ఐటీసీ ఎస్ఆర్ఏ 'వందేమాతరం' 150 వసంతాల వేడుకలు | ITC SRA Celebrating 150 years of Vande Mataram | Sakshi
Sakshi News home page

ఐటీసీ ఎస్ఆర్ఏ 'వందేమాతరం' 150 వసంతాల వేడుకలు

Aug 14 2026 7:42 PM | Updated on Aug 14 2026 8:02 PM

ITC SRA Celebrating 150 years of Vande Mataram

న్యూఢిల్లీ:  భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన జాతీయ గీతం 'వందేమాతరం' 150 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ, ఐటీసీ లిమిటెడ్ ఘనంగా నివాళులర్పించింది. ఐటీసీ సంగీత్ రీసెర్చ్ అకాడమీ (ఐటీసీ ఎస్ఆర్ఏ) రూపొందించిన ‘దేశ్ ఏక్ రాగ్ 3’ అనే మ్యూజిక్ వీడియో ద్వారా ఈ సంగీత నివాళిని సమర్పించింది. ‘దేశ్’ రాగంలో స్వరపరిచిన ఈ గీతానికి ఐటీసీ ఎస్ఆర్ఏ గురువులు, విద్వాంసులు, సంగీత శిక్షకులు మరియు ఇతర సంగీతకారులు ప్రాణం పోశారు. దేశంలో జాతీయ మేల్కొలుపు, గర్వం మరియు ఐక్యతకు శాశ్వత చిహ్నంగా నిలిచిన ఈ గీతానికి ఐటీసీ అర్పించిన ఘన నివాళికి ఈ వీడియో ప్రతిరూపంగా నిలుస్తుంది.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐటీసీ చైర్మన్, ఐటీసీ ఎస్ఆర్ఏ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సంజీవ్ పూరి ఈ వీడియోను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. మాతృభూమి పట్ల భక్తి, ఐక్యత మరియు ప్రేమను చాటే వందేమాతరం సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గురువులు, సంగీత శిక్షకులు మరియు శిష్యులు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘దేశ్ ఏక్ రాగ్ 3’.. మన గొప్ప దేశానికి, దాని అద్భుతమైన సాంస్కృతిక వారసత్వానికి ఐటీసీ అందిస్తున్న హృదయపూర్వక నివాళి అని ఆయన కొనియాడారు. 

ఐటీసీ ఎస్ఆర్ఏ దాదాపు ఐదు దశాబ్దాలుగా కాపాడుతున్న మన దేశ గాత్ర మరియు వాయిద్య సంప్రదాయాలకు ఈ వీడియో అద్దం పడుతోందని తెలిపారు. కాగా, ఈ సిరీస్‌లోని మూడవ ఎడిషన్ 2027లో రానున్న ఐటీసీ ఎస్ఆర్ఏ స్వర్ణోత్సవ ప్రయాణాన్ని కూడా సూచిస్తుంది.

అకాడమీకి చెందిన విశిష్టమైన 'గురు-శిష్య పరంపర' ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత స్ఫూర్తితో వందేమాతరాన్ని సమర్పించేందుకు గురువులు, విద్వాంసులు ఏకమయ్యారు. పండిట్ అజయ్ చక్రబర్తి, పండిట్ ఉల్హాస్ కశాల్కర్, పండిట్ పార్థ ఛటర్జీ, విదుషీ సుభ్రా గుహ, పండిట్ ఉదయ్ భవాల్కర్, శ్రీ ఓంకార్ దాదర్కర్, శ్రీ అబీర్ హుస్సేన్ మరియు శ్రీ బ్రజేశ్వర్ ముఖర్జీ వంటి ప్రముఖ గురువులు ఇందులో పాల్గొన్నారు. అకాడమీ మొదటి విద్యార్థి మరియు ప్రస్తుత గురువు అయిన పండిట్ అజయ్ చక్రబర్తి నుండి 11 ఏళ్ల విద్యార్థి వైభవ్ ముఖోపాధ్యాయ వరకు, వివిధ తరాలకు చెందిన దాదాపు 70 మంది కళాకారులు తమ గాత్రాన్ని, నైపుణ్యాన్ని అందించారు.

ఐటీసీ ఎస్ఆర్ఏ గురువు శ్రీ అబీర్ హుస్సేన్ ఈ ప్రత్యేక కూర్పును రూపొందించగా, కోల్‌కతాకు చెందిన స్వతంత్ర ఫిల్మ్‌మేకర్ పృథా చక్రబర్తి ఈ వీడియోకు దర్శకత్వం వహించారు. ఈ వీడియోను యూట్యూబ్ లింక్ : https://youtu.be/lPqU_ROp4OQ ద్వారా వీక్షించవచ్చు.

'దేశ్ ఏక్ రాగ్' ప్రయాణం రెండేళ్ల క్రితం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభమైంది. గురు-శిష్య పరంపరను కేంద్రంగా చేసుకుని, శాస్త్రీయ నృత్యాలను కూడా కలుపుతూ 2025లో ‘దేశ్ ఏక్ రాగ్ 2’ విడుదలైంది. ఈ రెండు ఎడిషన్లు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల కొద్దీ వ్యూస్, ప్రశంసలు అందుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement