బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ జర్నలిస్ట్ హత్య..! | Hindu Journalist Shot Dead In Bangladesh, Another Attack On Minority Community, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Banglasesh Hindu Attack: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ జర్నలిస్ట్ హత్య..!

Jan 5 2026 10:59 PM | Updated on Jan 6 2026 3:38 PM

Another Bangladesh Hindu man Shot dead in Bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బంగ్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఐస్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఓ బంగ్లా డైలీకి తాత్కాలిక ఎడిటర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ బైరాగి (38) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక ఏఎస్పీ అబుల్‌ బసర్‌ వెల్లడించారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలోని మోనిరాంపూర్ ఉపజిల్లాలో జరిగింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. కాగా.. ప్రతాప్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని.. అతడు నరైల్‌ జిల్లా నుంచి వెలువడే ఓ దిన పత్రికకు తాత్కాలిక సంపాదకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సదరు పత్రిక న్యూస్‌ ఎడిటర్‌ అబుల్‌ మాట్లాడారు. రాణా ప్రతాప్‌ తమ పత్రిక సంపాదకుడని తెలిపారు. ఒకప్పుడు అతడిపై  పలు కేసులు ఉన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డారని వెల్లడించారు. అయితే ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏమిటనేది మాత్రం తనకు తెలియదని అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement