ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే? | 2026 baba vanga predictions | Sakshi
Sakshi News home page

ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే?

Jan 2 2026 9:23 PM | Updated on Jan 2 2026 9:45 PM

2026 baba vanga predictions

సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పరిణామాలు వంటి అంశాలపై ఆమె చేసిన సూచనలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.

2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. తుఫానులు, వరదలు, భూకంపాలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాల్లో పెద్ద రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని ఆమె ప్రవచించారు. అంతర్జాతీయ స్థాయిలో పవర్ బ్యాలెన్స్ మార్పులు చోటు చేసుకుంటాయని సూచించారు. కొత్త కూటములు ఏర్పడి, పాత కూటములు కూలిపోతాయని అంచనా.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని ఆమె చెప్పారు. కొన్ని దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవడం, మార్కెట్లలో అస్థిరత పెరగడం జరుగుతుందని అంచనా. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(AI), బయోటెక్నాలజీ రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా.

బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయి. అయితే, ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా ఉన్నందున, ఆమె ప్రవచనాలు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఓ ప్రముఖ వ్యక్తి మీద పగటి పూట పిడుగు పడి చనిపోతాడు. ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి, కళారంగానికి చెందిన వారేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.   

2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలుగా గుర్తించబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement