breaking news
Bangladesh
-
రిషాద్ ‘సిక్సర్’
మీర్పూర్: ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్లో ‘వైట్ వాష్’కు గురైన వెస్టిండీస్ జట్టు... బంగ్లాదేశ్ పర్యటనను కూడా పరాజయంతోనే ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (90 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మహిదుల్ ఇస్లామ్ (46), నజ్ముల్ హుసేన్ షంటో (32) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టగా... రోస్టన్ చేజ్, జస్టన్ గ్రీవ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులభతర లక్ష్యఛేదనలో కరీబియన్ జట్టు విఫలమైంది. బ్యాటర్లంతా తేలపోవడంతో చివరకు 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (60 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుసేన్ 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విండీస్ టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది. బ్యాటింగ్లోనూ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, 2 సిక్స్ల సాయంతో 26 పరుగులు చేసిన రిషాద్... బౌలింగ్ అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది. -
ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్లోని ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్ షాహ్జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్ నంబర్ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు -
బంగ్లాదేశ్లో మళ్లీ జనాగ్రహం
ఢాకా: బంగ్లాదేశ్లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది. నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్ జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఏమిటీ చార్టర్? మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది. -
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్తో జరిగిన మ్యాచ్లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్ఫీల్డ్ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్ చాంపియన్కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ను కూడా అందించింది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్ ఆటగాళ్లు నాలుగు క్యాచ్లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్హామ్, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డ్నర్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్; 20 ఫోర్లు) కెరీర్లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచింది. బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. -
వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్తో మ్యాచ్లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
30 ఏళ్లుగా భారత్లో ‘బంగ్లా’ ట్రాన్స్.. నకిలీ పత్రాలతో హల్చల్
ముంబై: భారత్లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్కు చెందిన ట్రాన్స్ జెండర్ను అరెస్టు చేశారు.ట్రాన్స్ జెండర్ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.ఇదిలావుండగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ‘హైదర్పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
నబీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
మూడు మ్యాచ్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో (Bangladesh) ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (111 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్హమైన సెంచరీని రనౌటై, చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) కూడా రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 99 పరుగులు జోడించారు. ఆతర్వాత జద్రాన్ సెదిఖుల్లా అటల్ (29) సాయంతో ఇన్నింగ్స్ను పటిష్ట పరిచాడు. వీరిద్దరు రెండో వికెట్కు 74 పరుగులు జోడించారు.అయితే సెదిఖుల్లా ఔటయ్యాక ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. 76 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెటరన్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నాడు. నబీ ధాటికి ఆఫ్ఘన్ స్కోర్ రాకెట్లా పైకెళ్లి పోయింది. 249 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ పడ్డ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమే అనుకున్నారు.అయితే నబీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో నబీ 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నబీ ఇటీవల షార్జాలో కూడా ఇలాంటి సునామీ ఇన్నింగ్సే ఆడాడు. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు తొలుత పట్టు కోల్పోయినా, ఆతర్వాత పుంజుకున్నారు. సైఫ్ హసన్ 3, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం తలో 2, రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది.చదవండి: టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..? -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్ కాప్ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రయాన్ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై నెగ్గింది. సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్కు మూడో పరాజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్ (25) తొలి వికెట్కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్ నిగార్ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. షర్మిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే బ్రిట్స్ (0) వికెట్ కోల్పోగా... లారా వోల్వార్ట్ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్సెన్ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్ కాప్, ట్రయాన్ ఆరో వికెట్కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్లో పడింది. ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్ (29 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. భారత్ చేతుల్లోంచి మ్యాచ్ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. -
CWC 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (32), ఫర్జానా హాక్ (30), రూబ్యా హైదర్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేసినా.. చాలా నిదానంగా ఆడారు. వీరిలో ఫర్జానా మ్యాచ్ను చూసే వారికి విసుగు తెప్పించింది. 30 పరుగులు చేసేందుకు ఆమె ఏకంగా 76 బంతులు ఆడింది. రూబ్యా హైదర్ సైతం తాను చేసిన 25 పరుగుల కోసం 52 బంతులను ఎదుర్కొంది. హాఫ్ సెంచరీ చేసినా, షర్మిన్ అక్తర్ కూడా 77 బంతులు ఆడింది. నిగార్ సుల్తానా 42 బంతుల్లో 32 పరుగులు చేసింది. ఆఖర్లో రితూ మోనీ 8 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షోర్నా, రీతూ ఆఖర్లో వేగంగా ఆడకపోయుంటే బంగ్లాదేశ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లో ట్రయాన్, నదినే డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా నాలుగు, బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. సౌతాఫ్రికా కొద్ది రోజుల కిందట జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాపై విజయం సాధించింది. చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
Bangladesh: ‘అసలు హింసే లేదు’.. భారత్పై యూనస్ తీవ్ర ఆరోపణలు
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదని, అయితే భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. గత ఏదాది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత హిందువులపై మత పరమైన హింస జరిగిందంటూ వచ్చిన పలు అంతర్జాతీయ నివేదికలను ముహమ్మద్ యూనస్ తోసిపుచ్చారు. అవి భారతదేశం ప్రచురించిన అబద్ధపు వార్తలని పేర్కొన్నారు.ఇటీవల యూఎస్ జర్నలిస్ట్ మెహదీ హసన్తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ముహమ్మద్ యూనస్.. భూ విభజన, ఇతర స్థానిక సమస్యలపై పొరుగువారితో సాధారణ ఘర్షణలు ఉన్నాయని, అయితే వీటిని మతపరంగా చిత్రీకరించకూడదన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఫేక్ వార్తలలో ఒత్తిడి తెస్తున్నదని, అందుకే వీటిపై తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హసీనా పదవీచ్యుతురాలైన వెంటనే తమ దేశంలో మతపరమైన సంఘటనలకు సంబంధించిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలుగా మారాయన్నారు. హిందువుల విషయంలో యూనస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అనాగరికమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విమర్శించారని ఆయన గుర్తు చేశారు.గత నవంబర్లో దాదాపు 30 వేల మంది హిందువులు ఢాకా వీధుల్లో ర్యాలీ చేపట్టి, తమపై జరుగుతున్న దాడుల నుంచి యూనస్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ నాయకులపై ఉన్న దేశద్రోహ అభియోగాలను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరారు. మరోవైపు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు పలువురు భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాగా బంగ్లాదేశ్లోని హిందువులు తమను తాము హిందువులుగా కాకుండా బంగ్లాదేశ్ పౌరులుగా భావించాలని యూనస్ విజ్ఞప్తి చేశారు. -
న్యూజిలాండ్ బోణీ
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన కివీస్ జట్టు శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సుజీ బేట్స్ (29; 6 సిక్స్లు), ప్లిమర్ (4), అమెలియా కెర్ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. ఈ దశలో కెప్టెన్ సోఫీ డివైన్ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రూక్ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు 112 పరుగులు జోడించడంతో కివీస్ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్ (25; 3 ఫోర్లు), జెస్ కెర్ (0), రోజ్మేరీ (2), ఇసాబెల్లా గేజ్ (12) వికెట్లను కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్ (25; 2 ఫోర్లు) రాణించారు. జెస్ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుతో శ్రీలంక తలపడుతుంది. -
వెస్టిండీస్ జట్ల ప్రకటన.. మెరుపు వీరుడు ఔట్
త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వేర్వేరు వెస్టిండీస్ (West Indies) జట్లను ఇవాళ (అక్టోబర్ 9) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు షాయ్ హోప్ (Shai Hope) కెప్టెన్గా కొనసాగగా.. గాయం కారణంగా మెరుపు వీరుడు ఎవిన్ లూయిస్ (Evin Lewis) ఈ సిరీస్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ప్రస్తుత భారత పర్యటనకు దూరంగా ఉన్న యంగ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మాజీ అండర్-19 కెప్టెన్ అకీమ్ ఆగస్టేకి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అకీమ్ ఇప్పటికే విండీస్ తరఫున 3 టీ20లు ఆడి ప్రతిభ చాటాడు. ఎవిన్ లూయిస్ స్థానాన్ని అకీమ్ భర్తీ చేశాడు.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. అలిక్ అథనాజ్ రెండు ఫార్మాట్లకు ఎంపిక కాగా, రామోన్ సిమ్మండ్స్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. హోల్డర్ టీ20 జట్టుకు మాత్రమే ఎంపిక కాగా.. మోటీ, సీల్స్, షెపర్డ్ రెండు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్నారు.కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన ఈ సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్లు అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్లో పర్యటిస్తాయి. ప్రస్తుతం విండీస్ టెస్ట్ జట్టు రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో చిత్తుగా ఓడిన విండీస్ టెస్ట్ జట్టు.. రేపటి నుంచి రెండో టెస్ట్ ఆడనుంది.వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, బ్లేడ్స్, కార్టీ, చేజ్, గ్రీవ్స్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పియర్, రదర్ఫోర్డ్, సీల్స్, షెపర్డ్టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అథనాజ్, ఆగస్టే, చేజ్, హోల్డర్, హోసేన్, జాంగూ, జోసెఫ్, కింగ్, మోటీ, పౌవెల్, రదర్ఫోర్డ్, సీల్స్, షెపర్డ్, సిమ్మండ్స్షెడ్యూల్:తొలి వన్డే– అక్టోబర్ 18, ఢాకా రెండో వన్డే– అక్టోబర్ 21, ఢాకా మూడో వన్డే– అక్టోబర్ 23, ఢాకా తొలి టీ20– అక్టోబర్ 27, చట్టోగ్రామ్ రెండో టీ20– అక్టోబర్ 29, చట్టోగ్రామ్ మూడో టీ20– అక్టోబర్ 31, చట్టోగ్రామ్ చదవండి: వరుసగా రెండో మ్యాచ్లో శతక్కొట్టిన ఆసీస్ ప్లేయర్ -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టీ20 సిరీస్ పరాభవానికి ప్రతీకారం
టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టి ప్రత్యర్దికి షాకిచ్చింది. యూఏఈ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లలో తొలుత బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్ చేసింది.అబుదాబీ వేదికగా నిన్న (అక్టోబర్ 8) జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఆల్రౌండర్ షోతో అదరగొట్టాడు. రషీద్ ఖాన్ (Rashid Khan) తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా అర్ద సెంచరీలతో రాణించారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఒమర్జాయ్ (9-0-40-3), రషీద్ ఖాన్ (10-0-38-3), అల్లా ఘజన్ఫర్ (9.5-1-55-2) ధాటికి 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హృదోయ్ (56), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఆట ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ద సెంచరీలతో రాణించగా.. ఒమర్జాయ్ (40), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (33 నాటౌట్) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల ఈ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే అక్టోబర్ 11న ఇదే వేదికగా జరుగుతుంది. చదవండి: World Cup 2025: పాక్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
గట్టెక్కిన ఇంగ్లండ్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలిచింది. వన్డౌన్లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్కు డీన్తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో ఆ్రస్టేలియా తలపడనుంది. -
రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) జట్లు షార్జా, అబుదాబీ వేదికలుగా మూడు మ్యాచ్ల టీ20, వన్డేల్లో సిరీస్ల్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 2) తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ (40), మొహమ్మద్ నబీ (38) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్, రిషద్ చరో 2 వికెట్లు తీయగా.. తస్కిన్, నసుమ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 152 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్కు శుభారంభం లభించినా, ఆతర్వాత రషీద్ ఖాన్ (Rashid Khan) (4-0-18-4) తన స్పిన్ మాయాజాలంతో వారిని వణికించాడు. ఓపెనర్లు తంజిద్ (51), పర్వేజ్ ఎమోన్ (54) అర్ద సెంచరీలతో రాణించి తొలి వికెట్కు 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత రషీద్ ధాటికి 8 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఎట్టకేలకు నురుల్ హసన్ (23 నాటౌట్), రిషద్ హొసేన్ (14 నాటౌట్) బంగ్లాదేశ్ను విజయతీరాలకు చేర్చారు. మరో 8 బంతులు మిగిలుండగా ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). ఈ సిరీస్లో రెండో టీ20 ఇవాళే (అక్టోబర్ 3) జరుగనుంది. చదవండి: World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's World Cup 2025) సంచలనం నమోదైంది. పాకిస్తాన్ను (Pakistan) వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ (Bangladesh) చిత్తుగా ఓడించింది. కొలొంబో వేదికగా నిన్న (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 389.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు.పాక్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రుబ్యా హైదర్ (54) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాదేశ్ను గెలిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (23), శోభన మోస్తరి (24 నాటౌట్) రుబ్యాకు సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, డయానా బేగ్, రమీన్ షమీమ్కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.చదవండి: IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణ.. 129 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 2) పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో పాక్ 38.3 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు. కాగా, ప్రస్తుత ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. టోర్నీ ఓపెనర్లో ఆతిథ్య దేశాలు గౌహతిలో తలపడ్డాయి. ఇందులో భారత్ శ్రీలంకపై 59 పరుగుల తేడతో గెలుపొంది బోణీ కొట్టింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో రేపు (అక్టోబర్ 3) ఇంగ్లండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అక్టోబర్ 4న శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 5న కొలొంబో వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్లో భారత్ ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ పాక్పై మూడుసార్లు గెలుపొందింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ను నిరాకరించారు. టోర్నీ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పీసీబీ ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది. దీంతో చిర్రెత్తిపోయని ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ ట్రోఫీ సహా భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను ఎత్తుకెళ్లిపోయారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. చదవండి: చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా -
స్వల్ప ఆందోళనల నడుమ.. బంగ్లాలో వైభవంగా దుర్గా పూజలు
ఢాకా: బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు అత్యంత ఘనంగా దుర్గా పూజలను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించింది. చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో ఆదివారం దుర్గాదేవిని స్వాగతించడానికి భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. మారుమోగిన దుర్గాదేవి మంత్రాలు, డప్పు చప్పుళ్లు, శంఖు నాదాలు, ఆలయ గంటల నడుమ అమ్మవారిని ఆహ్వానించారు. మహా షష్టి రోజున దేవత ముఖాన్ని ఆవిష్కరించడంతో పండుగ మొదటి రోజు ఉత్సవం ప్రారంభమైందని స్థానికులు తెలిపారు. ‘ఈ ఏడాది పూజలను అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నాం’ అని బంగ్లాదేశ్ పూజా వేడుకల మండలి అధ్యక్షుడు బసుదేవ్ ధార్ మీడియాకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా పూజా మండపాల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన అన్నారు.ఇప్పటివరకు 11 దుర్గామండపాల వద్ద చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయని, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అరెస్టు చేశారని బసుదేవ్ ధార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 33,350 మండపాలలో దుర్గా పూజలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్బాద్ సంస్థ (బీఎస్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం దుర్గా పూజల నేపధ్యంలో దేశమంతటా దాదాపు రెండు లక్షల మంది పారా పోలీస్ సిబ్బంది, 15 వేల మందికి పైగా పారా మిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన 430 ప్లాటూన్లను నియమించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు 70 వేల మందికి పైగా పోలీసుల పహారా కాయనున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ దుర్గా పూజల సన్నాహాలు వీక్షించేందుకు డాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. -
Bangladesh: గిరిజన బాలికపై సామూహిక అకృత్యం.. నిరసనల్లో ముగ్గురు మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత హింస చెలరేగింది. అక్కడి చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస చెలరేగింది.బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు. -
Asia Cup 2025: భారత్ ప్రత్యర్థి పాక్
దుబాయ్: ‘చేతులు’ కలుపుకోలేని దాయాదులే టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్తో అమీతుమీకి పాకిస్తాన్ అర్హత సంపాదించింది. ఆదివారం ఈ తుది సమరం జరుగుతుంది. ఓవరాల్ ‘ఆసియా’ కప్ చరిత్రలో ఇరుజట్లు తొలిసారి ఫైనల్లో పోటీపడనున్నాయి. సెమీస్ కానీ సెమీస్ను తలపించిన సూపర్–4 మ్యాచ్లో పాకిస్తాన్ 11 పరుగులతో బంగ్లాదేశ్పై గెలిచింది. సాధారణంగా విధ్వంసరచన చేసే టి20 ఫార్మాట్ను ఈసారి బౌలర్లు శాసించారు. దీంతో 40 ఓవర్లలోనే 17 వికెట్లు కూలాయి. ముందుగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హరిస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. షాహిన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీయగా, సయీమ్ అయూబ్కు 2 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్లో తడబడి... బౌలింగ్తో గట్టెక్కి పాకిస్తాన్ బ్యాటింగ్లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు ఫర్హాన్ (4), ఫఖర్ జమన్ (13), సయీమ్ అయూబ్ (0) చేతులెత్తేశారు. తర్వాత తలత్ (3) కూడా వారిని అనుసరించగా, కెపె్టన్ సల్మాన్ ఆగా (23 బంతుల్లో 19; 2 ఫోర్లు), మొహమ్మద్ హరిస్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. నవాజ్ (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్లు), షాహిన్ అఫ్రిది (13 బంతుల్లో 19; 2 సిక్స్లు) 20 ఓవర్ల కోటా ఆడేందుకు దోహదపడ్డారు. బంగ్లా బౌలర్లు పాక్ను ఎలా దెబ్బకొట్టారో అదే బౌలింగ్ ఆయుధంతో పాకిస్తాన్ కూడా బంగ్లాను వణికించింది. షాహిన్ అఫ్రిది ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ (0)ను... కాసేపటికి వన్డౌన్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ (5)ని అవుట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ సైఫ్ హసన్ (18)ను రవూఫ్, మెహదీ హసన్ (11)ను నవాజ్ అవుట్ పెవిలియన్ చేర్చడంతో 44 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్లు) ఆశలు రేపినా... షాహిన్ అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్తో తుంచేశాడు. కెపె్టన్ జాకిర్ అలీ (5), తంజిమ్ హసన్ (10), తస్కిన్ అహ్మద్ (4)లు కూడా పాక్ బౌలర్లకు తలవంచడంతో వందలోపే (97/8) ఎనిమిది వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. -
ఫైనల్లో భారత్
అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్... ఆపై పదునైన బౌలింగ్... వెరసి ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్లో కాస్త తడబాటు కనిపించినా, చివరకు బంగ్లాదేశ్ను ఓడించడంలో టీమిండియా సఫలమైంది. టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన మన జట్టు దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది. గత మ్యాచ్లో శ్రీలంకపై స్ఫూర్తిదాయ ఆటను కనబర్చిన బంగ్లాదేశ్ ఈసారి టీమిండియా ముందు నిలవలేకపోయింది. ఇక భారత్తో తుది పోరుతో అమీతుమీ తలపడే జట్టేదో నేడు తేలనుంది. విరామం లేకుండా వరుసగా రెండో రోజు ఆడనున్న బంగ్లాదేశ్... పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజేతకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ‘సూపర్–4’ దశలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు) మరో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (51 బంతుల్లో 69; 3 ఫోర్లు, 5 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఇద్దరు మినహా మిగతా బంగ్లా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, వరుణ్ చెరో 2 వికెట్లు తీశారు. మధ్య ఓవర్లలో తడబాటు... భారత ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లలో ప్రశాంతత... ఒకే ఒక ఫోర్తో 17 పరుగులే వచ్చాయి! 7 పరుగుల వద్ద అభిషేక్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ జాకీర్ వదిలేయడం కూడా కలిసొచ్చిoది. అయితే పవర్ప్లేలో మిగిలిన 3 ఓవర్లలో అభిషేక్ విశ్వరూపం చూపించగా, గిల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. నసమ్ వేసిన నాలుగో ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టగా చివరి బంతిని అభిషేక్ సిక్స్ బాదాడు. ముస్తఫిజుర్ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన అభిషేక్...సైఫుద్దీన్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ మూడు ఓవర్లలో కలిపి 55 పరుగులు రావడంతో పవర్ప్లేలో స్కోరు 72 పరుగులకు చేరింది. అయితే పవర్ప్లే తర్వాత భారత్ అనూహ్యంగా తడబడింది. ఒక వైపు 25 బంతుల్లోనే అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మరోవైపు ఆరు పరుగుల వ్యవధిలో గిల్, శివమ్ దూబే (2) అవుటయ్యారు. జోరు మీదున్న అభిషేక్ ఇన్నింగ్స్ కూడా దురదృష్టవశాత్తూ రనౌట్తో ముగిసింది. ముస్తఫిజుర్ వేసిన బంతిని సూర్యకుమార్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... ఫీల్డర్ ఆపిన విషయాన్ని గుర్తించని అభిషేక్ చాలా ముందుకు దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోగా, అదే ఓవర్లో సూర్య కూడా అవుటయ్యాడు. తిలక్ వర్మ (5) విఫలం కాగా, 22 బంతుల పాటు భారత్కు బౌండరీనే రాలేదు! ఈ దశలో పాండ్యా దూకుడు జట్టుకు కాస్త మెరుగైన స్కోరును అందించింది. అయితే చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. అక్షర్ (15 బంతుల్లో 10) బంతులు వృథా చేయగా... ప్రధాన బ్యాటర్ సంజు సామ్సన్కు ఆడే అవకాశమే ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టపటపా... ఛేదనలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించలేకపోయింది. సైఫ్ మినహా ఎవరూ ప్రభావం చూపలేదు. అక్కడక్కడ కొన్ని చక్కటి షాట్లు ఆడినా బ్యాటింగ్ బృందం సమష్టిగా విఫలమైంది. ఆరంభంలోనే తన్జీద్ (1) వెనుదిరగడంతో సైఫ్, పర్వేజ్ (21) కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 30 బంతుల్లో 42 పరుగులు జోడించారు. పవర్ప్లేలో జట్టు 44 పరుగులు చేసింది. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే పర్వేజ్ను అవుట్ చేయడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాటర్లు అవుట్ కావడంతో గెలుపుపై జట్టు ఆశలు కోల్పోయింది. మరో ఎండ్లో సైఫ్ పోరాడినా లాభం లేకపోయింది. 36 బంతుల్లో సైఫ్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. బంగ్లా 18 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.150 అంతర్జాతీయ టి20ల్లో ముస్తఫిజుర్ వికెట్ల సంఖ్య. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షకీబ్ అల్ హసన్ (149)ను అతను అధిగమించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (రనౌట్) 75; గిల్ (సి) తన్జీద్ (బి) రిషాద్ 29; దూబే (సి) తౌహీద్ (బి) రిషాద్ 2; సూర్యకుమార్ (సి) జాకీర్ (బి) ముస్తఫిజుర్ 5; పాండ్యా (సి) తన్జీద్ (బి) సైఫుద్దీన్ 38; తిలక్ (సి) సైఫ్ (బి) తన్జీమ్ 5; అక్షర్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–77, 2–83, 3–112, 4–114, 5–129, 6–168. బౌలింగ్: తన్జీమ్ 4–0–29–1, నసుమ్ 4–0–34–0, ముస్తఫిజుర్ 4–0–33–1, సైఫుద్దీన్ 3–0–37–1, రిషాద్ 3–0–27–2, సైఫ్ 2–0–7–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) అక్షర్ (బి) బుమ్రా 69; తన్జీద్ (సి) దూబే (బి) బుమ్రా 1; పర్వేజ్ (సి) అభిషేక్ (బి) కుల్దీప్ 21; తౌహీద్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 7; షమీమ్ (బి) వరుణ్ 0; జాకీర్ (రనౌట్) 4; సైఫుద్దీన్ (సి) తిలక్ (బి) వరుణ్ 4; రిషాద్ (సి) తిలక్ (బి) కుల్దీప్ 2; తన్జీమ్ (బి) కుల్దీప్ 0; నసుమ్ (నాటౌట్) 4; ముస్తఫిజుర్ (సి) అక్షర్ (బి) తిలక్ 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–65, 4–74, 5–87, 6–109, 7–112, 8–112, 9–116, 10–127. బౌలింగ్: పాండ్యా 2–0–14–0, బుమ్రా 4–0–18–2, వరుణ్ 4–0–29–2, కుల్దీప్ 4–0–18–3, అక్షర్ 4–0–37–1, దూబే 1–0–10–0, తిలక్ 0.3–0–1–1. -
మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్
-
భారత్కు ఎదురుందా!
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అలవోక విజయాలతో దూసుకెళుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సైతం ఎలాంటి పోటీ ఎదురవలేదు. లీగ్ దశ, సూపర్–4లోనూ పాక్పై టీమిండియా దాదాపు ఏకపక్ష విజయాల్నే సాధించింది. ఇపుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. భారత్ ప్రస్తుతమున్న ఫామ్కు, జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేయడం అసాధ్యమనుకోవాలి. అయితే ఫలితాన్ని పక్కనబెట్టి పోటీ ఏమాత్రం ఇస్తుందనేదే వేచి చూడాలి. మరోవైపు ‘సూపర్–4’లో శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో దుర్బేధ్యమైన భారత్తో తలపడేందుకు సిద్ధమైంది. ‘సూపర్–4’లో బోణీ కొట్టిన ఇరు జట్ల మధ్య ఈ పోరు జరుగుతుండటంతో పైచేయి సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది. ఆల్రౌండ్ సత్తాతో... బ్యాటింగ్, బౌలింగ్లో టీమిండియా ఆటగాళ్లకు ఎదురేలేదు. పాక్తో గత మ్యాచ్లో ఫీల్డింగ్ లోపాలు మినహా ఏ విభాగంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే లేనేలేదు. బాల్య మిత్ర ద్వయం శుబ్మన్, అభిషేక్ శర్మలు అలవోకగా పరుగులు బాదేస్తున్నారు. సారథి సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, హార్దిక్ పాండ్యాల నుంచి శివమ్ దూబే, ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ వరకు పరుగులు సాధించగలరు. ఇక బౌలింగ్లో భారత్ స్పిన్కు ప్రత్యర్థులే చిత్తవుతున్నారు. కుల్దీప్, వరుణ్, అక్షర్లతో పాటు పార్ట్ టైమ్ బౌలర్ దూబే కూడా ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణిగా ఉన్న టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం ముమ్మాటికి కష్టమనే చెప్పాలి. దీంతో ఈ టోర్నీలో భారత్కు వరుసగా ఐదో విజయం ఏమంత కష్టం కానేకాదు! సర్వశక్తులు ఒడ్డినా... టి20ల్లో అజేయమైన శక్తిగా ఎదిగిన భారత్ను ఓడించడం బంగ్లాదేశ్ లాంటి జట్లకైతే అసాధ్యం. సర్వశక్తులు ఒడ్డినా సరే పాక్ కంటే మెరుగైన పోటీ ఇవ్వగలదేమో కానీ గెలుపుపై మాత్రం ఆశలైతే పెట్టుకోలేదు. బ్యాటింగ్లో టాపార్డర్ బ్యాటర్లు సైఫ్ హసన్, తంజిద్ హసన్, కెప్టెన్ లిటన్ దాస్లు రాణిస్తున్నారు. తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకిర్ అలీలు మిడిలార్డర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వగలరు. ఇక బౌలింగ్లో ముస్తఫిజుర్ కీలకం. మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్లు కూడా పిచ్ సహకరిస్తే ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. 16 భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో భారత్ గెలుపొందగా... ఒక్క మ్యాచ్లో మాత్రమే బంగ్లాదేశ్ నెగ్గింది. 2019లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్పై బంగ్లాదేశ్ ఏకైక విజయాన్ని అందుకుంది. -
ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు
ఆసియా కప్-2025లో (Asia cup 2025) బంగ్లాదేశ్ (Bangladesh) ఓ మోస్తరు ప్రదర్శనలతో ముందుకెళ్తుంది. గ్రూప్ దశలో హాంగ్కాంగ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఆ జట్టు.. ఈ దశలో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఆ జట్టు రేపు జరుగబోయే వారి రెండో సూపర్-4 మ్యాచ్లో పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాల్సి ఉంది (India Vs Bangladesh). ఈ మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) టీమిండియాపై (Team India) అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకపై గాలివాటంగా లభించిన గెలుపును (వాపును) చూసుకొని బలుపులా భావిస్తున్న అతను.. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టైన టీమిండియాతోనే మైండ్గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ప్రతి జట్టుకి భారత్ను ఓడించే సామర్థ్యం ఉందంటూ అతి వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యం కాని, రికార్డులు కాదంటూ బీరాలు పలికాడు.భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు అయ్యుండొచ్చు, మేము మా బెస్ట్ క్రికెట్ ఆడి వాళ్ల నుంచి తప్పులు రాబడతామని అతి విశ్వాసం ప్రదర్శించాడు. మేము శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు కాదు, టోర్నీని గెలిచేందుకు వచ్చామని గొప్పలు పోయాడు.రేపు భారత్తో, ఆతర్వాతి రోజు (సెప్టెంబర్ 25) పాకిస్తాన్తో ఆడటంపై మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఆడటం ఏ జట్టుకైనా కష్టమే అని అన్నాడు. మా పట్ల ఇలా జరగడం అన్యాయమని వ్యాఖ్యానించాడు.సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తాహతకు మించినవిగానే అనిపిస్తున్నప్పటికీ.. వారిలోని ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. కొందరు భారత అభిమానలు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, చాలామంది లైట్గా తీసుకుంటున్నారు.ఆమాత్రం జోష్తో బరిలోకి దిగితేనే టీమిండియాకు కనీస పోటీ అయినా ఇవ్వగలదని అంటున్నారు. సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా, సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగా లక్ష్యాన్ని చేరుకుంది. వాస్తవానికి బంగ్లాదేశ్కు ఈ గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. కాస్త అటు, ఇటు అయ్యుంటే శ్రీలంకనే గెలిచేది. చివరి ఓవర్లో గెలుపుకు 5 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. నసుమ్ అహ్మద్ ఐదో బంతికి రిస్క్ చేసి సింగిల్ తీయడంతో ఆ జట్టు గెలుపు ఖరారైంది. చదవండి: యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన -
Bangladesh: ఢాకాలో డెంగ్యూ దడ.. ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాలు
ఢాకా: బంగ్లాదేశ్ను డెంగ్యూ వ్యాధి పట్టిపీడిస్తోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలు సంఖ్య ప్రభుత్వానికి దడ పుట్టిస్తోంది. దేశంలో డెంగ్యూ కారణంగా ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాల సంఖ్య నమోదైంది. దీర్ఘకాలిక రుతుపవన పరిస్థితులు, దోమల విజృంభణ కారణంగా డెంగ్యూ వ్యాప్తి మరింత తీవ్రమవుతున్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం, నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించడం ద్వారా డెంగ్యూను తరిమికొట్టవచ్చని వారు సూచిస్తున్నారు.బంగ్లాదేశ్లో డెంగ్యూ కారణంగా గడచిన 24 గంటల్లో 12 మంది మృతిచెందారు. రాజధాని ఢాకాలో కొత్తగా 700 కేసులు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 179 డెంగ్యూ బారిన పడి మృతిచెందగా, 42 వేల మంది డెంగ్యూ బారిన పడ్డారని పేర్కొంది. అధిక సంఖ్యలో పిల్లలు డెంగ్యూ బారినపడి ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. బాధితులలో చాలామంది అధిక జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన నిర్జలీకరణతో బాధపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో నిర్లక్ష్యం తగదని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎబిఎం అబ్దుల్లా తెలిపారు.2023లో దేశంలో డెంగ్యూ కారణంగా రెండువేల మంది మరణించారు. మూడు లక్షల21వేల మందికి పైగా జనం వ్యాధి బారిన పడ్డారు. డెంగ్యూ వైరస్ సాధారణంగా మధ్య , దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్ దీవులతో సహా ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. డెంగ్యూ జ్వరం లక్షణాలు దోమ కాటు తర్వాత నాలుగు నుండి 10 రోజుల తర్వాత కనిపిస్తాయి. దోమ కాటు బారినపడకుండా ఉండటమే డెంగ్యూ నివారణకు ఉత్తమమార్గమని వైద్యులు సూచిస్తున్నారు. -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్.. అడుగు దూరంలో ముస్తాఫిజుర్
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 20) జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించాడు.షకీబ్ 129 మ్యాచ్ల్లో 13 హాఫ్ సెంచరీల సాయంతో 2551 పరుగులు చేయగా.. దాస్ 114 మ్యాచ్ల్లో 15 హాఫ్ సెంచరీల సాయంతో 2556 పరుగులు చేశాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (4231) పేరిట ఉంది.ముస్తాఫిజుర్ మరో వికెట్ దూరంలో..!శ్రీలంకతో మ్యాచ్కు ముందు వరకు బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు షకీబ్ అల్ హసన్ పేరిట సోలోగా ఉండేవి. ఈ మ్యాచ్లో షకీబ్ పేరిట ఉండిన అత్యధిక పరుగుల రికార్డును లిట్టన్ దాస్ బద్దలు కొట్టగా.. ఇదే మ్యాచ్లో షకీబ్ పేరిటే ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును ముస్తాఫిజుర్ రెహ్మాన్ సమం చేశాడు. లంకతో మ్యాచ్లో 3 వికెట్లు తీసిన తర్వాత ముస్తాఫిజుర్, షకీబ్ తలో 149 వికెట్లతో సమంగా ఉన్నారు. ముస్తాఫిజుర్ మరో వికెట్ తీస్తే బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరిస్తాడు. -
Asia cup2025: బంగ్లాదేశ్ సంచలన విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. లీగ్ దశలో తమను చిత్తు చేసిన శ్రీలంకను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగిన మ్యాచ్లో బంగ్లా 4 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దసున్ షనక (37 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా, కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించాడు. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లతో లంకను దెబ్బ తీయగా, మెహదీ హసన్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. సైఫ్ హసన్ (), తౌహీద్ హృదయ్ () అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించారు. బ్యాటింగ్ తడబాటు... శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు వీరిద్దరు 30 బంతుల్లో 44 పరుగులు జోడించారు. పవర్ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో మెండిస్, కామిల్ వెనుదిరిగారు. ఈ దశలో క్రీజ్లోకి వచి్చన షనక జట్టును ఆదుకున్నాడు. ఫోర్తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అతను ఆ తర్వాతా జోరు కొనసాగించాడు. కుశాల్ పెరీరా (16) వెనుదిరిగిన తర్వాత షనక, కెపె్టన్ అసలంక (21) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నసుమ్ ఓవర్లో షనక ఒక ఫోర్, 2 భారీ సిక్స్లతో చెలరేగగా, తస్కీన్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతులను అసలంక సిక్స్, ఫోర్గా మలిచాడు. షరీఫుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన షనక 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్ భాగస్వామ్యం 57 పరుగులకు (27 బంతుల్లో) చేరిన తర్వాత దురదృష్టవశాత్తూ అసలంక రనౌట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో కమిందు (1), హసరంగ (2)లను ముస్తఫిజుర్ అవుట్ చేశాడు. తస్కీన్ వేసిన ఆఖరి ఓవర్లో షనక ఫోర్, సిక్స్తో స్కోరును 160 దాటించాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి ఓవర్లోనే తన్జీద్ హసన్ (0) అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఛేదన పేలవంగా మొదలైంది. అయితే సైఫ్, కెపె్టన్ లిటన్ దాస్ (16 బంతుల్లో 23; 3 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. పవర్ప్లేలో స్కోరు 59 పరుగులకు చేరింది. సైఫ్ వరుసగా మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్తో ధాటిని ప్రదర్శించగా, చమీరా ఓవర్లో దాస్ 2 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్కు 34 బంతుల్లో 59 పరుగులు జోడించారు. అనంతరం తౌహీద్తో సైఫ్ భాగస్వామ్యం కొనసాగింది. 36 బంతుల్లోనే సైఫ్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. అనంతరం మరో భారీ షాట్కు ప్రయతి్నంచి హసరంగ బౌలింగ్లో సైఫ్ వెనుదిరిగాడు. మూడో వికెట్కు సైఫ్, తౌహీద్ 45 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. కమిందు ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది తౌహీద్ బంగ్లాను వేగంగా లక్ష్యం దిశగా నడిపించాడు. 31 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. విజయానికి 10 పరుగుల దూరంలో తౌహీద్ అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ ఎదురైనా, చివరకు బంగ్లా గట్టెక్కింది.స్కోరు వివరాలుశ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) సైఫ్ (బి) తస్కీన్ 22; కుశాల్ మెండిస్ (సి) సైఫ్ (బి) మెహదీ 34; కామిల్ (బి) మెహదీ 5; కుశాల్ పెరీరా (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 16; షనక (నాటౌట్) 64; అసలంక (రనౌట్) 21; కమిందు మెండిస్ (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 1; హసరంగ (సి) తన్జీద్ (బి) ముస్తఫిజుర్ 2; వెలలాగె (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–44, 2–58, 3–65, 4–97, 5–154, 6–156, 7–158. బౌలింగ్: షరీఫుల్ 4–0–49–0, నసుమ్ 4–0–36–0, తస్కీన్ 4–0–37–1, మెహదీ హసన్ 4–0–25–2, ముస్తఫిజుర్ 4–0–20–3. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) వెలలాగె (బి) హసరంగ 61; తన్జీద్ (బి) తుషార 0; లిటన్ దాస్ (సి) నిసాంక (బి) హసరంగ 23; తౌహీద్ (ఎల్బీ) (బి) చమీరా 58; షమీమ్ (నాటౌట్) 14; జాకీర్ (బి) షనక 9; మెహదీ హసన్ (సి) కుశాల్ మెండిస్ (బి) షనక 0; నసుమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 169.వికెట్ల పతనం: 1–1, 2–60, 3–114, 4–159, 5–168, 6–168. బౌలింగ్: నువాన్ తుషార 4–0–42–1, చమీరా 4–0–32–1, వెలలాగె 4–0–36–0, హసరంగ 4–0–22–2, షనక 2.5–0–21–2, కమిందు 1–0–16–0. -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
Asia Cup 2025: రోహిత్, రహానే సరసన బంగ్లాదేశ్ ఓపెనర్లు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 13) శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే ఔటైన వారిద్దరు.. టీ20 ఆసియా కప్ చరిత్రలో డకౌటైన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, బంగ్లాదేశ్కే చెందిన మరో ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ మిధున్, సౌమ్య సర్కార్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ ఇలాంటి చెత్త ప్రదర్శన (డకౌట్లు) చేశారు. తాజా ఉదంతంతో తంజిద్-పర్వేజ్ జోడీ రోహిత్, రహానే సరసన చేసింది.కాగా, నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో నువాన్ తుషార (4-1-17-1), చమీరా (4-1-17-1), హసరంగ (4-0-25-2) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పని పట్టారు. బంగ్లా ఇన్నింగ్స్కు ఓపెనర్లు తంజిద్, పర్వేజ్ డకౌటై చెత్త ఆరంభాన్ని ఇచ్చారు. లిట్టన్ దాస్ (28), జాకిర్ అలీ (41 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (42 నాటౌట్) అతి కష్టం మీద పరుగులు చేసి బంగ్లాదేశ్కు ఆమాత్రం స్కోరైనా అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (50), కమిల్ మిషారా (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
Asia Cup 2025: బంగ్లాదేశ్ శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీని బంగ్లాదేశ్ సునాయాస విజయంతో మొదలుపెట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి గెలిచింది. తమ తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన హాంకాంగ్కు ఇది వరుసగా రెండో పరాజయం. ఓపెనర్ అన్షుమన్ రథ్ (4) తొందరగానే వెనుదిరిగినా... మరో ఓపెనర్ జీషాన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో హాంకాంగ్కు తగిన ఆరంభాన్ని అందించాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ హయత్ (14) విఫలం కాగా, నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదలగా క్రీజ్లో నిలిచి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తాను ఆడిన 32వ బంతికి గానీ అతను తన తొలి బౌండరీ కొట్టలేకపోయాడు! చివర్లో కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు హాంకాంగ్కు చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. బంగ్లా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 3–13 మధ్య ఆడిన 11 ఓవర్లలో ఒక్క ఓవర్లో మాత్రమే హాంకాంగ్ రెండంకెల స్కోరు చేయగలిగింది. అయితే ఆఖరి 6 ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో హాంకాంగ్ గౌరవప్రదంగా ముగించగలిగింది. తన్జీమ్, తస్కీన్, రిషాద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్లు పర్వేజ్ (19), తన్జీద్ (14) ఎక్కువ సేపు నిలబడకపోయినా... కెపె్టన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ (36 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్) భాగస్వామ్యంతో బంగ్లా సునాయాస విజయాన్ని అందుకుంది. వీరిద్దరు మూడో వికెట్కు 70 బంతుల్లో 95 పరుగులు జోడించారు. నేడు దుబాయ్లో జరిగే మ్యాచ్లో ఒమన్ జట్టుతో పాకిస్తాన్ ఆడుతుంది. -
రాణించిన హాంకాంగ్ బ్యాటర్లు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, టాస్కిన్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ హాంకాంగ్కు చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే హాంకాంగ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. -
దక్షిణాసియాలో తరాల మార్పు.. రెండు ప్రభుత్వాల్ని కూల్చిన ‘జెన్ జెడ్’
ఖాఠ్మండు: నేపాల్ను తమ తిరుగుబాటుతో జనరేషన్ జెడ్ (జెన్ జెడ్) వణికించింది. దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో ఇదే తరహాలో యువత నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు దరిమిలా ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఏడాది వ్యవధిలో ‘జెన్ జెడ్’ రెండు దేశాల ప్రభుత్వాలను కూకటివేళ్లతో సహా కూల్చివేసింది.నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్ల నిషేధం దరిమిలా ఖాఠ్మండుతో పాటు దేశంలోని పలు నగరాల్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. 2024, ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఇటువంటి పరిణామాల నేపధ్యంలోనే రాజీనామా చేశారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని కేపీ ఓలి కూడా దేశం విడిచి పారిపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అటు బంగ్లాదేశ్ ఇటు నేపాల్.. ఈ రెండు దేశాల్లో జరిగిన ఘటనలు దక్షిణాసియాలో తరాల మార్పును గుర్తించేలా చేస్తున్నాయి. జనరల్ జెడ్ ఉద్యమాలు దేశాధినేతలను నిష్క్రమించేలా ఒత్తిడి చేస్తున్నాయి. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా వేలాది మంది జనరల్ జెడ్ నిరసనకారులు ఖాఠ్మండు వీధులలో నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్ జరిగిన ‘రిజర్వేషన్ కోటా’ నిరసనలు ఆ దేశంలో సంక్షోభం తలెత్తేలా చేశాయి. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికింది. అది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే వరకూ సాగింది.సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో మొదలైన ఉద్యమం రాజకీయ నేతల అవినీతిని నిలదీసే పోరాటానికి దారితీసింది. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్.. ఇరు దేశాల నిరసనలలో విద్యార్థులు, యువత కీలక భాగస్వామ్యం వహించారు. కాలం చెల్లిన రాచరిక పాలనకు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇందుకు సోషల్ మీడియాను ప్రముఖ వేదికగా వాడుకున్నారు. ఢాకా- ఖాట్మండు.. రెండు చోట్లా ఉద్యమాల అణిచివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో పలువురు నిరసనకారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఉద్యమాలు మరింత తీవ్రమయ్యాయి. దేశ నాయకత్వ మార్పు అనివార్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్దాయి.నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2024, ఆగస్టులో పదవి కోల్పోయి, భారతదేశానికి తరలివచ్చారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఆ దేశంలోని సంక్షోభ పరిణామాల దృష్ట్యా దుబాయ్లో ఆశ్రయం పొందే ప్రయత్నం చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దేశాల అధినేతలకు ఎదురైన పతనం దక్షిణాసియా అంతటా తరాల మార్పును సూచిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి యువత.. అవినీతి రహిత నేతలకు, ప్రభుత్వాలకు పట్టం కట్టేలా ఉన్నారని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని కొందరు అంటున్నారు. -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరించాడు. నిన్న నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో అర్ద సెంచరీ (46 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన దాస్ ఈ ఘనత సాధించాడు.దాస్కు ముందు ఈ రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. షకీబ్ బంగ్లాదేశ్ తరఫున 129 మ్యాచ్ల్లో 13 హాఫ్ సెంచరీలు చేయగా.. దాస్ కేవలం 110 మ్యాచ్ల్లోనే షకీబ్ పేరిట ఉండిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దాస్, షకీబ్ తర్వాత టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అర్ద సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా తమీమ్ ఇక్బాల్ (8), మహ్మదుల్లా (8), తంజిద్ హసన్ (6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న నెదర్లాండ్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ సిరీస్ గెలుపుతో బంగ్లాదేశ్ హ్యాట్రిక్ సాధించింది. నెదర్లాండ్స్ను ఖంగుతినిపించకముందు బంగ్లాదేశ్ శ్రీలంక, పాకిస్తాన్ను కూడా మట్టికరిపించింది. హ్యాట్రిక్ సిరీస్ విజయాలతో బంగ్లాదేశ్ ఆసియా కప్లో అడుగుపెట్టబోతుంది.చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ దశలో ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఆట ఆగిపోయే సమయానికి జాకిర్ అలీ (20), నురుల్ హసన్ (22) క్రీజ్లో ఉన్నారు. లిట్టన్ దాస్ బంగ్లాదేశ్కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. బంగ్లా ప్లేయర్లలో సైఫ్ హస్సన్ 12, తౌహిద్ హృదోయ్ 9, షమీమ్ హొస్సేన్ 21 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కైల్ క్లెయిన్ 3 వికెట్లు పడగొట్టగా.. టిమ్ ప్రింగిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
మైనారిటీ వలసదారులకు ఉపశమనం.. ప్రభుత్వ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మైనారిటీ వలసదారులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించే వార్త చెప్పింది. 2024, డిసెంబర్ 31కి ముందు భారత్లోకి వచ్చి, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు 2025, సెప్టెంబర్ 4 నుండి అమలులోకి వచ్చిన భారతదేశ ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం ప్రకారం శిక్షా చర్యల నుండి మినహాయింపు పొందుతారు. ఈ మినహాయింపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని పౌరసత్వ ప్రమాణాలను ప్రభావితం చేయదు.తాజాగా హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నోటిఫై చేసిన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ (మినహాయింపు) ఆర్డర్, 2025 లో ఈ నిబంధనలు పొందుపరిచారు. ఈ చట్టం కింద నేరాలను గుర్తించే అధికారం, చట్టాన్ని అమలు చేసే అధికారాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్పగిస్తూ మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్లను జారీ చేసింది.చట్టం- జరిమానాలుఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే ఏ విదేశీయుడైనా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానాకు అర్హులు. సెక్షన్ 23 ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఎక్కువ కాలం నివసించే విదేశీయులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా రూ. 3 లక్షల జరిమానా విధించనున్నారు.మినహాయింపుల వివరణడిసెంబర్ 31, 2024 లోపు భారతదేశంలోకి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలను నిర్బంధం, బహిష్కరణ చర్యల నుండి ఈ ఆర్డర్ మినహాయింపు కల్పిస్తుంది. ఈ మినహాయింపు 2014, డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేసే సీఏఏ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ గడువులో భారతదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణించరని, వారి పాస్పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలోనే ఉండవచ్చని పేర్కొన్నారని ఒక అధికారి తెలిపారు.చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు విధించే జరిమానాలను కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, వీసా లేకుండా అక్రమంగా ప్రవేశించే ఏ విదేశీయునికైనా రూ. 5 లక్షల జరిమానా విధించనున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసించే వారికి ఇమ్మిగ్రేషన్ అధికారి పెనాల్టీ విధిస్తారు. 30 రోజుల వరకు ఉండే వారికి రూ. 10వేలు. 31 నుండి 90 రోజుల వరకు ఉండే వారికి రూ. 20 వేలు జరిమానా విధించనున్నారు. టిబెటన్లు, మంగోలియాకు చెందిన బౌద్ధ సన్యాసులు, అర్హత కలిగిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ వలసదారులకు ఈ జరిమానాలు వర్తించవు. -
పేట్రేగిపోయిన షకీబ్.. కేవలం 20 బంతుల్లోనే.. అత్యుత్తమంగా..!
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025లో పేట్రేగిపోయాడు. చాన్నాళ్ల తర్వాత అతడు బ్యాట్ ఝులిపించాడు. ఈ లీగ్లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్కు ఆడుతున్న షకీబ్.. నిన్న (ఆగస్ట్ 31) సెయింట్ లూసియా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఇది అతనికి టీ20 కెరీర్లో జాయింట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతేడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లోనూ షకీబ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (రంగ్పూర్ రైడర్స్కు ఆడుతూ ఖుల్నా టైగర్స్పై) పూర్తి చేశాడు.తాజా హాఫ్ సెంచరీతో షకీబ్ మరో రికార్డు కూడా సాధించాడు. తన టీ20 కెరీర్లో అత్యుత్తమ స్ట్రయిక్రేట్ను (హాఫ్ సెంచరీ) నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 234.61 స్ట్రయిక్రేట్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షకీబ్.. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 234.62 స్ట్రయిక్రేట్తో 61 పరుగులు చేశాడు.షకీబ్ బ్యాట్తో విజృంభించినా ఈ మ్యాచ్లో అతని జట్టు ఫాల్కన్స్ ఓటమిపాలైంది. ఫాల్కన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. టిమ్ సీఫర్ట్ విధ్వంసకర శతకంతో (125 నాటౌట్) విరుచుకుపడటంతో లూసియా కింగ్స్ మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ సెంచరీతో సీఫర్ట్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్లో 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతను.. సీపీఎల్ చరిత్రలో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో ఆండ్రీ రసెల్ కూడా 40 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఈ మ్యాచ్లో సీఫర్ట్ చేసిన స్కోర్ (125 నాటౌట్) కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రెండో అత్యధికం. ఈ రికార్డు బ్రాండన్ కింగ్ పేరిట ఉంది. 2019 ఎడిషన్లో కింగ్ గయానా అమెజాన్ వారియర్స్కు ఆడుతూ బార్బడోస్ ట్రైడెంట్స్పై అజేయమైన 132 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్తో సీఫర్ట్ ఖాతాలో మరో రెండు రికార్డులు కూడా చేరాయి. ఛేదనలో (కరీబియన్ ప్రీమియర్ లీగ్లో) అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సీఫర్ట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ (121 నాటౌట్) పేరిట ఉండేది.ఈ సెంచరీతో సీఫర్ట్ సెయింట్ లూసియా కింగ్స్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉండేది. ఫాఫ్ 2021 సీజన్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్పై అజేయమైన 120 పరుగులు చేశాడు. -
ఆసియాకప్లో బంగ్లాదేశ్ బోణీ..
రాజ్గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం సాధించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 8–3 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లా (4వ, 26వ నిమిషాల్లో), రకీబుల్ హసన్ (42వ, 43వ నిమిషాల్లో), అష్రఫుల్ ఇస్లామ్ (45వ, 48వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ సాధించగా... సోహనుర్ సోబుజ్ (36వ నిమిషంలో), రిజావుల్ బాబు (56వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. చైనీస్ తైపీ జట్టు తరఫున సుంగ్ యూ (10వ, 18వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా... సుంగ్ జెన్ షిహ్ (60వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. తొలి పోరులో మలేసియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్... ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మరో మ్యాచ్లో మలేసియా 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై గెలిచింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే గెనెహో జిన్ గోల్తో ఖాతా తెరిచిన ఐదు సార్లు చాంపియన్ దక్షిణ కొరియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది.మలేసియా తరఫున అఖీముల్లా అన్వర్ (29వ, 34వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టాడు. అష్రాన్ హమ్సాని (33వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జపాన్తో భారత్, కజకిస్తాన్తో చైనా తలపడనున్నాయి. -
నోరుపారేసుకున్న మహువా
కోల్కతా: సంచలనాలకు మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదానికి తెరతీశారు. దేశంలోకి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడ్డుకోలేకపోతున్నారని, అందుకు శిక్షగా ఆయన తల నరికేయాలని తేల్చిచెప్పారు. శుక్రవారం పశి్చమ బెంగాల్లోని నాడియా జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో రక్షణ భద్రత కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవిలో ఉన్న అమిత్ షాదేనని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పౌరుల రాకను అడ్డుకొనే సత్తా లేని అమిత్ షా ఆ నెపాన్ని పశి్చమ బెంగాల్ ప్రభుత్వంపై వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చొరబాటుదార్లు వస్తున్నారంటూ తరచుగా గొంతు చించుకుంటున్న ఆయనకు వారిని అడ్డుకొనే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అక్రమ వలసల కారణంగా దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయంటూ ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ షా చప్పట్లు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారని గుర్తుచేశారు. దేశ సరిహద్దులను రక్షించేవారు లేకపోతే పొరుగుదేశాల నుంచి జనం వస్తూనే ఉంటారని, మన తల్లులు, అక్కాచెల్లెమ్మలపై కన్నేస్తారని, మన భూములు ఆక్రమించుకుంటారని పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడలేకపోవడంతో చొరబాట్లను ఆపలేనందుకు అమిత్ షా తల నరికి టేబుల్పై పెట్టాలని మహువా మొయిత్రా పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో సంబంధాలు క్షీణించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. గతంలో మన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రుదేశంగా మారిపోయిందని చెప్పారు. మొయిత్రాది తాలిబన్ మైండ్సెట్: బీజేపీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షాపై ఆమె చేసిన విమర్శల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. మొయిత్రాది తాలిబన్ మైండ్సెట్, తాలిబన్ కల్చర్ అని ధ్వజమెత్తారు. ఆమెపై కొత్వాలీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొయిత్రా జిహాదీ ఉగ్రవాదుల తరహాలో మాట్లాడారని బీజేపీ అధికార ప్రతనిధి షెహజాద్ పూనవాలా ఆరోపించారు. మొయిత్రా వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాజకీయంగా ఎదిరించాలి తప్ప హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయడంలో తప్పులేదన్నారు. వ్యక్తిగతంగా మాటల దాడి చేయొద్దని సూచించారు. ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేశారు. Shameful and disgraceful!How can an elected MP like Mahua Moitra stoop so low as to use violent language against Shri Amit Shah ji?Such statements are not just an insult to democracy but also a dangerous encouragement of hatred and violence in public life.We strongly condemn… pic.twitter.com/X9XS5IA9zW— Lakshmi Singh (@LakshmiSinghBJP) August 29, 2025 -
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్..
టీ20 క్రికెట్లో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్న 5వ క్రికెటర్గా షకీబ్ రికార్డులకెక్కాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో ఆంటిగ్వా అండ్ బార్బుడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న షకీబ్.. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను అందుకున్నాడు.సెయింట్స్ కిట్స్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను ఔట్ చేసిన అనంతరం షకీబ్ అల్ హసన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంగ్లా మాజీ కెప్టెన్ ఇప్పటివరకు 457 మ్యాచ్లు ఆడి 502 వికెట్లు పడగొట్టాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. అదేవిధంగా షకీబ్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో 7000 పరుగులతో పాటు 500 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా షకీబ్ నిలిచాడు.ఈ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అక్టోబర్ 2024 నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లలో మాత్రమే పాల్గొంటున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..రషీద్ ఖాన్- 487 మ్యాచ్లు- 660 వికెట్లుడ్వైన్ బ్రావో- 582 మ్యాచ్లు- 631 వికెట్లుసునీల్ నరైన్- 557 మ్యాచ్లు- 590 వికెట్లుఇమ్రాన్ తాహిర్- 436 మ్యాచ్లు- 554 వికెట్లుషకీబ్ అల్ హసన్- 457 మ్యాచ్లు-502 వికెట్లుచదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్ -
ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. తాజా మాజీ కెప్టెన్పై వేటు
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్-2025 కోసం 16 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 22) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా లిట్టన్ దాస్ కొనసాగగా.. తాజా మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. వికెట్కీపర్ బ్యాటర్ నురుల్ హసన్ మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. నురుల్తో పాటు మరో ఆటగాడు కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చాడు. సైఫ్ హసన్ ఏడాదిన్నర తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నాడు. సైఫ్ చివరిగా 2023 ఆసియా క్రీడల్లో ఆడాడు. నురుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్నాడు. ఇదే అతనికి మూడేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కేలా చేసింది. 31 ఏళ్ల నురుల్ ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్కప్లో చివరిసారి ఆడాడు.ఆసియా కప్ కోసం బంగ్లా సెలెక్టర్లు నలుగురు స్టాండ్ బై ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెహిది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్ ఉన్నారు. వీరిలో మిరాజ్ బంగ్లాదేశ్ చివరిగా ఆడిన టీ20 జట్టులో ఉన్నప్పటికీ.. 16 మంది సభ్యుల మెయిన్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదే జట్టు ఆసియా కప్కు ముందు స్వదేశంలో నెదర్లాండ్స్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా కొనసాగనుంది. నెదర్లాండ్స్తో సిరీస్ ఆగస్ట్ 30, సెప్టెంబర్ 1, 3 తేదీల్లో జరుగనుంది. ఆసియా కప్ విషయానికొస్తే.. ఈ ఖండాంతర టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం సెప్టెంబర్ 11న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ హాంగ్కాంగ్తో పోటీపడుతుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్.. హాంగ్కాంగ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్తో పాటు గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుంది.ఆసియా కప్, నెదర్లాండ్స్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహిదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్ బై (ఆసియా కప్కు మాత్రమే): సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్ -
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న షకీబ్
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ పొట్టి క్రికెట్లో చారిత్రక మైలురాయిని తాకేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్లో మరో వికెట్ తీస్తే 500 వికెట్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు.ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658 వికెట్లు), విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (631), విండీస్ వెటరన్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ (590), సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (549) టీ20ల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం షకీబ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 21) జరిగిన ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ తీసి తన టీ20 వికెట్ల సంఖ్యను 499కి పెంచుకున్నాడు. ఆగస్ట్ 23న గయానా అమెజాన్ వారియర్స్తో జరిగే మ్యాచ్లో ఓ వికెట్ తీస్తే 500 వికెట్ల క్లబ్లో చేరతాడు.2006లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీబ్ బంగ్లాదేశ్ జాతీయ జట్టుతో పాటు పదుల సంఖ్యలో ఫ్రాంచైజీలకు ఆడి 499 వికెట్లు (455 మ్యాచ్ల్లో) తీశాడు. ఇందులో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు 12 నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో షకీబ్ అత్యుత్తమ గణాంకాలు 6/6గా ఉన్నాయి.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన షకీబ్కు ఈ ఫార్మాట్లో బ్యాటింగ్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. 124 స్ట్రయిక్రేట్తో 33 హాఫ్ సెంచరీల సాయంతో 7541 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 48వ స్థానంలో ఉన్నాడు.38 ఏళ్ల షకీబ్ ఇటీవలికాలంలో బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్లోనూ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీపీఎల్లో అతడు 3 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి కేవలం 31 పరుగులే చేశాడు. బౌలింగ్లో ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. గత కొంతకాలంగా షకీబ్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. -
Asia Cup 2025: 'ఏ జట్టునైనా ఓడిస్తాము.. ఆసియాకప్ టైటిల్ మాదే'
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ మెగా టోర్నీకి మరో 20 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న జరిగే తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ అనిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలవడమే తమ లక్ష్యమని జాకర్ తెలిపాడు. కాగా బంగ్లా టైగర్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకోలేదు. ఇంతకుముందు మూడు సార్లు ఫైనల్కు చేరినప్పటికి.. ప్రతీసారి తుది మెట్టుపై బంగ్లా జట్లు బోల్తా పడింది. 2012లో పాకిస్తాన్, 2016, 2018 ఫైనల్లో భారత్పై బంగ్లా ఓటమి చవిచూసింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలిచి తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని బంగ్లా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడా తమ ప్రాథిమిక జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా యూఏఈలో ఒక ప్రత్యేక క్యాంపును కూడా బంగ్లాదేశ్ ఏర్పాటు చేయనుంది. కెప్టెన్ లిట్టన్ దాస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ఇటీవల శ్రీలంక, పాకిస్తాన్లతో టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది."టైటిలే లక్ష్యంగా ఈ ఏడాది ఆసియాకప్ బరిలోకి దిగనున్నాము. ఈసారి ఛాంపియన్స్గా నిలుస్తామన్న నమ్మకం డ్రెస్సింగ్ రూమ్లోని ప్రతి ఒక్కరికి ఉంది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఏ విషయాన్ని మేము తేలికగా తీసుకోవడం లేదు. ఈ టోర్నీ కోసం మాకు ఎటువంటి ప్రణాళికలు లేవు. ఏ జట్టుతో ఆడినా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు అన్ని విధాల సిద్దమవుతున్నాము" అని విలేకరుల సమావేశంలో అలీ పేర్కొన్నాడు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే ఆతి విశ్వాసం ప్రదర్శిస్తున్న అలీని నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. గెలిచి మాట్లాడాలని క్రికెట్ అభిమానులు అతడికి కౌంటరిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో గ్రూప్-బిలో శ్రీలంక, హాంకాంగ్, ఒమన్లతో పాటు బంగ్లాదేశ్ ఉంది.ఆసియాకప్-2025 బంగ్లాదేశ్ ప్రిలిమినరీ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్లో భారత్- పాక్ మ్యాచ్ జరగదు' -
Mumbai: ఆస్పత్రి నుంచి గర్భిణి ఖైదీ పరార్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గల జేజే ఆస్పత్రి నుంచి బంగ్లాదేశ్ గర్భిణి ఖైదీ తప్పించుకుంది. గురువారం మధ్యాహ్నం ఆమె పారిపోగా, అప్పటి నుంచి ముంబై పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. నకిలీ జనన ధృవీకరణ పత్రం ఉపయోగించి భారతీయ పాస్పోర్ట్ పొందినందుకు రుబీనా ఇర్షాద్ షేక్(27)ను ఆగస్టు 7న వాషి పోలీసులు అరెస్టు చేశారు.ఆమెపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పాస్పోర్ట్ చట్టం, విదేశీయుల చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ నేపధ్యంలోనే ఆమెను అరెస్ చేసి, బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. జ్వరం, జలుబు, చర్మ సంబంధిత వ్యాధుల ఫిర్యాదుల మేరకు ఐదు నెలల గర్భిణి అయిన రుబీనాను ఆగస్టు 11న జెజె ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 14న మధ్యాహ్నం ఆమె ఒక కానిస్టేబుల్ను తోసి, పారిపోయింది. ఖైదీ రుబీనా ఇర్షాద్ షేక్ ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఎన్ఆర్సీ ఎఫెక్ట్: బంగ్లాకు పంపుతారని వృద్ధుని బలవన్మరణం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు చేస్తే, తనను బంగ్లాదేశ్కు పంపుతారనే భయంతో దిలీప్ కుమార్ సాహా(63) ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.కోల్కతాలోని తన ఇంట్లో దిలీప్ కుమార్ సాహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిలీప్ కుమార్ సాహా 1972లో ఢాకాలోని నవాబ్గంజ్ నుండి కోల్కతాకు వచ్చాడు. ఇక్కడి రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఆనందపల్లి వెస్ట్లో నివసిస్తున్నాడు. సాహా దక్షిణ కోల్కతాలోని ధకురియాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా పనిచేశాడు. అతను ఉంటున్న ఇంటికి అతని భార్య పలుమార్లు ఫోన్ చేసింది.అయితే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆమె పొరుగింట్లో ఉంటున్న మేనకోడలికి ఫోన్ చేసింది. ఆమె.. దిలీప్ కుమార్ సాహా ఇంటి తలుపులను పగలగొట్టి, లోనికి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అతని భార్య ఆరతి సాహా మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ అమలు తర్వాత బంగ్లాదేశ్కు బహిష్కరిస్తారేమోనని తన భర్త ఆందోళన చెందుతుండేవాడని తెలిపారు. కాగా దిలీప్ కుమార్ సాహా గది నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ మంత్రి, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. -
పదవీచ్యుత బంగ్లా ప్రధాని హసీనాపై విచారణ ప్రారంభం
ఢాకా: పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాపై 2024లో విద్యార్థుల సారథ్యంలో మొదలైన ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్(ఐసీటీ)ఆదివారం విచారణను ప్రారంభించింది. ఈ కేసులో సహ నిందితులుగా మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ను, మాజీ ఐజీపీ అబ్దుల్లా అల్ మమూన్లను చేర్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వం చీఫ్ ప్రాసిక్యూటర్గా తాజుల్ ఇస్లాంను నియమించింది. అన్ని నేరాలకు హసీనాయే కేంద్రమని, ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును తాజుల్ ఇస్లాం కోరారు.గతేడాది మొదలైన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసేందుకు హత్యలు, చిత్రహింసలకు పాల్పడ్డారంటూ ఐసీటీ హసీనాపై ఆరోపణలు మోపింది. -
స్నేహితుడిపై దాడి.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్పై కేసు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తస్కిన్ అహ్మద్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నివేదికల ప్రకారం అతనిపై కేసు నమోదైంది. ఈనెల 26న తస్కిన్.. అతని స్నేహితుడు సిఫాతుర్ రెహ్మాన్ సౌరవ్పై దాడి చేశాడు. మీర్పూర్ మోడల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక జర్నలిస్ట్లు తస్కిన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) చెందిన కీలక అధికారి స్పందిస్తూ ఇలా అన్నాడు. ఈ వార్తను సమాచార మాధ్యమాల్లో చూశాను. ఒకవేళ ఇది నిజమే అయితే విచారకరం. తస్కిన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు. ఈ విషయంపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నాడు.మరో వాదనతస్కిన్కు సంబంధించి ఇదే విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. తస్కిన్ బీసీబీ డైరెక్టర్తో మాట్లాడి తాను నిర్దోషినని చెప్పాడట. కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని సంజాయిషీ ఇచ్చాడట. గొడవ జరిగిన మాట వాస్తవమే అని.. అయితే అందులో తన ప్రమేయమేమీ లేదని వివరణ ఇచ్చాడట.తస్కిన్ బీసీబీ డైరెక్టర్తో ఇలా చెప్పాడట..ఆ రోజు తన మిత్ర బృందంలోని రెండు గ్రూప్ల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ వర్గం తనను మీర్పూర్ పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. వారి కోరిక మేరకు నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఇందుకు ఆగ్రహించిన మరో వర్గం తనపై కేసు నమోదు చేసింది.ఈ ఘటన తస్కిన్ పాకిస్తాన్తో మూడో టీ20 ఆడిన అనంతరం జరిగింది. మీర్పూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తస్కిన్ 3 వికెట్లు తీశాడు. 30 ఏళ్ల రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన తస్కిన్ బంగ్లాదేశ్ తరఫున 17 టెస్ట్లు, 81 వన్డేలు, 76 టీ20లు ఆడి 254 వికెట్లు తీశాడు. తస్కిన్ పేరిట టెస్ట్ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. -
ఎట్టకేలకు పాకిస్తాన్కు ఓ విజయం
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (33), మొహమ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2, షొరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. బంగ్లా ఇన్నింగ్స్లో సైఫుద్దీన్తో పాటు మొహమ్మద్ నైమ్ (10), మెహిది హసన్ మిరాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ నవాజ్ చెరో 2, అహ్మద్ దెనియాల్, సల్మాన్ అఘా, హుసేన్ తలాట్ తలో వికెట్ తీశారు. -
పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగరగొట్టిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకొని ఫ్యూజులు ఎగురగొట్టింది. ఇవాళ (జులై 22) ఢాకాలో జరిగిన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. 134 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను పాకిస్తాన్ బౌలర్లు సైతం అద్భుతంగా కట్టడి చేశారు. సల్మాన్ మీర్జా (4-1-17-2), అబ్బాస్ అఫ్రిది (4-0-37-2), అహ్మద్ దనియాల్ (4-0-23-2), ఫహీమ్ అష్రాఫ్ (3-0-20-1), మొహమ్మద్ నవాజ్ (3-0-19-1) చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ 133 పరుగులకే ఆలౌటైంది. జాకెర్ అలీ (55), మెహిది హసన్ (33) అద్బుతంగా పోరాడి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి ధాటికి పాకిస్తాన్ 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో ఫహీమ్ అష్రాఫ్ (51) వీరోచితంగా పోరాడి పాక్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి పాక్ను 125 పరుగులకే పరిమితం చేశారు. మెహిది హసన్ (4-0-25-2), షొరిఫుల్ ఇస్లాం (4-0-17-3), తంజిమ్ హసన్ సకీబ్ (4-0-23-2), ముస్తాఫిజుర్ (3.2-0-15-1), రిషద్ హొసేన్ (4-0-42-1) పాక్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లో నామమాత్రపు మూడో టీ20 జులై 24న జరుగనుంది. -
చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్.. జింబాబ్వే కంటే హీనంగా..!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్లోనూ సత్తా చాటలేకపోతుంది. సీనియర్ల ఫామ్ లేమి.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య సత్సంబంధాలు లేకపోవడం వంటి అనేక కారణాల చేత పాక్ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పసికూనలపై కూడా ఆ జట్టు విజయాలు నమోదు చేయలేకపోతుంది.తాజాగా వారి కంటే చాలా రెట్లు బలహీనమైన బంగ్లాదేశ్ వారికి షాకిచ్చింది. ఆదివారం (జులై 20) ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పాక్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సంచలన విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాక్ ఓ ఘోర అప్రతిష్ఠను మూటగట్టుకుంది.2024 నుంచి ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ చెత్త రికార్డును పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచే లాగేసుకోవడం విశేషం. ప్రస్తుత క్రికెట్ పసికూనలుగా పిలువబడే జింబాబ్వే, వెస్టిండీస్ కూడా గతేడాది కాలంలో పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి.2024 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) పాకిస్తాన్ 63 మ్యాచ్లు ఆడగా.. అందులో ఏకంగా 38 మ్యాచ్ల్లో ఓడింది. పాకిస్తాన్ తర్వాత అత్యధికంగా బంగ్లాదేశ్ 37 మ్యాచ్ల్లో (62లో) పరాజయాలు చవిచూసింది. వెస్టిండీస్ (65 మ్యాచ్ల్లో 35లో ఓటమి), జింబాబ్వే (61 మ్యాచ్ల్లో 31లో ఓటమి) లాంటి దేశాలు 2024 నుంచి పాకిస్తాన్ కంటే తక్కువ మ్యాచ్ల్లో ఓడాయి. ఈ గణాంకాలు చూస్తే పాక్ క్రికెట్ జట్టు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.పాక్ను షాకిచ్చిన బంగ్లాదేశ్మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూల్చింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (4-0-6-2), తస్కిన్ అహ్మద్ (3.3-0-22-3) చెలరేగి బౌలింగ్ చేశారు. తంజిమ్ హసన్ సకీబ్ (4-0-20-1), మెహిది హసన్ (4-0-37-1) కూడా పర్వాలేదనిపించారు. పాక్ బ్యాటర్లలో ఫకర్ జమాన్ (44) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించగా.. ఆఖర్లో అబ్బాస్ అఫ్రిది (22), ఖుష్దిల్ షా (17) రెండంకెల స్కోర్లు చేయడంతో పాకిస్తాన్ అతి కష్టం మీద మూడంకెల స్కోర్ దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయం సాధించింది (3 వికెట్లు కోల్పోయి). పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (56 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో రాణించి బంగ్లాను గెలిపించాడు. అతనికి తౌహిద్ హృదోయ్ (36), జాకిర్ అలీ (15 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఢాకా వేదికగానే ఇవాళ (జులై 22) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం
-
28 ఏళ్ల పాటు మారువేషంలో..
భోపాల్: బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల పర్వంలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్చేశారు. 28 ఏళ్లుగా భారత్లో అక్రమంగా ఉంటున్న అబ్దుల్ కలామ్ అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ బంగ్లాదేశ్ నుంచి పదేళ్ల వయసులో భారత్కు అక్రమంగా వచ్చి ముంబైలో 20 ఏళ్లపాటు నివసించాడు. ఎనిమిదేళ్లుగా నేహా కినార్ పేరిట ట్రాన్స్జెండర్గా మారువేషంలో భోపాల్ నగరంలో జీవిస్తున్నాడు. ఈ 28 ఏళ్ల కాలంలో భారత్లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఓటర్ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ చివరకు భారత పాస్పోర్ట్ సైతం సంపాదించాడు. పలుమార్లు స్వదేశానికి వెళ్లి వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. భారత్లోకి అక్రమ మార్గాల్లో చేరుకున్నాక మారువేషాల్లో పలువురు జీవిస్తున్నారన్న సమాచారంతో భోపాల్ పోలీసులు నిఘా బృందాలు సమిష్టిగా దర్యాప్తుచేసి అబ్దుల్ను ఎట్టకేలకు అరెస్ట్చేశారు. దీంతో ఇలా ఎంత మంది బంగ్లాదేశీయులు మారువేషాల్లో భారత్లో నివసిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. -
సొంతగడ్డపై శ్రీలంకకు ఊహించని పరాభవం.. చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్ విజయం. బంగ్లా కెప్టెన్గా లిట్టన్ దాస్కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్ గెలుపు. ఈ సిరీస్ గెలుపుతో లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. లిట్టన్ గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్లో కాకుండా బంగ్లాదేశ్ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ (4-0-17-1), రిషద్ హొస్సేన్ (4-0-20-0) కూడా అదే పని చేశారు. షొరిఫుల్ ఇస్లాం (4-0-50-1), తంజిమ్ హసన్ సకీబ్ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్ హొస్సేన్ 2 ఓవర్లలో ఓ వికెట్ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (46), దసున్ షనక (35 నాటౌట్), కమిందు మెండిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్ హసన్ తమీమ్ (47 బంతుల్లో 73 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్కు సునాయాస విజయాన్నందించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (0) ఔటైనా.. లిట్టన్ దాస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, సిక్స్) తమీమ్కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు. -
చిక్కుల్లో షేక్ హసీనా కూతురు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్(Saima Wazed) చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి(SEARO) ఆమె రీజియనల్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంగతి తెతలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది.ఇప్పటికే భారత్లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే తాజాగా ఆమె తనయ సైమా వాజెద్పైనా అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్వో.. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని వెల్లడించింది. అయితే ఆమె సెలవుల వ్యవహారంపై ప్రశ్న ఎదురుకాగా.. అదనంగా స్పందించేందుకు డబ్ల్యూహెచ్వో నిరాకరించింది. డబ్ల్యూహెచ్వో నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్వో రీజీయనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.1972 డిసెంబర్ 9న డా. ఎం.ఎ. వాజేద్ మియా (న్యూక్లియర్ సైంటిస్ట్), షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా(అమెరికా) బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. ఆర్గనైజేషనల్ లీడర్షిప్లో డాక్టరల్ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్వో ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆమె భర్త ఖండకర్ మస్రూర్ హుస్సేన్ మితు. ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ జంటకు నలుగురు పిల్లలు. అయితే వీళ్లు విడిపోయారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. అధికారికంగా ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టారిఫ్ వార్లో వెనక్కి తగ్గిన ఈయూ? -
SL Vs BAN: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. నిన్న (జులై 13) జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (50 బంతుల్లో 76; ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో.. తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్), షమీమ్ హొసేన్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించారు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తంజిద్ హసన్ 5, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 0, మెహిది హసన్ మిరాజ్ 1, జాకెర్ అలీ 3, సైఫుద్దీన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మహీశ్ తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లాదేశ్ బౌలర్లు ఊహించని రీతిలో రెచ్చిపోవడంతో 15.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో కేవలం పథుమ్ నిస్సంక (32), దసున్ షనక (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కుసాల్ మెండిస్ 8, కుసాల్ పెరీరా 0, అవిష్క ఫెర్నాండో 2, అసలంక 5, చమిక కరుణరత్నే 0, వాండర్సే 8, తీక్షణ 6, బినుర 6 పరుగులకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, షోరీఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో 2, ముస్తాఫిజుర్, మెహిది హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20 కొలొంబో వేదికగా జులై 16న జరుగనుంది. కాగా, టీ20 సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్లను శ్రీలంక కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో.. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
రెక్కలున్నా.. లెక్క తేలక... పదేళ్లుగా ఉన్నచోటే!
2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టేకాఫ్ అయిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ విమానాన్ని అత్యవసరంగా రాయ్పుర్ (ఛత్తీస్గఢ్)లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్ చేరుకున్నారు. అయితే రాయ్పుర్లో ఆ రోజు ల్యాండ్ అయిన ఆ ‘డగ్లస్ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!పార్కింగ్కి రూ.4 కోట్ల బకాయిపదేళ్లుగా ఆ డగ్లస్ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్ చేసినందుకు ‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది. కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!రాయ్పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్ బేస్లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్లో డగ్లస్ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్ యార్డ్కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. విసిగి వేసారిన రాయ్పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ వస్తే చాలుఅసలు డగ్లస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్పుర్ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్గా ఉంది’ అన్న సర్టిఫికెట్ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్నెస్ సర్టిఫికెట్ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్పుర్ ఎయిర్పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్ బేస్లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్ 83 కారణంగా ఆ బేస్లో ఉంచవలసిన వాటిని వేరే బేస్కు తరలించాల్సి వస్తోంది. ... ఇక వాళ్ల కష్టాలు..!‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్ను వెతికి పట్టుకుని, డగ్లస్ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్లో టేకాఫ్ అయింది. వారణాసి–రాయ్పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్ ఇంజినీర్ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి చేరలేదు. కోల్కతా చెబితేనే రాయ్పుర్ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్పుర్లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్ చేయించే అధికారం రాయ్పుర్ ఎయిర్ పోర్ట్కు లేదు. కోల్కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్కతా ఎయిర్పోర్ట్కు అందించారు. కోల్కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన షకీబ్ అల్ హసన్
కరీబియన్ దీవుల్లో జరుగుతున్న గ్లోబల్ సూపర్ లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్ తొలి మ్యాచ్లోనే విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ మ్యాచ్లో క్యాపిటల్స్ న్యూజిలాండ్కు చెందిన సెంట్రల్ డిస్ట్రిక్స్పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. షకీబ్ క్యాపిటల్స్ తరఫున తన తొలి మ్యాచ్లోనే ఇరగదీశాడు. సెంట్రల్ డిస్ట్రిక్స్తో మ్యాచ్లో షకీబ్ తొలుత బ్యాటింగ్లో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) చేసి, ఆతర్వాత బౌలింగ్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (4-1-13-4) ఇచ్చాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ షకీబ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షకీబ్తో పాటు సెదికుల్లా అటల్ (41) కూడా రాణించాడు. నిరోషన్ డిక్వెల్లా 15, గుల్బదిన్ నైబ్ 1, కదీమ్ 3, జోర్డన్ జాన్సన్ 1, జెస్సీ బూటాన్ 20, డోమినిక్ డ్రేక్స్ 11 పరుగులు చేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ బౌలరల్లో అంగస్ షా 3, టిక్నర్ 2, ఫాక్స్క్రాఫ్ట్ ఓ వికెట్ తీశారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్స్ షకీబ్ మాయాజాలం దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. క్యాపిటల్స బౌలర్లలో షకీబ్తో పాటు తన్వీర్ (3-0-28-2), డేక్స్ (4-0-26-1), ఆర్యమాన్ వర్మ (4-0-23-1) తలో చేయి వేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ ఇన్నింగ్స్లో టామ్ బ్రూస్ (34) టాప్ స్కోరర్గా నిలువగా.. డేన్ క్లీవర్ (21), విలియమ్ క్లార్క్ (20) నామమాత్రపు పరుగులు చేశారు.వాస్తవానికి షకీబ్ ఈ టోర్నీలో రంగ్పూర్ రైడర్స్కు (బంగ్లాదేశ్) ఆడాల్సి ఉండింది. అయితే స్వదేశంలో (బంగ్లాదేశ్) అతనిపై నెలకొన్న నిషేధం కారణంగా ఇది కుదరలేదు. షకీబ్కు బంగ్లాదేశ్ క్రికెట్తో గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. రాజకీయ అనిశ్చితి కారణంగా షకీబ్ కొద్ది నెలలుగా స్వదేశంలో అడుగుపెట్టలేదు. అలాగే అతను జాతీయ జట్టు నుంచి కూడా తప్పించబడ్డాడు. షకీబ్ బంగ్లాదేశ్లో ప్రతిపక్ష ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. -
కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ.. శ్రీలంకదే వన్డే సిరీస్
పల్లెకెలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 99 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సైతం ఆతిథ్య లంక జట్టు 1–0తో గెలుచుకుంది.మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (114 బంతుల్లో 124; 18 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ అసలంక (68 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ పాథుమ్ నిసాంక (35) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 39.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (78 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో పోరాడగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (28), పర్వేజ్ (28), జాకీర్ అలీ (27) మెరుగైన ఆరంభాలను వృథా చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, దుశ్మంత చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా... దునిత్ వెల్లలాగె, వణిండు హసరంగా రెండేసి వికెట్లు తీశారు.ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. కుశాల్ మెండిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. మెండిస్ ఈ సిరీస్లో తొలి వన్డేలో 45, రెండో వన్డేలో 56, ఇప్పుడు మూడో వన్డేలో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కుసాల్కు అంతర్జాతీయ క్రికెట్లో 16వది. ఈ మ్యాచ్లో కుసాల్ మరో రికార్డు కూడా సాధించాడు. బంగ్లాదేశ్పై 2000 పరుగులు (అన్ని ఫార్మాట్లలో) పూర్తి చేసిన రెండో శ్రీలంకన్గా నిలిచాడు. గతంలో కుమార్ సంగక్కర (3090) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ఇరు జట్ల మధ్య గురువారం తొలి టి20 జరగనుంది. -
భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను జారీ చేయనుంది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తుంది. ఇప్పటిదాకా దుబాయ్లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు రూ.4.66 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టి ఉండాలి. ఇవేమీ అవసరం లేకుండానే కేవలం ఫీజుతోనే వీసాను అందజేసేందుకు ఉద్దేశించిన ఈ విధానంలో వచ్చే మూడు నెలల్లో కనీసం 5 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నది దుబాయ్ ప్రభుత్వ వర్గాల అంచనా. పథకం పైలట్ ప్రాజెక్టు కోసం భారత్తోపాటు బంగ్లాదేశ్ను ఎంపిక చేసింది. గోల్డెన్ వీసా కావాలనుకునే వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రయాద్ గ్రూప్ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ కంపెనీ ఎండీ రయాద్ కమాల్ అయూబ్ చెప్పారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, మనీ లాండరింగ్ కేసులు, నేర చరిత్రతోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామన్నారు. అన్నీ ఓకే అయితేనే ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. వీసా జారీపై తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మున్ముందు ఈ పథకాన్ని చైనా వంటి ఇతర సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కుదిరిన దేశాలకు దుబాయ్ ప్రభుత్వం వర్తింపజేయనుంది. -
వరుస సెంచరీలు.. జట్టులో స్థానం గల్లంతు
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు. ఇటవలి కాలంలో షాంటో పొట్టి ఫార్మాట్లో పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగానే అతన్ని టీ20 జట్టు నుంచి తప్పించినట్లు సెలెక్టర్లు తెలిపారు. బ్యాటింగ్పై దృష్టి సారించేందుకు షాంటో ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ లోపే అతన్ని జట్టు నుంచే తప్పించారు. షాంటో ప్రస్తుత శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. అయినా అతన్ని టీ20 జట్టు నుంచి తొలగించారు. షాంటో గత కొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగా అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి. షాంటో గతేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అనంతర పరిణామాల్లో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదిలి పెట్టాడు. జులై 10 నుంచి శ్రీలంకతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జులై 4) ప్రకటించారు. ఈ జట్టులో షాంటోతో పాటు మరో ఐదుగులు స్థానాలు కోల్పోయారు. పాకిస్తాన్తో చివరిగా ఆడిన జట్టులో సభ్యులైన సౌమ్య సర్కార్, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం, నహీద్ రాణా, ఖలీద్ అహ్మద్ లంకతో సిరీస్కు ఎంపిక కాలేదు. ఆల్రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. జులై 10, 13, 16 తేదీల్లో పల్లెకెలె, డంబుల్లా, కొలొంబో వేదికలుగా శ్రీలంకతో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్లో శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు.. లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహ్మద్ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మద్ సైఫుద్దీన్. -
అసలంక సూపర్ సెంచరీ.. హసరంగ మాయాజాలం
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (జులై 2) జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.లంక ఇన్నింగ్స్లో అసలంక మినహా ఎవ్వరూ రాణించలేదు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేశారు. పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ డకౌటయ్యారు. నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. హసరంగ (7.5-2-10-4), కమిందు మెండిస్ (5-0-19-3), మహీశ్ తీక్షణ (9-1-32-1) మాయాజాలం దెబ్బకు 35.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ (62), జాకిర్ అలీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో పర్వేజ్ ఎమోన్ (13), నజ్ముల్ షాంటో (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిట్టన్ దాస్, కెప్టెన్ మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ డకౌట్లు కాగా.. తౌహిద్ హృదోయ్, తంజిమ్ సకీబ్ తలో పరుగు చేశారు. తన్వీర్ ఇస్లాం 5 పరుగులు చేశాడు. రెండో వన్డే కొలొంబో వేదికగానే జులై 5న జరుగనుంది.కాగా, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి వన్డేలో గెలుపుతో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
శ్రీలంక కెప్టెన్ సూపర్ శతకం.. గత మూడు ఇన్నింగ్స్ల్లో రెండవది
కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఐదో స్థానంలో బరిలోకి దిగిన అసలంక.. 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. గత మూడు ఇన్నింగ్స్ల్లో అసలంకకు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా అతని కెరీర్లో ఐదవది. అసలంక చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో వరుసగా 127, 78 నాటౌట్ పరుగులు చేశాడు. గత కొన్నేళ్లుగా అసలంక వన్డేల్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్గా మారాడు. 2024లో 97.11 స్ట్రయిక్రేట్తో 50.41 సగటున పరుగులు చేసిన అసలంక.. ఈ ఏడాది ఏకంగా 68 సగటున, 96.03 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 74 వన్డేలు ఆడిన అసలంక 44.98 సగటున 5 సెంచరీలు, 15 అర్ద సెంచరీల సాయంతో 2474 పరుగులు చేశాడు.బంగ్లాదేశ్తో మ్యాచ్లో అసలంక ఆదుకోవడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ (49.2 ఓవర్లలో 244 పరుగులు) చేయగలిగింది. జట్టులో మిగతా బ్యాటర్లెవ్వరూ రాణించకపోగా అసలంక ఒక్కడే జట్టు భారం మొత్తాన్ని మోశాడు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేసి అసలంకకు సహకరించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్తోనే జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారీ శతకం బాదిన పథుమ్ నిస్సంక ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఓపెనర్ నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే ఇది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. -
షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బుధవారం ఆరు నెలల జైలు శిక్షపడింది. ఆడియో లీక్ వ్యవహారంలో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించిందని సమాచారం. ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని బుధవారం(జులై 2న) అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా.. రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది.ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటా కొనసాగించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు కిందటి ఏడాది జూన్లో ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఈ కోటాను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో.. నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. క్రమంగా ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 300 మందికి పైగా మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యాయి. కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్డౌన్, సైన్యం మోహరింపు వంటి కఠిన చర్యలు తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు.. షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలు ప్రధాని నివాసాన్ని తాకడంతో.. ఆమె అక్కడి నుంచి భారత్కు వచ్చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా అనంతరం, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. -
Ind vs Pak: ఆసియా కప్-2025.. భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే!
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.అయితే, ఆసియా కప్లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.భారత్- పాక్ మ్యాచ్ ఆరోజేఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.ఒకవేళ భారత్తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.మూడుసార్లు పోటీ పడే అవకాశం!అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.తటస్థ వేదిక కాబట్టికాగా పాకిస్తాన్తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రాడ్కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ -
BAN: కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా(Comilla) జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. Urgent protest march by Hindu students at Dhaka University after the horrific rape of a Hindu girl in Muradnagar, Comilla last night. The Islamist rapist must face justice and the harshest punishment. Silence is not an option! #StopHinduGenocideInBangladesh #JusticeForHindus pic.twitter.com/yAaGGkm82f— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 29, 2025ఏం జరిగిందంటే..బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్నగర్ ఉపజిల్లా రామ్చంద్రాపూర్ పాచ్కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్లో బంధించాడు. జూన్ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది. జూన్ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. జూన్ 28వ తేదీ.. సోషల్ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.జూన్ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు. జూన్ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలుమరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్న్యూస్గా తేల్చేస్తున్నాయి. కిందటి ఏడాది మొదలై.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్నవూ, జైపూర్, నాగ్పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన థాయ్లాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగినబిమ్స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జనపనార, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నావ సేవా పోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు వాణిజ్య శాఖ పరిధిలోని ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. బంగ్లాదేశ్తో సంబంధాల్లో అగాధం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం గమనార్హం.దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛా ప్రాంత(సాఫ్టా) నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి పన్నులూ లేవు. ఇది దేశీయ జూట్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే, ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే జనపనార, సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ(ఏడీడీ) విధించింది.ఈ చర్య బంగ్లాదేశ్ దిగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. పైపెచ్చు, బంగ్లాదేశ్ ఎగుమతిదారులు సాంకేతికపరమైన సాకులు చూపుతూ ఏడీడీ నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబదీ్ధకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి. -
ఊహించిందే జరిగింది.. కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
అంతా ఊహించిందే జరిగిందే. బంగ్లాదేశ్ క్రికెట్లో కెప్టెన్గా నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రస్దానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన శాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం షాంటో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా షాంటో ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీ20 కెప్టెన్సీ నుంచి తనంతట తనే తప్పుకున్న శాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ మెహదీ హసన్కు తమ వన్డే కెప్టెన్గా బంగ్లా క్రికెట్ నియమించింది. అప్పటి నుంచి శాంటో బీసీబీ తీవ్ర ఆంసతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. "ఇది వ్యక్తిగతం కాదు. జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెసింగ్స్ రూమ్లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికి వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో శాంటో పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్గా లిట్టన్ దాస్ ఉండగా.. వన్డే కెప్టెన్గా మెహదీ హసన్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఇప్పుడు శాంటో రాజీనామా చేయడంతో టెస్టు కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి. శ్రీలంకతో తొలి టెస్టును డ్రా గా ముగించిన బంగ్లా టైగర్స్.. రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 0-1తో బంగ్లాదేశ్ కోల్పోయింది.చదవండి: గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్ -
ఓటమి దిశగా బంగ్లాదేశ్
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు బంగ్లాదేశ్ ఇంకా 96 పరుగులు వెనుకపడి ఉంది. లిట్టన్ దాస్ (13) క్రీజ్లో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు ధనంజయ డిసిల్వ (4-1-13-2), ప్రభాత్ జయసూర్య (15-2-47-2), తిరిండు రత్నాయకే (2.4-0-10-1), అశిత ఫెర్నాండో (8-1-22-1) చెలరేగడంతో బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పేకమేడలా కూలుతుంది. బంగ్లా ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుగా నిలబడలేకపోతున్నారు. ఇప్పటివరకు ఔటైన ఆరుగురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు కానీ, ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. షద్మాన్ ఇస్లాం 12, అనాముల్ హక్ 19, మొమినుల్ హక్ 15, నజ్ముల్ షాంటో 19, ముష్ఫికర్ రహీం 26, మెహిది హసన్ 11 పరుగులకు ఔటయ్యారు.290/2 స్కోర్ వద్ద ఇవాళ (మూడో రోజు) ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 168 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ నిస్సంక తన సెంచరీకి మరో 12 పరుగులు జోడించి 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య తన వ్యక్తిగత స్కోర్కు మరో 5 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లలో కుసాల్ మెండిస్ (84) సెంచరీకి చేరువై ఔట్ కాగా.. కమిందు మెండిస్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అంతకుముందు దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. లహీరు ఉడార 40 పరుగులు చేశాడు. మొత్తంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 458 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 5 వికెట్లు తీశాడు. నయీమ్ హసన్ 3, నహిద్ రాణా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ వికెట్కీపర్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో ఆ దేశం తరఫున అత్యధిక మంది ఔట్ చేయడంలో భాగమైన వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో దినేశ్ చండీమల్ క్యాచ్ పట్టడం ద్వారా లిట్టన్ దాస్ ఈ ఘనత సాధించాడు. లిట్టన్కు ముందు బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక డిస్మిసల్స్ రికార్డు ముష్ఫికర్ రహీం పేరిట ఉంది. ముష్ఫికర్ 99 ఇన్నింగ్స్ల్లో 113 డిస్మిసల్స్లో (98 క్యాచ్లు, 15 స్టంపౌట్లు) భాగంగా కాగా.. లిట్టన్ కేవలం 65 ఇన్నింగ్స్ల్లోనే (114) ముష్ఫికర్ రికార్డును బద్దలు కొట్టాడు. లిట్టన్ డిస్మిసల్స్లో 99 క్యాచ్లుండగా.. 15 స్టంపౌట్లు ఉన్నాయి.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో విజయవంతమైన టాప్-4 వికెట్ కీపర్లు..లిట్టన్ దాస్-114ముష్ఫికర్ రహీం-113ఖలీద్ మసూద్-87నురుల్ హసన్-34మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి, 43 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (146) వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య (5) క్రీజ్లో ఉన్నాడు.లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ లహీరు ఉడారా 40 పరుగులతో రాణించాడు. తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ (రెండో రోజు) మరో 27 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు. నిస్సంక వరుస సెంచరీలుశ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో (146 నాటౌట్) మెరిశాడు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న శ్రీలంక బ్యాటింగ్ సంచలనం
శ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో మెరిశాడు. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నిస్సంక 167 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతను 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా దినేశ్ చండీమల్ (59) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో లహీరు ఉడారా 40 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్లో ఔటయ్యాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ మరో 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
బంగ్లాదేశ్ 220/8
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో భారీ స్కోర్లు చేసిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్లో అదే జోరు కనబర్చలేకపోయింది. బుధవారం కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (93 బంతుల్లో 46; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ముషి్ఫకర్ రహీమ్ (75 బంతుల్లో 35; 5 ఫోర్లు), లిటన్ దాస్ (56 బంతుల్లో 34; 3 ఫోర్లు), మెహదీ హసన్ మిరాజ్ (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. వీరంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. క్లిష్టతరమైన పిచ్పై పరుగులు రాబట్టేందుకు తడబడుతూ లంక బౌలర్లకు వికెట్లు అప్పగించుకున్నారు. గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలతో ఆకట్టుకున్న బంగ్లా కెపె్టన్ నజు్మల్ హసన్ షంటో (8) విఫలం కాగా... మరో ఓపెనర్ అనాముల్ హక్ (0) డకౌటయ్యాడు. తైజుల్ ఇస్లామ్ (9 బ్యాటింగ్), ఇబాదత్ హుసేన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ సోనాల్ దినుశా, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో రెండేసి వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏంజెలో మాథ్యూస్ స్థానంలో సోనాల్ దినుశా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. -
తొలి టెస్ట్లో హిట్.. రెండో టెస్ట్లో ఫట్
కొలొంబో వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46), మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25) రెండంకెల స్కోర్లు చేయగా.. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8 పరుగులకు ఔటయ్యారు. ఆట ముగిసే సమయానికి తైజుల్ ఇస్లాం (9), ఎబాదత్ హోసేన్ (5) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (14-2-43-2), విశ్వ ఫెర్నాండో (16-3-35-2), సోనల్ దినుష (9-3-22-2), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (16-1-63-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ల్లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం (163), శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (187) సెంచరీలు చేశారు.తొలి టెస్ట్లో హిట్.. రెండో టెస్ట్లో ఫట్తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అదరగొట్టాడు. అయితే ఇవాళ ప్రారంభమైన రెండో టెస్ట్లో మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు. తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన ముష్ఫికర్.. రెండో టెస్ట్లో ఓ మోస్తరు స్కోర్ (35) చేసి ఔటయ్యాడు. తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీలు చేసి హిట్ అయిన నజ్ముల్ హసన్.. రెండో టెస్ట్లో సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటై ఫట్ అనిపించాడు. -
పోరాడిన కమిందు మెండిస్.. అయినా బంగ్లాదేశ్కే స్వల్ప ఆధిక్యం
గాలే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక అద్బుతమైన పోరాటం కనబర్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ చేయగా.. శ్రీలంక కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 485 పరుగులకు ఆలౌటై, బంగ్లాదేశ్కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చింది.368/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో 107 పరుగులు చేసి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ (87) అద్బుతమైన పోరాటం చేసి తన జట్టును బంగ్లాదేశ్ స్కోర్కు దగ్గరగా తీసుకెళ్లాడు. ఇవాళ ఆటలో కమిందు రత్నాయకేతో (39) అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కమిందు ఔటయ్యాక చివరి వరుస బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను అధిగమించలేకపోయింది.అంతకుముందు పథుమ్ నిస్సంక (187) భారీ సెంచరీతో చెలరేగడంతో లంక ఇన్నింగ్స్ను బలమైన పునాది పడింది. నిస్సంక చండీమల్ (54) సాయంతో లంక ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. ఇతర బ్యాటర్లలో లహీరు ఉడార 29, ఏంజెలో మాథ్యూస్ 39, ధనంజయ డిసిల్వ 19, కుసాల్ మెండిస్ 5, తిరుండ రత్నాయకే 0, అశిత ఫెర్నాండో 4 పరుగులకు ఔటయ్యారు. ప్రభాత్ జయసూర్య 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నయీమ్ హసన్ 5 వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, తైజుల్ ఇస్లాం, మొమినుల్ తలో వికెట్ దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (350 బంతుల్లో 163; 9 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(279 బంతుల్లో 148; 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (123 బంతుల్లో 90; 11 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. మిలన్ రత్నాయకే, తరిందు రత్నాయకే తలో 3 వికెట్లు సాధించారు. -
శ్రీలంక @ బంగ్లాదేశ్
గాలే: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) తాజా విజేత దక్షిణాఫ్రికా సంబరాలు ఇంకా ముగియక ముందే తర్వాతి డబ్ల్యూటీసీకి తెర లేచింది. 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. గాలే వేదికగా నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. కొన్నాళ్ల క్రితమే సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో 0–2తో చిత్తయిన లంక కోలుకొని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ కోసం లంక ఏకంగా ఆరుగురు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేయగల తరిందు రత్ననాయకే ఈ టెస్టుతో అరంగేట్రం చేయడం ఖాయమైంది. టీమ్లో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిస్థితి ఎప్పటిలాగే బలహీనంగా కనిపిస్తోంది. జింబాబ్వేతో సిరీస్ను 1–1తో ముగించిన తర్వాత మళ్లీ ఆ టీమ్ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. ఒక్క ఆటగాడు కూడా ఫామ్లో కనిపించడం లేదు. కెపె్టన్ నజు్మల్ గత 10 టెస్టుల్లో 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగా, సీనియర్ బ్యాటర్ ముషి్ఫకర్ గత 13 ఇన్నింగ్స్లలో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. గాలే పిచ్ స్పిన్కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు స్పిన్పై బాగా దృష్టి పెట్టాయి. మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్ జట్టుకు కీలకం కానున్నారు. మ్యాచ్కు వర్షం కొంత అంతరాయం కలిగించవచ్చు. -
రేపటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ప్రారంభం
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ గత శనివారం జరిగిన ఫైనల్తో ముగిసింది. తుది పోరులో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఛాంపియన్గా అవతరించింది. తద్వారా డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.🚨 FULL SCHEDULE OF WTC 2025-27 CYCLE 🚨 pic.twitter.com/AsXZpsLh1s— Johns. (@CricCrazyJohns) June 17, 2025రేపటి నుంచి కొత్త సైకిల్ ప్రారంభంవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) రేపటి నుంచి (జూన్ 17) జరుగబోయే శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్తో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో శ్రీలంక బంగ్లాదేశ్కు రెండు టెస్ట్లకు ఆతిథ్యమివ్వనుంది. తొలి టెస్ట్ జూన్ 17 నుంచి 21 వరకు గాలే వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ జూన్ 25 నుంచి 29 వరకు కొలొంబోలో జరుగనుంది.ఈ మధ్యలోనే భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరు జట్ల మధ్య హెడింగ్లేలో తొలి మ్యాచ్ జరుగనుంది.ఈ సైకిల్లో మొత్తం 71 మ్యాచ్లు2025-27 డబ్ల్యూటీసీ ఎడిషన్లో మొత్తం 71 మ్యాచ్లు (9 జట్ల మధ్య) జరుగనున్నాయి. ఇందులో తాజా ఎడిషన్ రన్నరప్ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 మ్యాచ్లు ఆడనుంది. ఆసీస్ తర్వాత ఇంగ్లండ్ (21) రెండో అత్యధిక మ్యాచ్లు ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా రానున్న ఎడిషన్లో కేవలం 14 మ్యాచ్లు ఆడుతుంది. భారత్ 18, న్యూజిలాండ్ 16, వెస్టిండీస్ 14, పాకిస్తాన్ 13, బంగ్లాదేశ్, శ్రీలంక తలో 12 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సైకిల్లో భారత్ ఆడబోయే మ్యాచ్లు..స్వదేశంలోవెస్టిండీస్తో (2)సౌతాఫ్రికాతో (2)ఆస్ట్రేలియాతో (5)ప్రత్యర్ధి దేశంలోఇంగ్లండ్తో (5)శ్రీలంకతో (2)న్యూజిలాండ్తో (2) -
ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్ నుంచి మయన్మార్లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్కున్న రిజిస్ట్రేషన్ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు’ జమాత్ నాయకుడు అజహరుల్ ఇస్లామ్ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్కు భారత్ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్ చేస్తున్న డిమాండ్కు యూనస్ నిర్ణయించిన ఏప్రిల్ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్ స్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్ అధినేత షఫీకుర్ రహమాన్ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు. -
Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం
ఢాకా : బంగ్లాదేశ్లో మరో విధ్వంసం చోటుచేసుకుంది. సిరాజ్గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఒక సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.సందర్శకుడిని బంధించి..స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కచ్చరిబారికి ఒక సందర్శకుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు. మోటారుసైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఆ సందర్శకుడికి, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సందర్శకుడిని కార్యాలయ గదిలో బంధించి, మ్యూజియం సిబ్బంది అతనిపై దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దర్యాప్తుకు ప్రత్యేక కమిటీఇది స్థానికులలో ఆగ్రహానికి కారణమయ్యింది. వారంతా దీనిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. తర్వాత వారు కచ్చరిబారి ఆడిటోరియంలోకి చొరబడి ధ్వంసం చేశారు. సంస్థ డైరెక్టర్పై దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటన నేపధ్యంలో ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఐదు రోజులలోగా కమిటీ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. కచ్చరిబారి అధికారి హబీబుర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల కారణంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశామన్నారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహి డివిజన్లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలాకాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. దీనిని మ్యూజియంగా మలచారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే..
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ లేఖను పోస్ట్ చేశారు.ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు. pic.twitter.com/gNlLbLv3E6— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్కు రాసిన లేఖలో భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్ -
బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.2025లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్హసీనా దేశం విడిచిపెళ్లిపోయిన దరిమిలా ఆ దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ, రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాగా గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్ను కోరింది.ఇది కూడా చదవండి: ‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్ -
‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ -
సత్వరం ఎన్నికలు
ఢాకా: బంగ్లాదేశ్లో మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్పై ఒత్తిళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. డిసెంబర్లోగా ఎన్నికల జరపాలనే డిమాండ్తో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) బుధవారం దేశవ్యాప్తంగా కదం తొక్కింది. రాజధాని ఢాకా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలతో హోరెత్తించింది. దేశ నలుమూలల నుంచి ఆ పార్టీ యువ కార్యకర్తలు వేలాదిగా వాటిలో పాల్గొన్నారు. యూనస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహా్మన్ దుయ్యబట్టారు. గతంలో తాత్కాలిక సారథులంతా మూడు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదిత సంస్కరణల అమలును వీలైనంతగా పూర్తి చేసి డిసెంబర్, జూన్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని జపాన్ పర్యటనలో ఉన్న యూనస్ పురుద్ఘాటించారు. -
‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. "Shoot me, bury me here, in Ganabhaban". These were the words of deposed Bangladeshi Prime Minister Sheikh Hasina on the fateful morning of August 5, 2024, as army officers asked her to resign amid violent student protests. Hasina eventually fled to India hours before protesters… pic.twitter.com/JzfwBtHUMp— India Today Global (@ITGGlobal) May 28, 2025 -
బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు. -
బంగ్లాదేశ్లో ముసలం!
జవాబుదారీతనం లేని అధికారం అరాచకానికి దారితీస్తుంది. దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. బంగ్లాదేశ్లో నిరుడు ఆగస్టు తిరుగుబాటు తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగావున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకపక్క సత్ప్రవర్తన లేని ప్రభుత్వోద్యోగులకు త్వరగా ఉద్వాసన పలికేవిధంగా సర్వీసు నిబంధనలు మార్చటం, మరోపక్క అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలివ్వటంలో విఫలం కావటం వగైరాలు అసంతృప్తికి దారితీసి నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె సాగుతోంది. ఈలోగా అమెరికా ఒత్తిడికి లొంగి లోపాయకారీగా సెయింట్ మార్టిన్స్ దీవిని కట్టబెట్టేందుకు యూనస్ పావులు కదిపారు. అంతేకాదు... దాని ఆదేశాలతో చిట్ట గాంగ్– రఖినే కారిడార్ను ‘మానవతా సాయం’ అందించటానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైనా దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తంకావటంతో పాటు సైన్యం నుంచి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా పది నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చలాయి స్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరంలేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కటార్లతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీచేస్తూ హడావిడి మొదలుపెట్టారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడిరోడ్డుపై దండించటం, జైళ్లపాలు చేయటం కొనసాగాయి. మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ అరెస్టులు మామూలే. వీటని సరిదిద్దటానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగారు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్గా వున్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరిచి, దాన్ని నెత్తినపెట్టుకోవటం మొదలుపెట్టారు. చైనాకు పోయి దాంతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నించారు. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం మాని భారత్ను చీకాకు పెట్టడమే లక్ష్యంగా యూనస్ వ్యవహారశైలివుంది.ఎల్లకాలమూ ఇలాగే సాగిపోతుందనుకుంటే చెల్లదు. పాత ప్రభుత్వం పతనమై పది నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించదేమన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 2026 మధ్య వరకూ ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదన్నట్టు యూనస్ ప్రభుత్వం ఈమధ్య లీకులిస్తుండగా,బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్–ఉజ్–జమాన్ ఈ ఏడాది ఆఖరిలోగా ఎన్నికలు జరిగి తీరాలని నిర్దేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకొస్తే తాము తిరిగి బ్యారక్లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లా డుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇది యూనస్కు మింగుడు పడలేదు. అలాగని ప్రభు త్వాన్ని నడపటం ఆయనకు చేతకావటం లేదు. ప్రభుత్వంలోని మత ఛాందసవర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్టల్లా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ఠ పోగొట్టుకున్నారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే.బంగ్లా అధీనంలోవున్న సెయింట్ మార్టిన్స్ దీవి వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగాళాఖాతంలో మన దేశం, మయన్మార్ కూడా దీనికి సమీపంగా ఉంటాయి. పదివేలమంది బంగ్లా పౌరులు నివసించే ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుంచో కలలుగంటున్నది. హిందూ మహా సముద్రంలో డీగో గార్షియా దీవిలో స్థావరం ఉన్నా, బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. ఈ దీవిపై అమెరికా మాత్రమే కాదు... చైనా కన్ను కూడా పడింది. మయన్మార్ సైతం వీలైతే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సాగర చట్టాల ట్రిబ్యునల్ 2012లో ఈ దీవి బంగ్లాదేశ్కు చెందుతుందని, 12 నాటికల్ మైళ్ల మేర ప్రాంతం ఆ దేశానిదేనని తీర్పునిచ్చినా అడపా దడపా మయన్మార్తో సమస్యలు తప్పడం లేదు. ఆ దేశ సైన్యం అక్కడ మసిలే బంగ్లా పౌరులను అపహరించటం, కాల్పులు జరపటం రివాజుగా మారింది. దీన్ని అమెరికాకూ లేదా చైనాకూ అప్పగిస్తే మన దేశ భద్రతకు ముప్పు కలుగుతుంది. కానీ యూనస్ భారత్పై వ్యతిరేకతతో ఈ దీవిని అమెరికాకు అప్పగించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను కూడా బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికే వదలాలని సూచించింది. అలాగే చిట్టగాంగ్–రఖినే కారిడార్ విషయంలోనూ సైన్యం పట్టుదలతో ఉంది. మయన్మార్లో సైనిక ముఠా ప్రభుత్వ దాడుల్లో చిక్కుకున్న రఖినే ప్రాంతానికి నిత్యావసరాలు, మందులు, ఆహారం అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన మాట వాస్తవం. అమెరికా సైతం ఈ కృషిలో పాలుపంచుకుంటామని తెలిపింది. అయితే ఈ మాటున కారిడార్ ఆనుపానులన్నీ అమెరికా తెలుసుకుంటుందన్నది బంగ్లా సైన్యం బెంగ.తన నిర్ణయాలను హసీనాయే కాదు... బీఎన్పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించటంతో యూనస్కు ఎటూ పాలుపోలేదు. అందుకే రాజీనామా బెదిరింపులకు దిగారు. కానీ దానికెవరూ కంగారు పడిన దాఖలా లేకపోవటంతో వెనక్కి తగ్గారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించటం చేతకాని తన వ్యవహారశైలితో బంగ్లాదేశ్ను ఏం చేద్దామనుకుంటున్నారో యూనస్ ఆలోచించుకోవాలి. నడమంత్రపు సిరిలా వచ్చిపడిన అధికారం అండతో దేశాన్ని భ్రష్టుపట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించటమే గౌరవప్రదమని గ్రహించాలి. -
విదేశీ భార్యల మోజులో పడొద్దు
ఢాకా: బంగ్లాదేశ్కు చెందిన ఆన్లైన్ డేటింగ్, పెళ్లిళ్ల బ్యూరోల వలలో పడొద్దని చైనా ఎంబసీ తమ పౌరులను హెచ్చరించింది. తమ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో కొందరు అక్రమ మార్గంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. అయితే, వీటి కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతు న్నట్లు గుర్తించింది. దీనిపై తాజాగా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిందని చైనా ప్రభుత్వ ‘గ్లోబల్ టైమ్స్’పేర్కొంది. ఆన్లైన్లోని షార్ట్ వీడియో వేదికలపై వచ్చే మోసపూరిత ‘క్రాస్–బోర్డర్ డేటింగ్’వలలో పడొద్దని కోరింది. అనధికార నెట్వర్క్లు, పెళ్లిళ్ల బ్యూరోల్లో ‘ఫారిన్ వైవ్స్’అంటూ వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని పేర్కొంది. ఇలాంటి వాటిపై చైనాలో నిషేధం ఉందని వెల్లడించింది. విదేశీయులను భార్య లుగా తెచ్చుకోవాలన్న ఆలోచన మానుకోవాలంది. బంగ్లాదేశీ యులను పెళ్లి చేసుకునేముందు అన్ని వివరాలను కూలంకషంగా తెలుసుకోవాలని సూచించింది. ఒకే సంతానం అనే కఠిన మైన విధానాన్ని చైనా ప్రభుత్వం ఎత్తి వేయడం, జంటలు మగ సంతానం వైపు చూపుతున్న మొగ్గుతో జనాభాలో లింగపరమైన అసమతుల్యత తీవ్రరూపం దాల్చింది. చైనాలో ప్రస్తుతం దాదా పు 3 కోట్లు మంది పురుషులు అవివాహితులుగా మిగిలిపోయి నట్లు అంచనా. దీంతో, విదేశీ మహిళలను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఎక్కువమంది ఉంటున్నారు. పెళ్లి పేరుతో బంగ్లాదేశీ మహిళలను చైనీయులకు విక్రయించిన కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ రవాణా దందా వెనుక నేరగాళ్ల ముఠాలు ఉన్నట్లు తేలింది. బెదిరించి, చట్ట విరుద్ధంగా చేసుకునే ఇలాంటి పెళ్లిళ్లతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అక్రమ పెళ్లిళ్ల దందాకు వేదికగా మారిన పెళ్లిళ్ల బ్యూరోలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. అక్రమ సంబంధాలు, పెళ్లిళ్ల బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని కూడా చైనా రాయబార కార్యాలయం కోరింది. బంగ్లాదేశ్ మహిళలతో చట్ట విరుద్ధంగా లైంగిక సంబంధాలు పెట్టుకునే వారు మానవ అక్రమ రవాణా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారికి కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, గరిష్టంగా జీవిత ఖైదు, రూ.16 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని ముఠాలు బంగ్లాదేశ్ మహిళలను పొరుగునున్న భారత్కు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టిక్టాక్ ద్వారా మహిళలను వేశ్యావృత్తిలోకి దించుతున్న 11 మందిని గతంలో ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. -
IPL 2025: అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్గా ముస్తాఫిజుర్
ఐపీఎల్లో అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్గా ముస్తాఫిజుర్ రెహ్మాన్ రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లాదేశీ బౌలర్గా అవతరించాడు. ఈ క్రమంలో ఫిజ్.. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్కు అధిగమించాడు. షకీబ్ ఐపీఎల్లో 63 వికెట్లు తీయగా.. ఫిజ్ 65 వికెట్లు (60 మ్యాచ్ల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సీజన్లో లేట్గా (ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత స్టార్క్కు ప్రత్యామ్నాయంగా) ఎంట్రీ ఇచ్చిన ఫిజ్ (ఢిల్లీ క్యాపిటల్స్).. నిన్న (మే 24) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీయడంతో షకీబ్ రికార్డును బద్దలు కొట్టాడు.2016 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఫిజ్.. ఆ సీజన్లో సన్రైజర్స్ ఛాంపియన్గా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో ఫిజ్ 16 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. సన్రైజర్స్ తర్వాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్లకు ప్రాతినిథ్యం వహించిన ఫిజ్.. ఆయా జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు.ఈ సీజన్లో ఢిల్లీ తరఫున మూడే మ్యాచ్లు ఆడిన ఫిజ్ తనదైన మార్కును చూపించాడు. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఫిజ్ తొలుత ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను, ఆతర్వాత శశాంక్ సింగ్, మార్కో జన్సెన్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఫిజ్ కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ పంజాబ్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.పంజాబ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్ (28), జోష్ ఇంగ్లిస్ (32), స్టోయినిస్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ప్రియాంశ్ ఆర్య (6), నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1), మార్కో జన్సెన్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్, కుల్దీప్ తలో 2, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి (58 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. కరుణ్ నాయర్ (44), కేఎల్ రాహుల్ (35), డుప్లెసిస్ (23), సెదీఖుల్లా అటల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా అదే తరహా ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2, జన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
ఆర్మీ వర్సెస్ యూనుస్
ఢాకా: కొద్ది నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మారిన బంగ్లాదేశ్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్, బీఎన్పీ చేస్తున్న ఒత్తిడిపై యూనుస్ వర్గం మండిపడుతోంది. బ్లాక్మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపణలకు దిగింది. సర్కారును కాపాడుకునేందుకు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనుస్ వర్గం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనుస్ ఆదివారం పలు పారీ్టలతో భేటీ కానున్నారు. 2026 జూన్కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్ సర్కారు చెబుతుండగా వచ్చే డిసెంబర్లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బీఎన్పీ ప్రేరేపిత ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా గత ఆగస్టులో దేశం వీడి భారత్లో ఆశ్రయం పొందడం తెలిసిందే. ఆర్మీ ఒత్తిళ్ల నేపథ్యంలో యూనుస్ తప్పుకుంటున్నట్టు తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించడం తెలిసిందే. -
‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు. -
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?
-
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా?
ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వస్తున్నాయి.బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన రాజీనామా గురించి సమాచారం వచ్చిందని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. ఈ విషయంపై యూనస్తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.Will Muhammad Yunus resign as caretaker to the interim government in Bangladesh? This BBC Bangla report quotes National Citizen Party leader Nahid Islam as saying Yunus is thinking of retirement. pic.twitter.com/GIsP3WqiaI— Deep Halder (@deepscribble) May 22, 2025యూనస్ను సవాళ్లు.. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఇక, గతేడాది ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్, హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ‘బ్లడీ కారిడార్’మరోవైపు.. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెలుసుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’ అని పరిశీలకులు అంటున్నారు.వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. -
అది బ్లడీ కారిడార్
ఢాకా: బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడం మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెల్సుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’అని పరిశీలకులు అంటున్నారు. వకారుజ్జమాన్ ఏమన్నారు? రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.ఏమిటీ కారిడార్..? బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దుల్లోని చట్టోగ్రామ్ ప్రాంతం నుంచి మయన్మార్లో అంతర్యుద్ధం, భూకంపం కారణంగా తీవ్రంగా నలిగిపోతున్న రఖైన్ ప్రాంతంలోని 20 లక్షల మంది పౌరులకు మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన మార్గమే రఖైన్ కారిడార్. ఈ నడవా ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి నుంచి అందిన వినతిపై యూనస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సైన్ ఇటీవల చేసిన ప్రకటనే ఈ అసంతృప్తి జ్వాలకు ఆజ్యం పోసింది. యూనస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖలేదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), కొన్ని వామపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవ్యతిరేకమంటూ మండిపడ్డాయి. ప్రజల ప్రయోజనాలకు గాలికొదిలేసి విదేశీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. ఎలాంటి నిర్ణయమైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్లో చర్చించి తీసుకోవాలని పేర్కొంది. ఏదేమైనా, తాత్కాలిక ప్రభుత్వం కారిడార్ ఏర్పాటుపై ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. చైనాకు చెక్ పెట్టే ఎత్తుగడతోనే అమెరికా ప్రభుత్వం చేసిన ఒత్తిడులకు యూనస్ లొంగిపోయారని పరిశీలకులు అంటున్నారు. మానవీయ సాయం పేరుతో బంగ్లాదేశ్లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, సైనిక, నిఘా పరమైన అవసరాలకు దీనిని వాడుకునే అవకాశముందని ఢాకా ట్రిబ్యూన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారిడార్ ఏర్పాటైతే బంగ్లాదేశ్తోపాటు మయన్మార్ సార్వభౌమత్వమూ ప్రమాదంలో పడుతుందని తన కథనంలో పేర్కొంది. తాజా నిర్ణయమేమంటే.. ఆర్మీ చీఫ్ హెచ్చరికలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో యూనస్ సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించే ఖలీలుర్ రహా్మన్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. రఖైన్ కారిడార్ గురించి తమ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని, ఇకముందు కూడా చర్చించదని స్పష్టం చేశారు. ‘దేశ సరిహద్దులకు సమీపంలోని రఖైన్ ప్రాంత వాసులకు మానవతా సాయం అందించే విషయంలో వీలుంటే సాయం చేయాలని మాత్రమే ఐక్యరాజ్యసమితి కోరింది. ఈ వినతిని పరిగణనలోకి తీసుకుంటామని మాత్రం చెప్పాం’అంటూ మాటమార్చారు. అంతకుముందు, ఏప్రిల్లో ఆయన..‘రఖైన్ కారిడార్ ఏర్పాటుపై ఐరాస ప్రతిపాదనకు ప్రభుత్వం షరతులతో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఆ షరతులేమిటో ఆయన వివరించలేదు. -
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
-
రికార్డు విజయం.. బంగ్లాదేశ్కు షాకిచ్చిన యూఏఈ
క్రికెట్ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్ కోసం యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.రాణించిన బంగ్లా బ్యాటర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. టాపార్డర్ బ్యాటర్లు తంజిద్ హసన్ (59), లిటన్ దాస్ (40), నజ్ముల్ హసన్ షాంటో (27), తౌహిద్ హృదోయ్ (45), జాకిర్ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.యూఏఈని గెలిపించిన కెప్టెన్అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో ధృవ్ పరాషార్ (11), హైదర్ అలీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్, నహిద్ రాణా, రిషద్ హొసేన్ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లాం, తంజిమ్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ -
హత్యాయత్నం కేసు.. ప్రముఖ నటి అరెస్ట్
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయ్ లాండ్ కు వెళుతున్న క్రమంలో ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. . ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయిఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ఆధారంగా తమ బృందం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని సదరు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక 2023లో తెరకెక్కిన ముజిబ్: ద మేకింగ్ ఆఫ్ నేషన్ చిత్రంలో షేక్ హసీనా పాత్రలో నటించింది నుసారత్ ఫరియా. -
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం యూఏఈలో పర్యటిస్త్ను బంగ్లాదేశ్ విజయంతో బోణీ కొట్టింది. నిన్న (మే 17) జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు ఆతిథ్య జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన యూఏఈ 164 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.ఎమోన్ విధ్వంసకర శతకంఈ మ్యాచ్లో బంగ్లా ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. మిగతా ఎనిమిది మంది బంగ్లా బ్యాటర్లు కలిపి 66 బంతుల్లో 70 పరుగులు మాత్రమే చేశారు. యూఏఈ బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో ఏకంగా 21 పరుగులిచ్చారు.రికార్డు శతకంఎమోన్ విధ్వంసకర సెంచరీ సాధించిన క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో తమీమ్ ఇక్బాల్ (2016 టీ20 వరల్డ్కప్లో ఒమన్పై) తర్వాత బంగ్లా తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఎమోన్ చేసిన సెంచరీ (53 బంతుల్లో) టీ20ల్లో బంగ్లా తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. తమీమ్ ఒమన్పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు.తమీమ్ 27 ఏళ్ల వయసులో సెంచరీ చేయగా.. ఎమోన్ 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా బంగ్లా తరఫున అతి చిన్న వయసులో టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ఎమోన్ కొట్టిన 9 సిక్సర్లు టీ20ల్లో ఆ జట్టు తరఫున (ఓ మ్యాచ్లో) అత్యధికం. గతంలో ఈ రికార్డు రిషద్ హొస్సేన్ (2024లో శ్రీలంకపై 7 సిక్సర్లు) పేరిట ఉండేది.సత్తా చాటిన బౌలర్లు192 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్లు తంజిమ్ (4-0-22-2), మెహిది హసన్ (4-0-55-2), హసన్ మహమూద్ (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-17-2), తన్వీర్ ఇస్లాం (4-0-30-1) సత్తా చాటడంతో 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున కెప్టెన్ ముహమ్మద్ వసీం (54), ఆసిఫ్ ఖాన్ (42), రాహుల్ చోప్రా (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 19న షార్జా వేదికగా జరుగనుంది. -
చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. బిగ్ షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులు, కొన్ని ప్రాసెస్ట్ ఆహార వస్తువుల దిగుమతులపై నౌకాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసింది. అయితే, భారత్ మీదుగా నేపాల్, భూటాన్ మినహా ఇతర అన్ని దేశాలకు వెళ్లే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల దిగుమతులకు ఏ ల్యాండ్ పోర్టులోనూ అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని కోల్కతా, నవసేవా పోర్టుల్లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటెడ్ డ్రింకులు, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కాటన్, కాటన్ యాన్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్ట్ గూడ్స్, డైస్, గ్రాన్యుల్స్, వుడెన్ ఫరి్నచర్, వంటి వాటిని చంగ్రాబంధా, ఫుల్బారీ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారాగానీ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరంలలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా గానీ అనుమతించబోమని తేల్చింది. చేపలు, ఎల్పీజీ, వంట నూనెల దిగుమతులకు పోర్టుల్లో ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్ యూనుస్ ఇటీవల చైనా పర్యటన సమయంలో భారత్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఈ ఆంక్షలని పరిశీలకులు అంటున్నారు. నౌకల ద్వారా భారత్లోని పోర్టులకు తమ వస్తువులను తరలించుకుని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగు మతులు చేసుకునేలా బంగ్లాదేశ్కు 2020 మే నుంచి కేంద్రం వెసులుబాటు కల్పించింది. 🔴#BREAKING: India restricts garment imports from Bangladesh to Kolkata & Mumbai ports — land ports closed.Seen as a reciprocal move after Bangladesh curbed Indian cotton & rice exports.#India #Bangladesh #Trade #GarmentImports #Pakistan pic.twitter.com/3piBRtXfnh— TheWarPolitics (@TheWarPolitics0) May 17, 2025 -
భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైన దుష్ట కూటమి
-
ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!
-
మొన్న గుజరాత్ .. నేడు రాజస్థాన్!
జైపూర్: దేశంలో అక్రమ వలస దారుల ఏరివేత కార్యక్రమం మరింత పుంజుకుంది.. భారత్లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారుల్ని ఏరివేసే పనిలో పడ్డాయి. ఇటీవల గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీయులను వెనక్కి పంపించగా, తాజాగా రాజస్తాన్ లో కూడా వెయ్యికి పైగా బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.వీరిని ప్రస్తుతం తమ దేశానికి పంపించే యత్నం చేస్తున్నారు. రాజస్తాన్ లోని 17 జిల్లాల్లో జల్లెడ పడితే 1,008 మంది బంగ్లాదేశీయులు దొరికారు. ఒక్క సిల్కార్ జిల్లాలోనే 394 మంది అక్రమ బంగ్లాదేశీయులు ఉండటం గమనార్హం. వీరందర్నీ ఇప్పుడు దేశం దాటించే పనిలో పడ్డాయి ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది.పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఉండే అక్రమ వలసదారుల్ని ఏరివేస్తున్నారు. ప్రధానంగా అక్రమంగా ఉండే పాకిస్తానీయులిపై వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో అక్రమంగా స్థిరపడిన వారు వేలల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు. #WATCH | Rajasthan: First batch of Bangladeshi nationals, who were living illegally in India, and were caught in the past few days were brought to Jodhpur today. They are being deported to Bangladesh. pic.twitter.com/hLqKxDSlb5— ANI (@ANI) May 14, 2025 ఇది కూడా చదవండి:జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు! -
బంగ్లాదేశ్ క్రికెటర్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ మెహిదీ హసన్ మీరాజ్కు తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను మెహిదీ హసన్కు ఈ అవార్డు దక్కింది. గత నెలలో సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మెహిదీ హసన్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు.ఈ సిరీస్లో 27 ఏళ్ల మెహిదీ 116 పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు మిరాజ్కు వరించింది. ఈ అవార్డు సాధించిన మూడవ బంగ్లాదేశ్ ఆటగాడిగా మెహిదీ నిలిచాడు. అతడి కంటే ముందు వెటరన్ ఆటగాళ్లు ముష్పికర్ రహీం, షకీబ్ అల్ హసన్ ఈ అవార్డును అందుకున్నారు.కాగా ఈ అవార్డు కోసం మెహిదీ హసన్తో పాటు జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీ, బెన్ సియన్స్ పోటీ పడ్డారు. అయితే వీరిద్దిరికంటే మెహిదీ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో ఈ అవార్డును స్కాట్లాండ్ కెప్టెన్ కాథరిన్ బ్రైస్ సొంతం చేసుకుంది. గత నెలలో జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో కాథరిన్ బ్రైస్.. బ్యాట్, బంతితో అద్బుతంగా రాణించింది. 293 పరుగులతో టోర్నమెంట్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచిన బ్రైస్.. బౌలింగ్లోనూ 6 వికెట్లు పడగొట్టింది. దీంతో వెస్టిండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సానాను వెనక్కి నెట్టి ఈ అవార్డును కాథరిన్ సొంతం చేసుకుంది.చదవండి: IPL 2025: ఐపీఎల్ రీ స్టార్ట్.. ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్! -
వివాదంలో పాకిస్తాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు లీక్
ఢాకా: పాకిస్తాన్ హైకమిషనర్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్కు హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్ మరూఫ్ పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్కు హైకమిషనర్గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హైకమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
బంగ్లా మాజీ అధ్యక్షుడు హమీద్ పరార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కురీ్చలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం థాయ్లాండ్లో ఉన్నట్లు భావిస్తున్నారు.గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది.మరికొందరికి బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సి.ఆర్.అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. హమీద్ 2013 నుంచి 2023 మధ్యలో రెండుసార్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో షేక్ హసీనాతోపాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిశోర్గంజ్ సదర్ పోలీసు స్టేషన్లో ఆయనపై హత్య కేసు నమోదైంది. వైద్యం కోసమేనా? కేవలం వైద్యం కోసమే హమీద్ థాయ్లాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనతోపాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్లు తెలిపారు. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పారీ్టలో హమీద్ చురుగ్గా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఛాత్రా లీగ్ను గత ఏడాది అక్టోబర్లో మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటిని ఇస్లామిక్ రాడికల్స్ కూల్చివేశారు. -
లుంగీలోనే దేశం దాటేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని 'షేక్ హసీనా' ఇప్పటికే దేశం విడిచి ఇండియాలో తలదాచుకుంటోంది. కాగా తాజా ఆ దేశ మాజీ అధ్యక్షుడు 'మహమ్మద్ అబ్దుల్ హమీద్' లుంగీలోనే.. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానం ఎక్కి దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది.అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు (2013 నుంచి 2023 వరకు) పనిచేశారు. 2024లో జరిగిన ఆందోళన కాలంలో పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా.. ఆమె సహాయకులపై నమోదైన ఒక హత్య కేసులో ఆయన కూడా సహ నిందితుడు ఉన్నట్లు సమాచారం. హసీనాను పదవీచ్యుతురాలిని చేయడానికి బయలుదేరిన నిరసనకారులపై కాల్పులు జరిపి, వారిని చంపిందని ఆరోపణలు వచ్చాయి.ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం.. జనవరి 14న కిషోర్గంజ్ సదర్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో మహమ్మద్ అబ్దుల్ హమీద్ నిందితుడిగా ఉన్నారు. హసీనా.. ఆమె కుటుంబ సభ్యులు షేక్ రెహానా, సజీబ్ వాజెద్ జాయ్, సైమా వాజెద్ పుతుల్ కూడా సహ నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్ కూడా ఈ కేసులో ఒక నిందితుడు.మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ థాయిలాండ్కు వెళ్లడంపై దర్యాప్తు చేయడానికి.. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం విద్యా సలహాదారు సీఆర్ అబ్రార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్తా సంస్థ తెలిపింది.మహమ్మద్ అబ్దుల్ హమీద్.. కుటుంబ సభ్యులతో కలిసి వైద్య చికిత్స కోసం వెళ్లారని చెబుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు బంగ్లాదేశ్లో విచారణ నుంచి తప్పించుకోవడానికి పారిపోయారని చెబుతున్నారు. -
బంగ్లాదేశ్ కోచ్గా అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్
బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా షాన్ టైట్ నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ 42 ఏళ్ల మాజీ ఫాస్ట్ బౌలర్ 2027 నవంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. టైట్ తన కోచింగ్ ప్రయాణంలో పాకిస్తాన్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు సేవలందించాడు. టైట్.. 2007లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్లలో 59 మ్యాచ్లు ఆడిన టైట్.. 95 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా షాన్ టైట్ నియామకంతో ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన ఆండ్రీ ఆడమ్స్ వైదొలిగాడు. ఆడమ్స్ గతేడాది మార్చిలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఆడమ్స్ ఆథ్వర్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పేలవ ప్రదర్శనలు చేసింది. ఈ కారణంగా అతనిపై వేటు పడింది.క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్షాన్ టైట్ పేరిట క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డు నమోదై ఉంది. 2010లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అతను 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అక్తర్ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు. టైట్తో పాటు మరో ఆసీస్ పేసర్ బ్రెట్ లీ కూడా 161.1కిమీ వేగంతో బంతిని సంధించాడు. 2005లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో లీ ఈ వేగాన్ని అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో నాలుగో వేగవంతమైన డెలివరీ రికార్డు కూడా ఆసీస్కే చెందిన జెఫ్ థాంప్సన్ పేరిట ఉంది. థామ్సన్ 1975-76 సిరీస్లో విండీస్తో జరిగిన ఓ మ్యాచ్లో 160.6కిమీ వేగంతో బంతిని వేశాడు. క్రికెట్ చరిత్రలో ఐదో వేగవంతమైన బంతి రికార్డు కూడా ఆసీస్ పేసర్ పేరిటే ఉంది. 2015లో న్యూజిలాండ్తో జరిగిన ఓ మ్యాచ్లో స్టార్క్ 160.4కిమీ వేగంతో బంతిని సంధించాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ జట్టు మే 17 నుంచి యూఏఈలో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లా టీమ్ యూఏఈతో రెండు టీ20లు (మే 17, 19) ఆడనుంది. అనంతరం మే 25 నుంచి బంగ్లా జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే భారత్తో యుద్దం తర్వాత పాక్లో జరగాల్సిన ఈ సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. -
యువతకు మెంటల్ హెల్తే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ తరం యువతపైన అత్యంత సున్నితమైన సామాజిక బాధ్యతలున్నాయి. వీటిని నెరవేర్చడానికి వారిలో మానసిక పరిపక్వత కీలక అంశం’అని మిస్ బంగ్లాదేశ్ అక్లిమా అతికాకొనికా(Aklima Atika Konika) అన్నారు. ప్రస్తుతమున్న పలు సామాజిక సమస్యలకు పరిష్కారాలన్నీ యూత్ మెంటల్హెల్త్ పైనే ఆధారపడి ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మిస్వర్డల్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన అతికా ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..ఏ సహజత్వమే సౌందర్యం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నాకు ఫ్యాషన్ అంటేనే సరిగ్గా తెలియదు. కంఫర్ట్గా అనిపించే దుస్తులు వేసుకోవడం, ఎవరైనా పలకరించినా స్పందించలేని మొహమాటం ఉండేది. ఎలాంటి ఫ్యాషన్ సెన్స్ లేదు. అలాంటిది అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా దృష్టిలో బ్యూటీ అంటే సహజత్వం. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే వారి సౌందర్యానికి మెరుగులద్దుతుంది. అత్యంత సహజత్వమే సౌందర్యంగా కనిపిస్తుందని నేను నమ్ముతా.ఏ భారత్లో సాంస్కృతిక వైవిధ్యం భారత్ ఒక అద్భుత సాంస్కృతిక సమ్మేళనం. ఢిల్లీ వెళితే ఒకలా, చెన్నై, లడక్ వెళితే మరోలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతిక వైవిధ్యం. భారత్ మొత్తం తిరిగితే చాలు ప్రపంచం తిరిగినట్టే. కోల్కతా (బెంగాల్) వెళితే మా దేశ మూలాలు ఆత్మీయంగా పలకరిస్తాయి. హైదరాబాద్ (Hyderabad) అయితే మినీ ఇండియా. దేశంలోని ప్రత్యేకతలన్నీ ఇక్కడే ఆతిథ్యమిస్తాయి. నాకు మరో ఇల్లులా అనిపిస్తుంది హైదరాబాద్. తెలంగాణ ప్రజల ఆతీ్మయత నా మనసు దోచుకుంది. నేను మంచి భోజన ప్రియురాలిని. నాకు నచి్చనట్టు ఇక్కడ స్పైసీ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడి వారసత్వ వంటకాలు చాలా బాగున్నాయి. ఏ యంగ్ మైండ్ మ్యాటర్స్ మానసిక ఆరోగ్యం.. మానసిక పరిపక్వత ఈ తరం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఇందులో భాగంగానే యువత మెంటల్ హెల్త్పై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ‘యంగ్ మైండ్ మ్యాటర్స్’ అనే ప్రాజెక్ట్ చేపట్టా. భారత్లో పరిస్థితులు చెప్పలేను కానీ.. ఆసియా దేశాల్లో యువత మానసిక అస్థిరత, మెంటల్ హెల్త్ గురించి ఎవరూ అంతగా ప్రస్తావించట్లేదు. దీనితో ముడిపడి ఎన్నో సామాజిక సమస్యలున్నాయి. తమపైన తమకు విశ్వాసం ఉన్నప్పుడే మిగతా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. నేను ప్రపంచ సుందరి విజేతగా నిలిస్తే.. నా గుర్తింపు, ప్రశస్తిని అంతర్జాతీయంగా యూత్ మెంటల్ హెల్త్పై అవగాహన కల్పించడానికి, దానితో ముడిపడి ఉన్న అంశాల కార్యాచరణకు వినియోగిస్తాను. ఏ అపురూప స్నేహం భారత్–బంగ్లా మా దేశ యువతలో నైపుణ్యాలకు కొదువ లేదు. ఎన్నో విషయాలను బయటికొచ్చి నేర్చుకుంటున్నాం. గతేడాది మా దేశ యువత చేపట్టిన స్టూడెంట్ రెవల్యూషన్ నాకు స్ఫూర్తి. ఒక బంగ్లా అమ్మాయిగా మా యువత తరఫున ప్రపంచానికి మా ప్రశస్తిని చూపించే బాధ్యత నాపై ఉంది. ఆ ఆశయంతోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నాను. వినయం లేకుండా విజయం ఉండదని గట్టిగా నమ్ముతాను. భారత్–బంగ్లాదేశ్లది స్నేహపూర్వక సంబంధం. రాజకీయంగా, ఆర్థిక పరమైన అంశాల్లో అనుబంధంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడి ప్రజల ప్రేమ నాకెప్పుడూ గుర్తుండిపోతుంది. ఏ ఎన్నో దాటుకొని వచ్చాను నేనూ ఒక మనిషినే. అందరిలానే విభిన్న అనుభవాలు, బాధాకరమైన సందర్భాలను దాటుకొని వచ్చాను. నన్ను నేను సముదాయించుకోవడానికి, ఒత్తిడి పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తాను. ప్రకృతి ప్రేమికురాలిని. ప్రకృతికి మన మానసిక అనిశి్చతి, అస్థిరత్వాన్ని తొలగించే శక్తి ఉంది. నాకు ఏ మాత్రం బాగాలేకున్నా ప్రకృతిలోకి వెళతాను. నాకు నేను సమయం ఇచ్చుకుంటా. సాధారణంగా మాట్లాడటమే నాకున్న పెద్ద చాలెంజ్. అలాంటిది ఇప్పుడు మిస్వరల్డ్ వేదికపైన మాట్లాడగలుగుతున్నానంటే అది నా పరిణామ క్రమమే. మహిళలు బయటికెళ్లి ఉద్యోగం, వ్యాపారం ఇంకేదైనా చేయడమే సాధికారత అని అనుకోను. ఒక మహిళ తనకు నచి్చన రంగంలో తన అభిరుచులకు అనుగుణంగా రాణించడమే సాధికారత అని నమ్ముతాను. -
బంగ్లాదేశ్ షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025 -
బోర్డర్కు అదనంగా భారత సైన్యం.. ఆర్మీ ప్లానేంటి?
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 11వ రోజు మరోసారి కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో, వెంటనే భారత భద్రతా బలగాలు అప్రమత్తమై పాక్ ఆర్మీ ప్లాన్ను తిప్పికొట్టాయి.మరోవైపు.. సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. కొత్తగా 16 అదనపు బెటాలియన్లు రంగంలోకి దిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేశారు. కాగా, పాకిస్తాన్పై దాడి సన్నాహాల్లో భాగంగా సైన్యం మోహరించినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన్లో దాదాపు 1000 మందికిపైగా సైనికులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కీడు తలపెట్టాలని చూసేవారి తాట తీయడంలో సైనిక బలగాలతో కలిసి పనిచేయడం, దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడం తన కర్తవ్యమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ప్రజలకు బాగా తెలుసునని.. ఆయన పనితీరు, కట్టుబాటు, జీవితంలో రిస్కు తీసుకునే విధానంపైనా వారికి అవగాహన ఉందని చెప్పారు. ప్రజలు కోరుకున్నవన్నీ మోదీ నేతృత్వంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పారు. అంతకు మించి దానిపై వివరించలేదు. -
బంగ్లాదేశ్ కెప్టెన్గా లిట్టన్ కుమార్ దాస్..
పాకిస్తాన్, యూఏఈలతో టీ20 సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్లకు బంగ్లాదేశ్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ కుమార్ దాస్ ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్ అనంతరం బంగ్లా టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు.ఈ క్రమంలోనే తమ టీ20 జట్టు కెప్టెన్గా లిట్టన్ కుమార్ దాస్ను బంగ్లా క్రికెట్ బోర్డు నియమించింది. ఈ సిరీస్లలో లిట్టన్ దాస్ సారథిగా తనను తాను నిరూపించుకుంటే ఫల్ టైమ్గా కెప్టెన్గా కొనసాగించే అవకాశముంది. అయితే ఈ సిరీస్లకు స్టార్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోతో పాటు యువ ఆటగాళ్లు షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషాద్ హొస్సేన్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బంగ్లా జట్టు తొలుత యూఏఈతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లు మే 17, మే 19 తేదీలలో షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం పాకిస్తాన్కు వెళ్లనుంది. ఈ సిరీస్ మే 25 నుంచి ప్రారంభం కానుంది.యూఏఈ, పాకిస్తాన్ టీ20 సిరీస్లకు బంగ్లా జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హొస్సేన్, షక్ మహిదీ హసన్ (వైస్ కెప్టెన్), తన్వీర్ మహ్ముద్, ససనీబ్, తన్వీర్ మహ్మద్, సస్కీమ్, నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం -
భారత్ పై బంగ్లాదేశ్ - పాకిస్తాన్ కుట్ర
-
‘పాక్పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’
ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్పై భారత్ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ సలహాదారు ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్కు రహ్మాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.ఇదిలా ఉండగా.. భారత్ విషయంలో పాకిస్తాన్ మరో స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ప్రెస్ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది. పాక్ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. -
ఆసియా తొలి ప్లేయర్గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) చరిత్రపుటల్లోకెక్కాడు. ఆసియాలో ఇంత వరకు ఏ క్రికెటర్కు సాధ్యం కాని ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్లో ఒకే రోజు శతకం బాదడంతో పాటు ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా నిలిచాడు.జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా మెహదీ హసన్ మిరాజ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్ పర్యటన (Zimbabwe tour of Bangladesh)కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో తొలి టెస్టులో బంగ్లాదేశ్ జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది.ఆల్రౌండ్ ప్రదర్శనతోఅయితే, చట్టోగ్రామ్ వేదికగా రెండో టెస్టు (Ban vs Zim 2nd Test)లో మాత్రం ఆతిథ్య జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (162 బంతులలో 104; 11 ఫోర్లు, 1 సిక్స్; 5/32) బ్యాటింగ్లో సెంచరీ బాదడంతో పాటు... జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.మెహదీ హసన్ దూకుడుగత టెస్టులో బంగ్లాదేశ్ను ఓడించి నాలుగేళ్ల తర్వాత ఈ ఫార్మాట్లో తొలి విజయం ఖాతాలో వేసుకున్న జింబాబ్వే దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. ఓవర్నైట్ స్కోరు 291/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... చివరకు 129.2 ఓవర్లలో 444 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ సహకారంతో మెహదీ హసన్ మిరాజ్ శతకంతో చెలరేగిపోయాడు.చివర్లో అతడికి తైజుల్ ఇస్లామ్ (20), తన్జీమ్ హసన్ (80 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు. మెహదీ హసన్ దూకుడుతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 217 పరుగుల ఆధిక్యం లభించింది. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకెసా 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ (103 బంతుల్లో 46; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (25), వెల్లింగ్టన్ మసకద్జ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కదంతొక్కిన మెహదీ హసన్ మిరాజ్... బంతితోనూ విజృంభించి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇతరుల్లో తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన మిరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టెస్టుల్లో 2068 రన్స్, 205 వికెట్లుకాగా ఖుల్నాకు చెందిన మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ ఆల్రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన అతడు రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్. 2016లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మెహదీ హసన్ మిరాజ్.. ఇప్పటి వరకు 53 టెస్టులు, 105 వన్డేలు, 29 టీ20 మ్యాచ్లు ఆడాడు.టెస్టుల్లో 2068 పరుగులు చేయడంతో పాటు 205 వికెట్లు తీశాడు. అదే విధంగా.. వన్డేల్లో 1617 పరుగులు సహా 110 వికెట్లు.. టీ20లలో 354 పరుగులు సహా 14 వికెట్లు మెహదీ హసన్ మిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో రెండు, వన్డేల్లో రెండు శతకాలు సాధించాడు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని -
మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్
జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. చటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేను ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తమ మొదటి ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(67), నిక్ వెల్చ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నయీమ్ హసన్ రెండు, తాంజిమ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 444 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(120), మెహిదీ హసన్ మీరాజ్(104) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు ముష్ఫికర్ రహీం(40), మోనిమల్(33), షకీబ్(41) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకేసా 5 వికెట్లు పడగొట్టగా.. ముజారబానీ, వెల్లింగ్టన్ మసకడ్జా బెన్నట్ తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా జింబాబ్వే ఆట తీరు ఏ మాత్రం మారలేదు. బంగ్లా బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో జింబాబ్వే 111 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లతో చెలరేగగా.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే బ్యాటర్లలో బెన్ కుర్రాన్(46) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ను 1-1తో బంగ్లా సమం చేసింది. -
Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్కు ఊరట
ఢాకా: ఇస్కాన్ మాజీ ప్రతినిధి, బంగ్లాదేశ్లో మైనారిటీ హక్కుల సాధన ఉద్యమకారుడు చిన్మయ్ కృష్ణదాస్కు ఎట్టకేలకు ఊరట లభించింది. బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో కిందటి ఏడాది నవంబర్లో ఆయన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న ఢాకా హజారత్ షాహ్జలాల్ ఎయిర్పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ దక్కలేదు. మరోవైపు భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. ఆపై హిందూ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే తరఫున ప్రతినిధిగా దాస్ పని చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది. కిందటి ఏడాది.. అక్టోబర్ 25న చిట్టాగాంగ్లో, నవంబర్ 22వ తేదీన రంగ్పూర్లో ఆయన నిర్వహించిన ర్యాలీలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. చిట్టాగాంగ్లో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు పైన కాషాయ జెండాను ఎగరేయడంతోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు అయ్యింది. -
పాక్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్పై చాలా సీరియస్గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్లోని మ్యాచ్లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్లో జరుగనుండగా.. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్కు చేరుకుంటుంది. ఫైసలాబాద్లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది. -
బంగ్లాదేశ్కూ నీళ్లు నిలిపివేయాలి: బీజేపీ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో సైతం ఇలాంటి చర్యనే తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కోరారు. 1996లో కాంగ్రెస్ హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన గంగ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ‘ఆ ఒప్పందం చాలా తప్పు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేసింది’అని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో సంబంధాలున్న దేశాలతో నదీ జలాల పంపకం ఒప్పందాలను యథా ప్రకారం కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ‘పాములకు ఎంతకాలం నీళ్లు అందించాలి? వాటిని నలిపేయాలి’అంటూ దూబే వ్యాఖ్యానించారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలన్నారు. -
టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాపై సంచలన శతకం సాధించి వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ నిషేధానికి గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్-2025లో ఓ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు అతడిపై నాలుగు మ్యాచ్ల సస్పెన్షన్ (8 డీమెరిట్ పాయింట్లతో పాటు) విధించబడింది. దీంతో హృదోయ్ ఈ సీజన్లో అబాహీనీ జట్టుతో జరిగే కీలక మ్యాచ్తో పాటు వచ్చే సీజన్లో తొలి మూడు మ్యాచ్లకు దూరం కానున్నాడు. హృదోయ్ ఢాకా ప్రీమియర్ లీగ్లో (DPL) మొహమ్మదెన్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఘాజీ గ్రూప్తో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.24 ఏళ్ల హృదోయ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అద్భుత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హృదోయ్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. జాకిర్ అలీతో (68) కలిసి ఆరో వికెట్కు 154 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అనంతరం భారత్ సులువగా లక్ష్యాన్ని ఛేదించినా హృదోయ్ ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్ను గెలిపించాడు. రోహిత్ శర్మ (41), కేఎల్ రాహుల్ (41 నాటౌట్) కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆ టోర్నీలో భారత్ ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వగా, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. -
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
అహ్మదాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు, వారిని తిరిగి వెనక్కి పంపించే చర్యలు కొనసాగుతున్న వేళ.. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న విదేశీయులు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్రమంగా భారత్ కు వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన వారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలస దారుల వేరివేతకు శ్రీకారం చుడితే అహ్మదాబాద్, సూరత్ లలో కలిపి వెయ్యి మందికి పైగా అక్రమ బంగ్లా దేశీయులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం తెలిపారు. అహ్మదాబాద్ లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు 890 మంది కాగా, సూరత్ లో నివసిస్తున్న బంగ్లా జాతీయులు 134 ఉన్నట్లు గుర్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.స్వచ్ఛందంగా బయటకు రండి.. లేకపోతేఅక్రమ వలసదారులకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సంఘ్వీ హెచ్చరించారు. ఎవరైనా ఇంకా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆపై తీసుకునే కఠిన చర్యలు దారుణంగా ఉంటాయన్నారు. Surat, Gujarat | The people caught last night are Bangladeshis. We will check their documents. After this, we plan to send them to Bangladesh: Surat JCP Crime Raghavendra Vats. https://t.co/jqgyPEJmzm— ANI (@ANI) April 26, 2025 Over 550 Illegal Bangladeshi immigrants detained in Gujarat operationsRead @ANI Story | https://t.co/NuuktkcjCp#IllegalImmigrant #Gujarat pic.twitter.com/6Cwc8g3Ci9— ANI Digital (@ani_digital) April 26, 2025 Massive numbers incoming - More than 1000 illegal Bangladeshis and Pakistanis detained in pre-dawn Ops by Gujarat PoliceMale - 436+88Female - 240+44Kids - 214Total - 1022 pic.twitter.com/rvAB5HdLPQ— Megh Updates 🚨™ (@MeghUpdates) April 26, 2025 -
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు వారి సొంతగడ్డపై పసి కూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. సిల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్పై 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (52) టాప్ స్కోరర్గా నిలవగా..బెన్ కుర్రాన్(44) పరుగులతో రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహాది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించాడు. కాగా ఇది జింబాబ్వేకు నాలుగేళ్ల తర్వాత దక్కిన తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో తమ బౌలర్లు చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది.జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. న్యాయుచి, మదెవెరె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) పర్వాలేదన్పించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో కూడా బంగ్లా బ్యాటర్లు తీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 255 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శాంటో(60), జాకీర్(58), మోమినల్(47) మినహా మిగితా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు చేధించింది. బంగ్లాపై జింబాబ్వేకు ఇది రెండో టెస్టు విజయం. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్ 28 నుంచి ఛటోగ్రామ్ వేదికగా జరగనుంది. -
సంచలన విజయం దిశగా జింబాబ్వే
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న జింబాబ్వే క్రికెట్ జట్టు.. సిల్హెట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో సంచలన విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలుపుకు మరో 57 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలిస్తే ఆరేళ్ల తర్వాత బంగ్లా గడ్డపై విజయం సాధించినట్లవుతుంది. చివరిగా జింబాబ్వే 2018 నవంబర్లో బంగ్లాదేశ్ను వారి సొంతగడ్డపై ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్.బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.82 వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చి 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే అద్భుతంగా ఆడుతూ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు టీ విరామం సమయానికి జింబాబ్వే గెలుపుకు 57 పరగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్లో జింబాబ్వే స్కోర్ 117/2గా ఉంది. బ్రియాన్ బెన్నెట్ (52), సీన్ విలియమ్స్ (0) క్రీజ్లో ఉన్నారు. -
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
మణికొండ: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయింది. దీని ఆధారంగా అతడు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ టాస్్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు సదరు బంగ్లాదేశీయుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుదీర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు. దీనికి ముందు అతడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేశాడు. అధికారులు ఇతడికి జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సు«దీర్.. బంగ్లాదేశీయుడికి నార్సింగిలో జని్మంచిన వ్యక్తిగా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీసు వెరిఫికేషన్లో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్్కఫోర్స్ పోలీసులు సుదీర్తో పాటు సదరు బంగ్లాదేశీని అదుపులోకి తీసుకున్నారు.మరింత లోతుగా విచారణమున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న సు«దీర్ రెండు సంవత్సరాల క్రితం ఒకరికి అప్పటి కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు తెలిసింది. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నామని, అతన్ని అదుపులోకి తీసుకుంటున్నామని టాస్్కఫోర్స్ పోలీసులు తెలిపారు. అతను చేసిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తేవాలని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారికి చెప్పాను. అవసరమైతే మరింత లోతుగా విచారణ చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తాం. – టి. కృష్ణమోహన్రెడ్డి, కమిషనర్, నార్సింగి మున్సిపాలిటీ -
ఐదేసిన మెహిది హసన్.. అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన జింబాబ్వే
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో పర్యాటక జింబాబ్వే కీలకమైన 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 67/1 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన జింబాబ్వే మరో 206 పరుగులు జోడించి 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవండతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ సొంతగడ్డపై భారీ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
రెచ్చిపోయిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న వేల బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలైంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోయారు. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్కు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ 40, బెన్ కర్రన్ 17 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.స్వదేశంలో బంగ్లాదేశ్ అత్యల్ప స్కోర్లు (టెస్ట్ల్లో)ఢాకా- 107 (2001)సిల్హెట్- 143 (2018)సిల్హెట్- 169 (2018)సిల్హెట్- 191 (2025)ఢాకా- 211 (2005) -
పాకిస్తాన్ భారత్లో మ్యాచ్లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్రేట్లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్లాండ్తో మ్యాచ్లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్రేట్తో వరల్డ్కప్నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్రేట్తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ -
బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్కు కోల్కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది. -
కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్ హ్యాట్రిక్
లాహోర్: మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు విజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫర్జానా (57; 6 ఫోర్లు), షర్మిన్ అక్తర్ (57; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్యాథరిన్ బ్రైస్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. ప్రియనాజ్ (63 బంతుల్లో 61; 7 ఫోర్లు), రాచెల్ (73 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా 4, జన్నతుల్ 2 వికెట్లు తీశారు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్ 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో ఐర్లాండ్ 46 పరుగుల తేడాతో థాయ్లాండ్ జట్టుపై గెలిచింది. ఇది కూడా చదవండి: శ్రేయస్ అయ్యర్కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుదుబాయ్: భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మార్చి నెలకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దక్కింది. చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చినందుకుగానూ అయ్యర్ను ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వివరాలు వెల్లడించింది. చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో అయ్యర్ అత్యధిక పరుగులు (243) చేసిన ప్లేయర్గా నిలిచాడు.న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ కూడా ఈ పురస్కారం కోసం పోటీపడగా... ఆ ఇద్దరినీ వెనక్కి నెడుతూ అయ్యర్ విజేతగా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీ హస్తగతం చేసుకోవడంతో పాటు అవార్డు గెలుచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని అయ్యర్ అన్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారాన్ని భారత ఆటగాడు శుబ్మన్ గిల్ దక్కించుకున్నాడు. -
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ.. -
హసీనాకు మరో అరెస్ట్ వారెంట్
ఢాకా: అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమె సోదరి షేక్ రెహానా, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా మరో 50 మంది పేర్లు పొందుపరిచింది. అధికార దుర్వినియోగంతో పుర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో 10 అంతస్తుల స్థలాన్ని కొనుగోలు చేశారంటూ జనవరి 13న రెహానాపై ఏసీసీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హసీనా, రెహానా కుమార్తె బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు. మరో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీసీ మార్చి 10న సమర్పించిన తుది చార్జిషీట్లోలో మరో 18 మంది పేర్లు చేర్చింది. మూడు వేర్వేరు ఛార్జిషీట్లను పరిశీలించిన అనంతరం ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జాకీర్ హుస్సేన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు ఉత్తర్వుల అమలుపై నివేదికలను సమీక్షించడానికి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు. రజుక్ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన మరో అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వజీద్ పుతుల్, మరో 17 మందిపై ఏప్రిల్ 10న ఇదే కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పుతుల్ 2023 నవంబర్ 1 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. హసీనాపై సామూహిక హత్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు అదృశ్యాలు వంటి అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5న తిరుగుబాటు అనంతరం తన ప్రభుత్వం కూలిపోవడంతో, 77 ఏళ్ల హసీనా అప్పటి నుంచి భారత్లోనే ఉంటున్నారు. -
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 10) బంగ్లాదేశ్, థాయ్లాండ్ తలపడ్డాయి. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ థాయ్ను 178 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. షర్మిన్ అక్తర్ (126 బంతుల్లో 94 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి చేరువై అజేయంగా నిలిచింది. ఓపెనర్ ఫర్జానా హాక్ (53) అర్ద సెంచరీతో రాణించింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పసికూన థాయ్లాండ్.. బంగ్లా స్పిన్నర్లు ఫహిమ ఖాతూన్ (8.5-1-21-5), జన్నతుల్ ఫిర్దౌస్ (5-3-7-5) చెలరేగడంతో 23.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. థాయ్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. చనిద (22) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో బోణీ కొట్టింది.కాగా, ఈసారి మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీలకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్ వరల్డ్కప్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి.ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి. -
బంగ్లాదేశ్ సారథి యూనస్ కు షాక్ ఇచ్చిన భారత్
-
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
న్యూఢ్లిల్లీ: భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు అందిస్తున్న కీలక ట్రాన్స్షిప్మెంట్ (Transshipment) సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ సౌలభ్యాన్ని భారత్ 2020లో బంగ్లదేశ్కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి, అక్కడ నుండి మూడవ దేశాలకు రవాణా చేసేది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.భారత ఎగుమతులకు ఆటంకంఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారతదేశం ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవులలో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు, భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.అసలు కారణం ఇదే..అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) ఇటీవల చైనాలో పర్యటించి, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్లాక్డ్ (భూపరివేష్టిత) ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన అలజడిని రేపాయి. దీనికి ప్రతిగానే భారత్ ఈ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు.అమెరికా సుంకాలకు తోడుగా..భారత్ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ (Readymade garment industry) దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారింది.బంగ్లాకు ఆర్థిక సవాళ్లుఅస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇది ఈశాన్య ప్రాంత భద్రతను కాపాడటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను సూచిస్తున్నదని పేర్కొన్నారు. భారత దుస్తుల ఎగుమతి పరిశ్రమ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. కాగా ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యం రద్దు భారత్- బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ ఇకపై తమ దేశ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టనుంది.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే! -
నిషేధం ముగించుకుని తిరిగొచ్చిన నాసిర్ హొసేన్
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హొసేన్ ఐసీసీ విధించిన రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకుని తిరిగి బరిలోకి దిగాడు. నాసిర్ హొసేన్ 2020-21 అబుదాబీ టీ10 లీగ్ సందర్భంగా ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ఐసీసీ నాసిర్ను దోషిగా తేల్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు నాసిర్ అంగీకరించాడు. దీంతో హొసేన్ను క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రెండేళ్ల పాటు (ఆరు నెలల సస్పెన్షన్తో కలుపుకుని) నిషేధించారు. ప్రస్తుతం హొసేన్ నిషేధానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను పూర్తి చేసుకుని కెరీర్ను తిరిగి ప్రారంభించేందుకు అర్హత సాధించాడు. ఐసీసీ నాసిర్ హొసేన్ను క్లీన్ చిట్ ఇచ్చింది.నాసిర్ హొసేన్పై నిషేధం ఎత్తి వేయడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. నాసిర్ తప్పనిసరి అవినీతి నిరోధక విద్యా సెషన్ను పూర్తి చేయడంతో పాటు అన్ని అవసరాలను తీర్చాడు. ఏప్రిల్ 7, 2025 నాటికి అధికారిక క్రికెట్లోకి తిరిగి ప్రవేశించేందుకు అతనికి మార్గం సుగమమైందని బీసీబీ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. నాసిర్ తనపై సస్పెన్షన్ ఎత్తివేసిన రోజునే ఢాకా ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నాడు. ఈ టోర్నీ అతను రూప్ఘంజ్ టైగర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఘాజీ గ్రూప్ జట్టుతో తలపడ్డాడు.33 ఏళ్ల నాసిర్ 2011లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 19 టెస్ట్లు, 85 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన నాసిర్ టెస్ట్ల్లో 1044 పరుగులు, 8 వికెట్లు.. వన్డేల్లో 1281 పరుగులు, 24 వికెట్లు.. టీ20ల్లో 370 పరుగులు 7 వికెట్లు తీశాడు. నాసిర్ తన అంతర్జాతీయ కెరీర్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. నాసిర్ బంగ్లాదేశ్ తరఫున 2018లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లో పాల్గొంటూ వచ్చాడు. -
బంగ్లా తీరు మారాల్సిందే!
ఏదైనా మోతాదు మించితే వికటిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోగా అనవసర ప్రయాస మిగులు తుంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్కు ఆలస్యంగానైనా ఇది అర్థమైందో లేదో సందేహమే. గతవారం ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విజయవంతమైందని బంగ్లా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. కానీ అక్కడ తెలిసీ తెలియకుండా యూనస్ మాట్లాడిన మాటలవల్ల బంగ్లాకు ఒరిగిందేమీ లేకపోగా, ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పించుకోవాల్సివచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజా ఉద్యమం పర్యవసానంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి మన దేశంలో ఆశ్రయం పొందినప్పటినుంచీ ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. హత్యలు, అత్యా చారాలు అధికమయ్యాయి. మత ఛాందసవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలమధ్యా ఉన్నతస్థాయి భేటీ జరగటం ఇదే ప్రథమం. శుక్రవారం థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ఏడు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల కూటమి బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూనస్తో విడిగా భేటీ అయినప్పుడు ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయటం మానుకోవాలని మోదీ సూచించినట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే నిర్మాణాత్మక, ఆచరణీయ వైఖరితో ఉండాలని కూడా సలహా ఇచ్చారట. తమ దేశంపై తప్పుడు ప్రచారం సాగుతోందని బంగ్లా దబాయించినా సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు నిజమేమిటో వెల్లడిస్తూ వచ్చాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇవి పునరావృతం కానీయరాదని గతంలోనే మన దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుత భేటీలో కూడా మోదీ దీన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలన్న యూనస్కు... అలా అడగటా నికి ఇది వేదిక కాదని మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పాల్సి వచ్చింది.యూనస్ పూర్వాశ్రమంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థ రూపశిల్పిగా, మైక్రో ఫైనాన్స్ విధాన నిర్ణేతగా బంగ్లా గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు చేసినకృషికి 2006లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. పలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలకు సారథ్యం వహించారు. ఇదంతా బాగున్నా షేక్ హసీనాతో వచ్చిన విభేదాల కార ణంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కేసులు వచ్చి పడ్డాయి. మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ వల్ల గ్రామీణులకు మేలు కలగకపోగా అప్పుల్లో కూరుకుపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. తనకు ససేమిరా పడని హసీనాకు మన దేశం మద్దతుగా నిలిచిందన్న ఆక్రోశం యూనస్కు ఉండొచ్చు. ఇరుగు పొరుగు సత్సంబంధాలతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం, అభివృద్ధి సాధించటం అత్యవసరమని ఆయన ఇప్పటికీ గ్రహించలేదని చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఈశాన్య భారత్లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని యూనస్ చైనాలో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, మతిమరుపోగానీ... భారత్కు రెండువైపులా 6,500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న సంగతి ఆయనకు తట్టలేదు.ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే... జలరవాణాను పెంచితే దేశంలోని ఏ తీరప్రాంతంనుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని! యూనస్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లా విదేశాంగ శాఖ ముక్తాయిస్తోంది. కానీ సమయమూ,సందర్భమూ గమనిస్తే అది నిజం కాదనిపిస్తుంది. తాము పాకిస్తాన్తోపాటు చైనాకు దగ్గర కాబోతు న్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించటమే ఇది.బంగ్లాదేశ్కు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మతఛాందసుల వీరంగంతో మన దేశం కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో అది సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రధాన సలహాదారయ్యాక యూనస్ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి పర్యటనకు యూనస్ కావాలని చైనాను ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. ఇంతచేసినా 210 కోట్ల డాలర్ల పెట్టుబడికి చైనా సమ్మతించింది. దాదాపు వంద కంపెనీలు 100 కోట్ల డాలర్లమేర మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ బంగ్లాకు తక్షణసాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో సతమతమవుతోంది. మత ఛాందసులు ఈ స్థితిని తమకు అను కూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. మోదీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశ మన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాకు అన్నివైపులనుంచీ సాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆటపట్టయితే, భారత్ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం శూన్యం. యూనస్ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
బ్యాంకాక్: భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించారు.‘భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు.‘ ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీప్ అడ్వైజర్ ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.భారత్ గురించి బంగ్లా చీఫ్ అడ్వైజర్ ఏమన్నారంటే.. చైనా పర్యటన సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకోగా, దీనికి తాజాగా ప్రధాని మోదీ కౌంటర్ తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
127వ స్థానంలో...
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్లో ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది జూన్లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న హాంకాంగ్తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి. -
భారత్కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్పై కాంగ్రెస్ విమర్శించింది. -
బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే. -
బంగ్లాతో మళ్లీ చెలిమి!
నిరుడు ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచీ భారత–బంగ్లాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్కు లేఖ రాయటం ఆహ్వానించదగ్గ పరిణామం. బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా త్యాగాల పునాదులపై నిర్మితమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. పదిహేనేళ్లు పాలించిన హసీనా మత ఛాందసుల్ని అదుపులో పెట్టడంలో సాధించిన విజయాలు ప్రశంసనీయమైనా, రిగ్గింగ్తో విజయాన్ని చేజిక్కించుకోవటం, విపక్ష నేతలను ఏళ్ల తరబడి జైళ్లపాలు చేయటం వంటి ధోరణుల్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. తిరుగుబాటు జరి గాక, జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. హసీనా పార్టీ అవామీ లీగ్ నేత లపైనా, కార్యకర్తలపైనా దాడులతో పాటు ఆ పార్టీకి మద్దతు పలికారంటూ పలువురి ఆస్తుల్ని ధ్వంసం చేయటం మితిమీరింది. ఈ అరాచకం ఆపకపోగా అంతా సవ్యంగా ఉందంటూ యూనుస్ దబాయింపులకు దిగారు. మతఛాందసులది పైచేయి అయి మహిళలపైనా, మైనారిటీ హిందూ వర్గంపైనా దాడులకు పూనుకుంటున్నా... వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు బాగా పెరిగినా అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. గత డిసెంబర్లో ఆ దేశాన్ని సందర్శించిన మన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బంగ్లా విదేశాంగ సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేన్కు అందజేశారు. భౌగోళిక రాజకీయ కోణంలో బంగ్లాదేశ్తో చెలిమి భారత్కు చాలా అవసరం. అది చిన్న దేశమే అయినా దానితో మనకు 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దువుంది. ఇందులో నదీ పరీవాహక ప్రాంతం వేయి కిలోమీటర్లపైన ఉంటుంది. తాగునీటికైనా, సాగునీటికైనా తీస్తా నదీజలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. ఆ నది ప్రవహించే 315 కిలోమీటర్లలోనూ 130 కిలోమీటర్లు బంగ్లాదేశ్ భూభాగంలోనే ఉంటుంది. పశ్చిమబెంగాల్లోని గజల్డోబా బరాజ్ వల్ల భారీ మొత్తం జలాలు ఆ రాష్ట్రానికే పోతాయని, తమకు మిగిలేది అతి తక్కువని బంగ్లా వాదిస్తోంది. ఆ జలాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని కోరుకుంటోంది. చివరకు కనీసం తొలి దశలో 25 శాతం ఇస్తే చాలని రాజీ కొచ్చింది కూడా. కానీ మమత అందుకు కూడా ససేమిరా అన్నారు. వాస్తవానికి 2011లో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ తీస్తా నదీజలాల పంపకంపై బంగ్లాతో సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు. ఒప్పందం రూపొందింది. కానీ అప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ సీఎంగా వున్న మమతా బెనర్జీ యూపీఏ భాగస్వామి కావటం, ఆ ఒప్పందానికి ఆమె ససేమిరా అనటంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫెనీ జలాల విషయంలోనూ ఇలాంటి పీటముడే పడింది. నదీజలాల అంశం తప్ప ఇతరేతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవి. భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తమ ప్రయోజనాలను బేఖాతరు చేస్తున్నదని బంగ్లా ప్రజానీకంలో చాన్నాళ్ల నుంచి అసంతృప్తి వుంది. దానికితోడు హసీనాకు భారత్ గట్టి మద్దతుదారుగా ఉండటంవల్లే ఆమె ఇష్టారాజ్యం సాగిందని, లక్షలాదిమంది తమ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని విపక్షాల ఆరోపణ. ఈశాన్య భారత్లో తరచు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకునే మిలిటెంట్లను ఆమె హయాంలో భారత్కు అప్పగించేవారు. ఇది కూడా అక్కడి ఛాందసవాదులకు మింగుడుపడలేదు. అయినా ఇరు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొనాల్సిన సమస్యలూ ఉన్నాయి. ఉదాహరణకు టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించతలపెట్టిన మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది కాబోతోంది. అది మనతోపాటు బంగ్లాదేశ్ ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. బంగ్లా సాగు అవసరాల్లో 55 శాతం బ్రహ్మపుత్ర నదీజలాలు తీరుస్తాయి. చైనాలోని టిబెట్లో యార్లుంగ్ సాంగ్పోగా మొదలై మన దేశంలో ప్రవేశించేసరికి బ్రహ్మపుత్ర అయి, బంగ్లాలో అది జమునా నదిగా మారుతుంది. ప్రస్తుత బంగ్లా వాటా జలాల్లో 5 శాతం తగ్గినా సాగు ఉత్పత్తులు 15 శాతం పడిపోతాయని మూడేళ్ల క్రితం బంగ్లా పర్యావరణ శాఖ అంచనా వేసింది. బరాజ్ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపాలపరంగా ప్రమాదకరమైనది. భూ అంతర్భాగంలోని టిబెట్ పలక చురుగ్గా ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే మన దేశం చైనాకు ఆందోళనను తెలియజేయగా, బంగ్లాదేశ్ సైతం ఆ బరాజ్ ప్రభావంపై రూపొందించిన నివేదికలు తమకందించాలని ఆ దేశానికి లేఖ రాసింది.బంగ్లా విముక్తి దినోత్సవంపై ప్రస్తుత పాలకులకు అంత పట్టింపు లేదు. హసీనా పతనానికి దారితీసిన ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విద్యార్థులు తమది తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో గణతాంత్రిక్ ఛాత్ర సంగ్సద్ (ప్రజాతంత్ర విద్యార్థి మండలి) పేరిట గత నెలలో పార్టీ స్థాపించారు. అయితే ఛాందస వాదులు దీన్ని ఎంతవరకూ సాగనిస్తారో తెలియదు. దేశాన్ని మళ్లీ తూర్పు పాకిస్తాన్గా మార్చాలని వారు తహతహలాడుతున్నారు. ఇస్లామిక్ సంప్రదాయాలను అమలు చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకూ బ్యాంకాక్లో జరగబోయే బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంఘం బిమ్స్టెక్ సమావేశం సందర్భంగా మోదీతో భేటీకి బంగ్లా ఆసక్తి చూపుతోంది. తాజా పరిణామంతో అది సాకారమైతే మళ్లీ ఇరు దేశాల స్నేహసంబంధాలూ పట్టాలెక్కుతాయి. -
బంగ్లాదేశ్లో త్వరలో సైనిక పాలన!
ఢాకా: బంగ్లాదేశ్లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతోపాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు మీడియా స్పష్టంచేసింది.యూనస్ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించి, ఆ తర్వాత మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అత్యవసర భేటీ జరగలేదన్న సైన్యం సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని బంగ్లాదేశ్ సైన్యం తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది. -
మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటు.. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డ స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్, ఆ దేశ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (36) నిన్న ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా తమీమ్కు రెండు సార్లు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలిసి అందుబాటులో ఉన్న వారు తమీమ్ను ఆసుపత్రికి తరలించారు. స్పృహ కోల్పోయిన తమీమ్కు ఆసుపత్రిలో డాక్టర్లు గంట సేపు సీపీఆర్ చేశారు. డాక్టర్లు తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. నిన్ననే తమీమ్ గుండెకు స్టంట్లు వేశారు. తమీమ్ ఆసుపత్రికి చేరిన సమయంలో పరిస్థితి విషమంగా ఉండిందని డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రికి రావడం లేట్ అయ్యుంటే తమీమ్ ప్రాణాలు కోల్పోయేవాడని అన్నారు.ప్రస్తుతం తమీమ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి కోలుకునే క్రమంలో ఉన్నాడని తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే స్పృహలోకి వచ్చాడని సమాచారం. తమీమ్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడని బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.తమీమ్ గుండెపోటుకు గురయ్యాడని తెలిసి క్రికెట్ ప్రపంచం స్పందించింది. తమీమ్ కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. తమీమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. నిన్ననే పుట్టిన రోజు జరుపుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తమీమ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నాడు. తమీమ్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.తమీమ్ పరిస్థితి తెలిసి టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను మైదానంలో ఎదుర్కొన్నావు. విజయవంతమయ్యావు. ఇప్పుడూ అంతే, త్వరగా కోలుకుని విజయవంతంగా తిరిగొస్తావంటూ ట్వీట్ చేశాడు.కాగా, తమీమ్ బంగ్లాదేశ్ తరఫున 16 ఏళ్ల కెరీర్లో 391 మ్యాచ్లు ఆడి 15000 పైచిలుకు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 మధ్యలో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. -
స్టార్ క్రికెటర్కు గుండెపోటు.. పరిస్థితి విషమం
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్కు (36) ఇవాళ (మార్చి 23) ఉదయం గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతుండగా తమీమ్ తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే రెండు సార్లు ఛాతీ నొప్పికి గురైనట్లు సమాచారం. తమీమ్ పరిస్థితి తెలిసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ కార్యకలాపాలన్నిటినీ వాయిదా వేసుకుంది. బోర్డు డైరెక్టర్లు తమీమ్ను చూసేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు.తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్లో అత్యంత సఫలమైన ఆటగాడు. తమీమ్ 2023లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను లోకల్ క్రికెట్ ఆడుతూ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. తమీమ్ పేరిట బంగ్లాదేశ్ క్రికెట్కు సంబంధించి ఎన్నో రికార్డులు ఉన్నాయి. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో (మూడు ఫార్మాట్లలో) 15000 పైచిలుకు పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 వరకు బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. -
Bangladesh: బంగ్లాలో మళ్లీ అల్లర్లు? సైనికుల పహారాకు ఆదేశాలు
బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంలో అశాంతి, హింసాయుత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాజధాని ఢాకాలో సైనికులను మోహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని వారాలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్మీ ఇటువంటి ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తిరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే ఇటువంటి ఆదేశాలు జారీ అయ్యాయని కూడా చెబుతున్నారు.నార్త్-ఈస్ట్ న్యూస్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ సైన్యం ఇప్పటికే ఢాకా(Dhaka) చేరుకుంది. భారీ సంఖ్యలో సాయుధ వాహనాలు, 100 మంది సైనికులను తొలుత ఢాకాలో మోహరించినట్లు సమాచారం. 9వ డివిజన్ సైనికులు కూడా ఢాకాకు చేరుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సైన్యం ఇటువంటి చర్యలు చేపట్టిందని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామీణాభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమూద్ షాజిబ్ భూయాన్కు చెందిన పాత వీడియో ఒకటి బయటపడింది. అందులో అతను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సమక్షంలో బంగ్లాదేశ్ పగ్గాలను ముహమ్మద్ యూనస్(Muhammad Yunus)కు అప్పగించడానికి అయిష్టంగానే అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా విద్యార్థి నేత హస్నత్ అబ్దుల్లా మార్చి 11న జనరల్ జమాన్తో రహస్య భేటీ తర్వాత సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆర్మీ చీఫ్ అనడం హస్నత్ అబ్దుల్లాకు నచ్చలేదని అంటున్నారు.బంగ్లాదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలకు, ఆర్మీ చీఫ్కు మధ్య సయోధ్య లేనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులను నియంత్రించాలని ఆర్మీ చీఫ్ యూనస్ నిరంతరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆర్మీ చీఫ్ మరోసారి షేక్ హసీనా అవామీ లీగ్కు మార్గం సుగమం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో రాబోయే ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు ఆర్మీ చీఫ్ సన్నాహాలను ప్రారంభించారని సమాచారం. ఇది కూడా చదవండి: Janta Curfew: జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు.. 68 రోజుల లాక్డౌన్ మొదలైందిలా.. -
షకీబ్కు బిగ్ రిలీఫ్.. బౌలింగ్కు లైన్ క్లియర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మేటి ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్కు మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అతని బౌలింగ్ శైలితీరు నియమాలకు లోబడే ఉందని, సందేహాస్పదంగా లేదని సమీక్ష అనంతరం తేలింది. అయితే తన బౌలింగ్ యాక్షన్ను ఎక్కడ సమీక్షించారనే విషయాన్ని షకీబ్ వెల్లడించలేదు.ఇప్పటికే టెస్టులకు, అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్ వన్డే ఫార్మాట్లో, ఫ్రాంచైజీ లీగ్లలో బౌలింగ్ చేసేందుకు మార్గం సుగమం అయింది. గత ఏడాది అక్టోబర్ కాన్పూర్లో భారత్తో జరిగిన రెండో టెస్టు తర్వాత షకీబ్ మళ్లీ బరిలోకి దిగలేదు. గత డిసెంబర్లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడిన సమయంలో షకీబ్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉండటంతో అతడు బౌలింగ్పై నిషేధం విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన షకీబ్ త్వరలో శ్రీలంకతో వన్డే సిరీస్లో పాల్గొనే అవకాశముంది.చదవండి: ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు! -
బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా
వాషింగ్టన్ డీసీ: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా(America) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా సారిస్తున్నామని వెల్లడించింది.మరోవైపు బంగ్లాదేశ్లోని ప్రజల భద్రత కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వంgovernment) తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని కూడా అమెరికా పేర్కొంది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరంతరం గమనిస్తున్నామని, వీటిని నియంత్రించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. బంగ్లాదేశ్పై నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించినప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఈ విధంగా స్పందించారు.బంగ్లాదేశ్(Bangladesh)లో 2024 ఆగస్టు 5న అప్పటి ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసినప్పటి నుండి హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. హిందువుల ప్రార్థనా స్థలాలు, మతపరమైన ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువుల ఇళ్లను తగులబెట్టి, ధ్వంసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం మౌనం వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి.ఇది కూడా చదవండి: శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా నిన్న (మార్చి 12) వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని మహ్మదుల్లా బోర్డును కోరాడు.మహ్మదుల్లా తన రిటైర్మెంట్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు.. నా సహచరులకు, కోచ్లకు, నాకు ఎల్లప్పుడూ మద్దతు నిలిచిన నా అభిమానులకు కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులు, అత్తమామలకు ధన్యవాదాలు. నా చిన్నతనం నుండి కోచ్గా, మెంటర్గా నిరంతరం నాకు తోడుగా ఉన్న నా సోదరుడు ఎమ్దాద్ ఉల్లాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.చివరిగా నా భార్య, పిల్లలకు కృతజ్ఞతలు. వారు క్లిష్ట సమయాల్లో నాకు మద్దతుగా నిలిచారు. బంగ్లాదేశ్ జెర్సీలో నా పిల్లలు నన్ను మిస్ అవుతారని తెలుసు. ప్రతిదీ పరిపూర్ణంగా ముగియదు. మనకు మనము సర్ది చెప్పుకొని ముందుకు సాగాలి. శాంతి.. నా జట్టుకు, బంగ్లాదేశ్ క్రికెట్కు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ ముగించారు.39 ఏళ్ల మహ్మదుల్లా తాజాగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ (న్యూజిలాండ్పై) ఆడాడు. మహ్మదుల్లా తన అంతర్తాజీయ కెరీర్లో 400కు పైగా మ్యాచ్లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మహ్మదుల్లాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో మూడు సెంచరీలు (2015లో రెండు, 2023లో ఒకటి) చేసిన ఏకైక బంగ్లాదేశ్ ప్లేయర్ మహ్మదుల్లానే.2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 50 టెస్ట్లు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడాడు. ఇందులో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 5689 పరుగులు.. టెస్ట్ల్లో 2914, టీ20ల్లో 2444 పరుగులు చేశాడు. మహ్మదుల్లా వన్డేల్లో 4, టెస్ట్ల్లో 5 సెంచరీలు చేశాడు. రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన మహ్మదుల్లా టెస్ట్ల్లో 43 వికెట్లు.. వన్డేల్లో 82, టీ20ల్లో 41 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ కెరీర్లో మహ్మదుల్లా 181 క్యాచ్లు కూడా పట్టాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల రహీమ్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో టీ20లకు వీడ్కోలు పలికిన రహీమ్.. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముష్పికర్ వెల్లడించాడు.అన్నివిధాలగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ రహీమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రహీమ్ వన్డేలకు విడ్కోలు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది."నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నాను. నా కెరీర్లో ఇప్పటివరకు సాధించిన ప్రతీ విజయం వెనక ఆ దేవుడు ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో మేము సాధించిన పరిమితం అయినప్పటికీ.. నేను మాత్రం నా దేశం కోసం ఎంతో నిజాయతీతో, అంకితభావంతో పనిచేశాను. గత కొన్ని వారాలగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇక టెస్టు క్రికెట్పై మరింత దృష్టిసారిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన బంగ్లా క్రికెట్కు, అభిమానులకు, సహచరులకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను" అని ముష్ఫికర్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చాడు.2006లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రహీమ్ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్లో బంగ్లా తరపున 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్.. 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన రికార్డు రహీమ్ పేరిటే ఉంది. అదేవిధంగా వికెట్ కీపర్గా కూడా ముష్ఫికర్ 243 క్యాచ్లు అందుకున్నాడు.చదవండి: సచిన్ హాఫ్ సెంచరీ వృథా.. భారత్ను చిత్తు చేసిన ఆసీస్ -
Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వివక్ష చూపింది. దేశంలోని పాఠ్యపుస్తకాలలో ఆమె పేరును తొలగించింది. పాఠశాల పాఠ్యపుస్తకాలలో ప్రధాన మార్పులు చేసిన దరిమిలా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఇదేవిధంగా పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్లు కనిపించే ఒక చారిత్రక ఫోటోను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.గత సంవత్సరం బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న పలు అల్లర్ల దరిమిలా షేక్ హసీనా(Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన నూతన ప్రభుత్వం పాఠశాల పుస్తకాలలో పలు మార్పులు చేసింది. వాటిలో భారతదేశానికి సంబంధించిన వివరాలలో కూడా మార్పులు చేసింది. షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం పాత్రను తొలగించనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ముజిబురహ్మాన్ ఉన్న ఫోటోలను తొలగించారు.పుస్తకాల వెనుక కవర్ పేజీపై షేక్ హసీనా విద్యార్థుల కోసం అందించిన సందేశాన్ని తొలగించారు. హసీనాపై తిరుగుబాటు జూలై 2024లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోలను నూతన పాఠ్యపుస్తకాల వెనుక కవర్ పేజీపై ముద్రించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్బుక్ బోర్డ్ (ఎన్సీటీబీ)చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ 57 మందికి పైగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబురాహ్మాన్ సంయుక్తంగా ఉన్న ఫొటోను తొలగించారు. ఈ ఫొటో ఫిబ్రవరి 6, 1972 నాటిది. ఇంతేకాకుండా బంగ్లా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని పుస్తకాల మొదటి పేజీ నుండి తొలగించి వెనుక భాగంలో ముద్రించారు. నిపుణుల బృందం పుస్తకాలలో జాతీయ జెండా, గీతం అవసరం లేదని భావించింది. వీటిని పూర్తిగా తొలగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని విద్యాశాఖాదికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. -
Champions Trophy 2025: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 27) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్లో టాస్ కూడా పడలేదు. ప్రస్తుత ఎడిషన్లో వర్షం కారణంగా రద్దైన రెండో మ్యాచ్ ఇది. ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలాగే టాస్ కూడా పడకుండా రద్దైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ గ్రూప్-ఏలో భాగంగా జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్. ఈ గ్రూప్ నుంచి ఈ రెండు జట్లు ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఆడిన రెండు మ్యాచ్ల్లో భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడాయి. ఆతిథ్య దేశ హోదాలో నేటి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావించింది. అయితే వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పాక్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ కలిగిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ముగించింది. టోర్నీ ప్రారంభానికి ముందు పాక్లాగే బీరాలు పలికి బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్కు చేరడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగానే సాగనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్లో జరుగనుంది.గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్లు ఖరారైనా.. గ్రూప్-బిలో పోటీ మాత్రం రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో ఈ గ్రూప్ నుంచి సెమీస్ రేసు రంజుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రెండు సెమీస్ బెర్త్ల కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో మ్యాచ్ గెలవగా.. ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చెరి 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్పై గెలుపు.. అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రేపు ఆఫ్ఘనిస్తాన్ లాహోర్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది. రెండో బెర్త్ మార్చి 1న జరిగే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిస్తే రెండో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుంటుంది. -
కివీస్తో కలిసి సెమీస్కు భారత్
బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ ఓవర్లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టిన కివీస్ బ్యాటర్ బ్రేస్వెల్... ఈ షాట్తో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సమీకరణం తేలిపోయింది. ఈ బౌండరీతో న్యూజిలాండ్, భారత్ అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టయిన పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కథ కూడా లీగ్ దశలోనే ముగిసింది. నిష్క్రమించిన రెండు జట్లు ప్రాధాన్యత లేని పోరులో గురువారం తలపడనుండగా... సెమీస్కు ముందు సన్నాహకంగా ఆదివారం కివీస్ను భారత్ ఎదుర్కోనుంది.కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్ను ఎదుర్కొనడంలో విఫలమైన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ తరహాలోనే పేలవ బ్యాటింగ్తో దాదాపు అదే స్కోరు సాధించగా... మరో 23 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. విరామం లేకుండా వరుసగా 10 ఓవర్లు వేసిన ఆఫ్స్పిన్నర్ బ్రేస్వెల్ నాలుగు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టగా... బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర సెంచరీ హైలైట్గా నిలిచాయి. గత చాంపియన్స్ ట్రోఫీలో తమను ఓడించి సెమీఫైనల్ చేరిన బంగ్లాదేశ్ను ఇప్పుడు కివీస్ అదే తరహాలో 5 వికెట్లతో ఓడించి సెమీస్ చేరడం విశేషం. రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయంతో మాజీ విజేత న్యూజిలాండ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇదే గ్రూప్లో రెండు విజయాలు సాధించిన భారత్ కూడా కివీస్తో పాటు సెమీస్ చేరింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో కివీస్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.కెప్టెన్ నజ్ముల్ హుసేన్ (110 బంతుల్లో 77; 9 ఫోర్లు), జాకీర్ అలీ (55 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్వెల్ (4/26) నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు సాధించి గెలిచింది. రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా... లాథమ్ (76 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించాడు. నజ్ముల్ అర్ధసెంచరీ... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు తన్జీద్ (24; 1 ఫోర్, 2 సిక్స్లు), నజ్ముల్ ధాటిగా మొదలు పెట్టారు. తన్జీద్ రెండు సిక్స్లు బాదగా, జేమీసన్ ఓవర్లో నజ్ముల్ 3 ఫోర్లు కొట్టాడు. అయితే 9వ ఓవర్లోనే స్పిన్ బౌలింగ్ను మొదలు పెట్టిన కివీస్ ఫలితం సాధించింది. బ్రేస్వెల్ తొలి ఓవర్లోనే తన్జీద్ వికెట్ తీసి పతనానికి శ్రీకారం చుట్టగా... మిరాజ్ (13) మరోసారి విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత బ్రేస్వెల్ మళ్లీ బంగ్లాను దెబ్బ కొట్టాడు.21 పరుగుల వ్యవధిలో బంగ్లా తౌహీద్ (7), ముషి్ఫకర్ (2), మహ్మదుల్లా (4) వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ బ్రేస్వెల్ ఖాతాలోకే చేరాయి. ఈ దశలో నజ్ముల్, జాకీర్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. 71 బంతుల్లో నజ్ముల్ అర్ధ సెంచరీ పూర్తయింది. నజ్ముల్ను అవుట్ చేసి రూర్కే ఈ జోడీని విడదీయగా... బంగ్లా మిగిలిన వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బంగ్లా ఇన్నింగ్స్లో డాట్ బాల్స్ ఏకంగా 178 ఉన్నాయి. శతక భాగస్వామ్యం... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే యంగ్ (0) అవుట్ కాగా, కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ (5) కూడా వెనుదిరిగాడు. కాన్వే, రచిన్ కలిసి మూడో వికెట్కు 57 పరుగులు జోడించిన తర్వాత కాన్వే పెవిలియన్ చేరాడు. అయితే రచిన్, లాథమ్ల భారీ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. ఈ ద్వయాన్ని విడదీసేందుకు బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో 95 బంతుల్లోనే రచిన్ కెరీర్లో నాలుగో సెంచరీని అందుకున్నాడు. లాథమ్ కూడా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎట్టకేలకు విజయానికి 36 పరుగుల దూరంలో రచిన్ను బంగ్లా అవుట్ చేయగా, కొద్ది సేపటికే లాథమ్ కూడా నిష్క్రమించాడు. అయితే ఫిలిప్స్ (21 నాటౌట్), బ్రేస్వెల్ (11 నాటౌట్) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్వెల్ 24; నజ్ముల్ (సి) బ్రేస్వెల్ (బి) రూర్కే 77; మిరాజ్ (సి) సాంట్నర్ (బి) రూర్కే 13; తౌహీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్వెల్ 7; ముషి్ఫకర్ (సి) రచిన్ (బి) బ్రేస్వెల్ 2; మహ్ముదుల్లా (సి) రూర్కే (బి) బ్రేస్వెల్ 4; జాకీర్ (రనౌట్) 45; రిషాద్ (సి) సాంట్నర్ (బి) హెన్రీ 26; తస్కీన్ (సి) కాన్వే (బి) జేమీసన్ 10; ముస్తఫిజుర్ (నాటౌట్) 3; నాహిద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 236.వికెట్ల పతనం: 1–45, 2–64, 3–97, 4–106, 5–118, 6–163, 7–196, 8–231, 9– 236. బౌలింగ్: హెన్రీ 9–0–57–1, జేమీసన్ 9–1– 48–1, బ్రేస్వెల్ 10–0–26–4, రూర్కే 10–1– 48– 2, సాంట్నర్ 10–1–44–0, ఫిలిప్స్ 2–0– 10–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (బి) తస్కీన్ 0; కాన్వే (బి) ముస్తఫిజుర్ 30; విలియమ్సన్ (సి) ముష్ఫికర్ (బి) నాహిద్ 5; రచిన్ (సి) (సబ్) పర్వేజ్ (బి) రిషాద్ 112; లాథమ్ (రనౌట్) 55; ఫిలిప్స్ (నాటౌట్) 21; బ్రేస్వెల్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 6; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 240.వికెట్ల పతనం: 1–0, 2–15, 3–72, 4–201, 5–214. బౌలింగ్: తస్కీన్ 7–2–28–1, నాహిద్ 9–0–43–1, మిరాజ్ 10–0–53–0, ముస్తఫిజుర్ 10–0–42–1, రిషాద్ 9.1–0–58–1, నజ్ముల్ 1–0–12–0. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికామధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం