాయి. పాతాళానికి రియాల్ విలువ డాలర్తో పోలిస్తే రియాల్ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 42,125 రియాల్స్గా నమోదయ్యింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్టం. ఇరాన్పై అమెరికాతోపాటు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షల ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లో 2022 తర్వాత ప్రజా ఉద్యమం రగులుకోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మాషా అమీనీ అనే యువతిని పోలీసులు నిర్బంధించారు. ఆమె పోలీసు కస్టడీలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలు భద్రతా సిబ్బంది దాడిలో ఏడుగురు మరణించడం పట్ల జనం మండిపడుతున్నారు. తమ పోరాటం ఉధృతం చేస్తామని తేలి్చచెబుతున్నారు. గురువారం లారెస్తాన్ ప్రావిన్స్లోని అజ్నా సిటీలో నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బక్తియారీ ప్రావిన్స్లోని లార్డెగాన్ నగరంలోనూ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్ఫాహాన్ ప్రావిన్స్లో ఉన్న ఫులద్షహర్లో ఒకరు బలయ్యారు. మరోవైపు జనం దాడిలో ఇద్దరు పారామిలటరీ గార్డులు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కౌహదస్త్ నగరంలో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. విదేశీ జోక్యాన్ని సహించం: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తిప్పి కొట్టారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేలి్చచెప్పారు. తమ సమస్యలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకొనే సామర్థ్యం తమకు ఉందన్నారు. ఇరాన్ వ్యవహారాల్లో అనవసరంగా కలుగుజేసుకోవాలని చూడడం సరైంది కాదని సూచించారు. ఇతర దేశాలు ఈ విషయం గుర్తించాలని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్లో అలజడికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఆరోపించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే అమెరికా అంతిమంగా ప్రయోజనాలే దెబ్బతింటాయని స్పష్టంచేశారు. గత ఏడాది జూన్లో ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం ఇరాన్ కరెన్సీ విలువ పడిపోకుండా కాపాడే విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంకేతాలిచ్చారు. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని, ప్రజలు శాంతించాలని కోరారు. నిరసనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్న ట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఘర్షణలో మృతిచెందినవారి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి చావు తప్పదంటూ ఈ సందర్భంగా జనం నినాదాలు చేశారు. హద్దు మీరితే జోక్యం: ట్రంప్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై ఆయుధాలు ప్రయోగిస్తే తాము జోక్యం చేసుకోక తప్పదని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో పోస్టు చేశారు. ప్రజా ఉద్యమం పట్ల ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలపై హద్దు మీరి ప్రవర్తిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. నిరసనకారులను కాపాడుకుంటామన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు. -
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
నేపాల్లోని భద్రాపూర్ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి నది వైపు దూసుకెళ్లింది. అయితే.. కాస్త దూరం వెళ్లి ఆగిపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.08 గంటల సమయంలో చోటుచేసుకుంది. బుద్ధ ఎయిర్వేస్కు చెందిన విమానం 51 మంది ప్రయాణికులు, మరో నలుగురు విమాన సిబ్బందితో నేపాల్ రాజధాని కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23కు బయలుదేరిన విమానం.. 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. రన్వేను దాటుకుని 200 మీటర్ల దూరం వెళ్లి.. గడ్డిలోకి కూరుకుపోయింది. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే.. విమానం నదిలోకి పడిపోయి ఉండేది.విమానం రన్వేపై నుంచి ముందుకు దూసుకుపోవడంతో భారీ కుదుపులు వచ్చాయి. దీంతో.. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు బుద్ధ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (సీఏఏఎన్) అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. -
పుతిన్ సెక్యూరీటి ఎలా ఉంటుందో తెలుసా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు విన్నారా...? వినే ఉంటారు...? చూశారా అంటే అతికొద్ది మంది మాత్రమే చూసి ఉంటారు. ఇక కలిశారా? అని ప్రశ్నిస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..... అదేంటీ... ఓ దేశ అధ్యక్షుడు కొంతమందినే కలిశాడనడమేంటీ అని ఆశ్చర్య పోతున్నారా...? అవును మీరు విన్నది నిజమే. అతని చుట్టూ వలయంలా ఉండే భద్రతా సిబ్బందిని దాటి పుతిన్ను కలవాలంటే... మామూలు విషయం కాదు. అసలు అతనికున్న సెక్యూరిటీని ఛేదించి ముందుకు వెళ్లాలంటే... ఈగలు- దోమలకు కూడా ఆస్కారం లేదు. అంతటి రక్షణ వ్యవస్థతో కూడిన పుతిన్ సెక్యూరిటీతో పోలిస్తే ప్రపంచంలో మరే అధ్యక్షుడికి అంతటి సెక్యూరిటీ లేదనే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడికి మించి ఉన్న అతని భద్రతా వలయం... అతని రక్షణ కోసం నిత్యం జరిగే కసరత్తుపై ఓ సారి ఫోకస్ చేద్దాం.వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో ప్రముఖుల్లో ఒకరు. ఆయనకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన భద్రతా బలగాలు... కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉంటూ... అతనిపై ఈగ కూడా వాలనీయకుండా సిబ్బంది జాగ్రత్త పడుతుంటారు. దానికోసం నమ్మకస్తులైన అతని భద్రతా సిబ్బంది చేసే కసరత్తు... ఓ యంత్రంలా సాగుతుంటుంది. పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది 5 వలయాల్లో ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా... గుర్తించే యంత్రాంగం ఉంటుంది. చివరకు పుతిన్ మల మూత్రాలను కూడా రష్యా తిరిగి తీసుకెళ్తారు.విదేశాల్లో అక్కడి టాయిలెట్ వాడితే... వాటిని సేకరించి... అతని డీఎన్ఏను గుర్తించడం లేదా... పుతిన్కు ఉన్న రోగాల గురించి తెలుసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది... అతని మల మూత్రాలను కూడా ఓ సూట్కేస్లో భద్రపరిచి రష్యాకు తీసుకొస్తారంటే... ఇక అతని సెక్యూరిటీ స్థాయిని గుర్తించవచ్చు. పుతిన్ సెక్యూరిటీ స్థాయి అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ కన్నా మించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనంతో అతి తక్కువగా కలిసే పుతిన్ దగ్గరికి కేవలం అతని కుటుంబీకులు, సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. మిగత వారు అతని వద్దకు రావడం అసాధ్యమే అని చెప్పవచ్చు. ప్రజలతో కాంటాక్ట్ చాలా పరిమితంగా ఉంటుంది. అతనికి దగ్గరగా రావడం దాదాపు అసాధ్యం.పుతిన్ భద్రతా వ్యవస్థను ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనే ప్రత్యేక భద్రతా సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా సిబ్బందితో పాటు ఎలైట్ బాడీగార్డులు, ఇంటెలిజెన్స్ యూనిట్లు పుతిన్ భద్రతలో ఉంటాయి.పుతిన్ మస్కటీర్స్ పేరిట ఉన్న అతని బాడీగార్డులు ఎప్పుడూ అతని చుట్టూ ఓ కంచెలా ఉంటారు. శిక్షణ పొందిన అతని బాడీగార్డులు... అధునాతన ఆయుధాలు ధరించి ఉంటారు. పుతిన్ ఆరస్ సెనేట్ పేరుతో ఉన్న కారులో తిరుగుతారు. సెనేట్ కారు ప్రత్యేకంగా పుతిన్ అధికారిక వినియోగం కోసం తయారైంది. ట్విన్ టర్బో ఇంజిన్తో తయారైన కారు ఎంతో అధునాతనమైంది.లగ్జరీతో పాటు సెక్యూరిటీ... రష్యా తయారీ బ్రాండ్ కారునే పుతిన్ వాడుతారు. ఈ కారు ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లతో...., గ్రనేడ్ దాడులను కూడా తట్టుకునేలా తయారైంది. భోజన విషయంలోనూ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. పుతిన్ కోసం తయారైన భోజనాన్ని తొలుత అతని బాడీగార్డులు రుచి చూస్తారు. ఆ తర్వాతనే పుతిన్కు వడ్డిస్తారు. ఫుడ్ తయారు చేసే షెఫ్లను కూడా తనిఖీలతో పాటు హైజీన్ చెక్లు ఉంటాయి.పుతిన్ అంతర్జాతీయ పర్యటనల సమయంలో భద్రత పటిష్ఠంగా ఉంటుంది. పుతిన్ ఏ దేశం వెళ్లినా... స్థానిక భద్రతా బలగాలతో కలిపి ఐదు- అంచెల సెక్యూరిటీ గ్రిడ్ ఉంటుంది. వాటిలో స్నిపర్ టీమ్స్, ఏఐ ఆధారిత సర్వైలెన్స్ కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసినప్పుడు ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ప్రత్యేక విమానం ద్వారా వెళ్తారు. అందులోనూ బాడీగార్డులు, ఎలైట్ సెక్యూరిటీ, అధికారులు, NSG కమాండోలు, టెక్నాలజీ AI ఆధారిత సర్వైలెన్స్, స్నిపర్ టీమ్స్ ఉంటాయి. అతని పర్యటన, షెడ్యూల్ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. విమానం కూడా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో ఉంటుంది.దాంతో శత్రు క్షిపణులను గుర్తించి తప్పించుకునే టెక్నాలజీ ఆ విమానానికి ఉంది. రాడార్ - జామింగ్ టెక్నాలజీ ద్వారా శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టించే సాంకేతికత కూడా ఉంది. అందులో ఉన్న కమ్యూనికేషన్ సిస్టంతో.... యుద్ధ పరిస్థితుల్లో కూడా రష్యా సైన్యం... ప్రభుత్వంతో నిరంతర సంబంధాలు కలిగి ఉండేలా చర్యలున్నాయి. విమానం ద్వారానే ఎయిర్బోర్న్ కమాండ్ సెంటర్ – ఏర్పాటు చేసి అణు యుద్ధం జరిగినా అధ్యక్షుడు ఆకాశంలో నుంచే ఆదేశాలు ఇవ్వగల సాంకేతికత జోడించి ఉంది. పుతిన్ భద్రతా వ్యవస్థలో అతని వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలు ఎక్కడా లీక్ కాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడతారు. విదేశీ ప్రయాణాల్లో ప్రత్యేక ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. విచిత్రమేమిటంటే... విదేశీ పర్యటనలో అతని బాడీగార్డుల వద్ద పూప్ సూట్కేస్ ఉంటుంది. ఆ సూట్కేస్ కూడా... పుతిన్.. విదేశీ పర్యటనల్లో ఉపయోగించే ఒక విచిత్రమైన భద్రతా ప్రోటోకాల్. అతని బాడీగార్డులు అతని శరీర వ్యర్థాలను మూత్రం, మలము సేకరించి వాటిని ప్రత్యేక సూట్కేస్లో రష్యాకు తీసుకెళ్తారు.దీని ఉద్దేశ్యం అతని ఆరోగ్య స్థితి, DNA వంటి గోప్యమైన సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు చేరకుండా కాపాడటం. పుతిన్ ఎప్పుడూ విదేశాల్లో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించరు. అతని బాడీగార్డులు ప్రత్యేకంగా పూప్ సూట్కేస్లో సేకరించి రష్యాకు తీసుకెళ్తారు. ఈ ప్రోటోకాల్ అసాధారణంగా వినిపించినా, ఇది అత్యంత గట్టి భద్రతా వ్యూహంలో భాగమని రష్యా సైన్యాధికారులు చెబుతున్నారు. ఇంతటి రక్షణ వ్యవస్థలో ఉన్న పుతిన్ సెక్యూరిటీని ఛేదించడం దాదాపు అసాధ్యమే. -
మెక్సికోలో భూకంపం.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు
మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరెరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి, భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి బలంగా కంపించింది. భూకంపం కారణంగా ఒకరు మృతిచెందగా.. 12 మంది గాయపడ్డట్లు మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతి క్లారా బ్రూగాడా తెలిపారు. అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ తన ప్రత్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే భూకంప అలారం మోగడంతో బయటకు వెళ్లి, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి రావడం గమనార్హం. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి నివేదిక బయటకు రాలేదు. కాకపోతే భూకంప తీవ్రత ఎక్కువగానే ఉందని స్థానికులు అంటున్నారు. -
గడ్డం తీస్తే జైలుశిక్షే..?
కాబూల్: వెంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని సామెత ఇప్పుడు ఆఫ్గాన్ దేశంలోని క్షౌరకులుకు సరిగ్గా సరిపోతుంది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడడం ఏమోగాని అక్కడి క్షౌరకుల కుటుంబాలు జీవన ఆధారం లేక తల్లడిల్లిపోతున్నాయి.తాలిబన్ల చట్టం ప్రకారం పురుషులు గడ్డం తీసుకోవడం నేరం అని ఓకవేళ గడ్డాలు తీస్తే 15 నెలల దాకా జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆదేశంలో ప్రస్తుతం హెయిర్ డ్రెస్సింగ్స్ పైనే ఆదారపడాల్సి వస్తుందని తెలిపారుతాలిబన్ల చట్టాన్ని ఒకవేళ ఎవరైనా మగవారి గడ్డం తీస్తే వారికి 15 నెలల జైలుశిక్ష వేయడంతో పాటు ఇతర కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రజలు గడ్డం తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు.అంతేకాకుండా ఇటీవల కొంతమంది యువకులు అక్కడ వెస్ట్రన్ హెయిర్ స్టైల్ చేసుకున్నారని ఆరోపణలతో వారిని తీవ్రంగా కొట్టారని ఆరోపణలున్నాయి. దీంతో అక్కడి హెయిర్డ్రెస్సర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందైతే ప్రజల ఇళ్ల కెళ్లి పురుషులని కటింగ్ అయినా చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.2021లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంటి తమ జీవనోపాధి పెద్దఎత్తున దెబ్బతిందని అక్కడి క్షౌరకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సిరియాలో కొత్త నోట్ల ముద్రణ.. మార్పులు ఇవే
రియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియ మొదలైంది. కొత్త ప్రభుత్వం.. పాత బషర్ అల్-అసద్ చిత్రాలతో ఉన్న నోట్లను తొలగించి, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ ప్రక్రియ 2026 జనవరి 1 నుండి ప్రారంభమైంది. దీన్ని గతేడాది చివరి మాసంలో అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై సిరియా షౌండేషన్ పునర్నిర్మించి.. రెండు సున్నాలు తొలగించారు. ఈ నోట్ల ముద్రణను రష్యా కాంట్రాక్ట్కు తీసుకుంది. కొత్త నోట్లలో గోధుమ, నారింజలు, ఆలివ్, రోజాలు వంటి వ్యవసాయ చిహ్నాలు ఉన్నాయి. బషర్ అల్-అసద్ చిత్రాలను తొలగించి, కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ఆధ్వర్యంలో నోట్లను విడుదల చేశారు.ఈ నోట్ల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం చూరగొంటుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా ఉంది. అయితే అంతర్జాతీయంగా ఈ కొత్త నోట్ల ముద్రణ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నడుమ.. కొత్త కరెన్సీకి అంగీకారం ఎంతవరకూ లభిస్తుందనేది మరొక ప్రశ్నగా మారింది. అయితూ అసద్ చిత్రాలను తొలగించడం ద్వారా కొత్త ప్రభుత్వం ప్రజలకు కొత్త ఆరంభం సంకేతం ఇచ్చింది..మొత్తంగా, సిరియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఆర్థిక పునరుద్ధరణకు ఒక పెద్ద మైలురాయి అవుతుందని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, రాజకీయంగా కొత్త యుగానికి సంకేతమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేస్తుంది. -
ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే?
సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పరిణామాలు వంటి అంశాలపై ఆమె చేసిన సూచనలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. తుఫానులు, వరదలు, భూకంపాలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాల్లో పెద్ద రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని ఆమె ప్రవచించారు. అంతర్జాతీయ స్థాయిలో పవర్ బ్యాలెన్స్ మార్పులు చోటు చేసుకుంటాయని సూచించారు. కొత్త కూటములు ఏర్పడి, పాత కూటములు కూలిపోతాయని అంచనా.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని ఆమె చెప్పారు. కొన్ని దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవడం, మార్కెట్లలో అస్థిరత పెరగడం జరుగుతుందని అంచనా. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(AI), బయోటెక్నాలజీ రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా.బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయి. అయితే, ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా ఉన్నందున, ఆమె ప్రవచనాలు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఓ ప్రముఖ వ్యక్తి మీద పగటి పూట పిడుగు పడి చనిపోతాడు. ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి, కళారంగానికి చెందిన వారేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. 2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలుగా గుర్తించబడుతున్నాయి. -
పాక్లో 8 మంది యూట్యూబర్లకు జీవితఖైదు..
ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అనుకూలంగా వీరు యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఆక్కడి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్చునిచ్చింది. ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి, ప్రభుత్వం, సైన్యం.. ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులను అణచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది. కోర్టు ఏం చెప్పింది?కోర్టు తన తీర్పులో, నిందితుల చర్యలు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఉగ్రవాదంగా పరిగణించబడుతున్నాయని, వారి ఆన్లైన్ కంటెంట్ సమాజంలో భయాన్ని, అశాంతిని వ్యాపింపజేస్తుందని పేర్కొంది. దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ వెలుపల ఉన్నారని , విచారణ సమయంలో హాజరు కాలేదని ధృవీకరించిన కోర్టు.. వారికి జీవితఖైదు విధించింది. దోషులుగా నిర్ధారించబడిన వారు ఎవరు?కోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా తేలిన వారిలో మాజీ సైనిక అధికారులు నుండి యూట్యూబర్లు అయిన ఆదిల్ రాజా, సయ్యద్ అక్బర్ హుస్సేన్, జర్నలిస్టులు వజాహత్ సయీద్ ఖాన్, సబీర్ షకీర్ మరియు షాహీన్ సెహబాయి, వ్యాఖ్యాత హైదర్ రజా మెహదీ, విశ్లేషకుడు మోయిద్ పిర్జాదా ఉన్నారు. -
ఆరోగ్యంపై ట్రంప్ కీలక అప్డేట్
వాషింగ్టన్: అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్స్ట్రీట్ జర్నల్స్కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయిటపెట్టారు.డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్దిరోజులు కనబడపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. "నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను" అని వివరణ ఇవ్వడంతో అప్పట్లో అంతా సైలంట్ అయ్యారు.అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " నా ఆరోగ్యంపై మాట్లాడడం ఇది 25వసారి. గత 25 ఏళ్లుగా ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా. డాక్టర్లు 81mg తీసుకోమని చెబితే, నేను 325mg తీసుకుంటున్నాను. రక్తాన్ని పలుచగా చేయడంలో అంది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నా గుండెలో చిక్కటి రక్తం వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు. వైట్హౌస్లో ఇటీవల జరిగిన కార్యక్రమాలలో తాను వినడానికి ఇబ్బందులు పడుతున్నానని, తరచుగా నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి చర్చించడం తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తోందదన్నారు.. అయితే తనకు వ్యాయామం అంటే అస్సలు నచ్చదని ట్రెడ్మిల్పై నడవడం, పరిగెత్తడం చాలా బోరింగ్గా ఉంటుందని తెలిపారు. తన చేతులపై ఇప్పుడు కొన్ని గాయాలున్నాయని వాటికి 10 నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని వాల్ స్ట్రీట్స్ జనరల్కిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ అదే పెద్దవయస్సు, అయితే 78 సంవత్సరాల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జో బైడెన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. -
చైనా నుంచి మాకు ముప్పు.. మీరు మాతో కలవండి!
బలూచిస్తాన్.. పాకిస్తాన్తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేది వారి లక్ష్యం. ఇందుకోసం గత కొంతకాలంగా పాకిస్తాన్తో పోరాటం చేస్తునే ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. గతంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయ ఎలాగైతే దేశంగా ఏర్పడిందో అదే తరహాలో బలూచిస్తాన్ కూడా పాక్ నుంచి వేరు కావాలని కోరుకుంటోంది. అందుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తోంది. అయితే గతంలో భారత్ సాయం కోరిన బలూచిస్తాన్.. మరొకసారి భారత్ సాయం కోసం అభ్యర్థించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత్ సైన్యం తమతో కలిస్తే పాక్ అంతు చూద్దాం’ అంటూ గతంలో కోరిన బలూచిస్తాన్.. ఇప్పుడు తమకు చైనా నుంచి ముప్పు ఉందని, ఆ క్రమంలోనే భారత్ తమకు సాయం అందించాలని వేడుకుంటోంది. బలూచ్ అగ్రనేత మిర్ యార్ బలూచ్.. ఈ మేరకు భారత్కు లేఖ రాశారు. ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే ‘ మాకు చైనా నుంచి ముప్పు ఉంది. కొన్ని నెలల్లో చైనా బలగాలను మా భూభాగంలో మోహరించే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా పాక్ నుంచి వేరపాటును కోరుకుంటున్నాం. పాక్తో కలిసి ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుఉతుంది. అలాగే అవమానాలను సైతం ఎదుర్కొంటున్నాం. గతేడాది మే 25వ తేదీన మా జాతీయ నాయకత్వం పాక్ నుంచి విడిపోవాలని తీర్మానించింది. అందుకోసమే పోరాటం సాగిస్తున్నాం. ఈ ఏడాది బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడతుందని అనుకంటన్నాం. మాకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలుఅదే సమయంలో పాక్తో యుద్ధంలో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై సైతం బలూచిస్తాన్ నేత మీర్ ప్రశంసలు కురిపించారు. . పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్.. పాక్కు వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మరొకవైపు వంద కోట్లకు పైగా జనాభా కల్గిన భారత్.. విశేషమైన ప్రగతి సాధించే దిశలో ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్కు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. Open letter to Honorable Foreign Minister of #Bharat Shri @DrSJaishankar ji From, Baloch Representative,Republic of BalochistanState.The Honorable Dr. S. Jaishankar,Minister of External Affairs,Government of Bharat,South Block, Raisina Hill,New Delhi – 110011January… https://t.co/WdjaACsG2V pic.twitter.com/IOEusbUsOB— Mir Yar Baloch (@miryar_baloch) January 1, 2026 -
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్లో జెన్జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇరాన్ తీరుపై ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్లోని టెహ్రాన్తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు. If Iran shots and violently kills peaceful protesters, which is their custom, the United States of America will come to their rescue. We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter! President DONALD J.TRUMP(TS: 02 Jan 02:58 ET)…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 2, 2026 -
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్ కేక్ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.ప్రపంచంలోని ఎత్తైనహోటల్లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం. వరల్డ్ టాలెస్ట్ హోటల్,ప్యూర్ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్ లవ్’’అంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్ ఒక ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది తల్లి బర్త్డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్కమ్ టు ది జంగిల్లలో నటించనుంది. గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్తో కలిసి నటిస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
కండోమ్, గర్భనిరోధక మాత్రలపై అమల్లోకి వచ్చిన వ్యాట్
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి సరికొత్త సమస్య వచ్చి పడింది. జననాల సంఖ్య దారుణంగా పడిపోతుండడంతో జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది.. అందునా మొదటి రోజే ఓ కీలక నిర్ణయం ప్రకటించింది. కండోమ్ సహా గర్భ నిరోధక మాత్రలు, ఇతర సంబంధిత ఔషధాలపై 13 శాతం పన్ను విధించి.. తీవ్ర చర్చకు దారి తీసింది.చైనా ప్రభుత్వంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. అక్కడ గత మూడేళ్లుగా జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2024లో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గత దశాబ్దం కాలంనాటి గణాంకాల్లో సగం కావడం గమనార్హం. వృద్ధ జనాభా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రభుత్వం త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనాలని అక్కడి యువతను కోరుకుంటోంది. ఈ క్రమంలో.. గర్భనిరోధక వస్తువులు (కండోమ్లు, మాత్రలు, IUDలు)లపై పన్నులు పెంచగా, చైల్డ్కేర్ సేవలు (పిల్లల సంరక్షణ), వివాహ సంబంధిత సేవలు, వృద్ధుల సంరక్షణ సేవల వస్తువులపై పన్నులు తగ్గించింది. తల్లిదండ్రులకు ఎక్కువ పేరెంటల్ లీవ్.. క్యాష్ హ్యాండౌట్లు (ఆర్థిక సహాయం) వంటి ప్రోత్సహాకాలు అందిస్తోంది. 2026 జనవరి 1 నుండి కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు, IUDలు వంటి వస్తువులపై 13 శాతం వ్యాట్ అమల్లోకి తెచ్చింది. 1993 నుంచి ఈ వస్తువులు వ్యాట్ కేటగిరీ నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాయి. కానీ.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..కండోమ్ల ధర పెరగడం వల్ల జననాల సంఖ్య పెరగడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య పిల్లల పెంపకం ఖర్చులు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు. చైనాలో కండోమ్లపై పన్నులు పెరగడం వల్ల వాటి ధరలు పెరిగితే, ప్రజలు వాటిని తక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుండగా.. ఇది హెచ్ఐవీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. గతంలో కొన్ని దేశాల్లో ఎదురైన పరిస్థితులనూ ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావిస్తోంది. అదే సమయంలో చైనాలో హెచ్ఐవీ కేసులు.. గత దశాబ్దంలో తగ్గినా, యువతలో కొత్త కేసులు ఇంకా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తోంది.ట్రోలింగ్.. జననాల రేటు పెంచేందుకు చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలు కనమని చెబుతోంది. మరోవైపు గర్భనిరోధక వస్తువులను ఖరీదుగా చేస్తోందంటూ మండిపడుతున్నారు.మరోవైపు.. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కండోమ్స్ ధరలు పెంచడం అంటే.. ముందుగానే రెండు,మూడేళ్లకు ముందే కండోమ్స్ కొనుగోలు చేయమని చెబుతున్నారా? అంటూ చైనా యువత సెటైర్లు సంధిస్తున్నారు. కండోమ్ ధరలు పెంచటం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే సూపర్.. మనం పిల్లల్ని కనటానికి మన కంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుందంటూ నెటిజన్లు పంచ్ల మీద పంచ్లు వేస్తున్నారు. -
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
స్విట్జర్లాండ్ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్లోని ఓ లగ్జరీ బార్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరుకుంది. తొలుత ఉగ్రదాడి అయ్యి ఉండొచ్చనే ప్రచారం జరగ్గా.. అధికారులు ఆ కోణాన్ని తోసిపుచ్చారు. అయితే.. దర్యాప్తు అధికారులు ఇది ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా జరిగిన ప్రమాదం అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటో అని ఆరా తీస్తున్నారు చాలా మంది. ఇక, ఇప్పటికే ఫ్లాష్ ఓవర్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.ప్లాష్ ఓవర్ అంటే.. అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. ఒక పరిమిత స్థలంలో వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ఆ గదిలో త్వరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు అన్నీ ఒకేసారి అగ్నిలో చిక్కుకుపోతాయి. ఆ ఫలితంగా.. మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతుంది. అయితే.. ఫ్లాష్ఓవర్ అనేది అగ్ని ప్రమాదంలో అత్యంత ప్రమాదకరమైన దశ. కొన్ని సెకన్లలోనే మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. ఇది సాధారణంగా 500–600°C వద్ద జరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.ఈ ప్రక్రియలో మొదట ఒక వస్తువుకు మంటలు అంటుకుంటాయి. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి పొగ పైకప్పు దగ్గరకు చేరుతుంది. ఈ క్రమంలో పొర వేడెక్కి, గదిలోని ఇతర వస్తువులు ఆటో-ఇగ్నిషన్ ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దీంతో, ఒక్కసారిగా మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపించి.. దహనం అయిపోతుంది. ఈ స్థితిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం మంటలను అదుపు చేయలేరు.When this happened in America 23 yrs ago in Rhode Island, our National Institute of Standards and Technology (NIST) recreated the fire with the same polyurethane egg-crate foam and sparklers that ignited it.This is the video showing 1 minute to total flashover. Then, no escape. pic.twitter.com/T52qpPZf5g— Solvated Electron (@Solvatdelectron) January 1, 2026ఫ్లాష్ ఓవర్ గుర్తించే సంకేతాలుకాగా, ఫ్లాష్ ఓవర్ జరగబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తగ్గించుకోవచ్చు.పొగ రంగు: గాఢమైన నల్ల పొగ, వేగంగా కదిలే పొగ పొర.వేడి తీవ్రత: గదిలో వేడి ఒక్కసారిగా పెరగడం, నేలస్థాయిలో కూడా వేడి తీవ్రంగా అనిపించడం.పొగ పొర కదలిక: పైకప్పు దగ్గర పొగ పొర కిందికి దిగుతూ, వేగంగా కదలడం.ఫైర్ బిహేవియర్: వస్తువులు ఇంకా మంటలు అంటుకోకపోయినా, వేడి వల్ల వాటి ఉపరితలాలు కాంతివంతంగా కనిపించడం.రేడియంట్ హీట్: గదిలో నిలబడలేని స్థాయిలో వేడి ప్రవాహం (సుమారు 20 kW/m²).నివారణ చర్యలుఫ్లాష్ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది భవన రూపకర్తలు ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.వెంటిలేషన్ నియంత్రణ: గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా మంటల విస్తరణను తగ్గించడం.కూలింగ్ వాటర్ స్ప్రే: పైకప్పు పొగ పొరపై నీటిని స్ప్రే చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గించడం.ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్: భవన నిర్మాణంలో అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించడం.ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్: భవనంలో పొగ డిటెక్టర్లు, హీట్ సెన్సర్లు వాడటం.ఫైర్ఫైటర్ ట్రైనింగ్: ఫ్లాష్ఓవర్ సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం.ముఖ్యమైన గత ప్రమాదాలు ఇవే..1923: టోక్యో, జపాన్: భూకంపం తర్వాత మంటలు విస్తరించి నగరం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.1964: తమిళనాడులోని మదురై స్కూల్ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు.1997: ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు.2004: తమిళనాడులోని కుంబకోణం పాఠశాలలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 90కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.2024: గుజరాత్లోని రాజ్కోట్ టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు విస్తరించి 33 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు.2025: ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు శిశువులు మరణించారు.2026: స్విట్జర్లాండ్లోని క్రాన్స్-మోంటానా బార్లో ప్రమాదం. 47 మంది మరణించారు. -
ఆప్ఘనిస్తాన్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి
ఆప్ఘనిస్తాన్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 17 మంది మృతిచెందారని, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘానిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. హెరాత్ ప్రావిన్స్లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు.సోమవారం(డిసెంబర్ 29, 2025) నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో నష్టం అధికంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. వరదలు కారణంగా పశువులు కూడా చనిపోయాయి. వరద ప్రభావం 1,800 కుటుంబాలపై పడిందన్నారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. వరద తీవ్రతను అంచనా వేయడానికి బృందాలను పంపించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాలు కురిసిప్పటికీ ఆకస్మిక వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పరిస్థితి మరింత దారుణంగా మారింది. -
మేయర్గా మమ్దానీ ప్రమాణం.. ఖాతాలో మరో రికార్డు
న్యూయార్క్: అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర 112వ మేయర్గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ(34) ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెల్లవారుజామున న్యూయార్క్ ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. మమ్దానీ కుటుంబ సభ్యులు, సలహాదారులు, సన్నిహితులు హాజరయ్యారు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తొలి దక్షిణాసియావాసిగా, తొలి ముస్లింగా, రెండో పిన్న వయసు్కడిగా మమ్దానీ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఆయనతో స్టేట్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్ ప్రమాణం చేయించారు. మమ్దానీ రెండు ఖురాన్ ప్రతులపై ప్రమాణం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా భార్య రమా దువాజీ పక్కనే ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తా.. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీల కుమారుడైన జోహ్రాన్ ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. మేయర్గా న్యూయార్క్ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని మమ్దానీ ప్రకటించారు. తన ప్రమాణ స్వీకారం నూతన అధ్యాయానికి ప్రారంభంగా అభివర్ణించారు. ప్రమాణ స్వీకారానికి వేదికగా పాత సబ్వే స్టేషన్ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఇది 1904లో ప్రారంభమైందని, ఘన చరిత్ర కలిగి ఉందని పేర్కొన్నారు.“I was elected as a Democratic Socialist, and I will govern as a Democratic Socialist.”— Zohran Mamdani in his inauguration speech. pic.twitter.com/R1KlIhu6vA— Pop Base (@PopBase) January 1, 2026ప్రజల జీవితాలను మార్చేలా తెలివైన, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదొక ప్రతీక అని చెప్పారు. ప్రమాణం కోసం మమ్దానీ ఉపయోగించిన ఖురాన్ ప్రతులకు కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇందులో ఒకటి మమ్దానీ తాత నుంచి వారసత్వంగా వచ్చింది. మరొకటి న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ నుంచి తీసుకొచ్చారు. దీనికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. నల్ల జాతీయుల సంస్కృతిపై స్కోమ్బర్గ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే పలు ఖురాన్ ప్రతులను, పుస్తకాలను సేకరించింది. వీటిని న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో భద్రపర్చారు. అందులో ఒకటి మమ్దానీ ఉపయోగించిన ఖురాన్ కావడం విశేషం. తమ లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ఖురాన్పై మేయర్ ప్రమాణం చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని లైబ్రరీ సీఈఓ ఆంథోనీ డబ్ల్యూ మార్క్స్ చెప్పారు. ఖురాన్పై ప్రమాణం చేసిన తొలి న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మరో రికార్డు సృష్టించారు. -
బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సీమా దాస్ కీలక వ్యాఖ్యలు
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో మరో హిందువుపై దాడి జరిగింది. వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్పై దుండగులు దాడి చేశారు. దుండగులు.. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన దాముద్యాలోని క్యూర్బంగా బజార్లో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. కాగా, గడిచిన రెండు వారాల్లో నలుగురు హిందువులపై దాడి జరగడం గమనార్హం.ఈ నేపథ్యంలో తన భర్తపై జరిగిన హత్యాయత్నంపై దాస్ భార్య సీమా దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత సీమా దాస్ మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ పోసి తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. తమకు ఏ విషయంలోనూ ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన భర్తపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. మేము హిందువులం. ఇక్కడ శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం. నా భర్తపై దాడి చేసిన వారిని ప్రభుత్వం శిక్షించాలి. దాడి చేసిన వారిలో ఇద్దరిని నా భర్త గుర్తించారు. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించారు. నేను ప్రభుత్వాన్ని సాయం కోసం అభ్యర్థిస్తున్నాను అని కన్నీటిపర్యంతమయ్యారు.Bangladesh - Seema Das wife of Khokon Das said in Bangla & broke down - We have no dispute with anyone on any issue. We don't understand why my husband was suddenly targeted. He recognised 2 of the attackers, That's why they poured petrol on his head, face & set him on fire. pic.twitter.com/A8atvPubYl— Anand L (@kharshad0) January 1, 2026ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయ్ గ్రామానికి చెందిన ఖోకన్ దాస్.. క్యూర్బంగా బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్బంగా బజార్కు సమీపంలో దుండగులు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్ తలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దుండగుల నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దాస్ దూకేశారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడిని షరియత్పుర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. -
చైనాకు తైవాన్ చెక్.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
తైపీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టె స్పష్టం చేశారు. ఆ దేశం చుట్టూ చైనా ఇటీవల లైవ్–ఫైర్ సైనిక కసరత్తలు చేపట్టిన నేపథ్యంలో గురువారం కొత్త సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విస్తరణవాద కాంక్ష నేపథ్యంలో, తైవాన్ ప్రజలకు తమను తాము రక్షించుకునే శక్తి ఉందో, లేదోనని అంతర్జాతీయ సమాజం చూస్తోందన్నారు.జాతీయ రక్షణ, సమాజాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సమగ్రమైన రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై అధ్యక్షుడిగా తన వైఖరి స్పష్టమన్నారు. ఒకప్పుడు జపాన్ కాలనీగా ఉన్న తైవాన్ 1949లో చైనాతో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోవడంతో స్వతంత్ర పాలనలో ఉంది. అయితే చైనా మాత్రం తైవాన్ను తన సొంత భూభాగంగా చూస్తుంది. అవసరమైతే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని పదేపదే బెదిరిస్తుంది. ఈ నేపథ్యంలో లై వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.అధ్యక్షుడు లై, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎన్ని చెప్పినా, ఏం చేసినా.. తైవాన్ చైనాలో భాగమనే వాస్తవాన్ని వారు మార్చలేరని తెలిపింది. తైవాన్పై చైనా దాడి చేస్తే టోక్యో జోక్యం చేసుకుంటుందని జపాన్ చేసిన వ్యాఖ్యలు, యూఎస్ ఆయుధ విక్రయాలపై చైనా కొత్త నాయకుడి వ్యాఖ్యలపై బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ విలీనాన్ని ఎవ్వరూ ఆపలేరని తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా వ్యాఖ్యానించారు. -
బలగాల ప్రయోగంపై కేపీ ఓలీకి సమన్లు!
కాఠ్మండు: గత ఏడాది సెప్టెంబర్లో నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో యువత పైకి సాయుధబలగాలను ప్రయోగించి నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ త్వరలో ఆయనను విచారించనుంది. జనవరి 21వ తేదీలోగా నివేదిక సమర్పింంచాల్సి ఉండటంతో ఆలోపు నిర్ణయాత్మకమైన నేతలు, అధికారుల నుంచి కమిషన్ సభ్యులు వివరణ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన కాఠ్మండులో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేపట్టిన యువతపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలు, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన జనం జెన్–జెడ్ యువతరం సారథ్యంలో ఉద్యమించడంతో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా ఆనాడు 77 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం నియమించిన గౌరీ బహదూర్ కర్కీ సారథ్యంలోని విచారణ కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది. కర్కీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఘటనలో స్పష్టత కోసం ఓలీకి సమన్లు జారీచేసి ప్రశ్నించే అవకాశముందని చెప్పారు. అయితే కమిషన్ ఎదుట తాను హాజరయ్యే ప్రసక్తే లేదని కేపీ శర్మ ఓలీ కరాఖండీగా చెప్పేశారు. కమిషన్ చట్టబద్ధతను, విచారణలో పారదర్శకతను ఆయన ప్రశ్నించారు. -
కలిసి జీవిస్తేనే ‘గ్రీన్కార్డు’
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి దగ్గరి దారి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. గ్రీన్కార్డు అని పిలిచే శాశ్వత నివాస కార్డు(పర్మినెంట్ రెసిడెంట్ కార్డు) కోసం విదేశీయులు ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరుడు/పౌరురాలిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్కార్డు సాధించడమే. అయితే, గ్రీన్కార్డు కలిగినవారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలావరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణం. అమెరికా పౌరసత్వం కలిగినవారిని పెళ్లి చేసుకుని గ్రీన్కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టీన్ తేల్చిచెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్కార్డు రావడానికి గ్యారంటీ ఉండదని వెల్లడించారు. → యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ని బంధనల ప్రకారం అమెరికా సిటిజెన్ను వివా హం చేసుకొని జీవిత భాగస్వామిగా మారిన విదేశీ వ్యక్తిని ‘‘అమెరికా సిటిజెన్ తక్షణ బంధువు’గా పరిగణిస్తారు. అమెరికా పౌరుడు/పౌరు రాలి భార్య/భర్తకు గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకొనే అర్హత చట్ట ప్రకారం లభిస్తుంది. → అమెరికా సిటిజెన్ను వివాహం చేసుకుంటే గ్రీన్కార్డు వచ్చేసినట్లేనని భావించవద్దని, ఆ అవకాశం ఉండదని బెర్న్స్టీన్ తెలియజేశారు. గ్రీన్కార్డు పొందాలంటే అమెరికా సిటిజెన్తో పెళ్లి ఒక్కటే సరిపోదని చెప్పారు. వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు చాలా ఏళ్లుగా కలిసి జీవిస్తున్నట్లుగా నిర్ధారణ అయితేనే ఈ కార్డు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలపై బెర్న్స్టీన్కు 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నట్లు తెలిస్తే గ్రీన్కార్డు దరఖాస్తును ప్రభుత్వం పక్కనపడేసే ప్రమాదం అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉంటేనే అవకాశాలు మెరుగు పడతాయని ఆయన సూచించారు. → ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేర్వేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినా అధికారులు వినిపించుకునే పరిస్థితి ఉండదని బెర్న్స్టీన్ స్పష్టంచేశారు. కలిసి ఉంటున్నట్లు వారికి విశ్వాసం కలిగించాలని పేర్కొన్నారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవడం అనేది వివాహనికి నమ్మకమైన గుర్తింపుగా ఇమ్మిగ్రేషన్ చట్టాలు భావిస్తాయని తెలిపారు. → పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ గ్రీన్కార్డు కోసం ప్రయత్నించేవారు తొలుత న్యాయ సహాయం తీసుకోవాలని స్పష్టంచేశారు. అమెరికా వీసాలు, గ్రీన్కార్డుల కోసమే అమెరికా సిటిజెన్ను పెళ్లి చేసుకున్నట్లు తేలితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. → డొనాల్డ్ ట్రంప్ పాలనలో వివాహం ఆధారిత గ్రీన్కార్డు దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ వివాహం అసలైనదేనా? దురుద్దేశం ఏదైనా ఉందా? అనే తనిఖీ చేస్తున్నారు. కేవలం కాగితాలపై జరిగిన పెళ్లి అని తేలితే దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. → అమెరికా వీసాల జారీ కార్యక్రమాన్ని ట్రంప్ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. డైవర్సిటీ వీసా(డీవీ) లాటరీని రద్దు చేశారు. ఈ లాటరీ ద్వారా విదేశీయులకు ఏటా 50 వేల దాకా వీసాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అవన్నీ ఆగిపోయినట్లే. → గ్రీన్కార్డుల కార్యక్రమంపై ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా గురిపెట్టింది. నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పటికే గ్రీన్కార్డు పొందిన 19 దేశాల ప్రజల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని ట్రంప్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
జపాన్ పార్లమెంటులో 73 మంది మహిళా ఎంపీలకు ఒకే ఒక్క టాయిలెట్
టోక్యో: జపాన్ పార్లమెంట్లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుతం దిగువ సభలో 73 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. కానీ వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ వద్ద కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిపై మహిళా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 60 మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కొత్త ప్రధాని సేన్ తకైచి కూడా దీనిపై కలత చెందినట్లు సమాచారం.జపాన్ పార్లమెంట్ భవనం 1936లో నిర్మించబడింది. ఆ సమయంలో దేశంలో మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత 1945 డిసెంబర్లో మహిళలకు ఓటు హక్కు లభించింది. అనంతరం 1946 ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే కాలం మారినా భవనంలోని మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా మారలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జపాన్ ప్రముఖ వార్తాపత్రిక యోమియురి షింబున్ నివేదిక ప్రకారం... పురుషుల కోసం పార్లమెంటులో 12 మరుగుదొడ్లు (మొత్తం 67 స్టాల్స్) ఉన్నాయి. మహిళల కోసం 9 మరుగుదొడ్లు (మొత్తం 22 క్యూబికల్స్) మాత్రమే ఉన్నాయి. కాగా ప్రధాన విచారణలు జరిగే ప్లీనరీ హాల్ వద్ద మాత్రం మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉంది. దాంతో సమావేశాలకు ముందు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు మహిళా ఎంపీలు భవనంలోని మరో భాగానికి వెళ్లి టాయిలెట్ వినియోగించుకోవాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ మహిళా ఎంపీ యసుకో కొమియామా స్పందిస్తూ.. పార్లమెంటు సమావేశాల సమయంలో మహిళా సభ్యులు టాయిలెట్ బయట క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా అవమానకరమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు.ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 148 దేశాల్లో జపాన్ 118వ స్థానంలో నిలిచింది. వ్యాపారం, మీడియా, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఎన్నికల సమయంలో మహిళా అభ్యర్థులు తరచూ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారని, రాజకీయాలకంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్లమెంటులో మహిళల సంఖ్య పెరుగుతోందిప్రస్తుతం: దిగువ సభలో 465 మంది ఎంపీలలో 72 మంది మహిళలు, ఎగువ సభలో 248 మందిలో 74 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు కనీసం 30 శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ పరిణామాల నడుమ, కొత్త ప్రధాని సేన్ తకైచి నిర్వహించిన సమావేశం తర్వాత దేశంలో పని, జీవిత సమతుల్యతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో ఆమె పని, పని, పని మాత్రమే అనే వైఖరితో వార్తల్లో నిలిచారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తానని, పని, జీవిత సమతుల్యతను నమ్మనని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.మొత్తంగా జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు మౌలిక సౌకర్యాల కోసం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉందన్న విషయం ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది. -
టెన్షన్ టెన్షన్: వెనిజులా వైమానిక దళంలో ఇరాన్ యుద్ధ డ్రోన్లు!
ఇరాన్ యొక్క మొహజెర్-6 స్ట్రైక్ డ్రోన్లు వెనిజులా వైమానిక దళంలో కనిపించడంతో యుద్ధం వాతావరణానికి ఆజ్యం పోస్తుంది. ఉక్రెయిన్లో ఉపయోగించే హమాస్తో అనుసంధానించబడిన ఈ ఇరాన్ యుద్ధ డ్రోన్లు ఇప్పుడు వెనిజులా వైమానిక స్థావరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి యూఎస్కు కొన్ని మైళ్లు దూరంలో ఉండటంతో మరింత ఆందోళన కల్గిస్తోంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని ట్రంప్ పేర్కొన్నారు. దాంతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో వెనిజులా దానికి ప్రతిగా సన్నద్ధమవుతుందన్న దానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు.. డాక్టర్లు వేలిని కత్తిరించారు?
పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం. అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి. చైనా దేశంలోని బీజింగ్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.అదొక ఫైవ్ స్టెప్ స్నేక్చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం‘ఫైవ్ స్టెప్ స్నేక్"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.అందుకే దీనిని "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు.శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి. పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.విష ప్రభావంరక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం. -
న్యూ ఇయర్లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి
నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?1872లో వోండెల్కెర్క్ చర్చ్ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు. 1970లలో పునరుద్ధరించారు. 1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది. De 150 jaar oude monumentale #Vondelkerk vormde het hart van de door Cuypers, architect van oa het Rijksmuseum, ontworpen Vondelbuurt. 😥 pic.twitter.com/z8KmitkUji— MaaikeDx 🖌 (@RembrandtsRoom) January 1, 2026 -
మరో హిందువుపై దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరో హిందూ వ్యక్తిపై దాడి జరిగింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది. బంగ్లాదేశ్లో ఇటీవల హింసాత్మక ఆందోళనలు మొదలైన తర్వాత హిందువులపై దాడి జరగడం ఇది నాల్గోసారి. డిసెంబర్ 24వ తేదీన కాలీమోహన్ ఏరియాలో అమృత్ మోండ్(29) అనే హిందూ యువకుడిపై దాడి జరగ్గా, డిసెంబర్ 18వ తేదీన దీపూ చంద్రదాస్ అనే 25 ఏళ్ల హిందూ యవకుడిని దారుణంగా హత్యచేశాయి అల్లరిమూకలు. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు మెమిన్సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్గన్తో కాలచ్చింపాడు. -
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని ఖేర్సన్ రీజియన్లో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. కొత్త సంవత్సర వేడుకల్లో పౌరులు ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.ఖోర్లీ గ్రామంలో ఉన్న ఆ హోటల్పై మూడు డ్రోన్లతో దాడి జరిగింది. ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారని అధికారులు టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు.ఒకవైపు ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుతిన్తో ఓసారి.. జెలెన్స్కీతో మూడుసార్లు భేటీ అయ్యారు. తాజాగా 90 శాతం శాంతి ప్రణాళిక ఖరారైనట్లేనని, ఏక్షణమైనా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. శాంతి చర్చల వేళ ఇరు దేశాలు మాత్రం డ్రోన్లతో పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగ్గా.. సైన్యం దానిని తిప్పి కొట్టింది. ఇది ఉక్రెయిన్ పనేనని మాస్కో ఆరోపిస్తుండగా.. కీవ్ మాత్రం అవి ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. ఆధారాలంటూ కొన్ని వీడియోలను బయటపెట్టింది రష్యా. -
ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
విమాన ప్రమాదాలు, ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దు లాంటి అనేక ఇబ్బందులతో విమాన ప్రయాణ మంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి ప్రయాణికులది. తాజాగా జరిగిన మరో సంఘటన విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో ఎయరిండియా పైలట్ బుక్ అయ్యాడు. స్టోరీ ఏమిటీ అంటే...టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫెస్టివ్ మూడ్లో ఉన్న పైలట్ మద్యం సేవించి వాంకోవర్నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-AI 186 విమానంలో విధులకు సిద్ధ పడ్డాడు. విమానంలో పైలట్ భద్రతా ప్రోటోకాల్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు నివేదించారు. వారు తక్షణమే పైలట్ను బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో అతని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని రెండు గంటల పాటు నిలిపి వేశారు. విషయం తెలిసి ప్రయాణీకులు ఆందోళన పడ్డారు. 2025 డిసెంబరు 23న సంఘటన చోటు చేసుకుంది. పైలట్ వ్యవహారం బయటపడటంతో ఎయిరిండియా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్ట్లతో నడిచే ఈ అల్ట్రా-లాంగ్-హాల్ విమానం స్థానిక సమయం సాయంత్రం 5 గంటలకు బయలు దేరింది. షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి, వియన్నాలో కొత్త సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా తీవ్రంగా స్పందించింది. పైలట్ను ఢిల్లీకి తరలించి, దర్యాప్తు చేపట్టింది. జీరో-టాలరెన్స్ తమ విధానమని, నిబంధనల ఉల్లంఘనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీలకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయాన్ని ఎయిర్లైన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి నివేదించింది.మరోవైపు పైలట్ విమానాశ్రయంలో అనుకోకుండా మద్యం తాగాడని కొందరు చెప్పగా, మరికొందరు బాటిల్ కొన్న సందర్భంగా మద్యం వాసన వచ్చిందని చెబుతున్నారు. -
తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా..
ఒకప్పుడు నూతన సంవత్సరం వేళ ప్రతి ఇంట్లోనూ సందడి చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే.. 80, 90వ దశకాల్లో గ్రీటింగ్ కార్డ్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఒకరికొకరు కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. ఈ గ్రీటింగ్ కార్డుల విప్లవం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. రోడ్డు పక్కన పోస్టర్లు అమ్ముకునే ఒక సామాన్య యువకుడు.. కేవలం ఐదు వేల రూపాయల అప్పుతో భారతదేశంలో గ్రీటింగ్ కార్డుల విస్తృత వినియోగానికి నాంది పలికాడు. తద్వారా వందల కోట్ల కంపెనీని కూడా నెలకొల్పాడు.గ్రీటింగ్ కార్డ్ పుట్టుక.. లండన్ నుండి భారత్కు..గ్రీటింగ్ కార్డుల చరిత్ర 182 ఏళ్ల నాటిది. 1843లో లండన్కు చెందిన ప్రభుత్వ అధికారి సర్ హెన్రీ కోల్.. క్రిస్మస్ సందర్భంగా తనకు వచ్చే వందలాది లేఖలకు సమాధానం ఇవ్వలేక ఒక కొత్త ఆలోచన చేశారు. తన స్నేహితుడు, ఆర్టిస్ట్ జాన్ కాల్కాట్ హార్స్లీచేత ఒక చిత్రాన్ని గీయించి, దానిపై ‘క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రాయించారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ గ్రీటింగ్ కార్డ్. బ్రిటీష్వారు భారత్ను పరిపాలిస్తున్న సమయంలో గ్రీటింగ్ సంస్కృతి భారత్లో ప్రవేశించింది. 1979లో అనిల్ మూల్చందాని అనే యువకుడు ‘ఆర్చీస్’ (Archies) సంస్థ ద్వారా గ్రీటింగ్ కార్డులను సామాన్యులకు చేరువ చేశారు.అప్పుతో మొదలైన ‘ఆర్చీస్’ ప్రస్థానంఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన అనిల్ మూల్చందాని, ఒకవైపు తన తండ్రికి చీరల దుకాణంలో సాయం చేస్తూనే, మరోవైపు పోస్టర్లు అమ్మేవారు. 1981లో ఆయన ఢిల్లీలోని కమలా నగర్లో కేవలం రూ. ఐదు వేల పెట్టుబడితో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. అనిల్ అమోఘ కృషితో ‘ఆర్చీస్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. గ్రీటింగ్ కార్డులు ప్రతి మధ్యతరగతి ఇంటికీ చేరాయి. ఒకానొక దశలో ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది. నేటి సోషల్ మీడియా యుగంలోనూ ఈ సంస్థ సుమారు రూ. 70 కోట్ల విలువతో తన ఉనికిని చాటుకుంటోంది.డిజిటల్ యుగంలోనూ జ్ఞాపకాలుప్రస్తుత స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా కాలంలో వాట్సాప్ సందేశాలు ప్రాచుర్యం పొందినప్పటికీ, గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోలేదు. ఆన్లైన్ గిఫ్టింగ్ పోర్టల్స్ ద్వారా నేటికీ కార్డుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చేతితో చక్కగా రాసిన సందేశం అందించే ఆత్మీయత డిజిటల్ మెసేజ్లలో కనిపించదని కొందరు నమ్ముతుంటారు. వారు ఇప్పటికీ శుభాకాంక్షలను తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులనే ఎంచుకుంటున్నారు. అందుకే గ్రీటింగ్ కార్డుల యుగం ముగిసిందని చెప్పలేం.. అది కేవలం తన రూపాన్ని మార్చుకున్నదని మాత్రమే అనగలం.ఇది కూడా చదవండి: ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే.. -
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్కు తొలి ముస్లిం మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. అనూహ్యంగా గురువారం అర్ధరాత్రి చారిత్రక మాన్హట్టాన్ సబ్వే స్టేషన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంపై అటు నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ మేయర్ ప్రమాణ స్వీకార వేడుకను ఆయన స్నేహితురాలు లెటిటియా జేమ్స్ నిర్వహించారు. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్దదే కాదు.. విలాసవంతమైన నగరానికి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఖురాన్ పై చేయి ఉంచి ఆయన ప్రమాణం చేసిన ఆయన.. తన జీవిత కాలంలో లభించిన అరుదైన గౌరవంగా చెప్పారు. అంతేకాదు.. కొత్త రవాణా శాఖ కమిషనర్గా మైక్ ఫ్లిన్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం గానూ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగానూ జోహ్రాన్ మమ్దానీ నిలిచారు.🚨BREAKING: Zohran Mamdani, a 34-year-old immigrant from Uganda, just made history as the first Muslim, first South Asian, and youngest in a century to become Mayor of New York City.He was sworn in alongside his wife minutes into the new year of 2026 by NYS AG Letitia James. pic.twitter.com/NHgE6NVK5l— CALL TO ACTIVISM (@CalltoActivism) January 1, 2026మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ ఉగాండా జాతీయుడు. తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్ మీరానాయర్. కాగా, మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 50.40 శాతం ఓట్లు (10,36,051) పోల్ అయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోకు 41.6 శాతం ఓట్లు (8,54,995) వచ్చాయి. దాదాపు 1.81 లక్షల ఓట్ల మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 7.10% (1,46,137) ఓట్లు వచ్చాయి.నవంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఎన్నికలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 56 ఏండ్లలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో జోహ్రాన్ను చిత్తుగా తిట్టారు. అయినా కూడా జోహ్రాన్నే విజయం వరించింది.అయితే.. ఆ మధ్య వైట్హౌజ్ వెళ్లి ట్రంప్ను కలిసి కాసేపు భేటీ అయ్యాడు మమ్దానీ. ఆ సమయంలో న్యూయార్క్ అభివృద్ధికి కలిసి పని చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. -
సంబరాల వేళ స్విట్జర్లాండ్లో పేలుడు
క్రాన్స్–మోంటానా(స్విట్జర్లాండ్): ఎప్పుడు దట్టంగా కమ్ముకున్న మంచుతో దవళవర్ణంతో ధగధగా మెరిసిపోయే స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో ఒక్కసారిగా నిప్పుకణికలు ఎగసిపడ్డాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రఖ్యాత క్రాన్స్–మోంటానాలోని ప్రముఖ బార్లో జనం వేడుకల్లో మునిగిపోయిన వేళ భారీ పేలుడు రూపంలో మృత్యుదేవత అక్కడివారిని కబళించివేసింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.30 గంటలప్పుడు హఠాత్తుగా లీ కాన్స్టలేషన్ బార్, లాంజ్లో చెలరేగిన మంటలకు 40 మంది బలయ్యారు. 115 మంది గాయపడ్డారు. మంటలకు తాళలేక పలువురు పర్యాటకులు బార్ అద్దాల కిటికీలు బద్దలుకొట్టి బయటకు దూకారు. కాలిన గాయాలతో పలువురు రక్తమోడుతూ రోడ్డుపై పరుగులు పెట్టారు. ఇదంతా ఒక హారర్ మూవీని తలపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ ‘బీఎఫ్ఎం’టీవీకి చెప్పారు. తొలుత భారీ శబ్దం వినిపించి తర్వాత బార్ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. అనూహ్య ఘటనలో క్రాన్స్–మోంటానా సిటీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే 10 హెలికాప్టర్లలో రంగంలోకి దిగి వెంటనే మంటల్ని ఆర్పే పనిలో పడ్డారు. క్షతగాత్రులను సమీప వలేస్ ఆస్పత్రిలో చేర్పింంచారు. క్షతగాత్రులతో ఆ ఆస్పత్రి ఐసీయూ యూనిట్ పూర్తిగా నిండిపోయింది. తీవ్రగాయాలైన వారిని మిలాన్ నగర ఆస్పత్రులకు తరలించారు. బార్లో గాయపడిన అతిథులను తరలించేందుకు 40 అంబులెన్సులను రప్పించారు. 150కిపైగా అగ్నిమాపక సిబ్బంది బార్లో మంటల్ని ఆర్పేందుకు శ్రమించారు. కాలిపోయిన మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. ‘‘పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో స్థానికులు, ఇటాలియన్లు సహా పలు దేశాల పౌరులు ఉన్నారు. నూతన ఏడాది వేడుకలు కావడంతో వేర్వేరు దేశాల సందర్శకులు హాజరయ్యారు. మృతుల బంధువుల డీఎన్ఏ శాంపిళ్లు తెప్పించి సరిపోల్చి మృతదేహాలను అప్పగించేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది’’ అని వలేస్ సబ్డివిజన్ పోలీస్ కమాండర్ ప్రెడెరిక్ గిస్లెర్ స్పష్టంచేశారు. ఘటనను ఉగ్రదాడిగా భావించట్లేమని ఈ ప్రాంత అటార్నీ జనరల్ బేర్రిస్ పిలౌడ్ చెప్పారు. ఇరుకైన మెట్లే ఇరికించాయా? మంటలు అంటుకోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొత్త ఏడాది మొదలవగా పేల్చిన బాణసంచా నుంచి వెలువడిన నిప్పుకణికల కారణంగా మంటలు అంటుకున్నాయని పలువురు చెప్పారు. ‘‘అతిథుల కోసం నిలువుగా పేర్చిన షాంపేన్ బాటిళ్లపై ఉంచిన ఒక బర్త్డే కొవ్వొత్తి మంటలు పై కప్పుకు అంటుకున్నాయి. దాంతో రెప్పపాటులో మంటలు చెక్క సీలింగ్ అంతటా చుట్టుముట్టాయి. మొదటి ఫ్లోర్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. పైన దాదాపు 200 మంది ఉన్నారు. 30 సెకన్ల వ్యవధిలో అంత మంది ఇంత చిన్న ఇరుకు మెట్ల మార్గం గుండా కిందకు దిగిరావడం సాధ్యంకాలేదు. మేం అదృష్టంకొద్దీ ఎలాగోలా బయటపడ్డాం. బాధితుల్లో చాలా మంది 16–26 ఏళ్ల వయసు వారే’’ అని బార్లో సంబరాల్లో పాల్గొన్న ఫ్రాన్స్ జంట ఎమ్మా, అల్బనీలు చెప్పారు. ‘‘వాస్తవిక కారణాలను ఇప్పుడే వెల్లడించలేం. సమగ్ర దర్యాప్తు తర్వాత అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడిస్తాం’’ అని స్థానిక ప్రభుత్వ సారథి మ్యాథియస్ రెనార్డ్ చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు మొదలెట్టిన తొలిరోజే భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే పార్మెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 4 దశాబ్దాలుగా ప్రముఖ స్కీ రిసార్ట్ బార్గా పేరు.. క్రాన్స్–మోంటానాలోని స్విస్ స్కీ రిసార్ట్లోని అతిపెద్ద బార్గా లీ కాన్స్టెలేషన్కు పేరుంది. దీనిని గత 40 ఏళ్లుగా నడుపుతున్నారు. ఇది రెండంతస్తుల భవంతి. కింది ఫ్లోర్లో అతిపెద్ద బార్ ఉంది. అక్కడ జనం మద్యం సేవిస్తూ నృత్యం చేసే ఏర్పాటు ఉంది. పై ఫ్లోర్లో ఫుట్బాల్ మ్యాచ్లు చూసేందుకు భారీ ఎల్ఈడీ టీవీలున్నాయి. ఇందులో ఒకేసారి 300 మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఘటన జరిగినప్పుడు బార్లో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.Many people were killed and others injured after an explosion at a bar in the ski resort town of Crans-Montana, Switzerland. pic.twitter.com/d2g9rqcCrY— Weather Monitor (@WeatherMonitors) January 1, 2026#Switzerland | Several people were killed and others injured after an explosion rocked a bar in the luxurious alpine ski resort of Crans-Montana, Swiss police said. A spokesperson for the cantonal police said that the explosion was of unknown origin but confirmed multiple… pic.twitter.com/vzDcSNaasS— Deccan Chronicle (@DeccanChronicle) January 1, 2026 -
ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లోని ప్రజలు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. ఆరోజు విందు వినోదాలతో వేడుకలు చేసుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటి నూతన సంవత్సర ఆరంభం కాదు. కొన్ని దేశాల్లో తమ సంస్కృతులు, ప్రాచీన క్యాలెండర్లు, చంద్రుని గమనం (లూనార్ సైకిల్స్) ఆధారంగా వేర్వేరు తేదీలలో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. నూతన సంవత్సర వేడుకలు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలకు ప్రతిరూపాలు.డ్రాగన్ డ్యాన్స్ల హోరుచైనీస్ నూతన సంవత్సరం సాధారణంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 3 మధ్య వస్తుంది. ఏకంగా 15 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఆ రోజుల్లో డ్రాగన్ డ్యాన్స్లు, ఎరుపు రంగు లాంతర్లు, కుటుంబ విందులతో చైనా కళకళలాడుతుంది. ప్రతి ఏటా ఒక జంతువును ‘రాశి’ (Zodiac Animal) గా పరిగణించడం వీరి ప్రత్యేకత.రైస్ కేక్ సూప్ తింటే..కొరియాలో 'సోల్లాల్' (Seollal) పేరుతో మూడు రోజుల పాటు నూతన సంవత్సర వేడుక నిర్వహిస్తారు. 2026, ఫిబ్రవరి 17న ఇది మొదలుకానుంది. ఈ సందర్భంగా అక్కడి వారంతా ‘టెక్గుక్’ (tteokguk) అనే రైస్ కేక్ సూప్ను సేవిస్తారు. ఇది తింటే వయస్సు ఒక ఏడాది పెరుగుతుందని వారు నమ్ముతారు.దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్థాయిలాండ్లో ఏప్రిల్ 13 నుండి 15 వరకు 'సోంగ్క్రాన్' (Songkran) పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్ నిర్వహిస్తారు. ఇది చెడును కడిగివేస్తుందని వారు భావిస్తారు.నిశ్శబ్ధ స్వాగతంబాలిలో 'న్యేపి' (Nyepi) అనే నిశ్శబ్ద వేడుక జరుగుతుంది. 2026 మార్చి 19న జరగబోయే ఈ వేడుకలో భాగంగా 24 గంటల పాటు ద్వీపం మొత్తం నిశ్శబ్ధంగా మారుతుంది. విమానాలు, ట్రాఫిక్, లైట్లు, శబ్దం ఏమీ ఉండవు. ప్రజలంతా ప్రశాంతంగా మెలుగుతూ ధ్యానంలో కాలం గడుపుతారు.ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ)ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రతి ఏటా మారుతూ ఉంటుంది (2026లో జూన్ 16-17 తేదీలలో రావచ్చు). చంద్రుని గమనం ఆధారంగా ఏటా సుమారు 11 రోజులు ముందుకు జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉండే అట్టహాసాలు, పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఆ రోజున ప్రశాంతత పాటిస్తూ, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. ఇది కూడా చదవండి: New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు -
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి..నిన్న డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. అయితే.. ఇప్పుడు మరో దేశం ఇప్పుడు ఈ రూట్నే ఎంచుకుంది. 15 ఏళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను(డ్రాఫ్ట్)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పిల్లలను డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు. ప్రతిపాదనల్లో.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం, అలాగే సెకండరీ స్కూల్స్లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయని తెలిపారాయన. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..పిల్లలను స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరం చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు. 2018లో ప్రీ-స్కూల్, మిడిల్ స్కూల్లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు. అయితే 2023లో ఇదే రూల్కు ఓ చిక్కు వచ్చిపడింది. “డిజిటల్ లీగల్ ఏజ్” కింద ఫోన్ వాడాలంటే 15 ఏళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది. దీంతో ఫ్రాన్స్లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు.అయితే.. పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఫ్రాన్స్ ఈసారి మరో రూట్లో వస్తోంది. నేరుగా నిషేధం అని చెప్పకుండా.. సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సెనేట్ ప్రతిపాదనలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.ఇంటర్నెట్లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయి. వీటిని ఎవరైనా చూసే వీలుంది. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయనే వాదనతో ఏకీభవిస్తున్నాం. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలి..::మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజా వ్యాఖ్యలుఇప్పటిదాకా .. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట. -
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
ఉక్రెయిన్ సంక్షోభం ఈ ఫిబ్రవరితో నాలుగేళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా.. మరోవైపు ఇరుదేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైనే డ్రోన్ దాడి జరగడం కలకలం రేపగా.. అమెరికా సహా పలు దేశాల అనుమానాల నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందనే.. ఇది ఉక్రెయిన్ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఆ దాడి తమ పని కాదని.. ఇది రష్యా ఆడుతున్న నాటకమని.. అసలు అలాంటి దాడేం జరగలేదని.. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగింది అని ఉక్రెయిన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా అధినేత నివాసంపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. అనూహ్యంగా.. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయంటూ రష్యా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. అందులో.. క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష కార్యాలయం) సమీపంలో నిర్వీర్యం చేసిన ఓ డ్రోన్కు ఆరు కేజీల పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నాయి. దీంతో 24 గంటల్లో దాడికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. Downed UAV with a 6kg explosive charge — Russian MOD publishes VIDEO PROOF of Ukrainian attack on Putin’s residenceThe attempt was carried out on the night of December 28 to 29WATCH report by the unit who took down 41 of the 91 drones sent by Kiev https://t.co/J9Tgd8yAJx pic.twitter.com/b7Yv55OlxP— RT (@RT_com) December 31, 2025ఈ వీడియోలు వెలుగులోకి రాకముందే.. పుతిన్ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడుల్ని పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘‘శాంతి స్థాపనకు కొనసాగుతున్న ప్రయత్నాలకు భంగం కలిగించవద్దు’’ అంటూ రష్యా-ఉక్రెయిన్లను కోరారు. ఒక్క ఫ్రాన్స్ మాత్రం సరైన ఆధారాల్లేకుండా ఉక్రెయిన్ను నిందించడానికి వీల్లేదంటూ మద్దతు ప్రకటించింది. అయితే.. తాజా దాడుల వీడియోలపై కీవ్ వర్గాలు, జెలెన్స్కీ.. అసలు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుమారు 91 డ్రోన్లు.. నోవ్గోరోడ్ రీజియన్లోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని.. అయితే మాస్కో-సెయింట్ పీటర్స్బర్గ్లో వాటిని తమ సైన్యం నేల్చకూల్చిందని రష్యా విదేశాంగ మంతరి సెర్గె లావ్రోవ్ ప్రకటించారు. అయితే.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తున్నారాయన. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై దాడులను రష్యా ఆపడం లేదు. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెసా నగరంపై తాజాగా డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్మెంట్లు, విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. ఓ శిశువు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావించేలోపే.. రష్యా ఉక్రెయిన్పై దీర్ఘశ్రేణి దాడుల్ని తీవ్రం చేయడం గమనార్హం. -
చైనాకు పాక్ ఉప ప్రధాని.. కారణం ఇదే..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్దార్ చైనాలో పర్యటించనున్నారు. ఈ వారం చివర్లో చైనాను సందర్శించనున్న ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా, ఏడో దశ ద్వైపాక్షిక చర్చలు జనవరి 4న బీజింగ్లో జరుగుతాయని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆహ్వానం మేరకు దార్ ఈ పర్యటన చేస్తున్నారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఇరు దేశాలు స్మారక కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఈ పర్యటన బలోపేతం చేస్తుందని ప్రకటించింది. -
‘హెచ్–1బీ’ దరఖాస్తు ఫీజు పెంపు చట్టబద్ధమే
వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడడానికి వ్యతిరేకంగా సాగిస్తున్న న్యాయ పోరాటానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని కొలంబియా జిల్లాకు చెందిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బెరిల్ హోవెల్ తేల్చిచెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 23న ఉత్తర్వు జారీ చేసింది. వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని సవాలు చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్లో యూఎస్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయంలోని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి బెరిల్ హోవెల్ విచారణ చేపట్టారు. రుసుమును విపరీతంగా పెంచేయడం ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. వీసా ఫీజును నిర్ణయించే విషయంలో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కు ఉన్న అధికారాన్ని సైతం ట్రంప్ ప్రభుత్వం అతిక్రమించినట్లు పేర్కొంది. ఫీజను తగ్గించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అయితే, ఈ వాదనను బెరిల్ హోవెల్ తిరస్కరించారు. అధ్యక్షుడు ట్రంప్ చట్టప్రకారమే నడుచుకున్నారని, వీసా ఫీజు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు ఉందని న్యాయమూర్తి స్పష్టంచేశారు. బెరిల్ హోవెల్ గతంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒమాబా నియమించిన న్యాయవాది కావడం విశేషం. మరోవైపు జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ యూఎస్ చాంబర్ కామర్స్.. అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. నోటీసు ఆఫ్ అప్పీల్స్ను దాఖలు చేసింది. జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై త్వరలోనే అప్పీల్స్ కోర్టులో విచారణ జరుగనుంది. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు విషయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం ఫలించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఈ వ్యవహారం అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్–1బీ వీసాల కోసం అమెరికా వృత్తి నిపుణుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. మొత్తం వీసాల్లో దాదాపు 70 శాతం వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. వీసా ఫీజు లక్ష డాలర్లకు(రూ.89.86 లక్షలు) చేరడం అమెరికా కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ ఖర్చు భరించలేక విదేశీ నిపుణులను నియమించుకొనే ప్రక్రియను కంపెనీలు వాయిదా వేస్తున్నారు. అంతిమంగా విదేశీ వృత్తి నిపుణులే నష్టపోతున్నారు. -
బ్యాంక్కు కన్నమేసి భారీ చోరీ
అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ జర్మనీలో చోరశిఖామణులు వందల కోట్ల విలువైన సంపదపై పక్కా ప్రణాళికతో నింపాదిగా కొట్టేశారు. ఏమాత్రం హడావిడి పడకుండా నెమ్మదిగా పని ముగించి ఏకంగా దాదాపు రూ.950 కోట్ల విలువైన కట్టల కొద్దీ కరెన్సీ, కేజీల కొద్దీ బంగారం, ఆభరణాలను వెంట తీసుకెళ్లారు. ఈ చోరీ కోసం దొంగలు భారీ డ్రిల్లింగ్ మెషీన్ను రంగంలోకి దింపారు. అత్యంత దృఢమైన బ్యాంక్ వాల్ట్ గోడకు కన్నమేసి వేలాది మంది బ్యాంక్ వినియోగదారుల విలువైన వస్తువులను తమ వశంచేసుకున్నారు. ఉత్తర రైనీ–వెస్ట్ఫాలియా రాష్ట్రంలోని గెల్సెన్కిర్చెన్ నగరంలోని స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో ఈ భారీ చోరీ జరిగింది. సెలవు రోజుల్లో పక్కా ప్రణాళికతో గెల్సెన్కిర్చెన్: జర్మనీలో క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంక్లు సహా పలు రకాల సంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. డిసెంబర్ 24 తేదీ నుంచి బ్యాంక్ శాఖలకు తాళాలే వేసి ఉన్నాయి. అటు వైపు కన్నెత్తిచూసే పోలీస్నాథుడే ఉండడు. ఇదే సమయాన్ని దొంగలు తమకు అనువుగా మల్చుకుని విజయం సాధించారు. ఈ స్పార్కసీ సేవింగ్ బ్యాంక్ శాఖలో వందల కోట్ల విలువైన నగలు, బంగారం, కరెన్సీ మూటలను బ్యాంక్ అధికారులు భూగర్భంలోని అత్యంత సురక్షితమైన వాలెట్లోనే భద్రపరుస్తారు. ఈ విషయం తెల్సుకున్న దొంగలు తొలుత ఈ బ్యాంక్ బ్రాంచ్ భవంతిని ఆనుకుని ఉన్న ఒక పార్కింగ్ గ్యారేజీలోకి చొరబడ్డారు. గ్యారేజీ గోడలతో అనుసంధానమైన బ్యాంక్ వాలెట్ గోడ సరిగ్గా ఎక్కడుందో కనిపెట్టారు. పెద్దపెద్ద రంధ్రాలు చేసే అత్యంత శక్తివంతమైన డ్రిల్లింగ్ మెషీన్తో గోడకు రంధ్రం చేశారు. లోపలికి చొరబడి బ్యాంక్ వినియోగదారులకు చెందిన దాదాపు 3,250 లాకర్లను తెరచి వాటిలోని బంగారు ఆభరణాలు, బంగారం కడ్డీలు, కరెన్సీని వెంట తెచ్చుకున్న సంచుల్లోకి నింపారు. ఈ చోరీపై పోలీస్ శాఖ అధికార ప్రతినిధి థామస్ నొవాక్జిక్ మాట్లాడారు. ‘‘దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇందులో అత్యంత నిపుణులైన ఘరానా దొంగలు పాల్గొనట్లు తెలుస్తోంది. ఇంత పకడ్బందీగా చోరీ చేయడం ఈ మధ్యకాలంలో చూడలేదు. జర్మనీ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ చోరీ ఘటన ఇదేనేమో. దాదాపు రూ.950 కోట్ల సంపద పోయిందని భావిస్తున్నాం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో చోరీ జరగలేదు. నింపాదిగా ఒక్కో లాకర్ను బద్దలుకొట్టారు. వాలెట్లోని దాదాపు 95 శాతం లాకర్లలోని విలువైన వస్తువులు గల్లంతయ్యాయి. ఘటనపై ముమ్మర దర్యాప్తు మొదలెట్టాం. ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్చేయలేదు. అత్యంత ప్రతిభావంతులైన డిటెక్టివ్, పోలీస్ బృందాలతో దొంగల వేట ఆరంభించాం’’అని ఆయన చెప్పారు. తెల్లారిందాకా మోశారు! దొంగలను సంపదను సంచుల్లో నింపుకున్నాక ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా ఒక్కోటిగా బయటకు తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘వాళ్లంతా బ్యాంక్ నుంచి రాలేదు. పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజీ నుంచి రావడంతో మాకు కొంచెం కూడా అనుమానం రాలేదు. అందరూ మాసు్కలు ధరించారు. మెట్ల మీద నుంచి బ్యాగులు మోస్తూ కని్పంచారు’’అని పొరుగు వాళ్లు చెప్పారు. సమీప సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీచేశారు. అందులో నలుపు రంగు ఆడీ ఆర్ఎస్6 రకం కారు ఒకటి పార్కింగ్ గ్యారేజీ నుంచి బయటకు రావడం కనిపించింది. ఆ కారులో ఉన్నవా ళ్లంతా ముసుగులో ధరించి ఉన్నారు. డీ–లా షెవలేరీ స్ట్రాసీ రోడ్డు గుండా కారులో దొంగలు పారిపోయారు. ఆ కారు లైసెన్స్ ప్లేటు పై పోలీసులు ఆరాతీయగా ఘటనాస్థలి నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని హనోవర్ సిటీలో చోరీకి గురైన కారుదిగా గుర్తించారు. ఈ మొత్తం ఘటన హాలీవుడ్లో హిట్ అయిన ‘ఓషన్స్ ఎలెవన్’నేరముఠా చోరీని గుర్తుకు తెస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో బ్యాంక్లోని ఒక అలారమ్ మోగడంతో అప్పుడు ఎమర్జెన్సీ బృందం రావడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. -
బ్రహ్మపుత్రపై డ్యామ్కు రూ. 15.27 లక్షల కోట్లు!
