ముగిసిన ఖలీదా జియా అంత్యక్రియలు | Jaishankar attended Khaleda Zia funeral | Sakshi
Sakshi News home page

ముగిసిన ఖలీదా జియా అంత్యక్రియలు

Dec 31 2025 3:56 PM | Updated on Dec 31 2025 4:59 PM

Jaishankar attended Khaleda Zia funeral

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు ఈ రోజు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. ఆమెకు ప్రత్యేక నివాళులర్పించారు.ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ ఉన్న పత్రాన్ని బీఎన్పీ యాక్టింగ్ ఛైర్మన్ తరీఖ్ రహమాన్‌కు అందించారు. ఆమె మృతిపట్ల భారత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోందని తెలిపారు.  

అక్కడి ప్రభుత్వం ఖలీదా జియాకు ఘన నివాళులర్పించింది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఖలీదా జియా పార్థివదేహంతో అక్కడి పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యేక పార్థనలు చేశారు.  అనంతరం తన భర్త, ఆ దేశ మాజీ అధ్యక్షుడు జియావుల్ రహమన్ సమాధి పక్కనే ఖలీదా పార్థివదేహాన్ని పూడ్చిపెట్టారు. ఖలీదా జియా అంతిమయాత్రతో ఢాకా నగరం జన సంద్రమైంది. ఆమెను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఢాకా నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement