breaking news
Bangladesh
-
‘సుప్రీం’ ఆదేశం.. బంగ్లాదేశ్ గర్భిణికి ఉపశమనం
న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్లో బంగ్లాదేశ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్! -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ప్లేయర్
ఐర్లాండ్తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాడు తంజిద్ హసన్ తమీమ్ (Tanzid Hasan Tamim) అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో అతను ఏకంగా ఐదు క్యాచ్లు పట్టాడు. అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఫీల్డర్ (నాన్ వికెట్కీపర్) ఇన్ని క్యాచ్లు పట్టడంతో ఇది కేవలం మూడోసారి మాత్రమే. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల పరంగా చూస్తే.. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ తంజిదే. మిగతా ఇద్దరు నాన్ టెస్ట్ ప్లేయింగ్ దేశాలకు చెందిన వారు. మాల్దీవ్స్కు వెదగే మలిండ, స్వీడన్కు చెందిన సెదిక్ సహక్ ఆ మిగతా ఇద్దరు.ఐర్లాండ్తో మ్యాచ్లో తంజిద్ డాక్రెల్, డెలానీ, మార్క్ అదైర్, హంఫ్రేస్, బెంజమిన్ వైట్ క్యాచ్లు పట్టాడు. ఈ మ్యాచ్లో తంజిద్ క్యాచ్ పట్టడమే కాకుండా బ్యాటింగ్లోనూ రాణించి అజేయ అర్ద సెంచరీ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ను ఒంటిచేత్తో గెలిపించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 117 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం బంగ్లాదేశ్ సునాయాసంగా విజయతీరాలకు చేరింది. తద్వారా మ్యాచ్తో పాటు సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఐదు క్యాచ్లతో పాటు అజేయ అర్ద సెంచరీ చేసిన తంజిద్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో ఐర్లాండ్ తొలి మ్యాచ్ గెలువగా.. బంగ్లాదేశ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్లు గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. -
బంగ్లాదేశ్దే సిరీస్
స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (డిసెంబర్ 2) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ బంగ్లా బౌలర్ల ధాటికి 117 పరుగులకే ఆలౌటైంది. ముస్తాఫిజుర్, రిషద్ హొస్సేన్ తలో 3, షోరిఫుల్ 2, మెహిది హసన్, సైఫుద్దీన్ చెరో వికెట్ తీసి ఐర్లాండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. టెక్టర్ (17), డాక్రెల్ (19), డెలాని (10) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ తంజిద్ హసన్ (55) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి పర్వేజ్ హస్సేన్ ఎమోన్ (33 నాటౌట్) సహకరించాడు. అర్ద సెంచరీతో పాటు ఐదు క్యాచ్లు పట్టిన తంజిద్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్లో ఐర్లాండ్ తొలి మ్యాచ్ గెలువగా.. బంగ్లాదేశ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
షేక్ హసీనాకు మరో బిగ్ షాక్..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్షల పర్వం కొనసాగుతోంది. మరో భూ కుంభకోణం కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష, ఆమె సోదరి షేక్ రెహనాకు ఏడేళ్ల జైలు శిక్ష, రెహనా కూతురు, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢాకాలోని అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం కోర్టు తీర్పు ఇచ్చింది. భూకేటాయింపుల వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.ఈ నేపథ్యంలో 17 మందిపై కేసు నమోదైంది. మిగిలిన 14 మంది నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. 17 మంది జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో ఒక్కొక్కరు మరో ఆరు నెలలపాటు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. కేసు తీర్పు సందర్భంగా ముగ్గురు నిందితుల్లో ఏ ఒక్కరూ కోర్టు గదిలో లేకపోవడం గమనార్హం. అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అవినీతి కేసుల్లో 78 ఏళ్ల హసీనాకు సంబంధించిన నాలుగో తీర్పు ఇది. వరుస కేసులు.. ఇదిలా ఉండగా.. వరుస కేసులతో.. కఠిన శిక్షలతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా భారత్పైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఆమెపై మరో అభియోగం మోపే దిశగా అడుగులు వేస్తోంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తోంది. హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ ప్యానెల్కు రిటైర్డ్ మేజర్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) తిరుగుబాటు జరిగింది. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది మరణించారు. ఫజ్లుర్ కమిషన్ ఆదివారం సమర్పించిన నివేదికలో ఇలా ఉంది.. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటుకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చారు. ఆనాడు అవామీ లీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగింది. పైగా ఈ తిరుగుబాటులో "విదేశీ శక్తి" ప్రమేయం స్పష్టంగా కనిపించింది. అది భారతదేశమే. ఆ సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్లోకి చొరబడ్డారు. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు అని పేర్కొంది.హసీనా ప్రభుత్వ హయాంలో బీడీఆర్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది. అయితే ఫజ్లుర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారతదేశం బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది. -
9 ఎడిషన్ల తర్వాత వేలం.. ఖరీదైన ఆటగాడు అతడే..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తొమ్మిది ఎడిషన్ల తర్వాత మళ్లీ ఆటగాళ్ల వేలం జరిగింది. 2012లో తొలి సీజన్ వేలం తర్వాత ఇప్పటివరకు డ్రాఫ్ట్ విధానం అమల్లో ఉండింది. అయితే రాబోయే సీజన్ కోసం ఈసారి ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నయీమ్ను చిట్టగాంగ్ రాయల్స్ BDT 1 కోటి (USD 88000)కు కొనుగోలు చేసింది. ఈ వేలంలో కోటి టాకాల మార్క్ దాటిన ఏకైక ఆటగాడు నయీమే కావడం విశేషం. నయీమ్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్ నిలిచారు. వీరిద్దరినీ రంగ్పూర్ రైడర్స్ ఫ్రాంచైజీనే సొంతం చేసుకుంది. హ్రిదోయ్ USD 73600కు, లిట్టన్ దాస్ USD 56,000కు అమ్ముడుపోయారు.బంగ్లాదేశీ వెటరన్ స్టార్లు మహ్ముదుల్లా, ముష్ఫికుర్ రహీమ్ కోసం తొలుత ఏ ఫ్రాంచైజీ బిడ్ చేయకపోయినా, చివరికి మహ్ముదుల్లాను రైడర్స్, ముష్ఫికుర్ను రాజ్షాహి వారియర్స్ వారి బేస్ ప్రైస్ BDT 35 లక్షలకు దక్కించుకున్నాయి.ఈ వేలంలో విదేశీ ప్లేయర్లు వందల సంఖ్యలో పాల్గొన్నా 90 శాతానికి పైగా అమ్ముడుపోకపోవడం మరో విశేషం. ఈ కేటగిరిలో శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనకకు అత్యధిక ధర దక్కింది. ఇతన్ని ఢాకా క్యాపిటల్స్ USD 55000కు కొనుగోలు చేసింది.కాగా, ఈ సీజన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ డిసెంబర్ 26 నుంచి జనవరి 23 వరకు జరగనుంది. ఈ సీజన్లో పాల్గొనే జట్లు.. ఢాకా క్యాపిటల్స్, రంగ్పూర్ రైడర్స్, రాజ్షాహి వారియర్స్, నోయాఖాలి ఎక్స్ప్రెస్, సిల్హెట్ టైటాన్స్, చిట్టగాంగ్ రాయల్స్. -
హసీనా చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. భారత్పై సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చుట్టు ఉచ్చు మరింత బిగుస్తోంది. వరుస కేసులతో.. కఠిన శిక్షలతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా భారత్పైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఆమెపై మరో అభియోగం మోపే దిశగా అడుగులు వేస్తోంది.2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తోంది. హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ ప్యానెల్కు రిటైర్డ్ మేజర్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) తిరుగుబాటు జరిగింది. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది మరణించారు. ఫజ్లుర్ కమిషన్ ఆదివారం సమర్పించిన నివేదికలో ఇలా ఉంది.. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటుకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చారు. ఆనాడు అవామీ లీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగింది. పైగా ఈ తిరుగుబాటులో "విదేశీ శక్తి" ప్రమేయం స్పష్టంగా కనిపించింది. అది భారతదేశమే. ఆ సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్లోకి చొరబడ్డారు. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు అని పేర్కొంది.హసీనా ప్రభుత్వ హయాంలో బీడీఆర్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది. అయితే ఫజ్లుర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారతదేశం బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది.ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ల పెంపు నిర్ణయంతో బంగ్లాదేశ్లో కిందటి ఏడాది ఢాకా వర్సిటీ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అయితే ఈ నిరసనలు భద్రతా బలగాల మోహరింపుతో అల్లర్లకు దారి తీశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో పలువురు మరణించారు. ప్రభుత్వం కుప్పకూలి తిరుగుబాటు పరిస్థితుల నడుమ ఆమె భారత్కు శరణుకోరి వచ్చారు. అటుపై హింసాత్మకంగా ఆందోళనలకు అణచివేశారంటూ ఆమెపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా.. ఆమెకు తీవ్ర నేరాల దృష్ట్యా మరణశిక్ష, అటుపై మరో కేసులో 21 ఏళ్ల జైలు శిక్షా పడింది కూడా. మరోవైపు హసీనాను(ఫ్యూజిటివ్) తమకు వీలైనంత త్వరగా అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరుతుండగా.. భారత్ మాత్రం తొందరపడబోమని, ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటోంది. తాజా నివేదిక నేపథ్యంలో భారత్పై ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి భారత్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
రెండో టి20లో బంగ్లాదేశ్ విజయం
చిట్టోగ్రామ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు... ఐర్లాండ్తో రెండో టి20లో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో పరాజయం పాలైన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1–1తో సమంచేసింది. శనివారం జరిగిన పోరులో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టకర్ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ పాల్ స్టిర్లింగ్ (14 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు), టిమ్ టెక్టర్ (25 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తన్జీమ్ హసన్ షకీబ్, మొహమ్మద్ సైఫుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కెప్టెన్ లిటన్ దాస్ (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్సెంచరీతో రాణించగా... పర్వేజ్ హుసేన్ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. ఒక దశలో 138/2తో పటిష్ట స్థితిలో కనిపించిన బంగ్లాదేశ్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందిపడింది. తన్జిద్ హసన్ (7), తౌహిద్ హృదయ్ (6), నూరుల్ హసన్ (5) విఫలమయ్యారు. దీంతో ఉత్కంఠ రేగినా... ఆఖర్లో సైఫుద్దీన్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు చేసి మరో రెండు బంతులు మిగిలుండగా... జట్టును గెలిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, గారెత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టి20 మంగళవారం జరగనుంది. -
షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా న్యాయస్థానం గురువారం మూడు అవినీతి కేసుల్లో ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు భూకేటాయింపుల్లో అవతవకలకు పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ ఈ మూడు కేసులు నమోదు చేసింది. మార్చి 10న చార్చిషీట్లను సమర్పించింది. ఒక్కో కేసులో ఏడేళ్ల చొప్పున 21 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. ఎటువంటి దరఖాస్తులు లేకుండా, తన అధికార పరిధిని మించి హసీనా ప్లాట్ను కేటాయించారని కోర్టు పేర్కొంది. వరుసగా శిక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. హసీనా గైర్హాజరీలో ఉండగా ఆమె పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంటూ కోర్టు తీర్పునిచి్చంది. ఒక్కో కేసులో ఒక లక్ష రూపాయల జరిమానా చెల్లించలేకపోతే మరో 18 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు వివరించింది. హసీనా కుమారుడు, కుమార్తె సాజిబ్ వాజిద్ జాయ్, సైమా వాజిద్ పుతుల్లపై దాఖలైన కేసుల్లోనూ ఇరువురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇద్దరికీ లక్ష చొప్పున జరిమానా విధించింది. చెల్లించని పక్షంలో ఒక నెల ఎక్కువ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. అయితే విచారణ చట్టబద్ధతను హసీనా కొట్టిపారేసారు. తనపై ఉన్న అభియోగాలు రాజకీయపూరితమైన వని హసీనా అభిప్రాయపడ్డారు. కోర్టు మోసపూరితమైనదని ఆరోపించారు. గతేడాది ఆగస్టు 5 నుంచి హసీనా భారత్లో నివసిస్తున్నారు. గతేడాది జూలై, ఆగస్టు మధ్య విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును హింసాత్మకంగా అణచివేయాలని ఆదేశించినందుకు హసీనాను దోషిగా నిర్ధారించిన ట్రిబ్యునల్ ఈ నెల 17న ఆమెకు మరణశిక్ష విధించింది. వారం రోజులకే ఈ తీర్పు వచి్చంది. హసీనా కుటుంబంతోపాటు గృహ నిర్మాణశాఖ మాజీ మంత్రి షరీఫ్ అహ్మద్, శాఖ అధికారులతో సహా 20 మందిపై ఈ కేసుల్లో విచారణ జరిగింది. ఒకరికి తప్ప 19 మందికి వేర్వేరు శిక్షలు పడ్డాయి. -
బంగ్లా వినతిని పరిశీలిస్తున్నాం: భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగించాలన్న అక్కడి మధ్యంతర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వాల సాధనకు భారత్ ఎప్పు డూ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతిని« ది రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. బంగ్లాలో పరిస్థితు లను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. 78 ఏళ్ల హసీనా గతేడాది బంగ్లాలో భారీ నిరసన జ్వాలల నేపథ్యంలో దేశం వీధి భారత్ కు పారిపోయి రావడం, అప్పటినుంచీ ఇక్కడే తలదాచు కుంటుండటం తెలిసిందే. మానవత్వంపైనే తీరని నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు గత వారమే మరణ శిక్ష కూడా విధించింది.పాక్వి సిగ్గుచేటు వ్యాఖ్యలుఅయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమం పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రేలాపనలపై కేంద్రం మండిపడింది. మతోన్మాదం, మైనారిటీలపై అకృత్యాలకు పెట్టింది పేరైన పాక్ నుంచి నైతిక పాఠాలు నేర్చుకునే దుస్థితి భారత్కు పట్టలేదని జైస్వాల్ అన్నారు. బాబ్రీ మసీదు స్థలంపై ఆలయం కట్టడం, దానిపై ధ్వజారోహణ చేయడం ఏమిటంటూ పాకిస్తాన్ నోరు పారేసుకోవడం తెలిసిందే. -
కబడ్డీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఢాకా: ప్రపంచకప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మెగా టోర్నిలో రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకొని మట్టి ఆటలో మన ఆధిక్యాన్ని చాటింది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు 35–28 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీని చిత్తు చేసింది. మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ సెమీఫైనల్లో పటిష్ట ఇరాన్ జట్టును మట్టికరిపించిన మన అమ్మాయిలు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన భారత జట్టు... అటు రైడింగ్, ఇటు ట్యాక్లింగ్లో ఆకట్టుకుంది. 2012లో భారత్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్లో ఇరాన్పై గెలిచి చాంపియన్గా నిలిచిన టీమిండియా... ఇప్పుడు రెండో సారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన భారత జట్టు... ఫైనల్లో చైనీస్ తైపీపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. చక్కటి డిఫెన్స్తో పాటు... కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ పైచేయి కొనసాగించింది. కెపె్టన్ రీతూ నేగి అన్నీ తానై జట్టును నడిపించగా... వైస్ కెపె్టన్ పుష్ప తన రైడింగ్తో కట్టిపడేసింది. జట్టుకు అవసరమైనప్పుడల్లా పాయింట్లు సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. హెడ్ కోచ్ తేజస్వి ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా... చక్కటి సమన్వయం, సమష్టితత్వంతో కట్టిపడేసింది. తుది పోరు ఆరంభంలో చైనీస్ తైపీ గట్టి ప్రతిఘటన కనబర్చే ప్రయత్నం చేసింది. అయితే పట్టువదలని టీమిండియా మ్యాచ్ 13వ నిమిషంలో ప్రత్యరి్థని ఆలౌట్ చేసి 18–15తో ముందంజ వేసింది. ఈ దశలో భారత కెపె్టన్ రీతూ నేగి గాయపడటంతో ఉత్కంఠ పెరిగినా... ఎక్కడా ఒత్తిడికి గురికాని టీమిండియా ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ మ్యాచ్పై పట్టు సాధించి జగజ్జేతగా నిలిచింది. రీతూ, పుష్పతో పాటు చంపా ఠాకూర్, భావన ఠాకూర్, సాక్షి శర్మ భారత విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టుకు అన్నివైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు భారత మహిళల విజయాన్ని శ్లాఘించారు. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స
Khaleda Zia under intensive care బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) చైర్పర్సన్, మాజీ ప్రధాన మంత్రి బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గుండె, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాబోయే 12 గంటలు చాలా కీలకమని వైద్యులు ప్రకటించారు.జియా కోసం ఏర్పాటు చేసిన వైద్య బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎఫ్ఎం సిద్ధిఖీ ఆమె ఆరోగ్యపరిస్థితిపై నిన్న రాత్రి మీడియాకు వివరించారు. "గత కొన్ని నెలలుగా, తరచుగా అనేక సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆమె( ఎవర్కేర్ హాస్పిటల్) చికిత్స పొందుతున్నారని, ఛాతీలో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ఇప్పటికే ఆమెకు పర్మినెంట్ పేస్మేకర్, స్టంట్స్ వేయడం, గుండె సంబంధిత సమస్యలతో మిట్రల్ స్టెనోసిస్ అనే పరిస్థితితో కూడా బాధపడుతున్నారన్నారు. యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తున్నామని , మరోవైపుఅమెరికాకు చెందిన వైద్య నిపుణులు వర్చువల్గా సాయం అందిస్తున్నారని తెలిపారుఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా, గుండె, ఊపిరితిత్తులు ఒకేసారి ప్రభావితమయ్యాయి. దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది ఏర్పడిందన్నారు. బేగం జియాను ఇంటెన్సివ్ కేర్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని , రాబోయే 24 గంటల్లో వచ్చే రిపోర్ట్స్ కీలకమని ప్రొఫెసర్ సిద్ధిఖీ తెలిపారు. బేగం జియా అస్వస్థత వార్తలతో బీఎన్పీ నేతలు, శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్య నాయకులు ఆమె ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
బంగ్లాదేశ్ క్లీన్స్వీప్
మిర్పూర్: బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐర్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను బ్లంగాదేశ్ క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ 217 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2–0తో చేజిక్కించుకుంది. 509 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 176/6తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ చివరకు 113.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. కర్టీస్ కాంపెర్ (259 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మ్యాచ్ను ‘డ్రా’ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి చక్కటి పోరాటంతో బంగ్లాదేశ్ను విసిగించాడు. ఆఖరి రోజు దాదాపు 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన అతడు మ్యాచ్ను కాపాడలేకపోయినా... తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్ నీల్ (46 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 85 బంతుల్లో 48 పరుగులు జోడించిన కాంపెర్... ఆ తర్వాత పదో స్థానంలో బ్యాటింగ్కు వచి్చన గవిన్ హోయ్ (104 బంతుల్లో 37; 4 ఫోర్లు)తో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీ 9వ వికెట్కు 191 బంతులాడి 54 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు ఎంతగా పరీక్షిస్తున్నా ఈ జంట సహనం కోల్పోలేదు. దీంతో ఐర్లాండ్ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకునేలా కనిపించినా... హసన్ మురాద్ వరుస బంతుల్లో గవిన్, మాథ్యూ (0)ను అవుట్ చేసి ఐర్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, హసన్ మురాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 476 పరుగులు చేయగా... ఐర్లాండ్ 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బంగ్లా 297/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెరీర్లో వందో టెస్టులో సెంచరీతో మెరిసిన ముష్ఫికర్ రహీమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, తైజుల్ ఇస్లామ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. -
బంగ్లాలో భూకంపం 10 మంది మృతి
బంగ్లాదేశ్ లో భూకంపం బీభత్సం సృష్టించింది. మధ్య బంగ్లాదేశ్ ప్రాంతాలలో పాటు ఆ దేశ రాజధాని ఢాకాలోని భూమి కంపించింది. దీంతో 10 మంది మృతి చెందడంతో పాటు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది.శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ ని భూకంపాలు కుదిపేశాయి. సెంట్రల్ బంగ్లాదేశ్ ప్రాంతంతో పాటు రాజధాని ఢాకా నగరంలో పలు చోట్ల భూమి కంపించడంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపంలో చిక్కుకొని దాదాపు 10 మంది వరకూ ప్రజలు మరణించారని అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ భూకంపంలో దాదాపు 14 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఢాకా జిల్లా యంత్రాంగం తెలిపింది. వాటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మరోసారి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఇప్పుడు వచ్చిన భూకంపం రాబోయే భారీ భూకంపానికి సూచికగా పరిగణించాలన్నారు. దాని కనుగుణంగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే శనివారం ఉదయం సైతం బంగ్లాలో స్పల్పంగా భూమి కంపించింది.బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం ప్రపంచంలో భుకంపం వచ్చే అవకాశాలు ఉన్న తొలి 20 నగరాలలో ఒకటి. అంతే కాకుండా అక్కడ జనసాంద్రత అధికంగా ఉండడంతో భవనాల నిర్మాణం సైతం అధికంగా ఉంటుంది. దీంతో ఢాకాలో శిథిలావస్థకు చెందిన కట్టడాలపై నిఘా ఉంచాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ లో భారీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు. గతంలో బంగ్లాదేశ్ భూభాగానికి పెద్దఎత్తున భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. 1869 నంచి 1930 మధ్య కాలంలో రిక్టర్ స్కేలుపై 7కు పైగా తీవ్రతతో ఐదు సార్లు భూకంపాలు వచ్చాయి. -
విజయం ముంగిట బంగ్లాదేశ్
మిర్పూర్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు... సొంతగడ్డపై ఐర్లాండ్తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించి 1–0తో ఆధిక్యంలో ఉన్న బంగ్లాదేశ్... రెండో టెస్టులో ప్రత్యర్థి ముందు 509 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (80 బంతుల్లో 50; 7 ఫోర్లు)హాఫ్ సెంచరీతో మెరవగా... కర్టీస్ కాంపెర్ (93 బంతుల్లో 34 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడుతున్నాడు. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (13)తో పాటు పాల్ స్టిర్లింగ్ (9), కార్మిచెల్ (10), టకర్ (7) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు పడగొట్టగా... హసన్ మురాద్ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న ఐర్లాండ్ జట్టు... విజయానికి ఇంకా 333 పరుగులు చేయాల్సి ఉంది. కాంపెర్తో పాటు మెక్బ్రినె (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 156/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... చివరకు 69 ఓవర్లలో 297/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మహ్ముదుల్ హసన్ జాయ్ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్మన్ ఇస్లామ్ (119 బంతుల్లో 78; 7 ఫోర్లు), మోమినుల్ హక్ (118 బంతుల్లో 87; 10 ఫోర్లు), ముషి్ఫకర్ రహీమ్ (81 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న ముషి్ఫకర్ రహీమ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేయడంతో పాటు... రెండో ఇన్నింగ్స్లో అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో గవిన్ 2 వికెట్లు పడగొట్టాడు.249 తైజుల్ ఇస్లామ్ వికెట్ల సంఖ్య. టెస్టుల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షకీబ్ అల్ హసన్ (246)ను తైజుల్ అధిగమించాడు. -
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్ 21) తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. దోహా వేదికగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో జిషన్ ఆలమ్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్ అబ్రార్ (13), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ 9, మహిదుల్ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్ డకౌటయ్యాడు.భారత బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. రమన్దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్ మెరుపులు కూడా మొదలయ్యాయి..!అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ 3.3 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. -
క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు
ఢాకా (Dhaka) వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)-ఐర్లాండ్ (Bangladesh vs Ireland) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు (నవంబర్ 21) ఆటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా భూకంపం (Earth Quake) సంభవించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు. మ్యాచ్ ఉన్నపళంగా ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు.ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్దం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మూడు, నాలుగు నిమిషాల భూకంపం ధాటి తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్ ఇన్నింగ్స్ 56వ ఓవర్ రెండో బంతి బౌల్ చేస్తుండగా చోటు చేసుకుంది.కాగా, ఇవాళ ఉదయం 10:08 గంటల సమయంలో బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూలిపోయాయి. ఇందులో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసి, 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 476 పరుగుల భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. ఆతర్వాత ఐర్లాండ్ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. రెండు మ్యాచ్ల ఆ సిరీస్లో తొలి టెస్ట్ గెలిచిన బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
బంగ్లాదేశ్ లో భారీ భూకంపం.. భారత్ లోను భూప్రకంపనలు
-
వైరల్ వీడియో: బంగ్లాదేశ్లో భూకంపం.. భారత్ ప్రకంపనలు
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. బంగ్లా రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. భూకంపం ప్రకంపనల కారణంగా బంగ్లాదేశ్లో పలు భవనాలు కూలిపోయాయి.. దీంతో, ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల ప్రకారం.. బంగ్లా రాజధాని ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డిలో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పేర్కొంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ ప్రకంపనల ధాటికి భారత్లోనూ భూమి కంపించింది. కోల్కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్లోని కూచ్బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.🚨🇧🇩 BREAKING: BANGLADESH ROCKED BY 6.0 EARTHQUAKE A magnitude 6.0 earthquake struck Bangladesh early Friday, shaking the densely populated region around Dhaka.The quake hit at 4:38 GMT at a depth of 36 kilometers, with its epicenter roughly 28 kilometers northeast of the… pic.twitter.com/LC1w1RrS3z— Mario Nawfal (@MarioNawfal) November 21, 2025మరోవైపు.. ఈ భూకంపం కారణంగా బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Reportedly there is a Strong earthquake in Bangladesh, hope everyone is safe. 🇧🇩 pic.twitter.com/2spGn9yUnB— Kashif (@KashifNdmCric) November 21, 2025 #WATCH | A 5.5-magnitude earthquake struck near Narsingdi in Bangladesh, this morning.Visuals from Dhaka as the agencies work to restore damages caused by the tremors. pic.twitter.com/rqHmCggN3L— ANI (@ANI) November 21, 2025 -
బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణ.. పతనం దిశగా ప్రత్యర్ధి
ఢాకా వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ బౌలర్లు రెచ్చిపోయారు. ముష్ఫికర్ రహీం (106), లిటన్ దాస్ (128) సెంచరీల సాయంతో భారీ స్కోర్ (476) చేసిన అనంతరం ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేశారు. హసన్ మురద్ 2, ఖలీద్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ తీయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 98 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. ఆండ్రూ బల్బిర్నీ (21), పాల్ స్టిర్లింగ్ (27), కేడ్ కార్మికెల్ (17), హ్యారీ టెక్టార్ (14), కర్టిస్ క్యాంఫర్ (0) ఔట్ కాగా.. లోర్కన్ టక్కర్ (11), స్టీఫెన్ డోహ్ని (2) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఐర్లాండ్ ఇంకా 378 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు కెరీర్లో వందో టెస్ట్ ఆడుతున్న ముష్ఫికర్ సెంచరీతో కదంతొక్కాడు. మరో శతక వీరుడు లిటన్ దాస్తో కలిసి ఐదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ముష్ఫికర్ ఔటైన అనంతరం దాస్ మెహిది హసన్తో (47) కలిసి మరో కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ (63) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు మహ్మదుల్ జాయ్ (34), షద్మాన్ ఇస్లాం (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. కాగా, ఐర్లాండ్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందిన బంగ్లా 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది.చదవండి: IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు -
రహీమ్, లిట్టన్ దాస్ సెంచరీలు.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
మిర్పూర్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు అదరగొట్టారు. ముష్ఫికర్ రహీమ్(214 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 106), లిట్టన్ దాస్(192 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 128) సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా బంగ్లా జట్టు తమ తమ తొలి ఇన్నింగ్స్లో 476 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. రెండో రోజు ఆరంభంలో సెంచరీ చేసిన అనంతరం రహీమ్ పెవిలియన్కు చేరాడు. రహీమ్కు ఇది తన కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. వందో టెస్టులో సెంచరీ చేసిన 11వ ఆటగాడిగా రహీమ్ రికార్డులకెక్కాడు. ముష్ఫికర్ ఔటైన తర్వాత లిట్టన్ దాస్ దూకుడుగా ఆడి తన ఐదవ టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు.వీరిద్దరితో పాటు మోమినుల్ హక్ (128 బంతుల్లో 63; 1 ఫోర్), హసన్ జాయ్ (34), షాద్మన్ ఇస్లామ్ (35) ఫర్వాలేదనిపించారు. . కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (8) విఫలమయ్యాడు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్బ్రినె 6 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టెస్టులో ఐర్లాండ్ను ఇన్నింగ్స్ తేడాతో బంగ్లా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: యువరాజ్ ఒంటరి పోరాటం.. భారత్ను చిత్తు చేసిన అఫ్గాన్ -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్.. వందో టెస్టులో సెంచరీ
బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ తన కెరీర్లో ఆడుతున్న 100వ టెస్టులో అదరగొట్టాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రహీమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 99 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రహీమ్.. జోర్డాన్ నైల్ బౌలింగ్లో తన 13వ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఈ క్రమంలో ముష్ఫికర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వందో మ్యాచ్లో శతక్కొట్టిన 11వ ఆటగాడిగా రహీమ్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.వందో టెస్ట్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు..కొలిన్ కౌడ్రేజావిద్ మియాందాద్గార్డన్ గ్రీనిడ్జ్అలెక్ స్టీవర్ట్ఇంజమామ్ ఉల్ హక్రికీ పాంటింగ్- రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలుగ్రేమీ స్మిత్హషీమ్ అమ్లాజో రూట్- వందో టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడుడేవిడ్ వార్నర్- వందో టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడుముష్ఫికర్ రహీమ్👉అదేవిధంగా టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మొమిముల్ హక్ రికార్డును ముష్ఫికర్ సమం చేశారు. ఇద్దరూ కూడా ఇప్పటివరకు టెస్టుల్లో 13 సెంచరీలు సాధించారు.బంగ్లాదేశ్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..13 - మోమిముల్ హక్, ముష్ఫికర్ రహీమ్10 - తమీమ్ ఇక్బాల్8 - నజ్ముల్ హొస్సేన్ శాంటోప్రత్యేక జ్ఞాపిక మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన కార్యక్రమంలో ముష్ఫికర్ను ప్రత్యేకంగా సన్మానించారు. 2005లో ఇంగ్లండ్పై లార్డ్స్ టెస్టులో 18 ఏళ్ల 17 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముషి్ఫకర్... సుదీర్ఘ కెరీర్లో బంగ్లాదేశ్కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముష్ఫికర్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించింది. తొలి టెస్టు ఆడిన సహచరుల సంతకాలతో కూడిన జెర్సీతో పాటు... ప్రస్తుత మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ల సంతకాలతో కూడిన జెర్సీని అతడికి బహుమతిగా అందజేశారు. దీంతో పాటు 100 అంకెతో కూడిన ప్రత్యేక టోపీని బహుకరించారు. బంగ్లాదేశ్ తరఫున వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న తొలి ప్లేయర్ కావడంతో... గతంలో అతడితో కలిసి ఆడిన ప్లేయర్లు, కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్ దిగ్గజం
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) టెస్ట్ క్రికెట్లో మరో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వందో టెస్ట్ (ఐర్లాండ్తో రెండో టెస్ట్) ఆడుతున్న ఈ మాజీ కెప్టెన్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సెంచరీకి పరుగు దూరంలో (99 నాటౌట్) ఉన్నాడు.ముష్ఫికర్ రెండో రోజు ఈ ఒక్క పరుగు పూర్తి చేస్తే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వందో మ్యాచ్లో వంద చేసిన 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో 83 మంది 100 టెస్ట్లు పూర్తి చేసుకోగా.. బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు ముష్ఫికర్ మాత్రమే. వందో టెస్ట్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు..కొలిన్ కౌడ్రేజావిద్ మియాందాద్గార్డన్ గ్రీనిడ్జ్అలెక్ స్టీవర్ట్ఇంజమామ్ ఉల్ హక్రికీ పాంటింగ్- రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలుగ్రేమీ స్మిత్హషీమ్ అమ్లాజో రూట్- వందో టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడుడేవిడ్ వార్నర్- వందో టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడుమ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో ఇప్పటికే తొలి టెస్ట్ (బంగ్లాదేశ్ విజయం సాధించింది) పూర్తి కాగా.. ఇవాళ (నవంబర్ 19) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీంకు వందో టెస్ట్.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ 34, షద్మాన్ ఇస్లాం 35, మొమినుల్ హక్ 63, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8 పరుగులు చేసి ఔట్ కాగా.. ముష్ఫికర్ రహీం 99, లిటన్ దాస్ 47 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్బ్రైన్కే 4 వికెట్లు దక్కాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్ -
మనది టెర్రరిస్టులను కాపాడే దేశమా..? షేక్ హసీనాకు ఉరిశిక్ష... భారత్ చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
-
భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..!
భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మహిళా క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో (డిసెంబర్) జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో (FTP) భాగమైన ఈ సిరీస్కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉండింది. ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సిరీస్ జరగాల్సిన సమయంలో (డిసెంబర్ మూడో వారం) బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్ సిరీస్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) దృష్ట్యా ఈ సిరీస్ చిన్నదిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. డబ్ల్యూపీఎల్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. ఆగస్టులో భారత పురుషుల జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉండింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్ను వచ్చే ఏడాది సెప్టెంబర్కు మార్చారు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్లో ఆసీస్ను, ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్. చదవండి: బాబర్ ఆజమ్కు భారీ షాక్ -
షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..!
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.జమ్దానీ చీరలను బెంగాల్లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం. ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె. అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది. అజర్బైజాన్లో జరిగిన NAM సమ్మిట్లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది. G20 సమ్మిట్లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా. జమ్దానీ చరిత్రజమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని. అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం. గతేడాది నిరసనల టైంలో కూడా..ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్రోబ్లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..) -
షేక్ హసీనాకు మరణశిక్ష
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది. జూలై 15న విద్యార్థుల సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి 1,400 మంది మరణాలకు హసీనా కారణమయ్యారంటూ దాఖలైన కేసులో ఆమెకు మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరిచింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ మొహమ్మద్ గులామ్ మోర్తుజా మజూందార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టు గతంలోనే ఆమె పారిపోయిన నేరుస్తురాలిగా ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నిర్దయగా ఆదేశాలు జారీచేసి భద్రతబలగాల సాయంతో ఉద్యమాన్ని అణిచివేశారని, వందల మంది మరణాలకు ప్రధాన బాధ్యురాలు అని ప్రభుత్వం అందించిన సాక్ష్యాధారాలతో రూఢీ అయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ వందల మరణాలకు, ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియ హసీనాయే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైకి ఆమెకు చెందిన పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు తెగబడేలా ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం కట్టడిచేయకుండా ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. నిరసనబాటపట్టిన వేలాది మంది విద్యార్థులపై మారణాయుధాలు, హెలికాప్టర్లతో దాడులు చేయించారు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాటి హసీనా ప్రభుత్వంలో హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్షను ఖరారుచేసింది. మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్–మమూన్కు ఐదేళ్ల శిక్ష విధించింది. ఆమెను అప్పగించాలన్న తాత్కాలిక సర్కార్గత ఏడాది ఆగస్ట్ 5న దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనాను తమకు అప్పగించాలని భారత్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ భారత్కు పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమాల్లను వెంటనే బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు అప్పగించండి. గతంలో మన రెండు శాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒడంబడికను గౌరవించాల్సిందే. కోర్టు తీర్పుతో దోషులుగా నిర్ధారణ అయిన ఖైదీలను మాకు భారత ప్రభుత్వం అప్పగించాలి. దోషులు అని తేలాకకూడా వాళ్లను ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య అనిపించుకోదు. ఇలాంటి ధోరణి న్యాయబద్ధంకాదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ మేరకు మరోసారి భారత్కు అధికారికంగ లేఖ రాస్తాం. ఊచకోత కారకులకు ఇంకా ఆశ్రయం కల్పిస్తామని భారత్ మొండికేస్తే రెండుదేశాల మధ్య విరోధం పెరుగుతుంది’’ అని ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ స్పష్టంచేశారు. దీనిపై భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.తీర్పు తర్వాత పలు చోట్ల ఘర్షణలుతమ పార్టీ చీఫ్ హసీనాకు మరణశిక్ష ఖరారుచేస్తూ తీర్పు వెలువడటంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం రోడ్లమీదకొచ్చాయి. ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.ఉక్కు మహిళ నుంచి మరణశిక్ష దాకా..1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కారుతీర్పును స్వాగతిస్తూ యూనుస్ వ్యాఖ్యఢాకా: హసీనాకు పడిన మరణశిక్షను ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు యూనుస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఈరోజు బంగ్లాదేశ్ వ్యాప్తంగా, దేశానికి ఆవల సైతం ప్రతిధ్వనించేలా దేశ న్యాయస్థానాలు అత్యంత స్పష్టమైన సందేశానిచ్చాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ వర్తిస్తుందని న్యాయస్థానం మరోసారి గుర్తుచేసింది. గత జూలై, ఆగస్ట్లో ఉద్యమం వేళ ప్రాణాలు కోల్పోయిన, వేధింపులకు గురైన, ఇప్పటికీ మనోవ్యథను భరిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి కొనసాగిన అణిచివేతతో పెళుసుబారిన ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు మేం కృషిచేస్తాం’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు.హసీనాపై మోపిన కీలక ఆరోపణలు1. హత్య, హత్యాయత్నం, నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం. విద్యార్థులపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఏమాత్రం అడ్డుకోకపోవడం2. హలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో సైన్యం దాడిచేసేలా ఆదేశాలు ఇవ్వడం3. రంగ్పూర్లో బేగమ్ వర్సిటీ విద్యార్థి అబూ సయీద్ను అత్యంత దారుణంగా చంపేయడం4. ఆగస్ట్ 5న ఛంకార్పూర్లో ఆరుగురిని హత్యచేయడం, విద్యార్థులపై దాడి చేయాలని ప్రసంగాలు ఇవ్వడం5. ఆగస్ట్ 5న అషూలియాలో ఆరుగురు విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించడం, తర్వాత ఆధారాల్లేకుండా తగలబెట్టడం రాజకీయ ప్రేరేపిత తీర్పు ఇదితీర్పుపై ఘాటుగా స్పందించిన హసీనాతీర్పుపై 78 ఏళ్ల హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు. ప్రజాతీర్పు పొందని ఎన్నికల్లో గెలవని ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్రస్థాయి భావజాలం ఏ స్థాయిలో తీర్పు కళ్లకుకడుతోంది. తీర్పు పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో వెలువర్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానిగా ఎన్నికైన నన్ను, అవామీ లీగ్ రాజకీయశక్తిని నిర్వర్యీంచేసే కుట్ర ఇది. పారదర్శకంగా కేసు నడవని, సాక్ష్యాధారాలను పరిశీలించని ఇలాంటి ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులకు నేను అస్సలు భయపడను. మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ఈ తీర్పును సాకుగా చూపి అస్తవ్యస్తపాలనను అద్భుతంగా ఉందని చెప్పుకునే దుస్సాహసంచేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశ్వసనీయత లేని విచారణ!
అందరూ అనుకున్నట్టే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్’ సోమవారం మరణశిక్ష విధించింది. ఆమెతోపాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం ఇదే శిక్ష పడింది. నిరుడు ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డాక ఆమె బంగ్లా వదిలి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడామెను తమకు అప్పగించాలంటూ తాత్కాలిక ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరింది. అధికారంలో కొనసాగాలన్న లక్ష్యంతో హసీనా అనేక అవకతవకలకు పాల్పడటం, వ్యతిరేకుల్ని జైలుపాలు చేయటం, న్యాయమైన ఉద్యమాలను సైతం ఉక్కుపాదంతో అణిచేయటం వాస్తవం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి తీరుతెన్నులు కూడా ఏమంత మెరుగ్గా లేవు. ‘పేదవాళ్ల బ్యాంకర్’గా పేరు తెచ్చుకుని 2006లో నోబెల్ బహుమతి సాధించిన ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్న దాఖలా కనబడదు. తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో మతతత్వ వాదుల ప్రాబల్యం పెరిగింది. మైనారిటీ హిందువులకూ, మహిళలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులేర్ప డ్డాయి. ఆఖరికి న్యాయమూర్తులుగా పనిచేసినవారిని సైతం వేధించి, రాజీనామాలు చేయించారు. ఆరోపణలొచ్చినప్పుడల్లా అవి అవాస్తమని ప్రకటించటం తప్ప యూనస్ చేసిందేమీ లేదు. బహుశా ఇలాంటి పరిణామాల వల్ల కావొచ్చు... యూనస్కు హోంశాఖ ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఖుదాబక్ష్ చౌధురి సెలవు పేరిట ఇటీవల దేశం వదిలిపోయారు. హసీనాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంపై జరిగిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే 1,400 మంది మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. కానీ వాటిపై విచా రణ జరిపి శిక్షించటానికి తాత్కాలిక ప్రభుత్వానికి హక్కూ, అధికారం ఉన్నాయా? బంగ్లా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వం అనే ఏర్పాటే లేదు. పోనీ హఠాత్తుగా ప్రధాని దేశం విడిచిపోయారు గనుక ఆపద్ధర్మంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకున్నా, ఏడాదిలోగా ఎన్నికలు ఎందుకు జరపలేకపోయారు? అసలు హసీనాపై తీర్పు సందర్భమే కక్షపూరిత మైనది. ఈ నెల 14న తీర్పు ఇవ్వబోతున్నట్టు పక్షం రోజుల క్రితం ‘ట్రైబ్యునల్’ ప్రకటించింది. తర్వాత దాన్ని 17కు మార్చారు. ఆ తేదీ ఆమె పెళ్లి రోజు కావటం తప్ప మరేమీ కారణం లేదు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో సాధించదల్చుకున్నదేమిటో?!తూర్పు పాకిస్తాన్... బంగ్లాదేశ్గా ఏర్పడి 54 ఏళ్లవుతోంది. ఆ సందర్భంగా పాక్ పాలకులపై సాగిన పోరాటంలో పాలుపంచుకుని, బంగ్లాదేశ్ ఆవిర్భావ అనంతరం తొలి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్తో సన్నిహితంగా పనిచేసిన యూనస్ ఇప్పుడు పాక్ అను కూల శక్తులతో చేతులు కలిపారు. పాక్ నేతలకూ, సైనికాధికారులకూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అచ్చం వారిలానే మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిజానికి హసీనా, యూనస్ 2007 వరకూ కలిసి పనిచేశారు. ఆ సంవత్సరం అప్పటి అధ్యక్షుడు లాజుద్దీన్ అహ్మద్ ఆత్యయిక స్థితి ప్రకటించినప్పుడు సైన్యం తిరగబడి ఆయన్ను తొలగించింది. ఆ తర్వాత అవినీతిపై పోరాటం చేస్తామన్న సైనిక పాలకులకు యూనస్ మద్దతు పలకటంతో ఇద్దరి మధ్యా చెడింది. అటు తర్వాత ఏర్పడిన హసీనా ప్రభుత్వం యూనస్ను ఇబ్బందుల పాలు చేసింది. 172 కేసుల్లో విచారణను ఎదుర్కొనటం, ఒక కేసులో శిక్ష కూడా పడి బెయిల్పై ఉండటం వగైరాలు సాగాయి. పదవీ భ్రష్టత్వం ప్రాప్తించింది గనుక హసీనా ప్రభుత్వ అణచివేత చర్యలన్నీ ఆమెకు చుట్టుకున్నాయి. ఆ ఉద్యమం విఫలమైతే ఇవాళ విద్యార్థి నాయకులు, కొందరు రాజకీయ నాయకులు దోషులుగా నిలబడవలసి వచ్చేది. బంగ్లాలో అవామీ లీగ్ ప్రాబల్యం తగ్గి నట్టు లేదు. తీర్పు వెలువడటానికి ముందే అక్కడక్కడ హింస చోటుచేసుకుంది. సోమవారం ఢాకా పూర్తిగా స్తంభించింది. హసీనాపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరగాల్సిందే. కానీ ఆ పని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ద్వారా జరగాలి. దేశంలో ప్రజా స్వామిక వాతావరణం ఏర్పడాలి. ఇవేమీ లేని విచారణలు, శిక్షలు ప్రజల్లో విశ్వసనీయత కలిగించలేవు. -
షేక్ హసీనా భర్త ఎవరు, ఆయన దాచుకున్న అపురూపమైన గిఫ్ట్!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. హసీనాను దోషిగా నిర్ధారించిన కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో హసీనా కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా భర్త డా.ఎం.ఎ. వాజెద్ మియా (Wazed Miah) గురించి తెలుసుకుందాం.షేక్ హసీనా పుట్టుక1947 సెప్టెంబరు 28న పాకిస్థాన్లోని తుంగిపారాలో షేక్ హసీనా జన్మించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఆమె తండ్రి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేది. హసీనా ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. వీరికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కుమార్తె ఉన్నారు.2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడినుంచి తృటిలో తప్పించుకుంది హసీనా. 2006-2008 రాజకీయ సంక్షోభం మధ్య, హసీనా దోపిడీ ఆరోపణలపై అరెస్టైంది. విడుదలైన తర్వాత 2008 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీని గెలిపించి ప్రధానిగా ఎన్నికై, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన ఘనతను దక్కించుకుంది హసీనా. 2024లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం సందర్భంగా అల్లర్లు, విద్యార్థులపై అణచివేత, హింస ఆరోపణల కారణంగా ఆమెను నిరంకుశ నేతగా, దోషిగా పేర్కొంటూ కోర్టు మరణ శిక్ష విధించింది.ఉక్కు మహిళగా, తిరుగులేని నేతగాతన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్ను నడిపించి, దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ను రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న ‘ఉక్కు మహిళ’ గా పేరుగాంచిన హసీనా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. తిరుగులేని నాయకురాలిగా నిలిచింది. ప్రతిపక్ష నాయకురాలిగా కూడా ప్రజాస్వామ్యం గొంతుకగా మారింది. పలు సార్లు గృహనిర్బంధాన్ని కూడా ఎదుర్కొంది. విద్యార్థి ఉద్యమం చిలికి చిలికి గాలివానలా ముదిరి బంగ్లాదేశ్లో అశాంతి నెలకొంది. అది చివరికి హసీనాను పదవి నుండి తొలగించే స్థాయికి చేరింది. దీంతో 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ నుండి పారిపోయి అప్పటి నుండి భారతదేశంలో తలదాచుకుంది. ఎవరీ ఎంఏ వాజెద్ మియాహసీనా భర్త వాజెద్ మియా సైన్స్ రంగంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి. తన కెరీర్ మొత్తంలో, అనేక ప్రభావవంతమైన పుస్తకాలను ప్రచురించారు. అణుశాస్త్రవేత్తగా ఎంతో కృషి చేశారు. 1942, ఫిబ్రవరి 16న రంగ్పూర్లోని పిర్గంజ్లో జన్మించారు వాజెద్ మియా. ఈయనను ప్రేమగా 'సుధా మియా' అని పిలుస్తారు. రంగ్పూర్లో విద్యను పూర్తి చేసిన తర్వాత, వాజెద్ మియా భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు , రెండింటిలోనూ టాప్గా నిలిచారు. తరువాత ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుండి డిప్లొమా , UK లోని డర్హామ్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో PhD పొందారు.1963లో, మియా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగంలో చేరారు. ఇటలీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ ఫిజిక్స్లో అసోసియేట్షిప్ తర్వాత, మియా పాకిస్తాన్కు తిరిగి వచ్చాడు. అనంతరం కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రధాన శాస్త్రవేత్తగా చేరారు. అయితే, అతని భద్రతా అనుమతి రద్దు చేయడంతో అతను బంగ్లాదేశ్కు వలస వెళ్ళాడు.బంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్గా బంగ్లాదేశ్కు తిరిగి వచ్చిన తర్వాత, మియాబంగ్లాదేశ్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో గణనీయ మైన సేవలందించారు. వాటిలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ , బంగబంధు షేక్ ముజిబ్కే ఘైర్ కిచ్చు ఘటానా ఓ బంగ్లాదేశ్ ఉన్నాయి. తరువాత బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్ ఛైర్మన్ అయ్యాడు. 1999లో పదవీ విరమణ చేశాడు.వాజెద్ మియా అరెస్టుఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో, వాజెద్ మియా రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు.. 1961 నుండి 1962 వరకు,ఫజ్లుల్ హక్ ముస్లిం హాల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.అయితే 1962 తూర్పు పాకిస్తాన్ విద్యా ఉద్యమంలో పాల్గొన్నందుకు కూడా అతను అరెస్టు అయ్యాడు. కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయం తర్వాత అతను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.వాజెద్ మియా - షేక్ హసీనాల వివాహం1967 నవంబర్ 17న వాజెద్ మియాను వివాహం చేసుకుంది హసీనా. అప్పటికి బంగ్లాదేశ్లోని ప్రతికూల రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ వివాహం చాలా సన్నిహితంగా జరిగింది. ఇదీ చదవండి: మరణ శిక్ష : మాజీ ప్రధాని షేక్ హసీనా తొలి స్పందనమామగారి బహుమతిని అపురూపంగావివాహ సమయంలో, హసీనా తండ్రి రెహమాన్ జైలులో ఉన్నారు. దీంతో జైలులోంచే కొత్త జంటను ఆశీర్వదించిన ఆయన తన అల్లుడు వాజెద్కు రోలెక్స్ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దానిని వాజెద్ తన జీవితాంతం విలువైన ఆస్తిగా, అపురూపంగా దాచుకున్నాడట. వాజెద్ మియా అస్తమయంరాజకీయ కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ, షేక్ ముజిబుర్ రెహమాన్ అల్లుడు లేదా షేక్ హసీనా భర్త అని అతను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అణు శాస్త్రవేత్తగా వాజెద్ తన తెలివితేటలతో ప్రత్యేకంగా నిలిచాడు. అయితే తీవ్ర గుండె సమస్యలతో పాటు మూత్రపిండ వైఫల్యం, మధుమేహం, ఉబ్బసం , అధిక రక్తపోటుతో బాధపడుతూ 66 ఏళ్ల వయసులో వాజెద్ 2009లో కన్నుమూశాడు. గొప్ప అణు శాస్త్రవేత్తగా మియా అందించిన సేవలను గొప్పగా, నిత్యం ప్రకాశించే లైట్హౌస్గా భావిస్తారు. -
ఇప్పటికైనా హసీనాను మాకు అప్పగించండి: భారత్కు బంగ్లా లేఖ
ఢాకా: మరణశిక్ష పడ్డ తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇక అప్పగించాల్సిన తరుణం ఏర్పడిందని భారత్కు బంగ్లాదేశ్ విన్నవించింది. చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డ వారికి ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు దౌత్యపరంగా సరైనది కాదని బంగ్లా స్పష్టం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ,.. భారత్కు లేఖ రాసింది. మరణశిక్ష పడ్డ షేక్ హసీనా అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. ఇది స్నేహ పూర్వక బాధ్యత అని కూడా బంగ్లాదేశ్ లేఖ ద్వారా స్సష్టం చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఈ వ్యక్తులకు మరే ఇతర దేశం ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు న్యాయం పట్ల నిర్లక్ష్యమే అవుతుందని పేర్కొంది.కాగా ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్.. షేక్ హసీనాను దోషిగా తేల్చుతూ మరణశిక్ష విధించింది. అల్లర్ల కేసులో ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలపింది. హసీనా మానవత్వాన్ని మరిచిపోయి.. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారని, ఆమె చేతులో రక్తం నిండిపోయి ఉన్నాయని, అందుకు ఆమెకు మరణశిక్షే సరైనది అంటూ తీర్పు వెలువరించింది. అయితే హసీనా తొలిసారి స్పందించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుని పేర్కొన్నారు. తనపై కుట్రతో, రాజకీయ దురద్దేశంతో చేసిన కుట్రగా ఆమె అభివర్ణించారు. ఇదిలా ఉంచితే, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఈ క్రమంలోనే మన దేశానికి దౌత్య సమస్య మరొకటి చేరింది. ఇందులో హసీనా అప్పగింత వ్యవహారం. గత ఏడాది ఆగస్టు నుంచీ భారత్లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేయగా, ఆమె మరణశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి ‘అప్పగింత’ వ్యవహారంపై బంగ్లాదేశ్ చకచకా పావులు కదుపుతోంది. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
-
మరణ శిక్ష : మాజీ ప్రధాని షేక్ హసీనా తొలి స్పందన
ఢాకా: తనకు మరణ శిక్ష విధిస్తూ ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా(Sheikh Hasina) స్పందించారు. ఈ తీర్పు పక్షపాతంతో కూడినదనీ, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని వ్యాఖ్యానించారు. అలాగే తనపై వచ్చిన అన్ని ఆరోపణలను హసీనా తోసిపుచ్చారు. ఎన్నికే కాని తాత్కాలిక ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన న్యాయవాదులు గైర్హాజరులో తన తరపున వాదించడానికి కూడా తనకు న్యాయమైన అవకాశం ఇవ్వ లేదన్నారు. పేరుకే ఐసీటీ తప్ప అందులో అంతర్జాతీయం ఏమీలేదని విమర్శించారు. ఎపుడూ న్యాయం జరగ లేదని ఆరోపించారు. అటు తాత్కాలిక ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తుల హత్యకాండల ఉద్దేశానికి, భయానక ధోరణికి హసీనా మరణశిక్షే నిదర్శనమని అవామీ లీగ్ పార్టీ పేర్కొంది. ఢాకా అల్లర్లు: హసీనాకు మరణశిక్ష -
ఢాకా అల్లర్ల కేసు.. హసీనాకు మరణశిక్ష
ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఐసీటీ(ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ‘‘హసీనా మానవత్వాన్ని మరిచారు. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారు. ఆమె చేతులు రక్తంతో తడిచాయి. చేసిన నేరంపై ఆధారాలు ఉన్నాయి. ఆమెకు మరణశిక్షే సరి’’ అని తీర్పు సందర్భంగా ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను పునరుద్ధరించడాన్ని నిరసిస్తూ కిందటి ఏడాది జులైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే.. ఆ ఆందోళనకు హింసాత్మకంగా అణచివేశారని హసీనాతో పాటు మరో ఇద్దరిపై(మాజీ హోం మంత్రి, మాజీ పోలీస్ చీఫ్) నేరారోపణలు నమోదు అయ్యారు. తీవ్ర నేరాల దృష్ట్యా ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. విచారణ జరిపిన కోర్టు.. ‘‘బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే. ప్రధాని పదవిలో ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించారు. అంతేకాదు.. 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ను ఆమె ఆదేశించారు. .. జులై 14వ తేదీన రాత్రి ఆమె ఢాకా వర్సిటీ వీసీకి ఫోన్ చేశారు. నిరసనకారుల్ని ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘ ఆ రజాకార్లను ఉరి తీస్తా. వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నవాళ్లను కూడా చంపేస్తా. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని ఆమె అన్నారు. తక్షణమే వాళ్లను అరెస్ట్ చేయించాలని వీసీకి ఆమె సూచించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను ఆమె రెచ్చగొట్టారు. ఆ సమయంలో కోర్టులు సైతం జోక్యం చేసుకున్నాయి. అలాంటి ప్రసంగాలు చేయొద్దని ఆమెను వారించాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. .. విద్యార్థులను ఆమె కిరాతకంగా చంపించారు. వాళ్ల మృతదేహాలను తగలబెట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థి సంఘం నాయకుడు అబూ సయ్యద్ జులై 16న జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ పోస్ట్మార్టం నివేదిక విషయంలోనూ భారీ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ వైద్యుడ్ని బెదిరించి ఐదుసార్లు ఆ నివేదికను హసీనా ప్రభుత్వం మార్పించింది... ఆమెకు గరిష్ట శిక్ష(మరణశిక్ష) విధించాలని ప్రాసిక్యూషన్వాళ్లు కోరుతున్నారు. వాళ్లు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైన సరే ఆమెకు గరిష్ట శిక్షనే విధిస్తుంది అని బెంచ్లో ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.తీర్పు నేపథ్యంలో.. ఢాకా ఆర్మీ భారీగా మోహరించింది. ఇప్పటికే అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగే అవకాశం ఉండడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. అల్లా ఇచ్చిన జీవితంతీర్పు వేళ.. భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా స్పందించారు. అవామీ లీగ్ శ్రేణులను ఉద్దేశించి ఓ ఆడియో విడుదల చేశారు. ఇది అల్లా ఇచ్చిన జీవితమని.. తనకు ఎలాంటి భయం లేదని.. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందని.. ఇలాంటి తీర్పులు తననేం చేయలేవని అన్నారామె. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చారు. అవామీ లీగ్ అనేది ప్రజల్లోంచి పుట్టిందని.. అలాంటి పార్టీని నాశనం చేయాలని తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అయితే అది అయ్యే పని కాదని.. ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని హసీనా అన్నారు. -
బంగ్లాదేశ్ అతలాకుతలం.. హసీనాకు మరణశిక్ష?
ఢాకా: బంగ్లాదేశ్లో మరోసారి అతలాకుతలమైంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. నిరసనకారులు రోడ్ల మీదకు రావడంతో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) నేడు తీర్పు వెలువరించనుంది. గతేడాది విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో ఆమె అమానుష చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. హసీనా, ఆమె ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఖమాల్ను నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించి విచారణ జరిపారు. ఈ క్రమంలో భారత్లో ఉన్న హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు.- Massive protests against Muhammad Yunus Govt in Bangladesh.- Shoot at sight orders issued against anyone not agreeing with Yunus diktats.- Protestors are burning Mohammad Yunus owned Grameen Bank outlets across Bangladesh.- Protestors are asking Yunus to go back to USA.… pic.twitter.com/3VbS9pNN3Q— Incognito (@Incognito_qfs) November 16, 2025మరోవైపు.. ఐసీటీ తీర్పు నేపథ్యంలో షేక్ హసీనా అవామీ లీగ్ ఫేస్బుక్ పేజీలో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె..‘ఈ దాడులు, కేసులు కొత్తవి కావు. నాకు శిక్ష వేసినా భయపడవద్దు. వాళ్లు నన్ను విచారిస్తే చేసుకోండి. నాకు ఫర్వాలేదు. ఇది దేవుడు ఇచ్చిన జీవితం. ఏదొక రోజు మరణించాల్సిందే. కానీ నేను ప్రజల కోసం పనిచేస్తున్నా. అలాగే చేస్తూనే ఉంటా. పథకం ప్రకారం నన్ను అధికారంలో నుంచి తొలగించినట్లు యూనస్ స్వయంగా చెప్పారు. ఆయన అధికార దాహి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 7(B) ప్రకారం, ఎవరైనా బలవంతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగిస్తే శిక్షార్హులు. యూనస్ అదే చేశారు. నా మీద పెట్టిన కేసులు పూర్తిగా తప్పుడు కేసులే. కోర్టులో ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే వాళ్లపై కూడా శిక్ష ఉంటుంది. ఒక రోజు అది జరుగుతుంది. భయపడటానికి ఏమీ లేదు. నేను బతికే ఉన్నాను. నేను బతుకుతాను. దేశ ప్రజలకు నేను మద్దతు ఇస్తాను. యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ను మిలిటెంట్ రాజ్యంగా మారుస్తోంది. బంగ్లాదేశ్లో ప్రజలకు రక్షణ కరువైంది అని ఘాటు విమర్శలు చేశారు. ఇక, తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో నిరసనగా అవామీ లీగ్ నవంబర్ 17న దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది.హసీనా వీడియో సందేశం తర్వాత.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు కార్లకు నిప్పంటించారు. చెట్లను అడ్డుగా పెట్టి, ఓ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగించారు. రోడ్లపైకి పెద్ద ఎత్తు చేరి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం సైన్యం, పోలీసులతోపాటు బోర్డర్ గార్డులను రంగంలోకి దించింది. ఎవరైనా ప్రాణహాని తలపెట్టేలా ఆందోళనలు చేస్తే వారిపై కాల్పులు జరపొచ్చని పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.Today, tens of thousands of Bangladeshis gathered in Dhaka to protest against interim government leader Muhammad Yunus.BANGLADESH = IN THE TANK.Stay tuned.pic.twitter.com/YybYXjbi9y— Steve Hanke (@steve_hanke) November 17, 2025మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో: హసీనా కుమారుడుఇదిలా ఉండగా.. తీర్పు నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ స్పందిస్తూ.. మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో. తీర్పు ఏమిటో మాకు ఖచ్చితంగా తెలుసు. యూనస్ ప్రభుత్వం ఆమెను దోషిగా నిర్ధారించబోతున్నారు. నా తల్లిని ఏం చేయగలరు?. ఆమె భారత్లో సురక్షితంగా ఉంది. ఆమెకు భారత్ పూర్తి భద్రతను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే వచ్చే ఏడాది ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తీర్పు ప్రత్యక్ష ప్రసారం.. తీర్పులోని కొన్ని అంశాలను ప్రభుత్వ యాజమాన్యంలోని బీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ICT-BD అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. హసీనాను అరెస్టు చేయకపోతే లేదా 30 రోజుల్లోపు లొంగిపోకపోతే ఆమె అప్పీల్ చేయడాన్ని ICT-BD చట్టం నిషేధిస్తుందని చెప్పారు. తీర్పు ఎలా ఉన్నా అమలు చేస్తామని అని ప్రభుత్వ తాత్కాలిక సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్లో ఉన్నాయి.యూనస్ పరిస్థితి అంతే..షేక్ హసీనా ప్రభుత్వం పతనమై.. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా.. నిరసనలు, అశాంతి కొనసాగుతున్నాయి. హసీనా కూడా.. తాను బంగ్లాదేశ్కు తిరిగి రావాలంటే.. ముందుగా భాగస్వామ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని, అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని కోరారు. యూనస్ ప్రభుత్వం.. మితవాదుల మద్దతుపై ఆధారపడుతోందని ఆరోపించారు. బంగ్లా ప్రభుత్వం తన మూర్ఖపు, ఆత్మహత్యా చర్యలతో.. భారత్తో ముఖ్యమైన సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న నిరసనలు, యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ తిరుగుబాటు.. కేవలం రాజీనామా కోసం జరిగిన గత ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే కాదు. అనేక ఘర్షణల మధ్య జరుగుతున్న పోరాటం. హసీనాను గద్దె దించిన తర్వాత కూడా, తాత్కాలిక ప్రభుత్వంలో.. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడంతో, దేశం పూర్తిగా విచ్ఛిన్నమైన రాజకీయ వ్యవస్థను ఎదుర్కొంటోంది. ఈ నిరసనలు, బంగ్లాదేశ్ నిజమైన, సమ్మిళిత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు పయనించాలనే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయి. -
భారీ విజయం దిశగా బంగ్లాదేశ్
సిల్హెట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఐరీష్ జట్టు బంగ్లా కంటే ఇంకా 215 పరుగులు వెనకబడి ఉంది.రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(43) కాసేపు నిలకడగా ఆడాడు. మిగితా బ్యాటర్లంతా వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్కు క్యూ కట్టారు. బంగ్లా బౌలర్లలో ఇప్పటివరకు హసన్ మురాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలా వికెట్ సాధించారు.స్టిర్లింగ్ రనౌటయ్యాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ను 587/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్ మహముదుల్ హసన్ జాయ్(171 పరుగులు), కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(100) శతకాలతో కదం తొక్కగా.. షాద్మన్ ఇస్లామ్( 80 పరుగులు), మోమినుల్ హక్(82) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్ ఫైవ్ వికెట్ల హాల్తో సత్తాచాటాడు. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరగాలి.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
‘బంగ్లా’లో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా
ఢాకా: పొరుగుదేశం బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాపై నేడు (గురువారం) కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగ్లాదేశ్.. కాల్పులు, దేశీయ బాంబు దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇది 2024లో చోటుచేసుకున్న విద్యార్థి నిరసనలను తలపించింది. నాడు జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతిచెందారు.రాజధాని ఢాకా గురువారం పటిష్టమైన కోటగా మాదిరిగా మారింది. హసీనాకు చెందిన ‘అవామీ లీగ్ ’ ఢాకా లాక్డౌన్కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సభ్యులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద బహుళ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా రవాణాను అణువణువునా తనిఖీ చేస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండే రోడ్లలో నిశ్శబ్దం నెలకొంది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, ఆమె సహాయకులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల కేసులో నేడు (నవంబర్ 13)న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో భారతదేశానికి చేరుకున్న హసీనా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హత్య, కుట్రతో పాటు పలు ఆరోపణలున్నాయి.కాగా తాజాగా జరిగిన అల్లర్లలో నిరసనకారులు బ్రహ్మన్బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి, అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ముహమ్మద్ యూనస్ ఈ గ్రామీణ బ్యాంకును స్థాపించారు. నిరసనకారులు రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు బస్సులను తగులబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయని, ముగ్గురు గాయపడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి.రాజకీయ కార్యకలాపాల నుంచి నిషేధించిన హసీనా ‘అవామీ లీగ్’కు చెందిన 44 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఢాకా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నారాయణగంజ్లో, పార్టీకి చెందిన మరో 29 మంది నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని ఒక ఇంటి నుండి పెద్ద మొత్తంలో ముడి బాంబులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: Bihar Election: నితీష్ ఇంటి ముందు ‘టైగర్’ పోస్టర్ -
‘యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్మన్’.. హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాన సలహాదారు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్పై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఆర్థికవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న ఆయన దానిని దుర్వినియోగం చేస్తున్నారని హసీనా ఆరోపించారు. సీఎన్ఎన్- న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ యూనస్పై అంతర్జాతీయ సమాజానికున్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఆయనను అందరూ ఎన్నికకాని దేశాధినేతగా చూస్తున్నారన్నారు. అతని పరిపాలన రాజ్యాంగాన్ని కూల్చివేస్తున్నదని, మైనారిటీలను రక్షించడంలో విఫలమవుతున్నదని షేక్ హసీనా ఆరోపించారు.దేశాన్ని మతోన్మాదంగా మారుస్తూ, సామాజికంగా తిరోగమన దేశీయ ఎజెండాను అనుసరిస్తున్న యూనస్ ‘ఉగ్రవాదుల ఫ్రంట్మన్’గా ఉన్నారంటూ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మంత్రివర్గంలో రాడికల్ తీవ్రవాదులు ఉన్నారని, ఫలితంగా మైనారిటీలు అణచివేతకు గురవుతున్న వాతావరణం ఏర్పడిందని హసీనా పేర్కొన్నారు. యూనస్ ప్రజాస్వామ్య ఆధారాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తొమ్మిదిసార్లు ఎన్నికైన అవామీ లీగ్ను రాబోయే ఎన్నికల నుండి నిషేధించాలనే ఆయన నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.యూనస్ ప్రజాస్వామ్య పాలన మార్పునకు చిహ్నం కాదని, అతనికి ప్రజల్లో విస్తృత మద్దతు లేదని, అతను ఎన్నిక కాని వ్యక్తి అని హసీనా ఆరోపించారు. అందుకే ఆయన లక్షలాది మంది మద్దతు కలిగిన పార్టీని ఎన్నికల నుండి బహిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని హసీనా ఆరోపించారు. ఇతర దేశాల వారు యూనస్ను స్నేహితునిగా భావిస్తే, వారు మోసపోతున్నట్లేనని హసీనా పేర్కొన్నారు. ఆ నోబెల్ గ్రహీత తన గత రచనలతో పొందిన ఇమేజ్ను ప్రస్తుతం తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారని హసీనా ఆరోపించారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘మహిళా డాక్టర్’ను ‘డీకోడ్’ చేసిన సన్నిహితులు -
ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగితేనే..
కోల్కతా: బంగ్లాదేశ్లో ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం’పునరుద్ధరణ జరిగితేనే తాను అక్కడికి తిరిగి వెళ్తానని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా చెప్పారు. తమ అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని అన్నారు. బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పదవిచ్యుతురాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో గుర్తు తెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె తాజాగా ఓ వార్తా సంస్థకు ఈ–మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై స్పందించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజల చేత ఎన్నిక కాని మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. భారత్తో సంబంధాలు తెంచేసుకోడానికి ప్రయత్నిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు తీవ్రవాద శక్తులకు ప్రభుత్వం అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. తీవ్రవాదులు బలపడితే ప్రజలకు ముప్పు తప్పదని తేలి్చచెప్పారు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తమ ప్రభుత్వ హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య విస్తృతమైన, లోతైన సంబంధాలు ఉండేవని షేక్ హసీనా గుర్తుచేశారు. యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం వచి్చన తర్వాత ఆ సంబంధాలు నానాటికీ బలహీనపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాతో మెరుగైన సంబంధాలు ఉంటేనే బంగ్లాదేశ్ ప్రజలకు భరోసా లభిస్తుందని పరోక్షంగా స్పష్టంచేశారు. అనవసరమైన రిస్క్ చేయొద్దని యూనస్కు హితవు పలికారు. తనకు ఆశ్రయం కలి్పస్తున్నందుకు భారత ప్రభుత్వానికి హసీనా ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఇక్కడ చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయని, భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఎల్లప్పుడు కృతజు్ఞరాలినై ఉంటానని వ్యాఖ్యానించారు. ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇవ్వలేదు తాను స్వదేశానికి తిరిగి వెళ్లాలంటే అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాల్సిందేనని షేక్ హసీనా తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ ప్రజ లంతా అదే కోరుకుంటున్నారని స్పష్టంచేశా రు. అత్యధిక కాలం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన నేతగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, హింసాకాండ నేపథ్యంలో 2024 ఆగస్టు 5న పదవికి రాజీనామా చేసి, దేశం వీడి వెళ్లాల్సి వచి్చంది. అప్పటి హింసాకాండను నియంత్రించ డంలో తాము విఫలమైన మాట నిజమేనని షేక్ హసీనా అంగీకరించారు. అందుకు విచా రిస్తున్నామని చెప్పారు. ఆ దురదృష్టకర సంఘటనల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యా ర్థి సంఘాల నాయకులమని చెప్పుకొంటున్న కొందరు దుర్మార్గులు కుట్రపూరితంగా హింసను ప్రేరేపించారని మండిపడ్డారు. వారు బాధ్యతలేకుండా ప్రవర్తించారని విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికలను బహిష్కరించాలంటూ తాను పిలుపునిచి్చనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి పిలుపు తాను ఇవ్వలేదని పేర్కొన్నారు. అవామీ లీగ్ ప్రమేయం లేకుండా ఏ ఎన్నికలు జరిగినా వాటికి చట్టబద్ధత ఉండదని వెల్లడించారు. బంగ్లాదేశ్లో తమకు కోట్లాది మంది మద్దతు పలుకుతున్నారని గుర్తుచేశారు. అసలైన ప్రజాబలం ఉన్న పార్టీయే అధికారంలోకి రావాలన్నారు. అవామీ లీగ్పై నిషేధాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తేలి్చచెప్పారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీ లీగ్ పాత్ర ఉండాల్సిందేనని అన్నారు.బలహీన పాలకుడు యూనస్ బంగ్లాదేశ్కు భారత్ అత్యంత కీలకమైన అంతర్జాతీయ భాగస్వామి అని షేక్ హసీనా వివరించారు. భారత్ ఎప్పటికీ విశ్వసనీయ మిత్ర దేశమేనని చెప్పారు. మహ్మద్ యూనస్ దౌత్య విధానాలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తనన తాను ఓడించుకొనే విధానాలను ఆయన తలకెత్తుకున్నారని విమర్శించారు. యూనస్ ఒక బలహీన పాలకుడు అని తేలి్చచెప్పారు. తీవ్రవాదుల మద్దతుపై ఆధారపడి పాలన సాగిస్తున్నారని ఆక్షేపించారు. విదేశాలతో దౌత్యం విషయంలో తప్పులు చేయడం ఇకనైనా మానుకోవాలని యూనస్కు సూచించారు. పొరుగు దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అన్నారు. బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడం లేదని, భారత్ ఎప్పటికీ మిత్రదేశంగానే ఉంటుందని షేక్ హసీనా వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. న్యాయం తనవైపే ఉందని, నిర్దోíÙగా బయటపడతానని ధీమా వ్యక్తంచేశారు. బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో తనపై విచారణ ప్రారంభించడాన్ని ఆమె తప్పుపట్టారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై కుట్రలకు వేదికగా ఆ ట్రిబ్యునల్ను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తనను, తన పార్టీని అంతం చేయాలన్నదే వారి ఆసలు అజెండా అని మండిపడ్డారు. ప్రత్యర్థుల ఆటలు సాగవని స్పష్టంచేశారు. -
శతక్కొట్టిన హసన్ జాయ్.. భారీ స్కోర్ దిశగా బంగ్లాదేశ్
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ (Mahmudul Hasan joy) సెంచరీతో (125 నాటౌట్) కదంతొక్కి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (80) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. హసన్ జాయ్కు జతగా మొమినుల్ హాక్ (38) క్రీజ్లో ఉన్నాడు. షద్మాన్ వికెట్ మాథ్యూ హంఫ్రేస్కు దక్కింది.అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, హసన్ మురద్ తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీసి ఐర్లాండ్ను దెబ్బ కొట్టారు. బంగ్లాదేశ్ ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు దాటి 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.రెండు టెస్ట్లు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ సిల్హెట్ వేదికగా నవంబర్ 11న మొదలు కాగా.. రెండో టెస్ట్ ఢాకా వేదికగా నవంబర్ 19 నుంచి జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. తొలి రెండు మ్యాచ్లకు చట్టోగ్రామ్, మూడో టీ20కి ఢాకా ఆతిథ్యమివ్వనున్నాయి. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
రాణించిన బంగ్లా బౌలర్లు
రెండు టెస్ట్లు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 11) తొలి టెస్ట్ మొదలైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచేల్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.బ్యారీ మెక్కార్తీ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. తొలి రోజు ఆటలో చివరి బంతికి జోర్డన్ నీల్ ఔటయ్యాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. హ్యారీ టెక్టర్ 1, ఆండీ మెక్బ్రైన్ 5 పరుగులు చేసి ఔటయ్యారు.బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. హసన్ మురద్ 2, హసన్ మహమూద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలో వికెట్ తీశారు. కాగా, ఈ పర్యటనలో రెండో టెస్ట్ నవంబర్ 19 నుంచి ఢాకాలో జరుగుతుంది. అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. చదవండి: శ్రేయస్ గాయం.. షాకింగ్ విషయాలు -
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్కు తీవ్ర అస్వస్థత
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (Former Bangladesh Captain), ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ (Faruque Ahmed) తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్గా నిర్దారించారు. యాంజియోగ్రామ్ చేయగా, గుండె ధమనాల్లో బ్లాకేజ్ గుర్తించారు. చికిత్సలో భాగంగా స్టెంట్ వేసి పూడికను తొలగించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో (CCU) ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ఫారూఖీ 1984-1999 మధ్యలో బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలం ఆ జట్టుకు కెప్టెన్గానూ సేవలందించాడు. రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు జాతీయ సెలెక్టర్గా వ్యవహరించిన అతను.. 2024 అగస్ట్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగానూ పని చేశారు. ఈ పదవిలో 9 నెలల పాటు కొనసాగాడు. ఆతర్వాత అమినుల్ ఇస్లాం పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. 59 ఏళ్ల ఫారూఖీ ఇటీవలే బీసీబీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.ఫారూఖీ సుదీర్ఘకాలం జాతీయ జట్టులో ఉన్నా కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 105 పరుగులు చేశాడు. ఫారూఖీ కుడి చేతి వాటం బ్యాటింగ్తో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్గానూ వ్యవహరించేవాడు.చదవండి: 'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి' -
బంగ్లాకు పాక్ యుద్ధనౌక.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్?
ఢాకా: దాయాది పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. పాకిస్తాన్కు చెందిన కీలక నేతలు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.తాజాగా పాకిస్తాన్కు చెందిన నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాక్ నేవీకి చెందిన యుద్ధనౌక, PNF SAIF.. నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. ఈ విషయాన్ని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది. అయితే, 1971 తర్వాత పాక్ యుద్ధనౌక బంగ్లాదేశ్ సందర్శించడం ఇదే తొలిసారి. ఇది పాక్ కొత్త ఎత్తుగడగా భారత్ భావిస్తోంది. ఆపరేషన్ సిందూర్తో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పాక్.. బంగ్లాదేశ్ ద్వారా మన దేశాన్ని చుట్టుముట్టాలని కుట్ర పన్నుతోందని సమాచారం.ఇదిలా ఉండగా.. కెప్టెన్ షుజాత్ అబ్బాస్ రాజా నేతృత్వంలోని జుల్ఫికార్-క్లాస్ ఫ్రిగేట్ పిఎన్ఎస్ సైఫ్ (FFG-253) సద్భావన పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టుకు యుద్ధనౌక చేరుకుంది . పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీన్ అష్రఫ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అధికారిక పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్లో ఉన్న సమయంలో ఈ సందర్శన జరిగింది. మరోవైపు.. గత అక్టోబర్ ప్రారంభంలో పాక్ సైన్యంలో రెండో అత్యున్నత సైనిక కమాండర్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్ను సందర్శించారు. మీర్జా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్తో సమావేశమయ్యారు.Pakistan Navy ship PNS SAIF commanded by Captain Shujaat Abbas Raja, arrived at Chattogram Port. The ship was warmly received on behalf of Commander Chattogram Naval Area.This goodwill visit is expected to further strengthen the friendly relations between Bangladesh & Pakistan. pic.twitter.com/ajqCerieRP— Defense Technology of Bangladesh-DTB (@DefenseDtb) November 8, 2025 -
ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివారం మోంగ్కాంగ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత ఓపెనర్ బెన్ మెక్డెర్మాట్ కేవలం 14 బంతుల్లో 8 సిక్స్ల సాయంతో 51 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సూపర్ సిక్సెస్ టోర్నీ నిబంధనల ప్రకారం 50 పరుగులు చేసిన బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్'గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మెక్డెర్మాట్తో పాటు కెప్టెన్ అలెక్స్ రాస్ 11 బంతుల్లో 7 సిక్స్లు, ఒక ఫోర్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ ఏడాది సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు 20 సిక్స్లు బాదారు.తడబడిన బంగ్లా..అనంతరం బంగ్లాదేశ్ 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున అబు హైదర్ ఒంటరి పోరాటం చేశాడు. హైదర్ 18 బంతుల్లో 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రిస్ గ్రీన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్తో ఆదివారం తలపడనుంది.చదవండి: అతడు లేకపోవడం కలిసొచ్చింది.. వారి వల్లే చెలరేగుతున్నాను: అభిషేక్ -
18 ఏళ్ల తర్వాత.. కరాచీలో బంగ్లా కళాకారులు
కరాచీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైంది. బంగ్లాదేశ్ కళాకారులు 18 ఏళ్ల అనంతరం పాకిస్తాన్లో అడుగుపెట్టారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా వీరు కరాచీలో బుధవారం ప్రదర్శన ఇచ్చారు. నిహారికా ముంతాజ్ సారథ్యంలోని బంగ్లాదేశ్ బృందంలో కొందరు హిందూ కళాకారులు సైతం ఉండటం విశేషం. షిరీన్ జవాద్ పాడిన బెంగాలీ పాటలు ఆహూతులను అలరించాయి. అక్టోబర్ 30వ తేదీన మొదలైన వీరి ప్రదర్శనలు డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో 140 దేశాలకు చెందిన కళాకారులున్నారు. రెండు దేశాల నడుమ తలెత్తిన దౌత్యపరమైన రాజకీయ విభేదాల కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు పదేళ్లపాటు కొనసాగలేదు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కనిష్టస్థాయిలో కొనసాగాయి. 2024లో విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమంతో హసీనా ప్రభుత్వం పడిపోయింది. యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్తో సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి. -
బంగ్లాదేశ్ కెప్టెన్గా దేశవాలీ స్టార్
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్-ఏ జట్టును (Bangladesh-A) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా దేశవాలీ స్టార్, వికెట్కీపర్, బ్యాటర్ అయిన అక్బర్ అలీ (Akbar Ali) ఎంపికయ్యాడు.అక్బర్ అలీకి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 92 మ్యాచ్ల్లో 27.65 సగటున 1853 పరగులు చేశాడు. అతని తాజాగా ప్రదర్శనలు (40, 44, 28) కూడా పర్వాలేదనేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలైన రాజ్షాహీ, ఖుల్నా టైగర్స్ తరఫున కూడా అక్బర్ అలీ సత్తా చాటాడు.ఈ జట్టు అక్బర్తో పాటు అనుభవజ్ఞులు, యువశక్తి కలయికగా ఉంది. అబూ హీదర్ రోని, రిపోన్ మొండల్ బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరఫున సత్తా చాటారు. రోని 2016, మొండల్ 2023లో సీనియర్ టీమ్లోకి అరంగేట్రం చేశారు. యార్కర్ స్పెషలిస్ట్ అయిన రోని 13 టీ20ల్లో 6 వికెట్లు తీయగా.. మొండల్ 23 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఈ జట్టులో దేశవాలీ స్టార్లు,యువ ఆటగాళ్లు జిషన్ అలం, మహిదుల్ ఇస్లాం, అరిఫుల్ ఇస్లాం వంటి వారికి చోటు దక్కింది.ఈ టోర్నీలో బంగ్లాదేశ్తో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంగ్కాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ, హాంగ్కాంగ్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుండగా.. భారత్-ఏ, పాకిస్తాన్-ఏ, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏ తలపడనున్నాయి.టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్, ఒమన్ తలపడనుండగా.. రెండో మ్యాచ్లో భారత్, యూఏఈ ఢీకొంటాయి. నవంబర్ 15న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ హాంగ్కాంగ్ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్లోకి మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు (A1 vs B2, B1 vs A2) చేరతాయి. ఈ మ్యాచ్లు నవంబర్ 21న జరుగుతాయి. సెమీస్ విజేతలు నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.బంగ్లాదేశ్ ఏ జట్టు..అక్బర్ అలీ (కెప్టెన్), జిషాన్ అలం, హబీబుర్ రెహమాన్, జవాద్ అబ్రార్, అరిఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ చౌదరి, మహిదుల్ ఇస్లాం భుయాన్, రకీబుల్ హసన్, ఎస్ఎం మెహెరోబ్ హుస్సేన్, అబూ హిడర్ రోనీ, తుఫాయెల్ అహ్మద్, షాధిన్ ఇస్లాం, రిపోన్ మొండోల్, అబ్దుల్ గఫార్ సక్లైన్, మృత్తుంజయ్ చౌదరిచదవండి: ప్రపంచ క్రికెట్ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) ఇప్పుడు బంగ్లాదేశ్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులన్నీ ‘ఇస్కాన్’పై ఉగ్రవాద ముద్ర వేశాయి. అలాగే ఈ సంస్థపై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. గత కొంతకాలంగా ఇస్కాన్ దేవాలయంతో సహా బంగ్లాదేశ్లోని పలు హిందూ దేవాలయాలను ఇస్లాంవాదులు తగులబెట్టారు. హిందూ వ్యతిరేక నినాదాల హోరుఇస్కాన్ ను వెంటనే నిషేధించాలని కోరుతూ పలువురు మతఛాందసవాదులు బంగ్లాదేశ్ వీధుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాజధాని ఢాకా, చట్టోగ్రామ్లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలలో హిందూ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. ఇస్కాన్ ను తక్షణం బ్యాన్ చేయాలంటూ నినదించారు. ఈ నేపధ్యంలోనే చట్టోగ్రామ్తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ సమావేశాలు జరిగాయి. హెఫాజత్-ఎ-ఇస్లాం, ఇంతిఫాదా బంగ్లాదేశ్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ను నిషేధించాలని పిలుపునిచ్చిన ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్ ఎ ఇస్లాం సంస్థ గతంలో ముస్లిం మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండించింది. యూనస్ ప్రభుత్వం రాకతో..ఇటీవల ఢాకాలోని బైతుల్ ముకర్రం మసీదు సమీపంలో జరిగిన సమావేశంలో ఇంతిఫాదా బంగ్లాదేశ్ సంస్థ పలు డిమాండ్లను ప్రస్తావించింది. ఇస్కాన్ను నిషేధించడమనేది వాటిలో ప్రధానమైనది. ఢాకాకు చెందిన బంగ్లా దినపత్రిక దేశ్ రూపాంతర్ తెలిపిన వివరాల ప్రకారం అల్-ఖైదా అనుబంధ అన్సరుల్లా బంగ్లా టీం (ఏబీటీ) చీఫ్ జాసిముద్దీన్ రెహమానీ ఇటీవల ఇస్కాన్ను ఒక తీవ్రవాద సంస్థగా అభివర్ణించారు. కాగా 2024, ఆగస్టులో యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రెహ్మాన్ ను జైలు నుంచి విడుదల చేశారు. పలు నేరాలకు పాల్పడిన అవామీ లీగ్ను నిషేధించిన విధంగానే, తీవ్రవాద సంస్థగా ఇస్కాన్ను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ చట్టోగ్రామ్ ర్యాలీలో ఒక ఇస్లాం వక్త ప్రసంగించినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ పేర్కొంది.1970 నుండి నిస్వార్థ సేవలు2024, ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో ఇస్కాన్పై నిరసనలు పెరిగాయి. పలు ఇస్కాన్ దేవాలయాలు , కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. ప్రముఖ హిందూనేత కృష్ణ దాస్ ప్రభును అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 1970 నుండి బంగ్లాదేశ్లో ఇస్కాన్ నిస్వార్థ సేవలు అందిస్తోంది. 1971లో విముక్తి యుద్ధం, వరదల కాలంలో లక్షలాది మందికి ఉచితంగా ఆహారపానీయాలు అందించింది. మతంతో సంబంధం లేకుండా అక్కడి నిరుపేద పిల్లల కోసం అనేక పాఠశాలలను కూడా స్థాపించింది. వృద్ధాశ్రమాలను కూడా నిర్వహిస్తున్నది. ఇది కూడా చదవండి: బుడిబుడి అడుగులతో రోబో గోమాత -
వెస్టిండీస్ క్లీన్స్వీప్
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు... టి20 సిరీస్లో అదరగొట్టింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు చివరి మ్యాచ్లోనూ ఆతిథ్య బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. శుక్రవారం జరిగిన నామమాత్రమైన పోరులో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్జీద్ హసన్ (62 బంతుల్లో 89; 9 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. జట్టు మొత్తంలో తన్జీద్తో పాటు సైఫ్ హసన్ (22 బంతుల్లో 23; 2 సిక్స్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కెపె్టన్ లిటన్ దాస్ (6), పర్వేజ్ హుసేన్ (9), రిషాద్ హుసేన్ (3), నూరుల్ హసన్ (1), నసుమ్ అహ్మద్ (1), జాకీర్ అలీ (5) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరుకున్నారు. ఒక ఎండ్లో తన్జీద్ పాతుకుపోయినా... మరో ఎండ్లో వికెట్ల పతనం ఆగలేదు. ఒక్క బ్యాటర్ కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేయకుడానే పెవిలియన్ బాట పట్టారు. అయినా పట్టుదలతో ఆడిన తన్జీద్ జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ పడగొట్టగా... జాసెన్ హోల్డర్, ఖారీ పియర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ జట్టు 16.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రోస్టన్ చేజ్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), అకీమ్ అగస్టె (25 బంతుల్లో 50; ఒక ఫోర్, 5 సిక్స్లు) అర్ధశతకాలతో అలరించారు. వికెట్ కీపర్ అమీర్ జాంగో (34; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. బ్రాండన్ కింగ్ (8), అలిక్ అథనాజె (1) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్హుసేన్ 3 వికెట్లు పడగొట్టాడు. రోస్టన్ చేజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రొమారియో షెఫర్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
టీ20 సిరీస్ విండీస్దే
పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టుకు ఊరట లభించే విజయం దొరికింది. తొలుత జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఆ జట్టు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (అక్టోబర్ 29) జరిగిన రెండో టీ20లో విండీస్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలిక్ అథనాజ్ (52), షాయ్ హోప్ (55) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీసః ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, నసుమ్ అహ్మద్, రిషద్ హొస్సేన్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు.అనంతరం స్వల్ప స్కోర్ను విండీస్ బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. అకీల్ హోసేన్, రొమారియో షెపర్డ్ తలో 3, హోల్డర్ 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను దెబ్బకొట్టారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తంజిద్ హసన్ తమీమ్ (61) ఒంటరిపోరాటం వృధా అయ్యింది. నామమాత్రపు మూడో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 31న జరుగనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ -
సిక్సర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..!
బంగ్లాదేశ్, వెస్టిండీస్ (Bangladesh vs West Indies) జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 27) జరిగిన వన్డే మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బంగ్లా ఆటగాడు తస్కిన్ అహ్మద్ (Taskin Ahmed) సిక్సర్ కొట్టిన బంతికే ఔటయ్యాడు. బంగ్లాదేశ్ 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి ఇది జరిగింది.When you think you've won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ— FanCode (@FanCode) October 27, 2025బంగ్లా గెలుపుకు చివరి 3 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. రొమారియో షెపర్డ్ను తస్కిన్ ఎదుర్కొన్నాడు. షెపర్డ్ సంధించిన ఫుల్ లెంగ్త్ డెలివరిని తస్కిన్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. బంతిని బౌండరీ ఆవల పడగానే తస్కిన్ కాలు పొరపాటున వికెట్లను తాకింది. దీంతో బెయిల్ కింద పడి తస్కిన్ హిట్ వికెట్గా (ఆఖరి వికెట్) వెనుదిరగాల్సి వచ్చింది.ఫలితంగా బంగ్లాదేశ్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆలౌటై, 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన ఈ వన్డేలో (మొదటిది) తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.షాయ్ హోప్ (46 నాటౌట్), రోవ్మన్ పావెల్ (44 నాటౌట్), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.బంగ్లా ఇన్నింగ్స్లో తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. చదవండి: ఆసీస్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..? -
Zakir Naik: హసీనా బహిష్కరిస్తే.. యూనస్ ఆహ్వానించారు!
ఢాకా: బంగ్లాదేశ్లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్కు బంగ్లాదేశ్లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.బంగ్లాదేశ్ వివాదాస్పద నిర్ణయంవివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకర్త జకీర్ నాయక్పై భారతదేశంలో మనీలాండరింగ్తో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదేవిధంగా జకీర్ నాయక్కు బంగ్లాదేశ్లోకి ప్రవేశం లేదని ప్రకటించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత తన నిర్ణయం మార్చుకోవడం వివాదాస్పదంగా మారింది. 2016, జూలైలో రాజధాని ఢాకాలోని ‘హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్’ పై దాడి వెనుక జకీర్ నాయక్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు.. జకీర్ నాయక్ బోధనలతో ప్రేరణ పొందారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి ప్రభుత్వం జకీర్ నాయక్ను బంగ్లాదేశ్లోకి ప్రవేశించకుండా నిషేధించింది.2016లో జకీర్ నాయక్పై ఎన్ఐఏ కేసుభారతదేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అతనిపై ఉగ్రవాదం, మనీలాండరింగ్ తదితర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. ఢాకాలో ఉగ్రవాద దాడి తర్వాత అతను ఆ దేశం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్ స్పార్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించే ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నవంబర్ 28-29 తేదీలలో బంగ్లాదేశ్కు రానున్నారు. ఈ కార్యక్రమం ఢాకాలోని అగర్గావ్ ప్రాంతంలో జరగనుంది. వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో 2016లో ఎన్ఐఏ తొలిసారిగా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జకీర్ నాయక్పై కేసు నమోదు చేసింది.జకీర్ అప్పగింతకు మలేషియా సహకారం?60 ఏళ్ల జకీర్ నాయక్ 2016లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లి, అక్కడ శాశ్వత నివాస హోదాను పొందాడు.తనపై సాగుతున్నఅన్యాయమైన విచారణ నుండి సురక్షితంగా బయటపడేవరకూ తాను భారతదేశానికి తిరిగి రానని జకీర్ నాయక్ గతంలో వెల్లడించారు. కాగా తమ దేశంలో సమస్యలు సృష్టించనంత వరకు జకీర్ నాయక్ను బహిష్కరించలేమని, భారత్కు పంపే ప్రసక్తే లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఏడాది మొదట్లో భారతదేశంలోని మలేషియా హైకమిషనర్ దాతో ముజాఫర్ షా ముస్తఫా మాట్లాడుతూ జకీర్ నాయక్ అప్పగింతకు సంబంధించి భారతదేశానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం -
ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. పుతిన్ రక్షించాడా?
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి', రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.Modi’s life was under threat during SCO summit.An american operative was in Bangladesh for the job.Putin invited him to travel in his car.That was the moment 😲Assassin@tion was planned on China's land to blame China. The Russian spy agency saved him. pic.twitter.com/u9TD7pjnZj— Defense Scope🔭 (@DefeScope) October 22, 2025పుతిన్ రక్షించాడా?ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.25th October 2025. CIA Links Surface After Putin Shielded Modi During SCO Meet.According to Defence News, President Putin saved Indian Prime Minister Modi, from possible assassination attempt at hands of Western Intelligence Agencies. Speculations revolve around direct… pic.twitter.com/yCaigh7heN— Sense and Sensibility (@UNIT_Diplomat) October 25, 2025భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.మోదీ వ్యాఖ్యల అర్థమేంటి?చైనా పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Mai gaya tha isliye Tali baja rahe ho YA Laut aaya hu isliye Tali baja rahe ho?"REPORTEDLY, it was planned to turn SCO Summit into Tashkent Summit, but President Putin saved PM Modi Ji from meeting Lal Bahadur Shastri Ji's fate.Ps- China didn't have any hand in it. Same old… pic.twitter.com/3sYLogtyi1— BhikuMhatre (@MumbaichaDon) October 11, 2025ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
మరో పోరు వర్షార్పణం
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా పలు మ్యాచ్లు రద్దు కాగా... లీగ్ దశలో చివరి మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో చివరకు ఫలితం తేలకుండానే మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్లు ఖరారు అయిపోవడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ముందుగా మ్యాచ్ను 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత తిరిగి వర్షం పడటంతో 27 ఓవర్లకు తగ్గించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... శోభన (26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో రాధ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, అమన్జ్యోత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగుల వద్ద ఉన్న స్థితిలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలుమార్లు సమీక్షించిన అనంతరం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత మ్యాచ్లో సెంచరీతో మెరిసిన టీమిండియా ఓపెనర్ ప్రతీక రావల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో ఈ మ్యాచ్లో అమన్జ్యోత్ కౌర్ (15 నాటౌట్; 2 ఫోర్లు) ఓపెనర్గా బరిలోకి దిగింది. స్మృతి మంధాన (27 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. రెండు రోజుల విరామం తర్వాత... గువాహటిలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా... నవీముంబైలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్లకు వర్ష సూచన ఉంది. అయితే సెమీఫైనల్స్తోపాటు ఫైనల్ మ్యాచ్కు ‘రిజర్వ్ డే’ ఉంది. ‘రిజర్వ్ డే’ రోజున కూడా వర్షంతో మ్యాచ్లు సాధ్యంకాకపోతే లీగ్ దశలో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫైనల్కు చేరుతాయి. ఫైనల్ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.6 ప్రస్తుత ప్రపంచకప్లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్లు. శ్రీలంకలో జరిగిన 11 మ్యాచ్ల్లో ఐదు వర్షంతో రద్దయ్యాయి. తాజాగా ముంబై పోరు కూడా ఆ జాబితాలో చేరింది. -
గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి. ఢాకా వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్లో ఆతిథ్య జట్టు 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. వీరి గర్జనకు మాజీ ప్రపంచ ఛాంపియన్లు బిత్తరపోయారు.తొలుత బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. బౌలింగ్లో ప్రత్యర్దిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లోని తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ బౌలర్లు ఇదే రీతిలో చెలరేగిపోయారు. ఆ మ్యాచ్లో స్వల్ప స్కోర్ చేసినా విండీస్ను ఇంకా తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించారు. అయితే ఈసారి విండీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో విండీస్ గెలుపొందింది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు.అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది.తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో 3, మెహిది హసన్, తన్వీర్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.కాగా, ఇరు జట్ల ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
సిరీస్ డిసైడర్.. ఆరంభం అదిరినా, ఆఖర్లో తడబడిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహిదుల్ ఇస్లాం 6, రిషద్ హొసేన్ 3, నసుమ్ అహ్మద్ 1 పరుగుకు ఔటయ్యారు. ఆఖర్లో నురుల్ హసన్ (16 నాటౌట్), కెప్టెన్ మెహిది హసన్ (17) ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో బంగ్లాదేశ్, రెండో వన్డేలో వెస్టిండీస్ (సూపర్ ఓవర్) గెలిచాయి. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక -
బంగ్లాదేశ్ చెరలో విజయనగరం మత్స్యకారులు
భోగాపురం/మహారాణిపేట: విజయనగరం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్టు గార్డుల చెరలో చిక్కుకున్నారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొట్టకూటి కోసం విశాఖకు వలస వెళ్లారు. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ చేపలరేవు నుంచి మరబోటు (బోటు నెంబర్ ఎంఎం75)పై సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారితప్పి బంగ్లాదేశ్ కోస్టు గార్డ్ పరిధిలోకి ప్రవేశించారు.సిగ్నల్స్ వ్యవస్థతో గుర్తించిన అక్కడి నేవీ అధికారులు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, బోటులో జీపీఎస్ సిస్టం, ఎకో ఫైండర్ వంటి పరికరాలు చూపించారు. అయినా వారు వదిలి పెట్టలేదు. బంగ్లాదేశ్లో చిక్కుకున్న వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్కా రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, చిన్నప్పన్న ఉన్నారు.కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న తమ వాళ్లు ప్రాంతం కాని ప్రాంతంలో బందీలుగా ఉండడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందిందని జిల్లా మత్స్యకార శాఖ జేడీ లక్ష్మణరావు, డీడీ నిర్మల, ఎఫ్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ ద్వారా మత్స్యశాఖ కమిషనర్, సీఎంవోకు నివేదిక పంపామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై అధికారులను ఆరా తీశారు. మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, రోజులు గడుస్తున్నా తమ వారి జాడ తెలియక పోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉత్కంఠ సమరం.. సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్పై విండీస్ విజయం
బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య (Bangladesh Vs West Indies) ఇవాళ (అక్టోబర్ 21) ఉత్కంఠ సమరం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్పై వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది.స్పిన్నర్లకు స్వర్గధామమైన ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఊహించిన విధంగానే పిచ్ సహకరించడంతో విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.బంగ్లాదేశ్ను 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ కూడా తడబడింది. ఓ దశలో పూర్తిగా చేతులెత్తేసింది. అయితే షాయ్ హోప్ (53 నాటౌట్) టెయిలెండర్ల సహకారంతో మ్యాచ్ను చివరి బంతివరకు తీసుకొచ్చాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. ఖారీ పియెర్రీ రెండు పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విండీస్ ఓ కనీవినీ ఎరుగని రికార్డు సెట్ చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లను స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణయాత్మక చివరి వన్డే ఢాకా వేదికగానే అక్టోబర్ 23న జరుగనుంది.చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్గా ఇంకో అఫ్రిది -
చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్లు.. కుదేలైన శ్రీలంక బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 20) శ్రీలంక, బంగ్లాదేశ్ (Sri Lanka Vs Bangladesh) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరీరా (85) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆమెకు కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), నిలాక్షి డిసిల్వ (37) సహకరించారు. పై ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షోర్నా అక్తర్ (10-4-27-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. రబేయా ఖాన్ 2, నహిదా అక్తర్, నిషిత అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ తీశారు.టాస్ గెలిచాక తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శ్రీలంకకు తొలి బంతికే తెలిసింది. ఓపెనర్ విష్మి గౌతమ్ను మరుఫా అక్తర్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేసింది. అనంతరం కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), హాసిని పెరీరా (85) లంక ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు 72 పరుగులు జోడించారు. ఆతర్వాత ఆటపట్టును రబేయా ఖాన్ ఔట్ చేసింది. 28 పరుగుల వ్యవధిలో శ్రీలంక మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హాసిని, నీలాక్షి లంకను ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 74 పరుగులు జోడించారు. ఆతర్వాత లంక ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. 28 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మూడు సెమీస్ బెర్త్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.చదవండి: PAK Vs SA: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..! -
రిషాద్ ‘సిక్సర్’
మీర్పూర్: ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్లో ‘వైట్ వాష్’కు గురైన వెస్టిండీస్ జట్టు... బంగ్లాదేశ్ పర్యటనను కూడా పరాజయంతోనే ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (90 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మహిదుల్ ఇస్లామ్ (46), నజ్ముల్ హుసేన్ షంటో (32) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టగా... రోస్టన్ చేజ్, జస్టన్ గ్రీవ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులభతర లక్ష్యఛేదనలో కరీబియన్ జట్టు విఫలమైంది. బ్యాటర్లంతా తేలపోవడంతో చివరకు 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (60 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుసేన్ 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విండీస్ టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది. బ్యాటింగ్లోనూ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, 2 సిక్స్ల సాయంతో 26 పరుగులు చేసిన రిషాద్... బౌలింగ్ అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది. -
ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్లోని ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్ షాహ్జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్ నంబర్ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు -
బంగ్లాదేశ్లో మళ్లీ జనాగ్రహం
ఢాకా: బంగ్లాదేశ్లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది. నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్ జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఏమిటీ చార్టర్? మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది. -
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్తో జరిగిన మ్యాచ్లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్ఫీల్డ్ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్ చాంపియన్కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ను కూడా అందించింది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్ ఆటగాళ్లు నాలుగు క్యాచ్లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్హామ్, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డ్నర్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్; 20 ఫోర్లు) కెరీర్లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచింది. బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. -
వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్తో మ్యాచ్లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
30 ఏళ్లుగా భారత్లో ‘బంగ్లా’ ట్రాన్స్.. నకిలీ పత్రాలతో హల్చల్
ముంబై: భారత్లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్కు చెందిన ట్రాన్స్ జెండర్ను అరెస్టు చేశారు.ట్రాన్స్ జెండర్ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.ఇదిలావుండగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ‘హైదర్పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
నబీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
మూడు మ్యాచ్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో (Bangladesh) ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (111 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్హమైన సెంచరీని రనౌటై, చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) కూడా రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 99 పరుగులు జోడించారు. ఆతర్వాత జద్రాన్ సెదిఖుల్లా అటల్ (29) సాయంతో ఇన్నింగ్స్ను పటిష్ట పరిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు 74 పరుగులు జోడించారు.అయితే సెదిఖుల్లా ఔటయ్యాక ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. 76 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెటరన్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నాడు. నబీ ధాటికి ఆఫ్ఘన్ స్కోర్ రాకెట్లా పైకెళ్లి పోయింది. 249 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ పడ్డ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమే అనుకున్నారు.అయితే నబీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో నబీ 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నబీ ఇటీవల షార్జాలో కూడా ఇలాంటి సునామీ ఇన్నింగ్సే ఆడాడు. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు తొలుత పట్టు కోల్పోయినా, ఆతర్వాత పుంజుకున్నారు. సైఫ్ హసన్ 3, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం తలో 2, రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది.చదవండి: టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..? -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్ కాప్ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రయాన్ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై నెగ్గింది. సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్కు మూడో పరాజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్ (25) తొలి వికెట్కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్ నిగార్ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. షర్మిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే బ్రిట్స్ (0) వికెట్ కోల్పోగా... లారా వోల్వార్ట్ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్సెన్ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్ కాప్, ట్రయాన్ ఆరో వికెట్కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్లో పడింది. ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్ (29 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. భారత్ చేతుల్లోంచి మ్యాచ్ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. -
CWC 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (32), ఫర్జానా హాక్ (30), రూబ్యా హైదర్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేసినా.. చాలా నిదానంగా ఆడారు. వీరిలో ఫర్జానా మ్యాచ్ను చూసే వారికి విసుగు తెప్పించింది. 30 పరుగులు చేసేందుకు ఆమె ఏకంగా 76 బంతులు ఆడింది. రూబ్యా హైదర్ సైతం తాను చేసిన 25 పరుగుల కోసం 52 బంతులను ఎదుర్కొంది. హాఫ్ సెంచరీ చేసినా, షర్మిన్ అక్తర్ కూడా 77 బంతులు ఆడింది. నిగార్ సుల్తానా 42 బంతుల్లో 32 పరుగులు చేసింది. ఆఖర్లో రితూ మోనీ 8 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షోర్నా, రీతూ ఆఖర్లో వేగంగా ఆడకపోయుంటే బంగ్లాదేశ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లో ట్రయాన్, నదినే డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా నాలుగు, బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. సౌతాఫ్రికా కొద్ది రోజుల కిందట జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాపై విజయం సాధించింది. చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
Bangladesh: ‘అసలు హింసే లేదు’.. భారత్పై యూనస్ తీవ్ర ఆరోపణలు
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదని, అయితే భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. గత ఏదాది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత హిందువులపై మత పరమైన హింస జరిగిందంటూ వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను ముహమ్మద్ యూనస్ తోసిపుచ్చారు. అవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలని పేర్కొన్నారు.ఇటీవల యూఎస్ జర్నలిస్ట్ మెహదీ హసన్తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ముహమ్మద్ యూనస్.. భూ విభజన, ఇతర స్థానిక సమస్యలపై పొరుగువారితో సాధారణ ఘర్షణలు ఉన్నాయని, అయితే వీటిని మతపరంగా చిత్రీకరించకూడదన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఫేక్ వార్తలలో ఒత్తిడి తెస్తున్నదని, అందుకే వీటిపై తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హసీనా పదవీచ్యుతురాలైన వెంటనే తమ దేశంలో మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయన్నారు. హిందువుల విషయంలో యూనస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అనాగరికమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విమర్శించారని ఆయన గుర్తు చేశారు.గత నవంబర్లో దాదాపు 30 వేల మంది హిందువులు ఢాకా వీధుల్లో ర్యాలీ చేపట్టి, తమపై జరుగుతున్న దాడుల నుంచి యూనస్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహ అభియోగాలను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరారు. మరోవైపు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు పలువురు భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాగా బంగ్లాదేశ్లోని హిందువులు తమను తాము హిందువులుగా కాకుండా బంగ్లాదేశ్ పౌరులుగా భావించాలని యూనస్ విజ్ఞప్తి చేశారు. -
న్యూజిలాండ్ బోణీ
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన కివీస్ జట్టు శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సుజీ బేట్స్ (29; 6 సిక్స్లు), ప్లిమర్ (4), అమెలియా కెర్ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. ఈ దశలో కెప్టెన్ సోఫీ డివైన్ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రూక్ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు 112 పరుగులు జోడించడంతో కివీస్ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్ (25; 3 ఫోర్లు), జెస్ కెర్ (0), రోజ్మేరీ (2), ఇసాబెల్లా గేజ్ (12) వికెట్లను కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్ (25; 2 ఫోర్లు) రాణించారు. జెస్ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుతో శ్రీలంక తలపడుతుంది. -
వెస్టిండీస్ జట్ల ప్రకటన.. మెరుపు వీరుడు ఔట్
త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వేర్వేరు వెస్టిండీస్ (West Indies) జట్లను ఇవాళ (అక్టోబర్ 9) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు షాయ్ హోప్ (Shai Hope) కెప్టెన్గా కొనసాగగా.. గాయం కారణంగా మెరుపు వీరుడు ఎవిన్ లూయిస్ (Evin Lewis) ఈ సిరీస్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ప్రస్తుత భారత పర్యటనకు దూరంగా ఉన్న యంగ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మాజీ అండర్-19 కెప్టెన్ అకీమ్ ఆగస్టేకి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అకీమ్ ఇప్పటికే విండీస్ తరఫున 3 టీ20లు ఆడి ప్రతిభ చాటాడు. ఎవిన్ లూయిస్ స్థానాన్ని అకీమ్ భర్తీ చేశాడు.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. అలిక్ అథనాజ్ రెండు ఫార్మాట్లకు ఎంపిక కాగా, రామోన్ సిమ్మండ్స్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. హోల్డర్ టీ20 జట్టుకు మాత్రమే ఎంపిక కాగా.. మోటీ, సీల్స్, షెపర్డ్ రెండు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్నారు.కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన ఈ సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్లు అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్లో పర్యటిస్తాయి. ప్రస్తుతం విండీస్ టెస్ట్ జట్టు రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో చిత్తుగా ఓడిన విండీస్ టెస్ట్ జట్టు.. రేపటి నుంచి రెండో టెస్ట్ ఆడనుంది.వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, బ్లేడ్స్, కార్టీ, చేజ్, గ్రీవ్స్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పియర్, రదర్ఫోర్డ్, సీల్స్, షెపర్డ్టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, చేజ్, హోల్డర్, హోసేన్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పౌవెల్, రదర్ఫోర్డ్, సీల్స్, షెపర్డ్, సిమ్మండ్స్షెడ్యూల్:తొలి వన్డే– అక్టోబర్ 18, ఢాకా రెండో వన్డే– అక్టోబర్ 21, ఢాకా మూడో వన్డే– అక్టోబర్ 23, ఢాకా తొలి టీ20– అక్టోబర్ 27, చట్టోగ్రామ్ రెండో టీ20– అక్టోబర్ 29, చట్టోగ్రామ్ మూడో టీ20– అక్టోబర్ 31, చట్టోగ్రామ్ చదవండి: వరుసగా రెండో మ్యాచ్లో శతక్కొట్టిన ఆసీస్ ప్లేయర్ -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టీ20 సిరీస్ పరాభవానికి ప్రతీకారం
టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టి ప్రత్యర్దికి షాకిచ్చింది. యూఏఈ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లలో తొలుత బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్ చేసింది.అబుదాబీ వేదికగా నిన్న (అక్టోబర్ 8) జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఆల్రౌండర్ షోతో అదరగొట్టాడు. రషీద్ ఖాన్ (Rashid Khan) తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా అర్ద సెంచరీలతో రాణించారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఒమర్జాయ్ (9-0-40-3), రషీద్ ఖాన్ (10-0-38-3), అల్లా ఘజన్ఫర్ (9.5-1-55-2) ధాటికి 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హృదోయ్ (56), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఆట ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ద సెంచరీలతో రాణించగా.. ఒమర్జాయ్ (40), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (33 నాటౌట్) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల ఈ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే అక్టోబర్ 11న ఇదే వేదికగా జరుగుతుంది. చదవండి: World Cup 2025: పాక్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
గట్టెక్కిన ఇంగ్లండ్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలిచింది. వన్డౌన్లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్కు డీన్తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో ఆ్రస్టేలియా తలపడనుంది. -
రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) జట్లు షార్జా, అబుదాబీ వేదికలుగా మూడు మ్యాచ్ల టీ20, వన్డేల్లో సిరీస్ల్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 2) తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ (40), మొహమ్మద్ నబీ (38) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్, రిషద్ చరో 2 వికెట్లు తీయగా.. తస్కిన్, నసుమ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 152 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్కు శుభారంభం లభించినా, ఆతర్వాత రషీద్ ఖాన్ (Rashid Khan) (4-0-18-4) తన స్పిన్ మాయాజాలంతో వారిని వణికించాడు. ఓపెనర్లు తంజిద్ (51), పర్వేజ్ ఎమోన్ (54) అర్ద సెంచరీలతో రాణించి తొలి వికెట్కు 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత రషీద్ ధాటికి 8 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఎట్టకేలకు నురుల్ హసన్ (23 నాటౌట్), రిషద్ హొసేన్ (14 నాటౌట్) బంగ్లాదేశ్ను విజయతీరాలకు చేర్చారు. మరో 8 బంతులు మిగిలుండగా ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). ఈ సిరీస్లో రెండో టీ20 ఇవాళే (అక్టోబర్ 3) జరుగనుంది. చదవండి: World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's World Cup 2025) సంచలనం నమోదైంది. పాకిస్తాన్ను (Pakistan) వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ (Bangladesh) చిత్తుగా ఓడించింది. కొలొంబో వేదికగా నిన్న (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 389.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు.పాక్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రుబ్యా హైదర్ (54) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాదేశ్ను గెలిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (23), శోభన మోస్తరి (24 నాటౌట్) రుబ్యాకు సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, డయానా బేగ్, రమీన్ షమీమ్కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.చదవండి: IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణ.. 129 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 2) పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో పాక్ 38.3 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు. కాగా, ప్రస్తుత ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. టోర్నీ ఓపెనర్లో ఆతిథ్య దేశాలు గౌహతిలో తలపడ్డాయి. ఇందులో భారత్ శ్రీలంకపై 59 పరుగుల తేడతో గెలుపొంది బోణీ కొట్టింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో రేపు (అక్టోబర్ 3) ఇంగ్లండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అక్టోబర్ 4న శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 5న కొలొంబో వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్లో భారత్ ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ పాక్పై మూడుసార్లు గెలుపొందింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ను నిరాకరించారు. టోర్నీ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పీసీబీ ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది. దీంతో చిర్రెత్తిపోయని ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ ట్రోఫీ సహా భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను ఎత్తుకెళ్లిపోయారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. చదవండి: చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా -
స్వల్ప ఆందోళనల నడుమ.. బంగ్లాలో వైభవంగా దుర్గా పూజలు
ఢాకా: బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు అత్యంత ఘనంగా దుర్గా పూజలను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించింది. చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో ఆదివారం దుర్గాదేవిని స్వాగతించడానికి భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. మారుమోగిన దుర్గాదేవి మంత్రాలు, డప్పు చప్పుళ్లు, శంఖు నాదాలు, ఆలయ గంటల నడుమ అమ్మవారిని ఆహ్వానించారు. మహా షష్టి రోజున దేవత ముఖాన్ని ఆవిష్కరించడంతో పండుగ మొదటి రోజు ఉత్సవం ప్రారంభమైందని స్థానికులు తెలిపారు. ‘ఈ ఏడాది పూజలను అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నాం’ అని బంగ్లాదేశ్ పూజా వేడుకల మండలి అధ్యక్షుడు బసుదేవ్ ధార్ మీడియాకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా పూజా మండపాల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన అన్నారు.ఇప్పటివరకు 11 దుర్గామండపాల వద్ద చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయని, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అరెస్టు చేశారని బసుదేవ్ ధార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 33,350 మండపాలలో దుర్గా పూజలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్బాద్ సంస్థ (బీఎస్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం దుర్గా పూజల నేపధ్యంలో దేశమంతటా దాదాపు రెండు లక్షల మంది పారా పోలీస్ సిబ్బంది, 15 వేల మందికి పైగా పారా మిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన 430 ప్లాటూన్లను నియమించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు 70 వేల మందికి పైగా పోలీసుల పహారా కాయనున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ దుర్గా పూజల సన్నాహాలు వీక్షించేందుకు డాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. -
Bangladesh: గిరిజన బాలికపై సామూహిక అకృత్యం.. నిరసనల్లో ముగ్గురు మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత హింస చెలరేగింది. అక్కడి చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస చెలరేగింది.బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు. -
Asia Cup 2025: భారత్ ప్రత్యర్థి పాక్
దుబాయ్: ‘చేతులు’ కలుపుకోలేని దాయాదులే టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్తో అమీతుమీకి పాకిస్తాన్ అర్హత సంపాదించింది. ఆదివారం ఈ తుది సమరం జరుగుతుంది. ఓవరాల్ ‘ఆసియా’ కప్ చరిత్రలో ఇరుజట్లు తొలిసారి ఫైనల్లో పోటీపడనున్నాయి. సెమీస్ కానీ సెమీస్ను తలపించిన సూపర్–4 మ్యాచ్లో పాకిస్తాన్ 11 పరుగులతో బంగ్లాదేశ్పై గెలిచింది. సాధారణంగా విధ్వంసరచన చేసే టి20 ఫార్మాట్ను ఈసారి బౌలర్లు శాసించారు. దీంతో 40 ఓవర్లలోనే 17 వికెట్లు కూలాయి. ముందుగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హరిస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. షాహిన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీయగా, సయీమ్ అయూబ్కు 2 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్లో తడబడి... బౌలింగ్తో గట్టెక్కి పాకిస్తాన్ బ్యాటింగ్లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు ఫర్హాన్ (4), ఫఖర్ జమన్ (13), సయీమ్ అయూబ్ (0) చేతులెత్తేశారు. తర్వాత తలత్ (3) కూడా వారిని అనుసరించగా, కెపె్టన్ సల్మాన్ ఆగా (23 బంతుల్లో 19; 2 ఫోర్లు), మొహమ్మద్ హరిస్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. నవాజ్ (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్లు), షాహిన్ అఫ్రిది (13 బంతుల్లో 19; 2 సిక్స్లు) 20 ఓవర్ల కోటా ఆడేందుకు దోహదపడ్డారు. బంగ్లా బౌలర్లు పాక్ను ఎలా దెబ్బకొట్టారో అదే బౌలింగ్ ఆయుధంతో పాకిస్తాన్ కూడా బంగ్లాను వణికించింది. షాహిన్ అఫ్రిది ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ (0)ను... కాసేపటికి వన్డౌన్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ (5)ని అవుట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ సైఫ్ హసన్ (18)ను రవూఫ్, మెహదీ హసన్ (11)ను నవాజ్ అవుట్ పెవిలియన్ చేర్చడంతో 44 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్లు) ఆశలు రేపినా... షాహిన్ అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్తో తుంచేశాడు. కెపె్టన్ జాకిర్ అలీ (5), తంజిమ్ హసన్ (10), తస్కిన్ అహ్మద్ (4)లు కూడా పాక్ బౌలర్లకు తలవంచడంతో వందలోపే (97/8) ఎనిమిది వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. -
ఫైనల్లో భారత్
అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్... ఆపై పదునైన బౌలింగ్... వెరసి ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్లో కాస్త తడబాటు కనిపించినా, చివరకు బంగ్లాదేశ్ను ఓడించడంలో టీమిండియా సఫలమైంది. టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన మన జట్టు దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది. గత మ్యాచ్లో శ్రీలంకపై స్ఫూర్తిదాయ ఆటను కనబర్చిన బంగ్లాదేశ్ ఈసారి టీమిండియా ముందు నిలవలేకపోయింది. ఇక భారత్తో తుది పోరుతో అమీతుమీ తలపడే జట్టేదో నేడు తేలనుంది. విరామం లేకుండా వరుసగా రెండో రోజు ఆడనున్న బంగ్లాదేశ్... పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజేతకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ‘సూపర్–4’ దశలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు) మరో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (51 బంతుల్లో 69; 3 ఫోర్లు, 5 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఇద్దరు మినహా మిగతా బంగ్లా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, వరుణ్ చెరో 2 వికెట్లు తీశారు. మధ్య ఓవర్లలో తడబాటు... భారత ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లలో ప్రశాంతత... ఒకే ఒక ఫోర్తో 17 పరుగులే వచ్చాయి! 7 పరుగుల వద్ద అభిషేక్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ జాకీర్ వదిలేయడం కూడా కలిసొచ్చిoది. అయితే పవర్ప్లేలో మిగిలిన 3 ఓవర్లలో అభిషేక్ విశ్వరూపం చూపించగా, గిల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. నసమ్ వేసిన నాలుగో ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టగా చివరి బంతిని అభిషేక్ సిక్స్ బాదాడు. ముస్తఫిజుర్ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన అభిషేక్...సైఫుద్దీన్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ మూడు ఓవర్లలో కలిపి 55 పరుగులు రావడంతో పవర్ప్లేలో స్కోరు 72 పరుగులకు చేరింది. అయితే పవర్ప్లే తర్వాత భారత్ అనూహ్యంగా తడబడింది. ఒక వైపు 25 బంతుల్లోనే అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మరోవైపు ఆరు పరుగుల వ్యవధిలో గిల్, శివమ్ దూబే (2) అవుటయ్యారు. జోరు మీదున్న అభిషేక్ ఇన్నింగ్స్ కూడా దురదృష్టవశాత్తూ రనౌట్తో ముగిసింది. ముస్తఫిజుర్ వేసిన బంతిని సూర్యకుమార్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... ఫీల్డర్ ఆపిన విషయాన్ని గుర్తించని అభిషేక్ చాలా ముందుకు దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోగా, అదే ఓవర్లో సూర్య కూడా అవుటయ్యాడు. తిలక్ వర్మ (5) విఫలం కాగా, 22 బంతుల పాటు భారత్కు బౌండరీనే రాలేదు! ఈ దశలో పాండ్యా దూకుడు జట్టుకు కాస్త మెరుగైన స్కోరును అందించింది. అయితే చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. అక్షర్ (15 బంతుల్లో 10) బంతులు వృథా చేయగా... ప్రధాన బ్యాటర్ సంజు సామ్సన్కు ఆడే అవకాశమే ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టపటపా... ఛేదనలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించలేకపోయింది. సైఫ్ మినహా ఎవరూ ప్రభావం చూపలేదు. అక్కడక్కడ కొన్ని చక్కటి షాట్లు ఆడినా బ్యాటింగ్ బృందం సమష్టిగా విఫలమైంది. ఆరంభంలోనే తన్జీద్ (1) వెనుదిరగడంతో సైఫ్, పర్వేజ్ (21) కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 30 బంతుల్లో 42 పరుగులు జోడించారు. పవర్ప్లేలో జట్టు 44 పరుగులు చేసింది. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే పర్వేజ్ను అవుట్ చేయడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాటర్లు అవుట్ కావడంతో గెలుపుపై జట్టు ఆశలు కోల్పోయింది. మరో ఎండ్లో సైఫ్ పోరాడినా లాభం లేకపోయింది. 36 బంతుల్లో సైఫ్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. బంగ్లా 18 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.150 అంతర్జాతీయ టి20ల్లో ముస్తఫిజుర్ వికెట్ల సంఖ్య. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షకీబ్ అల్ హసన్ (149)ను అతను అధిగమించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (రనౌట్) 75; గిల్ (సి) తన్జీద్ (బి) రిషాద్ 29; దూబే (సి) తౌహీద్ (బి) రిషాద్ 2; సూర్యకుమార్ (సి) జాకీర్ (బి) ముస్తఫిజుర్ 5; పాండ్యా (సి) తన్జీద్ (బి) సైఫుద్దీన్ 38; తిలక్ (సి) సైఫ్ (బి) తన్జీమ్ 5; అక్షర్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–77, 2–83, 3–112, 4–114, 5–129, 6–168. బౌలింగ్: తన్జీమ్ 4–0–29–1, నసుమ్ 4–0–34–0, ముస్తఫిజుర్ 4–0–33–1, సైఫుద్దీన్ 3–0–37–1, రిషాద్ 3–0–27–2, సైఫ్ 2–0–7–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) అక్షర్ (బి) బుమ్రా 69; తన్జీద్ (సి) దూబే (బి) బుమ్రా 1; పర్వేజ్ (సి) అభిషేక్ (బి) కుల్దీప్ 21; తౌహీద్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 7; షమీమ్ (బి) వరుణ్ 0; జాకీర్ (రనౌట్) 4; సైఫుద్దీన్ (సి) తిలక్ (బి) వరుణ్ 4; రిషాద్ (సి) తిలక్ (బి) కుల్దీప్ 2; తన్జీమ్ (బి) కుల్దీప్ 0; నసుమ్ (నాటౌట్) 4; ముస్తఫిజుర్ (సి) అక్షర్ (బి) తిలక్ 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–65, 4–74, 5–87, 6–109, 7–112, 8–112, 9–116, 10–127. బౌలింగ్: పాండ్యా 2–0–14–0, బుమ్రా 4–0–18–2, వరుణ్ 4–0–29–2, కుల్దీప్ 4–0–18–3, అక్షర్ 4–0–37–1, దూబే 1–0–10–0, తిలక్ 0.3–0–1–1. -
మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్
-
భారత్కు ఎదురుందా!
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అలవోక విజయాలతో దూసుకెళుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సైతం ఎలాంటి పోటీ ఎదురవలేదు. లీగ్ దశ, సూపర్–4లోనూ పాక్పై టీమిండియా దాదాపు ఏకపక్ష విజయాల్నే సాధించింది. ఇపుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. భారత్ ప్రస్తుతమున్న ఫామ్కు, జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేయడం అసాధ్యమనుకోవాలి. అయితే ఫలితాన్ని పక్కనబెట్టి పోటీ ఏమాత్రం ఇస్తుందనేదే వేచి చూడాలి. మరోవైపు ‘సూపర్–4’లో శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో దుర్బేధ్యమైన భారత్తో తలపడేందుకు సిద్ధమైంది. ‘సూపర్–4’లో బోణీ కొట్టిన ఇరు జట్ల మధ్య ఈ పోరు జరుగుతుండటంతో పైచేయి సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది. ఆల్రౌండ్ సత్తాతో... బ్యాటింగ్, బౌలింగ్లో టీమిండియా ఆటగాళ్లకు ఎదురేలేదు. పాక్తో గత మ్యాచ్లో ఫీల్డింగ్ లోపాలు మినహా ఏ విభాగంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే లేనేలేదు. బాల్య మిత్ర ద్వయం శుబ్మన్, అభిషేక్ శర్మలు అలవోకగా పరుగులు బాదేస్తున్నారు. సారథి సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, హార్దిక్ పాండ్యాల నుంచి శివమ్ దూబే, ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ వరకు పరుగులు సాధించగలరు. ఇక బౌలింగ్లో భారత్ స్పిన్కు ప్రత్యర్థులే చిత్తవుతున్నారు. కుల్దీప్, వరుణ్, అక్షర్లతో పాటు పార్ట్ టైమ్ బౌలర్ దూబే కూడా ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణిగా ఉన్న టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం ముమ్మాటికి కష్టమనే చెప్పాలి. దీంతో ఈ టోర్నీలో భారత్కు వరుసగా ఐదో విజయం ఏమంత కష్టం కానేకాదు! సర్వశక్తులు ఒడ్డినా... టి20ల్లో అజేయమైన శక్తిగా ఎదిగిన భారత్ను ఓడించడం బంగ్లాదేశ్ లాంటి జట్లకైతే అసాధ్యం. సర్వశక్తులు ఒడ్డినా సరే పాక్ కంటే మెరుగైన పోటీ ఇవ్వగలదేమో కానీ గెలుపుపై మాత్రం ఆశలైతే పెట్టుకోలేదు. బ్యాటింగ్లో టాపార్డర్ బ్యాటర్లు సైఫ్ హసన్, తంజిద్ హసన్, కెప్టెన్ లిటన్ దాస్లు రాణిస్తున్నారు. తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకిర్ అలీలు మిడిలార్డర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వగలరు. ఇక బౌలింగ్లో ముస్తఫిజుర్ కీలకం. మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్లు కూడా పిచ్ సహకరిస్తే ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. 16 భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో భారత్ గెలుపొందగా... ఒక్క మ్యాచ్లో మాత్రమే బంగ్లాదేశ్ నెగ్గింది. 2019లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్పై బంగ్లాదేశ్ ఏకైక విజయాన్ని అందుకుంది. -
ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు
ఆసియా కప్-2025లో (Asia cup 2025) బంగ్లాదేశ్ (Bangladesh) ఓ మోస్తరు ప్రదర్శనలతో ముందుకెళ్తుంది. గ్రూప్ దశలో హాంగ్కాంగ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఆ జట్టు.. ఈ దశలో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఆ జట్టు రేపు జరుగబోయే వారి రెండో సూపర్-4 మ్యాచ్లో పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాల్సి ఉంది (India Vs Bangladesh). ఈ మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) టీమిండియాపై (Team India) అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకపై గాలివాటంగా లభించిన గెలుపును (వాపును) చూసుకొని బలుపులా భావిస్తున్న అతను.. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టైన టీమిండియాతోనే మైండ్గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ప్రతి జట్టుకి భారత్ను ఓడించే సామర్థ్యం ఉందంటూ అతి వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యం కాని, రికార్డులు కాదంటూ బీరాలు పలికాడు.భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు అయ్యుండొచ్చు, మేము మా బెస్ట్ క్రికెట్ ఆడి వాళ్ల నుంచి తప్పులు రాబడతామని అతి విశ్వాసం ప్రదర్శించాడు. మేము శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు కాదు, టోర్నీని గెలిచేందుకు వచ్చామని గొప్పలు పోయాడు.రేపు భారత్తో, ఆతర్వాతి రోజు (సెప్టెంబర్ 25) పాకిస్తాన్తో ఆడటంపై మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఆడటం ఏ జట్టుకైనా కష్టమే అని అన్నాడు. మా పట్ల ఇలా జరగడం అన్యాయమని వ్యాఖ్యానించాడు.సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తాహతకు మించినవిగానే అనిపిస్తున్నప్పటికీ.. వారిలోని ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. కొందరు భారత అభిమానలు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, చాలామంది లైట్గా తీసుకుంటున్నారు.ఆమాత్రం జోష్తో బరిలోకి దిగితేనే టీమిండియాకు కనీస పోటీ అయినా ఇవ్వగలదని అంటున్నారు. సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా, సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగా లక్ష్యాన్ని చేరుకుంది. వాస్తవానికి బంగ్లాదేశ్కు ఈ గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. కాస్త అటు, ఇటు అయ్యుంటే శ్రీలంకనే గెలిచేది. చివరి ఓవర్లో గెలుపుకు 5 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. నసుమ్ అహ్మద్ ఐదో బంతికి రిస్క్ చేసి సింగిల్ తీయడంతో ఆ జట్టు గెలుపు ఖరారైంది. చదవండి: యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన -
Bangladesh: ఢాకాలో డెంగ్యూ దడ.. ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాలు
ఢాకా: బంగ్లాదేశ్ను డెంగ్యూ వ్యాధి పట్టిపీడిస్తోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలు సంఖ్య ప్రభుత్వానికి దడ పుట్టిస్తోంది. దేశంలో డెంగ్యూ కారణంగా ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాల సంఖ్య నమోదైంది. దీర్ఘకాలిక రుతుపవన పరిస్థితులు, దోమల విజృంభణ కారణంగా డెంగ్యూ వ్యాప్తి మరింత తీవ్రమవుతున్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం, నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించడం ద్వారా డెంగ్యూను తరిమికొట్టవచ్చని వారు సూచిస్తున్నారు.బంగ్లాదేశ్లో డెంగ్యూ కారణంగా గడచిన 24 గంటల్లో 12 మంది మృతిచెందారు. రాజధాని ఢాకాలో కొత్తగా 700 కేసులు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 179 డెంగ్యూ బారిన పడి మృతిచెందగా, 42 వేల మంది డెంగ్యూ బారిన పడ్డారని పేర్కొంది. అధిక సంఖ్యలో పిల్లలు డెంగ్యూ బారినపడి ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. బాధితులలో చాలామంది అధిక జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన నిర్జలీకరణతో బాధపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో నిర్లక్ష్యం తగదని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎబిఎం అబ్దుల్లా తెలిపారు.2023లో దేశంలో డెంగ్యూ కారణంగా రెండువేల మంది మరణించారు. మూడు లక్షల21వేల మందికి పైగా జనం వ్యాధి బారిన పడ్డారు. డెంగ్యూ వైరస్ సాధారణంగా మధ్య , దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్ దీవులతో సహా ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. డెంగ్యూ జ్వరం లక్షణాలు దోమ కాటు తర్వాత నాలుగు నుండి 10 రోజుల తర్వాత కనిపిస్తాయి. దోమ కాటు బారినపడకుండా ఉండటమే డెంగ్యూ నివారణకు ఉత్తమమార్గమని వైద్యులు సూచిస్తున్నారు. -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్.. అడుగు దూరంలో ముస్తాఫిజుర్
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 20) జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించాడు.షకీబ్ 129 మ్యాచ్ల్లో 13 హాఫ్ సెంచరీల సాయంతో 2551 పరుగులు చేయగా.. దాస్ 114 మ్యాచ్ల్లో 15 హాఫ్ సెంచరీల సాయంతో 2556 పరుగులు చేశాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (4231) పేరిట ఉంది.ముస్తాఫిజుర్ మరో వికెట్ దూరంలో..!శ్రీలంకతో మ్యాచ్కు ముందు వరకు బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు షకీబ్ అల్ హసన్ పేరిట సోలోగా ఉండేవి. ఈ మ్యాచ్లో షకీబ్ పేరిట ఉండిన అత్యధిక పరుగుల రికార్డును లిట్టన్ దాస్ బద్దలు కొట్టగా.. ఇదే మ్యాచ్లో షకీబ్ పేరిటే ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును ముస్తాఫిజుర్ రెహ్మాన్ సమం చేశాడు. లంకతో మ్యాచ్లో 3 వికెట్లు తీసిన తర్వాత ముస్తాఫిజుర్, షకీబ్ తలో 149 వికెట్లతో సమంగా ఉన్నారు. ముస్తాఫిజుర్ మరో వికెట్ తీస్తే బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరిస్తాడు. -
Asia cup2025: బంగ్లాదేశ్ సంచలన విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. లీగ్ దశలో తమను చిత్తు చేసిన శ్రీలంకను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో బంగ్లా 4 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దసున్ షనక (37 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా, కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించాడు. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లతో లంకను దెబ్బ తీయగా, మెహదీ హసన్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. సైఫ్ హసన్ (), తౌహీద్ హృదయ్ () అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించారు. బ్యాటింగ్ తడబాటు... శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు వీరిద్దరు 30 బంతుల్లో 44 పరుగులు జోడించారు. పవర్ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో మెండిస్, కామిల్ వెనుదిరిగారు. ఈ దశలో క్రీజ్లోకి వచి్చన షనక జట్టును ఆదుకున్నాడు. ఫోర్తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అతను ఆ తర్వాతా జోరు కొనసాగించాడు. కుశాల్ పెరీరా (16) వెనుదిరిగిన తర్వాత షనక, కెపె్టన్ అసలంక (21) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నసుమ్ ఓవర్లో షనక ఒక ఫోర్, 2 భారీ సిక్స్లతో చెలరేగగా, తస్కీన్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతులను అసలంక సిక్స్, ఫోర్గా మలిచాడు. షరీఫుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన షనక 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్ భాగస్వామ్యం 57 పరుగులకు (27 బంతుల్లో) చేరిన తర్వాత దురదృష్టవశాత్తూ అసలంక రనౌట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో కమిందు (1), హసరంగ (2)లను ముస్తఫిజుర్ అవుట్ చేశాడు. తస్కీన్ వేసిన ఆఖరి ఓవర్లో షనక ఫోర్, సిక్స్తో స్కోరును 160 దాటించాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి ఓవర్లోనే తన్జీద్ హసన్ (0) అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఛేదన పేలవంగా మొదలైంది. అయితే సైఫ్, కెపె్టన్ లిటన్ దాస్ (16 బంతుల్లో 23; 3 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. పవర్ప్లేలో స్కోరు 59 పరుగులకు చేరింది. సైఫ్ వరుసగా మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్తో ధాటిని ప్రదర్శించగా, చమీరా ఓవర్లో దాస్ 2 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్కు 34 బంతుల్లో 59 పరుగులు జోడించారు. అనంతరం తౌహీద్తో సైఫ్ భాగస్వామ్యం కొనసాగింది. 36 బంతుల్లోనే సైఫ్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. అనంతరం మరో భారీ షాట్కు ప్రయతి్నంచి హసరంగ బౌలింగ్లో సైఫ్ వెనుదిరిగాడు. మూడో వికెట్కు సైఫ్, తౌహీద్ 45 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. కమిందు ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది తౌహీద్ బంగ్లాను వేగంగా లక్ష్యం దిశగా నడిపించాడు. 31 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. విజయానికి 10 పరుగుల దూరంలో తౌహీద్ అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ ఎదురైనా, చివరకు బంగ్లా గట్టెక్కింది.స్కోరు వివరాలుశ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) సైఫ్ (బి) తస్కీన్ 22; కుశాల్ మెండిస్ (సి) సైఫ్ (బి) మెహదీ 34; కామిల్ (బి) మెహదీ 5; కుశాల్ పెరీరా (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 16; షనక (నాటౌట్) 64; అసలంక (రనౌట్) 21; కమిందు మెండిస్ (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 1; హసరంగ (సి) తన్జీద్ (బి) ముస్తఫిజుర్ 2; వెలలాగె (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–44, 2–58, 3–65, 4–97, 5–154, 6–156, 7–158. బౌలింగ్: షరీఫుల్ 4–0–49–0, నసుమ్ 4–0–36–0, తస్కీన్ 4–0–37–1, మెహదీ హసన్ 4–0–25–2, ముస్తఫిజుర్ 4–0–20–3. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) వెలలాగె (బి) హసరంగ 61; తన్జీద్ (బి) తుషార 0; లిటన్ దాస్ (సి) నిసాంక (బి) హసరంగ 23; తౌహీద్ (ఎల్బీ) (బి) చమీరా 58; షమీమ్ (నాటౌట్) 14; జాకీర్ (బి) షనక 9; మెహదీ హసన్ (సి) కుశాల్ మెండిస్ (బి) షనక 0; నసుమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 169.వికెట్ల పతనం: 1–1, 2–60, 3–114, 4–159, 5–168, 6–168. బౌలింగ్: నువాన్ తుషార 4–0–42–1, చమీరా 4–0–32–1, వెలలాగె 4–0–36–0, హసరంగ 4–0–22–2, షనక 2.5–0–21–2, కమిందు 1–0–16–0. -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
Asia Cup 2025: రోహిత్, రహానే సరసన బంగ్లాదేశ్ ఓపెనర్లు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 13) శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే ఔటైన వారిద్దరు.. టీ20 ఆసియా కప్ చరిత్రలో డకౌటైన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, బంగ్లాదేశ్కే చెందిన మరో ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ మిధున్, సౌమ్య సర్కార్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ ఇలాంటి చెత్త ప్రదర్శన (డకౌట్లు) చేశారు. తాజా ఉదంతంతో తంజిద్-పర్వేజ్ జోడీ రోహిత్, రహానే సరసన చేసింది.కాగా, నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో నువాన్ తుషార (4-1-17-1), చమీరా (4-1-17-1), హసరంగ (4-0-25-2) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పని పట్టారు. బంగ్లా ఇన్నింగ్స్కు ఓపెనర్లు తంజిద్, పర్వేజ్ డకౌటై చెత్త ఆరంభాన్ని ఇచ్చారు. లిట్టన్ దాస్ (28), జాకిర్ అలీ (41 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (42 నాటౌట్) అతి కష్టం మీద పరుగులు చేసి బంగ్లాదేశ్కు ఆమాత్రం స్కోరైనా అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (50), కమిల్ మిషారా (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
Asia Cup 2025: బంగ్లాదేశ్ శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీని బంగ్లాదేశ్ సునాయాస విజయంతో మొదలుపెట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి గెలిచింది. తమ తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన హాంకాంగ్కు ఇది వరుసగా రెండో పరాజయం. ఓపెనర్ అన్షుమన్ రథ్ (4) తొందరగానే వెనుదిరిగినా... మరో ఓపెనర్ జీషాన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో హాంకాంగ్కు తగిన ఆరంభాన్ని అందించాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ హయత్ (14) విఫలం కాగా, నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదలగా క్రీజ్లో నిలిచి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తాను ఆడిన 32వ బంతికి గానీ అతను తన తొలి బౌండరీ కొట్టలేకపోయాడు! చివర్లో కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు హాంకాంగ్కు చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. బంగ్లా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 3–13 మధ్య ఆడిన 11 ఓవర్లలో ఒక్క ఓవర్లో మాత్రమే హాంకాంగ్ రెండంకెల స్కోరు చేయగలిగింది. అయితే ఆఖరి 6 ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో హాంకాంగ్ గౌరవప్రదంగా ముగించగలిగింది. తన్జీమ్, తస్కీన్, రిషాద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్లు పర్వేజ్ (19), తన్జీద్ (14) ఎక్కువ సేపు నిలబడకపోయినా... కెపె్టన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ (36 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్) భాగస్వామ్యంతో బంగ్లా సునాయాస విజయాన్ని అందుకుంది. వీరిద్దరు మూడో వికెట్కు 70 బంతుల్లో 95 పరుగులు జోడించారు. నేడు దుబాయ్లో జరిగే మ్యాచ్లో ఒమన్ జట్టుతో పాకిస్తాన్ ఆడుతుంది. -
రాణించిన హాంకాంగ్ బ్యాటర్లు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, టాస్కిన్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ హాంకాంగ్కు చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే హాంకాంగ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. -
దక్షిణాసియాలో తరాల మార్పు.. రెండు ప్రభుత్వాల్ని కూల్చిన ‘జెన్ జెడ్’
ఖాఠ్మండు: నేపాల్ను తమ తిరుగుబాటుతో జనరేషన్ జెడ్ (జెన్ జెడ్) వణికించింది. దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో ఇదే తరహాలో యువత నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు దరిమిలా ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఏడాది వ్యవధిలో ‘జెన్ జెడ్’ రెండు దేశాల ప్రభుత్వాలను కూకటివేళ్లతో సహా కూల్చివేసింది.నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్ల నిషేధం దరిమిలా ఖాఠ్మండుతో పాటు దేశంలోని పలు నగరాల్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. 2024, ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఇటువంటి పరిణామాల నేపధ్యంలోనే రాజీనామా చేశారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని కేపీ ఓలి కూడా దేశం విడిచి పారిపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అటు బంగ్లాదేశ్ ఇటు నేపాల్.. ఈ రెండు దేశాల్లో జరిగిన ఘటనలు దక్షిణాసియాలో తరాల మార్పును గుర్తించేలా చేస్తున్నాయి. జనరల్ జెడ్ ఉద్యమాలు దేశాధినేతలను నిష్క్రమించేలా ఒత్తిడి చేస్తున్నాయి. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా వేలాది మంది జనరల్ జెడ్ నిరసనకారులు ఖాఠ్మండు వీధులలో నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్ జరిగిన ‘రిజర్వేషన్ కోటా’ నిరసనలు ఆ దేశంలో సంక్షోభం తలెత్తేలా చేశాయి. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికింది. అది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే వరకూ సాగింది.సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో మొదలైన ఉద్యమం రాజకీయ నేతల అవినీతిని నిలదీసే పోరాటానికి దారితీసింది. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్.. ఇరు దేశాల నిరసనలలో విద్యార్థులు, యువత కీలక భాగస్వామ్యం వహించారు. కాలం చెల్లిన రాచరిక పాలనకు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇందుకు సోషల్ మీడియాను ప్రముఖ వేదికగా వాడుకున్నారు. ఢాకా- ఖాట్మండు.. రెండు చోట్లా ఉద్యమాల అణిచివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో పలువురు నిరసనకారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఉద్యమాలు మరింత తీవ్రమయ్యాయి. దేశ నాయకత్వ మార్పు అనివార్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్దాయి.నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2024, ఆగస్టులో పదవి కోల్పోయి, భారతదేశానికి తరలివచ్చారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఆ దేశంలోని సంక్షోభ పరిణామాల దృష్ట్యా దుబాయ్లో ఆశ్రయం పొందే ప్రయత్నం చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దేశాల అధినేతలకు ఎదురైన పతనం దక్షిణాసియా అంతటా తరాల మార్పును సూచిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి యువత.. అవినీతి రహిత నేతలకు, ప్రభుత్వాలకు పట్టం కట్టేలా ఉన్నారని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని కొందరు అంటున్నారు. -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరించాడు. నిన్న నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో అర్ద సెంచరీ (46 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన దాస్ ఈ ఘనత సాధించాడు.దాస్కు ముందు ఈ రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. షకీబ్ బంగ్లాదేశ్ తరఫున 129 మ్యాచ్ల్లో 13 హాఫ్ సెంచరీలు చేయగా.. దాస్ కేవలం 110 మ్యాచ్ల్లోనే షకీబ్ పేరిట ఉండిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దాస్, షకీబ్ తర్వాత టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అర్ద సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా తమీమ్ ఇక్బాల్ (8), మహ్మదుల్లా (8), తంజిద్ హసన్ (6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న నెదర్లాండ్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ సిరీస్ గెలుపుతో బంగ్లాదేశ్ హ్యాట్రిక్ సాధించింది. నెదర్లాండ్స్ను ఖంగుతినిపించకముందు బంగ్లాదేశ్ శ్రీలంక, పాకిస్తాన్ను కూడా మట్టికరిపించింది. హ్యాట్రిక్ సిరీస్ విజయాలతో బంగ్లాదేశ్ ఆసియా కప్లో అడుగుపెట్టబోతుంది.చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ దశలో ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఆట ఆగిపోయే సమయానికి జాకిర్ అలీ (20), నురుల్ హసన్ (22) క్రీజ్లో ఉన్నారు. లిట్టన్ దాస్ బంగ్లాదేశ్కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. బంగ్లా ప్లేయర్లలో సైఫ్ హస్సన్ 12, తౌహిద్ హృదోయ్ 9, షమీమ్ హొస్సేన్ 21 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కైల్ క్లెయిన్ 3 వికెట్లు పడగొట్టగా.. టిమ్ ప్రింగిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
మైనారిటీ వలసదారులకు ఉపశమనం.. ప్రభుత్వ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మైనారిటీ వలసదారులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించే వార్త చెప్పింది. 2024, డిసెంబర్ 31కి ముందు భారత్లోకి వచ్చి, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు 2025, సెప్టెంబర్ 4 నుండి అమలులోకి వచ్చిన భారతదేశ ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం ప్రకారం శిక్షా చర్యల నుండి మినహాయింపు పొందుతారు. ఈ మినహాయింపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని పౌరసత్వ ప్రమాణాలను ప్రభావితం చేయదు.తాజాగా హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నోటిఫై చేసిన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ (మినహాయింపు) ఆర్డర్, 2025 లో ఈ నిబంధనలు పొందుపరిచారు. ఈ చట్టం కింద నేరాలను గుర్తించే అధికారం, చట్టాన్ని అమలు చేసే అధికారాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్పగిస్తూ మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్లను జారీ చేసింది.చట్టం- జరిమానాలుఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే ఏ విదేశీయుడైనా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానాకు అర్హులు. సెక్షన్ 23 ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఎక్కువ కాలం నివసించే విదేశీయులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా రూ. 3 లక్షల జరిమానా విధించనున్నారు.మినహాయింపుల వివరణడిసెంబర్ 31, 2024 లోపు భారతదేశంలోకి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలను నిర్బంధం, బహిష్కరణ చర్యల నుండి ఈ ఆర్డర్ మినహాయింపు కల్పిస్తుంది. ఈ మినహాయింపు 2014, డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేసే సీఏఏ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ గడువులో భారతదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణించరని, వారి పాస్పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలోనే ఉండవచ్చని పేర్కొన్నారని ఒక అధికారి తెలిపారు.చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు విధించే జరిమానాలను కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, వీసా లేకుండా అక్రమంగా ప్రవేశించే ఏ విదేశీయునికైనా రూ. 5 లక్షల జరిమానా విధించనున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసించే వారికి ఇమ్మిగ్రేషన్ అధికారి పెనాల్టీ విధిస్తారు. 30 రోజుల వరకు ఉండే వారికి రూ. 10వేలు. 31 నుండి 90 రోజుల వరకు ఉండే వారికి రూ. 20 వేలు జరిమానా విధించనున్నారు. టిబెటన్లు, మంగోలియాకు చెందిన బౌద్ధ సన్యాసులు, అర్హత కలిగిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ వలసదారులకు ఈ జరిమానాలు వర్తించవు. -
పేట్రేగిపోయిన షకీబ్.. కేవలం 20 బంతుల్లోనే.. అత్యుత్తమంగా..!
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025లో పేట్రేగిపోయాడు. చాన్నాళ్ల తర్వాత అతడు బ్యాట్ ఝులిపించాడు. ఈ లీగ్లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్కు ఆడుతున్న షకీబ్.. నిన్న (ఆగస్ట్ 31) సెయింట్ లూసియా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఇది అతనికి టీ20 కెరీర్లో జాయింట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతేడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లోనూ షకీబ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (రంగ్పూర్ రైడర్స్కు ఆడుతూ ఖుల్నా టైగర్స్పై) పూర్తి చేశాడు.తాజా హాఫ్ సెంచరీతో షకీబ్ మరో రికార్డు కూడా సాధించాడు. తన టీ20 కెరీర్లో అత్యుత్తమ స్ట్రయిక్రేట్ను (హాఫ్ సెంచరీ) నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 234.61 స్ట్రయిక్రేట్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షకీబ్.. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 234.62 స్ట్రయిక్రేట్తో 61 పరుగులు చేశాడు.షకీబ్ బ్యాట్తో విజృంభించినా ఈ మ్యాచ్లో అతని జట్టు ఫాల్కన్స్ ఓటమిపాలైంది. ఫాల్కన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. టిమ్ సీఫర్ట్ విధ్వంసకర శతకంతో (125 నాటౌట్) విరుచుకుపడటంతో లూసియా కింగ్స్ మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ సెంచరీతో సీఫర్ట్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్లో 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతను.. సీపీఎల్ చరిత్రలో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో ఆండ్రీ రసెల్ కూడా 40 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఈ మ్యాచ్లో సీఫర్ట్ చేసిన స్కోర్ (125 నాటౌట్) కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రెండో అత్యధికం. ఈ రికార్డు బ్రాండన్ కింగ్ పేరిట ఉంది. 2019 ఎడిషన్లో కింగ్ గయానా అమెజాన్ వారియర్స్కు ఆడుతూ బార్బడోస్ ట్రైడెంట్స్పై అజేయమైన 132 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్తో సీఫర్ట్ ఖాతాలో మరో రెండు రికార్డులు కూడా చేరాయి. ఛేదనలో (కరీబియన్ ప్రీమియర్ లీగ్లో) అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సీఫర్ట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ (121 నాటౌట్) పేరిట ఉండేది.ఈ సెంచరీతో సీఫర్ట్ సెయింట్ లూసియా కింగ్స్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉండేది. ఫాఫ్ 2021 సీజన్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్పై అజేయమైన 120 పరుగులు చేశాడు. -
ఆసియాకప్లో బంగ్లాదేశ్ బోణీ..
రాజ్గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం సాధించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 8–3 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లా (4వ, 26వ నిమిషాల్లో), రకీబుల్ హసన్ (42వ, 43వ నిమిషాల్లో), అష్రఫుల్ ఇస్లామ్ (45వ, 48వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ సాధించగా... సోహనుర్ సోబుజ్ (36వ నిమిషంలో), రిజావుల్ బాబు (56వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. చైనీస్ తైపీ జట్టు తరఫున సుంగ్ యూ (10వ, 18వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా... సుంగ్ జెన్ షిహ్ (60వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. తొలి పోరులో మలేసియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్... ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మరో మ్యాచ్లో మలేసియా 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై గెలిచింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే గెనెహో జిన్ గోల్తో ఖాతా తెరిచిన ఐదు సార్లు చాంపియన్ దక్షిణ కొరియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది.మలేసియా తరఫున అఖీముల్లా అన్వర్ (29వ, 34వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టాడు. అష్రాన్ హమ్సాని (33వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జపాన్తో భారత్, కజకిస్తాన్తో చైనా తలపడనున్నాయి. -
నోరుపారేసుకున్న మహువా
కోల్కతా: సంచలనాలకు మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదానికి తెరతీశారు. దేశంలోకి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడ్డుకోలేకపోతున్నారని, అందుకు శిక్షగా ఆయన తల నరికేయాలని తేల్చిచెప్పారు. శుక్రవారం పశి్చమ బెంగాల్లోని నాడియా జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో రక్షణ భద్రత కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవిలో ఉన్న అమిత్ షాదేనని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పౌరుల రాకను అడ్డుకొనే సత్తా లేని అమిత్ షా ఆ నెపాన్ని పశి్చమ బెంగాల్ ప్రభుత్వంపై వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చొరబాటుదార్లు వస్తున్నారంటూ తరచుగా గొంతు చించుకుంటున్న ఆయనకు వారిని అడ్డుకొనే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అక్రమ వలసల కారణంగా దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయంటూ ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ షా చప్పట్లు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారని గుర్తుచేశారు. దేశ సరిహద్దులను రక్షించేవారు లేకపోతే పొరుగుదేశాల నుంచి జనం వస్తూనే ఉంటారని, మన తల్లులు, అక్కాచెల్లెమ్మలపై కన్నేస్తారని, మన భూములు ఆక్రమించుకుంటారని పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడలేకపోవడంతో చొరబాట్లను ఆపలేనందుకు అమిత్ షా తల నరికి టేబుల్పై పెట్టాలని మహువా మొయిత్రా పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో సంబంధాలు క్షీణించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. గతంలో మన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రుదేశంగా మారిపోయిందని చెప్పారు. మొయిత్రాది తాలిబన్ మైండ్సెట్: బీజేపీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షాపై ఆమె చేసిన విమర్శల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. మొయిత్రాది తాలిబన్ మైండ్సెట్, తాలిబన్ కల్చర్ అని ధ్వజమెత్తారు. ఆమెపై కొత్వాలీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొయిత్రా జిహాదీ ఉగ్రవాదుల తరహాలో మాట్లాడారని బీజేపీ అధికార ప్రతనిధి షెహజాద్ పూనవాలా ఆరోపించారు. మొయిత్రా వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాజకీయంగా ఎదిరించాలి తప్ప హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయడంలో తప్పులేదన్నారు. వ్యక్తిగతంగా మాటల దాడి చేయొద్దని సూచించారు. ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేశారు. Shameful and disgraceful!How can an elected MP like Mahua Moitra stoop so low as to use violent language against Shri Amit Shah ji?Such statements are not just an insult to democracy but also a dangerous encouragement of hatred and violence in public life.We strongly condemn… pic.twitter.com/X9XS5IA9zW— Lakshmi Singh (@LakshmiSinghBJP) August 29, 2025 -
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్..
టీ20 క్రికెట్లో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్న 5వ క్రికెటర్గా షకీబ్ రికార్డులకెక్కాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో ఆంటిగ్వా అండ్ బార్బుడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న షకీబ్.. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను అందుకున్నాడు.సెయింట్స్ కిట్స్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను ఔట్ చేసిన అనంతరం షకీబ్ అల్ హసన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంగ్లా మాజీ కెప్టెన్ ఇప్పటివరకు 457 మ్యాచ్లు ఆడి 502 వికెట్లు పడగొట్టాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. అదేవిధంగా షకీబ్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో 7000 పరుగులతో పాటు 500 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా షకీబ్ నిలిచాడు.ఈ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అక్టోబర్ 2024 నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లలో మాత్రమే పాల్గొంటున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..రషీద్ ఖాన్- 487 మ్యాచ్లు- 660 వికెట్లుడ్వైన్ బ్రావో- 582 మ్యాచ్లు- 631 వికెట్లుసునీల్ నరైన్- 557 మ్యాచ్లు- 590 వికెట్లుఇమ్రాన్ తాహిర్- 436 మ్యాచ్లు- 554 వికెట్లుషకీబ్ అల్ హసన్- 457 మ్యాచ్లు-502 వికెట్లుచదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్ -
ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. తాజా మాజీ కెప్టెన్పై వేటు
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్-2025 కోసం 16 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 22) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా లిట్టన్ దాస్ కొనసాగగా.. తాజా మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. వికెట్కీపర్ బ్యాటర్ నురుల్ హసన్ మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. నురుల్తో పాటు మరో ఆటగాడు కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చాడు. సైఫ్ హసన్ ఏడాదిన్నర తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నాడు. సైఫ్ చివరిగా 2023 ఆసియా క్రీడల్లో ఆడాడు. నురుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్నాడు. ఇదే అతనికి మూడేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కేలా చేసింది. 31 ఏళ్ల నురుల్ ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్కప్లో చివరిసారి ఆడాడు.ఆసియా కప్ కోసం బంగ్లా సెలెక్టర్లు నలుగురు స్టాండ్ బై ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెహిది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్ ఉన్నారు. వీరిలో మిరాజ్ బంగ్లాదేశ్ చివరిగా ఆడిన టీ20 జట్టులో ఉన్నప్పటికీ.. 16 మంది సభ్యుల మెయిన్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదే జట్టు ఆసియా కప్కు ముందు స్వదేశంలో నెదర్లాండ్స్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా కొనసాగనుంది. నెదర్లాండ్స్తో సిరీస్ ఆగస్ట్ 30, సెప్టెంబర్ 1, 3 తేదీల్లో జరుగనుంది. ఆసియా కప్ విషయానికొస్తే.. ఈ ఖండాంతర టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం సెప్టెంబర్ 11న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ హాంగ్కాంగ్తో పోటీపడుతుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్.. హాంగ్కాంగ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్తో పాటు గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుంది.ఆసియా కప్, నెదర్లాండ్స్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహిదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్ బై (ఆసియా కప్కు మాత్రమే): సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్ -
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న షకీబ్
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ పొట్టి క్రికెట్లో చారిత్రక మైలురాయిని తాకేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్లో మరో వికెట్ తీస్తే 500 వికెట్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు.ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658 వికెట్లు), విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (631), విండీస్ వెటరన్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ (590), సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (549) టీ20ల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం షకీబ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 21) జరిగిన ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ తీసి తన టీ20 వికెట్ల సంఖ్యను 499కి పెంచుకున్నాడు. ఆగస్ట్ 23న గయానా అమెజాన్ వారియర్స్తో జరిగే మ్యాచ్లో ఓ వికెట్ తీస్తే 500 వికెట్ల క్లబ్లో చేరతాడు.2006లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీబ్ బంగ్లాదేశ్ జాతీయ జట్టుతో పాటు పదుల సంఖ్యలో ఫ్రాంచైజీలకు ఆడి 499 వికెట్లు (455 మ్యాచ్ల్లో) తీశాడు. ఇందులో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు 12 నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో షకీబ్ అత్యుత్తమ గణాంకాలు 6/6గా ఉన్నాయి.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన షకీబ్కు ఈ ఫార్మాట్లో బ్యాటింగ్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. 124 స్ట్రయిక్రేట్తో 33 హాఫ్ సెంచరీల సాయంతో 7541 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 48వ స్థానంలో ఉన్నాడు.38 ఏళ్ల షకీబ్ ఇటీవలికాలంలో బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్లోనూ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీపీఎల్లో అతడు 3 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి కేవలం 31 పరుగులే చేశాడు. బౌలింగ్లో ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. గత కొంతకాలంగా షకీబ్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. -
Asia Cup 2025: 'ఏ జట్టునైనా ఓడిస్తాము.. ఆసియాకప్ టైటిల్ మాదే'
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ మెగా టోర్నీకి మరో 20 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న జరిగే తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ అనిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలవడమే తమ లక్ష్యమని జాకర్ తెలిపాడు. కాగా బంగ్లా టైగర్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకోలేదు. ఇంతకుముందు మూడు సార్లు ఫైనల్కు చేరినప్పటికి.. ప్రతీసారి తుది మెట్టుపై బంగ్లా జట్లు బోల్తా పడింది. 2012లో పాకిస్తాన్, 2016, 2018 ఫైనల్లో భారత్పై బంగ్లా ఓటమి చవిచూసింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలిచి తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని బంగ్లా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడా తమ ప్రాథిమిక జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా యూఏఈలో ఒక ప్రత్యేక క్యాంపును కూడా బంగ్లాదేశ్ ఏర్పాటు చేయనుంది. కెప్టెన్ లిట్టన్ దాస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ఇటీవల శ్రీలంక, పాకిస్తాన్లతో టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది."టైటిలే లక్ష్యంగా ఈ ఏడాది ఆసియాకప్ బరిలోకి దిగనున్నాము. ఈసారి ఛాంపియన్స్గా నిలుస్తామన్న నమ్మకం డ్రెస్సింగ్ రూమ్లోని ప్రతి ఒక్కరికి ఉంది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఏ విషయాన్ని మేము తేలికగా తీసుకోవడం లేదు. ఈ టోర్నీ కోసం మాకు ఎటువంటి ప్రణాళికలు లేవు. ఏ జట్టుతో ఆడినా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు అన్ని విధాల సిద్దమవుతున్నాము" అని విలేకరుల సమావేశంలో అలీ పేర్కొన్నాడు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే ఆతి విశ్వాసం ప్రదర్శిస్తున్న అలీని నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. గెలిచి మాట్లాడాలని క్రికెట్ అభిమానులు అతడికి కౌంటరిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో గ్రూప్-బిలో శ్రీలంక, హాంకాంగ్, ఒమన్లతో పాటు బంగ్లాదేశ్ ఉంది.ఆసియాకప్-2025 బంగ్లాదేశ్ ప్రిలిమినరీ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్లో భారత్- పాక్ మ్యాచ్ జరగదు' -
Mumbai: ఆస్పత్రి నుంచి గర్భిణి ఖైదీ పరార్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గల జేజే ఆస్పత్రి నుంచి బంగ్లాదేశ్ గర్భిణి ఖైదీ తప్పించుకుంది. గురువారం మధ్యాహ్నం ఆమె పారిపోగా, అప్పటి నుంచి ముంబై పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. నకిలీ జనన ధృవీకరణ పత్రం ఉపయోగించి భారతీయ పాస్పోర్ట్ పొందినందుకు రుబీనా ఇర్షాద్ షేక్(27)ను ఆగస్టు 7న వాషి పోలీసులు అరెస్టు చేశారు.ఆమెపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పాస్పోర్ట్ చట్టం, విదేశీయుల చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ నేపధ్యంలోనే ఆమెను అరెస్ చేసి, బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. జ్వరం, జలుబు, చర్మ సంబంధిత వ్యాధుల ఫిర్యాదుల మేరకు ఐదు నెలల గర్భిణి అయిన రుబీనాను ఆగస్టు 11న జెజె ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 14న మధ్యాహ్నం ఆమె ఒక కానిస్టేబుల్ను తోసి, పారిపోయింది. ఖైదీ రుబీనా ఇర్షాద్ షేక్ ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఎన్ఆర్సీ ఎఫెక్ట్: బంగ్లాకు పంపుతారని వృద్ధుని బలవన్మరణం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు చేస్తే, తనను బంగ్లాదేశ్కు పంపుతారనే భయంతో దిలీప్ కుమార్ సాహా(63) ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.కోల్కతాలోని తన ఇంట్లో దిలీప్ కుమార్ సాహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిలీప్ కుమార్ సాహా 1972లో ఢాకాలోని నవాబ్గంజ్ నుండి కోల్కతాకు వచ్చాడు. ఇక్కడి రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఆనందపల్లి వెస్ట్లో నివసిస్తున్నాడు. సాహా దక్షిణ కోల్కతాలోని ధకురియాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా పనిచేశాడు. అతను ఉంటున్న ఇంటికి అతని భార్య పలుమార్లు ఫోన్ చేసింది.అయితే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆమె పొరుగింట్లో ఉంటున్న మేనకోడలికి ఫోన్ చేసింది. ఆమె.. దిలీప్ కుమార్ సాహా ఇంటి తలుపులను పగలగొట్టి, లోనికి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అతని భార్య ఆరతి సాహా మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ అమలు తర్వాత బంగ్లాదేశ్కు బహిష్కరిస్తారేమోనని తన భర్త ఆందోళన చెందుతుండేవాడని తెలిపారు. కాగా దిలీప్ కుమార్ సాహా గది నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ మంత్రి, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. -
పదవీచ్యుత బంగ్లా ప్రధాని హసీనాపై విచారణ ప్రారంభం
ఢాకా: పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాపై 2024లో విద్యార్థుల సారథ్యంలో మొదలైన ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్(ఐసీటీ)ఆదివారం విచారణను ప్రారంభించింది. ఈ కేసులో సహ నిందితులుగా మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ను, మాజీ ఐజీపీ అబ్దుల్లా అల్ మమూన్లను చేర్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వం చీఫ్ ప్రాసిక్యూటర్గా తాజుల్ ఇస్లాంను నియమించింది. అన్ని నేరాలకు హసీనాయే కేంద్రమని, ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును తాజుల్ ఇస్లాం కోరారు.గతేడాది మొదలైన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసేందుకు హత్యలు, చిత్రహింసలకు పాల్పడ్డారంటూ ఐసీటీ హసీనాపై ఆరోపణలు మోపింది. -
స్నేహితుడిపై దాడి.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్పై కేసు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తస్కిన్ అహ్మద్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నివేదికల ప్రకారం అతనిపై కేసు నమోదైంది. ఈనెల 26న తస్కిన్.. అతని స్నేహితుడు సిఫాతుర్ రెహ్మాన్ సౌరవ్పై దాడి చేశాడు. మీర్పూర్ మోడల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక జర్నలిస్ట్లు తస్కిన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) చెందిన కీలక అధికారి స్పందిస్తూ ఇలా అన్నాడు. ఈ వార్తను సమాచార మాధ్యమాల్లో చూశాను. ఒకవేళ ఇది నిజమే అయితే విచారకరం. తస్కిన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు. ఈ విషయంపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నాడు.మరో వాదనతస్కిన్కు సంబంధించి ఇదే విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. తస్కిన్ బీసీబీ డైరెక్టర్తో మాట్లాడి తాను నిర్దోషినని చెప్పాడట. కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని సంజాయిషీ ఇచ్చాడట. గొడవ జరిగిన మాట వాస్తవమే అని.. అయితే అందులో తన ప్రమేయమేమీ లేదని వివరణ ఇచ్చాడట.తస్కిన్ బీసీబీ డైరెక్టర్తో ఇలా చెప్పాడట..ఆ రోజు తన మిత్ర బృందంలోని రెండు గ్రూప్ల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ వర్గం తనను మీర్పూర్ పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. వారి కోరిక మేరకు నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఇందుకు ఆగ్రహించిన మరో వర్గం తనపై కేసు నమోదు చేసింది.ఈ ఘటన తస్కిన్ పాకిస్తాన్తో మూడో టీ20 ఆడిన అనంతరం జరిగింది. మీర్పూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తస్కిన్ 3 వికెట్లు తీశాడు. 30 ఏళ్ల రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన తస్కిన్ బంగ్లాదేశ్ తరఫున 17 టెస్ట్లు, 81 వన్డేలు, 76 టీ20లు ఆడి 254 వికెట్లు తీశాడు. తస్కిన్ పేరిట టెస్ట్ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. -
ఎట్టకేలకు పాకిస్తాన్కు ఓ విజయం
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (33), మొహమ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2, షొరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. బంగ్లా ఇన్నింగ్స్లో సైఫుద్దీన్తో పాటు మొహమ్మద్ నైమ్ (10), మెహిది హసన్ మిరాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ నవాజ్ చెరో 2, అహ్మద్ దెనియాల్, సల్మాన్ అఘా, హుసేన్ తలాట్ తలో వికెట్ తీశారు. -
పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగరగొట్టిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకొని ఫ్యూజులు ఎగురగొట్టింది. ఇవాళ (జులై 22) ఢాకాలో జరిగిన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. 134 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను పాకిస్తాన్ బౌలర్లు సైతం అద్భుతంగా కట్టడి చేశారు. సల్మాన్ మీర్జా (4-1-17-2), అబ్బాస్ అఫ్రిది (4-0-37-2), అహ్మద్ దనియాల్ (4-0-23-2), ఫహీమ్ అష్రాఫ్ (3-0-20-1), మొహమ్మద్ నవాజ్ (3-0-19-1) చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ 133 పరుగులకే ఆలౌటైంది. జాకెర్ అలీ (55), మెహిది హసన్ (33) అద్బుతంగా పోరాడి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి ధాటికి పాకిస్తాన్ 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో ఫహీమ్ అష్రాఫ్ (51) వీరోచితంగా పోరాడి పాక్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి పాక్ను 125 పరుగులకే పరిమితం చేశారు. మెహిది హసన్ (4-0-25-2), షొరిఫుల్ ఇస్లాం (4-0-17-3), తంజిమ్ హసన్ సకీబ్ (4-0-23-2), ముస్తాఫిజుర్ (3.2-0-15-1), రిషద్ హొసేన్ (4-0-42-1) పాక్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లో నామమాత్రపు మూడో టీ20 జులై 24న జరుగనుంది. -
చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్.. జింబాబ్వే కంటే హీనంగా..!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్లోనూ సత్తా చాటలేకపోతుంది. సీనియర్ల ఫామ్ లేమి.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య సత్సంబంధాలు లేకపోవడం వంటి అనేక కారణాల చేత పాక్ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పసికూనలపై కూడా ఆ జట్టు విజయాలు నమోదు చేయలేకపోతుంది.తాజాగా వారి కంటే చాలా రెట్లు బలహీనమైన బంగ్లాదేశ్ వారికి షాకిచ్చింది. ఆదివారం (జులై 20) ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పాక్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సంచలన విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాక్ ఓ ఘోర అప్రతిష్ఠను మూటగట్టుకుంది.2024 నుంచి ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ చెత్త రికార్డును పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచే లాగేసుకోవడం విశేషం. ప్రస్తుత క్రికెట్ పసికూనలుగా పిలువబడే జింబాబ్వే, వెస్టిండీస్ కూడా గతేడాది కాలంలో పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి.2024 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) పాకిస్తాన్ 63 మ్యాచ్లు ఆడగా.. అందులో ఏకంగా 38 మ్యాచ్ల్లో ఓడింది. పాకిస్తాన్ తర్వాత అత్యధికంగా బంగ్లాదేశ్ 37 మ్యాచ్ల్లో (62లో) పరాజయాలు చవిచూసింది. వెస్టిండీస్ (65 మ్యాచ్ల్లో 35లో ఓటమి), జింబాబ్వే (61 మ్యాచ్ల్లో 31లో ఓటమి) లాంటి దేశాలు 2024 నుంచి పాకిస్తాన్ కంటే తక్కువ మ్యాచ్ల్లో ఓడాయి. ఈ గణాంకాలు చూస్తే పాక్ క్రికెట్ జట్టు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.పాక్ను షాకిచ్చిన బంగ్లాదేశ్మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూల్చింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (4-0-6-2), తస్కిన్ అహ్మద్ (3.3-0-22-3) చెలరేగి బౌలింగ్ చేశారు. తంజిమ్ హసన్ సకీబ్ (4-0-20-1), మెహిది హసన్ (4-0-37-1) కూడా పర్వాలేదనిపించారు. పాక్ బ్యాటర్లలో ఫకర్ జమాన్ (44) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించగా.. ఆఖర్లో అబ్బాస్ అఫ్రిది (22), ఖుష్దిల్ షా (17) రెండంకెల స్కోర్లు చేయడంతో పాకిస్తాన్ అతి కష్టం మీద మూడంకెల స్కోర్ దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయం సాధించింది (3 వికెట్లు కోల్పోయి). పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (56 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో రాణించి బంగ్లాను గెలిపించాడు. అతనికి తౌహిద్ హృదోయ్ (36), జాకిర్ అలీ (15 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఢాకా వేదికగానే ఇవాళ (జులై 22) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం
-
28 ఏళ్ల పాటు మారువేషంలో..
భోపాల్: బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల పర్వంలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్చేశారు. 28 ఏళ్లుగా భారత్లో అక్రమంగా ఉంటున్న అబ్దుల్ కలామ్ అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ బంగ్లాదేశ్ నుంచి పదేళ్ల వయసులో భారత్కు అక్రమంగా వచ్చి ముంబైలో 20 ఏళ్లపాటు నివసించాడు. ఎనిమిదేళ్లుగా నేహా కినార్ పేరిట ట్రాన్స్జెండర్గా మారువేషంలో భోపాల్ నగరంలో జీవిస్తున్నాడు. ఈ 28 ఏళ్ల కాలంలో భారత్లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఓటర్ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ చివరకు భారత పాస్పోర్ట్ సైతం సంపాదించాడు. పలుమార్లు స్వదేశానికి వెళ్లి వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. భారత్లోకి అక్రమ మార్గాల్లో చేరుకున్నాక మారువేషాల్లో పలువురు జీవిస్తున్నారన్న సమాచారంతో భోపాల్ పోలీసులు నిఘా బృందాలు సమిష్టిగా దర్యాప్తుచేసి అబ్దుల్ను ఎట్టకేలకు అరెస్ట్చేశారు. దీంతో ఇలా ఎంత మంది బంగ్లాదేశీయులు మారువేషాల్లో భారత్లో నివసిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. -
సొంతగడ్డపై శ్రీలంకకు ఊహించని పరాభవం.. చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్ విజయం. బంగ్లా కెప్టెన్గా లిట్టన్ దాస్కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్ గెలుపు. ఈ సిరీస్ గెలుపుతో లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. లిట్టన్ గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్లో కాకుండా బంగ్లాదేశ్ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ (4-0-17-1), రిషద్ హొస్సేన్ (4-0-20-0) కూడా అదే పని చేశారు. షొరిఫుల్ ఇస్లాం (4-0-50-1), తంజిమ్ హసన్ సకీబ్ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్ హొస్సేన్ 2 ఓవర్లలో ఓ వికెట్ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (46), దసున్ షనక (35 నాటౌట్), కమిందు మెండిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్ హసన్ తమీమ్ (47 బంతుల్లో 73 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్కు సునాయాస విజయాన్నందించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (0) ఔటైనా.. లిట్టన్ దాస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, సిక్స్) తమీమ్కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు. -
చిక్కుల్లో షేక్ హసీనా కూతురు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్(Saima Wazed) చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి(SEARO) ఆమె రీజియనల్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంగతి తెతలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది.ఇప్పటికే భారత్లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే తాజాగా ఆమె తనయ సైమా వాజెద్పైనా అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్వో.. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని వెల్లడించింది. అయితే ఆమె సెలవుల వ్యవహారంపై ప్రశ్న ఎదురుకాగా.. అదనంగా స్పందించేందుకు డబ్ల్యూహెచ్వో నిరాకరించింది. డబ్ల్యూహెచ్వో నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్వో రీజీయనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.1972 డిసెంబర్ 9న డా. ఎం.ఎ. వాజేద్ మియా (న్యూక్లియర్ సైంటిస్ట్), షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా(అమెరికా) బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. ఆర్గనైజేషనల్ లీడర్షిప్లో డాక్టరల్ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్వో ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆమె భర్త ఖండకర్ మస్రూర్ హుస్సేన్ మితు. ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ జంటకు నలుగురు పిల్లలు. అయితే వీళ్లు విడిపోయారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. అధికారికంగా ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టారిఫ్ వార్లో వెనక్కి తగ్గిన ఈయూ? -
SL Vs BAN: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. నిన్న (జులై 13) జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (50 బంతుల్లో 76; ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో.. తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్), షమీమ్ హొసేన్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించారు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తంజిద్ హసన్ 5, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 0, మెహిది హసన్ మిరాజ్ 1, జాకెర్ అలీ 3, సైఫుద్దీన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మహీశ్ తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లాదేశ్ బౌలర్లు ఊహించని రీతిలో రెచ్చిపోవడంతో 15.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో కేవలం పథుమ్ నిస్సంక (32), దసున్ షనక (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కుసాల్ మెండిస్ 8, కుసాల్ పెరీరా 0, అవిష్క ఫెర్నాండో 2, అసలంక 5, చమిక కరుణరత్నే 0, వాండర్సే 8, తీక్షణ 6, బినుర 6 పరుగులకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, షోరీఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో 2, ముస్తాఫిజుర్, మెహిది హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20 కొలొంబో వేదికగా జులై 16న జరుగనుంది. కాగా, టీ20 సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్లను శ్రీలంక కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో.. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
రెక్కలున్నా.. లెక్క తేలక... పదేళ్లుగా ఉన్నచోటే!
2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టేకాఫ్ అయిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ విమానాన్ని అత్యవసరంగా రాయ్పుర్ (ఛత్తీస్గఢ్)లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్ చేరుకున్నారు. అయితే రాయ్పుర్లో ఆ రోజు ల్యాండ్ అయిన ఆ ‘డగ్లస్ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!పార్కింగ్కి రూ.4 కోట్ల బకాయిపదేళ్లుగా ఆ డగ్లస్ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్ చేసినందుకు ‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది. కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!రాయ్పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్ బేస్లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్లో డగ్లస్ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్ యార్డ్కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. విసిగి వేసారిన రాయ్పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ వస్తే చాలుఅసలు డగ్లస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్పుర్ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్గా ఉంది’ అన్న సర్టిఫికెట్ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్నెస్ సర్టిఫికెట్ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్పుర్ ఎయిర్పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్ బేస్లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్ 83 కారణంగా ఆ బేస్లో ఉంచవలసిన వాటిని వేరే బేస్కు తరలించాల్సి వస్తోంది. ... ఇక వాళ్ల కష్టాలు..!‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్ను వెతికి పట్టుకుని, డగ్లస్ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్లో టేకాఫ్ అయింది. వారణాసి–రాయ్పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్ ఇంజినీర్ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి చేరలేదు. కోల్కతా చెబితేనే రాయ్పుర్ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్పుర్లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్ చేయించే అధికారం రాయ్పుర్ ఎయిర్ పోర్ట్కు లేదు. కోల్కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్కతా ఎయిర్పోర్ట్కు అందించారు. కోల్కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన షకీబ్ అల్ హసన్
కరీబియన్ దీవుల్లో జరుగుతున్న గ్లోబల్ సూపర్ లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్ తొలి మ్యాచ్లోనే విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ మ్యాచ్లో క్యాపిటల్స్ న్యూజిలాండ్కు చెందిన సెంట్రల్ డిస్ట్రిక్స్పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. షకీబ్ క్యాపిటల్స్ తరఫున తన తొలి మ్యాచ్లోనే ఇరగదీశాడు. సెంట్రల్ డిస్ట్రిక్స్తో మ్యాచ్లో షకీబ్ తొలుత బ్యాటింగ్లో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) చేసి, ఆతర్వాత బౌలింగ్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (4-1-13-4) ఇచ్చాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ షకీబ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షకీబ్తో పాటు సెదికుల్లా అటల్ (41) కూడా రాణించాడు. నిరోషన్ డిక్వెల్లా 15, గుల్బదిన్ నైబ్ 1, కదీమ్ 3, జోర్డన్ జాన్సన్ 1, జెస్సీ బూటాన్ 20, డోమినిక్ డ్రేక్స్ 11 పరుగులు చేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ బౌలరల్లో అంగస్ షా 3, టిక్నర్ 2, ఫాక్స్క్రాఫ్ట్ ఓ వికెట్ తీశారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్స్ షకీబ్ మాయాజాలం దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. క్యాపిటల్స బౌలర్లలో షకీబ్తో పాటు తన్వీర్ (3-0-28-2), డేక్స్ (4-0-26-1), ఆర్యమాన్ వర్మ (4-0-23-1) తలో చేయి వేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ ఇన్నింగ్స్లో టామ్ బ్రూస్ (34) టాప్ స్కోరర్గా నిలువగా.. డేన్ క్లీవర్ (21), విలియమ్ క్లార్క్ (20) నామమాత్రపు పరుగులు చేశారు.వాస్తవానికి షకీబ్ ఈ టోర్నీలో రంగ్పూర్ రైడర్స్కు (బంగ్లాదేశ్) ఆడాల్సి ఉండింది. అయితే స్వదేశంలో (బంగ్లాదేశ్) అతనిపై నెలకొన్న నిషేధం కారణంగా ఇది కుదరలేదు. షకీబ్కు బంగ్లాదేశ్ క్రికెట్తో గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. రాజకీయ అనిశ్చితి కారణంగా షకీబ్ కొద్ది నెలలుగా స్వదేశంలో అడుగుపెట్టలేదు. అలాగే అతను జాతీయ జట్టు నుంచి కూడా తప్పించబడ్డాడు. షకీబ్ బంగ్లాదేశ్లో ప్రతిపక్ష ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. -
కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ.. శ్రీలంకదే వన్డే సిరీస్
పల్లెకెలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 99 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సైతం ఆతిథ్య లంక జట్టు 1–0తో గెలుచుకుంది.మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (114 బంతుల్లో 124; 18 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ అసలంక (68 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ పాథుమ్ నిసాంక (35) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 39.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (78 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో పోరాడగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (28), పర్వేజ్ (28), జాకీర్ అలీ (27) మెరుగైన ఆరంభాలను వృథా చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, దుశ్మంత చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా... దునిత్ వెల్లలాగె, వణిండు హసరంగా రెండేసి వికెట్లు తీశారు.ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. కుశాల్ మెండిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. మెండిస్ ఈ సిరీస్లో తొలి వన్డేలో 45, రెండో వన్డేలో 56, ఇప్పుడు మూడో వన్డేలో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కుసాల్కు అంతర్జాతీయ క్రికెట్లో 16వది. ఈ మ్యాచ్లో కుసాల్ మరో రికార్డు కూడా సాధించాడు. బంగ్లాదేశ్పై 2000 పరుగులు (అన్ని ఫార్మాట్లలో) పూర్తి చేసిన రెండో శ్రీలంకన్గా నిలిచాడు. గతంలో కుమార్ సంగక్కర (3090) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ఇరు జట్ల మధ్య గురువారం తొలి టి20 జరగనుంది. -
భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను జారీ చేయనుంది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తుంది. ఇప్పటిదాకా దుబాయ్లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు రూ.4.66 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టి ఉండాలి. ఇవేమీ అవసరం లేకుండానే కేవలం ఫీజుతోనే వీసాను అందజేసేందుకు ఉద్దేశించిన ఈ విధానంలో వచ్చే మూడు నెలల్లో కనీసం 5 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నది దుబాయ్ ప్రభుత్వ వర్గాల అంచనా. పథకం పైలట్ ప్రాజెక్టు కోసం భారత్తోపాటు బంగ్లాదేశ్ను ఎంపిక చేసింది. గోల్డెన్ వీసా కావాలనుకునే వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రయాద్ గ్రూప్ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ కంపెనీ ఎండీ రయాద్ కమాల్ అయూబ్ చెప్పారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, మనీ లాండరింగ్ కేసులు, నేర చరిత్రతోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామన్నారు. అన్నీ ఓకే అయితేనే ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. వీసా జారీపై తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మున్ముందు ఈ పథకాన్ని చైనా వంటి ఇతర సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కుదిరిన దేశాలకు దుబాయ్ ప్రభుత్వం వర్తింపజేయనుంది. -
వరుస సెంచరీలు.. జట్టులో స్థానం గల్లంతు
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు. ఇటవలి కాలంలో షాంటో పొట్టి ఫార్మాట్లో పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగానే అతన్ని టీ20 జట్టు నుంచి తప్పించినట్లు సెలెక్టర్లు తెలిపారు. బ్యాటింగ్పై దృష్టి సారించేందుకు షాంటో ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ లోపే అతన్ని జట్టు నుంచే తప్పించారు. షాంటో ప్రస్తుత శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. అయినా అతన్ని టీ20 జట్టు నుంచి తొలగించారు. షాంటో గత కొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగా అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి. షాంటో గతేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అనంతర పరిణామాల్లో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదిలి పెట్టాడు. జులై 10 నుంచి శ్రీలంకతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జులై 4) ప్రకటించారు. ఈ జట్టులో షాంటోతో పాటు మరో ఐదుగులు స్థానాలు కోల్పోయారు. పాకిస్తాన్తో చివరిగా ఆడిన జట్టులో సభ్యులైన సౌమ్య సర్కార్, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం, నహీద్ రాణా, ఖలీద్ అహ్మద్ లంకతో సిరీస్కు ఎంపిక కాలేదు. ఆల్రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. జులై 10, 13, 16 తేదీల్లో పల్లెకెలె, డంబుల్లా, కొలొంబో వేదికలుగా శ్రీలంకతో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్లో శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు.. లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహ్మద్ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మద్ సైఫుద్దీన్. -
అసలంక సూపర్ సెంచరీ.. హసరంగ మాయాజాలం
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (జులై 2) జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.లంక ఇన్నింగ్స్లో అసలంక మినహా ఎవ్వరూ రాణించలేదు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేశారు. పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ డకౌటయ్యారు. నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. హసరంగ (7.5-2-10-4), కమిందు మెండిస్ (5-0-19-3), మహీశ్ తీక్షణ (9-1-32-1) మాయాజాలం దెబ్బకు 35.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ (62), జాకిర్ అలీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో పర్వేజ్ ఎమోన్ (13), నజ్ముల్ షాంటో (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిట్టన్ దాస్, కెప్టెన్ మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ డకౌట్లు కాగా.. తౌహిద్ హృదోయ్, తంజిమ్ సకీబ్ తలో పరుగు చేశారు. తన్వీర్ ఇస్లాం 5 పరుగులు చేశాడు. రెండో వన్డే కొలొంబో వేదికగానే జులై 5న జరుగనుంది.కాగా, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి వన్డేలో గెలుపుతో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
శ్రీలంక కెప్టెన్ సూపర్ శతకం.. గత మూడు ఇన్నింగ్స్ల్లో రెండవది
కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఐదో స్థానంలో బరిలోకి దిగిన అసలంక.. 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. గత మూడు ఇన్నింగ్స్ల్లో అసలంకకు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా అతని కెరీర్లో ఐదవది. అసలంక చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో వరుసగా 127, 78 నాటౌట్ పరుగులు చేశాడు. గత కొన్నేళ్లుగా అసలంక వన్డేల్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్గా మారాడు. 2024లో 97.11 స్ట్రయిక్రేట్తో 50.41 సగటున పరుగులు చేసిన అసలంక.. ఈ ఏడాది ఏకంగా 68 సగటున, 96.03 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 74 వన్డేలు ఆడిన అసలంక 44.98 సగటున 5 సెంచరీలు, 15 అర్ద సెంచరీల సాయంతో 2474 పరుగులు చేశాడు.బంగ్లాదేశ్తో మ్యాచ్లో అసలంక ఆదుకోవడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ (49.2 ఓవర్లలో 244 పరుగులు) చేయగలిగింది. జట్టులో మిగతా బ్యాటర్లెవ్వరూ రాణించకపోగా అసలంక ఒక్కడే జట్టు భారం మొత్తాన్ని మోశాడు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేసి అసలంకకు సహకరించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్తోనే జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారీ శతకం బాదిన పథుమ్ నిస్సంక ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఓపెనర్ నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే ఇది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. -
షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బుధవారం ఆరు నెలల జైలు శిక్షపడింది. ఆడియో లీక్ వ్యవహారంలో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించిందని సమాచారం. ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని బుధవారం(జులై 2న) అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా.. రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది.ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటా కొనసాగించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు కిందటి ఏడాది జూన్లో ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఈ కోటాను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో.. నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. క్రమంగా ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 300 మందికి పైగా మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యాయి. కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్డౌన్, సైన్యం మోహరింపు వంటి కఠిన చర్యలు తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు.. షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలు ప్రధాని నివాసాన్ని తాకడంతో.. ఆమె అక్కడి నుంచి భారత్కు వచ్చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా అనంతరం, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. -
Ind vs Pak: ఆసియా కప్-2025.. భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే!
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.అయితే, ఆసియా కప్లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.భారత్- పాక్ మ్యాచ్ ఆరోజేఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.ఒకవేళ భారత్తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.మూడుసార్లు పోటీ పడే అవకాశం!అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.తటస్థ వేదిక కాబట్టికాగా పాకిస్తాన్తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రాడ్కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ -
BAN: కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా(Comilla) జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. Urgent protest march by Hindu students at Dhaka University after the horrific rape of a Hindu girl in Muradnagar, Comilla last night. The Islamist rapist must face justice and the harshest punishment. Silence is not an option! #StopHinduGenocideInBangladesh #JusticeForHindus pic.twitter.com/yAaGGkm82f— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 29, 2025ఏం జరిగిందంటే..బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్నగర్ ఉపజిల్లా రామ్చంద్రాపూర్ పాచ్కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్లో బంధించాడు. జూన్ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది. జూన్ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. జూన్ 28వ తేదీ.. సోషల్ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.జూన్ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు. జూన్ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలుమరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్న్యూస్గా తేల్చేస్తున్నాయి. కిందటి ఏడాది మొదలై.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్నవూ, జైపూర్, నాగ్పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన థాయ్లాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగినబిమ్స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జనపనార, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నావ సేవా పోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు వాణిజ్య శాఖ పరిధిలోని ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. బంగ్లాదేశ్తో సంబంధాల్లో అగాధం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం గమనార్హం.దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛా ప్రాంత(సాఫ్టా) నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి పన్నులూ లేవు. ఇది దేశీయ జూట్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే, ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే జనపనార, సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ(ఏడీడీ) విధించింది.ఈ చర్య బంగ్లాదేశ్ దిగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. పైపెచ్చు, బంగ్లాదేశ్ ఎగుమతిదారులు సాంకేతికపరమైన సాకులు చూపుతూ ఏడీడీ నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబదీ్ధకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి. -
ఊహించిందే జరిగింది.. కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
అంతా ఊహించిందే జరిగిందే. బంగ్లాదేశ్ క్రికెట్లో కెప్టెన్గా నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రస్దానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన శాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం షాంటో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా షాంటో ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీ20 కెప్టెన్సీ నుంచి తనంతట తనే తప్పుకున్న శాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ మెహదీ హసన్కు తమ వన్డే కెప్టెన్గా బంగ్లా క్రికెట్ నియమించింది. అప్పటి నుంచి శాంటో బీసీబీ తీవ్ర ఆంసతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. "ఇది వ్యక్తిగతం కాదు. జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెసింగ్స్ రూమ్లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికి వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో శాంటో పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్గా లిట్టన్ దాస్ ఉండగా.. వన్డే కెప్టెన్గా మెహదీ హసన్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఇప్పుడు శాంటో రాజీనామా చేయడంతో టెస్టు కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి. శ్రీలంకతో తొలి టెస్టును డ్రా గా ముగించిన బంగ్లా టైగర్స్.. రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 0-1తో బంగ్లాదేశ్ కోల్పోయింది.చదవండి: గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్ -
ఓటమి దిశగా బంగ్లాదేశ్
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు బంగ్లాదేశ్ ఇంకా 96 పరుగులు వెనుకపడి ఉంది. లిట్టన్ దాస్ (13) క్రీజ్లో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు ధనంజయ డిసిల్వ (4-1-13-2), ప్రభాత్ జయసూర్య (15-2-47-2), తిరిండు రత్నాయకే (2.4-0-10-1), అశిత ఫెర్నాండో (8-1-22-1) చెలరేగడంతో బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పేకమేడలా కూలుతుంది. బంగ్లా ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుగా నిలబడలేకపోతున్నారు. ఇప్పటివరకు ఔటైన ఆరుగురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు కానీ, ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. షద్మాన్ ఇస్లాం 12, అనాముల్ హక్ 19, మొమినుల్ హక్ 15, నజ్ముల్ షాంటో 19, ముష్ఫికర్ రహీం 26, మెహిది హసన్ 11 పరుగులకు ఔటయ్యారు.290/2 స్కోర్ వద్ద ఇవాళ (మూడో రోజు) ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 168 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ నిస్సంక తన సెంచరీకి మరో 12 పరుగులు జోడించి 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య తన వ్యక్తిగత స్కోర్కు మరో 5 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లలో కుసాల్ మెండిస్ (84) సెంచరీకి చేరువై ఔట్ కాగా.. కమిందు మెండిస్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అంతకుముందు దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. లహీరు ఉడార 40 పరుగులు చేశాడు. మొత్తంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 458 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 5 వికెట్లు తీశాడు. నయీమ్ హసన్ 3, నహిద్ రాణా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ వికెట్కీపర్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో ఆ దేశం తరఫున అత్యధిక మంది ఔట్ చేయడంలో భాగమైన వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో దినేశ్ చండీమల్ క్యాచ్ పట్టడం ద్వారా లిట్టన్ దాస్ ఈ ఘనత సాధించాడు. లిట్టన్కు ముందు బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక డిస్మిసల్స్ రికార్డు ముష్ఫికర్ రహీం పేరిట ఉంది. ముష్ఫికర్ 99 ఇన్నింగ్స్ల్లో 113 డిస్మిసల్స్లో (98 క్యాచ్లు, 15 స్టంపౌట్లు) భాగంగా కాగా.. లిట్టన్ కేవలం 65 ఇన్నింగ్స్ల్లోనే (114) ముష్ఫికర్ రికార్డును బద్దలు కొట్టాడు. లిట్టన్ డిస్మిసల్స్లో 99 క్యాచ్లుండగా.. 15 స్టంపౌట్లు ఉన్నాయి.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో విజయవంతమైన టాప్-4 వికెట్ కీపర్లు..లిట్టన్ దాస్-114ముష్ఫికర్ రహీం-113ఖలీద్ మసూద్-87నురుల్ హసన్-34మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి, 43 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (146) వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య (5) క్రీజ్లో ఉన్నాడు.లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ లహీరు ఉడారా 40 పరుగులతో రాణించాడు. తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ (రెండో రోజు) మరో 27 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు. నిస్సంక వరుస సెంచరీలుశ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో (146 నాటౌట్) మెరిశాడు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న శ్రీలంక బ్యాటింగ్ సంచలనం
శ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో మెరిశాడు. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నిస్సంక 167 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతను 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా దినేశ్ చండీమల్ (59) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో లహీరు ఉడారా 40 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్లో ఔటయ్యాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ మరో 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
బంగ్లాదేశ్ 220/8
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో భారీ స్కోర్లు చేసిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్లో అదే జోరు కనబర్చలేకపోయింది. బుధవారం కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (93 బంతుల్లో 46; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ముషి్ఫకర్ రహీమ్ (75 బంతుల్లో 35; 5 ఫోర్లు), లిటన్ దాస్ (56 బంతుల్లో 34; 3 ఫోర్లు), మెహదీ హసన్ మిరాజ్ (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. వీరంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. క్లిష్టతరమైన పిచ్పై పరుగులు రాబట్టేందుకు తడబడుతూ లంక బౌలర్లకు వికెట్లు అప్పగించుకున్నారు. గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలతో ఆకట్టుకున్న బంగ్లా కెపె్టన్ నజు్మల్ హసన్ షంటో (8) విఫలం కాగా... మరో ఓపెనర్ అనాముల్ హక్ (0) డకౌటయ్యాడు. తైజుల్ ఇస్లామ్ (9 బ్యాటింగ్), ఇబాదత్ హుసేన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ సోనాల్ దినుశా, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో రెండేసి వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏంజెలో మాథ్యూస్ స్థానంలో సోనాల్ దినుశా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. -
తొలి టెస్ట్లో హిట్.. రెండో టెస్ట్లో ఫట్
కొలొంబో వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46), మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25) రెండంకెల స్కోర్లు చేయగా.. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8 పరుగులకు ఔటయ్యారు. ఆట ముగిసే సమయానికి తైజుల్ ఇస్లాం (9), ఎబాదత్ హోసేన్ (5) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (14-2-43-2), విశ్వ ఫెర్నాండో (16-3-35-2), సోనల్ దినుష (9-3-22-2), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (16-1-63-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ల్లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం (163), శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (187) సెంచరీలు చేశారు.తొలి టెస్ట్లో హిట్.. రెండో టెస్ట్లో ఫట్తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అదరగొట్టాడు. అయితే ఇవాళ ప్రారంభమైన రెండో టెస్ట్లో మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు. తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన ముష్ఫికర్.. రెండో టెస్ట్లో ఓ మోస్తరు స్కోర్ (35) చేసి ఔటయ్యాడు. తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీలు చేసి హిట్ అయిన నజ్ముల్ హసన్.. రెండో టెస్ట్లో సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటై ఫట్ అనిపించాడు. -
పోరాడిన కమిందు మెండిస్.. అయినా బంగ్లాదేశ్కే స్వల్ప ఆధిక్యం
గాలే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక అద్బుతమైన పోరాటం కనబర్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ చేయగా.. శ్రీలంక కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 485 పరుగులకు ఆలౌటై, బంగ్లాదేశ్కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చింది.368/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో 107 పరుగులు చేసి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ (87) అద్బుతమైన పోరాటం చేసి తన జట్టును బంగ్లాదేశ్ స్కోర్కు దగ్గరగా తీసుకెళ్లాడు. ఇవాళ ఆటలో కమిందు రత్నాయకేతో (39) అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కమిందు ఔటయ్యాక చివరి వరుస బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను అధిగమించలేకపోయింది.అంతకుముందు పథుమ్ నిస్సంక (187) భారీ సెంచరీతో చెలరేగడంతో లంక ఇన్నింగ్స్ను బలమైన పునాది పడింది. నిస్సంక చండీమల్ (54) సాయంతో లంక ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. ఇతర బ్యాటర్లలో లహీరు ఉడార 29, ఏంజెలో మాథ్యూస్ 39, ధనంజయ డిసిల్వ 19, కుసాల్ మెండిస్ 5, తిరుండ రత్నాయకే 0, అశిత ఫెర్నాండో 4 పరుగులకు ఔటయ్యారు. ప్రభాత్ జయసూర్య 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నయీమ్ హసన్ 5 వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, తైజుల్ ఇస్లాం, మొమినుల్ తలో వికెట్ దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (350 బంతుల్లో 163; 9 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(279 బంతుల్లో 148; 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (123 బంతుల్లో 90; 11 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. మిలన్ రత్నాయకే, తరిందు రత్నాయకే తలో 3 వికెట్లు సాధించారు. -
శ్రీలంక @ బంగ్లాదేశ్
గాలే: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) తాజా విజేత దక్షిణాఫ్రికా సంబరాలు ఇంకా ముగియక ముందే తర్వాతి డబ్ల్యూటీసీకి తెర లేచింది. 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. గాలే వేదికగా నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొన్నాళ్ల క్రితమే సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో 0–2తో చిత్తయిన లంక కోలుకొని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ కోసం లంక ఏకంగా ఆరుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేయగల తరిందు రత్ననాయకే ఈ టెస్టుతో అరంగేట్రం చేయడం ఖాయమైంది. టీమ్లో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిస్థితి ఎప్పటిలాగే బలహీనంగా కనిపిస్తోంది. జింబాబ్వేతో సిరీస్ను 1–1తో ముగించిన తర్వాత మళ్లీ ఆ టీమ్ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. ఒక్క ఆటగాడు కూడా ఫామ్లో కనిపించడం లేదు. కెపె్టన్ నజు్మల్ గత 10 టెస్టుల్లో 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగా, సీనియర్ బ్యాటర్ ముషి్ఫకర్ గత 13 ఇన్నింగ్స్లలో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గాలే పిచ్ స్పిన్కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు స్పిన్పై బాగా దృష్టి పెట్టాయి. మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్ జట్టుకు కీలకం కానున్నారు. మ్యాచ్కు వర్షం కొంత అంతరాయం కలిగించవచ్చు. -
రేపటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ప్రారంభం
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ గత శనివారం జరిగిన ఫైనల్తో ముగిసింది. తుది పోరులో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఛాంపియన్గా అవతరించింది. తద్వారా డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.🚨 FULL SCHEDULE OF WTC 2025-27 CYCLE 🚨 pic.twitter.com/AsXZpsLh1s— Johns. (@CricCrazyJohns) June 17, 2025రేపటి నుంచి కొత్త సైకిల్ ప్రారంభంవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) రేపటి నుంచి (జూన్ 17) జరుగబోయే శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్తో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో శ్రీలంక బంగ్లాదేశ్కు రెండు టెస్ట్లకు ఆతిథ్యమివ్వనుంది. తొలి టెస్ట్ జూన్ 17 నుంచి 21 వరకు గాలే వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ జూన్ 25 నుంచి 29 వరకు కొలొంబోలో జరుగనుంది.ఈ మధ్యలోనే భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరు జట్ల మధ్య హెడింగ్లేలో తొలి మ్యాచ్ జరుగనుంది.ఈ సైకిల్లో మొత్తం 71 మ్యాచ్లు2025-27 డబ్ల్యూటీసీ ఎడిషన్లో మొత్తం 71 మ్యాచ్లు (9 జట్ల మధ్య) జరుగనున్నాయి. ఇందులో తాజా ఎడిషన్ రన్నరప్ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 మ్యాచ్లు ఆడనుంది. ఆసీస్ తర్వాత ఇంగ్లండ్ (21) రెండో అత్యధిక మ్యాచ్లు ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా రానున్న ఎడిషన్లో కేవలం 14 మ్యాచ్లు ఆడుతుంది. భారత్ 18, న్యూజిలాండ్ 16, వెస్టిండీస్ 14, పాకిస్తాన్ 13, బంగ్లాదేశ్, శ్రీలంక తలో 12 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సైకిల్లో భారత్ ఆడబోయే మ్యాచ్లు..స్వదేశంలోవెస్టిండీస్తో (2)సౌతాఫ్రికాతో (2)ఆస్ట్రేలియాతో (5)ప్రత్యర్ధి దేశంలోఇంగ్లండ్తో (5)శ్రీలంకతో (2)న్యూజిలాండ్తో (2) -
ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్ నుంచి మయన్మార్లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్కున్న రిజిస్ట్రేషన్ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు’ జమాత్ నాయకుడు అజహరుల్ ఇస్లామ్ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్కు భారత్ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్ చేస్తున్న డిమాండ్కు యూనస్ నిర్ణయించిన ఏప్రిల్ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్ స్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్ అధినేత షఫీకుర్ రహమాన్ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు. -
Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం
ఢాకా : బంగ్లాదేశ్లో మరో విధ్వంసం చోటుచేసుకుంది. సిరాజ్గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఒక సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.సందర్శకుడిని బంధించి..స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కచ్చరిబారికి ఒక సందర్శకుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు. మోటారుసైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఆ సందర్శకుడికి, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సందర్శకుడిని కార్యాలయ గదిలో బంధించి, మ్యూజియం సిబ్బంది అతనిపై దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దర్యాప్తుకు ప్రత్యేక కమిటీఇది స్థానికులలో ఆగ్రహానికి కారణమయ్యింది. వారంతా దీనిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. తర్వాత వారు కచ్చరిబారి ఆడిటోరియంలోకి చొరబడి ధ్వంసం చేశారు. సంస్థ డైరెక్టర్పై దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటన నేపధ్యంలో ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఐదు రోజులలోగా కమిటీ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. కచ్చరిబారి అధికారి హబీబుర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల కారణంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశామన్నారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహి డివిజన్లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలాకాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. దీనిని మ్యూజియంగా మలచారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే..
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ లేఖను పోస్ట్ చేశారు.ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు. pic.twitter.com/gNlLbLv3E6— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్కు రాసిన లేఖలో భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్ -
బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.2025లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్హసీనా దేశం విడిచిపెళ్లిపోయిన దరిమిలా ఆ దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ, రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాగా గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్ను కోరింది.ఇది కూడా చదవండి: ‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్ -
‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ -
సత్వరం ఎన్నికలు
ఢాకా: బంగ్లాదేశ్లో మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్పై ఒత్తిళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. డిసెంబర్లోగా ఎన్నికల జరపాలనే డిమాండ్తో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బుధవారం దేశవ్యాప్తంగా కదం తొక్కింది. రాజధాని ఢాకా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలతో హోరెత్తించింది. దేశ నలుమూలల నుంచి ఆ పార్టీ యువ కార్యకర్తలు వేలాదిగా వాటిలో పాల్గొన్నారు. యూనస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహా్మన్ దుయ్యబట్టారు. గతంలో తాత్కాలిక సారథులంతా మూడు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదిత సంస్కరణల అమలును వీలైనంతగా పూర్తి చేసి డిసెంబర్, జూన్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని జపాన్ పర్యటనలో ఉన్న యూనస్ పురుద్ఘాటించారు. -
‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. "Shoot me, bury me here, in Ganabhaban". These were the words of deposed Bangladeshi Prime Minister Sheikh Hasina on the fateful morning of August 5, 2024, as army officers asked her to resign amid violent student protests. Hasina eventually fled to India hours before protesters… pic.twitter.com/JzfwBtHUMp— India Today Global (@ITGGlobal) May 28, 2025 -
బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు. -
బంగ్లాదేశ్లో ముసలం!
జవాబుదారీతనం లేని అధికారం అరాచకానికి దారితీస్తుంది. దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. బంగ్లాదేశ్లో నిరుడు ఆగస్టు తిరుగుబాటు తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగావున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకపక్క సత్ప్రవర్తన లేని ప్రభుత్వోద్యోగులకు త్వరగా ఉద్వాసన పలికేవిధంగా సర్వీసు నిబంధనలు మార్చటం, మరోపక్క అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలివ్వటంలో విఫలం కావటం వగైరాలు అసంతృప్తికి దారితీసి నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె సాగుతోంది. ఈలోగా అమెరికా ఒత్తిడికి లొంగి లోపాయకారీగా సెయింట్ మార్టిన్స్ దీవిని కట్టబెట్టేందుకు యూనస్ పావులు కదిపారు. అంతేకాదు... దాని ఆదేశాలతో చిట్ట గాంగ్– రఖినే కారిడార్ను ‘మానవతా సాయం’ అందించటానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైనా దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తంకావటంతో పాటు సైన్యం నుంచి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా పది నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చలాయి స్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరంలేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కటార్లతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీచేస్తూ హడావిడి మొదలుపెట్టారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడిరోడ్డుపై దండించటం, జైళ్లపాలు చేయటం కొనసాగాయి. మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ అరెస్టులు మామూలే. వీటని సరిదిద్దటానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగారు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్గా వున్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరిచి, దాన్ని నెత్తినపెట్టుకోవటం మొదలుపెట్టారు. చైనాకు పోయి దాంతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నించారు. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం మాని భారత్ను చీకాకు పెట్టడమే లక్ష్యంగా యూనస్ వ్యవహారశైలివుంది.ఎల్లకాలమూ ఇలాగే సాగిపోతుందనుకుంటే చెల్లదు. పాత ప్రభుత్వం పతనమై పది నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించదేమన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 2026 మధ్య వరకూ ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదన్నట్టు యూనస్ ప్రభుత్వం ఈమధ్య లీకులిస్తుండగా,బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్–ఉజ్–జమాన్ ఈ ఏడాది ఆఖరిలోగా ఎన్నికలు జరిగి తీరాలని నిర్దేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకొస్తే తాము తిరిగి బ్యారక్లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లా డుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇది యూనస్కు మింగుడు పడలేదు. అలాగని ప్రభు త్వాన్ని నడపటం ఆయనకు చేతకావటం లేదు. ప్రభుత్వంలోని మత ఛాందసవర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్టల్లా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ఠ పోగొట్టుకున్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే.బంగ్లా అధీనంలోవున్న సెయింట్ మార్టిన్స్ దీవి వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగాళాఖాతంలో మన దేశం, మయన్మార్ కూడా దీనికి సమీపంగా ఉంటాయి. పదివేలమంది బంగ్లా పౌరులు నివసించే ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుంచో కలలుగంటున్నది. హిందూ మహా సముద్రంలో డీగో గార్షియా దీవిలో స్థావరం ఉన్నా, బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. ఈ దీవిపై అమెరికా మాత్రమే కాదు... చైనా కన్ను కూడా పడింది. మయన్మార్ సైతం వీలైతే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సాగర చట్టాల ట్రిబ్యునల్ 2012లో ఈ దీవి బంగ్లాదేశ్కు చెందుతుందని, 12 నాటికల్ మైళ్ల మేర ప్రాంతం ఆ దేశానిదేనని తీర్పునిచ్చినా అడపా దడపా మయన్మార్తో సమస్యలు తప్పడం లేదు. ఆ దేశ సైన్యం అక్కడ మసిలే బంగ్లా పౌరులను అపహరించటం, కాల్పులు జరపటం రివాజుగా మారింది. దీన్ని అమెరికాకూ లేదా చైనాకూ అప్పగిస్తే మన దేశ భద్రతకు ముప్పు కలుగుతుంది. కానీ యూనస్ భారత్పై వ్యతిరేకతతో ఈ దీవిని అమెరికాకు అప్పగించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను కూడా బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికే వదలాలని సూచించింది. అలాగే చిట్టగాంగ్–రఖినే కారిడార్ విషయంలోనూ సైన్యం పట్టుదలతో ఉంది. మయన్మార్లో సైనిక ముఠా ప్రభుత్వ దాడుల్లో చిక్కుకున్న రఖినే ప్రాంతానికి నిత్యావసరాలు, మందులు, ఆహారం అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన మాట వాస్తవం. అమెరికా సైతం ఈ కృషిలో పాలుపంచుకుంటామని తెలిపింది. అయితే ఈ మాటున కారిడార్ ఆనుపానులన్నీ అమెరికా తెలుసుకుంటుందన్నది బంగ్లా సైన్యం బెంగ.తన నిర్ణయాలను హసీనాయే కాదు... బీఎన్పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించటంతో యూనస్కు ఎటూ పాలుపోలేదు. అందుకే రాజీనామా బెదిరింపులకు దిగారు. కానీ దానికెవరూ కంగారు పడిన దాఖలా లేకపోవటంతో వెనక్కి తగ్గారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించటం చేతకాని తన వ్యవహారశైలితో బంగ్లాదేశ్ను ఏం చేద్దామనుకుంటున్నారో యూనస్ ఆలోచించుకోవాలి. నడమంత్రపు సిరిలా వచ్చిపడిన అధికారం అండతో దేశాన్ని భ్రష్టుపట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించటమే గౌరవప్రదమని గ్రహించాలి. -
విదేశీ భార్యల మోజులో పడొద్దు
ఢాకా: బంగ్లాదేశ్కు చెందిన ఆన్లైన్ డేటింగ్, పెళ్లిళ్ల బ్యూరోల వలలో పడొద్దని చైనా ఎంబసీ తమ పౌరులను హెచ్చరించింది. తమ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో కొందరు అక్రమ మార్గంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. అయితే, వీటి కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతు న్నట్లు గుర్తించింది. దీనిపై తాజాగా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిందని చైనా ప్రభుత్వ ‘గ్లోబల్ టైమ్స్’పేర్కొంది. ఆన్లైన్లోని షార్ట్ వీడియో వేదికలపై వచ్చే మోసపూరిత ‘క్రాస్–బోర్డర్ డేటింగ్’వలలో పడొద్దని కోరింది. అనధికార నెట్వర్క్లు, పెళ్లిళ్ల బ్యూరోల్లో ‘ఫారిన్ వైవ్స్’అంటూ వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని పేర్కొంది. ఇలాంటి వాటిపై చైనాలో నిషేధం ఉందని వెల్లడించింది. విదేశీయులను భార్య లుగా తెచ్చుకోవాలన్న ఆలోచన మానుకోవాలంది. బంగ్లాదేశీ యులను పెళ్లి చేసుకునేముందు అన్ని వివరాలను కూలంకషంగా తెలుసుకోవాలని సూచించింది. ఒకే సంతానం అనే కఠిన మైన విధానాన్ని చైనా ప్రభుత్వం ఎత్తి వేయడం, జంటలు మగ సంతానం వైపు చూపుతున్న మొగ్గుతో జనాభాలో లింగపరమైన అసమతుల్యత తీవ్రరూపం దాల్చింది. చైనాలో ప్రస్తుతం దాదా పు 3 కోట్లు మంది పురుషులు అవివాహితులుగా మిగిలిపోయి నట్లు అంచనా. దీంతో, విదేశీ మహిళలను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఎక్కువమంది ఉంటున్నారు. పెళ్లి పేరుతో బంగ్లాదేశీ మహిళలను చైనీయులకు విక్రయించిన కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ రవాణా దందా వెనుక నేరగాళ్ల ముఠాలు ఉన్నట్లు తేలింది. బెదిరించి, చట్ట విరుద్ధంగా చేసుకునే ఇలాంటి పెళ్లిళ్లతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అక్రమ పెళ్లిళ్ల దందాకు వేదికగా మారిన పెళ్లిళ్ల బ్యూరోలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. అక్రమ సంబంధాలు, పెళ్లిళ్ల బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని కూడా చైనా రాయబార కార్యాలయం కోరింది. బంగ్లాదేశ్ మహిళలతో చట్ట విరుద్ధంగా లైంగిక సంబంధాలు పెట్టుకునే వారు మానవ అక్రమ రవాణా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారికి కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, గరిష్టంగా జీవిత ఖైదు, రూ.16 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని ముఠాలు బంగ్లాదేశ్ మహిళలను పొరుగునున్న భారత్కు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టిక్టాక్ ద్వారా మహిళలను వేశ్యావృత్తిలోకి దించుతున్న 11 మందిని గతంలో ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. -
IPL 2025: అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్గా ముస్తాఫిజుర్
ఐపీఎల్లో అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్గా ముస్తాఫిజుర్ రెహ్మాన్ రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లాదేశీ బౌలర్గా అవతరించాడు. ఈ క్రమంలో ఫిజ్.. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్కు అధిగమించాడు. షకీబ్ ఐపీఎల్లో 63 వికెట్లు తీయగా.. ఫిజ్ 65 వికెట్లు (60 మ్యాచ్ల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సీజన్లో లేట్గా (ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత స్టార్క్కు ప్రత్యామ్నాయంగా) ఎంట్రీ ఇచ్చిన ఫిజ్ (ఢిల్లీ క్యాపిటల్స్).. నిన్న (మే 24) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీయడంతో షకీబ్ రికార్డును బద్దలు కొట్టాడు.2016 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఫిజ్.. ఆ సీజన్లో సన్రైజర్స్ ఛాంపియన్గా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో ఫిజ్ 16 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. సన్రైజర్స్ తర్వాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్లకు ప్రాతినిథ్యం వహించిన ఫిజ్.. ఆయా జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు.ఈ సీజన్లో ఢిల్లీ తరఫున మూడే మ్యాచ్లు ఆడిన ఫిజ్ తనదైన మార్కును చూపించాడు. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఫిజ్ తొలుత ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను, ఆతర్వాత శశాంక్ సింగ్, మార్కో జన్సెన్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఫిజ్ కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ పంజాబ్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.పంజాబ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్ (28), జోష్ ఇంగ్లిస్ (32), స్టోయినిస్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ప్రియాంశ్ ఆర్య (6), నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1), మార్కో జన్సెన్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్, కుల్దీప్ తలో 2, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి (58 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. కరుణ్ నాయర్ (44), కేఎల్ రాహుల్ (35), డుప్లెసిస్ (23), సెదీఖుల్లా అటల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా అదే తరహా ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2, జన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
ఆర్మీ వర్సెస్ యూనుస్
ఢాకా: కొద్ది నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మారిన బంగ్లాదేశ్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్, బీఎన్పీ చేస్తున్న ఒత్తిడిపై యూనుస్ వర్గం మండిపడుతోంది. బ్లాక్మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపణలకు దిగింది. సర్కారును కాపాడుకునేందుకు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనుస్ వర్గం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనుస్ ఆదివారం పలు పారీ్టలతో భేటీ కానున్నారు. 2026 జూన్కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్ సర్కారు చెబుతుండగా వచ్చే డిసెంబర్లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బీఎన్పీ ప్రేరేపిత ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా గత ఆగస్టులో దేశం వీడి భారత్లో ఆశ్రయం పొందడం తెలిసిందే. ఆర్మీ ఒత్తిళ్ల నేపథ్యంలో యూనుస్ తప్పుకుంటున్నట్టు తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించడం తెలిసిందే. -
‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు. -
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?
-
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా?
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI— Deep Halder (@deepscribble) May 22, 2025యూనస్ను సవాళ్లు.. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ‘బ్లడీ కారిడార్’మరోవైపు.. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. -
అది బ్లడీ కారిడార్
ఢాకా: బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడం మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెల్సుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’అని పరిశీలకులు అంటున్నారు. వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.ఏమిటీ కారిడార్..? బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దుల్లోని చట్టోగ్రామ్ ప్రాంతం నుంచి మయన్మార్లో అంతర్యుద్ధం, భూకంపం కారణంగా తీవ్రంగా నలిగిపోతున్న రఖైన్ ప్రాంతంలోని 20 లక్షల మంది పౌరులకు మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన మార్గమే రఖైన్ కారిడార్. ఈ నడవా ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి నుంచి అందిన వినతిపై యూనస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సైన్ ఇటీవల చేసిన ప్రకటనే ఈ అసంతృప్తి జ్వాలకు ఆజ్యం పోసింది. యూనస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖలేదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), కొన్ని వామపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవ్యతిరేకమంటూ మండిపడ్డాయి. ప్రజల ప్రయోజనాలకు గాలికొదిలేసి విదేశీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. ఎలాంటి నిర్ణయమైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్లో చర్చించి తీసుకోవాలని పేర్కొంది. ఏదేమైనా, తాత్కాలిక ప్రభుత్వం కారిడార్ ఏర్పాటుపై ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. చైనాకు చెక్ పెట్టే ఎత్తుగడతోనే అమెరికా ప్రభుత్వం చేసిన ఒత్తిడులకు యూనస్ లొంగిపోయారని పరిశీలకులు అంటున్నారు. మానవీయ సాయం పేరుతో బంగ్లాదేశ్లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, సైనిక, నిఘా పరమైన అవసరాలకు దీనిని వాడుకునే అవకాశముందని ఢాకా ట్రిబ్యూన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారిడార్ ఏర్పాటైతే బంగ్లాదేశ్తోపాటు మయన్మార్ సార్వభౌమత్వమూ ప్రమాదంలో పడుతుందని తన కథనంలో పేర్కొంది. తాజా నిర్ణయమేమంటే.. ఆర్మీ చీఫ్ హెచ్చరికలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో యూనస్ సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించే ఖలీలుర్ రహా్మన్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. రఖైన్ కారిడార్ గురించి తమ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని, ఇకముందు కూడా చర్చించదని స్పష్టం చేశారు. ‘దేశ సరిహద్దులకు సమీపంలోని రఖైన్ ప్రాంత వాసులకు మానవతా సాయం అందించే విషయంలో వీలుంటే సాయం చేయాలని మాత్రమే ఐక్యరాజ్యసమితి కోరింది. ఈ వినతిని పరిగణనలోకి తీసుకుంటామని మాత్రం చెప్పాం’అంటూ మాటమార్చారు. అంతకుముందు, ఏప్రిల్లో ఆయన..‘రఖైన్ కారిడార్ ఏర్పాటుపై ఐరాస ప్రతిపాదనకు ప్రభుత్వం షరతులతో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఆ షరతులేమిటో ఆయన వివరించలేదు. -
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
-
రికార్డు విజయం.. బంగ్లాదేశ్కు షాకిచ్చిన యూఏఈ
క్రికెట్ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్ కోసం యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.రాణించిన బంగ్లా బ్యాటర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. టాపార్డర్ బ్యాటర్లు తంజిద్ హసన్ (59), లిటన్ దాస్ (40), నజ్ముల్ హసన్ షాంటో (27), తౌహిద్ హృదోయ్ (45), జాకిర్ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.యూఏఈని గెలిపించిన కెప్టెన్అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో ధృవ్ పరాషార్ (11), హైదర్ అలీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్, నహిద్ రాణా, రిషద్ హొసేన్ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లాం, తంజిమ్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.