బీజింగ్: భారత్కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి ఏకంగా దాదాపు రూ.15.27 లక్షల కోట్లు(170 బిలియన్ డాలర్లు) కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుదుత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రా జెక్టులోని జలరాశిని మనపైకి జలఖడ్గంలా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్ పింగ్ ప్రకటన తేటతెల్లం చేసింది. తైవాన్కు వార్నింగ్ తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకుని తీరతామని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. తద్వారా తైవాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికా వంటి దేశాలను అన్యాపదేశంగా ఆయన హెచ్చరించారు. తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులను కొద్ది రోజులుగా చైనా మరింత ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. -
2026కు విశ్వమానవాళి వెల్కమ్
మెల్బోర్న్/న్యూఢిల్లీ: కొత్త ఆశలను మోసుకొచ్చిన నూతన సంవత్సరానికి ప్రపంచదేశాలు ఆనందోత్సాహల నడుమ సాదర స్వాగతం పలికాయి. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో అత్యంత ఆడంబరంగా జరిగే బాల్ డ్రాప్ వేడుక కంటే 18 గంటలు ముందుగానే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు నూతన ఏడాది వేడుకలను జరుపుకున్నారు. స్థానికకాలమానం ప్రకారం కొత్త ఏడాది అన్నిదేశాలకంటే ముందుగా అక్కడే మొదలైంది. ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆ్రస్టేలియాలోని సిడ్నీ నగర హార్బర్ బ్రిడ్జిపై కన్నులపండువగా జరిగే బాణసంచా షోను చూసేందుకు జనం ఈసారి సైతం తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే రెండు వారాల క్రితం బాండీ బీచ్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఆ్రస్టేలియాపోలీసులు మునుపెన్నడూ లేనంతగా మొహరించారు. చాలా మంది పోలీస్ అధికారులు తొలిసారిగా ర్యాపిడ్ఫైర్ రైఫిళ్లను వెంటేసుకుని తిరిగారు. న్యూజిలాండ్లోని అక్లాండ్ సిటీలో ప్రఖ్యాత స్కై టవర్పై పేల్చిన బాణసంచా అక్కడి వారికి కనువిందుచేసింది. ఆ్రస్టేలియా సమీప ఇండోనేసియాలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. నెల క్రితమే వేయి మందికిపైగా ప్రజలను వరదలు కబళించిన బాధ నుంచి జనం తేరుకుని కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయారు. అయితే ఇండోనేసియాలోని బాలీలో మాత్రం భారీ వేడుకలను ఈసారి రద్దుచేశారు. జపాన్లో జనం కొత్త ఏడాది గంట కొట్టగానే బౌద్ధారామాలను దర్శించుకున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్ వాసులూ తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జర్మనీలోని బెర్లిన్ నగర క్యాథడ్రల్, ప్రఖ్యాత బ్రాండెన్బర్గ్ గేటు వద్ద జనం పోగై ఒకరికొకరు నూతన సంవత్సర శుభకాంక్షలు చెప్పుకున్నారు. భారత్లో ఊరూవాడా జనం సంబరాల్లో మునిగిపోయారు. -
చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షలే!
న్యూఢిల్లీ: వలసదారులకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది. క్రిమినల్ నేరాల కింద శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ఎంబసీ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘చట్టాలను గౌరవించకపోయినా, ఉల్లంఘించినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవు. క్రిమినల్ నేరాలుగా పరిగణించి శిక్ష విధిస్తారు. అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’’అని స్పష్టంచేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పోస్టు చేయడం గమనార్హం. వలసదారులపై ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీసా నిబంధనలు మార్చేసింది. ప్రధానంగా హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. మరోవైపు హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ వృత్తినిపుణులు స్వదేశానికే పరిమితయ్యారు. ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ను, పోస్టులను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో చట్టాలను ఉల్లంఘించవద్దంటూ అమెరికా ఎంబసీ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం వారిపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 6.05 లక్షల మందిని బలవంతంగా బయటకు పంపించింది. అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని అమెరికా నుంచి వెళ్లగొట్టడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. -
2025 మండిపోయింది..
అనుకున్నట్టుగానే 2025 పర్యావరణపరంగా మరో అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుని ని్రష్కమించింది. చరిత్రలో అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. నంబర్లపరంగా మూడో స్థానమే అయినా, ప్రపంచవ్యాప్తంగా 2025 పొడవునా అత్యంత తీవ్రతతో కూడిన వాతావరణ మార్పులు పదేపదే చోటుచేసుకుని వణికించాయి. ముఖ్యంగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల ఉదంతాలు ఏకంగా 157 నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘‘ఇవన్నీ పర్యావరణ మార్పుల విపరిణామాలే. ఈ విపత్తును దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలను తక్షణం ముమ్మరం చేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి రావాలి. లేదంటే అంతే సంగతులు. మరో రెండు మూడేళ్ల తర్వాత తత్వం బోధపడ్డా, దిద్దుబాటు చర్యలకు అప్పటికి బాగా ఆలస్యమవుతుంది. అప్పుడిక ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే కాగలదు’’అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమితిని దాటేశాం! 2025 అత్యంత భారీ ఉష్ణోగ్రతలు చవిచూసిన సంవత్సరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిందంటే మనిషి అత్యాశ వల్ల పుట్టుకొచ్చిన పర్యావరణ విపరిణామాల వల్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, గత మూడేళ్ల భూ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటేసింది. ఇలా జరగడం ఇదే తొలిసారి!. ఇది కచ్చితమైన ప్రమాద సంకేతమేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో కేవలం అత్యుష్ణ ప్రతాపాలే కాదు, భయానక తుఫాన్లు, వరదల వంటివి కూడా బెంబేలెత్తించడం గమనార్హం. నిజానికి 2025లో వాతావరణాన్ని సాధారణంగా చల్లబరిచే లా నినా ఆధిపత్యమే కొనసాగింది. అయినా యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోయాయంటే ఆలోచించాల్సిన విషయమేనన్నది నిపుణుల మాట. ‘‘ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకానికి మనం తక్షణం గుడ్బై చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే అతి త్వరలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చు’’అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకుడు, లండన్ ఇంపీరియల్ కాలేజీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో స్పష్టం చేశారు. ‘‘2025లో వచ్చిన పలు వడగాడ్పులు 2015తో పోలిస్తే ఏకంగా 10 రెట్లు శక్తిమంతమైనవి. పైగా ఏడాది పొడవునా అవి పదేపదే సంభవించాయి. ఇదంతా మనిషి కోరి తెచ్చుకుంటున్న విపత్తే’’ అని ఆయన అన్నారు. ప్రమాదంలో కోట్ల మంది 2025లో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ పరిస్థితులు అతి వేడిమి నుంచి తీవ్ర వరదలదాక చూస్తుండగానే మారుతూ వచ్చాయి. ‘‘గ్రీస్, టర్కీ మొదలుకుని అమెరికా, ఆ్రస్టేలియా దాకా పలు దేశాల్లో ఎటు చూసినా కార్చిచ్చులు, మెక్సికోను వణికించిన వరదలు, ఫిలిప్పీన్స్ను కుండపోత వానలతో ముంచెత్తిన ఫుంగ్ వాంగ్ తుఫాను, భారత్లో వానాకాలమంతా ఏదో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ఇవన్నీ వాతావరణ మార్పుల విపరిణామాల సంకేతాలే’’ అని ఫ్రెడరిక్ స్పష్టం చేశారు. ‘‘జమైకా, క్యూబా, హైతీ వంటి దేశాలను హరికేన్ మెలిస్సా రెప్పపాటులో అతలాకుతలం చేసింది. కనీసం హెచ్చరికల జారీకి వ్యవధి ఇవ్వకుండా మెరుపు వేగంతో వచ్చి పడింది. ఆ తర్వాత వెంటనే ఆయా దేశాలను ఉష్ణోగ్రతలు అల్లాడించాయి. ఇలాంటి వెంటవెంట మార్పులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులవుతున్నారు. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇది లక్షలాది కుటుంబాలను దారిద్య్రం దిశగా నెడుతోంది. తద్వారా పలు దేశాల్లో నిశ్శబ్దంగా అతి పెద్ద సంక్షోభాలు పురుడు పోసుకునేందుకు కారణంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.‘శిలాజ’ ముప్పుపై చర్యలేవీ? ఇటీవల బ్రెజిల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ చర్చలు ఈ ప్రమాదకర పరిణామాన్నే హైలైట్ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ వారి్మంగ్కు ప్రధాన కారకాల్లో ఒకటైన శిలాజ ఇంధనాల వాడకాన్ని శరవేగంగా తగ్గించి, వీలైనంత త్వరగా సున్నాకు తేవాలని తీర్మానించాయి. ‘‘కానీ దేశాలన్నీ ఇలాంటి ప్రమాణాలు ఏటా చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తీరిగ్గా విస్మరిస్తూనే ఉన్నాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. చైనాయే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూనే, మరోవైపు బొగ్గు గనుల తవ్వకాన్ని కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంతకాలం పర్యావరణ మార్పులపై సమర్థంగా యుద్ధం చేయడం అసాధ్యమే’’ అని ఫ్రెడరిక్ కుండబద్దలు కొట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఆఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ ఏడారిలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యింది. అయితే సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఏడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలుత హవాక్కయ్యారు. తాజాగా అందులో అపారమైన బంగారం. వెండితో పాటు పెద్ద మెుత్తంలో ఖజానా దొరికింది.2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఏడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాములు రాగి కడ్డీలు ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు.అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమిబీయా తీరాన్ని తీవ్ర మంచుతుపాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడ లభ్యం కాలేదు ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది. -
ద్వంద్వ పౌరసత్వం ఇవ్వండి..!
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని అక్కడి ప్రవాసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రవాసీ లీగల్ సెల్ ప్రతినిధులు బుధవారం యుఎస్, హూస్టన్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రవాసీ లీగల్ సెల్ గ్లోబల్ ప్రతినిధి సుధీర్ తీరునిలత్ను కలిసి వినతి పత్రం అందించారు. ద్వంద్వ పౌరసత్వం కల్పించడానికి ఉన్న చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన వారికి తెలిపారువిదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సరైన సంబంధాలు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని గ్లోబల్ సెల్ ప్రతినిధులు సూచించారు. తద్వారా ప్రవాస భారతీయుల హక్కులను పరిరక్షించడమే కాకుండా భారత్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్నారైలకు దంద్వ పౌరసత్వం కల్పించే అంశంపై ప్రవాసీ లీగల్ సెల్ తీవ్రంగా కృషి చేస్తోందని లీగల్ సెల్ హెచ్ఓసీ ప్రశాంత్ కుమార్ సోనా అన్నారు. కనుక అమెరికాలోని ఎన్నారైలు ఈ పోరాటంలో భాగం పంచుకోవాలని కోరారు.ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు భారత్ ఓసీఐ కార్టు అందజేస్తుంది. ఈ కార్డు ఉన్నవారు జీవిత కాలం పాటు భారత్లో పర్యటించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఓటు హక్కు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు కారు. రాజ్యాంగం అమలు సమయం నుంచి భారత్ ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తాయి. -
కొత్త ఏడాదిలో అవన్నీ సాగవు : గుర్తిస్తే కఠిన చర్యలు
మస్కట్: వర్క్ పర్మిట్లు, వృత్తిపరమైన లైసెన్స్, సర్టిఫికెట్లపై ఒమన్ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వర్క్ పర్మిట్లు, జాబ్ లైసెన్స్ పత్రాలను సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి నకిలీని సర్టిఫికెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో నిబంధనలను కఠినతరం చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు, కాపీలు లాంటి చర్యలు చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒమన్లో పని అనుమతులు (వీసాలు) పునరుద్ధరించడానికి, కొత్త ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి, సంబంధిత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికెట్లు, వృత్తిపరమైన అభ్యాస లైసెన్స్లను సమర్థ అధికారుల (సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లు) నుండి పొందాలని స్పష్టం చేసింది.అదే సమయంలో, అన్ని ఉద్యోగులు, కంపెనీలు ఈ పత్రాలు జారీ చేసే క్రమంలో వాటి ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఏదైనా అనధికార పత్రాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రొఫెషనల్ వర్గీకరణ సర్టిఫికేట్ , వృత్తిని అభ్యసించడానికి లైసెన్స్ ముఖ్యమైనవి. ఉద్దేశించిన వృత్తికి సంబంధిత వ్యక్తి సుముఖత , అర్హతను ధృవీకరించడం, వృత్తిపరమైన సామర్థ్యం , పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం, కార్మిక మార్కెట్ను నియంత్రించడం వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడమే దీని లక్ష్యంమని పేర్కొంది. నకిలీ లేదా తప్పుడు పత్రాన్ని సృష్టించడం నేరస్థుడిపై చట్టపరమైన చర్యలకు దారితీసుకుంటామని హెచ్చరించింది. చట్టాలని లోబడి జరిమానా, ఇతర చర్యలుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో న్యూఇయర్ వేడుకలు రద్దు
లాస్ ఏంజెల్స్: భద్రతా కారణాలు, ఉగ్రదాడుల ముప్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేశారు. లాస్ ఏంజెల్స్లో వరుస బాంబు దాడులే లక్ష్యంగా కుట్ర పన్నిన నలుగురిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఎఫ్బీఐ వివిధ దేశాలు హెచ్చరికలు జారీ చేసింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండై బీచ్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించగా, 40 మందికి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, 15,000 మందికి పైగా పాల్గొనే బోండై బీచ్లోని పటాకుల ప్రదర్శనతో పాటు ఇతర వేడుకలు రద్దయ్యాయి. యూదుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.పారిస్లోని షాంప్స్-ఎలీసీ వద్ద ప్రసిద్ధ సంగీత కార్యక్రమాన్ని పోలీసులు సూచన మేరకు రద్దు చేశారు. భారీ జనసమూహం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే అధికారిక పటాకుల ప్రదర్శన మాత్రం జరుగుతుంది.టోక్యోలోని షిబుయా స్టేషన్ వెలుపల జరిగే ప్రపంచ ప్రసిద్ధ నూతన సంవత్సరం కౌంట్డౌన్ రద్దు చేశారు. భారీ రద్దీ కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ఆవకాశముందని అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించారు. అయితే, న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. -
ఇతర దేశాలకూ ముప్పు తప్పదా..?
దీర్ఘకాలంగా మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా... యూఏఈల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో అలజడి చెలరేగింది. అంతగా స్నేహంగా ఉన్న దేశాల మధ్య ఒక్కసారిగా విబేధాలు రావడానికి యెమన్ దేశమే కారణమైంది. 9 ఏళ్లుగా యెమన్లో యుఏఈ మద్దతు ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే వేర్పాటువాద గ్రూప్. ఆ గ్రూప్ను యెమన్ దేశంతో పాటు... సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. కానీ... యూఏఈ మాత్రం ఆ గ్రూప్ను సమర్థిస్తోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పేరిట పుట్టిన వేర్పాటు వాద గ్రూప్... అంతర్గత కలహాలు సృష్టిస్తూ యెమెన్లోని ప్రధాన దక్షిణ వేర్పాటువాదం కోసం పోరాడుతోంది. ముఖ్యంగా యెమెన్ దక్షిణ ప్రాంతానికి స్వతంత్రత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఈ గ్రూప్ 2017లో పుట్టింది.వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తోందన్న అనుమానంతో సౌదీకి కోపం వచ్చింది. దీంతో సౌదీ బలగాలు నేరుగా డిసెంబర్ ౩౦న యెమెన్లోని ముకల్లా పోర్ట్ నగరంపై దాడి చేయగా... యుఏఈ దీనిని తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా అక్కడ ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యెమన్పై జరిగిన దాడితో పాత మిత్రుల మధ్య పుట్టుకొచ్చిన వ్యతిరేకతను దూరం చేయడానికి గల్ఫ్ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు దాడి జరగ్గానే యెమన్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యెమన్లోని వేర్పాటు వాదులకు యూఏఈ నుంచి ఆయుధాలు అందుతన్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ... యెమెన్లోని ముకల్లా పోర్ట్పై సౌదీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దాడిని యూఏఈ ఖండిస్తూ... సౌదీ ఆరోపణలు నిరాధారమైనవని.. అసలు వారి వద్ద ఆయుధాలే లేవని యూఏఈ స్పష్టం చేసింది. అనాలోచిత దాడి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యెమన్లో ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఊహించని పరిణామమని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి. అయితే అక్కడ చెలరేగిన యూఏఈ- సౌదీ మధ్య విబేధాలు ఇటు మన దేశంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక భద్రత, భారత్కు అందే ఇంధన సరఫరా, ప్రవాస భారతీయుల సంక్షేమాలపై ప్రభావం చూపే అవకాశముంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. యెమన్లో మళ్లీ సౌదీ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని... దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా- యూఏఈల మధ్య ఘర్షణ ముదిరితే.. యెమన్, యూఏఈతో పాటు ఇతర దేశాలకూ ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరిగితే వాటి ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. భారత్ లో ప్రవాస భారతీయుల భద్రత, భారత్కు ఇంధన సరఫరా, వాణిజ్య సంబంధాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
దుబాయ్లో ఉంటున్నారా..? అయితే ఇది మీకోసమే?
న్యూ ఇయర్- 2026 దుబాయ్లో ఉండే వారికి షాక్ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగడంతో అక్కడ అద్దెలు ఈ ఏడాది గరిష్ఠంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు విల్లాలు, ప్లాట్ల రేట్లు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దుబాయ్ అంటే కాస్లీ లైఫ్కు పెట్టింది పేరు. ఆ నగరం కేవలం టూరిస్ట్ స్పాట్గానే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్లు, సాంస్కృతిక వైభవం, సైక్యూరిటీ తదితర కారణాల రీత్యా దుబాయ్కి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో అక్కడి భవనాల అద్దెరెట్లు దాదాపు ఆరుశాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పామ్ జుమేరా, దుబాయ్ హిల్స్, డౌన్టౌన్, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలలో నివసించడానికి విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని అందుచేత అక్కడ అద్దెలు ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు సాధారణ ప్రాంతాలలో అద్దెలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలకు వీటిని చెల్లించడం అధిక భారంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.వీటితో పాటు గోల్డెన్ వీసా హోల్డర్లు, విదేశీ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో పాట్లు, విల్లాల అమ్మకాలకు అధిక డిమాండ్ ఏర్పడనున్నట్లు తెలిపారు. -
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
పాక్లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు? ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్మౌలానా ఫజలుర్రహ్మన్ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది. ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే... మరి భారత్ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్పై పాక్ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్... ఆఫ్గనిస్తాన్ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. పాక్లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్లోని తాలిబాన్ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్స్టాప్ పెట్టి ఆసిమ్ మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనగరల్ ఆసిమ్ మునీర్లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్ మునీర్ గేమ్ చివరి దశకు చేరిందని... ఖేల్ ఖతమ్ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో... ఇప్పుడు మనం చూద్దాం.ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్ మునీర్కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్- ఆఫ్గాన్ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్ మునీర్ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్ పెద్దలు, పాకిస్తాన్ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్ మునీర్ అనవసరంగా ఆఫ్గాన్పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. ఫజలుర్ రహ్మాన్ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్... పాక్ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం నోరు విప్పడం లేదు. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ..
సంవత్సరపు చివరి క్షణాలు మనసులో జ్ఞాపకాల ముత్యాలు చల్లుతూ.. కొత్త ఆశలతో నిండిన ఉదయం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. పాతది మసకబారుతుంటే, కొత్తది వెలుగులు విరజిమ్ముతోంది. న్యూ ఇయర్కు కొత్త ఉదయం తలుపులు తడుతుంటే.. ఇప్పటి వరకూ మనం ఆస్వాదించిన ఇయర్-2025 ముగింపునకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. అలాగే న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో కొత్త ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడి జనవరి 1 వచ్చేసింది కాబట్టి వారు కొత్త సంవత్సరం వేడుకల్లోకి ప్రవేశించారు.కిరిబాటి.. చిన్న ద్వీప దేశంభూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్కు ఉత్తరాన ఉంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.భారత్లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..కిరిబాటి(8.30 am on Jan 1)సమోవా, టోంగా((7.30 am on Jan 1)న్యూజిలాండ్((7.30 am on January 1)రష్యా, ఫిజి((6.30 am on January 1)ఆస్ట్రేలియా((5.30 am on January 1)పాపువా న్యూగినియా((4.30 am on January 1)ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)వియాత్నాం, థాయ్లాండ్( 1.30 am on January 1)మయన్మార్(1 am on January 1)బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)నేపాల్(12.15 am on January 1)Kiribati Island First to celebrate the New Year 2026 #Happynewyear #2026 Celebration to Kiribati as other countries in the world catches up to celebrate The New Year 🎊 🎊🕺💃I TOLD THEMMan U Academy Verse of the day DO NOT#FundsRecovery pic.twitter.com/QQ4Y18av3s— Brass ENt ✴️🔸🔶 (@jakeOttario) December 31, 2025 It's offically 2026 in Auckland, New Zealand pic.twitter.com/uADbsKxZeu— Maurice (@maurice_lippy) December 31, 2025 -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
జియాకు కన్నీటి వీడ్కోలు
ఢాకా: దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియాకు వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఢాకా నగరంలోని దేశ మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త, దివంగత జియావుర్ రహ్మాన్ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేశారు. మూడు సార్లు ప్రధాని పగ్గాలు చేపట్టి బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన 80 ఏళ్ల జియా మంగళవారం పలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో కన్నుమూయడం తెల్సిందే. బుధవారం ఢాకాలోని మాణిక్ మియా అవెన్యూ సమీపంలోని షేర్–ఎ–బంగ్లా నగర్లోని శ్మశానవాటికలో పూర్తి అధికారిక లాంఛనాలతో జియా అంత్యక్రియలను సాయంత్రం 4.30 గంటలకు మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిచేసింది. తొలుత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎనీ్ప) కార్యకర్తలు, వేలాది మంది అభిమానుల సందర్శనార్థం జియా పార్థివదేహాన్ని జాతీయ సంసద్ భవన్(పార్లమెంట్) సమీప మాణిక్ మియా అవెన్యూలో ఉంచారు. జియా మృతదేహంపై బంగ్లాదేశ్ జాతీయజెండాను కప్పారు. అక్కడే మధ్యాహ్నం రెండో నమాజు ‘జుహుర్’తర్వాత అంత్యక్రియల సంబంధ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైతుల్ మొకర్రం జాతీయ మసీదు ప్రధాన మతాధికారి మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా సుదూరాల నుంచి సైతం జియా అభిమానులు కడసారి ఆమెను చూసేందుకు తరలివచ్చారు. దీంతో పార్లమెంట్ చుట్టూతా ఉన్న రహదారులన్నీ బీఎన్పీ కార్యకర్తలు, అభిమానులతో జనసంద్రంగా మారాయి. రోడ్లమీదనే జియా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జియా ఫొటోలున్న భారీ ప్లకార్డులను చేతబూని ఆమె దేశానికి చేసిన సేవను గుర్తుచేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్, చీఫ్ జస్టిస్ జుబేయర్ రహ్మాన్ చౌదరి, బేగం జియా కుమారుడు, బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్, పలు దేశాల ప్రత్యేక ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల చీఫ్లు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరై జియా కుమారుడికి ప్రధాని మోదీ తరఫున సంతాప లేఖను అందజేశారు. -
ఇండియా-పాక్ వార్.. చైనా అక్కసు
ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించిందిఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు మద్ధతుగా నిలిచింది. పాక్కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. -
ఎయిర్వేస్లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు
నైరోబీ: కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాష్మీర్ సయ్యద్కు విమాన ప్రయాణంలో ఘోర అవమానం ఎదురైంది. ‘కెన్యా ఎయిర్వేస్’లో తాను ముందుగా బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ సీటును తనకు కేటాయించకుండా, ఎకానమీ క్లాస్కు మార్చడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా మారింది.కాష్మీర్ సయ్యద్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె గత వారంలో తన ప్రయాణం కోసం బిజినెస్ క్లాస్ టికెట్ను బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలోనే చెక్-ఇన్ కూడా పూర్తి చేశారు. అయితే విమానం ఎక్కే సమయంలో సిబ్బంది ఆమెను ఎకానమీ క్లాస్కు వెళ్లాలని సూచించారు. వెంటనే ఆమె ప్రశ్నించగా, విమాన సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా, ముప్పై నిమిషాల పాటు వేచి ఉండేలా చేశారని ఆమె ఆరోపించారు. స్థానిక కెన్యా పౌరురాలైన తనను కాదని, తన సీటునుఘెందుకు తెల్లజాతీయులకు కేటాయించారని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కాష్మీర్ సయ్యద్ సిబ్బందితో విమాన వాదించడం కనిపిస్తుంది. ‘ఈ సీటు కోసం నేను డబ్బు చెల్లించాను. చెక్-ఇన్ చేశాను.. మరి నా సీటులో ఎవరు కూర్చుంటారు?’ అని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు. దీంతో విమాన సంస్థ ప్రతినిధులు ఆమెకు రీఫండ్ ఇస్తామని లేదా తదుపరి విమానంలో పంపిస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె వాటిని తిరస్కరించారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, స్పష్టమైన జాత్యహంకార వివక్ష అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎయిర్లైన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం ముదిరిన నేపధ్యంలో కెన్యా ఎయిర్వేస్ స్పందించింది. తమపై వస్తున్న జాత్యహంకార ఆరోపణలను సంస్థ ఖండించింది. విమాన ప్రయాణ సమయంలో చివరి నిమిషంలో విమానం మారడం వల్ల బిజినెస్ క్లాస్ సీట్ల సంఖ్య తగ్గిందని, అందుకే కొందరు ప్రయాణికులను ఎకానమీకి మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఈ విధమైన ఎంపిక ప్రక్రియ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా జరుగుతుందని, ఇందులో జాతి వివక్షకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బాధిత ప్రయాణికురాలికి జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ సంస్థ ఆమెను క్షమాపణలు కోరింది.ఇది కూడా చదవండి: Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర! -
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తామే చల్లార్చామంటూ చైనా చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. అయితే చైనాకు అంత సీన్ లేదని భారత్ అంటోంది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పుడూ ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేస్తూ.. డ్రాగన్ కంట్రీ ప్రకటనను తోసిపుచ్చింది. చైనా ప్రకటనను కేంద్ర వర్గాలు తోసిపుచ్చినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం.. భారతదేశం మధ్యవర్తిత్వంపై ఎప్పటినుంచో స్పష్టమైన వైఖరిని అవలంభిసతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. కేవలం పాకిస్తాన్ DGMO (Director General of Military Operations) భారత్ను సంప్రదించి కాల్పుల విరమణ కోరింది. కాబట్టి.. భారత్ ఎప్పటికీ మూడోపక్ష జోక్యాన్ని అనుమతించదు అని పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ పేరిట సర్జికల్ స్ట్రయిక్సతో సర్వనాశనం చేసింది. ఈ నేపథ్యంతో మే 7-10వ తేదీల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రెండు దేశాల సైనిక డీజీఎంవోల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కారు ప్రకటించింది. కానీ,తాజాగా బీజింగ్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన టారిఫ్ బెదిరింపులతోనే ఇరు దేశాలు దిగొచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. దీనికి కారకుడంటూ భారతీయ మూలాలున్న తన ప్రత్యేక సహాయకుడు రికీ గిల్ను ట్రంప్ ప్రభుత్వం తాజాగా సత్కరించింది కూడా. ఈ పరిణామాల నడుమే.. మే నెల ఉద్రిక్తతల సమయంలో పాక్కు ఆయుధాలను సరఫరా చేసిన చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం నడిపి ఉద్రిక్తతలను చల్లార్చామంటూ ప్రకటించుకోవడం కొసమెరుపు. -
Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర!
కోపెన్హాగన్: ఆధునిక డిజిటల్ యుగం ప్రపంచంలోని అన్నింటినీ సమూలంగా మార్చివేస్తోంది. ఈ ప్రభావం పోస్టల్ విభాగంపై తీవ్రంగా పడింది. సుమారు నాలుగు శతాబ్దాల కాలంగా ప్రజల మధ్య వారధిగా నిలిచిన డెన్మార్క్ పోస్టల్ సర్వీస్ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో భౌతిక రూపంలో ఉండే ఉత్తరాల పంపిణీని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దాదాపు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ వ్యవస్థ, మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను సమూలంగా మార్చుకుంటోంది. ఉత్తరాల పంపిణీ కోసం దశాబ్దాలుగా కొనసాగిన సార్వత్రిక సేవా బాధ్యత (Universal Service Obligation) ఒప్పందం ముగియడంతో డెన్మార్క్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఉత్తరాలు రాయడం తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. గడచిన 20 ఏళ్లలో డెన్మార్క్లో ఉత్తరాల సంఖ్య ఏకంగా 90శాతానికి పడిపోయింది. స్మార్ట్ఫోన్లు, ఇమెయిల్స్, ఇతర డిజిటల్ సమాచార వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కాగితంపై రాసే ఉత్తరాలకు దూరమయ్యారు.ఒకప్పుడు వేల సంఖ్యలో పోస్ట్మెన్లు వీధివీధిన తిరిగిన రోజులు ఉండేవి. ప్రస్తుతం ఉత్తరాలు మోయడం అనేది పోస్టల్ విభాగానికి ఆర్థికంగా భారంగా మారింది. దీంతో ప్రభుత్వం పోస్టల్ సేవలను కేవలం పార్సిల్స్, వ్యాపార సరుకుల పంపిణీకే పరిమితం చేయాలని నిర్ణయించింది. మరోవైపు డిజిటల్ విప్లవంలో డెన్మార్క్ అగ్రగామిగా ఉంది. ఈ నిర్ణయంతో డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్న దేశంగా మరోసారి నిరూపితమయ్యింది. ఇప్పటికే డెన్మార్క్లోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రజల మధ్య కమ్యూనికేషన్ అనేది దాదాపు 100శాతం మేరకు డిజిటల్ వేదికల ద్వారానే సాగుతోంది.అయితే డెన్మార్క్ పోస్టల్ విభాగం తీసుకున్న నిర్ణయం వృద్ధులకు, సాంకేతికతపై అవగాహన లేని వారికి కొంతమేరకు ఇబ్బంది కలిగించేది ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే సంప్రదాయ రీతిలో ఉత్తరాల పంపిణీ ఆగిపోయినప్పటికీ, పార్సిల్, డెలివరీ రంగంలో తమ సేవలను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డెన్మార్క్ పోస్టల్ విభాగం వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ వ్యవస్థపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నది.ఇది కూడా చదవండి: దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’! -
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దుబాయ్: సౌదీ అరేబియా, యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్లోని తీర ప్రాంత నగరం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో యెమెన్కు మద్దతుగా నిలుస్తున్న యూఏఈకి సౌదీ హెచ్చరికలు జారీ చేసింది. 24 గంట్లలో యెమెన్ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని సౌదీ వార్నింగ్ ఇచ్చింది.ఇక, అంతకుముందు.. యెమెన్లోని వేర్పాటువాదుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పంపిన ఆయుధ నౌకలపై దాడి చేసినట్లు సౌదీ తెలిపింది. యూఏఈ చర్యలు అత్యంత ప్రమాదకరమైనవంటూ వ్యాఖ్యానించింది. యూఏఈ మద్దతు కలిగిన సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు చెందిన వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో యెమెన్లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. దీనిపై సౌదీ, దాని మిత్ర దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా దాడికి దిగింది.Saudi Arabia bombs a UAE convoy in Yemen meant to establish a Zionist friendly state called 'South Arabia'. Saudi has issued a warning to the UAE to remove it's presence in Yemen within 24 hours. pic.twitter.com/QelYcZkC69— Israel Exposed (@xIsraelExposedx) December 30, 2025యూఏఈ తీర నగరం పుజైరాహ్ నుంచి ఆయుధాలతో ముకల్లాకు వచ్చిన రెండు నౌకల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, మిలటరీ వాహనాలను కిందికి దించుతున్న సమయంలోనే మిత్ర కూటమి విమానాలు బాంబులతో దాడి జరిపాయని సౌదీ తెలిపింది. అదే సమయంలో, 24 గంటల్లోగా యెమెన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని యూఏఈకి తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ పరిణామంపై యూఏఈ స్పందించింది. సహనం, వివేకంతో వ్యవహరించాలంటూ సౌదీకి హితవు పలికింది. యెమెన్ నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్పై మాత్రం ఆ దేశం స్పందించలేదు. యెమెన్లోని తమ బలగాలకు అవసరమైన వాహనాలను మాత్రమే ఆ నౌకల్లో పంపామని, ఆయుధాలు లేవని యూఏఈ అంటోంది.సౌదీ ఆగ్రహం.. కాగా, యెమెన్లో వేర్పాటు వాదులు ఇటీవల సాధించిన పైచేయికి యూఏఈ కారణమని సౌదీ స్పష్టంచేసింది. దక్షిణ యెమెన్కు ప్రత్యేక దేశ స్థాయి కల్పించేందుకు పోరాటం సాగిస్తున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ)కు యూఏఈ మద్దతు తెలుపుతోంది. వేర్పాటు వాద సంస్థ ఎస్టీసీని సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థకు మద్దతుగా యూఏఈ తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రమాదకరమైనవని సౌదీ పేర్కొంది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు మద్దతుగా యూఏఈ నౌకలు ఆయుధాలు చేరవేశాయని ప్రకటన వివరించింది. తాజా పరిణామాలు సౌదీ అరేబియాకు, యూఏఈకీ మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా ఉన్నాయి. పశ్చిమాసియాకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై కలసికట్టుగా పనిచేస్తున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ విషయాల్లో విభేదాలు ఉన్నాయి.రంగంలోకి అమెరికా..ఇదిలా ఉండగా.. సౌదీ, యెమెన్ వ్యవహారంపై అమెరికా ఫోకస్ పెట్టింది. తాజాగా యెమెన్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో మాట్లాడినట్టు తెలిపారు. యెమెన్ పరిస్థితి, మధ్య ప్రాచ్య భద్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే విస్తృత సమస్యల గురించి ఇద్దరూ చర్చించారని సమాచారం. -
తైవాన్పై చైనా దూకుడు.. గగనతల దిగ్బంధనం
హాంకాంగ్: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి జస్టిస్ మిషన్ 2025 పేరుతో విన్యాసాలకు తెరతీసింది.తైవాన్కు బయటి నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు స్వయం పాలిత దీవిని దిగ్బంధనం చేసి, లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో పీఎల్ఏ సదరన్ థియేటర్ కమాండ్లోని డె్రస్టాయర్లు, ఫ్రిగేట్లు, యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణ వైపు సముద్ర జలాలతోపాటు గగనతలంపైనా దిగ్బంధనం కొనసాగిస్తున్నాయి. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది.కాగా, సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తమ దీవికి సమీపంలో చైనాకు చెందిన ఫైటర్ జెట్లు, బాంబర్లు కలిపి 130 విమానాలు, 14 మిలటరీ ఓడలు, 8 ఇతర షిప్పులు కనిపించాయని తైవాన్ తెలిపింది. చైనాకు చెందిన కనీసం 90 విమానాలు జలసంధిలోని తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా బెలూన్ కూడా సంచరించిందని తెలిపింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ విభాగం తమ ఉత్తర ప్రాంతంపై కాల్పులు జరిపిందని వివరించింది. తమ తీరానికి 44 కిలోమీటర్ల దూరం వరకు వీటి ప్రభావం కనిపించిందని వెల్లడించింది. -
2 వారాల్లో 3వ హత్య
ఢాకా: మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో హిందువు హత్యోదంతం తాజాగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మెమిన్సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్గన్తో కాలచ్చింపాడు. అయితే ఉద్దేశపూర్వకంగా అతడిని హత్యచేయలేదని మియా చెప్పారు.‘‘పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ సరదాగా గన్ను బిశ్వాస్ వైపు గురిపెట్టా. వేలు పొరపాటున ట్రిగ్గర్కు తగిలి గన్ పేలింది. దీంతో బుల్లెట్ గాయంతో అతడు కూలబడితే వెంటనే భలూకా ఉపజిల్లా ఆస్పత్రిలో చేర్పించాం’’అని మియా వివరించారు. అయితే విషయం తెల్సి పోలీసులు వెంటనే మియాను అరెస్ట్చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్యచేశాడని విపక్ష పార్టీలు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశాన్ని వీడాక బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. దైవదూషణ ఆరోపణలపై డిసెంబర్ 18న ఫ్యాక్టరీ కార్మికుడైన హిందువు దీపూ చంద్రదాస్ను స్థానికులు కొట్టిచంపారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అమృత్ మొండల్ అనే మరో హిందువునూ చంపేశారు. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియా అస్తమయం
ఢాకా/న్యూఢిల్లీ/బీజింగ్: మూడుసార్లు ప్రధానమంత్రి పీఠం కూర్చుని దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన దిగ్గజ నాయకురాలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పి) అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఢాకాలోని ఎవర్కేర్ ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారని బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగిర్ చెప్పారు. 80 ఏళ్ల జియాను వృద్ధాప్య సమస్యలతోపాటు పలు దీర్ఘకాలిక వ్యాధులు కుంగదీశాయి.ఛాతిలో ఇన్ఫెక్షన్ రావడంతో తొలుత నవంబర్ 23వ తేదీన ఆమెను ఎవర్కేర్ ఆస్పత్రిలో చేర్పించారు.నవంబర్ 27వ తేదీన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే కరోనరీ కేర్ యూనిట్(సీసీయూ)లో చేరి్పంచి ప్రత్యేక వైద్యం ఆరంభించారు. కాలేయం, మూత్రపిండాలు, హృద్రోగ సమస్యలు, అత్యధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇలా పలు సమస్యలు చుట్టుముట్టంతో ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. చివరిసారిగా ఆమె నవంబర్ 21వ తేదీన ఢాకా కంటోన్మెంట్లోని సాయుధబలగాల కార్యక్రమంలో బహిరంగంగా కనిపించారు. జియా చనిపోయినప్పుడు ఆమె పక్కనే జియా కుమారుడు తారిఖ్ రెహ్మిన్, కోడలు జుబైదా, మనవరాలు జైమా ఉన్నారు. భర్త సమాధి పక్కనే ఖననం.. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడిన మాజీ బంగ్లా అధ్యక్షుడు, బీఎన్పీ వ్యవస్థాపకుడు జియాఉర్ రెహ్మాన్ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేయనున్నారు. ఢాకాలోని షేర్–ఇ–బంగ్లా నగర్లోని జియా ఉద్యాన్లోని రెహ్మాన్ సమాధి వద్దే అధికార లాంఛనాలతో ఖనన క్రతువును పూర్తిచేయాలని ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. జియా మృతి నేపథ్యంలో దేశంలో మూడ్రోజులపాటు సంతాప దినాలను, అంత్యక్రియల ప్రార్థనల కోసం అదనంగా మరోరోజు సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అంత్యక్రియల కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొననున్నారు. పూడ్చలేని లోటుగా అభివర్ణించిన హసీనా వైరి పార్టీ అవామీ లీగ్ సారథి షేక్ హసీనా సైతం జియా మరణంపై స్పందించారు. ‘‘బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా మాత్రమే కాదు సంక్షుభిత బంగ్లాలో సమస్యల పరిష్కారానికి జియా ఎంతగానో కృషిచేశారు. దేశానికి ఆమె చేసిన సేవ ఎన్నదగింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు’’అని హసీనా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య మజిలీలో జియా ఒక రక్షకురాలిగా నిలబడ్డారు. జియా మరణంతో బంగ్లాదేశ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది అని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జియా మరణంతో ప్రపంచదేశాధినేతల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ ఖలీదా జియా మరణంపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. వివాదాలు, ప్రశంసలమయం జియా వ్యక్తిగత, రాజకీయ ప్రస్తానం ఆద్యంతం ఆసక్తికరంగా, వివాదాస్పద నిర్ణయాలు, పాలన, ప్రశంసలతో సాగింది. భారత్కు స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడాది ముందు అంటే అవిభాజ్య భారతదేశంలో 1946 ఆగస్ట్ 15న నాటి బెంగాల్లోని దినాజ్పూర్ జిల్లాలో జియా జన్మించారు. తండ్రి ఇస్కందర్ మజూందార్, తల్లి తయ్యబా జల్పాయ్గురిలో టీ వ్యాపారం చేసేవారు. తర్వాత వీళ్ల కుటుంబం తూర్పు పాకిస్తాన్వైపు వలసవెళ్లింది. అంతకుముందు ఈమె సురేంద్రనాథ్ కాలేజీలో చదువుకున్నారు. ఒకప్పుటి పాకిస్తాన్ సైనిక జనరల్ జియాఉర్ రెహ్మిన్ను 1960లో పెళ్లాడారు.1978లో రెహ్మాన్ బీఎన్పీ పార్టీని స్థాపించాక తొలిసారిగా ఈమె గురించి అప్పట్లో వార్తలొచ్చాయి. 1981 మే 30న నాటి సైన్యంలోని ఒక వర్గం రెహ్మాన్ను హత్యచేయడంతో 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో పార్టీ బాధ్యతలు ఈమె మోయాల్సి వచ్చింది. 1984 మేలో పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1982లో నాటి ఆర్మీ చీఫ్ జనరల్ హెచ్ఎం ఎర్షాద్ తిరుగుబాటులేవదీసి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ఈమె పెద్ద ఉద్యమంలేవదీశారు. దీంతో జాతీయస్థాయి నేతగా అవతరించారు.1991లో చీఫ్ జస్టిస్ షహాబుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించగా బీఎన్పీ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో తొలి మహిళా ప్రధానిగా ఈమె బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించారు. పాకిస్తాన్లో బెనజీర్ భుట్టో తర్వాత ఒక ఇస్లామిక్ దేశానికి ప్రధాని అయిన రెండో మహిళగానూ జియా చరిత్ర సృష్టించారు. 1996 ఎన్నికల్లోనూ జియా పార్టీ గెలిచినా షేక్హసీనా సారథ్యంలోని ఆవామీ లీగ్ చేసిన ఉద్యమాలతో కేవలం 12 రోజుల్లో జియా అధికారాన్ని కోల్పోయారు. అప్పుడే ఈమె తొలిసారిగా దేశంలో తాత్కాలిక ప్రభుత్వ విధానం తెచ్చారు.2001లోనూ అధికారంలోకి వచ్చారు. 2006లో గద్దె దిగి తాత్కాలిక సర్కార్కు పగ్గాలు అప్పజెప్పారు. ఏడాదికే ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి తర్వాతి ప్రభుత్వం జియాను అరెస్ట్చేసింది. ‘జియా అనాథల ట్రస్ట్’కేసులో జియాకు 2018 ఫిబ్రవరిలో ఐదేళ్ల జైలుశిక్ష పడింది. 2024లో హసీనా అధికారంలోకి రాగానే జియాకు క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
2025 ఏ టు జెడ్
2025 ప్రపంచమంతటికీ తీపి, చేదుల మిశ్రమంగా గడిచింది. ప్రాకృతిక విపత్తులు, ఘోర ప్రమాదాలు, రాజకీయపుటెత్తులు, యుద్ధక్రీడలు, నేతల నోటి దురుసులు, ఎన్నికల సమరాంగణాలు... ఇలా మొత్తమ్మీద మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలావరకు ఖేదమే మిగిలించాయి. ఆంగ్ల అక్షరక్రమంలో అలాంటి ఘటనల సమాహారం...ఎ - ఎయిరిండియా ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా–171 విమానం టేకాఫైన 32 సెకన్లకే రన్వే ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. విమానంలోని 242 మంది, కింద ఉన్న మరో 19 మంది నిర్భాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపింది. ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ప్రయాణికుడు మృత్యుంజయునిగా చిన్నపాటి గాయాలతో బయటపడటం విశేషం.బి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ఆర్జేడీ సారథ్యంలోని విపక్ష మహాఘట్బంధన్ కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కూటమి 243 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 202 చోట్ల విజయదుందుభి మోగించి ఆశ్చర్యపరిచింది. ఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో ఘోర పరాభవం మూటగట్టుకుంది. నితీశ్కుమార్ సీఎంగా ఏకంగా పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. సి - క్యాస్ట్ సెన్సెస్ కరోనా కారణంగా 2020లో వాయిదాపడ్డ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేంద్రం ఏప్రిల్లో ప్రకటించింది. ఇది 2027 మార్చి నుంచి మొదలవనుంది. అందులో భాగంగా కులగణన సైతం చేపడుతున్నట్టు వెల్లడించడం విశేషం. బ్రిటిష్ హయాంలో మన దేశంలో 1881 నుంచి 1931 దాకా కులగణన జరిగింది. కుల విభజనను పెంచరాదనే ఉద్దేశంతో స్వాతంత్య్రానంతరం ఆ ప్రక్రియను నిలిపేశారు. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసినా దాన్ని పూర్తిస్థాయి కులగణనగా పరిగణించడం లేదు. డి - డీప్సీక్ ఈ చైనా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపింది. డౌన్లోడ్ చార్టుల్లో చూస్తుండగానే అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రత్యర్థి ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీని తోసిరాజంది. దాంతో పోలిస్తే కారుచౌకగా సేవలందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా డీప్సీక్–ఆర్1ను విడుదల చేసింది. దీని దెబ్బకు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ 600 బిలియన్ల మేరకు తగ్గిపోయింది. ఇ - ఎప్స్టీన్ ఫైల్స్ 20 ఏళ్లనాటి ఈ కామ భూతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వారి లైంగికానందం కోసం బాలికలను ఎరవేసిన వ్యాపారి ఎప్స్టీన్ చివరికి ఆత్మహత్య చేసుకున్నా, ఆ ఉదంతం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ కేసు విచారణ ఫైళ్లను బయటపెట్టాలన్న కాంగ్రెస్ ఉత్తర్వులపై ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసినా, తనకు నష్టం లేనివాటిని మాత్రమే, అదీ విడతలవారీగా వదులుతూ సాగదీస్తున్నారు. ఎఫ్ - ఫ్లడ్స్ ఇన్ ఆసియా నానాటికీ తీవ్రమవుతున్న పర్యావరణ మార్పుల సమస్యకు ఈ ఏడాది ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వరదలు అద్దంపట్టాయి. శ్రీలంక, ఇండొనేసియా, థాయ్లాండ్, మలేసియా, వియత్నాం తుఫాన్ల దెబ్బకు కుదేలయ్యాయి. ఈ విపత్తు భారత్ను కూడా తీవ్రంగానే నష్టపరిచింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆకస్మిక వరదలు, తుపాన్లు వేలాది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జెన్–జెడ్ ఆందోళనలు ప్రభుత్వాల, పాలకుల కర్రపెత్తనంపై ఆన్లైన్ వీరులు ఆఫ్లైన్లో ఆందోళనలకు దిగితే ఎలా ఉంటుందో నవతరం రుచిచూపింది. ఈ నవయువత నిరసన గళాల ధాటికి నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దె దిగాల్సి వచ్చింది. జెన్–జెడ్ ఆందోళనలు నేపాల్కే పరిమితం కాలేదు. ఇండొనేసియా మొదలుకుని మడగాస్కర్, బల్గేరియా మీదుగా పెరు, మెక్సికో దాకా విస్తరించాయి.జి - హాంకాంగ్ అగ్ని ప్రమాదంఅగ్నిగోళంలా మండిపోతున్న ఆకాశహర్మ్యం. దానికేసి వేలెత్తి చూపుతూ, తన భార్య అందులో చిక్కుబడిందంటూ విలపిస్తున్న వృద్ధుని ఫొటో. ఇటీవల ఆన్లైన్లో వారాల తరబడి వైరల్గా మారిన చిత్రమిది. అందుకు కారణమైన హాంకాంగ్లోని వాంగ్ఫుక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 160 మందిని పొట్టనపెట్టుకుంది. 40 గంటలకు పైగా శ్రమిస్తేనే గానీ మంటలు అదుపులోకి రాలేదు.హెచ్ - ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్12 రోజుల యుద్ధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ పోరు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక, క్షిపణి దాడులు ఇరాన్ సైనిక వ్యవస్థలతో పాటు అణు వ్యవస్థలనూ తీవ్రంగా నష్టపరిచాయి. ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులేసి అమెరికా యుద్ధజ్వాలల్లో చలికాచుకుంది. తర్వాత తీరిగ్గా తానే సంధి చేసి జబ్బలు చరుచుకుంది.జె జగ్దీప్ ధన్ఖడ్మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ధన్ఖడ్. ఆరోగ్య కారణాలను చూపుతూ జూలై 21న తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్గా సభలో చురుగ్గా వ్యవహరిస్తూ, అధికార పక్షానికి పెట్టని కోటగా నిలుస్తూ వచ్చిన ఆయన రాజీనామా సంచలనమే సృష్టించింది. ఇలా తప్పుకున్న తొలి ఉపరాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. పలు అంశాలపై కేంద్రంతో ఆయనకు కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చిందంటారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రాజ్యసభలో విపక్షాలిచ్చిన నోటీసును ధన్ఖడ్ స్వీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టడం రాజీనామాకు తక్షణ కారణంగా నిలిచిందని అంటారు.కె కర్ణాటకలో సిద్ధూ వర్సెస్ డీకే కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత పవర్ పాలిటిక్స్ కుస్తీ పోటీలను తలపిస్తున్నాయి. గద్దె దిగేందుకు సీఎం సిద్ధరామయ్య ససేమిరా అంటుండటం, ఒప్పందం ప్రకారం కురీ్చని తనకు అప్పగించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పట్టుబడుతుండటం అధిష్టానానికి తీరని తలనొప్పిగా మారింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా హైకమాండే ఒప్పందం కుదిర్చిన నేపథ్యంలో ఇప్పుడు తన వంతు వచ్చిందన్నది డీకే వాదన.ఎల్ - లౌరే దోపిడీ ఈ శతాబ్దంలోనే అతి పెద్ద దోపిడీగా సంచలనం సృష్టించింది. పారిస్లోని లౌరే ఆర్ట్స్ గ్యాలరీలోకి అక్టోబర్ 19న ఆదివారం వేళ నలుగురు దోపిడీ దొంగలు చొరబడ్డారు. అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యమున్న 8 అమూల్య ఆభరణాలను కాజేశారు. వాటి విలువ ఏకంగా 10 కోట్ల డాలర్లుగా తేలింది. ఇంతటి దోపిడీని దొంగలు కేవలం ఏడంటే 7 నిమిషాల్లో పని ముగించి జారుకోవడం విశేషం. ఎం - మోదీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ మరింత పెరిగింది. నిజానికి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీని నిలబెట్టుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. జేడీ (యూ) వంటి పారీ్టల మద్దతు కీలకంగా మారడంతో మోదీకి ఇక కష్టకాలమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ కీలకమైన ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాలతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపైనా మోదీ పేరుప్రఖ్యాతులు మరింతగా పెరిగాయి. జీ7తో పాటు ఏ శిఖరాగ్ర సదస్సులోనైనా ఆయనే ప్రధాన ఆకర్షణగా మారుతున్న పరిస్థితి!ఎన్ - నెట్ఫ్లిక్స్–వార్నర్ బ్రదర్స్ డీల్ ప్రపంచవ్యాప్తంగా వినోదపు తీరుతెన్నులనే సమూలంగా మార్చేయగల పరిణామంగా అంతా పేర్కొంటున్న ఒప్పందమిది. వార్నర్ బ్రదర్స్ టీవీ స్టూడియోలతో పాటు కీలకమైన స్ట్రీమింగ్ విభాగాన్ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 6.47 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది! హ్యారీపోటర్, సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, గేమ్ ఆఫ్ థోర్న్ వంటి బ్లాక్బస్టర్ మూవీ సిరీస్లతో పాటు స్కూబీ డూ, టామ్ అండ్ జెర్రీ కామిక్స్, హెచ్బీఓ మాక్స్ ఓటీటీ ప్లాట్ఫాం, డిస్కవరీ చానల్ వంటివన్నీ వార్నర్ నుంచి నెట్ఫ్లిక్స్ సొంతమవుతాయి. ఈ దెబ్బకు చాలా దేశాల్లో సినిమా థియేటర్లు మూతబడటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఓ - ఆపరేషన్ సిందూర్ మే 7 తెల్లవారుజాము. బైసారన్ లోయలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా మన సైన్యం కొట్టిన దెబ్బకు దాయాది గింగిరాలు తిరిగిన రోజు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వందలాది ముష్కరులను హతమార్చి భరతమాతకు రక్తసిందూరం దిద్దిన రోజు. సరిహద్దుల వెంబడి చిన్నాచితకా దాడులతో ఒకట్రెండు రోజులు ప్రతిఘటిస్తున్నట్టు నటించినా, మన దెబ్బకు కీలక వైమానిక స్థావరాలన్నీ వరుసబెట్టి ధ్వంసం కావడంతో మూడో నాటికే పాక్ కాళ్లబేరానికి వచ్చి సంధి చేసుకుంది. పి - పహల్గాం ఉగ్ర దాడి ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్లోని పహల్గాం ప్రాంతం అమాయక పర్యాటకుల రక్తంతో ఎరుపెక్కింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హిందువులనే లక్ష్యం చేసుకుంటూ ఉన్మాదులు హత్యాకాండకు తెగబడ్డారు. వారిని పేర్లడిగి మరీ కాల్చి చంపారు. దేశమంతటినీ ఆగ్రహావేశాలకు లోను చేసిన ఈ దారుణం ఆపరేషన్ సిందూర్కు దారితీసింది.క్యూ - క్వైట్, పిగ్గీ! మహిళా జర్నలిస్టులను అవమానించే దుర్లక్షణం ట్రంప్ను ఓ పట్టాన వదిలేలా లేదు. ఎప్స్టీన్ వివాదానికి సంబంధించి ప్రశ్నించిన బ్లూంబర్గ్ న్యూస్ జర్నలిస్టు కేథరిన్ లూసీపై ఆయన దారుణంగా నోరు పారేసుకున్నారు. అదే అంశంపై ఆమె రెట్టించడంతో ఉక్రోషానికి లోనై ‘క్వైట్, క్వైట్, పిగ్గీ!’అంటూ అవమానకర పదజాలం వాడుతూ అరుపులకు దిగారు. సదరు వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్ తీరును అంతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘క్వైట్, పిగ్గీ’ హా‹Ùట్యాగ్తో నెటిజన్లు హోరెత్తించారు. ట్రంప్ను గేలి చేస్తూ దీనిపై మీమ్లూ ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఆర్ - రాహుల్గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం«దీకి 2025 కష్టకాలంగానే సాగింది. విపక్ష నేత పదవికి న్యాయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఢిల్లీతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ సోదిలో కూడా లేకుండాపోవడం రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలకు తావిచ్చింది. వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన ఆయన సోదరి ప్రియాంకా పారీ్టలో ఇక మరింత ‘క్రియాశీలక’ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పలువురు కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్న పరిస్థితి! ఎస్ - సెంగర్ అత్యాచార కేసు తీర్పు సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్ తాజాగా మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. అతని జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి ఒడిగట్టడమే గాక న్యాయ పోరాటానికి దిగిన తన తండ్రిని కూడా చంపించిన సెంగర్కు ఉరిశిక్ష పడేదాకా వదిలేది లేదని బాధితురాలు అన్నారు.ఎక్స్ - షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఏడాది చాలారకాలుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ టారిఫ్లకు బెదరకుండా అమెరికాపై అంతకుమించిన స్థాయిలో టారిఫ్లు బాదారు. ఎన్నడూ లేనట్టుగా మోదీతో సాన్నిహిత్యం పెంచుకుని భారత్నూ ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నవ్వులు చిందిస్తున్న ఫొటో అయితే ట్రంప్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. వై - యమున ప్రక్షాళన నానాటికీ కాలుష్య కాసారంగా మారుతున్న యమునా నదిని తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఏకంగా రూ.57 వేల కోట్లతో మాస్టర్ ప్లానే ప్రకటించింది. దేశ రాజధానిలో మురుగునీటి శుద్ధి సామర్థ్యం పెంపు కోసం 9 ప్రాజెక్టులను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ పరిధిలోని కేవలం 22 కిలోమీటర్ల నిడివే యమున కాలుష్యంలో ఏకంగా 80 శాతానికి కారణంగా మారుతోంది! జెడ్ - జొహ్రాన్ మమ్దానీ ఒక మేయర్ ఎన్నికకు ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా క్రేజ్ వచ్చిన సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! న్యూయార్క్ మేయర్గా 34 ఏళ్ల ముస్లిం విద్యాధికుడు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక పలు రకాలుగా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఆయన్ను ఓడించేందుకు ట్రంప్ అపార శక్తియుక్తులన్నీ వినియోగించినా లాభం లేకపోయింది. మమ్దానీ ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.టి - టారిఫ్లు ఈ ఏడాదంతా దేశదేశాలను వణికించిన పదమిది. ట్రంప్ ఎడాపెడా పెంచిన టారిఫ్ల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తొలుత బెంబేలెత్తిపోయాయి. కానీ చైనా ప్రతీకార టారిఫ్ల దెబ్బకు ట్రంపే చివరికి కాళ్లబేరానికి రావాల్సి వచ్చింది. తర్వాత ఒక్కొక్క దేశంపైనా టారిఫ్లను ఇష్టానికి పెంచుతూ, తగ్గిస్తూ తన స్థాయినీ, అమెరికా స్థాయినీ పలుచన చేసుకున్నారాయన. భారత్పైనా ఒక దశలో 50 శాతం దాకా భారీ టారిఫ్లు విధించినా, వాటిని వెనక్కు తీసుకుని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు.యు - ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రపంచానికి ఈ ఏడాది కాస్త ఉపశమనం ఇచ్చిన ఉదంతమిది. మూడున్నరేళ్ల పై చిలుకు యుద్ధానికి తెర దించేందుకు రష్యా సుముఖత వెలిబుచ్చడంతో ఇరు దేశాలతో అమెరికా అత్యున్నత స్థాయిలో శాంతి చర్చలు జరుపుతోంది. ఈ శాంతి వీచికల కారణంగా ఉక్రెయిన్పై రష్యా దాడుల ధాటి బాగా తగ్గింది.వి - వెనెజులా ధిక్కారం వెనెజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన తెంపరి ట్రంప్, వాటిని సొంతం చేసుకునేందుకు అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెనకాడబోనని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చారు. ఆ దేశపు చమురు నౌకలను నానా సాకులతో దిగ్బంధిస్తూ, పేల్చేస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మదురో ధిక్కార స్వరం వినిపించడంతో ట్రంప్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.డబ్ల్యూ - వక్ఫ్ సవరణ చట్టం మోదీ సర్కారు తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వివాదాలు చుట్టుముట్టాయి. వక్ఫ్ ఆస్తులపై కర్రపెత్తనమే దీని లక్ష్యమని ముస్లిం బోర్డులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (దానం) ఇవ్వొచ్చు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిళ్లలో ఇద్దరు ముస్లిమేతర సభ్యుల వంటి నిబంధనలన్నీ వక్ఫ్ ఆస్తుల స్వా«దీనం కోసం పెట్టినవేనని దుయ్యబడుతున్నాయి. సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టగా మరికొన్నింటిపై పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ కేసులో తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జెన్ జడ్ గురించి మీకు తెలుసా?
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన... ఈ సాంకేతికను అలవర్చుకున్న... చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్నే జెన్జడ్ అని... అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా... కొత్త ఆలోచనలు... దానికి మించి... ఆన్లైన్ సాంకేతికత... అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్. ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్ఞానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్..., "ఐ జనరేషన్"...., "డిజిటల్ స్థానికులు".... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్జడ్లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.... పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్ లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.... లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే... దీంతో వారి మనస్సులు... వారి సామాజిక స్పృహ... ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు. జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం... కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా... ఎక్కువగా ఆలోచిస్తారు... చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం... దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Z లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం... సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం... ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.... భయం లేకుండా ప్రవర్తించడం... కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని... లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. జెన్ జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు... భావోద్వేగాలకు తావు లేకుండా... బాధను వ్యక్తీకరించడం... ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.... సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా... వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్ లైన్లో చర్చల ద్వరా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు... ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన... చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు... వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్... అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం... ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు... కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ... బలహీనత కాదు... అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.... గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి... కానీ జెన్జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.... తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. -
ఒమన్ కీలక నిర్ణయం.. నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలే
ఒమన్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వర్క్ సర్టిఫికెట్స్, లైసెన్స్, తదితర పత్రాలు సరైనవి లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్కడి కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది.ఒమన్లో వీసా పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగులలో ప్రవేశానికి సంబంధింత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికేట్లు, లైసెన్స్లు అందుకు సంబంధించిన శాఖలకు చెందిన అధికారులనుంచి పొందవలసి ఉంటుంది. అయితే అలా పొందాల్సిన సమయంలో సంబంధిత అధికారులు అన్ని రకాలుగా సరైన సమాచారం ధృవీకరించుకున్నాకే ఆ పత్రాలు జారీ చేయాలని తెలిపింది. ఒకవేళ నకిలీ పత్రాలు జారీదేస్తే ఉద్యోగులతో పాటు సంబంధింత కంపెనీలు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కాగా ఒమన్లో ఉన్న మెుత్తం విదేశీ కార్మికుల సంఖ్య దాదాపు 18 లక్షలు కాగా భారత్ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అక్కడ పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా ఒమన్లో పని చేస్తున్న భారతీయుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. -
నిజంగానే భూమి మీదకు వస్తే వారితో సావాసం ఎలా?
2026లో మనం ఏలియన్లను కలవ బోతున్నామా? లేక ఏలియన్లు మన వద్దకు రానున్నాయా? ఏలియన్లకు సంబంధించి బాబా వంగా చేసిన భవిష్యవాణి నిజమవుతుందా? నిజంగా ఏలియన్లు భూమి మీదకు రానున్నాయా? అసలు ఏలియన్లు ఉన్నారా? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. ఇప్పటికీ... బాబా వంగా భవిష్య వాణిని నమ్మేవారు ఏలియన్ల ఉనికి సాధ్యమే అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ... సువిశాల విశ్వంలో పరిశోధనల ఇంకా మిగిలే ఉంది. ఒక వేళ బాబా వంగా వ్యాఖ్యలు వాస్తవమేనని అనుకున్నా.. 2026లో నిజంగా ఏలియన్లు భూమి మీదకు వస్తే మరి వారిని ఎలా కలవాలి...? వారు మనకన్నా బలవంతులా? లేక బలహీనులా?... వాళ్లు శక్తి వంతులై... దాడి చేయడానికి ప్రయత్నిస్తే... వారి ఆయుధాల గురించి కనీస జ్ఞానం లేని మానవులు ఎదుర్కొనగలరా.. ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెదుకుదాం. ఏలియన్ల ఉనికి ఉందని... అవి త్వరలోనే భూమి మీదకు వస్తాయని బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పారు. ఆమె జీవించి ఉన్నప్పుడు... భవిష్యత్తులో జరిగే కొన్ని కార్యాల గురించి చెప్పారు. అందులో ఏలియన్ల ప్రస్తావన కూడా ఉంది. అయితే ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరిగాయి. కొన్ని జరగలేదు. దాంతో జనం ఆమె భవిష్యత్తును చూడగలరని నమ్మారు. అందులోనే 2026లో ఏలియన్ల గురించి ఆమె భవిష్యవాణి ప్రస్తావన ఉంది. ఏలియన్లు భూమ్మీదకు వస్తారు... అప్పడు భూమిమీద పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. జనం నమ్మి ఏలియన్ల మీద ఆసక్తి పెంచుకోవడంతో పాటు సంక్షభాన్ని ఎదుర్కొనే తీరుపై చర్చలు కూడా సాగుతున్నాయ. శాస్రవేత్తలు మాత్రం... మానవులు.... గ్రహంతర వాసులను కలుస్తారనే ఆధారాలు లేవని... అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. 2026 మాత్రం ఇంటరెస్టింగా మారనుంది. ఇప్పటికే హాట్ టాపిక్గా మారిన ఏలియన్ల ప్రస్తావన... రాను రాను పెద్ద చర్చకే దారి తీసేట్టు ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం నమ్మడంతో... శాస్త్రవేత్తలు సైతం మరింత లోతుగా వాస్తవాలను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఏలియన్ల చర్చకు భిన్నంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఏలియన్ల ఉనికి ఉండొచ్చని... ఉండక పోవచ్చని మాత్రం చెప్పగలిగారు. ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఖగోళ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయినా నిరంతర అన్వేషణ సాగుతోనే ఉంది. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రోగ్రామ్లో ఆకాశాన్ని.. గ్రహాలను స్కాన్ చేస్తూనే ఉన్నప్పటికీ... ఏలియన్ల గురించి స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.ఏలియన్ల గురించి శాస్త్రవేత్తల ఆలోచన ఏంటనే అంశాలపై ఓ సర్వే జరిగింది. అంతో 1055 మంది శాస్త్రవేత్తలు, వారిలో దాదాపు సగం అంటే 521 మంది ఖగోళ జీవ శాస్త్రవేత్తలతో జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తల్లో 87 శాతం మంది గ్రహంతర వాసులున్నారని నమ్ముతున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో సగం మంది మాత్రమే నమ్ముతున్నారు. మిగతా సగం నమ్మడం లేదు. విశ్వంలో... భూమి తప్ప నివాస యోగ్యంగా ఉండే వాతావరణం, నీటి ఉత్పన్నం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఇతర గ్రహాలు లేవని... అందుకే వాటిపై జీవం లేకపోవచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచన. ఇతర శాస్త్రవేత్తలు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో చంద్రునిపై జీవం ఉండే ఆస్కారం ఉందని... మన గెలాక్సీలో 100 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. అన్నింటిపై పరిశోధనలు జరపకుండా ఈ నిర్ణయానికి రావడం తొందరపాటేనని... ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలతో పాటు... భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో ఏలియన్లు, ఇతర జీవాల ఉనికి ఉండొచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.శాస్త్రవేత్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏలియన్లు, లేదా ఏలియన్లను పోలే ఆకారాలు, ఇతర జీవాలు గెలాక్సీలో ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... శాస్త్రవేత్తలు ఏలియన్ల ఉనికి ఉందని నమ్ముతున్నారు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వార్తను ఖండిస్తున్నారు. మరి కొందరు శాస్ర్తవేత్తలు మాత్రం మరో విధంగా కూడా చెబుతున్నారు. ఏలియన్స్ ఉన్నాయా లేదా అని ఓ చర్చ సాగుతుండగానే... వారి స్వభావం... వారి తీరుతెన్నుల గురించి కూడా కొందర శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వాటి ఉనికి స్పష్టంగా ఉన్న సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అస్పష్టమైన హ్యూమనాయిడ్లు సుడిగుండంగా మారి... పొగమంచుతో కూడిన నిల్చున్నాయని... అవి వాటి వెనుక నుండి ప్రకాశవంతమైన కాంతితో చలనంలోకి వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక విశ్వంలో ఉన్న ఏలియన్స్ ఆకారం ఎలా ఉంటుంది... వారి భాష, వారి జీవన శైలి ఎలా ఉంటుందనే అంశాలపై కూడా కొందరు శాస్త్రవేత్తలు చర్చలు ప్రారంభించారు. వారి తెలివి తేటలు ఎలా ఉంటాయి...? వారు వాడే టెక్నాలజీ మనకన్నా అడ్వాన్సుగా ఉంటుందా... లేక సాంకేతికతకు దూరం మన రాతియుగం లాంటి జీవాలుంటాయా అనే క్యూరియాసిటీ కూడా సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఊహగానాలే తప్ప.... విశ్వ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏలియన్ల ఉనికి మాత్రం దొరకలేదు. ఏలియన్లపై వచ్చిన సినిమాల ఆధారంగా ఏలియన్ల ఆకారం, తెలివితేటలు, సాంకేతికత, స్పేష్ షటిల్ సఫవగురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. విస్తృత విశ్వం అంతటా నిజంగా భారీ సంఖ్యలో జీవాలు ఉంటే... నివాసయోగ్యమైన వాతావరణాలు ఎందుకు లేవు. అలాంటి ప్రాంతాలుంటే అక్కడి జీవాలపై పరిశోధనలెందుకు జరగడం లేదు.ఏలియన్లు ఉండి... ఒకవేళ ఏలియన్లు భూమ్మీదకు వచ్చేస్తే పరిస్థతి ఏంటీ? ఇప్పటికే సినిమాల ప్రభావం కారణంగా ఏలియన్ల ఆకారం, వాటి ఉనికి... వారి నడక, వారి భాష గురించి అవగాహన పొందినట్లు జనం భావిస్తున్నప్పటికీ... నిజంగా వాళ్లు వస్తేనే అసలు ఆకారాలు బయటపడతాయి. ఏలియన్లు వచ్చినప్పుడు జనంతో భయపడతారా...? లేక మనకన్నా వాళ్లే అడ్వాన్డ్గా ఉంటారా? వాళ్లతో మనం భయపడాల్సి వస్తుందా... ఇలాంటి ప్రశ్నలెన్నో సాధారణ మనుషులను మెదళ్లను తొలచి వేస్తున్నాయి. ఒకవేళ బలహీనులుంటే ... మనుషులు వాటికి హాని కలిగించే ఆలోచనలో మాత్రం ఉండరు. కానీ అవి దాడి చేస్తే మాత్రం ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన సమస్య. వారి భాషను డీకోట్cయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలన్నదీ శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లే. -
ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు చాలా కామన్గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్ను ఆపమని భారత్ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. -
న్యూ ఇయర్ కోసం దుబాయ్ బంపర్ ఆఫర్
దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.సాధారణ సమయాల్లోనే దుబాయ్కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. -
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలతో కిమ్ జాంగ్ బిజీబిజీ..!
ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలను ఆ దేశం పంపిస్తోంది. ఇప్పటికే 2 లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జరపడంతో నార్త్ కొరియాలోనే కాదు.. దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతను పెంచుతోంది. డిసెంబర్ 28న పసుపు సముద్రంలో జరిగిన క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ స్వయంగా పరిశీలించడం అనుమానాలను బల పరుస్తోంది. నార్త్ కొరియా చుట్టూ అమెరికా బలగాలతో పాటు సౌత్ కొరియాకు చెందిన బలగాలు ఇప్పటికే మోహరించి ఉండటంతో కిమ్ ఈ పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2 గంటల పాటు సాగిన క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిశీలించడమే కాకుండా వాటి లక్ష్యాన్ని అవి ఛేదించగలుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు వెల్లడించారు. క్షిపణుల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ జోలికి వస్తే అమెరికాతో కలిసి ఎదురొడ్డుతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడిన కిమ్ మాత్రం... యుద్ధానికోసం కాదని... క్షిపణుల పనితీరును పరిశీలించడం, దేశ ఆత్మరక్షణ నిమిత్తమే ఈ పరీక్షలు జరిగాయని వెల్లడించడం గమనార్హం.అయినా అప్రమత్తమైన దక్షిణ కొరియా... కొరియా చుట్టూ మోహరించి ఉండటాన్ని గమనిస్తే ఏ క్షణమైన యుద్ధానికి సై అనే ప్రమాదం లేకపోలేదు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం... లక్ష్యాన్ని ఛేదించడానికి ముందు క్షిపణులు 2 గంటల పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయని... ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో క్షిపణి ప్రయోగం నుండి హిట్ టార్గెట్ వరకు వీడియోలను ఈ క్షిపణి పరీక్షపై కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా క్షిపణి పరీక్షను ధృవీకరించారు.నార్త్ కొరియా చర్యలతో మరో వైపు దక్షిణ కొరియా కూడా తన సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. గత ఆదివారం ఉదయం 8 గంటలకు ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ ప్రాంతంలో అనేక క్రూయిజ్ క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించినట్లు సౌత్ కొరియా అధికారులు గమనించినట్లు చెప్పారు. ఒకవేళ నార్త్ కొరియా తోకాడిస్తై అమెరికాతో కలిసి తాము కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని సైనిక సన్నాహాలు చేశామని తెలిపింది. ఉత్తర కొరియా చేసే ఎలాంటి చర్యనైనా తిప్పి కొడతామని కూడా సౌత్ కొరియా హెచ్చరింది. ఉత్తర కొరియా అణ్వాయుధంతో నడిచే జలాంతర్గామిని నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నట్లు కూడా అంతకుముందు వెల్లడించింది. -
ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న ఢాకాలో జరిగే ఖలీదా అంత్యక్రియలలో పాల్గొనడానికి జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్లనున్నట్లు తెలిపింది.బంగ్లాదేశ్ తొలిమహిళా ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా ఈరోజు ఉదయం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. 80 ఏళ్ల వయసున్న ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫ్క్షన్తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధితో పాటు భారత్తో సంబంధాలు మెరుగుపడడం కోసం ఆమె చేసిన కృషి ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. బంగ్లాలో రాజకీయ అస్థితరతతో ఈ ఏడాది ప్రారంభం నుంచే హిందువులపై దాడులు తీవ్రతరమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు ముగ్గురు హిందూ యువకులను అక్కడి మతఛాందస వాదులు కొట్టిచంపారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఈ ఘటనలపై సీరియస్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.ఖలీదా జియా ప్రస్థానం1945లో అవిభక్త భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఖలీదా జియా జన్మించింది. ఆమె వివాహం జియావుర్ రహమాన్తో (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు) జరిగింది. రహమాన్ మరణానంతరం సుధీర్ఘ కాలం పాటు బీఎన్పీ అధ్యక్షురాలిగా సేవలంధించింది. 1991లో బంగ్లాదేశ్ ప్రధానిగా తొలిసారి ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది. ఆ దేశంలో మహిళ ప్రధాని పదవి చేపట్టడం అదే మెుదలు. కాగా బీఎన్పీ పార్టీ భారత్కు వ్యతిరేకమని వాదనలుండగా ఖలీదా జియా వాటిని పలుమార్లు ఖండించింది. -
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
ఉక్రెయిన్తో కొనసాగుతున్నయుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.డోనెట్స్స్కీ, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్ వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటినీ దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని పుతిన్ పేర్కొన్నారు.తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్క్లోని స్లోవియన్స్కీలో రష్యా జరిపిన షెల్లింగ్లో ఒకరు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. జపోరిజియాలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు . ఈ ఏడాది ఉక్రెయిన్లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు విఫలమైన కొద్దిసేపటికే పుతిన్ సైనిక యూనిఫాంలో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు. ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతిజెలెన్స్కీతో చర్చల తర్వాత, ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు, డోనెట్స్కి, మరియు లుహాన్స్కీలను కలిగి ఉన్న డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించడం అనేవి పరిష్కారం కాని రెండు సమస్యలు అని జెలెన్స్కీ అన్నారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. దానికోసం కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరం. ప్రస్తుతం డాన్బాస్లో కొంత భాగం మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఉక్రెయిన్ దళాలు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని లేదా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కానీ ఉక్రెయిన్ మాత్రం ఖండించింది.ఇదీ చదవండి : ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం -
రోజుకు 25 గంటలు..ఎందుకో తెలుసా?
రోజుకు ఎన్ని గంటలు అనగానే ఠక్కున వచ్చే సమాధానం 24 గంటలు. అయితే ఈ రోజుకు 24 గంటల రోజు నెమ్మదిగా మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మార్పు నిజం. కచ్చితంగా.. ఇప్పటికే జరుగుతోంది. ఈ మార్పు చాలా క్రమంగా జరుగుతుందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. భూమి భ్రమణం నెమ్మదిగా నెమ్మదిస్తోందని శాస్త్రవేత్తల మాట. అంటే రోజు ఎక్కువుతోంది. కాలం, జీవితం , గ్రహం నిశ్శబ్దంగా ఎలా పరిణామం చెందుతాయనే దానిపై ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆగండి ఆగండి..అయితే ఇప్పటికిప్పుడు దైనందిన జీవితానికి తక్షణ అంతరాయం లేదంటున్నారు. ఈ మార్పుకు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది, అసలు ఏం జరుగుతోంది. దేని ఆధారంగా సైంటిస్టులు ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు.భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది. సాధారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక రోజు ఎంత సమయం అనేది నిర్ణయిస్తారు. ఇపుడు ఈ వేగం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రోజులకు 24 గంటలకు బదులు 25 గంటలు పడుతుందంటున్నారు. ఇది ఆ రోజు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందట.భూమి భ్రమణం నెమ్మదిస్తోందిభూమి భ్రమణం క్రమంగా వేగాన్ని తగ్గిస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందగమనంతో మానవులపై చాలా నెమ్మదిగా ఉంటుందనీ, ప్రస్తుత గడియారాలు , క్యాలెండర్లు పూర్తిగా ప్రభావితం కావు. ఈ ధోరణి వందల మిలియన్ల వరకు విస్తరించి ఉందని పరిశోధకులు అంటున్నారు.ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీతో పాటు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్శిటీ పరిశోధకులువెల్లడించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరమవుతున్నాడు భూ భ్రమణం దాదాపు 1.7 మిల్లీసెకన్ల పాటు ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ మార్పు దాదాపు ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చంద్రుడి వల్ల కలిగే టైడల్ ఘర్షణ. చంద్రుని గురుత్వాకర్షణ భూమి, మహాసముద్రాలను నిరంతరం ఆకర్షిస్తుంది. దీంతో చంద్రుడిని దూరంగా నెట్టివేస్తూ భూమి నెమ్మదిస్తుంది. కాలక్రమేణా, ఈ శక్తులు కొలవగల ప్రభావాలను కూడగట్టుకుంటాయి. అణు గడియారాలను ఉపయోగించి ఈ మార్పులను శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తారు. భూమి భ్రమణ స్థిరమైన వేగంతో నెమ్మదించదు. స్వల్పకాలిక మార్పులు భ్రమణాన్ని కొద్దిగా వేగవంతం చేస్తాయి లేదా నెమ్మదిస్తాయి. వాతావరణ పీడన మార్పులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యరాశి పంపిణీని ప్రభావితం చేస్తాయి. కరిగే హిమానీనదాలు భూమి, మహాసముద్రాల మధ్య బరువును కదిలిస్తాయి. ఈ పునఃపంపిణీలు తాత్కాలికంగా భ్రమణ వేగాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తాయి.శాస్త్రవేత్తలు 25 గంటల రోజు సుదూరమని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులను దాదాపు 200 మిలియన్ (20 కోట్ల )సంవత్సరాలు పట్టవచ్చు. అంతేకాదు సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో భూ భ్రమణ వేగంఎక్కువగా ఉండేదని, అప్పట్లో ఒక రోజు పూర్తవడానికి కేవలం 18 గంటలే పట్టేదట. డైనోసార్ కాలంలో, రోజులు దాదాపు 23 గంటలు ఉండేవి. భూమిపై జీవితం క్రమంగా ఆ మార్పులకు అనుగుణంగా మారింది. పరిణామం తరతరాలుగా జీవ లయలను నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటుంది.ప్రస్తుతానికి, భూమి మునుపటిలాగే తిరుగుతోంది. అయితే నెమ్మదించే భ్రమణం శాస్త్రీయంగా మనోహరంగా ఉంది. ఈ పరివర్తన నెమ్మదిగా ఉంటుంది, విపత్తు కాదు,ఎలాంటి ఆందోళన అవసరం శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు.త ప్పుదారి పట్టించే వైరల్ వాదనలకు వ్యతిరేకంగా నిపుణులు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. సహస్రాబ్దాలలో కొలిచిన మార్పును శాస్త్రం సూచిస్తుంది. -
యెమెన్లోని ముకల్లాపై సౌదీ వైమానిక దాడులు
సనా: యెమెన్లోని ఓడరేవు నగరం ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి వ్యతిరేకంగా వేర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తాసంస్థ స్పష్టం చేసింది. వేర్పాటు వాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది.ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్గా స్పందించింది. యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్-అలీమి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి టీవీలో మాట్లాడారు. యెమెన్లో ఉన్న యూఏఈ దళాలు(అల్-అలీమీ) తమ భూభాగాన్ని 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మూడ్రోజులపాటు నోఫ్లై జోన్గా ప్రకటించారు. 90 రోజుల అత్యయిక స్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హిందువు హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల హత్యలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవల ఐదు హిందూ కుటుంబాల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడం ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, మతపరమైన వేధింపులు కలవరపెడుతోంది. తాజాగా బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హిందువు హత్యకు గురయ్యాడు.మైమెన్సింగ్లోని భలుకాలో బజేంద్ర బిశ్వాస్ (40) అనే అన్సార్ (రక్షణ కమిటీ) సభ్యుడిని సహోద్యోగి కాల్చి చంపాడు.ఈ సంఘటనలో హంతకుడు అన్సార్ సభ్యుడు నోమన్ మియాను అరెస్టు చేశారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20 మంది అన్సార్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. బజేంద్ర బిస్వాస్ ,నోమన్ మియా ఆవరణలో కలిసి కూర్చున్నప్పుడు నోమన్ వద్ద ఉన్న తుపాకీ పేలిందనే కథనాలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ బిస్వాస్ ఎడమ తొడలో దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఫ్యాక్టరీ సిబ్బంది బజేంద్ర బిస్వాస్ను భాలుకా ఉపజిల్లా హెల్త్ కాంప్లెక్స్కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్చార్జ్ జాహిదుల్ ఇస్లాం ఈ సంఘటనను ధృవీకరించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మైమెన్సింగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మార్చురీకి పంపారు.కాగా బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద రాజ్యంగా మారుతోంది. ఈ హత్యాకాండపై సర్వత్రా ఆందోళన వ్యకమవుతోంది. బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న అభద్రతకు ఇది నిదర్శమంటూ ఆగ్రహం వెల్లువెత్తుతోంది.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి -
ఆయుధంగా నదీ జలాలు!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నదీ జలాలను ఆయుధంగా మార్చుకోవడం వల్ల మరింతగా పెచ్చరిల్లు తాయని పాకిస్తాన్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ అయిన షెర్రీ రెహ్మాన్.. చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం పయ్రత్నాలు ప్రారంభించిన వేళ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.వాతావరణ మార్పుల కారణంగా అత్యంత ప్రభావితమవుతున్న ఈ ప్రాంతంలో, నీటిని ఒక ఆయుధంగా (water weaponisation) మార్చుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే శత్రుత్వం, అపనమ్మకంతో నిండిపోయి ఉన్న రెండు దేశాల సంబంధాల్లో ఇది ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది’ అని షెర్రీ రెహ్మాన్ (Sherry Rehman) సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నుంచి వైదొలగుతున్నట్లు భారత ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించడం తెల్సిందే. కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజీ–2 జల విద్యుత్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. చదవండి: లాహోర్ లేడీ సింగానికి తప్పని ట్రోలింగ్ -
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది. -
‘స్వయంగా పుతినే చెప్పారు’.. డ్రోన్ ఎటాక్పై ట్రంప్ ఆగ్రహం
అమెరికా దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభం ఓ కొలిక్కి వస్తుందని భావించేలోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగిందని రష్యా ప్రకటించింది. పైగా ఇది ఉక్రెయిన్ పనేనంటూ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను కీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. మరోవైపు ఈ దాడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో రిసార్ట్లో ట్రంప్ సమావేశం అయ్యారు. ఆ భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం గురించి నాకు ఎవరు సమాచారం ఇచ్చారో తెలుసా?. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన నాకు ఫోన్ చేసి దాడి జరిగిందని అన్నారు. ఆయనపై దాడి జరిగిందని. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేను చాలా కోపంగా ఉన్నాను అని ట్రంప్ అన్నారు. అయితే దాడిపై కూడా ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. డ్రోన్ దాడి జరగకపోయి ఉండొచ్చని.. అందుకు ఆస్కారం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించడం ఒక విషయం. కానీ ఆయన ఇంటిపై దాడి చేయడం మరో విషయం. ఇప్పుడే అలాంటి పనులు చేయడానికి సరైన సమయం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. ఉత్తర రష్యాలోని నోవ్గొరోడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ రాత్రిపూట డ్రోన్ దాడి చేసిందని అన్నారు. అయితే రష్యా వాయుసేన రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం/ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. రష్యా దీనికి తప్పకుండా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని చెప్పారు. అలాగే..ఈ పరిణామంతో శాంతి చర్చలపై రష్యా తన వైఖరిని పునఃపరిశీలించాల్సి వస్తుందని తెలిపారు. అంతమాత్రాన ఉక్రెయిన్తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి మాత్రం తప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో పుతిన్ ఆ నివాసంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని రష్యా స్పష్టంగా చెప్పలేదు. డోల్గియే బొరోడీ అనే ఆ నివాసాన్ని గతంలో జోసెఫ్ స్టాలిన్, నికితా ఖ్రుష్చెవ్, బోరిస్ యెల్త్సిన్, పుతిన్ వంటి సోవియట్, రష్యా నేతలు ఉపయోగించారు.రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పూర్తిగా తిరస్కరించారు. ఇది “మరో అబద్ధాల పరంపర” అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికి, కీవ్పై కొత్త దాడులు చేయడానికే రష్యా ఈ కథలు సృష్టిస్తోందని అన్నారు. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జెలెన్స్కీ చెప్పారు. రష్యా బెదిరింపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాలని కోరారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా స్పందించారు. -
Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. 80 ఏళ్ల వయసున్న ఆమె ఢాకాలోని ఎవర్కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తనువు చాలించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరారు.Reuters reports, Bangladesh's first female Prime Minister, Khaleda Zia, dies at 80.— ANI (@ANI) December 30, 2025గత కొంతకాలంగా ఖలీదా జియా గుండె, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె దీర్ఘకాలంగా మధుమేహం, ఆర్థరైటిస్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా సోకిన ఛాతీ ఇన్ఫెక్షన్ ఆమె శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపింది. వైద్యుల నివేదిక ప్రకారం ఆమె గుండె పనితీరు కూడా మందగించింది. దీంతో ఆమెను అత్యవసరంగా కోరోనరీ కేర్ యూనిట్ (ససీయూ) నుండి వెంటిలేటర్కు తరలించారు. ఆమె వ్యక్తిగత వైద్య బృందం, అంతర్జాతీయ నిపుణులు కలిసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు.ఖలీదా జియా మృతిపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆమె మంగళవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచినట్లు తెలిపింది. ‘బీఎన్పీ చైర్పర్సన్, మాజీ ప్రధాని, జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఈరోజు ఉదయం 6:00 గంటలకు ప్రార్థనల తర్వాత మరణించారు’ అని పార్టీ ఆ ప్రకటనలో తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని పేర్కొంది. బీఎన్పీ మీడియా సెల్ కూడా ఫేస్బుక్లో ‘మా ప్రియమైన జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఇప్పుడు మాతో లేరు. ఆమె ఈరోజు ఉదయం 6 గంటలకు మరణించారు’ అని పోస్ట్ చేసింది.ఖలీదా జియా ప్రస్థానం.. భారత్తో బంధంబంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం సేవలందించారు. 1945లో అవిభక్త భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో జన్మించిన ఖలీదా జియాకు భారత్తో సంబంధం ఉంది. ఆమె భర్త, దివంగత అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పలు పోరాటాలు చేశారు.ఖలీదా జియా పదవీకాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆమె పార్టీ బీఎన్పీని భారత్ వ్యతిరేకిగా కొందరు పరిగణించినప్పటికీ, ఆమె ఎప్పుడూ ఆ వాదనలను ఖండించారు. ఇటీవల ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో, తమ పార్టీ భారత్కు వ్యతిరేకం కాదని, కేవలం వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. జల్పైగురిలో జన్మించిన ఆమెకు భారతీయ సంస్కృతి, ప్రాంతీయ సంబంధాలపై ప్రత్యేక గౌరవం ఉంది. 1991లో మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ తర్వాత 2001లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఆమె పలు అవినీతి ఆరోపణలు, జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవి భారత్తో దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి.ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి -
తైవాన్ జలసంధిలో భారీగా విన్యాసాలు
బీజింగ్: తైవాన్ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్ దేశం చైనా తైవాన్ జలసంధిలో తాజాగా సైనిక విన్యాసాలకు తెరతీసింది. తైవాన్కు మద్దతుగా జపాన్ ప్రధానమంత్రి తకాయిచీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు, తైవాన్కు అమెరికా ఇటీవల భారీగా ఆయుధాలను విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నడుమ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సోమవారం యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతోపాటు లాంగ్ రేంజ్ క్షిపణులతో తైవాన్ జలసంధి మధ్యప్రాంతంలో సముద్రజలాలతోపాటు గగనతలంలోనూ విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కీలకమైన లక్ష్యాలను కచి్చతంగా ఛేదించేలా బలగాల సామర్థ్యాలకు పదును పెట్టడమే వీటి ఉద్దేశమని పేర్కొంది. చైనా చర్యలపై తైవాన్ వెంటనే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ విన్యాసాలను చేపట్టామని తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. చైనా మిలటరీ చర్యలను శాంతికి తీవ్ర విఘాతం కలిగించే దుందుడుకు వైఖరిగా ఆయన అభివరి్ణంచారు. తైవాన్ వైమానిక స్థావరంలో ల్యాండవుతున్న పలు మిరేజ్ 2000 యుద్ధ విమానాల వీడియోను విడుదల చేశారు. దీంతో, సోమవారం పీఎల్ఏ చేపట్టిన విన్యాసాలు ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. ఓ వైపు జపాన్.. మరో వైపు అమెరికా నవంబర్ 7న జపాన్ పార్లమెంటులో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తైవాన్లో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి జపాన్ మనుగడకే ముప్పు కలిగించే పరిస్థితిగా మారవచ్చని, అటువంటప్పుడు అమెరికాకు మద్దతుగా జపాన్ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తకాయిచీ తకైచి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. చైనా విమా న వాహక నౌకలు, విమానాల సంచారంపై ఓ కన్నేసి ఉంచేందుకు ఒకినావాలోని సుదూర తూర్పు ద్వీపంలో మొబైల్ సర్వైలెన్స్ రాడార్ యూనిట్ను మోహరించాలనే జపాన్ నిర్ణయాన్ని కూడా చైనా విమర్శించింది. తైవాన్కు సమీపంలో జపాన్ లకి‡్ష్యత సైనిక మోహరింపులను బలోపేతం చేయడా న్ని, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా తీవ్రంగా తప్పుబట్టింది. సైనిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తోందని ఆరోపించింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఈ నెల 18వ తేదీన తైవాన్కు రూ.లక్ష కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో తైవాన్కు ఇచ్చే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీ అవుతుంది. అమెరికా చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరే, వేర్పాటువాద శక్తులకు ఊతమిచి్చనట్లేనని చైనా కన్నెర్ర చేసింది. తైవాన్ స్వాతంత్య్ర శక్తులు ఆ దీవిని పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులాగా మారుస్తారంటూ వ్యాఖ్యానించింది. చైనా స్వాతంత్య్రాన్ని, సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడు కునేందుకు అవసరమైన అన్ని చర్యలను తప్పక తీసుకుంటుందని స్పష్టం చేసింది. 2022లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు మద్దతు తెలిపేందుకు వచి్చనప్పటి నుంచి డ్రాగన్ దేశం విన్యాసాల పేరుతో తైవాన్ను పలుమార్లు దిగ్బంధనం చేసింది. -
శాంతి ఒప్పందానికి చేరువలో...
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో ఆ రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంతోపాటు యుద్ధం ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడు అంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ఏం చర్చించారు? ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్కు సంబంధించిన కొన్ని భూభాగాలను రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా రష్యా అంగీకరించడం లేదు. వాటిపై హక్కులు వదులుకోవడంతోపాటు రష్యాలో అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని తేలి్చ చెబుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా భద్రతాపరమైన గ్యారెంటీలు ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు ముఖ్యమైన అంశాలపైనే ట్రంప్, జెలెన్స్కీ చర్చించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ నాయకులతో సమావేశం కావాలని వారిద్దరూ నిర్ణయించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్తోపాటు ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలాండ్ తదితర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటుచేస్తానని ట్రంప్ చెప్పారు. వచ్చే నెలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. శాంతి కోసం ట్రంప్ ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయనకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, రష్యా అధినేత పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. శాంతి ఒప్పందంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. -
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. రష్యా సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం... ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో–సెంట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గొరడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తాం అని హెచ్చరించారు.ఇదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికీ ఇదే కారణం అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఈ పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది. -
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
లకురవా..! ఒకప్పుడు నైజీరియాలో దోపిడీ దొంగల నుంచి గ్రామీణులను కాపాడతారనే పేరున్న ఈ ముఠా సభ్యులు.. క్రమంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో జతకట్టారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలో పాగా వేశారు. ఇప్పుడు పెద్దన్న...... అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా మారారు. అందుకే ట్రంప్ క్రిస్మస్ రోజున ‘హ్యపీ క్రిస్మస్’ సందేశమిస్తూ.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటో రాష్ట్రంలో ఐఎస్ ఉగ్రవాదులను టార్గెట్గా చేసి, దాడులు జరిపిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఏమిటా లకురవా ముఠా? ట్రంప్ వారిపై ఎందుకు కక్షకట్టాడు?? లకురవా అంటే రిక్రూటింగ్ అని అర్థం. 2016-17 మధ్యకాలంలో లకురవా ముఠా టంకాసాలోని గోంగానో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలపై దాడులు జరిపి, దోపిడీలకు పాల్పడే మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేది. తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ గ్రామాలను దోచుకునే బందిపోట్ల పీచమణిచేది. వ్యవసాయాధారితమైన ఈ గ్రామాల్లో రాజకీయ అస్థిరతకు తోడు.. నైజీరియా సైన్యం రక్షణ లేకపోవడంతో.. దోపిడీదారులు విజృంభించేవారు. ఈ పరిస్థితుల్లో నైజర్, మాలి నుంచి వచ్చిన కొంతమంది యువకులు దోపిడీదారులపై ఎదురుదాడి చేశారు. గ్రామస్థులు కూడా వీరికి మద్దతిచ్చారు. 2018 నాటికి ఈ ముఠా శక్తిమంతమైంది. తమ ముఠాకు లకురవా అని నామకరణం చేసింది. స్థానికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని స్థిరపడింది. ఆ తర్వాత.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఇస్లామిక్ నిబంధనలను అమలు చేయడం మొదలు పెట్టింది. మ్యూజిక్ వినేవారికి కొరడాలతో శిక్షలు విధించింది. 2023 నాటికి లకురవా ముఠా.. సోకోటోలోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. గతంలో ఈ ప్రాంతాలను బెంబేలెత్తించిన దోపిడీదారులను మించి.. ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. క్రమంగా క్రూరత్వానికి మారుపేరుగా లకురవా మారిపోయింది. గ్రామాలపై పన్నులు విధించి.. దారుణంగా వసూలు చేసేది. దాదాపు 500 గ్రామాల్లో లకురవా పాగా వేసింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే నైజీరియా సైన్యంపై అత్యంత క్రూరంగా దాడులు జరిపేది.క్రమంగా లకురవా ముఠాలు రిక్రూట్మెంట్లను తీవ్రతరం చేశాయి. 18-35 ఏళ్ల యువకులను ఆకట్టుకున్నాయి. తమతో జతకట్టే యువకుల కుటుంబాలకు డబ్బులివ్వడమే కాకుండా.. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, విత్తనాలను అందజేసేది. అలా.. దారుల్ ఇస్లాం అనే పేరుతో శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. దీంతో.. నైగర్, నైజీరియా సైన్యాలు చర్యలకు ఉపక్రమించాయి. 2024 నవంబరులో ఈ రెండు దేశాలు లకురవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లకురవా ఉగ్రదాడులను మరింతగా పెంచింది. అదే నెలలో కేబ్బీలోని మెరా అనే గ్రామంపై దాడి చేసి, 25 మంది గ్రామస్థులను హతమార్చింది.లకురవాను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి సరిగ్గా రెండు నెలల ముందు.. అంటే.. 2024 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి ఓ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. లకురవా నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారనేది ఆ సమాచారంలో ప్రధానాంశం. ఐఎస్లో చేరి ఐఎస్జీఎస్.. అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ద గ్రేటర్ సహారాను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా.. ఐఎస్ నుంచి అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలను సేకరించింది. ఐఎస్జీఎస్ ఇప్పుడు బోకోహరామ్తో కూడా చేతులు కలిపే ప్రమాదాలున్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో.. లకురవా మాత్రం అరాచకాలను మరింత పెంచింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలను టార్గెట్గా చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను టార్గెట్గా చేసుకుంది. లకురవా చర్యలపై ఉప్పందుకున్న అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఏడాది నవంబరు నుంచే అమెరికా గూఢచర్య సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కూడా ఈ నెల 22న ఓ కథనాన్ని ప్రచురించింది. అందుకు తగిన ఆధారాలుగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్ల రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను పాఠకుల ముందుంచింది. అంతేకాదు.. క్రైస్తవులపై హింస పెరుగుతుండడంతో మత అసహన దేశాల జాబితాలో నైజీరియాను ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ ప్రపంచానికి షాకిచ్చారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపినట్లు ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు జరిపానంటూ తననుతాను సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతంచేస్తానని ప్రతినబూనారు.లకురవా అరాచకాలు ఒక్కటని చెప్పలేం. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో కూడా క్రిస్మస్ రోజున దాడులు జరిపింది. కొన్ని వారాల క్రితం ఉత్తర నైజీరియాలో ఓ క్యాథలిక్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 300 మంది పిల్లలను అపహరించింది. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణ ఉదంతం. చాలా మంది పిల్లలను ఆ తర్వాత విడుదల చేసినా.. మిగతావారెక్కడ? అనేదానిపై స్పష్టత లేదు. ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ కోసం పనిచేసే ఓ పైలట్ కూడా ఇటీవల అపహరణకు గురయ్యారు. నైజీరియాలో ముస్లిం-క్రిస్టియన్ల జనాభా దాదాపుగా చెరిసగం ఉంటుంది. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రైస్తవులపై దాడులు కొనసాగితే.. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆ మేరకే క్రిస్మస్కు ముందు సోకోటోలోని అనేక ఉగ్రవాద స్థావరాలను అమెరికా, నైజీరియా సైన్యాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. ఈ ఉదంతాన్ని బహిర్గతం చేస్తూనే ట్రంప్ ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ పోస్టు చేశారు. ట్రంప్ పట్టుదలను చూస్తుంటే.. నైజీరియాలో అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించి, మున్ముందు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -హెచ్.కమలాపతిరావు -
తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..!
అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవకుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవడమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. View this post on Instagram A post shared by Interesting Engineering (@interestingengineering)చదవండి: భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా.. -
ఘోరం.. డోర్ లాక్చేసి ఐదు గృహాలకు నిప్పంటించారు..!
బంగ్లాదేశ్ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్గా జరుగుతున్న దాడులు భారత్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.🚨 BangladeshAn attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025 అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు పేర్కొన్నారు. -
Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని ‘కాసిహ్ సయాంగ్’ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని’ ఆయన వివరించారు.ప్రమాదం నుంచి బయటపడిన 15 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వంటగదిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. వృద్ధాశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జకార్తా తాత్కాలిక గవర్నర్ హెరు బూడి హర్తోనో సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ? -
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఫలానా కేసును.. గంటల్లోనే చేధించిన ఖాకీలు.. అంటూ అత్యంత అరుదుగా చూస్తుంటాం. అదే ఒక కేసును గంటలోనే చేధిస్తే ఎలా ఉంటుంది?.. అదీ ఒక మహిళా ఆఫీసర్ ఆ పని చేస్తే!. అయితే.. పాపం అలాంటి సందర్భంలో ఆ సూపర్ ఉమెన్ను అభినందించాల్సిందిపోయి.. ‘ఒడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్’ అంటూ ఎగతాళి చేసేస్తోంది సోషల్ మీడియా..‘‘మేడమ్.. ఇది స్క్రిప్ట్ కాదు కాదా.. ఎందుకంటే సీఐడీ(హిందీ క్రైమ్ టీవీ సిరీస్) కూడా ఇంత ఫాస్ట్గా కేసును సాల్వ్ చేయలేదేమో’’ అంటూ అనుమానాలతో పాకిస్థాన్కు చెందిన మహిళా ఎస్పీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. లాహోర్ ఎస్పీ షెహర్బానో నఖ్వీ.. ఈ పేరుతో గతంలోనూ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. కిందటి ఏడాది.. దుస్తులపై అరబిక్ ప్రింట్ ఉండడంతో ఒక మహిళపై మూక దాడి ప్రయత్నం జరిగింది. అయితే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి బాధితురాలిని ఆ మూక నుంచి కాపాడి లాహోర్ లేడీ సింగంగా గుర్తింపు పొందింది నఖ్వీ. ఆ సమయంలో నెట్టింట ఆమెపై ప్రశంసలు కురిశాయి. అయితే..ఆవిడను ఇప్పుడు ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఏఆర్వై న్యూస్ ప్రకారం.. ఎస్పీ నఖ్వీ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో.. మధ్యలో ఉండగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రాగా లిఫ్ట్ చేసి.. ‘‘ఖుర్రం జీ.. ఎక్కడున్నారు... వాళ్లను పట్టుకున్నారా? మంచిది’’ అంటూ మళ్లీ వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మధ్యలో టైంని బ్రేక్ ప్రకటించారు సదరు పాడ్కాస్ట్ వ్యాఖ్యాత.గంట సేపటి తర్వాత తిరిగి వచ్చాక.. ఆమె జరిగిందో పాడ్కాస్ట్లో వివరించారు. డిఫెన్స్ ఫేస్ ఏలో ఒక హత్య జరిగిందని.. ఆ కేసును చేధించడం కోసమే వెళ్లానని అన్నారామె. ‘‘డబ్బు కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకడు మరొకడిని చంపేశాడు. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బంధించాడు. ఈ విషయం బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లి.. ఆ హంతకుడ్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని సేఫ్గా విడిపించాను. అందులో ఓ చిన్నారి కూడా ఉంది.. అని తెలిపారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది..కానీ, ఆమె చెప్పేది గతంలో ఆమెను పొగిడిన వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. అంత దూరం.. అదీ అంత స్పీడ్గా వెళ్లి ఎలా కేసును సాల్వ్ చేశారంటూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఏసీపీ ప్రద్యుమన్(సీఐబీ సిరీస్ క్యారెక్టర్) కూడా ఈ కేసును చూసి సుత్తితో తలబద్ధలు కొట్టుకుంటాడేమో అంటూ వెటకారం ప్రదర్శించాడు. ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? అని ఒక యూజర్.. కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. అని మరో యూజర్ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లేడీ సింగాన్ని.. کسی مہذب معاشرے میں ایک پولیس افسر یہ ناٹک کرتی تو اُسے نا صرف برطرف کیا جاتا بلکہ جیل ہو جاتی ! ایک گھنٹے میں FIR نہیں لکھی جاتی اس نے نا صرف قاتل پکڑ لیا وجہ قتل اور ساری کہانی میڈیا پر بتا دی عدالتیں جس کام میں سالوں لگا دیتی ہیں اس نے ایک گھنٹے میں کر دیا ۔۔ واہ دی دی واہ pic.twitter.com/1loxSxQGWV— AliZai Vlogs (@alizaihere) December 21, 2025 -
రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ?
జలంధర్: ఉపాధి కోసం రష్యా వెళ్లిన భారత యువకుల విషాదాంతం వెలుగు చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతూ 10 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పంజాబ్కు చెందిన ఓ యువకుడు వెల్లడించడం సంచలనంగా మారింది. తన సోదరుని ఆచూకీ కోసం రష్యా వెళ్లిన పంజాబ్లోని జలంధర్ జిల్లా గోరయాకు జగదీప్ కుమార్ ఈ వివరాలను మీడియా ముందు వెల్లడించారు.జగదీప్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రష్యాలో మరణించిన 10 మందిలో ముగ్గురు పంజాబ్కు చెందిన వారు కాగా, మిగిలిన ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. రష్యా సైన్యం అందించిన అధికారిక పత్రాల ఆధారంగా వీరి మరణాలను జగదీప్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా రష్యా సైన్యం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలను జగదీప్ కుమార్ రాజ్యసభ సభ్యుడు సంత్ బల్బీర్ సింగ్ సీచేవాల్ కార్యాలయానికి అందజేశారు. మరణించిన వారితో పాటు మరో నలుగురు భారతీయులు కూడా రష్యాలో గల్లంతయ్యారని ఆయన పేర్కొన్నారు.జగదీప్ సోదరుడు మన్ దీప్ కుమార్ గత ఏడాది రష్యాకు వెళ్లారు. ఒక ట్రావెల్ ఏజెంట్ మోసం కారణంగా ఆయన రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చింది. 2024, మార్చి నుంచి కుటుంబ సభ్యులకు మన్ దీప్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. కాగా తన సోదరునితో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులను రక్షించాలని కోరుతూ జగదీప్ జూన్ 29, 2024న రాజ్యసభ సభ్యుడు సీచేవాల్ను కలిశారు. అనంతరం తన సోదరుని ఆచూకీ కోసం జగదీప్ స్వయంగా రెండుసార్లు రష్యాలో పర్యటించారు. మొదటిసారి 21 రోజులు, రెండోసారి రెండు నెలల పాటు అక్కడే ఉండి సమాచారాన్ని సేకరించారు.భాషా సమస్యలతో పాటు ఇతర అడ్డంకులు ఎదురైనప్పటికీ, రష్యా సైనిక అధికారుల ద్వారా తన సోదరుడితో సహా ఇతర భారతీయ యువకుల స్థితిగతులపై ఆయన పలు కీలక పత్రాలను సేకరించగలిగారు. ఈ ఘటనపై ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్ స్పందిస్తూ విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. రష్యాలో మృతిచెందిన భారతీయ యువకుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అమాయక యువకులను మోసం చేసి, యుద్ధ భూమికి పంపుతున్న ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత యువకులు రష్యా సైన్యంలో చేరకుండా దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇది కూడా చదవండి: Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా? -
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
ఫసిఫిక్ మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తైవాన్ను రక్షించేందుకు తాము ఎటిపరిస్థితుల్లోనూ వెనుకాడబోమంటూ జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. తైవాన్ చుట్టూ ‘జస్టిస్ మిషన్ 2025’ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మూడు ప్రధాన సముద్రాలు (తూర్పు చైనా, దక్షిణ చైనా, ఫిలిప్పీన్)తో కూడిన తైవాన్ జలసంధి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో జరిగిన స్వోర్డ్ A, జాయింట్ స్వోర్డ్ B, స్ట్రైట్ థండర్ వంటి విన్యాసాల కంటే భారీ స్థాయిలో చైనా తాజా సైనిక విన్యాసాలు నిర్వహించడమే ఇందుకు కారణం. తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ సమీప జలాల్లో చైనా కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు పెరిగాయి. అదేవిధంగా.. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌక 1303 దృశ్యాన్ని విడుదల చేసింది. అయితే, చైనా కోస్ట్ గార్డ్ ఈ విన్యాసాల్లో తమ పాల్గొనడం గురించి అధికారికంగా ప్రకటించలేదు. తైవాన్పై చైనా దాడులు చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని.. జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల పార్లమెంటులో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తోందనేది స్పష్టమవుతోంది. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం ప్రధాన టార్గెట్గా తెలుస్తోంది.మరోవైపు తకైచి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజింగ్ వర్గాలు.. తమ అంతర్గత విషయాల్లో జపాన్ జోక్యం చేసుకుంటే బాగోదని హెచ్చరించింది. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. అదే సమయంలో.. కౌంటర్గానే తైవాన్ను దిగ్బంధించేలా తన ఎయిర్ఫోర్స్, నేవీ బలగాలతో ‘జస్టిస్ మిషన్ 2025’లో చేపట్టినట్లు పరోక్ష ప్రకటన చేయడం గమనార్హం. -
Mexico: ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి
మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర తీరాన్ని.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో అనుసంధానించే ‘ఇంటర్ ఓషియానిక్’ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 98 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.నౌకాదళం అందించిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో రైలులో 9 మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు.. మొత్తం 250 మంది ఉన్నారు. ఓక్సాకా, వెరాక్రజ్ రాష్ట్రాల సరిహద్దులోని నిజాండా పట్టణం మీదుగా రైలు వెళుతున్నప్పుడు.. ఒక మలుపు వద్ద రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘ఇంటర్ ఓషియానిక్ రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. గాయపడిన 98 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’ అని ఆమె వెల్లడించారు.బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు నౌకాదళ కార్యదర్శిని, మానవ హక్కుల అధికారులను ఘటనా స్థలానికి పంపినట్లు క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఈ ఘటనపై ఓక్సాకా గవర్నర్ సలోమన్ జారా మాట్లాడుతూ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించరని తెలిపారు. కాగా గాయపడిన వారికి మటియాస్ రోమెరో, సలినా క్రజ్, జుచిటాన్, ఇక్స్టెపెక్ ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గోడోయ్ రామోస్ విచారణకు ఆదేశించారు. 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ ఈ ఇంటర్ ఓషియానిక్ రైలును ప్రారంభించారు. ఇది పసిఫిక్ తీరంలోని సలినా క్రజ్ నుండి గల్ఫ్ తీరంలోని కోట్జాకోయాల్కోస్ వరకు సుమారు 290 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’ -
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ..ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి 90-95 శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడి అయ్యింది.ఉక్రెయిన్కు భద్రత కల్పించే అంశాలపై 95 శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు. అయితే.. తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటూ తేలడం లేదని మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అనుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితం. మరికొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలకు డెడ్లైన్ అంటూ ఏదీ లేదని గమనించాలి. కాబట్టి సరైన సమయంలో.. అదీ అమెరికా సమక్షంలో రష్యా-ఉక్రెయిన్లు ఈ యుధ్దానికి ముగింపు పలుకుతాయి’’ అని అన్నారాయన. ఇక ట్రంప్కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిన జెలెన్స్కీ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని.. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని.. జనవరిలో వాషింగ్టన్లో మరిన్ని చర్చలు జరుగుతాయని.. త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి తాత్కాలికంగా ఆపేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆయన కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్లో పర్యటించాలని, అక్కడి పార్లమెంట్లో ప్రసంగించాలని తాను కోరుకుంటున్నప్పటికీ.. ముందుగా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావాలని జెలెన్స్కీ ఆకాంక్షిస్తున్నారని, ఆ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాను అని అన్నారు.అసలు చిక్కల్లా అక్కడే.. డోన్బాస్ (Donbas) అనేది తూర్పు ఉక్రెయిన్లోని ఒక చారిత్రక.. ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్ (Donetsk), లుహాన్స్క్ (Luhansk) ప్రాంతాల కలయిక. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది. రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండడంతో.. రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది. అయితే.. ఈ అంశంపైనా చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ ఇప్పుడు చెబుతుండగా, డోన్బాస్పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని.. అది రష్యా అభిప్రాయానికి భిన్నమని వ్యాఖ్యానించడం కొసమెరుపు. భేటీకి ముందు.. జెలెన్స్కీతో భేటీకి ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. తుది గడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడానని.. ఆయనతో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.‘‘రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు ఏమీ లేదు.. యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను.. ఇదీ చాలా క్టిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చర్చలు చివరి దశలో ఉన్నాయి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు.ట్రంప్తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇది వరకే జెలెన్స్కీ వెల్లడించారు. ముఖ్యంగా 20సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపుగా(90 శాతం) సిద్ధమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ దేశాలూ పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. -
హదీ హంతకులు భారత్లోకి రాలేదు
షిల్లాంగ్: ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ హంతకులు భారత్లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్ఎఫ్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. హదీ హత్య కేసులో ఫైసల్ కరీం మసూద్, ఆలంగిర్ షేక్ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్ బోర్డర్ పాయింట్ మీదుగా స్థానికుల సాయంతో భారత్లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్లోని ఢాకా మెట్రోపాలిటన్ అదనపు పోలీస్ కమిషనర్ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్ అధికారి ప్రకటనపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ..‘హలువాఘాట్ సెక్టార్ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. గారో హిల్స్ ప్రాంతంలోని హలువాఘాట్ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. -
మయన్మార్లో తొలిసారిగా ఎన్నికలు
యాంగూన్: మయన్మార్లో సైన్యం అధికార పగ్గాలు చేపట్టిన ఐదేళ్ల తర్వాత సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం తొలి విడత పోలింగ్ జరిగింది. దేశం అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతుండగా, సైన్యం కన్నుసన్నల్లో ఎన్నిక తంతు జరుగుతోంది జనవరి 11, 25వ తేదీల్లో మరో 2 దఫాల పోలింగ్ అయ్యాక ఫలితాలొస్తాయి. జాతీయ, ప్రాంతీయ శాసనసభల స్థానాల కోసం 57 పార్టీలకు చెందిన 4,800 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. పార్లమెంటులో రాజకీయ ప్రాతినిథ్యం పొందే అవకాశమున్న 6 పార్టీలే పోటీ చేస్తున్నాయి. అంగ్సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోకస్రీ పార్టీని సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. సైన్యం అండదండలతో పనిచేస్తున్న యూనియన్ సాలిడారిటీ, డెవలప్మెంట్ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి. -
సూరినామ్లో కత్తిపోట్ల కలకలం
పారమారిబో: దక్షిణ అమెరికాలోని సూరినామ్లో ఓ వ్యక్తి కత్తితో జరిపిన దాడిలో ఐదుగురు బాలలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని పారమారిబో సమీపంలో ఆదివారం ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా నిందితుడి పిల్లలు, అతడి పొరుగువారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకుని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు దాడికి దిగాడన్నారు.ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో అతడు గాయపడ్డాడని చెప్పారు. అతడికి మతిస్థిమితం లేదని తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మా విమానాలు కొంటే భారత్లో తయారీ
మారియెటా (యూఎస్): సైనిక రవాణా అవసరాల నిమిత్తం 80 భారీ విమానాల కొనుగోలుకు మోదీ సర్కార్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వందల కోట్ల డాలర్ల విలువైన ఆ కాంట్రాక్టు కోసం అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్హీడ్ మార్టీన్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి బిడ్ వేయడం విశేషం. తమ సీ–130జే సూపర్ హెర్క్యులెస్ భారీ విమానాలు భారత అవసరాలకు సరిగ్గా సరిపోతాయని ఈ అమెరికా దిగ్గజం తాజాగా పేర్కొంది. ఈ భారీ కాంట్రాక్టు లభిస్తే విమానాల తయారీకి భారత్లోనే మెగా హబ్ ఏర్పాటు చేస్తామని భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా బయట తాము ఇలాంటి ప్లాంటు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అవుతుందని గుర్తుచేసింది. సీ–130జే సిరీస్లో లాక్హీడ్ ఇప్పటిదాకా 560కి పైగా విమానాలను సరఫరా చేసింది. అవి 23 దేశాల్లో సేవలందిస్తున్నాయి. మన వాయుసేవ వద్ద ప్రస్తుతం ఈ శ్రేణికి చెందిన 12 విమానాలున్నాయి. రవాణా అవసరాలతో పాటు నిఘా, ఎల్రక్టానిక్ వార్ఫేర్, గాలింపు, రెస్క్యూ మిషన్ల వంటి అవసరాల నిమిత్తం సీ–130జే శ్రేణిలో ప్రత్యేక కని్ఫగరేషన్లను సంస్థ అమరుస్తుంటుంది. ప్రస్తుతం డి్రస్టిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ తదితరాలతో వాటిని మరింత ఆధునీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఆ్రస్టేలియాతో పాటు జపాన్ కూడా సీ–130జే రవాణా విమానాల కొనుగోలు యోచనలో ఉన్నాయి. భారత వాయుసేన ప్రస్తుతం రవాణా అవసరాలకు సోవియెట్ కాలం నాటి ఏఎన్–32, ఐఎల్–76 రకం విమానాలపై ఆధారపడుతోంది. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ పిలుపు
వాష్టింగన్: కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు. -
‘నేను నీ బానిసనా?’.. మేనేజర్కి బుద్ది చెప్పిన ఉద్యోగి!
లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్లో మేనజర్గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్సీ అవుట్లెట్లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్కు అందించాడు. ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. -
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF— Elon Musk (@elonmusk) December 26, 2025 -
ఉస్మాన్ హాదీ హంతకులు భారత్లో?
బంగ్లాదేశ్లో రాడికల్ నేత ఉస్మాన్ హాది హత్య తీవ్ర అంతర్గత సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో హింస చెలరేగింది. హిందువులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నేరస్థులు భారత్లో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. భారత్ వ్యతిరేక భావజాలం ఉన్న నేతలు ప్రస్తుతం అక్కడ బలంగా ఉండడంతో పాటు ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం ఆదేశానికి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదేశానికి చెందిన కొంతమంది నేతలు ఇండియాపై కారుకూతలు కూశారు. అంతేకాకుండా ఇటీవల అక్కడ భారత వ్యతిరేక భావజాలం ఉన్న విద్యార్థి నేతల ఉస్మాన్ హాదీ హత్య తరువాత అక్కడ అలర్లు చెలరేగాయి. ఇద్దరు హిందూ యువకులను తీవ్రంగా కొట్టి కిరాతకంగా చంపారు. కాగా ఇప్పుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన వారు భారత్లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు.అక్కడి అడిషనల్ కమిషనర్ నార్జూల్ ఇస్లాం మాట్లాడుతూ" ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసుాద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు నేరస్థులు, మైమెన్ సింగ్ జిల్లాలోని హాలుఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోని మేఘాలయలోకి ప్రవేశించారు. అనంతరం వారిని పూరి అనే వ్యక్తి రిసీవ్ చేసుకొని, సమీ అనే ట్యాక్స్ డ్రైవర్ అక్కడి టూరా సిటిీలో దించారు." అని తెలిపారు. ఈ వివరాలను అక్కడి డైలీ స్టార్ పత్రిక ప్రచురించింది.అయితే పూరి, సమీలిద్దరినీ భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారే అనధికార సమాచారం తమకు అందిందని ఆయన తెలిపినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. నేరస్థులను బంగ్లాదేశ్ రప్పించేలా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపాయి . అయితే ఈ ఆరోపణల్ని మేఘాలయ పోలీసులు ఖండించారు. ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు భారత్లో ప్రవేశించలేదని తెలిపారు.బంగ్లాదేశ్ మీడియా సంస్థలు మేఘాలయ ప్రజలన భయభ్రాంతులకు గురిచేసేలా కథనాలు ప్రచురిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పూరి, సమీలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచురించారని అది కూడా పూర్తిగా అసత్య ఆరోపణలని వారు తెలిపారు -
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. -
2026 మరింత భయానకం.. వణికిస్తున్న నోస్ట్రడామస్ జోస్యం!
ప్రముఖ ఫ్రెంచ్ భవిష్యవేత్త నోస్ట్రడామస్ రాబోయే 2026కు సంబంధించి చేసిన సంచలన అంచనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూ, అందరిలో వణుకుపుట్టిస్తున్నాయి. ‘న్యూస్ 24’ కథనం ప్రకారం నోస్ట్రడామస్ అంచనా వేసిన భయానక పరిణామాలు, ముంచుకొస్తున్న విపత్తుల వివరాల్లోకి వెళితే..2026 మధ్యకాలంలోలో మూడవ ప్రపంచ యుద్ధం?నోస్ట్రడామస్ జోస్యం ప్రకారం 2026 మధ్యకాలం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం (World War III) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది అత్యంత వినాశకరంగా మారుతుందని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. మతం, జాతీయవాదం పేరుతో జనం ఒకరినొకరు చంపుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తూర్పు దేశాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం.సముద్ర యుద్ధాలు - రాజకీయ మార్పులునోస్ట్రడామస్ అంచనాల ప్రకారం.. 2026లో జరిగే భారీ నౌకాదళ ప్రమాదం లేదా సముద్ర యుద్ధం ప్రపంచాన్ని కుదిపేయనుంది. ఒక భారీ నౌక మునిగిపోవడం లేదా నౌకాదళాల మధ్య పోరు ప్రారంభమై అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగి, అగ్రరాజ్యాల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు. సముద్రంలో నౌక మునిగిన రోజున.. ఆ సముద్ర శక్తి ప్రపంచ రాజకీయాల గమనాన్ని మారుస్తుందని నోస్ట్రడామస్ తన పద్యాలలో పేర్కొన్నారు.ఆర్థిక సంక్షోభం- సామాజిక అశాంతి2026లో అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగి, సామాజిక అశాంతికి దారితీయవచ్చు. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతల పదవులు చేజారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.ప్రకృతి ప్రకోపం: తీవ్రమైన ఎండలు, వరదలుపర్యావరణ పరంగా కూడా 2026 అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోంది. నోస్ట్రడామస్ తెలిపిన వివరాల ప్రకారం తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పలు ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలతో భీకర వరదలు సంభవిస్తాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల పర్యావరణానికి, మానవజాతికి అపార నష్టం వాటిల్లుతుందని ఈ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు అంచనా వేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యంరాబోయే కాలంలో సాంకేతిక రంగంలో వచ్చే కీలక మార్పులను ఆయన ముందే ఊహించారు. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సలహాదారుగా మాత్రమే కాకుండా, నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు, అన్ని వ్యవస్థలు ఏఐ నియంత్రణలో నడిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.అణు దాడి- అంతరిక్ష కార్యక్రమాల పతనంమరో భయానక అంచనా ప్రకారం.. 2026లో అణు దాడి జరిగే అవకాశం ఉంది. ఇది మానవజాతి అంతరిక్ష పరిశోధనలపై ప్రభావం చూపనుంది. ‘మార్స్’పై చీకట్లు కమ్ముకుంటాయని, అలాగే ఒక ప్రముఖ దేశం అణు దాడికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.ఆహార ధాన్యాల ధరల పెరుగుదలనోస్ట్రడామస్ అంచనాల్లో గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కూడా ఉంది. ఆయన పద్యాల్లో నిర్దిష్టమైన తేదీలు లేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నోస్ట్రడామస్ చెప్పిన ఈ అంచనాలు చాలా వరకు అస్పష్టంగా ఉంటాయని, వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నోస్ట్రడామస్ అంచనాలకు దగ్గరగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఉన్నాయని పలువురు అంటున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్ హీరో.. -
ఉక్రెయిన్కు పుతిన్ సంచలన హెచ్చరిక
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు శాంతి చర్చల వేళ అధ్యక్షుడు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని పుతిన్ చెప్పుకొచ్చారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ఆ దేశ మిలిటరీ కమాండ్ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్, రష్యన్ దళాలతో పుతిన్ చర్చలు జరిపారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. సమస్య పరిష్కారానికి వాళ్లు తొందరపడటం లేదు. ఒక వేళ ఉక్రెయిన్ అధికారులు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో మా లక్ష్యాలను సాధిస్తాం. రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.రష్యా దాడులు.. మరోవైపు.. శాంతి చర్చల వేళ ఉక్రెయిన్పై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. కీవ్పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేసింది. ఈ దాడులను జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ దౌత్యపరమైన మార్గాలకు కట్టుబడి ఉందని.. మాస్కోనే యుద్ధం పొడిగించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది. JUST IN:🇷🇺 Putin in full military uniform:" If Kiev does not want peace, Russia will achieve all Special Military Operation goals by MILITARY means" pic.twitter.com/CCMLzoA1GB— Megatron (@Megatron_ron) December 27, 2025


