breaking news
Abhishek Sharma
-
వాళ్ల గురించే నా బాధంతా!: ఇచ్చిపడేసిన సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.కాగా వరల్డ్కప్ టోర్నీలో సూపర్-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లను గెలిచాయి భారత్, సౌతాఫ్రికా.ప్రతికూల అంశాలు ఇవేఅయితే, గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్లతో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది.వాళ్ల గురించే నా బాధంతా!ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్ పాండ్యా టాప్నకు ప్రమోట్ అవుతారు.సమస్య లేదునాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్ప్లాన్ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
అభిషేక్ శర్మ స్థానంలో సంజూకు చాన్స్?
మొట్ట మొదటి టి20 ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ తర్వాతి మ్యాచ్ల్లో ఆడతాడా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగ్ మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు సూపర్- 8 మ్యాచ్ల్లో ఆడే అవకాశం రాకపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శామ్సన్ను తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడుసార్లు డకౌట్ కావడంతో అభిషేక్పై వేటు తప్పదని భావిస్తున్నారు.లీగ్ దశలో నమీబియాతో జరిగిన మ్యాచ్కు అభిషేక్ దూరం కావడంతో సంజూకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు శామ్సన్. అయితే వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న తర్వాత సంజూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వచ్చిన ఒక అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే అభిషేక్ వైఫల్యం సంజూకు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అభిషేక్ కంటే సంజూయే కాస్త బెటరన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో సంజూకు చాన్స్ రావొచ్చని ఆశిస్తున్నారు. కాగా, టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్ బ్యాలర్లే ఉండడం సమస్యేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే అంగీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.అటు బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి మినహా మిగతా స్పిన్నర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్-8 మ్యాచ్ల్లో బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. తర్వాతి మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులోకి వచ్చే అవకాశముంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా క్రీడాభిమానుల్లో నడుస్తోంది. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్గా బ్యాటింగ్ చేయగల సత్తా వాషింగ్టన్ సుందర్కు ఉంది.చదవండి: అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?భారత జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. -
ముగ్గురూ లెఫ్టాండర్లే.. మాకు కష్టమే: టీమిండియా కోచ్
టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లను ఓడించి టాపర్గా తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, నమీబియా, పాకిస్తాన్లపై అలవోకగా విజయం సాధించిన సూర్యకుమార్ సేనకు.. పసికూనలు అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టమ్మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తుందనుకున్న మ్యాచ్లలోనే టీమిండియా తడబడటం గమనార్హం.ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్టాండర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొడుతుండటం సానుకూలాంశం కాగా.. మరో ఎడమ చేతి వాటం బ్యాటర్, వన్డౌన్లో వచ్చే తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో సూపర్-8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కోంటోందని తెలిపాడు.ప్రధానంగా రెండు సమస్యలుటాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే.. ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు మరో సమస్య అని డష్కాటే పేర్కొన్నాడు. ‘‘టాప్-3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజూ బెంచ్ మీద ఉన్నాడు. కాబట్టి ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు.అయితే, మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్ స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్-8లో వెస్టిండీస్, సౌతాఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే, మాకు అత్యుత్తమ బ్యాటర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్పాకిస్తాన్ కూడా గత మ్యాచ్లో 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్లు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్లపై ఇలాంటివి వర్కౌట్ అవుతాయి.అయితే, మా వాళ్లు అలాంటి చోట సమస్యను అధిగమించారు. కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు.కాగా ఆఫ్ స్పిన్నర్లు బంతిని టర్న్ చేసే క్రమంలో మణికట్టు కదలికల (కుడి నుంచి ఎడమకు)పై ఆధారపడితే.. ఫింగర్ స్పిన్నర్లు చూపుడు లేదంటే మధ్యవేలును ఉపయోగించి బంతి దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిన్న తేడా తప్ప రెండు దాదాపుగా ఒకే విధమైన బౌలింగ్ శైలి అని చెప్పవచ్చు. కాగా సూపర్-8లో భారత్ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్లతో తలపడుతుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
T20 WC: ‘డకౌట్ల’ అభిషేక్ శర్మ.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయి.. లీగ్ దశను అవమానకర రీతిలో ముగించాడు.గ్రూప్-ఎలో భాగంగా అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. పాకిస్తాన్తో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేశాడు.ఎనిమిది బంతులు మాత్రమేకెరీర్లో తొలిసారి వరల్డ్కప్ టోర్నీ ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఇప్పటికి మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుని మొత్తంగా ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ ఇలా లీగ్ దశలో.. అది కూడా అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా సింగిల్ కూడా తీయలేకపోయాడు. తద్వారా చెత్త రికార్డుతో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.తెలివిగా ఆడుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యువ బ్యాటర్ ముందుగా ఒత్తిడి నుంచి బయటపడాలని సూచించాడు. తనకున్న ట్యాగ్లను మరచిపోయి స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితం రాబట్టగలడని అభిప్రాయపడ్డాడు. తొందరపడకుండా తెలివిగా షాట్లు ఆడాలని సూచించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అంచనాల భారం అతడిపై ఒత్తిడిని పెంచుతోంది అనుకుంటున్నా!... అతడు మంచి బ్యాటర్. ఆట మొదలుపెట్టాడంటే తనదైన శైలిలో దూసుకుపోగలడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ముందుగా సింగిల్ తీయాలిసిక్స్ హిట్టర్ అని పేరున్న అభిషేక్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్ అతడు. అదే అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తుందేమో!.. ఏదేమైనా అభిషేక్ కాస్త ఓపికగా ఉండాలి. మొదటి బంతి నుంచే బౌండరీ, సిక్సర్ బాదాలని అనుకోవడం సరికాదు.ఆ ఫీలింగ్ నుంచి బయటపడుముందుగా సింగిల్ తీయాలి. స్మార్ట్గా ఆడాలి. ముఖ్యంగా తన కాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో అతడు అవుటైన విధానం అత్యంత సాధారణమైనది. అతడి షాట్ సెలక్షన్ను బట్టి ఎవరైనా ముందే పసిగట్టగలరు. ‘200కు పైగా స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేసే ఆటగాడిగానే నన్ను చూస్తారు’ అన్న భావన నుంచి బయటకు రావాలి.మెదడు నుంచి అలాంటి ఆలోచనను తీసివేయాలి. నీ సహజశైలిలో ఆడు.. అప్పుడు తప్పక భారీ స్కోరు సాధించగలవు’’ అని సునిల్ గావస్కర్ అభిషేక్ శర్మకు కీలక సూచనలు చేశాడు. కాగా గ్రూప్-ఎలో భాగంగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్లను ఓడించిన టీమిండియా.. ఆఖరిగా నెదర్లాండ్స్పై గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
T20 WC 2026: కొనసాగుతున్న అభిషేక్ శర్మ చెత్త ప్రదర్శన
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్ల్లో (యూఎస్ఏ, పాకిస్తాన్) డకౌట్లైన అభిషేక్.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ తన తొలి టీ20 ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో ఇది ఐదో డకౌట్ కావడం మరింత శోచనీయం.ఈ మ్యాచ్లో అభిషేక్ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయింది. అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీ కాకుండా సిరాజ్ వేసుకునే 73వ నంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.తాజా డకౌట్ తర్వాత అభిషేక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్గా సంజూ శాంసన్ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నెదర్లాండ్స్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ కష్టాల్లో ఉంది. పవర్ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 51-2గా ఉంది. తిలక్ వర్మ (26), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్ ఆర్మన్ దత్కే దక్కాయి. అభిషేక్, ఇషాన్లను దత్ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. -
అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్గా పేరొందిన అభిషేక్.. వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవనే లేదు.అగ్రస్థానంలో అభిషేక్పసికూన అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. తాజాగా పాకిస్తాన్తో ఆదివారం నాటి మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ఇలా విఫలం కావడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.అయితే, టీ20 వరల్డ్కప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లడంతో అభిషేక్ వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. లేదంటే అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తేవి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి అభిషేక్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రవిశాస్త్రి సూచనలు‘‘అతడి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. అందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే. అయితే, ఇందుకోసం ముందుగా అతడు తన పొరపాట్లు సరిచేసుకోవాలి.క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకోవాలి. వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే.. డాట్ బాల్స్ను బౌండరీలు, సిక్సర్లుగా మలచడం అతడికి కొత్తేమీ కాదు. ఇందుకు అతడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.ఏదేమైనా క్రీజులో కుదురుకున్న తర్వాతే పని మొదలుపెట్టాలి’’ అని రవిశాస్త్రి అభిషేక్ శర్మకు సూచనలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. పాక్పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సూపర్-8లో అడుగుపెట్టింది.అంతకు ముందు తొలుత అమెరికా.. అనంతరం నమీబియా జట్లపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు. పాక్తో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చి డకౌట్ అయి నిరాశపరిచాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. కాగా అభిషేక్ శర్మ కెరీర్లో ఇదే తొలి వరల్డ్కప్ అన్న సంగతి తెలిసిందే.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్ -
T20 WC 2026: అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్న అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్తో ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజీ మ్యాచ్లో డకౌటైన అతను.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మొదటి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు ఇమ్రుల్ కయేస్ ఈ అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్ తమ వరల్డ్కప్ కెరీర్లలో ఒక్క పరుగు కూడా చేయకపోవడం మరో విశేషం.ప్రస్తుత ప్రపంచకప్లో యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే) అభిషేక్.. ఇవాళ పాక్తో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్కు గత ఆరు ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో డకౌట్ కావడం మరో విశేషం.కోహ్లి రికార్డు సమంపాక్పై డకౌట్ కావడంతో అభిషేక్ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ తరఫున రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో రెండు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా (3) టాప్ ప్లేస్లో ఉన్నాడు.సంజూతో సమానంగా..!తాజా డకౌట్తో అభిషేక్ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20ల్లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా సంజూ శాంసన్ సరసన చేరాడు. అభిషేక్, సంజూ తమ టీ20 కెరీర్లలో తలో ఐదు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (10) అగ్రస్థానంలో ఉన్నాడు.భారీ స్కోర్ దిశగా టీమిండియాపాక్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ బౌలర్లను ఊచకోత కోసి ఔటయ్యాడు. అంతకుముందు అభిషేక్ డకౌటయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్ (21), తిలక్ వర్మ (25) క్రీజ్లో ఉన్నారు. -
IND vs PAK: అరెరే అభిషేక్.. ఇలా చేశావేంటి?
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన అభిషేక్.. ఇప్పుడు కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్లో చెత్త షాట్ ఆడి అభిషేక్ ఔటయ్యాడు.అమెరికాతో మ్యాచ్ తర్వాత అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ గురయ్యాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే పూర్తి ఫిట్నెస్ పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. దాయాది జట్టుకు అభిషేక్ చుక్కలు చూపిస్తాడు అని భారత అభిమానులు భావించారు.కానీ ఈ పంజాబీ బ్యాటర్ తన చెత్త బ్యాటింగ్తో అందరిని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్కు ముందు అభిషేక్ను ఉద్దేశించి పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, మ్యాచ్లో ఆడాలని కోరుకుంటున్నట్లు సల్మాన్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టే తొలి ఓవర్ వేసిన సల్మాన్.. అభిషేక్పై పైచేయి సాధించాడు. దీంతో అభిషేక్ను ఔట్ చేసిన అనంతరం సల్మాన్ సంబరాల్లో మునిగితేలిపోయాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్ -
పాక్ కోరిక నెరవేరుస్తాం: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. దాయాదులు భారత్- పాకిస్తాన్ కొలంబో వేదికగా ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఆర్.ప్రేమదాస స్టేడియం వేదిక కాగా.. వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శనివారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్ తొలుత అమెరికాతో తలపడిన సంగతి తెలిసిందే.అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక నమీబియాతో రెండో మ్యాచ్కు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అందుబాటులో లేకుండా పోయాడు. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. కోలుకున్నప్పటికీ యాజమాన్యం అతడికి విశ్రాంతినిచ్చింది.ఇక నమీబియాను చిత్తుగా ఓడించి సూపర్-8కు చేరువైన భారత్.. దాయాదిపై ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్తో ఆడే భారత తుదిజట్టు ఎలా ఉండబోతున్న చర్చ జరుగుతోంది.అతడు ఆడాలని కోరుకుంటున్నాంఇదిలా ఉంటే.. భారత్తో మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) మాట్లాడుతూ.. “అతడు మంచి ప్లేయర్. అభిషేక్ రేపు ఆడతాడనే అనుకుంటున్నాం. మేము అత్యుత్తమ జట్టుతో పోటీ పడాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అతడు కోలుకుని తిరిగి వస్తే బాగుంటుంది’’ అని అభిషేక్ శర్మను ఉద్దేశించి పేర్కొన్నాడు.పాక్ కోరిక నెరవేరుస్తాంఇదే విషయాన్ని సూర్య వద్ద విలేకరులు ప్రస్తావించగా.. “ఒకవేళ పాకిస్తాన్ మేము అభిషేక్ శర్మను ఆడించాలని కోరుకుంటే.. వారి కోరిక నెరవేరుతుంది. అతడు రేపు ఆడతాడు’’ అని సమాధానమిచ్చాడు. తద్వారా సంజూ శాంసన్పై వేటు వేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు సూర్య.అతడికీ చోటుఇక కొలంబో స్పిన్కు అనుకూలించే పిచ్ కాబట్టి లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తుదిజట్టులో ఉంటాడని సూర్య సంకేతాలు ఇచ్చాడు. “అతడి అవసరం ఉందనుకుంటే కచ్చితంగా ఆడిస్తాము’’ అని కుల్దీప్ను ఉద్దేశించి పేర్కొన్నాడు. కాగా అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉంది.కాగా గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్లతో పాటు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. అయితే, ఇప్పటికే చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అమెరికా సైతం సూపర్-8 రేసులో నిలిచే ప్రయత్నంలో ఉంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లు (అంచనా): భారత్సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాGuess who's back... back again! 💪😈#TeamIndia's Mr.Maximum, #AbhishekSharma, was spotted launching sixes during the training session in Colombo! Watch him next 👉 ICC Men's #T20WorldCup 👉 #INDvPAK | SUN, 15th FEB, 6 PM pic.twitter.com/CEkut5QxpP— Star Sports (@StarSportsIndia) February 14, 2026పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్. చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజూ శాంసన్పై వేటు పడనుంది.గత మ్యాచ్లో సంజూకు అవకాశం లభించినప్పటికి సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశముండడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నమీబియాతో మ్యాచ్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్దీప్ సింగ్ లేదా రింకూ సింగ్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టే అవకాశముంది. పాక్పై కుల్దీప్ యాదవ్కు అద్భుతమైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబట్టి అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్/అభిషేక్ శర్మ,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
కొలంబోకు చేరుకున్న అభిషేక్ తల్లిదండ్రులు.. పాక్తో మ్యాచ్కు డౌటే
టీ20 ప్రపంచకప్-2026లో కొలంబో వేదికగా ఆదివారం పాకిస్తాన్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు.అయితే ఆస్పత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించికపోయినట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భారత జట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంసన్ ఓపెనర్గా కొనసాగనున్నాడు. -
'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు
టీ20 ప్రపంచకప్-2026లో అసలు సిసలైన సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక 'స్లాగర్' (బంతిని బలంగా బాదడం) అని, బ్యాటింగ్ టెక్నిక్ లేదని అతడు విమర్శించాడు."అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అతడు ఒక స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతీ బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి ఆట తీరు ఉన్నవాళ్లు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అతడు సక్సెస్ అవుతారు. విఫలమయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ దగ్గర సరైన టెక్నిక్ లేదు.ప్రతీ 8 ఇన్నింగ్స్లలో ఒకసారి మాత్రమే అతడు రాణిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్లలో తక్కువే పరుగులకే అవుట్ అవుతున్నాడు. అతడు ఒక చోట నిలబడి అన్ని బంతులను ఒకే ఏరియాలో వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేస్తే అతను ఇబ్బంది పడతాడు. అదేవిధంగా బంతి కొంచెం స్వింగ్ అయినా అతను ఆడలేడు.అయితే అభిషేక్ను నేనేమి తక్కువ చేసి మాట్లడడం లేదు. అతడి ఆటలో చాలా రిస్క్ ఉందని చెబుతున్నా. తనదైన ప్రత్యర్ధి జట్టును ముప్పు తిప్పలు పెట్టగలడు అని ఓ టీవీ ఛానల్ డిబేట్లో అమీర్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మను 'స్లాగర్' అని పిలవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ లాంటి ఒక్క ప్లేయర్ అయినా మీ జట్టులో ఉన్నారా? అంటూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. కాగా కడుపు ఇన్ఫెక్షన్ వల్ల నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యాడు. పాక్తో మ్యాచ్కు ఈ పంజాబీ బ్యాటర్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. -
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత అభిషేక్కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే నమీబియాతో మ్యాచ్కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధ్రువీకరించాడు.నమీబియాతో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని నాతో చెప్పాడని వరుణ్ అన్నాడు.2 కిలోలు తగ్గిన అభిషేక్అభిషేక్ శర్మ కూడా తన ఫిట్నెస్పై అప్డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒకవేళ పాక్తో మ్యాచ్కు అభిషేక్ దూరమైతే, భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. -
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరుగబోయే మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్ పాకిస్తాన్తో మ్యాచ్కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్లో కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్న సంజూఅభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం గాయపడ్డాడు. నమీబియాతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కాలి బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్లో యార్కర్ను ఎదుర్కొనేందుకు ఇషాన్ సిద్ధపడగా.. బంతి బలంగా అతడి బొటనవేలికి తగింది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.గాయం గనుక తిరగబెడితేప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే, గాయం గనుక తిరగబెడితే ఇషాన్ మ్యాచ్కు అందుబాటులో ఉండటం కష్టమే. కాగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.అభిషేక్ డిశ్చార్జ్ అయినా..ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అభిషేక్ బుధవారం డిశ్చార్జ్ అయినట్లు మరో బ్యాటర్ తిలక్ వర్మ వెల్లడించాడు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. అయితే, నమీబియాతో మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్న అంశం మీద మాత్రం తిలక్ స్పష్టతనివ్వలేదు.ఇంతలో ఇషాన్ కిషన్కు కూడా స్వల్ప గాయం కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కాసేపటికే పరిస్థితి బాగుపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే రాణా అవుట్కాగా యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల అమెరికాతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఇక తీవ్రమైన జ్వరం కారణంగా అమెరికాతో మ్యాచ్ ఆడలేకపోయిన బుమ్రా సైతం తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ కోలుకోనట్లయితే ఇషాన్తో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్-‘ఎ’లో భాగంగా అమెరికాపై గెలిచిన టీమిండియా... తదుపరి గురువారం నమీబియాతో తలపడనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: IND vs NAM: మరో కూనతో పోరు -
టీమిండియాకు గుడ్ న్యూస్
రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్ సహ టీమిండియా సభ్యుడు తిలక్ వర్మ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించాడు. అయితే అభిషేక్ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్ క్లారిటీ ఇవ్వలేదు.అభిషేక్ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్ నమీబియా మ్యాచ్కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్మెంట్ సంజూ శాంసన్ను రేపటి మ్యాచ్కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి ఇవాళ కూడా నెట్స్లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్ సమయానికి అభిషేక్ ఫిట్ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్ తప్పకపోవచ్చు.ఒకవేళ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్లో ఇషాన్, సంజూ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్లో రాణిస్తే.. పాక్తో మ్యాచ్కు ముందు అభిషేక్తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఇటీవలికాలంలో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు. ఈ ప్రపంచకప్లో అభిషేక్పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అభిషేక్ ప్రతి మ్యాచ్లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్లో సత్తా చాటినా భారత్ మరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. భారత్ కు బిగ్ షాక్
-
T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఓ ఆటగాడు జట్టులోకి వస్తే మరో ప్లేయర్ దూరమవుతున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా వరల్డ్కప్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నమీబియాతో మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.అదే విధంగా.. తీవ్రమైన జ్వరం కారణంగా టీ20 ప్రపంచకప్-2026 తొలి మ్యాచ్కు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కోలుకున్నాడు. అమెరికాతో మ్యాచ్కు దూరంగా ఉన్న అతడు గురువారం నాటి మ్యాచ్ కోసం ఇప్పటికే సన్నద్ధమయ్యాడు.ఆస్పత్రిపాలైన అభిషేక్ శర్మఇలాంటి శుభ తరుణంలో టీమిండియాకు మరో చేదువార్త. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆస్పత్రిపాలైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొంది.ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు అభిషేక్ శర్మ దూరమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కటే కూడా ధ్రువీకరించాడు. ‘‘అభి ఇప్పటికీ ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్నాడు. పూర్తిగా కోలుకుని మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నాం’’ అని తెలిపాడు.అందుబాటులో ఉండకపోవచ్చుఅయితే, బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. సమస్య ఏమిటో కనుక్కునేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. అతడు డిశ్చార్జ్ అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నమీబియాతో మ్యాచ్కు మాత్రం అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా అభిషేక్ శర్మ గనుక దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తిరిగి ఓపెనర్గా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విఫలం కావడంతో అతడి స్థానంలో అభిషేక్కు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చాడు. సంజూకు ఛాన్స్ఇక అమెరికాతో తొలి మ్యాచ్లో గెలిచి బోణీ కొట్టిన టీమిండియా.. గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో తలపడుతుంది. కాగా అమెరికాతో మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిని విషయం తెలిసిందే. అయితే, ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఈ విధ్వంసకర ఓపెనర్ ఆట తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.చదవండి: నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత పోరాటం -
T20 WC 2026: సంజూ శాంసన్కు జాక్పాట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సంజూ శాంసన్ జాక్పాట్ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచకప్ మ్యాచ్లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతను.. అనూహ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాలో జరుగబోయే మ్యాచ్లో సంజూ ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రెగ్యులర్ ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజూకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్ సమయానికి అభిషేక్ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే పరోక్షంగా వెల్లడించాడు. ఇవాళ (ఫిబ్రవరి 10) అతను మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. అభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్ గైర్హాజరీలో సంజూ శాంసన్కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ సంజూ తుది జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు.డష్కటే.. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని వెల్లడించాడు.వాషింగ్టన్ సుందర్ కూడా రిబ్ ఫ్రాక్చర్ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డష్కటే స్పష్టతనివ్వలేదు.ఇదే సందర్భంగా డష్కటే భారత్–పాకిస్తాన్ మ్యాచ్పై కూడా స్పందించాడు. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్ తమ మనసు మార్చుకొని భారత్తో ఆడేందుకు సిద్దమవడం మంచి పరిణామంగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు.కాగా, బుమ్రా, సుందర్ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ స్థానంలో బుమ్రా వచ్చినా, సుందర్ కోసం ఎవరిని తప్పిస్తారన్నది చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే, అక్షర్ పటేల్ స్థానంలో సుందర్ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్ అందుబాటులోకి రాక సంజూ శాంసన్కు అవకాశం వస్తే.. నమీబియాతో మ్యాచ్కు భారత తుది జట్టు ఇలా ఉండవచ్చు.నమీబియాతో మ్యాచ్కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
టీమిండియా స్టార్ ఆటగాడికి అస్వస్థత
టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న టీమిండియాను జ్వరాల పీడ వేధిస్తుంది. తొలుత బుమ్రా.. తాజాగా అభిషేక్ శర్మ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. జ్వరం కారణంగా బుమ్రా యూఎస్ఏతో మ్యాచ్కు దూరం కాగా.. అభిషేక్ నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యేలా ఉన్నాడు. అభిషేక్కు జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నమీబియాతో మ్యాచ్ ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. ఆ సమయానికి అభిషేక్ కోలుకుంటాడో లేదో చూడాలి.కాగా, నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ జ్వరంతోనే బాధపడుతూనే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. స్కై మినహా భారత ఇన్నింగ్స్లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
గంభీర్ బాటలో అభిషేక్ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఈ పంజాబీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.గత కొన్నాళ్లుగా మంచి ఫామ్లో ఉన్న అభిషేక్.. కెరీర్లో తొలి ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్కప్లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అదరగొడతాడని అంతా భావించారు.అయితే, ఊహించని రీతిలో అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అమెరికా పేసర్ అలీ ఖాన్ బౌలింగ్లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.ఇక అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్కావడంతో.. “గంభీర్ బాటలో నడిచిన అభిషేక్ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. పవర్ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.టీ20 వరల్డ్కప్ అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అయిన భారత ఆటగాళ్లు వీరే👉గౌతం గంభీర్👉ఆశిష్ నెహ్రా (గోల్డెన్ డక్)👉శార్దూల్ ఠాకూర్👉దీపక్ హుడా👉అభిషేక్ శర్మ (గోల్డెన్ డక్). -
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్ఏతో భారత్ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మిలింద్ కుమార్ (34) స్టంపౌట్. నాలుగో వికెట్ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్ 16, సంజయ్ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్ బౌలింగ్లో సాయితేజ ముక్కామల (2) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చాడు. మిలింద్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్దీప్ బౌలింగ్లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (0) శివం దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ తీసిన సిరాజ్1.4: అనూహ్యంగా వరల్డ్కప్ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్ టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే వికెట్ పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్లో తిలక్కు క్యాచ్ ఇచ్చి అమెరికా ఓపెనర్ ఆండ్రీ గౌస్ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్ డౌన్19.6: వరుణ్ చక్రవర్తి (0) రనౌట్.. తొమ్మిదో వికెట్ డౌన్అర్ష్దీప్ అవుట్18.6: షాల్విక్ బౌలింగ్లో... ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన అర్ష్దీప్ సింగ్ (4) సూర్యకుమార్ హాఫ్ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్ఏడో వికెట్ కోల్పోయిన భారత్16.4: హర్మీత్ బౌలింగ్లో మొహ్సిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). క్రీజులోకి అర్ష్దీప్ సింగ్. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్, సూర్య ధనాధన్15: నేత్రావల్కర్ బౌలింగ్లో అక్షర్ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్ కోల్పోయిన భారత్12.4: హర్మీత్ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్ పటేల్. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్ కోల్పోయిన భారత్11.4: మొహ్సిన్ బౌలింగ్లో మిలింద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ అవుట్ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్5.6: వాన్ షాల్విక్ బౌలింగ్లో నేత్రావల్కర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన శివం దూబే. పవర్ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్ వర్మ అవుట్5.5: మూడో వికెట్గా వెనుదిరిగిన తిలక్ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్). వాన్ షాల్విక్ బౌలింగ్ మోనాంక్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన తిలక్. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్ డౌన్5.2: వాన్ షాల్విక్ బౌలింగ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, రెండు సిక్స్లు). క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. తిలక్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్ 13 బంతుల్లో 23, ఇషాన్ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.2: అలీ ఖాన్ బౌలింగ్లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్ బౌలింగ్... ఇషాన్ 7, అభిషేక్ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కగా.. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్కు లక్కీ ఛాన్స్అదే విధంగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక పేస్ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్ రాణా గాయపడటంతో సిరాజ్కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2026: భారత్ వర్సెస్ యూఎస్ఏ తుదిజట్లుభారత్ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్ఏఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ -
T20 WC: ఓపెనర్గా వచ్చి.. దంచికొట్టిన ఇషాన్ కిషన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్తో బరిలో దిగింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చాడు.6, 6, 4, 6విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్.. ధనాధన్ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్ అతడి బౌలింగ్ను చితక్కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.20 బంతుల్లోనేఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. సిక్సర్తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో ఏడు సిక్స్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.కాగా టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా నవీ ముంబైలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53) రిటైర్డ్ అవుట్గా నిష్క్రమించారు. టీ20 వరల్డ్కప్-2026 జట్లు భారత్అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.చదవండి: WC 2026: వరల్డ్కప్ సెమీస్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసంT20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్కు నో ఛాన్స్!When you’re in form, everything goes your way!😮💨ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/51Mr18qE1g— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!
టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్గా పాతుకుపోయాడు.విధ్వంసకర ఇన్నింగ్స్కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.మొదటి ఐపీఎల్ కోచ్ను నేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్కు మొదటి ఐపీఎల్ కోచ్ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్స్టార్గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.కాగా అభిషేక్ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్ ఢిల్లీ కోచ్గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్లోనే అభిషేక్ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్.. అభిషేక్ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్ చేసిందని వెల్లడించాడు.భవిష్య సూపర్స్టార్.. వద్దని మొత్తుకున్నా వినలేదు"అతడికి మొదటి ఐపీఎల్ కోచ్ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్ మీదుగా స్ట్రెయిట్గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్స్టార్ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.ధావన్ కోసం ట్రేడ్ చేసిన ఢిల్లీకాగా శిఖర్ ధావన్ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్ శర్మను సన్రైజర్స్కు ట్రేడ్ చేసింది. ఇక సన్రైజర్స్కు మారిన తర్వాత అభిషేక్ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్లో 162కు పైగా స్ట్రైక్రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్లు ఆడి 1297 రన్స్ రాబట్టిన అభిషేక్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాక్పై టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి సోషల్మీడియా వేదికగా పాక్ జట్టును ఏకి పారేస్తున్నారు. పాక్ భారత్ చేతిలో పరాభవాన్ని ముందే ఊహించి జారుకుందని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ శర్మ భయంతో పారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడపోవడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. భారత్తోనే కాదు, టోర్నీ మొత్తానే బాయ్కాట్ చేసుంటే పీడా పోయేదని చర్చించుకుంటున్నారు. భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకున్నందుకు ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ టోర్నీలో టీమిండియా తప్పక ఆడింది కానీ, చాలా మంది భారతీయులకు పాక్తో తలపడటం అస్సలు ఇష్టం లేదు. మెజారిటీ శాతం భారతీయుల అభిమతానికి అనుగుణంగానే టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఆసియా కప్ గెలిచిన తర్వాత పీసీబీ అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్కు చీఫ్ కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించలేదు. భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడం నిరాకరించినందుక నఖ్వీ ట్రోఫీ ఎత్తుకెళ్లిపోయిన విషయం విధితమే. ఇప్పటికీ అతను భారత్కు ఆ ట్రోఫీని అప్పగించలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే భారత్-బంగ్లాదేశ్ అంతర్గత విషయంలో పాక్ తలదూర్చింది. బంగ్లాదేశ్కు వత్తాసుగా ప్రపంచకప్ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ చాలా సీరియస్గా పరిగణించే అవకాశం ఉంది. క్రికెట్కు సంబంధించి పాక్ను అష్టదిగ్బంధనం చేయవచ్చు. ఆర్దిక, పాలనాపరమైన చాలా శిక్షలను పీసీబీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ జట్టును ప్రపంచకప్ నుంచి బహిష్కరించినా, ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒకవేళ పాక్ ప్రపంచకప్లో కొనసాగితే భారత్తో మ్యాచ్ రద్దు చేసుకున్నందుకు రెండు పాయింట్లు కోల్పోతుంది. భారత్కు మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ పాక్ అదృష్టం బాగుండి, తదుపరి దశకు చేరినా, అంతకంటే ముందుకు వెళ్లే సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ భారత్తో మ్యాచ్ ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా ఉండదని భారతీయ క్రికెట్ అభిమానులు అంటున్నారు. -
T20 WC: అభిషేక్ శర్మ కాదు!.. ఈసారి అతడే టాప్!
పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఫిబ్రవరి 7న తెరలేవనుంది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి బరిలోకి దిగుతున్న.. అద్భుత ఫామ్తో ఈసారీ హాట్ ఫేవరెట్గా మారింది.ఇక ఇప్పటికే మెగా టోర్నీకి భారత్ తమ జట్టును ప్రకటించింది. అదే జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మూడు విభాగాల్లోనూ ఆటను మెరుగుపరచుకుంటూ ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలుగా మారింది సూర్య సేన.అభిషేక్ శర్మ కాదు!.. ఈ నేపథ్యంలో మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు ఈసారి టీమిండియా సెమీస్ చేరడం ఖాయమని.. టైటిల్ పోరుకు కూడా అర్హత సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా.. టాప్ రన్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ అవార్డుల విజేతల గురించి తన అంచనాలు తెలియజేశాడు.ఈసారీ అతడే టాప్!గత ఎడిషన్ మాదిరే ఈసారి కూడా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలుస్తాడని చహల్ పేర్కొన్నాడు. ఇక భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను టాప్ రన్ స్కోరర్గా అంచనా వేసిన యుజీ.. ఈసారి అత్యధిక సిక్సర్లు బాదేది అతడే అని పేర్కొన్నాడు.భారత్- పాక్ ముఖాముఖి పోటీఅదే విధంగా.. టాప్ వికెట్ టేకర్గా బుమ్రాకు పట్టం కట్టాడు చహల్. ఇక ఈ మెగా టోర్నీలో తాను భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న చహల్.. జట్ల అత్యధిక స్కోరును 240 పరుగులుగా అంచనా వేశాడు. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ ముఖాముఖి తలపడతాయి.ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల చహల్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమితం అయ్యాడు. మరోవైపు.. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన బుమ్రా.. ఎనిమిది మ్యాచ్లలో కలిపి పదిహేను వికెట్లు కూల్చాడు. టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
T20 WC: వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో శతకం సాధించిన భారత ఏకైక క్రికెటర్గా సురేశ్ రైనా కొనసాగుతున్నాడు. సుమారుగా పదహారేళ్ల క్రితం 2010 నాటి వరల్డ్కప్ టోర్నీలో సౌతాఫ్రికా మీద రైనా శతక్కొట్టాడు. వెస్టిండీస్ వేదికగా లీగ్ దశలో సఫారీలతో మ్యాచ్లో 59 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 101 పరుగులు చేసి నిష్క్రమించాడు.రైనా ఆడిన నాటి శతక ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత భారత్ తరఫున ఇంత వరకు ఒక్క ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్లో సెంచరీ చేయలేదు. తాజా ఎడిషన్ సందర్భంగా తన రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఆటగాడి పేరును సురేశ్ రైనా (Suresh Raina) తాజాగా వెల్లడించాడు.వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడేటీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson)ఈసారి వరల్డ్కప్ టోర్నీలో సెంచరీ చేస్తాడని రైనా అంచనా వేశాడు. ‘‘సంజూ ఓపెనింగ్ బ్యాటర్. సెంచరీ చేయగల సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి.సౌతాఫ్రికా మీద రెండుసార్లు సంజూ శతక్కొట్టాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూ శాంసన్కే’’ అని రైనా వెల్లడించాడు. కాగా సంజూ గత కొన్నాళ్లుగా ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో తాజా టీ20 సిరీస్లో అతడు చేసిన స్కోర్లు 10. 6. 0, 24. ఇలాంటి తరుణంలో రైనా సంజూకు మద్దతుగా నిలవడం విశేషం.సంజూ క్లాస్ బ్యాటర్“ఫామ్ తాత్కాలికం. సంజూ క్లాస్ బ్యాటర్. టీమిండియా తరఫున, ఓవరాల్గా టీ20 క్రికెట్లో అతడు భారీ ఎత్తున పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలాకాలంగా ఫామ్లేమితో ఇబ్బందిపడ్డాడు.అయినప్పటికీ హెడ్కోచ్ అతడికి అండగా ఉన్నాడు. సంజూ విషయంలోనూ ఇదే జరగాలి. అతడికి ఒక్క ఛాన్స్ దొరికితే తిరిగి విజృంభించడం ఖాయం’’ అని రైనా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు అండగా నిలిచాడు.చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక -
టీమిండియా ఆటగాళ్ల దూకుడు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా బ్యాటర్లు భారీ ఎత్తున లాభపడ్డారు. న్యూజిలాండ్ సిరీస్లో తొలి మూడు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్-10లోకి దూసుకొచ్చాడు. స్కై 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు. కొంతకాలంగా అగ్రపీఠంపై తీష్ట వేసిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకొని, ఎవరికీ అందని ఎత్తుకు ఎదుగుతున్నాడు. అభిషేక్ ప్రస్తుతం 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 2, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 53, 59, 68 స్థానాలకు ఎగబాకారు. గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్కు దూరంగా ఉన్నా తిలక్ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.మిగతా దేశాలకు చెందిన బ్యాటర్లలో మార్క్రమ్ (9 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి), బ్రాండన్ కింగ్ (15 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి), గ్లెన్ ఫిలిప్స్ (18 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి), సెదిఖుల్లా అటల్ (13 స్థానాలు ఎగబాకి 65), ర్యాన్ రికెల్టన్ (12 స్థానాలు ఎగబాకి 82), దర్విష్ రసూల్ (29 స్థానాలు ఎగబాకి 88), హెట్మైర్ (27 స్థానాలు ఎగబాకి 93) భారీగా లబ్ది పొందారు.బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13కు, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్దిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరారు. వరుణ్ చక్రవర్తి మినహా టాప్-10లో మరో భారత బౌలర్ లేడు. రషీద్ ఖాన్, హసరంగ 2,3 స్థానాలు నిలబెట్టుకున్నారు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 16, కుల్దీప్ యాదవ్ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒకటి, 6 స్థానాలు మెరుగుపర్చుకొని 3, 12 స్థానాలకు ఎగబాకారు. టాప్-2గా సికందర్ రజా, సైమ్ అయూబ్ కొనసాగుతున్నారు. -
వరల్డ్కప్లో అభిషేక్ శర్మ జోడీగా ఇషాన్ కిషన్?!
సంజూ శాంసన్.. గత కొన్నేళ్లుగా భారత క్రీడా వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశంగా ఉంది. ప్రతిభ ఉన్నా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు తగినన్ని అవకాశాలు రావడం లేదని అతడి అభిమానులతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్ల వాదన. అయితే, టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనేది విశ్లేషకుల మాట.పేలవ ప్రదర్శనఆటలో నిలకడలేమి కారణంగానే సంజూను యాజమాన్యం నమ్మదగిన ఆటగాడిగా చూడటం లేదని ఇంకొంతమంది అభిప్రాయం. తాజాగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనలే ఇందుకు కారణం. నిజానికి గతేడాది కాలంగా భారత టీ20 జట్టులో ఓపెనర్గా ఈ కేరళ ఆటగాడు కొనసాగుతున్నాడు.సెంచరీలతో సత్తా చాటి విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు జోడీగా సంజూ విదేశీ గడ్డలపై సెంచరీలతో సత్తా చాటాడు. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి ముందు వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ తిరిగిరావడంతో సంజూపై వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్లో తనకంటూ ఓ స్థానం లేకుండా పోయింది.వికెట్ కీపర్ కోటాలోనూ సంజూకు జితేశ్ శర్మ పోటీగా రావడంతో.. తుదిజట్టులో అతడు స్థానం కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో టీ20 ఓపెనర్గా గిల్ విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది. ఫలితంగా స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ సందర్భంగా తిరిగి ఓపెనర్గా అతడికి అవకాశం దక్కింది. అంతేకాదు.. ప్రపంచకప్ టోర్నీ-2026కు కూడా ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ ఎంపికయ్యాడు.10, 6, 0.. పొంచి ఉన్న ఇషాన్ ముప్పుఅయితే, కివీస్తో సిరీస్ సందర్భంగా సంజూ తొలి మూడు టీ20లలోనూ తేలిపోయాడు. మూడు మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు 10, 6, 0. మరోవైపు.. దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు.వరల్డ్కప్లో అభిషేక్ జోడీగా ఇషాన్ కిషన్?!తిలక్ వర్మ గాయపడిన కారణంగా ఇషాన్ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజానికి అతడు కూడా ఓపెనింగ్ బ్యాటర్. సంజూ వైఫల్యం కారణంగా ఈ జార్ఖండ్ డైనమైట్ ఓపెనర్గా ప్రమోట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడని బీసీసీఐ ప్రకటించింది.నిజానికి తిలక్ గాయం వల్ల కివీస్తో మిగిలిన రెండు టీ20లకు కూడా దూరం కావడంతోనే సంజూ వేటు నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి న్యూజిలాండ్తో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్లు అతడికి అత్యంత కీలకంగా మారాయి.ఈ సందర్భంగా ఫామ్లోకి వస్తేనే వరల్డ్కప్లో సంజూ ఓపెనర్గా కొనసాగగలడు. లేదంటే.. అతడి స్థానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ భర్తీ చేయడం ఖాయం. ప్రస్తుతానికి టీమిండియా యాజమాన్యం సంజూకు మద్దతుగా నిలవడం అతడికి ఊరటనిచ్చే అంశం.అండగా మేనేజ్మెంట్సంజూ వైఫల్యాలలపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ.. ‘‘సంజూ తిరిగి ఫామ్లోకి రావడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్ అవసరం. ఫలితంగా అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయంలో ఆటగాళ్లు పుంజుకునేలా చేసి.. ప్రపంచకప్ టోర్నీకి వారిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే మా మొదటి ప్రాధాన్యం.సంజూ శ్రద్ధగా శిక్షణలో పాల్గొంటున్నాడు. నెట్స్లో ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. మోర్కెల్ చెప్పినట్లు సంజూ తిరిగి పుంజుకుంటే సరి.. లేదంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయడం లాంఛనమే అవుతుంది.చదవండి: ICC: పాకిస్తాన్ స్థానంలో ఉగాండా!.. ట్వీట్ వైరల్ -
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
-
అభిషేక్ శర్మకు యువరాజ్ సవాల్!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో గువాహటిలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై ఓ రేంజ్లో విరుచుకుపడి పరుగుల సునామీ సృష్టించాడు. అభిషేక్కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దంచుకొట్టుడు కొట్టడంతో 10 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశారు. బంతితో బుమ్రా నిప్పులు చెరగడంతో 8 వికెట్ల తేడాతో కివీస్ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా 5 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.ఈ సిరీస్లో రెండో అర్ధసెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ.. మరో ఘనత సాధించాడు. గువాహటి మ్యాచ్లో 14 బంతులోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో ఇంటర్నేషనల్ టి20ల్లో తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా 7వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 340 స్ట్రైక్రేట్తో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాగ్పూర్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84 పరుగులు; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కొట్టాడు. ఎప్పుడు బ్రేక్ చేస్తావ్?అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్పై మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి గురువు యువరాజ్ సింగ్ తన శిష్యుడికి సవాల్ విసిరాడు. తన పేరిట రికార్డ్ను ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ ఆట పట్టించాడు. ''ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావా?'' అంటూ ఎక్స్లో కామెంట్ పెట్టాడు. ''బాగా ఆడావు, ఇదే జోరు కొనసాగించాల''ని ఎంకరేజ్ చేశాడు. కాగా, టీమిండియా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు 19 ఏళ్లుగా యువీ పేరిటే ఉంది. 2007 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై 12 బంతుల్లోనే అతడు అర్ధశతకం సాధించి రికార్డు నెలకొల్పాడు.నెటిజన్ల స్పందనకాగా, అభిషేక్ శర్మను మోడ్రన్ యువరాజ్ సింగ్గా వర్ణిస్తూ.. గురువును రికార్డును అధిగమించే సత్తా శిష్యుడికే ఉందని నెటిజనులు అంటున్నారు. అభిషేక్ శర్మ ఇదే హై కొనసాగిస్తే త్వరలోనే యూవీ రికార్డు బ్రేక్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కుర్రాడిని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది నెటిజనులు అంటే.. శిష్యుడిని ఉత్సాహపరిచేందుకే యువీ సవాల్ విసిరాడని ఇంకొంత మంది అంటున్నారు. ఏదేమైనా రానున్న టి20 వరల్డ్కప్లోనూ అభిషేక్ శర్మ ఇదే జోరు కొనసాగించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: రోహిత్శర్మపై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలుభారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈ నెల 26న విశాఖపట్నంలో జరుగుతుంది. చివరి మ్యాచ్ ఈ నెల 31న తిరువనంతపురంలో జరగనుంది. చూడాలి మరి.. ఈ రెండు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ గురువు రికార్డును బ్రేక్ చేస్తాడో, లేదో!Still can’t get a 50 off 12 balls, can you? 🤪 Well played - keep going strong! 💪🏻 @OfficialAbhi04 #IndVSNz pic.twitter.com/6MQe1p6sx4— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2026 -
T20 WC 2026: సంజూ శాంసన్పై వేటు!?
భారత టీ20 జట్టు ఓపెనర్లుగా గత కొంతకాలంగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీ కొనసాగుతోంది. ఆసియా టీ20 కప్ సందర్భంగా శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమ్లోకి తిరిగి రావడంతో కొన్నాళ్లపాటు సంజూ బెంచ్కే పరిమితం అయ్యాడు. అయితే, గిల్ కూడా ఓపెనర్గా విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కూడా సంజూ శాంసన్కే ఓపెనర్గా అవకాశం దక్కింది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ అయిన గిల్పై వేటు వేసి మరీ.. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు మరో అవకాశం ఇచ్చింది యాజమాన్యం.సెలక్టర్ల వమ్ము చేస్తున్న సంజూఅయితే, సంజూ మాత్రం సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. కివీస్తో మూడు మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు (10, 6, 0) ఇందుకు నిదర్శనం. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో దుమ్ములేపుతున్నాడు.పేలుతున్న జార్ఖండ్ డైనమైట్న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో విఫలమైనా (8).. రెండో టీ20లో 32 బంతుల్లో 76, మూడో టీ20లో 13 బంతుల్లో 28 పరుగులతో సత్తా చాటాడు ఇషాన్. తద్వారా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ వైఫల్యాలు కొనసాగితే.. వరల్డ్కప్ టోర్నీలో భారత తుదిజట్టు నుంచి అతడిని తప్పించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ కిషన్ను జట్టు నుంచి ఎవరూ తప్పించలేరని పేర్కొన్నాడు.ఇషాన్ను తుదిజట్టు నుంచి తప్పించలేరు"ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సెలక్టర్లు ఇషాన్ను తుదిజట్టు నుంచి తప్పించలేరు. ఇందుకు అవకాశమే లేదు. సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడు. సంజూను చూస్తుంటే బాధగా ఉంది.పరుగులు చేయాలనే కసి అతడిలో కనిపిస్తోంది. కానీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. గత మ్యాచ్లో కనీసం నామమాత్రపు స్కోరైనా చేసి ఉండాల్సింది. నిలకడలేని ఆట తీరే సంజూకు ప్రధాన సమస్య. ఏడాదిన్నర క్రితం సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇదే తంతు కొనసాగుతోంది.సంజూపై వేటు తప్పదుఏదేమైనా సంజూ దురదృష్టవంతుడనే చెప్పాలి. అతడికి గట్టి పోటీ ఉంది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్ శర్మను ఎవరూ కదిలించలేరు. ఇషాన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్ డేంజరస్ ఫామ్లో ఉన్నపుడు సంజూ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశాలే ఎక్కువ’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. ఓపెనర్గా ఇషాన్ సంజూ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముIshan-daar. Jabardast. Zindabaad. 🔥Started with a 2nd-ball six & Ishan Kishan is straightaway showing his intent in this run chase! 💪He is certainly on a mission to DEFEAT HISTORY! 🎯Watch Bhojpuri commentary on JioHotstar #INDvNZ, 3rd T20I | LIVE NOW 👉… pic.twitter.com/YY3fnv3WvD— Star Sports (@StarSportsIndia) January 25, 2026 -
లక్ష్యం 154... 60 బంతుల్లోనే ఉఫ్...
గువాహటి: న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ను కోల్పోయిన టీమిండియా... ఐదు టి20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మూడో టి20లో ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో కివీస్పై గెలుపొందింది. 3–0తో సిరీస్ను వశం చేసుకుంది. టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చాప్మన్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ సాంట్నర్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ప్రపంచకప్కు ముందు ప్రీమియం బౌలర్ బుమ్రా (3/17) తన పేస్ వాడి ఏంటో నిలకడగా చూపించాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ షోతో స్టేడియాన్ని ఊపేశారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్లోని నాలుగో మ్యాచ్ బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది. అభి‘షో’... 14 బంతుల్లో ఫిఫ్టీ! తొలి బంతికే సామ్సన్ (0) క్లీన్బౌల్డ్... ఈ మ్యాచ్లో కివీస్ శిబిరం సంతోషించిన క్షణమిదే! తర్వాత గడిచిన క్షణాలు... పడిన బంతులు... వేసిన బౌలర్లు... పడిన పాట్లు... అన్ని ఇన్నీ కావు మరి! ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో బంతికి సిక్స్తో మొదలుపెట్టిన విధ్వంసం... అతను అవుటైనా కూడా ప్రతి ఓవర్లోనూ కొనసాగింది. ఓపెనర్ అభిషేక్, కెప్టెన్ సూర్యకుమార్ ‘హైలైట్స్’నే ఇన్నింగ్స్ అసాంతం చూపించారు. అభి, ఇషాన్, సూర్య ముగ్గురు కలిసి 10 సిక్స్లు బాదారు. అంటే సగటున ఓవర్కు ఒక్కోటి వచ్చింది. బౌండరీలైతే 16! ఎంత సులువుగా వచ్చాయంటే! ప్రత్యర్థి ఫీల్డర్లు, బౌలర్లు మొత్తం 20 ఓవర్లు కష్టపడకుండానే సగం ఓవర్లతోనే ముగించేలా బౌండరీల భరతం పట్టారు భారత బ్యాటర్లు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. సూర్య 25 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన మూడో వికెట్కు కేవలం 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. 3.1 ఓవర్లో 50 దాటిన భారత్ స్కోరు 6.3 ఓవర్లలో వందకు చేరుకుంది. 9.5 ఓవర్లలో 150ని సైతం అధిగమించింది.స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 1; సీఫర్ట్ (బి) బుమ్రా 12; రచిన్ (సి) బిష్ణోయ్ (బి) పాండ్యా 4; ఫిలిప్స్ (సి) ఇషాన్ (బి) బిష్ణోయ్ 48; చాప్మన్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 32; మిచెల్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 14; సాంట్నర్ (సి) అభిషేక్ (బి) బుమ్రా 27; జేమీసన్ (బి) బుమ్రా 3; హెన్రీ (రనౌట్) 1; ఇష్ సోధి (నాటౌట్) 2; డఫీ (నాటౌట్) 4: ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–34, 4–86, 5–112, 6–112, 7–132, 8–134, 9–144. బౌలింగ్: హర్షిత్ రాణా 4–0–35–1, హార్దిక్ పాండ్యా 3–0–23–2, రవి బిష్ణోయ్ 4–0–18–2, బుమ్రా 4–0–17–3, కుల్దీప్ 3–0–32–0, శివమ్ దూబే 2–0–24–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) హెన్రీ 0; అభిషేక్ శర్మ (నాటౌట్) 68; ఇషాన్ (సి) చాప్మన్ (బి) సోధి 28; సూర్యకుమార్ (నాటౌట్) 57; ఎక్స్ట్రాలు 2; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–53. బౌలింగ్: హెన్రీ 2–0–28–1, డఫీ 2–0–38–0, జేమీసన్ 1–0–17–0, ఇష్ సోధి 2–0–28–1, సాంట్నర్ 2–0–28–0, ఫిలిప్స్ 1–0–16–0. -
అభిషేక్ అదరహో.. మూడో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
గౌహతి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలూండగానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే ఊదిపడేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 నాటౌట్) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ తలా వికెట్ సాధించారు.బుమ్రా మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్(48) టాప్ స్కోరర్గా నిలిచాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: ప్రపంచకప్కు ముందే సౌతాఫ్రికాతో భారత్ 'ఢీ' -
అభిషేక్ శర్మ విధ్వంసకాండ.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని, ఓవరాల్గా ఏడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై యువరాజ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్ గేమ్స్లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్ (0), ఇషాన్ కిషన్ (28) ఔట్ కాగా.. అభిషేక్ శర్మ (67), సూర్యకుమార్ యాదవ్ (42) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-17-3), హార్దిక్ పాండ్యా (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
'హిట్మాన్'పై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మపై యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పాడు. టి20 పవర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తనపై హిట్మాన్ ప్రభావం గురించి జియోస్టార్తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శర్మ పాత్ర పోషించాలని కోచ్ గౌతమ్ గంభీర్ తనకు సూచించినట్టు వెల్లడించాడు.గంభీర్తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శర్మ ఫార్ములాను అనుసరిస్తున్నానని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుపడడం నాకు ఇష్టం కాబట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనితన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని అభిషేక్ శర్మ చెప్పాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జట్టు భారీస్కోరుకు బాటలు వేయాలని భావిస్తానని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జట్టుకు ఆరంభం ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటాన''ని ఈ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్రపంచకప్కు సన్నద్ధత కోసం మాట్లాడుతూ.. తన దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తానని, మ్యాచ్లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతానని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్లలో నేను ఎదుర్కొనబోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయమని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వరల్డ్కప్లో భాగంగా దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యమ''ని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.పవర్ హిట్టింగ్తో హిట్2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్తో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నంబర్వన్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్లోనూ తన జోరును కొనసాగించాలని ఈ ఎడంచేతి వాటం ఓపెనర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: ప్రధాని తర్వాత కష్టమైన జాబ్.. గంభీర్పై ప్రశంసలు -
WC 2027: రోహిత్ శర్మ వరల్డ్కప్ ఆడకుండా కుట్ర!?
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. హిట్మ్యాన్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్ కైవసం చేసుకుంది.అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్మెంట్ అతడిని తొలగించింది.అగార్కర్ అలారోహిత్ శర్మ స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027లో రోహిత్ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్గా తప్పించామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.అయితే, తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లో మాత్రం రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.డష్కాటే కామెంట్స్‘‘తొలి వన్డేలో రోహిత్ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్కు ముందు పెద్దగా క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్తో సిరీస్లో సత్తా చాటిన రోహిత్.. దేశీ క్రికెట్లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.కోచ్కు ఇచ్చిపడేసిన మనోజ్ తివారిటీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్తో నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్ ఫామ్ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్కప్-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్- రోహిత్ ఓపెనర్లుగా ఉన్నారు.వరల్డ్కప్ ఆడకుండా కుట్ర!?ఓవైపు అగార్కర్, డష్కాటే కామెంట్స్.. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్మ్యాన్ను వన్డే వరల్డ్కప్-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి విషయంలోనూ అగార్కర్ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!
టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్.1199 పరుగులుఈ మ్యాచ్లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్కప్ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్కప్ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్ప్లేలోనూ అభిషేక్ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్- గిల్ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ప్రస్తుత సారథి శుబ్మన్ గిల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్తో సిరీస్లో అభిషేక్ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్గా వరల్డ్కప్ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్పూర్ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్ అభిషేక్ శర్మదే.అతిపెద్ద సానుకూలాంశంఇక అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.సరైన సమయంలో క్రీజులోకివ్యక్తిగతంగా నా బ్యాటింగ్ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్లో నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.ఎక్కడున్నా అదే ఆలోచనఇక అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్లో.. టీమ్ బస్లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్ ప్లాన్ గురించే ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు.238 పరుగులుకాగా నాగ్పూర్లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్- కివీస్ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్కు రాయ్పూర్ వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుA thumping win! 👏🏻🇮🇳Shivam Dube finishes off the proceedings & after putting up a mammoth total, Team India bowlers combine to restrict the Kiwi batters to go 1-0 up! 👌🏻Watch #INDvNZ | 2nd T20I 👉 FRI, 23rd JAN, 6 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/WTK7BuF1Nv— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- న్యూజిలాండ్ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్పూర్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8) పూర్తిగా నిరాశపరిచారు.ఆకాశమే హద్దుఅయితే మరో ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్ సోధి బౌలింగ్లో జెమీషన్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 238 పరుగులు సాధించింది.కివీస్ ఓటమిభారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్ సాల్ట్- ఏడుసార్లు🏏సూర్యకుమార్ యాదవ్- ఏడుసార్లు🏏ఎవిన్ లూయీస్- ఏడుసార్లు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ You keep on counting, he keeps on hitting! 🤩😍𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
అదరగొట్టిన అభిషేక్
ఎప్పటిలాగే తనదైన శైలిలో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్... సూర్యకుమార్, రింకూ సింగ్ దూకుడు... ఆపై బౌలర్ల ప్రతాపం... వెరసి న్యూజిలాండ్తో టి20 సిరీస్లో భారత్కు ఘనమైన ఆరంభం లభించింది. ముందుగా కేవలం బౌండరీల ద్వారానే 168 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో చెలరేగిన టీమిండియా... అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమైంది. కివీస్ కొంత పోరాడినా లక్ష్యానికి దూరంలో నిలిచిపోయింది. నాగ్పూర్: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్ టి20 సిరీస్ తొలి మ్యాచ్లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్ మూడో వికెట్కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 6 సిక్స్లు), మార్క్ చాప్మన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రెండో టి20 శుక్రవారం రాయ్పూర్లో జరుగుతుంది. సమష్టి ప్రదర్శన 14 సిక్సర్లతో 84 పరుగులు... 21 ఫోర్లతో 84 పరుగులు... భారత్ జోరు బౌండరీలతో ఈ తరహాలో సాగింది. ముందుగా అభిషేక్, మధ్యలో సూర్య, పాండ్యా, చివర్లో రింకూ చెలరేగి భారత్కు భారీ స్కోరును అందించారు. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్కు దిగింది. సంజు సామ్సన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు) ఆరంభంలోనే వెనుదిరిగినా... మరోవైపు అభిషేక్ సిక్స్తో దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. జేమీసన్, క్లార్క్ వేసిన వరుస ఓవర్లలో అతను రెండేసి సిక్స్లు బాదాడు. దాంతో పవర్ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. ఫిలిప్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 117కు చేరింది. సూర్య అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ధాటిని ప్రదర్శించాడు. సోధి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ వెనుదిరిగాడు. తక్కువ వ్యవధిలో శివమ్ దూబే (4 బంతుల్లో 9; 1 సిక్స్), పాండ్యా, అక్షర్ పటేల్ (5) అవుటైన తర్వాత ఆఖర్లో రింకూ చెలరేగిపోయాడు. క్లార్క్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి స్కోరును 200 దాటించిన అతను... మిచెల్ వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఫిలిప్స్ అర్ధ సెంచరీ న్యూజిలాండ్ ఛేదన పేలవంగా ప్రారంభమైంది. రెండో బంతికే కాన్వే (0) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రచిన్ (1) కూడా అవుటయ్యాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాబిన్సన్ (21) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఇలాంటి స్థితిలో ఫిలిప్స్, చాప్మన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఫిలిప్స్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు భారీ సిక్స్లు బాదాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి ఫిలిప్స్ అవుట్ కావడంతో 79 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో చాప్మన్ను వరుణ్ అవుట్ చేయడంతో కివీస్ ఆశలు కోల్పోయింది. ఈ దశలో విజయానికి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన జట్టు చివరకు 46 పరుగులే చేయగలిగింది. డరైల్ మిచెల్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు), సాంట్నర్ (13 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) జేమీసన్ 10; అభిషేక్ (సి) జేమీసన్ (బి) సోధి 84; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) డఫీ 8; సూర్యకుమార్ (సి) రాబిన్సన్ (బి) సాంట్నర్ 32; పాండ్యా (సి) చాప్మన్ (బి) డఫీ 25; దూబే (సి అండ్ బి) జేమీసన్ 9; రింకూ సింగ్ (నాటౌట్) 44; అక్షర్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 5; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–126, 4–149, 5–166, 6–185, 7–209. బౌలింగ్: డఫీ 4–0–27–2, జేమీసన్ 4–0–54–2, క్లార్క్ 4–0–40–1, సోధి 3–0–38–1, ఫిలిప్స్ 1–0–20–0, సాంట్నర్ 3–0–37–1, మిచెల్ 1–0–21–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; రాబిన్సన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; రచిన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; ఫిలిప్స్ (సి) దూబే (బి) అక్షర్ 78; చాప్మన్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 39; మిచెల్ (సి) (సబ్) బిష్ణోయ్ (బి) దూబే 28; సాంట్నర్ (నాటౌట్) 20; క్లార్క్ (సి) రింకూ (బి) దూబే 0; జేమీసన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–52, 4–131, 5–143, 6–189, 7–189. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, పాండ్యా 2–0–20–1, బుమ్రా 3–0–29–0, అక్షర్ పటేల్ 3.3–0–42–1, వరుణ్ 4–0–37–2, దూబే 3–0–28–2, అభిషేక్ 0.3–0–3–0. -
తొలి టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించిందిఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్(24 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు చాప్మన్(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్పూర్ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్ -
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ (238/7) చేసింది. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్కు జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేసింది.మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, ఇషాన్ కిషన్ 8, శివమ్ దూబే 9, అక్షర్ పటేల్ 5, అర్షదీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.అభిషేక్కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి జేమీసన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్లో అభిషేక్ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్లో (33 ఇన్నింగ్స్లు) 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్రేట్తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్కే ఔటైనా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ ఔటయ్యాక శృతి మించాయి.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న హార్దిక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్ (4) క్రీజ్లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 185/5గా ఉంది. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..
ముంబైకి ఊహించని షాకిచ్చింది పంజాబ్. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గురువారం నాటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆఖరికి అభిషేక్ శర్మ సేన పైచేయి సాధించడంతో.. శ్రేయస్ అయ్యర్ బృందానికి నిరాశ తప్పలేదు.పంజాబ్ టాపార్డర్ కుదేలుదేశీ వన్డే టోర్నీ తాజా ఎడిషన్ ఎలైట్ గ్రూపులో భాగంగా గురువారం ముంబై- పంజాబ్ జట్లు తలపడ్డాయి. జైపూర్ వేదికగా టాస్ ఓడిన పంజాబ్.. ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పంజాబ్ టాపార్డర్ కుదేలైంది.ఆదుకున్న అన్మోల్, రమణ్దీప్టీమిండియా విధ్వంసకర ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (8), ప్రభ్సిమ్రన్ సింగ్ (11), హర్నూర్ సింగ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట దశలో అన్మోల్ప్రీత్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ (75 బంతుల్లో 57) ఆడగా.. నమన్ ధిర్ (22) ఫర్వాలేదనిపించాడు.216 పరుగులుఆరో స్థానంలో వచ్చిన రమణ్దీప్ సింగ్ అర్ధ శతకం (74 బంతుల్లో 72) సాధించగా.. బౌలర్లు హర్ప్రీత్ బ్రార్ (15), సుఖ్దీప్ బజ్వా (17) తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా 45.1 ఓవర్లలో పంజాబ్ 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే, శివం దూబే తలా రెండు వికెట్లు తీశారు. సాయిరాజ్ పాటిల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకంనామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (23), ముషీర్ ఖాన్ (21) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (20 బంతుల్లో 62) సాధించాడు.శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధనాధన్ దంచికొట్టగా (34 బంతుల్లో 45).. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (15) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్ అవుటైన తర్వాత ముంంబై వేగంగా వికెట్లు కోల్పోయింది. శివం దూబే (12), హార్దిక్ తామోర్ (15) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (2), శశాంక్ (0), ఓంకార్ (0) కనీస పోరాటపటిమ కనబరచలేకపోయారు. షామ్స్ ములానీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.ఒకే ఒక్క పరుగు తేడాతోఅయితే, పంజాబ్ బౌలర్ల దెబ్బకు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ముంబై చాపచుట్టేసింది. దీంతో పంజాబ్ ఒకే ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, పేసర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గుర్నూర్ బ్రార్ చెరో నాలుగు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. మిగతా వారిలో హర్ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా! -
అభిషేక్ శర్మ ఓవర్లో సర్ఫరాజ్ విశ్వరూపం.. 15 బంతుల్లోనే..
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పంజాబ్ బౌలింగ్ను చితక్కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్, పార్ట్టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకు చుక్కలు చూపించాడు.15 బంతుల్లోనేఅభిషేక్ శర్మ (Abhishek Sharma) వేసిన ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6,4,6,4,6,4 బాదాడు. వన్డౌన్లో వచ్చి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై పరుగులు పిండుకున్నాడు. వన్డే మ్యాచ్లో టీ20 తరహాలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం.. 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.మార్కండే బౌలింగ్లోపంజాబ్తో మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan).. 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే, మయాంక్ మార్కండే బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగడంతో సర్ఫరాజ్ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది.అభిషేక్ ఫెయిల్దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా.. జైపూర్ వేదికగా పంజాబ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ అభిషేక్ శర్మ (8) సహా మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (11).. వన్డౌన్ బ్యాటర్ హర్నూర్ సింగ్ డకౌట్ కావడంతో ఆదిలోనే పంజాబ్కు షాక్ తగిలింది.అన్మోల్, రమణ్ అర్ధ శతకాలుఈ క్రమంలో అన్మోల్ప్రీత్ సింగ్ అర్ధ శతకం (57)తో రాణించగా.. నమన్ ధిర్ (22) అతడికి సహకరించాడు. ఇక రమణ్దీప్ సింగ్ సైతం హాఫ్ సెంచరీ (72)తో ఆకట్టుకున్నాడు. అయితే, మిగతా వారంతా తేలిపోవడంతో 45.1 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.ముంబై బౌలర్లలో సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. శివం దూబే, శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే తలా రెండు వికెట్లు కూల్చారు. సాయిరాజ్ పాటిల్కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ధనాధన్ బ్యాటింగ్తో విజయం దిశగా పయనించిన ముంబై.. అనూహ్య రీతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా! -
అభిషేక్ శర్మపై వేటు వేస్తారా?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ప్రకటించిన భారత జట్టులో శుబ్మన్ గిల్కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. అప్పటిదాకా వైస్ కెప్టెన్గా ఉన్న అతడిపై మెగా ఈవెంట్కు ముందు వేటు పడింది. అయితే, అందుకు గిల్ వరుస వైఫల్యాలే కారణం.దాదాపు ఏడాది పాటు టెస్టు, వన్డేలతో బిజీగా ఉన్న గిల్ (Shubman Gill).. ఆసియా కప్-2025తో టీమిండియా తరపున టీ20 క్రికెట్లో పునరాగమనం చేశాడు. అతడి రాకతో అప్పటిదాకా అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా కొనసాగిన సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. మరోవైపు.. గిల్ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు.గిల్ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలుఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా.. వరల్డ్కప్ జట్టు నుంచి గిల్ను తప్పించిన యాజమాన్యం.. సంజూను ఓపెనర్గా బరిలో దించుతామని చెప్పకనే చెప్పింది. అయితే, వైస్ కెప్టెన్ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గిల్కు ఇంకాస్త సమయం ఇవ్వాల్సిందని.. భవిష్య కెప్టెన్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అభిప్రాయపడ్డారు.మరోవైపు.. గిల్ను తప్పించి మంచి పనిచేశారని మరికొందరు మాజీలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.ఏకంగా జట్టు నుంచే తప్పిస్తారా?‘‘శుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్. కేవలం 4-5 ఇన్నింగ్స్లో విఫలమయ్యాడని అతడిని జట్టు నుంచే తప్పిస్తారా? వందకు పది మాత్రమే సరిగ్గా ఆడిన ఎంతో మంది క్రికెటర్లకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలాంటి వాళ్లలో కొందరు ఇంకా ఆడుతున్నారు.అతడిపైనా వేటు వేస్తారా?ఇందుకు కారణమేంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువకుడైన అభిషేక్ శర్మ రెండేళ్ల క్రితం జట్టులోకి దూసుకువచ్చాడు. ఒకవేళ ఈ విధ్వంసకర ఓపెనర్గా నాలుగు ఇన్నింగ్స్లో గనుక విఫలమైతే.. అతడిపైనా వేటు వేస్తారా?’’ అని యోగ్రాజ్ సింగ్ టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు.కపిల్ దేవ్కు వరుస అవకాశాలుఈ సందర్భంగా భారత దిగ్గజం కపిల్ దేవ్ పేరును ప్రస్తావిస్తూ.. ‘‘మీ దృష్టిలో ‘గొప్పవాడైన’ కపిల్ దేవ్నే ఉదాహరణగా తీసుకుందాం. బిషన్ సింగ్ బేడీ కెప్టెన్సీలో మేము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినపుడు.. కపిల్ దేవ్ వరుసగా విఫలమవుతున్నా.. అన్ని మ్యాచ్లు ఆడాడు. అయినా సరే బిషన్ సింగ్ అతడిని ఇంగ్లండ్ టూర్కు కూడా తీసుకువెళ్లాడు. మరి గిల్ విషయంలో ఎందుకిలా?’’ అని యోగ్రాజ్ సింగ్ ప్రశ్నించాడు. రవిబిస్త్ ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా తనను తొక్కేశాడని కపిల్ దేవ్ను.. తన కుమారుడు యువీ కెరీర్ను నాశనం చేశారంటూ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిలను యోగ్రాజ్ తరచూ విమర్శిస్తూ ఉంటాడు. అయితే, అతడు చెప్పినట్లు ఇప్పుడు గిల్ కేవలం 4-5 ఇన్నింగ్స్లో కాదు.. దాదాపు ఇరవైకి పైగా ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకుండా విమర్శలు మూటగట్టుకున్నాడు. చదవండి: IND vs NZ: పంత్పై వేటు.. దేశీ ‘హీరో’ ఎంట్రీ!.. సిరాజ్కు చోటిస్తారా? -
‘టీ20లలో బెస్ట్.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’
టీమిండియా టీ20 స్టార్ అభిషేక్ శర్మ 2025లో అదరగొట్టాడు. ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరఫున ఈ సంవత్సరంలో 21 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ.. 193కు పైగా స్ట్రైక్రేటుతో 859 పరుగులు స్కోరు చేశాడు.అశూ ప్రశంసలుతద్వారా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma).. టీమిండియా టాప్ రన్స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఓపెనర్పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్ను.. ‘మెన్స్ టీమ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణించాడు.వన్డేలలోనూ ఆడించాలిఅదే విధంగా.. వన్డేల్లోనూ అభిషేక్ శర్మను ఆడిస్తే బాగుంటుందని అశూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ‘అశ్ కీ బాత్’లో మాట్లాడుతూ.. ‘‘ఇది అభిషేక్ శర్మ ఆగమనం మాత్రమే కాదు. టీమిండియా నవతరంలోని ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఆగమనం ఇది. 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడు అతడే.ముఖ్యంగా పవర్ ప్లేలో అతడి బ్యాటింగ్ అద్భుతం. వన్డేల్లోనూ అతడి ఆటను చూడాలని ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ అతడే’’ అని అభిషేక్ శర్మను అశూ కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 1115 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. తదుపరి టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు అభిషేక్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్కప్కు ముందు తన ఉద్దేశాలను మరోసారి స్పష్టం చేశాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని సిక్సర్గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్ సర్కిల్స్లో భయోత్పాతం సృష్టించాడు.ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్గా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల వీరుడు.. ఇవాళ (డిసెంబర్ 28) జైపూర్లోని అనంతం గ్రౌండ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది, అక్కడున్న వారిలో (ట్రిబ్యూన్ రిపోర్టర్ల కథనం) భయాందోళనలు పుట్టించాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్ మీడియాకు చెందిన రిపోర్టర్లు నివేదించారు.వారి నివేదిక ప్రకారం.. పంజాబ్ రేపు జరుగబోయే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో (జైపూర్లోని అనంతం క్రికెట్ గ్రౌండ్) ఉత్తరాఖండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ శివాలెత్తిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని భారీ షాట్ ఆడి, ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది చూసి రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.ఈ స్థాయి విధ్వంసమేంటంటూ నోరెళ్లబెట్టారు. ప్రతి బంతిని బాదడమే ధ్యేయంగా పెట్టుకొన్న అభిషేక్.. స్పిన్నర్ల బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్ మీదుగా సిక్సర్గా మలిచాడు. అభిషేక్ వీరంగం చూసి పంజాబ్ కోచ్ సందీప్ శర్మ అవాక్కైపోయాడు. ట్రిబ్యూన్ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చూసి ప్రపంచ బౌలర్లంతా భయాందోళనలకు గురవుతుంటారు.వాస్తవానికి అభిషేక్ సిక్సర్ల వీరంగం గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివర్లో అది తారాస్థాయికి చేరినట్లుంది. 2024 ఐపీఎల్తో మెరుపులు ప్రారంభించిన అభిషేక్ అప్పటినుంచి తానెదుర్కొన్న ప్రతి బౌలర్ను షేక్ చేస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది అతని సిక్సర్ల ప్రదర్శన శృతి మించింది. ఇప్పటివరకు ఆడిన 41 టీ20ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కరణ్బీర్ సింగ్ (ఆస్ట్రియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నారు. -
కలిసి బరిలోకి దిగనున్న టీమిండియా యువ కెరటాలు
టీమిండియా యువ కెరటాలు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ మరోసారి కలిసి బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి వారు ప్రాతినిథ్యం వహించనున్నది టీమిండియాకు కాదు. ఈ ముగ్గురు యువ తారలు విజయ్ హజారే వన్డే ట్రోఫీ (VHT) కోసం పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నారు.డిసెంబర్ 24 నుంచి ప్రారంభంకాబోయే విజయ్ హజారే ట్రోఫీ కోసం 18 మంది సభ్యుల పంజాబ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. ఈ జట్టులో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్తో పాటు రమన్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, నమన్ ధిర్ లాంటి ఐపీఎల్ స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.ఈ జట్టుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) కెప్టెన్ను ప్రకటించకపోవడం విశేషం. గత సీజన్లో అభిషేక్ శర్మ కెప్టెన్గా వ్యవహరించగా.. ఈ సీజన్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టులో ఉండటంతో PCA ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. బహుశా చివరి నిమిషంలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.కాగా, VHTలో భాగంగా పంజాబ్ డిసెంబర్ 24నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జైపూర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. భారత్-న్యూజిలాండ్ సిరీస్ కారణంగా గిల్, అభిషేక్ VHT మొత్తానికి అందుబాటులో ఉండరు. గిల్ వన్డే సిరీస్ సమయానికి.. అభిషేక్ టీ20 సిరీస్ సమయంలో పంజాబ్ జట్టుకు అందుబాటులో ఉండడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం పంజాబ్ జట్టు.. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్ప్రీత్ సింగ్, ఉదయ్ సహరన్, నమన్ ధిర్, సలిల్ అరోరా (వికెట్కీపర్), సన్వీర్ సింగ్, రమన్దీప్ సింగ్, జషన్ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్ప్రీత్ బ్రార్, రఘు శర్మ, కృష్ణ భగత్, గౌరవ్ చౌధరి, సుఖ్దీప్ బజ్వా. -
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్గా కొనసాగించిన శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.వైస్ కెప్టెన్గా రీఎంట్రీటీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్తో వైస్ కెప్టెన్గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్కు కష్టాలు మొదలయ్యాయి. గిల్ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్డౌన్లో.. ఆ తర్వాత మిడిలార్డర్కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.వరుస మ్యాచ్లలో విఫలం వికెట్ కీపర్గానూ సంజూకు బదులు ఫినిషర్గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.నిరూపించుకున్న సంజూఅహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్ను తప్పించడం సంచలనంగా మారింది.అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదుఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్కప్ జట్టులోనూ అతడు లేడు.మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజమే.అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఇక అనూహ్య రీతిలో.. వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ (Shubman Gill)కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. మరోవైపు.. జితేశ్ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది.జితేశ్కూ దక్కని చోటు.. దూసుకు వచ్చిన ఇషాన్తుదిజట్టులో గిల్ ఉండేలా.. సంజూ ఓపెనింగ్ స్థానం త్యాగం చేయించిన మేనేజ్మెంట్.. వికెట్ కీపర్గా జితేశ్కు పెద్ద పీట వేసి లోయర్ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్ జట్టు నుంచి జితేశ్ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపిన ఇషాన్ కిషన్ను తీసుకువచ్చింది. అతడిని బ్యాకప్ ఓపెనర్గా ఉపయోగించుకుంటామని తెలిపింది.అదే విధంగా.. నయా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ను మేనేజ్మెంట్ కనికరించింది. మరోసారి వరల్డ్కప్ జట్టులో భాగమయ్యే అవకాశం ఇచ్చింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలోనే గిల్ను జట్టు నుంచి తప్పించినట్లు స్పష్టమవుతోంది. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీకి ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కొత్తగా బీసీసీఐ కార్యదర్శిఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: WC 2026: ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?.. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఎవరంటే? -
గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీగా వచ్చి వరుస శతకాలతో అలరించాడు. కానీ ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ స్థానం గల్లంతైంది.గిల్ వరుస వైఫల్యాలుగిల్ను ఆడించే క్రమంలో సంజూను తొలుత మూడో స్థానంలో.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఒకటీ రెండు మ్యాచ్లలో ఆడించి.. అనంతరం తుదిజట్టు నుంచే తప్పించింది యాజమాన్యం. మరోవైపు.. గిల్ (Shubman Gill) పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.సంజూ ధనాధన్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి గిల్ కేవలం 33 పరుగులే చేశాడు. ఇందులో ఓ గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇక పాదానికి గాయమైన కారణంగా గిల్ సౌతాఫ్రికా (IND vs SA)తో ఆఖరిదైన ఐదో టీ20కి దూరమయ్యాడు. దీంతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు ఇచ్చిన మేనేజ్మెంట్ ప్రయోగాలకు వెళ్లకుండా ఈసారి అతడిని ఓపెనర్గానే పంపింది.వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 37 పరుగులు సాధించాడు. అయితే, జార్జ్ లిండే అద్భుత బంతితో సంజూను బౌల్డ్ చేశాడు. కాగా గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే కూడా సంజూ ఈ ఒక్క ఇన్నింగ్స్లో చేసిన పరుగులే ఎక్కువ కావడం గమనార్హం.గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంట్రీలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో అతడు అసలు ఎందుకు లేడు? ఇలాంటి ఆటగాడిని పక్కనపెడతారా? ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఇతడిని ఆడిస్తారా?టాపార్డర్లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్, డేంజరస్ ప్లేయర్. అద్భుతమైన షాట్లు ఆడటంలో దిట్ట. అయినా సరే అతడిని పక్కనపెడతారా?’’ అంటూ రవిశాస్త్రి యాజమాన్యం విధానాలను తప్పుబట్టాడు.కాగా అహ్మదాబాద్తో సౌతాఫ్రికాతో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పద్నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకుని.. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్గా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!1000 T20I runs ✅8000 T20 runs ✅@IamSanjuSamson crosses some big milestones in splendid style! 🤩#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/F8O8ZAUz19— Star Sports (@StarSportsIndia) December 19, 2025 -
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఫాస్టెస్ట్ ఫిఫ్టీతద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. యువరాజ్ సింగ్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.తిలక్ వర్మ విధ్వంసంఇక శుక్రవారం అహ్మదాబాద్లోనూ గెలిచి సిరీస్ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (22 బంతుల్లో 37), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు..@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc— Star Sports (@StarSportsIndia) December 19, 2025నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు. అనూహ్య రీతిలోమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్ బార్ట్మన్ బౌలంగ్లో షాట్ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c— Star Sports (@StarSportsIndia) December 19, 2025ఇక తిలక్ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి రనౌట్ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్మన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే🏏యువరాజ్ సింగ్- 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ🏏హార్దిక్ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ🏏అభిషేక్ శర్మ- 2025లో ఇంగ్లండ్ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ🏏కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ🏏సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
కోహ్లి ఆల్టైమ్ రికార్డు జస్ట్ మిస్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్ ఇయర్లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ తరఫున అదరగొట్టిన అభిషేక్ శర్మ 14 మ్యాచ్లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరు మ్యాచ్లలో కలిపి 304 పరుగులు సాధించాడు.ఇక టీమిండియా తరఫున ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. కోహ్లి ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.2016లో విరాట్ కోహ్లి ఐపీఎల్, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్ నాలుగో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ గెలుపు. స్కోర్లు: భారత్ 231/5(20), దక్షిణాఫ్రికా 201/8(20)దక్షిణాఫ్రికాకు 12 బంతుల్లో 47 పరుగులు అవసరం. విజయానికి చేరువగా భారత్.180 పరుగులకు 8 వికెట్లను కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమికి దగ్గర్లో ఉంది.వరుసగా మరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. 177 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 8వ వికెట్ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు 19 బంతుల్లో 55 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా ఏడోవ వికెట్ కోల్పోయింది. 15.2 ఓవర్లకు 163 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 33 బంతుల్లో 78 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా విజయానికి 38 బంతుల్లో 85 పరుగులు అవసరం.టీమిండియాతో ఐదో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగులు చేసింది. భారత్ విధించిన 232 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. హైలైట్స్👉10 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 118-1విజయానికి 60 బంతుల్లో 114 కావాలి. బ్రెవిస్ 14 బంతుల్లో 29, డికాక్ 34 బంతుల్లో 65 పరుగులతో ఉన్నారు.👉6.3 తొలి వికెట్ డౌన్: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో హెండ్రిక్స్ (13) అవుట్. స్కోరు: 70-1(7). డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు.👉ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 60-0హెండ్రిక్స్ 10, డికాక్ 42 పరుగులతో ఉన్నారు.భారత్ భారీ స్కోరు: 231-5(20)ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) రాణించగా.. తిలక్ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి విఫలం అయ్యాడు.ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్మన్ చెరొక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ జట్టు లక్ష్యం 232 పరుగులు.భారత్ బ్యాటింగ్.. హైలైట్స్👉19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్మన్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్మన్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)👉16 బంతుల్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకంబాష్ బౌలింగ్లో సిక్స్ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3తిలక్ 57, హార్దిక్ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.👉14.4 తిలక్ వర్మ హాఫ్ సెంచరీ: ఎంగిడి బౌలింగ్లో ఫోర్ బాది.. ఆరో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ (30 బంతుల్లో).👉12.1 మూడో వికెట్ డౌన్: బాష్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి సూర్య (5) అవుట్. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా. స్కోరు: 115-3(12.1)👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2తిలక్ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.👉9.1 రెండో వికెట్ డౌన్: లిండే బౌలింగ్లో శాంసన్ బౌల్డ్ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్ డౌన్. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. 👉8.4: సంజూ బాదిన షాట్తో అంపైర్కు గాయంఫెరీరా బౌలింగ్లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్ను ఫెరీరా డ్రాప్ చేయగా.. అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్ చేశారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 27, తిలక్ వర్మ 4 పరుగులతో ఉన్నారు.👉5.4- తొలి వికెట్ డౌన్: కార్బిన్ బాష్ బౌలింగ్లో కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి అవుటైన అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్) అవుట్. తొలి వికెట్ డౌన్. క్రీజులోకి తిలక్ వర్మ. స్కోరు: 63-1(5.4)👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0👉అభిషేక్ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.తుదిజట్లలో మార్పులు ఇవేఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో జార్జ్ లిండేను ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చింది. మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్, శుబ్మన్ గిల్ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ వారి స్థానాలను భర్తీ చేశారు.కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్లో భారత్, ముల్లన్పూర్లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్లో గెలిచి 3-1తో సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్సౌతాఫ్రికాక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మన్. -
నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్!
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్కు పొగమంచు అంతరాయం కలిగించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్కు టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దూరమైనట్లు సమాచారం.పేలవ ప్రదర్శనకాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్.. నాటి నుంచి ఓపెనర్గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కాగా గిల్ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లను యాజమాన్యం విడదీసింది.సంజూను పక్కనపెట్టేసి మరీ..అభిషేక్ను ఓపెనర్గా కొనసాగిస్తూ అతడికి గిల్ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్ దూరమైనట్లు క్రిక్బజ్ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్ కెప్టెన్ కాగా.. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్ వేయాల్సి ఉండగా పొగమంచు కమ్ముకుంది. దీంతో 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.వీడిన సస్పెన్స్ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పుడూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగగా.. ఈసారీ స్పష్టత రాలేదు. 9.25 నిమిషాలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సస్పెన్స్కు తెరదించారు.రీప్లేస్మెంట్గా షాబాజ్ అహ్మద్కాగా ఈ మ్యాచ్కు ముందు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్ అహ్మద్ను రీప్లేస్మెంట్గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్ల భాగంగా కటక్లో తొలి మ్యాచ్లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్పూర్లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్ సమం చేసింది. అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్వాష్ చేయగా.. వన్డే సిరీస్ను భారత్ 2-1తో గెలుచుకుంది.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
గిల్, సూర్య కలిసి వరల్డ్కప్ గెలిపిస్తారు: అభిషేక్ శర్మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫెయిల్సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్ను బలి చేసి గిల్కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సూర్య, గిల్పై నమ్మకం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి. సూర్య, గిల్పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్లో జట్టును గెలిపిస్తారు.వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్మన్తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.త్వరలోనే మీరు కూడా చూస్తారుసూర్య, గిల్ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.వరుస వైఫల్యాలుకాగా అభిషేక్ శర్మకు జోడీగా ఓపెనర్గా వస్తున్న గిల్.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.ఇదిలా ఉంటే.. కటక్లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్పూర్లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్గా.. -
నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా.. కానీ: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా సఫారీలను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో.. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమించి తాజా టీ20లో గెలవడం పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘క్రీడలు మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతాయి. ఈ సిరీస్లో తిరిగి పుంజుకుని ఆధిక్యంలోకి రావడం అత్యంత ముఖ్యమైన విషయం. మేము ప్రస్తుతానికి ఆ పనిని పూర్తి చేశాము.మా బౌలర్లు సూపర్కటక్లో జరిగిన తొలి టీ20లో మాదిరి ప్రాథమిక స్థాయి అంశాల మీద కూడా దృష్టి పెట్టాము. అందుకు తగ్గ ఫలితాన్ని పొందాము కూడా!.. చండీగఢ్ (ముల్లన్పూర్)లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈసారి మా బౌలర్లంతా సమిష్టిగా రాణించడం కలిసి వచ్చింది.నెట్స్లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాఆ మ్యాచ్లో ఓటమి తర్వాతి సమావేశంలో మా తప్పొప్పుల గురించి లోతుగా చర్చించుకున్నాము. కఠినంగా సాధన చేశాము. ఈ మ్యాచ్లో మేము ప్రయోగాలకు పోలేదు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే.. నెట్స్లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను.కానీ మ్యాచ్లో విఫలమవుతున్నాను. నా ఆధీనంలో ఉన్న ప్రతి పనిని విజయవంతంగా నిర్వహించేందుకు నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. సరైన సమయంలో సరైన విధంగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి. నేను ఫామ్లో లేనని అనుకోను.అయితే, వీలైనన్ని ఎక్కువ పరుగులు మాత్రం రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాం. తదుపరి లక్నో మ్యాచ్పై దృష్టి సారిస్తాం’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది.117 పరుగులే చేసి ఆలౌట్భారత బౌలర్ల విజృంభణకు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులే చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61) ఒక్కడే మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారిలో ఫెరీరా(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. టీమిండియా పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు కూల్చగా.. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు.స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టగా.. శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించాడు.మరోసారి సూర్య విఫలంవన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ సూర్య (12) మరోసారి విఫలమయ్యాడు. తిలక్తో కలిసి శివం దూబే (4 బంతుల్లో 10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.కాగా సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత బ్యాటర్గా దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా పేసర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. ఈ ఏడాది 18 ఇన్నింగ్స్లో పేసర్ల బౌలింగ్లో 14సార్లు అతడు అవుట్ అయ్యాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని 8.71 సగటుతో కేవలం 122 పరుగులు చేశాడు. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నాలుగో టీ20 జరుగుతుంది. ఇందుకు వేదిక లక్నో.చదవండి: Messi: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!#ShivamDube finishes things off in style and Team India go 2–1 up in the series.🔥#INDvSA, 4th T20I 👉 WED, DEC 17, 6 PM pic.twitter.com/OjhdlpHs7G— Star Sports (@StarSportsIndia) December 14, 2025 -
భారత్ భళా... సఫారీ డీలా
ధర్మశాల: ధర్మశాల అసలే శీతల ప్రదేశం. ఇక ఈ చలికాలమైతే మంచు గడ్డలా మారాల్సిందే. అలాంటి వేదికపై మన పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సెగ పెట్టారు. ఆరంభంలో పేస్ ప్రతాపం, తర్వాత స్పిన్ మాయాజాలం భారత్ను సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిపింది. ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే భారత బౌలింగ్కు ఎదురు నిలిచాడు. మ్యాచ్ మొదలైన కాసేపటికే అర్ష్ దీప్ (2/13), హర్షిత్ రాణా (2/34), హార్దిక్ పాండ్యా (1/23) పేస్కు సఫారీ కుదేలైంది. రిజా హెండ్రిక్స్ (0), డికాక్ (1), బ్రెవిస్ (2)లు పెవిలియన్ చేరడంతో ఒకదశలో 3.1 ఓవర్లలో సఫారీ స్కోరు 7/3. తర్వాత స్పిన్ తిరగడంతో 77 పరుగుల వద్ద 7వ వికెట్ను కోల్పోయింది. మార్క్రమ్ ఫిఫ్టీతో జట్టు కష్టంగా వంద పైచిలుకు స్కోరు చేసింది. మెరిపించిన అభిషేక్ భారత్ ముందున్న లక్ష్యం ఏమాత్రం కష్టమైంది కాదు. ఇలాంటి స్కోరు ఛేదించేందుకు దిగిన భారత్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్లు), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు) చక్కని ఆరంభమిచ్చారు. అభిషేక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా స్కోరు 4.1 ఓవర్ల్లలోనే 50 పరుగులు దాటింది. ఓపెనింగ్ వికెట్కు చకచకా 60 పరుగులు జోడించిన అభిషేక్ తొలి వికెట్గా నిష్క్రమించాడు. తిలక్ వర్మ (34 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు), గిల్ కుదురుగా ఆడారు. స్వల్ప వ్యవధిలో గిల్, కెప్టెన్ సూర్యకుమార్ (12) నిష్క్రమించినప్పటికీ మిగతా లాంఛనాన్ని తిలక్, శివమ్ దూబే (10 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముగించారు. ఐదు మ్యాచ్ల సిరీస్ తదుపరి నాలుగో టి20 బుధవారం (17న) లక్నోలో జరుగుతుంది.3 స్టబ్స్ను అవుట్ చేసిన హార్దిక్ అంతర్జాతీయ టి20 క్రికెట్లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న మూడో భారత బౌలర్. అర్ష్ దీప్, బుమ్రాలు ఇదివరకే వంద వికెట్ల క్లబ్లో ఉన్నారు.5 స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పొట్టి క్రికెట్లో 50 వికెట్లు పడగొట్టాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ రాణా 1; హెండ్రిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (సి) జితేశ్ (బి) అర్ష్ దీప్ 61; బ్రెవిస్ (బి) హర్షిత్ 2; స్టబ్స్ (సి) జితేశ్ (బి) హార్దిక్ 9; బాష్ (బి) దూబే 4; ఫెరీరా (బి) వరుణ్ 20; యాన్సెన్ (బి) వరుణ్ 2; నోర్జే (స్టంప్డ్) జితేశ్ (బి) కుల్దీప్ 12; ఎన్గిడి (నాటౌట్) 2; బార్ట్మన్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–7, 4–30, 5–44, 6–69, 7–77, 8–113, 9–115, 10–117. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–13–2, హర్షిత్ 4–0–34–2, హార్దిక్ పాండ్యా 3–0–23–1, వరుణ్ 4–0–11–2, శివమ్ దూబే 3–0–21–1, కుల్దీప్ 2–0–12–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) మార్క్రమ్ (బి) బాష్ 35; శుబ్మన్ (బి) యాన్సెన్ 28; తిలక్ వర్మ (నాటౌట్) 26; సూర్యకుమార్ (సి) బార్ట్మన్ (బి) ఎన్గిడి 12; శివమ్ దూబే (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–60, 2–92, 3–109. బౌలింగ్: ఎన్గిడి 3–0–23–1, యాన్సెన్ 3–0–24–1, బార్ట్మన్ 3.5–0–34–0, బాష్ 3–0–18–1, నోర్జే 3–0–14–0. -
న్యూ టీ20 మాస్ట్రో.. విరాట్ కోహ్లిని దాటేస్తాడా?
అభిషేక్ శర్మ.. టీ20 క్రికెట్లో భారత జట్టుకు దొరికిన అణిముత్యం. గతేడాది టీ20 దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అభిషేక్.. తన ఐపీఎల్ దూకుడును అంతర్జాతీయ వేదికపై కూడా కొనసాగిస్తున్నాడు. ఈ పంజాబ్ బ్యాటర్ అతి తక్కువ కాలంలోనే టీ20ల్లో వరల్డ్ నంబర్ బ్యాటర్గా ఎదిగాడు. యువరాజ్ సింగ్ వంటి లెజెండ్ కోచింగ్లో రాటుదేలిన అభిషేక్ టీ20ల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొదటి బంతి నుంచే భారీ షాట్ల ఆడే సత్తా అతడిది. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు.పరుగుల సునామీ..అభిషేక్ శర్మ గతేడాది జింబాబ్వేతో సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సిరీస్లోనే 183.33 స్ట్రైక్ రేట్తో 110 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 2024 ఏడాదిలో 11 ఇన్నింగ్స్లలో 23.27 సగటుతో 256 పరుగులు చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 171.81 ఉంది. మెరుగ్గా రాణించకపోయినప్పటికి తనకు పవర్ హిట్టింగ్ స్కిల్స్ కారణంగా టీమ్ మెనెజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. దీంతో మెనెజ్మెంట్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకున్నాడు. 2025 ఏడాదిలో పరుగులు సునామీ సృష్టించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ దాదాపుగా తన బ్యాట్కు పనిచెబుతున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 790 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్ధానంలో తిలక్ వర్మ(468) ఉన్నాడు.కోహ్లి రికార్డుపై కన్ను..ఈ డేంజరస్ బ్యాటర్ ఇప్పుడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డుపై కన్నేశాడు. ఒకే క్యాలెండర్ ఈయర్లో టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ)లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు అభిషేక్ చేరువయ్యాడు.ఆదివారం సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో 81 పరుగులు చేస్తే ఈ అరుదైన ఫీట్ను అందుకుంటాడు. అభిషేక్ ఇప్పటివరకు ఈ ఏడాది టీ20ల్లో 41.43 సగటుతో 1514 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. 2016లో కోహ్లి ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్తో కలిపి టీ20ల్లో 1614 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ సౌతాఫ్రికా సిరీస్ ముగిసేలోపు కోహ్లి ఆల్టైమ్ రికార్డు శర్మ బద్దలు కొట్టడం ఖాయం. అభిషేక్ ఐపీఎల్తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ-2025లోనూ దుమ్ములేపాడు. అయితే అభిషేక్ సఫారీలతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇంకా తన విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. అదేవిధంగా ఒకే క్యాలెండర్ ఈయర్లో వంద టీ20 సిక్స్లు పూర్తి చేసుకున్న ఏకైక భారత ఆటగాడిగా కూడా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.విరాట్ కోహ్లి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 125 మ్యాచ్లు ఆడి 4188 పరుగులు చేయగా.. అభిషేక్ ఇప్పటివరకు 31 మ్యాచ్లలో 1046 పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి టీ20 కెరీర్లో 13543 పరుగులు ఉండగా .. అభిషేక్ 4849 రన్స్ చేశాడు.చదవండి: IPL 2026: కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్గా అతడే? -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్గా శుబ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో గిల్తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్లోనూ సంజూకు ఓపెనర్గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో ముల్లన్పూర్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్గా గిల్ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా, బ్యాటర్గా మెరుగ్గా ఆడుతున్న గిల్ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
ఉప్పల్, జింఖానా మైదానాల్లో నేటి మ్యాచ్లకు ప్రేక్షకులకు ‘నో ఎంట్రీ’
హైదరాబాద్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లకు ప్రేక్షకులను అనమతించబోమని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీ టి20 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్ ‘సి’ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 2న ఉప్పల్ స్టేడియంలో పంజాబ్, బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరగగా... పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. భారత స్టార్ ఆటగాళ్లుహార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఆడుతుండటంతో వారిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. సరైన సెక్యూరిటీ లేకపోవడంతో... పలువురు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి స్టార్ ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తంకావడంతో... ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా హెచ్సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్తో పాటు జింఖానా మైదానంలో సోమవారం జరిగే మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించబోమని హెచ్సీఏ తెలిపింది. -
అభిషేక్ శర్మ రేర్ రికార్డు.. రోహిత్, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్లో టీ20ల్లో 100 సిక్స్ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు ఐపీఎల్, ఆసియాకప్, ఆసీస్ టూర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.పంజాబ్ ఘన విజయంఇక ఈ మ్యాచ్లో సర్వీసెస్ టీమ్ను 73 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అభిషేక్తో పాటు ఫ్రబ్సిమ్రాన్ సింగ్(50), నమన్ ధీర్(54) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, హర్ప్రీత్ తలా రెండు వికెట్లు సాధించారు. -
అభిషేక్ ఆల్రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (9 బంతుల్లో 34; 4 ఫోర్లు, 3 సిక్స్లు; 3/23) ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 54 పరుగుల తేడాతో పుదుచ్చేరిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... సలీల్ అరోరా (44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), సాన్వీర్ సింగ్ (38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), రమణ్దీప్ సింగ్ (34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తలాకొన్ని పరుగులు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో విజయ్ రాజా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సిదాక్ సింగ్ (61; 6 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అభిషేక్ 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆయుశ్ గోయల్ 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్లాడిన పంజాబ్ 3 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో హర్యానా 7 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై గెలిచింది. ముంబైకి కేరళ షాక్ ముస్తాక్ అలీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టుకు షాక్ తగిలింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 15 పరుగుల తేడాతో కేరళ చేతిలో పరాజయం పాలైంది. మొదట కేరళ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు వినోద్ (43 నాటౌట్; 3 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (32; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షర్ఫుద్దీన్ (15 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ముంబై జట్టు అనూహ్యంగా ఓడింది. లక్ష్యం పెద్దది కాకపోయినా... ముంబై జట్టు 19.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్ సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్ (40 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32; 4 ఫోర్లు), అజింక్యా రహానే (32; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కేరళ బౌలర్ కేఎమ్ ఆసిఫ్ మ్యాచ్ను మలుపుతిప్పాడు. తొలి బంతికి సాయిరాజ్ పాటిల్ (13)ను అవుట్ చేసిన అతడు... మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్ను, నాలుగో బంతికి శార్దుల్ ఠాకూర్ (0)ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడిలో పడ్డ ముంబై విజయానికి దూరమైంది. ఆసిఫ్ 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్ల్లో రాజస్తాన్ 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై, అస్సాం 58 పరుగుల తేడాతో విదర్భపై, ఉత్తరప్రదేశ్ 40 పరుగుల తేడాతో చండీగఢ్పై, జార్ఖండ్ 7 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్పై, గోవా 5 వికెట్ల తేడాతో బిహార్పై, ఢిల్లీ 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, ఒడిశా ఒక పరుగు తేడాతో రైల్వేస్పై, మధ్యప్రదేశ్ 21 పరుగుల తేడాతో మహారాష్ట్రపై, తమిళనాడు 61 పరుగుల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి. -
అభిషేక్ శర్మ విధ్వంసం.. కేవలం 9 బంతుల్లోనే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ములేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్.. గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్లతో 34 పరుగులు చేశాడు. అతడితో పాటు సలీల్ అరోరా(44), రమణ్దీప్ సింగ్(34), శన్వీర్ సింగ్(38) కీలక నాక్స్ ఆడారు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో రాజా రెండు, అయూబ్ తండా, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సైదక్ సింగ్(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అభిషేక్ శర్మ బౌలింగ్లో కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు అయూష్ గోయల్ మూడు, హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు సాధించారు.కాగా ఈ టోర్నీలో బెంగాల్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో పంజాబ్ జట్టు నుంచి అభిషేక్ వైదొలిగే అవకాశముంది. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి! -
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
-
అభిషేక్ శర్మ షాక్.. అభిమానమా... దురభిమానమా!
సాక్షి, హైదరాబాద్: 42 ఫోర్లు... 20 సిక్సర్లు... ఇరు జట్లు కలిపి 446 పరుగులు నమోదు చేశాయి... ఒక టి20 మ్యాచ్లో అభిమానుల వినోదానికి ఇంతకంటే ఏం కావాలి! చాలా రోజుల తర్వాత హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ తరహాలో ఒక టి20 మ్యాచ్ను మైదానంలో ఫుల్ జోష్తో ఆస్వాదించారు. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్, బరోడా జట్ల మధ్య జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో ఈ పరుగుల పండగ కనిపించింది. ప్రవేశం ఉచితమైనా సరే... సాధారణంగా దేశవాళీ మ్యాచ్లకు ప్రేక్షకులు మైదానానికి రావడం తక్కువ. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న ముస్తాక్ అలీ టి20 టోర్నీ మ్యాచ్లలో అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అయితే అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఆడుతుండటంతో పంజాబ్, బరోడా మ్యాచ్పై బాగా ప్రచారం జరిగింది. దాంతో పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఈస్ట్, వెస్ట్ గ్యాలరీలలోకి వారిని అనుమతించారు. ఇక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అసలు సమస్య అభిమానులు చప్పట్లతో సరిపెట్టకుండా మైదానంలోకి దూసుకుపోవడంలోనే కనిపించింది! ఒకటి కాదు, రెండు కాదు నాలుగు సార్లు కొందరు ఫ్యాన్స్ గ్యాలరీల్లోంచి దూకి గ్రౌండ్లోకి వచ్చేశారు. ఇక్కడ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గ్రౌండ్ సెక్యూరిటీతో పరిమిత సంఖ్యలోనే పోలీసులు ఉండటంతో నియంత్రణ సాధ్యం కాలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఈ మ్యాచ్ల కోసం కనీస ఏర్పాట్లు చేయలేకపోయిందనేది స్పష్టం. భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పేలవ రీతిలో నిర్వహిస్తున్నట్లు ఇది చూపించింది. ఆటగాళ్లకు చేరువగా వెళ్లడం, చేతులు కలపడం, కాళ్లు మొక్కడం మాత్రమే కాదు ఏకంగా సెల్ఫీలు తీసుకోవడం, కౌగిలించుకునే ప్రయత్నం చేయడం అభిషేక్ శర్మను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది! ఇది నిజంగా దురభిమానంగా మారి ఏదైనా ప్రమాదం తలెత్తి ఉంటే బాధ్యత ఎవరిది? -
మరోసారి దడదడలాడించిన అభిషేక్ శర్మ
ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.ఈ టోర్నీలో పంజాబ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అనంతరం రాజ్ లింబాని బౌలింగ్లో ఔటయ్యాడు. అభిషేక్తో పాటు అన్మోల్ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. నమన్ ధిర్ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్ రావత్ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. -
నేడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. హార్దిక్ పాండ్యా X అభిషేక్ శర్మ
సాక్షి, హైదరాబాద్: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా నేడు పంజాబ్తో జరిగే మ్యాచ్లో బరోడా తరఫున హార్దిక్ ఆడనున్నాడు. ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్లో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో గాయపడిన హార్దిక్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సెప్టెంబర్ 26న అతను చివరిసారిగా మ్యాచ్ (శ్రీలంకతో) ఆడాడు. ఈ మ్యాచ్లో కండరాల గాయంతో తప్పుకున్న పాండ్యా కొంత విశ్రాంతి తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు చేరుకున్నాడు. అక్టోబర్ 15 నుంచి మధ్యలో మూడు రోజుల దీపావళి సెలవు మినహా నవంబర్ 29 వరకు అక్కడే ఉండి పూర్తిగా కోలుకునే వరకు రీహాబిలిటేషన్ కొనసాగించాడు. మ్యాచ్ ఆడేందుకు పాండ్యా సోమవారం హైదరాబాద్కు చేరుకున్నాడు. హార్దిక్ ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేసేందుకు మ్యాచ్ ఫిట్గా మారాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) సర్టిఫికెట్ ఇచ్చింది. ‘దాదాపు నలభై రోజుల పాటు సీఓఈ బయటకు కూడా పోకుండా పాండ్యా పూర్తి స్థాయి రీహాబిలిటేషన్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్స్ను అన్ని విధాలా పాటించాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడటమే మిగిలింది’ అని సీఓఈ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రజ్ఞాన్ ఓజా సమక్షంలో... నిజానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాండ్యా డిసెంబర్ 4న గుజరాత్తో జరిగే మ్యాచ్లో ఆడాల్సి ఉంది. అయితే బీసీసీఐ సెలక్టర్, హైదరాబాద్కే చెందిన ప్రజ్ఞాన్ ఓజా ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కనీసం రెండు మ్యాచ్లలో హార్దిక్ ఆట, ఫిట్నెస్ను పరీక్షించాలని సెలక్టర్లు భావించారు. దాంతో నేడు, గురువారం జరిగే రెండు మ్యాచ్లు హార్దిక్ ఆడతాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో అతని ప్రదర్శన కీలకం కానుంది. అభిషేక్ మళ్లీ చెలరేగేనా! భారత ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ సభ్యుడు అభిషేక్ శర్మ మరోసారి తన టి20 మెరుపులను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం జింఖానా మైదానంలో బెంగాల్తో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 16 సిక్స్లతో 148 పరుగులు బాదిన అభిషేక్ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గత పోరులో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్, కెపె్టన్ కృనాల్ పాండ్యా మినహా పెద్ద అనుభవం లేని బరోడా బౌలింగ్ అతడిని ఏమాత్రం నిలువరించగలదో చూడాలి. -
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
-
శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. బెంగాల్తో ఆదివారం నాటి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పంజాబ్ కెప్టెన్.. భారీ శతకం బాదాడు. కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకున్నాడు.ఆది నుంచే బౌలర్లపై అటాక్దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (SMAT)లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘సి’లో పంజాబ్- బెంగాల్ (Punjab Vs Bengal) తలపడ్డాయి. హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) ఆది నుంచే బెంగాల్ బౌలర్లపై దాడికి దిగారు.148 పరుగులుఆకాశమే హద్దుగా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 148 పరుగులు సాధించాడు. అయితే, ఆకాశ్ దీప్ బౌలింగ్లో వ్రితిక్ ఛటర్జీకి క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది.మరోవైపు.. ప్రభ్సిమ్రన్ సింగ్ 35 బంతుల్లోనే 70 పరుగుల సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లతో పాటు 4 సిక్స్లు ఉన్నాయి. మిగతా వారిలో రమణ్దీప్ సింగ్ (15 బంతుల్లో 39), సన్వీర్ సింగ్ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. అన్మోల్ప్రీత్ సింగ్ (6 బంతుల్లో 11) కాస్త నిరాశపరిచాడు.ఇక నమన్ ధిర్ (2 బంతుల్లో 7), నేహాల్ వధేరా (2 బంతుల్లో 2) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన పంజాబ్ ఏకంగా 301 పరుగులు సాధించింది. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మొహమ్మద్ షమీ, షక్షైమ్ చౌదరి, ప్రదీప్త ప్రామాణిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 198 పరుగులే చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగాల్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టగా.. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్స్లు బాది 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.అభిమన్యుకు తోడుగా.. పేసర్ ఆకాశ్ దీప్ (7 బంతుల్లో 31) ఒక్కడే మెరుపు వేగంతో పరుగులు రాబట్టాడు. అయితే, మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పంజాబ్ చేతిలో బెంగాల్ ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నేహాల్ వధేరా, గుర్నూర్ బ్రార్ చెరో రెండు.. అభిషేక్ శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు. భారీ సెంచరీతో కదం తొక్కి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మబెంగాల్తో మ్యాచ్లో 148 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ (16 సిక్సర్లు) అరుదైన రికార్డు సాధించాడు. టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో 17 సిక్స్లు (146 నాటౌట్)తో మేఘాలయ బ్యాటర్ పునిత్ బిస్త్ అగ్రస్థానంలో ఉన్నాడు.కాగా టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్గా తిలక్ వర్మ కొనసాగుతున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో ఈ హైదరాబాదీ 67 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్స్లు ఉన్నాయి.చదవండి: IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్కు చోటు.. పంత్కు నో ఛాన్స్ -
అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
మాంసం కొట్టులో పని.. ఆసీస్ గడ్డపై ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర
ఆస్ట్రేలియా గడ్డపై ఓ ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్ ఫస్ట్క్లాస్ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. అతడే నిఖిల్ చౌదరి. గిల్ సహచర క్రికెటర్ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి.. దేశీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill).. భారత స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. అయితే, భారత్లో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు.ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్ చౌదరి.. కోవిడ్-19 (Covid 19)లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు భారత్కు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ కావాలన్న అతడి కల మాత్రం అలాగే ఉండిపోయింది.మాంసం కొట్టులో పనిఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో నిఖిల్ చౌదరి.. శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం కొట్టులో పని చేయడంతో పాటు.. పార్శిళ్లు అందించే డెలివరీ బాయ్గా.. ఉబర్ క్యాబ్ డ్రైవర్గా.. ఇలా ఎన్నో పనులు చేశాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు.కొన్నాళ్ల తర్వాత నిఖిల్ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్ హ్యారికేన్స్కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్ చౌదరి.. పాకిస్తాన్ ఓవరాక్షన్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో సిక్సర్ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది.సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఆసీస్ దేశీ క్రికెట్ జట్ల యాజమాన్యాలను ఆకర్షించిన నిఖిల్ చౌదరికి ఊహించని విధంగా ఓ అవకాశం వచ్చింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు జాతీయ జట్టులోకి వెళ్లగా.. టాస్మేనియా జట్టు నుంచి నిఖిల్కు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అతడు జట్టులో భాగమైపోయాడు.ఆసీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్ ఇటీవలే సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూ సౌత్ వేల్స్తో మ్యాచ్లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. శతక్కొట్టాడు. 184 బంతుల్లోనే 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆసీస్ దేశీ రెడ్బాల్ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి క్రికెటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్మేనియా న్యూ సౌత్ వేల్స్పై ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో గెలవడం విశేషం.ఫాస్ట్ బౌలర్గా మొదలుపెట్టి..ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి పంజాబ్లో పెరిగాడు. పంజాబ్ తరఫున అన్ని ఏజ్ గ్రూపులలోనూ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్తో సమయం గడిపే అవకాశం అతడికి వచ్చింది. నిజానికి నిఖిల్ తొలుత ఫాస్ట్ బౌలర్ కావాలని భావించాడు.అయితే, కాలక్రమేణా తన నైపుణ్యాలకు మెరుగు దిద్దుకుని లెగ్ స్పిన్నర్గా ఎదిగాడు. ఐపీఎల్ ట్రయల్స్లో ముంబై ఇండియన్స్ సెలక్షన్కు వెళ్లినప్పటికీ నిఖిల్కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన 29 ఏళ్ల నిఖిల్.. అక్కడి స్థానిక క్లబ్లలో ఆడుతూ టాస్మేనియా జట్టులో కుదురుకున్నాడు.చదవండి: స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఏం జరిగింది? -
ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు! కెప్టెన్ ఎవరంటే..
ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)కు భారీ షాక్ తగిలింది. గతేడాది కోట్లు కుమ్మరించి అతడిని కొనుక్కున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఈసారి మాత్రం ఆక్షన్లోకి విడిచిపెట్టేసింది. అన్నీ కుదిరితే కేకేఆర్ వెంకటేశ్ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ 2025లో అతడి ప్రదర్శన దృష్ట్యా ఇది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది.ఏకంగా రూ. 23.75 కోట్లుకాగా మధ్యప్రదేశ్కు చెందిన వెంకటేశ్ అయ్యర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. రూ. 20 లక్షలకు 2021లో కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. అదే ఏడాది వెంకటేశ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. పది మ్యాచ్లలో కలిపి 370 పరుగులతో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ను 2022లో ఏకంగా రూ. 8 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది.ఇక గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో వెంకీ తన వంతు పాత్ర పోషించాడు. 15 మ్యాచ్లలో కలిపి 370 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్.. ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో వెంకటేశ్ వేలంలోకి వెళ్లినా కేకేఆర్ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఈసారి అతడు పూర్తిగా విఫలమయ్యాడు.ఆల్టైమ్ టీ20 ఎలెవన్ఐపీఎల్-2025లో పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. దీంతో కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ను వేలంలోకి విడిచిపెట్టింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 16న అబుదాబి వేదికగా వేలంపాట జరుగనున్న నేపథ్యంలో క్రిక్ట్రాకర్కు వెంకీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్టైమ్ టీ20 ఎలెవన్ను వెంకటేశ్ అయ్యర్ ప్రకటించాడు.రోహిత్, కోహ్లికి దక్కని చోటుఅయితే, వెంకీ ఎంచుకున్న టీ20 ఆల్టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రో-కోకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.ఓపెనర్లుగా వీరూ, అభిషేక్ఇక తన జట్టులో ఓపెనర్లుగా భారత విధ్వంసకర బ్యాటర్లు వీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మను ఎంచుకున్న వెంకీ.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను వన్డౌన్లో ఆడిస్తానని తెలిపాడు. మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనాను ఎంపిక చేసుకున్న అతడు.. తన జట్టులో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుకు చోటిచ్చాడు.ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్తో పాటు టీమిండియా మేటి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెంకీ ఈ మేరకు తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక ఏడో స్థానానికి, వికెట్ కీపర్ బ్యాటర్గా.. కెప్టెన్గా టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్నాడు.బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ దిగ్గజం సునిల్ నరైన్లకు చోటు ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్.. పేస్ దళంలో భారత మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలను ఎంచుకున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్కు వెంకీ స్థానమిచ్చాడు.వెంకటేశ్ అయ్యర్ ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మ, ఏబీ డివిలియర్స్, సురేశ్ రైనా, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్: మాథ్యూ హెడెన్. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్స్వామి(33) టాప్ స్కోరర్గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు.రుతురాజ్ మెరుపులు.. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్ -
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఐపీఎల్-2026 వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని.. లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది ఎస్ఆర్హెచ్. తాజాగా వచ్చే సీజన్కు గానూ అట్టిపెట్టుకునే, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా (Adam Zampa), సిమర్జీత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్సును నింపుకొంది. షమీని ట్రేడ్ చేయడం ద్వారా రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ను సన్రైజర్స్ వేలంలోకి వదల్లేదు.అతడు జట్టుతోనే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రవిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు.. క్లాసెన్ను అట్టిపెట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజేయ శతకం (105) ఉండటం విశేషం.ఈ సీజన్లో సన్రైజర్స్ పద్నాలుగింట కనీసం ఆరైనా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్లలో క్లాసెన్ ముఖ్యుడు. అయితే, అతడి ప్రైజ్ ట్యాగ్ (రూ. 23 కోట్లు) కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా.. ఫ్రాంఛైజీ మాత్రం ఆ పని చేయలేదు.పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లురాబోయే సీజన్కు ముందు మొత్తానికి సన్రైజర్స్ ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండగా.. ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్ చేయడం ద్వారా సన్రైజర్స్ పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా పది స్లాట్లు ఖాళీ ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది.సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరేరాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
రుతురాజ్ సూపర్ సెంచరీ.. భారత్ ఘన విజయం
రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో రుతురాజ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించిన గైక్వాడ్ వికెట్కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.వరుస క్రమంలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియన్కు చేరినప్పటికి.. రుతురాజ్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఈ మహారాష్ట్ర బ్యాటర్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో తన 16వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా చిత్తు..రుతురాజ్తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్ రెడ్డి(37), నిషాంత్ సింధు(29) రాణించారు. ఫలితంగా భారత-ఎ జట్టు ప్రోటీస్పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు 6 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది.అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటిస్ పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో), బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.అభిషేక్ ఫెయిల్..కాగా 50 ఓవర్ల ఫార్మాట్లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. ఈ పంజాబ్ క్రికెటర్ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
సంజూ, గిల్ కాదు!.. వాళ్లిద్దరే సరిజోడి
భారత టీ20 జట్టులో శుబ్మన్ గిల్ (Shubman Gill) అవసరమా?.. క్రికెట్ వర్గాల్లో చాన్నాళ్లుగా ఇదే చర్చ. టెస్టు, వన్డేల్లో సత్తా చాటుతూ ఏకంగా కెప్టెన్గా ఎదిగిన ఈ పంజాబీ బ్యాటర్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోవడం ఇందుకు కారణం.దాదాపు ఏడాది కాలం పాటు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్ను.. సెలక్టర్లు ఆసియా కప్ సందర్భంగా వైస్ కెప్టెన్గా తిరిగి తీసుకువచ్చారు. దీంతో అప్పటిదాకా ఓపెనింగ్ జోడీగా పాతుకుపోయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma)- సంజూ శాంసన్ (Sanju Samson) విడిపోయారు.అంతంత మాత్రమేగిల్ ఓపెనర్గా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం అంటూ లేకుండా పోయింది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ గిల్ మరోసారి టీ20 ఫార్మాట్లో తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కేవలం 132 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో మరోసారి గిల్ విమర్శలు పాలయ్యాడు. అతడి కారణంగా సంజూ శాంసన్తో పాటు యశస్వి జైస్వాల్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత టీ20 ఓపెనింగ్ జోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అశ్ కీ బాత్లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్కు.. టీ20లకు ఎలాంటి పోలికా ఉండదు. ప్రతి ఫార్మాట్ దేనికదే ప్రత్యేకం. ఏదేమైనా రెండు ఫార్మాట్లలో జైస్వాల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు.పవర్ ప్లేలో సూపర్టెస్టుల్లో పరుగులు చేయడం ద్వారా అతడు టీ20 జట్టులోకి రాలేడు. కానీ ఇప్పటికే పొట్టి క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 160కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సూపర్గా ఆడతాడు.అతడి సగటు కూడా బాగుంది. ప్రస్తుతం అభిషేక్ శర్మతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సత్తా జైస్వాల్కే ఉంది. ఒకవేళ టీమిండియా అగ్రెసివ్ ఓపెనర్లను కోరుకుంటే వీళ్లిద్దరే సరిజోడి. అలా కాకుండా ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్- గిల్ జోడీవైపు మొగ్గు చూపవచ్చు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.వాళ్లిద్దరే సరి జోడీఅభిషేక్ శర్మ దూకుడుగా ఆడితే.. గిల్ మాత్రం నెమ్మదిగా ఆడతాడనే ఉద్దేశంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇటీవల మరో మాజీ క్రికెటర్ రమేశ్ సదగోపన్ మాట్లాడుతూ.. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్లో గిల్.. టేబుల్ ఫ్యాన్ను తలపిస్తున్నాడంటూ విమర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ ఉన్నంత వరకు టేబుల్ ఫ్యాన్పై దృష్టి పడదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీమిండియా.. స్వదేశంలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే -
'అతడు లేకపోవడం కలిసొచ్చింది.. వారి వల్లే చెలరేగుతున్నాను'
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టీ20 వర్షార్ఫణమైంది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ పంజాబీ క్రికెటర్ మొత్తంగా 161.39 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్క్ అందుకున్న క్రికెటర్గా అభిషేక్(528) నిలిచాడు."ఆ్రస్టేలియా పర్యటన కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. ఇక్కడ పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి. అక్కడి పరిస్ధితులకు తగ్గట్టుగా నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. మేము మరింత భారీ స్కోర్లు సాధించాల్సింది. అయితే జట్టు సిరీస్ గెలవడం ముఖ్యం. జోష్ హేజిల్వుడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోవడం ఏ జట్టుకైనా ప్రయోజనకరమే. కానీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా అటువంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇక టీమ్ మేనేజ్మెంట్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. నేను వరుసగా 15 మ్యాచ్లలో డకౌట్ అయినా నా స్థానానికి ఢోకా ఉండదని చెప్పింది. అందుకే తొలి బంతినుంచే ధైర్యంగా, దూకుడుగా ఆడగలుగుతున్నా. తొలిసారి టి20 ప్రపంచ కప్లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అభిషేక్ పేర్కొన్నాడు. చదవండి: ‘బంగభూషణ్’ రిచా ఘోష్ -
మ్యాచ్ రద్దు... మన ఖాతాలో సిరీస్
బ్రిస్బేన్: వర్షంతో మొదలైన భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ చివరకు వర్షంతోనే ముగిసింది. శనివారం ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టి20 మ్యాచ్ వాన కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షం ఎంతకీ తగ్గలేదు. దాంతో చివరకు ఆటను అంపైర్లు రద్దు చేయక తప్పలేదు. ఆడింది 29 బంతులే అయినా ఓపెనర్లు అభిషేక్ శర్మ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (16 బంతుల్లో 29 నాటౌట్; 6 ఫోర్లు) క్రీజ్లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో అభిషేక్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి ఓవర్లోనే 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన సులువైన క్యాచ్ను మ్యాక్స్వెల్ వదిలేయగా, 11 పరుగుల వద్ద మరో క్యాచ్ను డ్వార్షుయిస్ అందుకోలేకపోయాడు. మరో వైపు డ్వార్షుయిస్ ఓవర్లోనే 4 ఫోర్లు బాది గిల్ ధాటిని చూపించాడు. 161.38 స్ట్రైక్రేట్తో మొత్తం 163 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ తొలి మ్యాచ్ రద్దు కాగా, మెల్బోర్న్లో జరిగిన రెండో పోరులో ఆసీస్ గెలిచింది. ఆ తర్వాత హోబర్ట్, కరారాలలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పైచేయి సాధించిన భారత్ చివరకు 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. భారత్ తమ తర్వాతి పోరులో సొంతగడ్డపై నవంబర్ 14 నుంచి జరిగే టెస్టు సిరీస్లో బరిలోకి దిగనుండగా... నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్తో ‘యాషెస్’లో ఆసీస్ తలపడుతుంది. ‘తొలి మ్యాచ్ ఓడిన తర్వాత కోలుకొని గెలిపించిన జట్టు సభ్యులకు అభినందనలు. ప్రతీ ఒక్కరికి తమ బాధ్యతపై స్పష్టత ఉంది. పేసర్లు, స్పిన్నర్లు అంతా సమష్టిగా రాణించారు. దాని వల్లే మేం అనుకున్న ప్రణాళికలను సమర్థంగా అమలు చేయగలిగాం. ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్న ఎంతో మంది ప్లేయర్లు మా జట్టులో ఉండటం చాలా మంచి విషయం. వరల్డ్ కప్కు ముందు ఉన్న 2–3 సిరీస్లు సన్నాహకంగా ఉపయోగపడతాయి. జట్టులోని ప్రతీ ఒక్కరికి తమదైన ప్రత్యేక ప్రతిభ ఉండటం కెపె్టన్గా నా అదృష్టం. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గత కొన్ని నెలలుగా మంచి ఫలితాలు సాధించగలిగాం. ఎలాంటి లోపాలు లేవని చెప్పను. ఎందుకంటే నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది’ –సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్ 528 ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లో అత్యంత వేగంగా (528 బంతుల్లో) 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో ఐదో టీ20 సందర్భంగా శనివారం నాటి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు.పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటి.. గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో..ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో ఉన్న అభిషేక్ శర్మ.. కంగారూ గడ్డపై సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగా ఆసీస్తో ఆడిన నాలుగు టీ20లలో వరుసగా.. 19, 68, 25, 28 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున ఇప్పటి వరకు 28 మ్యాచ్లు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. 521 బంతుల్లో 989 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా బ్రిస్బేన్లో ఆఖరిదైన ఐదో టీ20లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో గాబా మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ ధనాధన్ దంచికొట్టడంతో 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు సాధించింది. మెరుపులు... వర్షం మొదలుకావడంతో అక్కడికి ఆటను ఆపివేశారు. ఆటగాళ్లను డ్రెసింగ్రూమ్లోకి పిలిచారు.రెండుసార్లు లైఫ్కాగా ఈ మ్యాచ్లో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ శర్మకు లైఫ్ లభించింది. అతడు ఇచ్చిన క్యాచ్ను గ్లెన్ మాక్స్వెల్ జారవిడిచాడు. అదే విధంగా.. పదమూడు పరుగుల వద్ద ఉన్న వేళ బెన్ డ్వార్షుయిస్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిషేక్కు మరో లైఫ్ వచ్చింది.ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పదకొండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ టీ20లలో ఈ లెఫ్టాండర్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు తీసుకున్న బంతులు కేవలం 528.ప్రపంచ రికార్డుతద్వారా అతి తక్కువ బంతుల్లోనే ఈ మైలురాయి చేరుకున్న క్రికెటర్గా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న రెండో భారత బ్యాటర్గానూ నిలిచాడు. కాగా ఆట నిలిచేసరికి అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23, శుబ్మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు🏏అభిషేక్ శర్మ- 528 బంతుల్లో🏏సూర్యకుమార్ యాదవ్- 573 బంతుల్లో🏏ఫిల్ సాల్ట్- 599 బంతుల్లో🏏గ్లెన్ మాక్స్వెల్- 604 బంతుల్లో🏏ఆండ్రీ రసెల్, ఫిన్ అలెన్- 609 బంతుల్లో.తక్కువ ఇన్నింగ్స్లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు🏏విరాట్ కోహ్లి- 27 ఇన్నింగ్స్లో🏏అభిషేక్ శర్మ- 28 ఇన్నింగ్స్లో🏏కేఎల్ రాహుల్- 29 ఇన్నింగ్స్లో🏏సూర్యకుమార్ యాదవ్- 31 ఇన్నింగ్స్లో🏏రోహిత్ శర్మ- 40 ఇన్నింగ్స్లో.చదవండి: భారత జట్టుకు ఘోర పరాభవం.. కువైట్, యూఏఈ చేతిలో చిత్తు Pace off from the bowler, POWER ON from #AbhishekSharma! 🧨🤩Absolutely smashed over the ropes for a flat six! 💪#AUSvIND 👉 5th T20I | LIVE NOW 👉 https://t.co/KVDenaqq4f pic.twitter.com/aGYxqj5hhP— Star Sports (@StarSportsIndia) November 8, 2025 -
అభిషేక్ శర్మపై సూర్యకుమార్ సెటైర్లు.. ఓపెనర్ రియాక్షన్ ఇదే
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘సింహం గడ్డి తినడం ఎప్పుడైనా చూశారా? .. ఈరోజు సింహం మెల్లమెల్లగా గడ్డి తినడం మొదలుపెట్టింది’’ అంటూ సరదాగా సెటైర్లు వేశాడు. ఇంతకీ ఇందుకు కారణం ఏమిటంటే?..మెరుగ్గానే..ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ (IND vs AUS T20Is)లో అభిషేక్ శర్మ మెరుగ్గా రాణిస్తున్నాడు. కాన్బెర్రా వేదికగా వర్షం కారణంగా అర్థంతరంగా రద్దైపోయిన తొలి టీ20లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 14 బంతుల్లో 19 (4 ఫోర్లు, స్ట్రైక్ రేటు- 135.71) పరుగులు రాబట్టాడు. ఇక మెల్బోర్న్లో జరిగిన రెండో టీ20లో అభిషేక్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 37 బంతుల్లోనే 68 పరుగులతో చెలరేగాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్రేటు 183.78.అదే విధంగా..హోబర్ట్లో జరిగిన మూడో టీ20లోనూ అభిషేక్ ఫర్వాలేదనిపించాడు. 16 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 156కు పైగా స్ట్రైక్రేటుతో 25 పరుగులు చేశాడు. అయితే, క్వీన్స్లాండ్లో గురువారం ముగిసిన నాలుగో టీ20లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది.. 28 రన్స్ రాబట్టాడు. స్ట్రైక్రేటు 133.33.2-1తో ఆధిక్యంలోఇక ఆసీస్తో ఇప్పటికి నాలుగు టీ20లు ముగించుకున్న టీమిండియా.. రెండో టీ20లో ఓడి.. వరుసగా మూడు, నాలుగో మ్యాచ్లో గెలిచింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం బ్రిస్బేన్లో నిర్ణయాత్మక ఐదో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.నవ్వుతూనే సెటైర్లు.. అభిషేక్ రియాక్షన్ ఇదేఈ నేపథ్యంలో బ్రిస్బేన్కు పయనమవుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ శర్మతో సరదాగా అన్న మాటలు వైరల్గా మారాయి. నాలుగో టీ20లో అభిషేక్ స్ట్రైక్రేటును ఉద్దేశించి.. ‘‘సింహం గడ్డి తింటుందా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది’’ అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశాడు. ఇందుకు బిత్తరపోయిన అభిషేక్ తేరుకుని.. తనూ గట్టిగా నవ్వేశాడు.కాగా నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్.. నాలుగో స్థానంలో వచ్చి 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో టీ20లోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ సారథ్యంలో ఆసీస్తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. దీంతో వన్డే కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే గిల్ ఓటమి రుచిచూశాడు. అంతకు ముందు ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన గిల్ 2-2తో ఐదు మ్యాచ్ల సిరీస్ను సమం చేసి ఫర్వాలేదనిపించాడు.చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’SuryaKumar Yadav on Abhishek Sharma slow inning 😅#INDvsAUS #SuryakumarYadav pic.twitter.com/aRdMXjtMWQ— Vishal kr (@vishal_kr_31) November 6, 2025 -
IND vs AUS: ఆసీస్ను చిత్తు చేసిన భారత్
టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 18.2 ఓవర్లలో కేవలం 119 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.వారెవ్వా వాషీ.. అదరగొట్టిన అక్షర్, శివంలక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. జోష్ ఇంగ్లిస్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), మార్కస్ స్టొయినిస్ (17) తీవ్రంగా నిరాశపరచగా.. గ్లెన్ మాక్స్వెల్ (2), బెన్ డ్వార్షుయిస్ (5), జేవియర్ బార్ట్లెట్ (0), నాథన్ ఎల్లిస్ (2 నాటౌట్), ఆడం జంపా (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేట్, శివం దూబే చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ ఆలౌట్18.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జంపా (0).. గిల్కు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ విజయం ఖరారైంది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా17.6: బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన డ్వార్షుయిస్ (5). స్కోరు: 118-9(18). విజయానికి చేరువైన టీమిండియా.ఎనిమిదో వికెట్ డౌన్16.5: వాషీ బౌలింగ్లో బార్ట్లెట్ బౌల్డ్ (0). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్. స్కోరు: 116-8(16.5). ఆసీస్ విజయానికి 19 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియాకు కేవలం రెండు వికెట్లు కావాలి.ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా16.4: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో స్టొయినిస్ (17) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా14.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్స్వెల్ బౌల్డ్ (4 బంతుల్లో 2). దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 8 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 103-6 (15).ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా13.1: ఫిలిప్ (10 బంతుల్లో 10) రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో అతడు వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 98-5(13.1). స్టొయినిస్ ఐదు పరుగులతో ఉండగా.. మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా11.3: శివం దూబే బౌలింగ్లో సూర్యకుమార్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 14). స్కోరు: 91-4(11.3). జోష్ ఫిలిప్ 8 పరుగులతో ఉండగా.. స్టొయినిస్క్రీజులోకి వచ్చాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: శివం దూబే బౌలింగ్లో మార్ష్ అర్ష్దీప్నకు క్యాచ్ ఇచ్చి మార్ష్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. మార్ష్ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడి స్థానంలో జోష్ ఫిలిప్ క్రీజులోకి రాగా.. టిమ్ డేవిడ్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 70-3(9.2).రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా8.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లిస్. 11 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ స్కోరు: 67-2(8.5). విజయానికి 67 బంతుల్లో 101 పరుగుల దూరంలో ఆసీస్ ఉండగా.. టీమిండియాకు ఎనిమిది వికెట్లు కావాలి. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగా.. మార్ష్ 30 పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా4.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ దీనిని నాటౌట్గా ప్రకటించగా.. టీమిండియా రివ్యూకు వెళ్లి విజయవంతమైంది. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లిస్ క్రీజులోకి రాగా.. మార్ష్ 12 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 39-1(5).రెండు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 11-0షార్ట్ ఆరు, మార్ష్ ఐదు పరుగులతో ఉన్నారు.ఆసీస్ టార్గెట్ ఎంతంటే?క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓ దశలో 200 పరుగుల మార్క్ను దాటేలా కన్పించిన మెన్ ఇన్ బ్లూ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది.భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(46) టాప్ స్కోరర్గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించాడు.ఏడో వికెట్ డౌన్..152 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సెందర్.. ఎల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్16.4: జితేశ్ శర్మను జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో జితేశ్ (4 బంతుల్లో 3) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. వాషీ ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 136-6(16.5). ఐదో వికెట్ డౌన్16.1: ఆడం జంపా బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చిన తిలక్ వర్మ (6 బంతుల్లో 5) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రావడంతోనే ఫోర్ బాదగా.. జితేశ్ 3 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 135-5(16.2) నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.1: బార్ట్లెట్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన సూర్య (10 బంతుల్లో 20). స్కోరు: 125-4(15.1). జితేశ్ శర్మ క్రీజులోకి రాగా.. తిలక్ రెండు పరుగులతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన భారత్14.1: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ గిల్(39 బంతుల్లో 46) బౌల్డ్. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 121-3(14.1). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. సూర్య 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్ కోల్పోయిన భారత్11.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన శివం దూబే. 18 బంతులు ఎదుర్కొన దూబే ఓ ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి ఎల్లిస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 88-2(11.3). గిల్ 34 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 75-1.శివం దూబే 11, గిల్ 33 పరుగులతో ఆడుతున్నారు.భారత్ తొలి వికెట్ డౌన్..6.4: 56 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఆడమ్ జంపా బౌలింగ్లో డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న గిల్..4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(18), అభిషేక్ శర్మ(12) దూకుడుగా ఆడుతున్నారు.టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడుతున్నాయి. కరారా ఓవల్లో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక నాలుగో టీ20లో ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది. ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్లను తుదిజట్టుకు ఎంపిక చేసింది. ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమన్లను పక్కనపెట్టింది. మరోవైపు.. టీమిండియా మూడో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది. దీంతో సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయి తప్పలేదు.1-1తో సమంగాకాగా భారత్- ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సూర్యసేన సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక నాలుగో టీ20లో గెలిచి ఆధిక్యం సంపాదించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా. -
ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 గెలవడంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్తో పోరాడి తిరిగి మైదానంలో అడుగుపెట్టి పరుగులు రాబట్టిన ఘనుడు.ఇక అన్ని ఫార్మాట్ల నుంచి చాలా ఏళ్ల క్రితమే వైదొలిగిన యువీ.. ఆ తర్వాత మెంటార్గా కొత్త అవతారం ఎత్తాడు. పంజాబీ స్టార్లు.. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మ (Abhishek Sharma)లకు చాన్నాళ్లుగా యువీ మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా అతడి గైడెన్స్లోనే అభిషేక్ టీ20 విధ్వంసకరవీరుడిగా రాటుదేలాడు.అస్సలు పోలికలు లేవుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా PTIతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచింగ్ విషయంలో తన తండ్రి యోగ్రాజ్ సింగ్తో తనకు అస్సలు పోలికలు లేవన్నాడు. మనకు నచ్చినది ఎదుటివాళ్లపై రుద్దడం కోచింగ్ కాదని.. ఆటగాళ్ల మైండ్సెట్ను బట్టి తీర్చిదిద్దడమే అసలైన కోచింగ్ అంటూ పరోక్షంగా తండ్రికి కౌంటర్ ఇచ్చాడు.యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదుఈ మేరకు.. ‘‘నేను కచ్చితంగా యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదు. వ్యక్తిగా, వ్యక్తిత్వం పరంగా ఆయనతో నాకు పోలిక లేదు. మేమిద్దరం భిన్న ధృవాలము. నా కోచింగ్ శైలి కూడా వేరుగా ఉంటుంది.ఒక ఆటగాడికి కోచ్గా ఉన్నపుడు.. అతడి స్థానంలో ఉండి ఆలోచించాలి. అతడికి ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాలి. వారి గురించి పూర్తిగా తెలుసుకుని మార్గనిర్దేశనం చేయాలి.అభిషేక్ శర్మకు చాలా ఏళ్లుగా మెంటార్గా ఉన్నాను. తద్వారా ఓ వ్యక్తికి ఎలా మార్గదర్శనం చేయాలో నేను పరిపూర్ణంగా నేర్చుకున్నా. ప్రతిభావంతులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నా. కఠిన శ్రమకు ఓరుస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కి మేము అనుకున్న ఫలితాలు రాబడుతున్నాం.అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడుసహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడు. 2011 వరల్డ్కప్ విన్నింగ్ జట్టు కెప్టెన్ గ్యారీ కిర్స్టెన్ నాకు ఈ మాట చెప్పాడు. ఇదే నేను ఫాలో అయ్యాను. నా శిష్యులకు కూడా ఇదే చెబుతున్నా. కోచ్, కెప్టెన్ స్వేచ్ఛను ఇస్తే ఆటగాడు అద్భుతాలు చేయగలడు. ఇప్పుడు అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడు’’ అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.కాగా అభిషేక్ శర్మ ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే ఐసీసీ నంబర్వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. ఇదిలా ఉంటే.. యువీని చిన్ననాటి నుంచే క్రికెటర్గా తీర్చిదిద్దే క్రమంలో యోగ్రాజ్ సింగ్ చాలా కఠినంగా వ్యవహరించాడు.ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు కూడా!.. ఒకానొక సందర్భంగా తన శిక్షణలో యువీ చచ్చిపోతాడంటూ అతడి తన తల్లి గొడవపెట్టినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువీ తన తండ్రి గురించి పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు -
అందుకే హర్షిత్ రాణాను ప్రమోట్ చేశారు: అభిషేక్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్లో భారత పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్ శివం దూబే (Shivam Dube)ను కాదని.. ఈ బౌలర్ను ఏడో స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ విషయంపై టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) స్పందించాడు. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హర్షిత్ రాణాను ముందుగా బ్యాటింగ్కు పంపడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు‘‘మా జట్టులో చాలా మందికి ఆస్ట్రేలియాలో ఇదే తొలి పర్యటన. ఇక్కడి పిచ్లపై అదనపు బౌన్స్, పేస్ గురించి మాకు తెలుసు. అయినా.. సరే ఈ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లు బౌల్ చేసిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.క్రమశిక్షణగా సరైన లైన్ అండ్ లెంగ్త్తో వాళ్లు బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. అయితే, ఊహించని రీతిలో వారు చెలరేగారు.వరుసగా వికెట్లు పడుతుంటే అక్కడ బ్యాటర్గా ఎవరున్నారన్న విషయంతో బౌలర్లకు పనిలేదు. ఇక క్రీజులో ఎవరు ఉన్నా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే ఆడతారు. మెల్బోర్న్ వికెట్ కఠినంగా ఉంది. ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు.అందుకే శివంను కాదని హర్షిత్ను.. హర్షిత్ బ్యాట్తోనూ రాణించగలడని నాకు తెలుసు. నెట్స్లో అతడు చాలాసార్లు సిక్స్లు బాదాడు. ‘నీ సాధారణ ఆట తీరుతోనే ముందుకు సాగు’ అని నాకు చెప్పాడు. మా లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఈ మ్యాచ్లో బాగా వర్కౌట్ అయింది.ఈ కాంబినేషన్ కోసమే.. శివం దూబే కంటే.. హర్షిత్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపించారు’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. కాగా 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఆసీస్తో రెండో మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు..@IamAbhiSharma4 leads from the front with a blazing half-century, taking the Aussies head-on in true Skyball fashion! 💥Fearless intent, clean hitting, and total command at the crease! 🚀#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/bcAUdN2kyw— Star Sports (@StarSportsIndia) October 31, 2025 మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో లెగ్ బిఫోర్గా వెనుదిరగడంతో అతడి ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) ఒక్కడే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.Short ball? No problem! #HarshitRana clears it for a six! 🚀Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025మూకుమ్మడిగా విఫలంఓపెనర్ శుబ్మన్ గిల్ 5, మూడో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ 2, నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఐదో స్థానానికి డిమోట్ అయిన తిలక్ వర్మ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా పరుగుల ఖాతా తెరవలేదు. శివం దూబే 4 పరుగులకే వెనుదిరిగాడు.ఫలితంగా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు, మార్కస్ స్టొయినిస్ ఒక వికెట్ దక్కించుకున్నారు.స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. రెండో టీ20లో భారత్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. కాగా కాన్బెర్రాలో జరగాల్సిన తొలి టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
మా ఓటమికి కారణమదే: సూర్య కుమార్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లతో మెన్ ఇన్ బ్లూ పతనాన్ని శాసించగా.. ఎల్లీస్, బార్ట్లెట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.ఇక మెల్బోర్న్ టీ20 ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని సూర్య చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ హాజిల్వుడ్పై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."జోష్ హాజిల్వుడ్ ఆసాధరణ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. పవర్ప్లేలో అతడు బౌలింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయాము. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. కచ్చితంగా జోష్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే.మొదటి మ్యాచ్ రద్దు అయినప్పటికి మేము బాగానే బ్యాటింగ్ చేశాము. ఈ మ్యాచ్లో కూడా అదే మైండ్ సెట్తో ఆడాలి అనుకున్నాము. తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి ముందు భారీ టార్గెట్ ఉంచాలనుకున్నాము. కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం విఫలమయ్యాము. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అతడు గత కొంత కాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నాడు. అతడు తన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తున్నాడు. రాబోయే మ్యాచ్లలో కూడా అతడు ఇదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. .. స్కోరెంతంటే? -
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు హోదా ఉన్న జట్ల తరఫున అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. ముంబైకి చెందిన 35 ఏళ్ల సూర్యకుమార్ ఆలస్యంగానే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా భారత్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటలేక చతికిల పడ్డ సూర్య.. తనకు కలిసి వచ్చిన టీ20 క్రికెట్లో మాత్రం వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఎదిగాడు.వరుస విజయాలుఈ క్రమంలో గతేడాది ఏకంగా టీమిండియా టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన సూర్య.. వరుస విజయాలు సాధించాడు. ఇటీవలే ఆసియా టీ20 కప్-2025లో భారత్ను చాంపియన్గా నిలిపాడు. కానీ బ్యాటర్గా మాత్రం విఫలం కావడం విమర్శలకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న సూర్య.. తొలి టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. కాన్బెర్రా వేదికగా టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.వర్షం వల్ల మ్యాచ్ రద్దుఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నంలోనే.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన సూర్య.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)తో కలిసి దంచికొట్టాడు. అయితే, వర్షం వల్ల ఈ మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.అప్పటికి.. 9.4 ఓవర్ల ఆట సాగగా.. వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది టీమిండియా. గిల్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. Fearless batting on display! 💥We’re in for a @surya_14kumar special!Match Update ➡️ Rain Delay. Revised start time awaited!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/87NwgUurcT— Star Sports (@StarSportsIndia) October 29, 2025205 సిక్సర్లతో టాప్లో రోహిత్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సూర్య అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 సిక్సర్ల క్లబ్లో చేరాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ 205 సిక్సర్లతో టాప్లో ఉండగా.. సూర్య ఐదో స్థానంలో నిలిచాడు.అయితే, అత్యంత తక్కువ ఇన్నింగ్స్లోనే అంటే.. 86వ ఇన్నింగ్స్లోనే 150 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు సూర్య. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ల (టెస్టు హోదా) జట్ల తరఫున ఫాస్టెస్ట్ 150 సిక్సెస్ సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఇక అసోసియేట్ దేశమైన యూఏఈ తరఫున ముహమ్మద్ వసీం 66 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెటర్లు🏏 రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్లలో 205 సిక్సర్లు🏏ముహమ్మద్ వసీం (యూఏఈ)- 91 మ్యాచ్లలో 187 సిక్సర్లు🏏మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్లలో 173 సిక్సర్లు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్లలో 172 సిక్సర్లు🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 91 మ్యాచ్లలో 150 సిక్సర్లు*.చదవండి: PKL 2025: అతడొక అద్భుతం.. తెలుగు టైటాన్స్కు దొరికిన ఆణిముత్యం -
ఎడమచేతి వాటం క్రికెటర్లతో లాభాలేమిటి?
టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్లకు సిద్ధమైంది. అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును పరిశీలిస్తే ఇందులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం గల ఆటగాళ్లు ఉన్నారు.మరి లెఫ్టాండర్ల వల్ల జట్టుకు అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? వీరిని ఎక్కువగా తుదిజట్టులోకి తీసుకోవడం వల్లే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం!బ్రియన్ లారా మారథాన్ ఇన్నింగ్స్ నుంచి ఆడం గిల్క్రిస్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్, సౌరవ్ గంగూలీ మెరుపులు .. ఎడమచేతి వాటం బ్యాటర్ల అద్భుత ప్రదర్శనలకు ఇవి నిదర్శనాలు.అడ్వాంటేజ్ ఏంటి?క్రికెట్లో కుడిచేతి వాటం బ్యాటర్లే ఎక్కువ. కాబట్టి బౌలర్లు కూడా అందుకు తగ్గట్లుగానే శిక్షణలో ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాటర్లకే బౌల్ చేస్తూ ఉంటారు. కాబట్టి లెఫ్టాండర్లు బరిలో ఉన్నపుడు వారి లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ క్రీజులో లెఫ్ట్- రైట్ బ్యాటర్లు జోడీగా ఉన్నారంటే బౌలర్లకు వారిని విడదీయడం మరింత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఇద్దరూ దంచికొడుతున్నారంటే.. బౌలర్ల రిథమ్ దెబ్బ తింటుంది. ఫీల్డింగ్లోనూ మార్పులు చేయడం బౌలింగ్ చేస్తున్న కెప్టెన్కు తలనొప్పిగా మారుతుంది. తరచూ ఫీల్డర్లను మార్చడం కూడా మైనస్గా మారుతుంది.డేటా ఏం చెబుతోంది?తమ రైట్ హ్యాండ్ కౌంటర్పార్ట్స్ కంటే లెఫ్టాండర్లు మూడు ఫార్మాట్లలోనూ రాణించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. టెస్టు క్రికెట్లో లెఫ్టాండర్లు విండీస్ లెజెండ్ బ్రియన్ లారా, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర వేల కొద్దీ పరుగులు రాబట్టారు. సంగక్కర టెస్టుల్లో 12,400 పరుగులు సాధిస్తే.. లారా 11,953 పరుగులు స్కోరు చేశాడు.ఇక వన్డేల్లో సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. గంగూలీ 311 వన్డేల్లో 11363 పరుగులు స్కోరు చేస్తే.. 167 వన్డేలు ఆడి 6793 రన్స్ రాబట్టాడు.అదే విధంగా టీ20 ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించగా.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగలరు!లెఫ్టాండ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. స్పిన్నర్ల బౌలింగ్లో వీరికి షాట్ సెలక్షన్ సులభంగా ఉంటుంది.పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ వీరి సంప్రదాయ విరుద్ధ బ్యాటింగ్ కారణంగా ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లను మార్పు చేసే క్రమంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక సమయాల్లో వ్యూహాలు మార్చుకోవాల్సి రావడం విజయావకాశాలను దెబ్బ తీస్తుంది.సైకలాజికల్ ఎడ్జ్కుడిచేతి వాటం బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కొనేటపుడు సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రతిసారి లైన్ అండ్ లెంగ్త్ మార్చడం వారికి కఠినతరంగా మారుతుంది. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లను తరచూ మార్చాల్సి రావడం వల్ల బ్యాటర్లకు పరుగులు స్కోరు చేసే అవకాశాలు పెరుగుతాయి.లెజెండరీ లెఫ్టాండ్ బ్యాటర్లుబ్రియన్ లారా టెస్టుల్లో క్వాడ్రపుల్ (400*) సెంచరీ చేసి ఇప్పటికీ తన పేరిటే ఆ రికార్డును పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ వన్డే, టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ల గురించి త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా లెఫ్టాండ్ బ్యాటరే. ఇప్పటికే యూత్ వన్డే, యూత్ టెస్టులలో వైభవ్ ఇరగదీస్తున్నాడు.భారత ప్రస్తుత టీ20 జట్టులో ఎనిమిది మందిఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రస్తుత భారత టీ20 జట్టులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. టాపార్డర్లో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. వన్డౌన్లో తిలక్వర్మ అందుబాటులో ఉన్నారు. వీరిద్దరు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబేతో పాటు నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా లెఫ్టాండరే. వీరితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎడమచేతి వాటం గల ప్లేయర్లే. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్ల కోటాలో అర్ష్దీప్ సింగ్ లెఫ్టాండర్ల జాబితాలో ఉన్నారు.చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య -
ఆసీస్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 29) తొలి టీ20 జరుగనుంది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్నైనా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై భారత్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు ఆడిన 32 మ్యాచ్ల్లో 20 సార్లు గెలుపొందింది. ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది. చివరిగా ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 5 సార్లు విజయాలు సాధించింది. 2024 ప్రపంచకప్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 24 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది.అంతకుముందు స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఇదే ఫామ్ను రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్లోనూ కొనసాగించాలని భావిస్తుంది. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉండటంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి.విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ విశేషంగా రాణిస్తున్నాడు. వన్డౌన్లో తిలక్ వర్మ ఆకట్టుకుంటున్నాడు. సంజూ శాంసన్ సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ నుంచి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్లు బాకీ ఉన్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ కొనసాగుతుంది. బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణిస్తున్నారు. గంభీర సహకారంతో నెట్టుకొస్తున్న హర్షిత్ రాణా పర్వాలేదనిపిస్తున్నాడు. టీమిండియాను ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. స్కై బ్యాటింగ్లో రాణించి చాలాకాలమైంది. ఈ ఆసీస్ సిరీస్లో అయినా అతను సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా విఫలమవుతున్నా మేనేజ్మెంట్, కోచ్ స్కైకు అండగా ఉన్నారు. వ్యక్తిగంతా విఫలమవుతున్నా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడన్న కారణం చేత అతనికి మద్దతు లభిస్తుంది. అయితే ఇది ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో విఫలమైతే మాత్రం సెలెక్టర్లు ప్రత్యామ్నాం వైపు చూడవచ్చు.ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భారత జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ -
ఫెయిల్ అయితే ఏంటి?!.. నాకైతే అలాంటి భయాలు లేవు: గంభీర్
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.ఈ నేపథ్యంలో టీ20 సిరీస్లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.బ్యాటింగ్ పరంగా విఫలంముఖాముఖి రికార్డు పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. బ్యాటింగ్ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్లలో కలిపి కేవలం రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. 72 పరుగులేఇటీవల కెప్టెన్గా ఆసియా టీ20 కప్-2025 టైటిల్ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.ఎలాంటి భయాలు లేవుఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్ ఫామ్ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్గా ఆడాలని డ్రెసింగ్రూమ్లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్ తెలిపాడు.ఒక్కసారి లయ అందుకుంటేఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్ టోర్నీలో సూపర్ ఫామ్ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.టీ20 క్రికెట్లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్ బ్రాండ్పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
అటు శర్మ.. ఇటు స్మృతి! ఇద్దరికి తిరుగులేదు
-
విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!
టీమిండియా నయా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (ICC Player Of The Month Award) గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ అభిషేక్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం అభిషేక్తో పాటు మరో టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ పోటీ పడ్డారు. ఓటింగ్ అనంతరం అభిషేక్ విజేతగా ఆవిర్భవించాడు.అభిషేక్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది మొదటిసారి. భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న 10వ ఆటగాడు అభిషేక్. అభిషేక్కు ముందు శుభ్మన్ గిల్ (4 సార్లు), బుమ్రా (2), శ్రేయస్ అయ్యర్ (2), పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.అభిషేక్ సెప్టెంబర్ నెలలో విశేషంగా రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. టీ20 ఆసియా కప్లో అతను 7 మ్యాచ్ల్లో 200 స్ట్రైక్ రేట్తో, 44.85 సగటున 314 పరుగులు చేశాడు. అభిషేక్ ప్రదర్శనల కారణంగా భారత్ ఆసియా కప్ను సునాయాసంగా గెలుచుకుంది.అభిషేక్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్న అభిషేక్.. ఆ ప్రదర్శనల తర్వాత ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.మహిళల విభాగంలో మంధనమహిళల విభాగంలో సెప్టెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు టీమిండియాకే చెందిన స్మృతి మంధనకు (Smriti Mandhana) దక్కింది. గత నెలలో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో (58, 117, 125) విశేషంగా రాణించినందుకు ఆమె ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డు కోసం మంధనతో పాకిస్తాన్కు చెందిన సిద్రా అమీన్, సౌతాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ పోటీ పడ్డారు. తిరుగులేని ప్రదర్శన కారణంగా మంధననే ఈ అవార్డు వరించింది. చదవండి: Chiranjeevi: ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు -
అభిషేక్ గొప్ప ప్లేయరేమి కాదు.. 3 బంతుల్లో ఔట్ చేస్తా! పాక్ బౌలర్ ఓవరాక్షన్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ ఇటీవలే ముగిసిన ఆసియాకప్లో దుమ్ములేపాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేశాడు.ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన అభిషేక్ ఇన్నింగ్స్లలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖండాంతర టోర్నీలో దాయాది పాకిస్తాన్కు అభిషేక్ చుక్కలు చూపించాడు. ఒక ఫైనల్లో తప్ప మిగితా లీగ్, సూపర్-8లలో పాక్ బౌలర్లను శర్మ ఉతికారేశాడు.సూపర్-4 మ్యాచ్లో అయితే అభిషేక్ బ్యాటింగ్ జోరుకు పాక్ స్పీడ్స్టార్ హ్యారిస్ రౌఫ్ తన సహనాన్ని కోల్పోయాడు. అభిషేక్తో వాగ్వాదానికి దిగాడు. రౌఫ్కు అభిషేక్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఈ పంజాబ్ క్రికెటర్ పాక్పై మూడు మ్యాచ్లు ఆడి 110 పరుగులు చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా ఓ ఛాలెంజ్ విసిరాడు. అభిషేక్ తన బౌలింగ్ను ఎదుర్కొలేడని.. కేవలం మూడు బంతుల్లో ఔట్ చేయగలని అతడు చెప్పుకొచ్చాడు. ఇహ్సానుల్లా పాక్ తరపున కేవలం 4 టీ20ల్లో మాత్రమే ఆడాడు. అభిషేక్తో కలిసి అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. "నేను భారత్తో ఆడితే అభిషేక్ నా బౌలింగ్ను ఎదుర్కోలేడు. అతడిని ఔట్ చేయడానికి నాకు కేవలం మూడు బంతులు చాలు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. ఈ పాక్ ఆటగాడికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.ఆసియాకప్ మ్యాచ్లు చూడలేదా? అయితే మీ బౌలర్లను అభిషేక్ గురించి అడుగు అని పోస్ట్లు పెడుతున్నారు. అభిషేక్ తిరిగి భారత జట్టు తరపున ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లో ఆడనున్నాడు.చదవండి: వన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్ -
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రేసులో అభిషేక్ శర్మ..
ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఆసియాకప్-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్లు షార్ట్ లిస్ట్ అయ్యారు.వీరిద్దరితో పాటు జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియాకప్లో అభిషేక్ పరుగుల వరద పారించాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేశాడు.ఒక్క ఫైనల్ మ్యాచ్లో మినహా మిగితా మ్యాచ్లలో ఈ పంజాబ్ ప్లేయర్ దుమ్ములేపాడు. అదేవిధంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఆసియాకప్లో కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. 7 మ్యాచ్లలో కుల్దీప్ 17 వికెట్లు పడగొట్టాడు.ఈ మెగా టోర్నీలో కుల్దీప్ కాకుండా షాహీన్ షా అఫ్రిది మాత్రమే 10 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు జింబాబ్వే ప్లేయర్ బెన్నెట్ గత కొంత కాలంగా టీ20 క్రికెట్లో అదరగొడుతున్నపాడు. 21 ఏళ్ల బెన్నెట్ గత నెలలో శ్రీలంక, ఉగాండా, నమీబియా, బోట్స్వానాపై అర్ధ సెంచరీలు చేశాడు.టీ20 ప్రపంచ కప్-2026 ఆఫ్రికా క్వాలిఫైయర్లో టాంజానియాపై కూడా బెన్నెట్ సెంచరీ సాధించాడు. మహిళల విభాగంలో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ అవార్డు రేసులో ఉంది. గత నెలలో మంధాన ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. నాలుగు మ్యాచ్ల్లో 77 సగటుతో 308 పరుగులు చేసింది.చదవండి: PAK vs SA: ఫ్రీ ఫ్రీ.. రండి బాబు రండి! బ్రతిమాలుకుంటున్న పీసీబీ -
ఆసీస్పై అభిషేక్ మళ్లీ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే?
టీ20ల్లో దుమ్ములేపుతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ.. 50 ఓవర్ల ఫార్మాట్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ తరపున ఆడిన అభిషేక్ తీవ్ర నిరాశపరిచాడు. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన ఈ పంజాబ్ క్రికెటర్ ఇప్పుడు మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు.25 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ రెండు ఫోర్లు సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ టాడ్ ముర్ఫీ బౌలింగ్లో తన్వీర్ సంఘాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అభిషేక్ ఈ తరహా ప్రదర్శనలు చేస్తే భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇప్పటిలో కష్టమనే చెప్పాలి.ఎందుకంటే ఓపెనింగ్ స్ధానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే వన్డే జట్టులో రెగ్యూలర్ ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైశ్వాల్ ఉన్నాడు. అవసరమైతే కేఎల్ రాహుల్ సైతం ఓపెనర్గా ప్రమోట్ చేసే అవకాశముంది. త్వరలోనే జరగనున్న విజయ్ హాజారే ట్రోఫీలో అభిషేక్ మెరుగైన ప్రదర్శన చేస్తే సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశముంది. అక్కడ కూడా విఫలమైతే అభిషేక్ కేవలం టీ20లకే పరిమితం కాక తప్పదు. ఇటీవల ముగిసిన ఆసియాకప్లో శర్మ దుమ్ములేపాడు. అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచాడు. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా ఈ పంజాబీ ఆటగాడికి మెరుగైన గణాంకాలు ఉన్నాయి.అభిషేక్ శర్మ తన కెరీర్లో ఇప్పటివరకు 61 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 35.33 సగటుతో 2,014 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 170గా ఉంది. అదేవిధంగా బౌలింగ్లో కూడా 38 వికెట్లు పడగొట్టాడు.భారత్ ఘన విజయం..కాగా నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్-ఎ జట్టు 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో శ్రేయస్ అయ్యర్ సేన సొంతం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ జాక్ ఎడ్వర్డ్స్ (75 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... లియామ్ స్కాట్ (64 బంతుల్లో 73; 1 ఫోర్, 6 సిక్స్లు), కూపర్ కొనొల్లీ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్సెంచరీలు చేశారు. మొత్తంగా ఆసీస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో 15 సిక్స్లు కొట్టారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన హర్షిత్ రాణా 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆయుశ్ బదోనీ 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (68 బంతుల్లో 102; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. ప్రభ్సిమ్రన్ ధనధాన్ సెంచరీకి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (58 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (55 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్సెంచరీలు తోడవడంతో భారత జట్టు అలవోకగా గెలుపొందింది.ఆసీస్ బౌలర్లలో టాడ్ మార్ఫీ, తన్వీర్ సంఘా చెరో 4 వికెట్లు తీశారు. ప్రభ్సిమ్రన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో సైతం భారత ‘ఎ’ జట్టే విజయం సాధించింది.చదవండి: మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ -
పాపం అభిషేక్ శర్మ.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!?
భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న యువ సంచలనం అభిషేక్ శర్మకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో అభిషేక్కు చోటు దక్కలేదు. రెగ్యూలర్ ఓపెనర్లగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ ఉండగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైశ్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.జైశ్వాల్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత తరపున వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఆసీస్తో సిరీస్కు ఈ ముంబై ఆటగాడికి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.అభిషేక్ వెయిట్ చేయాల్సిందే..అయితే అభిషేక్ శర్మ ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్లో అభిషేక్ ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచాడు. ఈ టోర్నీలో పంజాబ్ ఆటగాడు 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ కొనసాగుతున్నాడు. దీంతో ఆసీస్తో వన్డే సిరీస్కు అభిషేక్ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. రోహిత్ శర్మ, గిల్, జైశ్వాల్ రూపంలో ఓపెనర్లు అందుబాటులో ఉండడంతో అభిషేక్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 50 ఓవర్ల ఫార్మాట్లో శర్మ తన స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవాలని సెలక్టర్లు సూచించినట్లు సమాచారం. అభిషేక్ శక్రవారం ఆసీస్-ఎతో జరిగిన అనాధికారిక వన్డేలో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇది కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపించింది. అభిషేక్ శర్మ తన కెరీర్లో ఇప్పటివరకు 61 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 35.33 సగటుతో 2,014 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 170గా ఉంది. అదేవిధంగా బౌలింగ్లో కూడా 38 వికెట్లు పడగొట్టాడు. అయితే అభిషేక్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే అత్యంత త్వరలోనే వన్డే జట్టులోకి కూడా వచ్చే అవకాశముంది. కాగా భారత వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో శుబ్మన్ గిల్కు వన్డే జట్టు పగ్గాలను అప్పగించారు. -
IND vs AUS: ప్చ్... తిలక్ వర్మ మెరిసినా...
ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత ‘ఎ’ (IND A vs AUS A) జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని భారత ‘ఎ’జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. 246 పరుగులకు ఆలౌట్కాన్పూర్ వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ‘ఎ’ జట్టు 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. ఇటీవల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్పై అజేయ అర్ధశతంతో మెరిసి జట్టును గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma) మరోసారి ఆకట్టుకున్నాడు. త్రుటిలో చేజారిన శతకంతాజా మ్యాచ్లో తిలక్ 122 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 94 పరుగులు చేసి త్రుటిలో శతకం కోల్పోయాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న తిలక్ వర్మ... ఇప్పుడు వన్డే ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. రియాన్ పరాగ్ (54 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. రియాన్తో కలిసి నాలుగో వికెట్కు తిలక్ 101 పరుగులు జతచేశాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ బ్యాటర్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ విఫలంఇక తొలి మ్యాచ్లో సెంచరీలతో మెరిసిన ప్రభ్సిమ్రన్ సింగ్ (1), శ్రేయస్ అయ్యర్ (8)తో పాటు... అభిషేక్ శర్మ (0), నిశాంత్ (1) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా లక్ష్యఛేదన ప్రారంభించాక భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా... ఆసీస్ లక్ష్యాన్ని 25 ఓవర్లలో 160గా నిర్ణయించారు. సిరీస్ సమంఛేదనలో ఆసీస్ 16.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. మెకంజీ హార్వే (49 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు), కూపర్ (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో నిషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా పేసర్ అర్శ్దీప్ సింగ్ 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరగనుంది.చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ -
గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?
2025 ఆసియా కప్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద భారత యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మకు 'హవల్ హెచ్9' అనే లగ్జరీ కారు గిఫ్ట్గా లభించింది. ఈ కారు ధర సుమారు రూ. 33 లక్షలు అని సమాచారం. క్రికెటర్లు గిఫ్ట్గా స్వీకరించే కార్లు, ఇతర విలాసవంతమైన వస్తువులు పూర్తిగా పన్ను రహితం కాదు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. వాటి విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో క్రికెటర్లు గిఫ్ట్గా అందుకునే కార్లపై ఎంత పన్ను చెల్లించాలి.. నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.భారతదేశంలోని క్రికెటర్లు తరచుగా విలాసవంతమైన గిఫ్ట్స్ అందుకుంటారు. టోర్నమెంట్ గెలిచినప్పుడు లేదా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినప్పుడు కంపెనీలు, బ్రాండ్లు లేదా పారిశ్రామికవేత్తలు వారికి కార్లు, బైక్లు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులను గిఫ్ట్గా ఇస్తారు. చాలా మంది ఈ గిఫ్ట్స్ పూర్తిగా ఉచితం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను నియమాలు వీటికి కూడా వర్తిస్తాయి.ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక వస్తువును గిఫ్ట్గా స్వీకరిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దగ్గరి బంధువు నుంచి.. అంటే వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా తోబుట్టువుల నుంచి గిఫ్ట్ తీసుకుంటే, దానిపై పన్ను విధించబడదు. కానీ.. అదే గిఫ్ట్ కంపెనీ, బ్రాండ్, వ్యాపారవేత్త నుంచి వస్తే దానిపై పన్ను విధించబడుతుంది.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!ఇక ట్యాక్స్ విషయానికి వస్తే.. చాలా మంది క్రికెటర్లు ఎక్కువగా సంపాదిస్తారు. కాబట్టి వీరు అత్యధిక పన్ను పరిధి(30 శాతం)లోకి వస్తారు. ఇది కాకుండా సెస్ కూడా యాడ్ అవుతుంది. మొత్తంగా 31.2 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీరు తీసుకునే గిఫ్ట్కు అదే పన్ను విధించబడుతుంది. ఉదాహరణకు, ఒక క్రికెటర్ రూ. 20 లక్షల విలువైన కారును గిఫ్ట్గా అందుకుంటే, అతను ఆ గిఫ్ట్పై సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అభిషేక్ శర్మ.. హవల్ హెచ్9 కారుకు రూ. 9 లక్షల కంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లిచాలి. -
ఆసీస్పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా-ఎ తరపున ఆడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశరిచాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్య స్ధానంలో ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చిన అభిషేక్ తన మార్క్ను చూపించలేకపోయాడు. అభిషేక్ తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జాక్ ఎడ్వర్డ్ తొలి బంతిని అభిషేక్కు వైడ్-ఆఫ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని ఈ పంజాబ్ ఆటగాడు కవర్స్పై నుంచి షాట్ ఆడాలని చూశాడు. కానీ బంతి మాత్రం అవుట్సైడ్-ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్లో ఉన్న సదర్లాండ్ చేతికి వెళ్లింది. దీంతో అభిషేక్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. టీ20ల్లో దుమ్ములేపుతున్న అభిషేక్కు వన్డేల్లో కూడా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచించారు. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సెలక్టర్ల దృష్టిలో అభిషేక్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో సెలక్టర్లు పునరాలోచనలో పడే అవకాశముంది. అయితే మూడో వన్డేలో అభిషేక్ తన బ్యాట్ను ఝూళిపిస్తే సెలక్షన్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఆసియాకప్-2025లో అభిషేక్ దుమ్ములేపాడు. 7 మ్యాచ్లలో 314 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.తడబడుతున్న భారత్..ఇక రెండో అనాధికారిక వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తడబడుతోంది. 60 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఇన్నింగ్స్ను రియాన్ పరాగ్, తిలక్ వర్మ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ రెండో వన్డేలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అయ్యర్ ఔటయ్యాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ సైతం(1) సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు
టీమిండియా నయా విధ్వంసకర వీరుడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు (ICC T20I Rating Points) సాధించిన బ్యాటర్గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా కప్ 2025లో అదిరిపోయే ప్రదర్శనల తర్వాత అభిషేక్ నంబర్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకున్నాడు.ఇవాళ (అక్టోబర్ 1) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో అభిషేక్ రేటింగ్ పాయింట్లు 931కు చేరుకున్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ ఇన్ని రేటింగ్ పాయింట్లు లేవు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ పేరిట ఉండేది. మలాన్ తన కెరీర్లో అత్యుత్తమంగా 919 రేటింగ్ పాయింట్లు సాధించాడు.భారత్ తరఫున అభిషేక్కు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లను సూర్యకుమార్ యాదవ్ సాధించాడు. స్కై తన కెరీర్లో అత్యుత్తమంగా 912 రేటింగ్ పాయింట్లు సాధించాడు. స్కై తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ తన కెరీర్లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్లు సాధించాడు.అత్యధిక ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన టీ20 బ్యాటర్లు (టాప్-5)అభిషేక్ శర్మ- 931డేవిడ్ మలాన్- 919సూర్యకుమార్ యాదవ్- 912విరాట్ కోహ్లి- 909ఆరోన్ ఫించ్- 904కాగా, తాజాగా ముగిసిన ఆసియా కప్లో అభిషేక్ శర్మ అత్యుత్తమ ప్రదర్శనలతో చెలరేగాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడి 200 స్ట్రయిక్రేట్తో 44.86 సగటున 314 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్కు నఖ్వీ షరతు -
అది సూర్యకుమార్ ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో లీగ్, సూపర్-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. తొలుత గ్రూప్-‘ఎ’ మ్యాచ్లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్.. తర్వాత సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అయితే, సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.ఫొటోషూట్కు వెళ్లని సూర్యఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.అది సూర్యకుమార్ ఇష్టంఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు.గెలిచేది మేమేఇక టైటిల్ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్లు గెలవలేకపోయాము.తక్కువ తప్పులు చేసిన వారిదే విజయంఅయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్ ఫిట్గానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేననే టైటిల్ ఫేవరెట్ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
IND Vs SL: అతడి వల్లే ఇది సాధ్యమైంది: సెహ్వాగ్ ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma)పై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో మ్యాచ్లో ఈ యువ బ్యాటర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తిలక్ వర్మ వల్లే టీమిండియా భారీ స్కోరు చేసిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. సంజూ శాంసన్ ఆట తీరును కూడా సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. సూపర్-4లో చివరిగా నామమాత్రపు మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.అభిషేక్తో పాటు ఆ ఇద్దరుఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ (31 బంతుల్లో 61) ఆడగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) (4) విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (2) కూడా పూర్తిగా నిరాశపరిచారు.అయితే, నాలుగో నంబర్ బ్యాటర్.. తిలక్ వర్మ, ఐదో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ బ్యాట్ ఝులిపించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తిలక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 49 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Tilak Varma showing us the art of the “𝐠𝐡𝐮𝐭𝐧𝐚 𝐭𝐞𝐤 𝐜𝐡𝐡𝐚𝐤𝐤𝐚” 🤌 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/uLCfH4YepT— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 తిలక్ వర్మ వల్లే ఇలా..ఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ తిలక్ వర్మ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ కాకుండా.. ఇంకా ఎవరైనా రాణించాలని, పరుగులు రాబట్టాలని టోర్నీ ఆరంభం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాం.ఈరోజు తిలక్ వర్మ.. సంజూ శాంసన్ ఆ పని చేశారు. వారిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవచ్చు. కానీ ఇద్దరూ అద్భుతమైన, జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి వల్లే టీమిండియా 200 పరుగుల మార్కు అందుకుంది.ముఖ్యంగా తిలక్ వర్మ ఆఖరి వరకు అజేయంగా ఉండటం కలిసి వచ్చింది. ఇలా ఓ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆసాంతం నాటౌట్గా ఉన్నాడంటే.. అతడు తప్పక భారీ స్కోరు చేయగలడనే నమ్మకం వస్తుంది.ఫైనల్కు ముందు ఫామ్లో ఉండటం సానుకూలాంశంఫైనల్కు ముందు తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇలా బ్యాట్ ఝులిపించడం సానుకూలాంశం. వీరిద్దరి వల్ల టైటిల్ పోరులో భారత జట్టుకు తప్పక ప్రయోజనం చేకూరుతుంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. టీమిండియా మాదిరే ఐదు వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో భారత్ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఆసియా కప్ తాజా ఎడిషన్లో లెఫ్టాండర్ బ్యాటర్ తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. మరోవైపు.. సంజూ మూడు ఇన్నింగ్స్లో 108 పరుగులు రాబట్టాడు. ఇక ఆదివారం నాటి ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా.. దాయాది పాకిస్తాన్తో తలపడనున్న విషయం తెలిసిందే.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు -
ఆసియా కప్: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు సమాచారం. సూపర్-4 దశలో ఆఖరిగా టీమిండియా శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.ఒకే ఒక్క ఓవర్ వేసిదుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులు ఇచ్చి.. కుశాల్ మెండిస్ (0) రూపంలో కీలక వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్కు రానేలేదు. అంతకు ముందు బ్యాటింగ్కు దిగిన హార్దిక్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఫీల్డింగ్కు రాని అభిషేక్మరోవైపు.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) కూడా శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిస్థాయిలో ఫీల్డింగ్కు అందుబాటులో ఉండలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం నెలకొంది. కాగా లంకపై సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.అప్పుడే ఫిట్నెస్పై అంచనాకు వస్తాంఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గురించి ప్రస్తావన రాగా.. ‘‘హార్దిక్ కండరాలు పట్టేశాయి. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్నెస్పై అంచనాకు వస్తాము. ఆ తర్వాతే అతడి గురించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అభిషేక్ శర్మ కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, తను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దదేమీ కాదు’’అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్గా లేకుంటే మాత్రం టీమిండియాకు తలనొప్పి తప్పదు.ఇద్దరూ అత్యంత కీలకంఇప్పటి వరకు ఆసియా కప్-2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా టాపార్డర్లో అత్యంత కీలకం. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో హార్దిక్ పాండ్యా దిట్ట. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు పాండ్యాకు ఉంది. కాగా లీగ్, సూపర్-4 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆదివారం (సెప్టెంబరు 28) నాటి ఫైనల్లో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక. చదవండి: సూర్యకుమార్పై ఐసీసీ చర్య -
IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. స్టార్ ఆటగాడి రికార్డు బద్దలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్పై కూడా హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్.. 6 మ్యాచ్ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్రేట్తో, 51.50 సగటున, 3 హాఫ్ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ మరో మ్యాచ్ (ఫైనల్) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్ ఓ ఆల్టైమ్ రికార్డును సెట్ చేశాడు. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్కు ముందు టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్ ఎడిషన్) చేసిన రికార్డు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (281) పేరిట ఉండేది. రోహిత్ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్లో వరుసగా 7 ఇన్నింగ్స్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్ (61), శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12) ఔట్ కాగా.. తిలక్ వర్మ (27), సంజూ శాంసన్ (22) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఇదివరకే ఫైనల్కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్. సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది.చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా -
Abhishek Sharma: ప్రేమలో పడ్డ అభిషేక్ శర్మ?.. ఇంతకీ ఎవరీమె?
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కెరీర్లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. ఇక ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్లో 907 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు.ఇక ఆసియా కప్ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి 248 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 206కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న 25 ఏళ్ల అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వదంతి వ్యాప్తిలోకి వచ్చింది.ప్రేమలో పడ్డ అభిషేక్ శర్మ?లైలా ఫైజల్ ( Laila Faisal) అనే అమ్మాయితో అభిషేక్ ప్రేమలో ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. అభిషేక్ అక్క కోమల్ శర్మ డాక్టర్ అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తన తమ్ముడి మ్యాచ్ ఉన్న సమయంలో స్టేడియానికి వెళ్లి అతడిని ఉత్సాహపరచడంలో కోమల్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.ముఖ్యంగా ఐపీఎల్లో అభి ప్రాతినిథ్యం వహించే సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్లన్నింటీకి తల్లి మంజుతో కలిసి కోమల్ హాజరవుతుంది. ఇక వీరితో పాటు లైలా కూడా చాలాసార్లు కెమెరా కంటికి చిక్కింది. నిజానికి లైలా కోమల్ బెస్ట్ ఫ్రెండ్ అని వారి సోషల్ మీడియా అకౌంట్లలోని పోస్టుల ద్వారా తెలుస్తోంది.ఇటీవల కోమల్ బ్యాచిలరెట్ పార్టీలోనూ లైలా హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆసియా కప్ ఆడేందుకు అభిషేక్ యూఏఈ వెళ్లగా.. అతడి తల్లి మంజు, అక్క కోమల్ కూడా అక్కడే ఉన్నారు. వీరితో పాటు లైలా కూడా వెళ్లినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.ఎవరీ లైలా ఫైజల్?LRF అనే లగ్జరీ దుస్తుల బ్రాండ్ సహ వ్యవస్థాపకురాలు. తల్లి రూహీ ఫైజల్తో కలిసి లైలా దీనిని ప్రారంభించింది. కశ్మీర్ సిల్క్స్తో పాటు చేనేత వస్త్రాలకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి. ఇప్పుడిప్పుడే భారత ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న లైలా పేరు అభిషేక్తో ముడిపడటంతో ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది.కాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే ముందు లైలా లండన్లో సైకాలజీ చదివినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడే ఫ్యాషన్ టెక్నాలజీలోనూ కోర్సు చేసినట్లు తెలుస్తోంది. మలన్ బ్రెటాన్, రాకీ స్టార్ వంటి ప్రఖ్యాత డిజైనర్లతో కలిసి పనిచేసిన లైలా.. తర్వాత తనకంటూ సొంత బ్రాండ్ను స్థాపించింది.చదవండి: IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి అదరగొట్టాడు. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్ (IND vs BAN)తో బుధవారం నాటి మ్యాచ్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లతో పాటు ఐదు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్రేటు 202.70.And just like that, Abhishek Sharma reaches his fifty 🤯 Watch #INDvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/fP1RpHC0Eu— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025తొందరపాటు చర్యక్రీజులో కుదురుకున్న తర్వాత ధనాధన్ దంచికొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అభిషేక్ శర్మ.. ఓ దశలో సెంచరీ చేసే దిశగా పయనించాడు. అయితే, తన తొందరపాటు చర్య కారణంగా ఊహించని రీతిలో రనౌట్గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ బంతితో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ కట్ చేశాడు. అయితే, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రిషాద్ హొసేన్ వేగంగా స్పందించాడు.సూర్య చెప్పినా కూడా..డైవ్ కొట్టి మరీ బంతిని ఆపాడు. అయితే, అప్పటికే అభిషేక్ శర్మ సింగిల్ కోసమని నాన్-స్ట్రైకర్ పొజిషన్ నుంచి ముందుకు కదిలాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్య.. అభిషేక్ను వెనక్కి వెళ్లమని చెప్పాడు. దీంతో అతడు తిరిగి తన స్థానంలోకి వస్తుండగా.. రిషాద్.. బౌలర్ ముస్తాఫిజుర్ వైపు బంతిని త్రో చేయగా.. అతడు ఒడిసి పట్టాడు.అక్కకు హార్ట్బ్రేక్అభిషేక్ క్రీజులోకి వచ్చే కంటే ముందే బంతిని వికెట్లకు గిరాటేయడంతో అతడు రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో అభిషేక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మైదానంలోని ప్రేక్షకులతో పాటు.. అభి అక్క కోమల్ కూడా తీవ్ర నిరాశకు గురైంది.సెంచరీ చేసే ఛాన్స్ మిస్.. గావస్కర్ ‘ఫైర్’ఇక కామెంటేటర్, టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం.. అభిషేక్ శర్మ తొందరపాటు చర్యను విమర్శించకుండా ఉండలేకపోయాడు. ‘‘అసలు అక్కడ పరుగు తీయాల్సిన అవసరమే లేదు. అక్కడ సింగిల్కు అసలు ఆస్కారమే లేదు. అసలు అక్కడ ఏం ఉంది?’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫైనల్లో భారత్కాగా అభిషేక్ శర్మ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్ నెమ్మదించింది. హార్దిక్ పాండ్యా (38) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అంతకు ముందు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.అయితే, లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాను భారత బౌలర్లు 127 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. విధ్వంసర బ్యాటింగ్తో చెలరేగిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. Unfortunate end! 💔 "Abhishek Sharma departs after an absolute power-packed show. Missed out on a well-deserved 💯 but what a knock! "🔥 Absolute cinema!!🚀#AbhishekSharma #AsiaCup2025 #INDvsBAN #TeamIndia pic.twitter.com/cgRQFUkQNh— ममता राजगढ़ (@rajgarh_mamta1) September 24, 2025చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!pic.twitter.com/SjXZnnshzK— The Game Changer (@TheGame_26) September 24, 2025 -
ఫైనల్లో భారత్
అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్... ఆపై పదునైన బౌలింగ్... వెరసి ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్లో కాస్త తడబాటు కనిపించినా, చివరకు బంగ్లాదేశ్ను ఓడించడంలో టీమిండియా సఫలమైంది. టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన మన జట్టు దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది. గత మ్యాచ్లో శ్రీలంకపై స్ఫూర్తిదాయ ఆటను కనబర్చిన బంగ్లాదేశ్ ఈసారి టీమిండియా ముందు నిలవలేకపోయింది. ఇక భారత్తో తుది పోరుతో అమీతుమీ తలపడే జట్టేదో నేడు తేలనుంది. విరామం లేకుండా వరుసగా రెండో రోజు ఆడనున్న బంగ్లాదేశ్... పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజేతకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ‘సూపర్–4’ దశలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు) మరో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (51 బంతుల్లో 69; 3 ఫోర్లు, 5 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఇద్దరు మినహా మిగతా బంగ్లా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, వరుణ్ చెరో 2 వికెట్లు తీశారు. మధ్య ఓవర్లలో తడబాటు... భారత ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లలో ప్రశాంతత... ఒకే ఒక ఫోర్తో 17 పరుగులే వచ్చాయి! 7 పరుగుల వద్ద అభిషేక్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ జాకీర్ వదిలేయడం కూడా కలిసొచ్చిoది. అయితే పవర్ప్లేలో మిగిలిన 3 ఓవర్లలో అభిషేక్ విశ్వరూపం చూపించగా, గిల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. నసమ్ వేసిన నాలుగో ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టగా చివరి బంతిని అభిషేక్ సిక్స్ బాదాడు. ముస్తఫిజుర్ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన అభిషేక్...సైఫుద్దీన్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ మూడు ఓవర్లలో కలిపి 55 పరుగులు రావడంతో పవర్ప్లేలో స్కోరు 72 పరుగులకు చేరింది. అయితే పవర్ప్లే తర్వాత భారత్ అనూహ్యంగా తడబడింది. ఒక వైపు 25 బంతుల్లోనే అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మరోవైపు ఆరు పరుగుల వ్యవధిలో గిల్, శివమ్ దూబే (2) అవుటయ్యారు. జోరు మీదున్న అభిషేక్ ఇన్నింగ్స్ కూడా దురదృష్టవశాత్తూ రనౌట్తో ముగిసింది. ముస్తఫిజుర్ వేసిన బంతిని సూర్యకుమార్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... ఫీల్డర్ ఆపిన విషయాన్ని గుర్తించని అభిషేక్ చాలా ముందుకు దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోగా, అదే ఓవర్లో సూర్య కూడా అవుటయ్యాడు. తిలక్ వర్మ (5) విఫలం కాగా, 22 బంతుల పాటు భారత్కు బౌండరీనే రాలేదు! ఈ దశలో పాండ్యా దూకుడు జట్టుకు కాస్త మెరుగైన స్కోరును అందించింది. అయితే చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. అక్షర్ (15 బంతుల్లో 10) బంతులు వృథా చేయగా... ప్రధాన బ్యాటర్ సంజు సామ్సన్కు ఆడే అవకాశమే ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టపటపా... ఛేదనలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించలేకపోయింది. సైఫ్ మినహా ఎవరూ ప్రభావం చూపలేదు. అక్కడక్కడ కొన్ని చక్కటి షాట్లు ఆడినా బ్యాటింగ్ బృందం సమష్టిగా విఫలమైంది. ఆరంభంలోనే తన్జీద్ (1) వెనుదిరగడంతో సైఫ్, పర్వేజ్ (21) కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 30 బంతుల్లో 42 పరుగులు జోడించారు. పవర్ప్లేలో జట్టు 44 పరుగులు చేసింది. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే పర్వేజ్ను అవుట్ చేయడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాటర్లు అవుట్ కావడంతో గెలుపుపై జట్టు ఆశలు కోల్పోయింది. మరో ఎండ్లో సైఫ్ పోరాడినా లాభం లేకపోయింది. 36 బంతుల్లో సైఫ్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. బంగ్లా 18 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.150 అంతర్జాతీయ టి20ల్లో ముస్తఫిజుర్ వికెట్ల సంఖ్య. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షకీబ్ అల్ హసన్ (149)ను అతను అధిగమించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (రనౌట్) 75; గిల్ (సి) తన్జీద్ (బి) రిషాద్ 29; దూబే (సి) తౌహీద్ (బి) రిషాద్ 2; సూర్యకుమార్ (సి) జాకీర్ (బి) ముస్తఫిజుర్ 5; పాండ్యా (సి) తన్జీద్ (బి) సైఫుద్దీన్ 38; తిలక్ (సి) సైఫ్ (బి) తన్జీమ్ 5; అక్షర్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–77, 2–83, 3–112, 4–114, 5–129, 6–168. బౌలింగ్: తన్జీమ్ 4–0–29–1, నసుమ్ 4–0–34–0, ముస్తఫిజుర్ 4–0–33–1, సైఫుద్దీన్ 3–0–37–1, రిషాద్ 3–0–27–2, సైఫ్ 2–0–7–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) అక్షర్ (బి) బుమ్రా 69; తన్జీద్ (సి) దూబే (బి) బుమ్రా 1; పర్వేజ్ (సి) అభిషేక్ (బి) కుల్దీప్ 21; తౌహీద్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 7; షమీమ్ (బి) వరుణ్ 0; జాకీర్ (రనౌట్) 4; సైఫుద్దీన్ (సి) తిలక్ (బి) వరుణ్ 4; రిషాద్ (సి) తిలక్ (బి) కుల్దీప్ 2; తన్జీమ్ (బి) కుల్దీప్ 0; నసుమ్ (నాటౌట్) 4; ముస్తఫిజుర్ (సి) అక్షర్ (బి) తిలక్ 6; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–65, 4–74, 5–87, 6–109, 7–112, 8–112, 9–116, 10–127. బౌలింగ్: పాండ్యా 2–0–14–0, బుమ్రా 4–0–18–2, వరుణ్ 4–0–29–2, కుల్దీప్ 4–0–18–3, అక్షర్ 4–0–37–1, దూబే 1–0–10–0, తిలక్ 0.3–0–1–1. -
Asia cup 2025: అభిషేక్ విధ్వంసం.. ఫైనల్లో టీమిండియా
ఆసియా కప్ 2025లో టీమిండియా ఫైనల్కు చేరింది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్కు చేరడమే కాకుండా శ్రీలంకను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్లో విజేత ఫైనల్లో భారత్తో తలపడుతుంది.బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా టీమిండియా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.అభిషేక్ క్రీజ్లో ఉండగా భారత్ స్కోర్ 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.అనంతరం 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచే ప్రత్యర్ధిపై ఒత్తిడి తెచ్చింది. బుమ్రా (4-0-18-2), వరుణ్ చక్రవర్తి (4-0-29-2), కుల్దీప్ యాదవ్ (4-0-18-3), అక్షర్ పటేల్ (4-0-37-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు. అతనితో పాటు పర్వేజ్ హొస్సేన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సెప్టెంబర్ 26న జరిగే నామమాత్రపు మ్యాచ్లో భారత్.. శ్రీలంకతో తలపడుతుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్తో మ్యాచ్లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్లో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్రేట్తో 248 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు. చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా -
దుబాయ్లో అభిషేక్ శర్మ ఫ్యామిలీ.. ఫొటోలు షేర్ చేసిన కోమల్ (ఫొటోలు)
-
BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసియా టీ20 కప్- 2025 టోర్నమెంట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 208కి పైగా స్ట్రైక్రేటుతో అభిషేక్ శర్మ 173 పరుగులు సాధించాడు.తీవ్రమైన ఒత్తిడిలోనూతద్వారా ఇప్పటికి టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్పై రెండుసార్లు అభిషేక్ శర్మ చితక్కొట్టిన తీరు టీమిండియా విజయాల్లో హైలైట్గా నిలిచింది. లీగ్ దశలో పాక్పై 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. సూపర్-4లో 39 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు.బంపరాఫర్దాయాదితో సూపర్-4 మ్యాచ్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అభిషేక్ శర్మ.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (47)తో కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ పంజాబీ బ్యాటర్కు బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆసియా కప్-2025 టోర్నీ ముగిసిన తర్వాత.. టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను ఆసీస్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.గిల్కు విశ్రాంతి?కాగా శుబ్మన్ గిల్ ఇటీవలే టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను కెప్టెన్గా 2-2తో సమం చేశాడు. అనంతరం.. నెలరోజుల విరామం తర్వాత ఆసియా కప్ బరిలో దిగాడు. అయితే, ఆసియా కప్ ముగిసిన వెంటనే విండీస్తో సిరీస్ ఆడనున్నాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా గిల్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20లలో ఇప్పటికే ఓపెనర్గా పాతుకుపోయిన అభిషేక్ శర్మ ఇంతవరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తున్నాడు.జైస్వాల్కు అన్యాయంఅయితే, ఆసీస్తో సిరీస్లలో గిల్ రెస్ట్ తీసుకుంటే అభిషేక్ శర్మను ఓపెనర్గా ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అభిషేక్ శర్మ ఆసీస్ గడ్డపై వన్డేల్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దేశీ యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 61 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 2014 పరుగులు చేశాడు. ఒకవేళ అభిని ఆసీస్తో వన్డేలకు ఎంపిక చేస్తే.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అన్యాయం చేసినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే టీమిండియా టెస్టు ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. టీ20లలో తన మార్కు చూపించాడు. అయితే, వన్డేల్లో మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా జైసూ ఒకే ఒక్క వన్డే ఆడి.. 15 పరుగులు చేశాడు. ఇంత వరకు అతడికి వన్డేల్లో నిరూపించుకునే అవకాశమే రాలేదు.వన్డే టాపార్డర్లోఇలాంటి సమయంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడంటే.. జైసూకు అవకాశాలు సన్నగిల్లవచ్చు. అయితే, ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం వన్డే టాపార్డర్లో జైసూ, అభి, గిల్లను చూసే అవకాశాలను కొట్టిపారేయలేము. కాగా టీమిండియా తరఫున టీ20లలో అభిషేక్ శర్మ 21 టీ20లలో 708 పరుగులు సాధించాడు. మరోవైపు.. జైస్వాల్ 23 టీ20లలో 723, 24 టెస్టుల్లో 2209 రన్స్ రాబట్టాడు.చదవండి: IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు -
‘వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాం.. మా జట్టు గర్వకారణం’
సూర్యకుమార్ సేనపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.తీవ్రస్థాయిలో కవ్వింపులుఇక సూపర్-4 మ్యాచ్లోనూ భారత జట్టు మరోసారి పాక్పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.బ్యాట్తోనే సమాధానమిచ్చారుదీంతో ఫర్హాన్ సెలబ్రేషన్స్ పాక్ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లకు బ్యాట్తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ డష్కాటే స్పందించాడు.వాళ్ల చేష్టలు పట్టించుకోము‘‘హ్యారిస్ రవూఫ్ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.బ్యాట్తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్లో పాక్ తొలుత బాగానే బ్యాటింగ్ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్) అలా చేశాడు.అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.గర్వకారణంవాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు. నిజానికి ఈ మ్యాచ్లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.ఇలాంటి మ్యాచ్లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్, మా బ్యాటర్లతో పాక్ బౌలింగ్ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
-
సెహ్వాగ్ ఆడినపుడు ఇలాంటి వాళ్లు లేరు: అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్పై 13 బంతుల్లో 31 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో మరోసారి దంచికొట్టాడు.ధనాధన్ దంచికొట్టిన అభి.. పాక్ బౌలర్లు విలవిల దుబాయ్లో జరిగిన పాక్తో జరిగిన ఈ మ్యాచ్లో 39 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో అభిషేక్ చితక్కొట్టాడు. అయితే, స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) బౌలింగ్లో హ్యారిస్ రవూఫ్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా షాహిన్, రవూఫ్ల బౌలింగ్లో అభిషేక్ ధనాధన్ దంచికొట్టిన తీరు అభిమానులకు మజా ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇక అభిషేక్కు తోడు మరో ఓపెనర్ , వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47), నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) రాణించడంతో.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే.. పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది.వీరూ పాజీ హిట్టింగ్ ఆడిన రోజుల్లోఈ నేపథ్యంలో విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ ఆసియా కప్ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్తో మాట్లాడాడు. ఈ క్రమంలో పాక్ జట్టు బౌలర్ల గురించి మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘వీరూ పాజీ హిట్టింగ్ ఆడిన రోజుల్లో పాక్ బౌలర్లు గట్టి పోటీనిచ్చేవారు. కానీ ప్రస్తుత జట్టులో అలాంటి బౌలర్లు ఎవరూ లేరు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుత పాక్ బౌలింగ్ దళం బలహీనంగా ఉందని అభిషేక్ శర్మ అభిప్రాయపడ్డాడు. కాగా సెహ్వాగ్ టీమిండియాకు ఆడిన సమయంలో షోయబ్ అక్తర్ వంటి మేటి బౌలర్లు పాక్ జట్టులో ఉండేవారన్న సంగతి తెలిసిందే.సెంచరీ చేయాల్సిందిఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ పాక్తో మ్యాచ్లో సెంచరీ మిస్ కావడం తనకు కాస్త వెలితిగా అనిపించిందని ఈ సందర్భంగా సెహ్వాగ్ అన్నాడు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని.. 50s, 70s లను శతకాలుగా మార్చాలని ఈ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్కు సెహ్వాగ్ సూచించాడు.‘‘నువ్వు 70 పరుగులు దాటావంటే.. 100 చేసేందుకు కచ్చితంగా ప్రయత్నించు. సునిల్ గావస్కర్ నాకో మాట చెప్పారు. ‘నువ్వు రిటైర్ అయినపుడు ఈ 70, 80 స్కోర్లు నీకు గుర్తుకువస్తాయి. ఆరోజే వాటిని సెంచరీలుగా మలిస్తే బాగుండదని అనిపిస్తుంది’ అన్నారు.ఎందుకంటే వందకు చేరువయ్యే అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా!.. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోజు నాటౌట్గా ఉండేందుకు నువ్వు ప్రయత్నించు’’ అని సెహ్వాగ్ అభిషేక్ శర్మతో అన్నాడు.చదవండి: ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్Abhishek Sharma gets a priceless advice from Virender Sehwag ✨ @YUVSTRONG12, did the call finally happen? 👀 😅Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/SqHa1k4mAA— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ (IND vs PAK) జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నపుడు కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నీలో తొలుత లీగ్ దశలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన పాక్.. తాజాగా సూపర్-4 మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ ఆఘా బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ ఓవరాక్షన్పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అయితే, చేసింది హాఫ్ సెంచరీయే అయినా.. ఏకే-47 మాదిరి గన్ ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లు ఫర్హాన్ ఓవరాక్షన్ చేశాడు. అయితే, లక్ష్య ఛేదనలో టీమిండియా ఇందుకు బ్యాట్తోనే సమాధానమిచ్చింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74)- శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్తో తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరికి తోడు తిలక్ వర్మ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. పాక్ను మరోసారి కంగుతినిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్మన్ గిల్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ఆది నుంచే అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో ఫర్హాన్ సెలబ్రేషన్ చేసుకున్న తీరును కూడా కనేరియా విమర్శించాడు.నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు‘‘సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 గన్ కాలుస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ తమ బ్యాట్లతోనే ఏకంగా బ్రహ్మోస్ ప్రయోగించారు.ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ముద్దులు విసురుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. పాక్ బౌలింగ్పై వారిద్దరు విరుచుకుపడ్డారు. ఇందుకు పాక్ ఆటగాళ్ల వద్ద సమాధనమే లేకుండా పోయింది.మీరు ఉతుకుడు అని సంబరపడ్డారు. వారు ఉతికి.. ఉతికి ఆరేశారు. ప్రత్యర్థి జట్టులో అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ వంటి ఓపెనర్లు ఉన్నపుడు 200 పరుగుల స్కోరు కూడా చిన్నదే అయిపోతుంది. వాళ్లిద్దరు క్లాస్ ప్లేయర్లు’’ అంటూ డానిష్ కనేరియా వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు. -
పాక్ను చిత్తు చేసిన భారత్.. గౌతం గంభీర్ పోస్ట్ వైరల్
దాయాది పాకిస్తాన్కు టీమిండియా మరోసారి తమ స్థాయి ఏమిటో చూపించింది. దూకుడైన ఆటతో ‘చిరకాల ప్రత్యర్థి’కి చెక్పెట్టి .. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన భారత్.. తాజాగా కీలకమైన సూపర్-4 దశలోనూ సత్తా చాటింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. సల్మాన్ ఆఘా బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు కట్టడిచేయగలిగింది.అభిషేక్- గిల్ ధనాధన్ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా మరోసారి తన మార్కును చూపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత రీతిలో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు బాది 74 పరుగులు చేయగా.. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు.వీరికి తోడుగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ఫార్మాట్లో పదిహేనుసార్ల ముఖాముఖి పోరులో టీమిండియా పాక్పై పన్నెండోసారి గెలుపు జెండా ఎగురవేసింది.దిగ్గజాలు లేకుండానేఈసారి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండానే యువ భారత జట్టు పాక్ను ఓడించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.ఫియర్లెస్..ఇన్స్టా స్టోరీలో ‘‘ఫియర్లెస్.. ఫియర్లెస్.. ఫియర్లెస్’’ అంటూ అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్లతో పాటు టీమిండియా ఫొటోను గంభీర్ షేర్ చేశాడు. తమకు భయం లేదు.. తిరుగు లేదు అన్నట్లుగా గంభీర్ ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడు. ముఖ్యంగా మైదానంలో అతి చేసిన దాయాది పాక్కు తనదైన శైలిలో ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య -
పాక్ బౌలర్ల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్, గిల్
ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్లకు చేదు అనుభవం ఎదురైంది. తమ బౌలింగ్లో భారత బ్యాటర్లు చితక్కొడుతుంటే వారి అసహనం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఆటపై దృష్టి పెట్టాల్సింది పోయి .. నోటికి పనిచెప్పారు.పాక్ జట్టుకు ఓటమిని కానుకగాతమ బౌలింగ్లో ఉతికారేస్తున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishesk Sharma)- శుబ్మన్ గిల్ (Shuban Gill)లతో వాదులాటకు దిగేందుకు ప్రయత్నించారు. ఇందుకు వారిద్దరు బ్యాట్తోనే సమాధానమిచ్చి.. పాక్ జట్టుకు ఓటమిని కానుకగా అందించారు. దీంతో ఆడలేక అతి చేసిన పాక్ ఆటగాళ్లకు మరోసారి అవమానం తప్పలేదు.అసలేం జరిగిందంటే.. లీగ్ దశలో టీమిండియా చేతిలో చిత్తైన పాక్ (IND vs PAK).. తాజాగా సూపర్-4 మ్యాచ్లోనూ ఓడిపోయింది. అయితే, బ్యాటింగ్ పరంగా మాత్రం మెరుగ్గా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఆది నుంచే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారుఅయితే, టీ20 వరల్డ్ నంబర్ వన్ అయిన భారత జట్టు పాక్ విధించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆది నుంచే పాక్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించారు. ఇద్దరూ బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ క్రమంలో పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్.. అభిషేక్- గిల్లను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. షాహిన్ బౌలింగ్లో ఇరగొట్టిన గిల్.. అతడి ఓవరాక్షన్కు బదులుగా ‘‘వెళ్లి బంతి తెచ్చుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇక హ్యారిస్ రవూఫ్ పదే పదే మాటలతో కవ్వింపులకు పాల్పడగా.. అభిషేక్ ఓ దశలో అతడికి దగ్గరగా వెళ్లి బదులిచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అంపైర్ వచ్చి రవూఫ్ను పక్కకు తీసుకువెళ్లాడు.అస్సలు నచ్చలేదుఈ విషయంపై మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. పాక్ బౌలర్లు కారణం లేకుండా మీద మీదకు వచ్చారని.. దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. తనకు అది అస్సలు నచ్చలేదని తెలిపాడు. తాము మాత్రం అనవసర విషయాల పట్ల కాకుండా ఆటపై మాత్రమే దృష్టి పెట్టామంటూ పాక్ బౌలర్లకు మరోసారి కౌంటర్ ఇచ్చిపడేశాడు.ఇక గిల్- అభిషేక్ శర్మ సోషల్ మీడియా వేదికగా.. ‘‘మీవి మాటలు- మావి చేతలు’’ అంటూ పాక్కు తమ ఓటమిని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ ఇద్దరు పంజాబీ ఆటగాళ్లు చిన్ననాటి నుంచి స్నేహితులు. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వీరికి మెంటార్. ఇక తాజా మ్యాచ్లో విరాట్ కోహ్లిలేని లోటు పాక్ ఆటగాళ్లకు తెలియకుండా చేశారంటూ గిల్- అభిలపై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!Ye Naya Bharat Hain. Ye Bekhauf Bharat hai! 💪 Watch the Asia Cup, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/mn3n9OEZjv— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా ఘనత
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొడుతున్నాడు. లీగ్ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.మరోసారి విశ్వరూపంఆ తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ (IND vs PAK)లో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి.. దాయాదికి తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమన్పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. తాజాగా సూపర్-4లో భాగంగా పాకిస్తాన్కు మరోసారి విశ్వరూపం చూపించాడు.దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో అభిషేక్.. పాక్ బౌలింగ్ను ఉతికారేశాడు. 39 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47)తో కలిసి తొలి వికెట్కు వందకు పైగా పరుగులు జతచేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లుఇలా కెరీర్ ఆరంభం నుంచి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తాజాగా పాక్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో.. అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్ లూయీస్ వరల్డ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సూపర్-4 దశలోనూ మరోసారి దాయాదికి ఓటమి రుచి చూపించింది. కాగా లీగ్ దశలో భారత్.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.అతి తక్కువ బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు బాదిన ఫుల్ మెంబర్ (టెస్టు హోదా) జట్ల ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (ఇండియా)- 331 బంతుల్లోనే 50 సిక్సర్లుఎవిన్ లూయీస్ (వెస్టిండీస్)- 366 బంతుల్లో 50 సిక్సర్లుఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 409 బంతుల్లో 50 సిక్సర్లుహజ్రతుల్లా జజాయ్ (అఫ్గనిస్తాన్)- 492 బంతుల్లో 50 సిక్సర్లుసూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 509 బంతుల్లో 50 సిక్సర్లుఅతి తక్కువ ఇన్నింగ్స్లో అంతర్జాతీయ టీ20లలో సిక్సర్లు బాదిన ఆటగాళ్లు (ఫుల్ మెంబర్ జట్లు)అభిషేక్ శర్మ- 20 ఇన్నింగ్స్లోఎవిన్ లూయీస్- 20 ఇన్నింగ్స్లోహజ్రతుల్లా జజాయ్- 22 ఇన్నింగ్స్లోక్రిస్ గేల్- 25 ఇన్నింగ్స్లోసూర్యకుమార్ యాదవ్- 29 ఇన్నింగ్స్లో. చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!కోత.. ఊచకోత 💥Abhishek Sharma ఇచ్చిపడేసాడంతే! 🥁చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/0ufRZ5nDs6— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
అభిషేక్ సూపర్ షో.. పాకిస్తాన్కు చుక్కలు చూపించిన భారత్ (ఫొటోలు)
-
మళ్లీ చితక్కొట్టి...
వారం రోజుల వ్యవధిలో వేదిక కూడా మారలేదు... భారత జట్టు మళ్లీ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది... పాకిస్తాన్పై సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది... ముందుగా చక్కటి బౌలింగ్తో సాధారణ స్కోరుకే పాక్ను పరిమితం చేసిన టీమిండియా... ఆ తర్వాత అలవోకగా గెలుపు తీరాన్ని చేరింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ భారత్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఈసారి ‘షేక్హ్యాండ్’పై చర్చ జరగాల్సిన అవసరమే రాకుండా తమ ఆటతోనే ప్రత్యర్థికి పదునుగా జవాబిచ్చింది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్లు), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) చెలరేగి భారత్ విజయాన్ని సులువు చేశారు. వీరిద్దరు తొలి వికెట్కు 59 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం. సూపర్–4 దశలో తమ తర్వాతి మ్యాచ్లో బుధవారం బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. ఫర్హాన్ అర్ధ సెంచరీ... భారత్తో జరిగిన గత మ్యాచ్తో పోలిస్తే ఈసారి పాక్కు ఎంతో మెరుగైన ఆరంభం లభించింది. కానీ దానిని సది్వనియోగం చేసుకొని భారీ స్కోరు సాధించడంలో జట్టు విఫలమైంది. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ఫఖర్ జమాన్ (15) ఎక్కువ సేపు నిలవకపోయినా, మరో ఓపెనర్ ఫర్హాన్ చక్కటి షాట్లు ఆడాడు. బుమ్రా వరుస రెండు ఓవర్లలో ఫర్హాన్ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. పవర్ప్లేలో జట్టు 55 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ధాటిని కొనసాగిస్తూ పాక్ బ్యాటర్లు ఒకదశలో 13 బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు బాదారు. 10.2 ఓవర్లలో 93/1 స్కోరుతో పాక్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే సయీమ్ అయూబ్ (21) అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత బౌలర్లు పట్టు బిగించడంతో పరుగులు చేయడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. వరుసగా 33 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! ఐదు పరుగుల వ్యవధిలో హుస్సేన్ తలత్ (10), ఫర్హాన్ అవుట్ కాగా, మొహమ్మద్ నవాజ్ (19 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)లో దూకుడు లోపించింది. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్ 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది. అయితే చివరి 4 ఓవర్లలో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50 పరుగులు సాధించి గౌరవప్రదంగా ముగించింది. ఫహీమ్ అష్రఫ్ (8 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. మెరుపు బ్యాటింగ్... ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ చెలరేగిపోయారు. తొలి బంతికే సిక్సర్తో అభిషేక్ జోరు మొదలు పెట్టగా, తర్వాతి రెండు ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి గిల్ తానేంటో చూపించాడు. అయూబ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో భారత్ పవర్ప్లేలో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 69 పరుగులు రాబట్టింది. అబ్రార్ ఓవర్లో 2 సిక్స్లు బాదిన అభిషేక్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఎట్టకేలకు భారీ భాగస్వామ్యం తర్వాత 18 పరుగుల వ్యవధిలో గిల్, సూర్యకుమార్ (0), అభిషేక్ వెనుదిరిగారు. సామ్సన్ (13) కూడా తొందరగానే అవుటైనా... తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు.గత మ్యాచ్ తరహాలోనే ఈ సారి కూడా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ సమయంలో కరచాలనం చేసుకోలేదు. తమ టీమ్ షీట్లను కూడా ఇద్దరూ రిఫరీ పైక్రాఫ్ట్కే అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ‘షేక్ హ్యాండ్’లు లేకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నాలుగు క్యాచ్లు నేలపాలు... భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా పాక్ ఈ స్కోరు చేయడానికి కారణమైంది. అనూహ్యంగా మన ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేశారు. వీటిలో మూడు అతి సులువైనవి కాగా, ఒకటి కాస్త కష్టసాధ్యమైంది. అభిషేక్ శర్మ రెండు క్యాచ్లు (ఫర్హాన్ 0, 32 వద్ద), కుల్దీప్ (అయూబ్ 4 వద్ద), గిల్ (ఫహీమ్ 6 వద్ద) వదిలేయడం చూసి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తలపట్టుకున్నాడు! పాకిస్తాన్ మారదు! గత మ్యాచ్లో భారత జట్టు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాక్ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్ బ్యాట్ను ఏకే–47 గన్ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది. స్కోరు వివరాలుపాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 58; ఫఖర్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 15; అయూబ్ (సి) అభిషేక్ (బి) దూబే 21; హుస్సేన్ (సి) వరుణ్ (బి) కుల్దీప్ 10; నవాజ్ (రనౌట్) 21; సల్మాన్ (నాటౌట్) 17; ఫహీమ్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–21, 2–93, 3–110, 4–115, 5–149. బౌలింగ్: పాండ్యా 3–0–29–1, బుమ్రా 4–0–45–0, వరుణ్ చక్రవర్తి 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–31–1, అక్షర్ 1–0–8–0, శివమ్ దూబే 4–0–33–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రవూఫ్ (బి) అబ్రార్ 74; గిల్ (బి) ఫహీమ్ 47; సూర్యకుమార్ (సి) అబ్రార్ (బి) రవూఫ్ 0; తిలక్ (నాటౌట్) 30; సామ్సన్ (బి) రవూఫ్ 13; పాండ్యా (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–123, 4–148. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 3.5–0–40–0, అయూబ్ 3–0–35–0, అబ్రార్ 4–0–42–1, రవూఫ్ 4–0–26–2, ఫహీమ్ 4–0–31–1. -
విధ్వంసం సృష్టించిన అభిషేక్.. పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్
ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రాణించిన ఫర్హాన్ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు.ఫీల్డర్ల వైఫల్యం.. భారీగా పరుగులిచ్చిన బుమ్రా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోర్ ఇచ్చారు. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టారు. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శనలే చేశారు.వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు.విధ్వంసం సృష్టించిన అభిషేక్ 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయారు. తొలి వికెట్కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో గిల్, సూర్యకుమార్ యాదవ్ (0) వికెట్లు కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత (123 పరుగుల వద్ద) అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు.ఈ దశలో సంజూ శాంసన్, తిలక్ వర్మ నిదానంగా ఆడటంతో స్కోర్ నెమ్మదించింది. 148 పరుగుల వద్ద సంజూ (13) ఓ చెత్త షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ (7 నాటౌట్) సాయంతో తిలక్ వర్మ (30 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్కు తలో వికెట్ దక్కాయి. -
IND vs OMAN: సూర్య అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదే
ఆసియా కప్-2025లో ఒమన్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నామమాత్రపు మ్యాచ్లో అతడు బ్యాటింగ్కు రాలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సూర్య మాత్రం డగౌట్లోనే ఉండిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తూ.. ఆల్రౌండర్లతో పాటు బౌలర్లను ముందుకు పంపాడు.ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్మన్ గిల్(5)లను అలాగే కొనసాగించిన సూర్య.. వన్డౌన్లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)ను పంపాడు. నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా (1), ఐదో స్థానంలో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26)లను ఆడించాడు.ఆ తర్వాత వరుసగా తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను పంపాడు. ఈ క్రమంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒమన్ను 167 పరుగులకు పరిమితం చేసి విజయం సాధించింది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సూర్య తీసుకున్న నిర్ణయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందించాడు. ‘‘ఈ మ్యాచ్లో సూర్య బ్యాటింగ్ వస్తే కాసేపు ఫోర్లు, సిక్సర్లు కొట్టేవాడు. అతడికి అది మంచిది కూడా.అయితే, పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా సూర్యకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. తదుపరి అన్నీ కీలక మ్యాచ్లే. అందుకే ఒకవేళ టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోతే బ్యాటింగ్ పరిస్థితి ఏమిటన్నది చెక్ చేసేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు.కుల్దీప్ యాదవ్ను కూడా అందుకే బ్యాటింగ్కు పంపాడు. నిజంగా సూర్య వినూత్నమైన ఆలోచనలు గలవాడు. శ్రీలంకతో గతంలో ఓ మ్యాచ్లో తాను కూడా బౌలింగ్ చేశాడు. రింకూ చేతికి కూడా బంతినిచ్చాడు. తన నిర్ణయాలతో చేజారే మ్యాచ్లో టీమిండియాను గెలిపించాడు.ఇప్పుడు కూడా ప్రయోగం చేశాడు. తాను బ్యాటింగ్కు వెళ్లకుండా బౌలర్లు అర్ష్దీప్, కుల్దీప్లను ముందుకు పంపించాడు’’ అంటూ గావస్కర్ సూర్య నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసలు కురిపించాడు. కాగా లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా తదుపరి సూపర్-4 దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్లు ఆడనుంది. -
‘అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. టెస్టుల్లో మాత్రమే ఆడించడం అన్యాయం’
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైసూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. అయితే, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం సరికాదంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.టెస్టులలో దుమ్ములేపుతున్న జైసూభారత టెస్టు జట్టు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ తన స్థానం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రం నుంచే శతకాలు, ద్విశతకాలతో దుమ్ములేపుతున్న ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు 24 టెస్టుల్లో కలిపి 2209 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఆరు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డే, టీ20లలో మా త్రం నో ఛాన్స్ఇలా సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్న జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదు. టీమిండియా తరఫున 23 టీ20లలో 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులు రాబట్టగలిగాడు. టీ20లలో ఓపెనర్గా అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శుబ్మన్ గిల్ ఉండటంతో జైసూకు నిరాశ తప్పడం లేదు.అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ఈ విషయాల గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్ను మూడు ఫార్మాట్లలో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘యశస్వి మంచి ఆటగాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలడు. కానీ ఇప్పుడు అతడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడిస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. అతడికి అన్యాయం చేసినట్లే. యశస్విని తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడించాలి. స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడించడంతో పాటు.. తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ యశస్వికి అవకాశం ఇవ్వాలి. అతడిని ఆసీస్ పర్యటనలో వన్డేల్లో ఆడిస్తారనే అనుకుంటున్నా.అంతేకాదు.. శ్రేయస్ అయ్యర్తో కలిసి యశస్వి కూడా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతాడని నమ్ముతున్నా. దీనిపై నాకు సమాచారం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆసియా కప్ ముగించుకున్న తర్వాత కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడే జట్టులో యశస్వి జైస్వాల్కు చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్నా.. శ్రేయస్ అయ్యర్కు కనీసం రిజర్వు ప్లేయర్గానూ స్థానం దక్కలేదు. ఇక ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. -
ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో పాక్ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆటగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేశాడు. ఈ యువ సంచలనం తన ఇన్నింగ్స్ను 238.46 స్ట్రైక్ రేట్తో ముగించాడు. ఈ మ్యాచ్లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.పాకిస్తాన్పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువరాజ్ సింగ్ 2012లో పాక్పై 200.00 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 238.46 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అభిషేక్.. యువీని అధిగమించాడు. కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్ది కీలక పాత్ర. అతడి గైడెన్స్లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వరల్డ్ నెం1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
అభిషేక్, సూర్య మెరుపులు.. పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5ఓవర్లలో చేధించింది.ఈ స్వల్ప లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 47), శివమ్ దూబే(10) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.కుల్దీప్ మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు ఆర్హత సాధించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సెప్టెంబర్ 19న ఒమన్తో తలపడనుంది.#PKMKBForever#INDvsPAK pic.twitter.com/wSdhqOsx8R— Sarcastic Ujel (@Sarcasticujel) September 14, 2025 -
అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియో
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్పై అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఈ పంజాబ్ ఆటగాడు ఉతికారేశాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో అభిషేక్ తొలి బంతినే బౌండరీకి మలిచాడు. ఆ తర్వాత రెండో బంతికి లాంగాఫ్ మీదగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది. మళ్లీ మూడో ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో అభిషేక్ ఓ ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు యూఏఈతో మ్యాచ్లో అభిషేక్ కూడా 30 పరుగులు చేశాడు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్తో 47 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు.6️⃣ & 4️⃣ last time, 4️⃣ & 6️⃣ this time 🥵🥶Stay put & watch #INDvPAK as Abhishek takes off - #DPWORLDASIACUP2025. LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup pic.twitter.com/guAssBLFJC— Sony LIV (@SonyLIV) September 14, 2025 -
IND vs PAK: మనదే ఏకపక్ష విజయం.. అలా వద్దే వద్దు!.. ఊరించి మరీ..!
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడేందుకు ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి (సెప్టెంబరు 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సబా కరీం, ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అతడికి తిరుగులేదుటీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం మాట్లాడుతూ.. భారత్- పాక్ మ్యాచ్లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ‘‘పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది- టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇక కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయబోతున్నాడదనేది కూడా ఆసక్తికరం. బుమ్రా గురించి మాత్రం నేను మాట్లడను. ఎందుకంటే.. అతడికి తిరుగులేదు. ఎవరితో పోటీ కూడా లేదు. ఈసారి పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందనే అనుకుంటున్నా.ఏకపక్ష విజయంటీమండియా ఏకపక్ష విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జట్టు పటిష్టంగా ఉంది. అందుకే సులువుగానే గెలుస్తారని నమ్ముతున్నా’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అయితే, భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.ఆఖరి వరకు సాగాలి.. ఊరించి గెలవాలి‘‘భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగాలి. టీ20 ప్రపంచకప్-2022లో చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ బుమ్రా హీరో అయ్యాడు. ఈసారి కూడా పాక్ను ఊరించి మరీ టీమిండియా విజయం సాధించాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించాడు.కాగా 2022 ప్రపంచకప్లో భారత్ ఆఖరి బంతికి పరుగు తీసి.. పాక్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2024 వరల్డ్కప్ టోర్నీలో ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. ఈసారి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఏఈపై అద్భుత విజయం సాధించగా.. పాక్ ఒమన్ను ఓడించింది.బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్లుపహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ను టీమిండియా బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ టోర్నీ కావున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాయాదుల పోరుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
భారత్తో మ్యాచ్.. అతడిని చూసి వణకిపోతున్న పాకిస్తాన్!
ఆసియాకప్-2025లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల తర్వాత దాయాదుల పోరు జరగనుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ హైవోల్టేజ్ ఈ మ్యాచ్ కోసం తమ వ్యూహాలను ఇరు జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్లలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. యూఏఈతో ఆడిన తుది జట్టునే పాక్తో మ్యాచ్కు భారత్ కొనసాగించే అవకాశముంది.అభిషేక్ 'ఫియర్'అయితే భారత యువ సంచలనం అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ భయపడుతందంట. అతడి కోసం పాక్ టీమ్ మెనెజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అభిషేక్ను ఎలాగైనా పవర్ ప్లే లోపు ఔట్ చేసేందుకు మెన్ ఇన్ గ్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్కు సంబంధించిన పాత వీడియోలను పాక్ హెడ్ కోచ్ తమ బౌలర్లకు చూపించి ప్రాక్టీస్ చేయస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్కు అవుట్సైడ్ ఆఫ్స్టంప్ బంతుల వీక్నెస్ ఉంది. అతడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని పాక్ భావిస్తోంది. కానీ ఒక ఆరు ఓవర్ల పాటు అభిషేక్ క్రీజులో ఉంటే పాక్ బౌలర్లను షేక్ ఆడించేస్తాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఈ పంజాబ్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్.. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. అంతర్జాతీయ టీ20ల్లో అతడి స్ట్రైక్ రేటు 193.50గా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఎన్నో తుపాన్ ఇన్సింగ్స్లు ఈ లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ ఆడాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్? -
'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'
ఆసియాకప్-2025లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది.అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని భారత్ అందుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్లో దుమ్ములేపిన అభిషేక్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాము. అందుకే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాము. రెండు ఇన్నింగ్స్లోనూ వికెట్ ఒకేలా ఉంది. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము ప్రతీ మ్యాచ్లోనూ మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాము. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. కానీ వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం దుబాయ్లో వాతవారణం చాలా వేడిగా ఉంది. నిజంగా కుల్దీప్ యాదవ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి దూబే, బుమ్రా, వరుణ్ నుంచి సపోర్ట్ లభించింది. ఇక అభిషేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడొక అద్భుతం. జట్టు 200 పరుగులు చేధించినా, టార్గెట్ 50 అయినా అతడి ఆట తీరు ఒకే విధంగా ఉంటుంది. అందుకే అతడు ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: Asia Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా -
Asia Cup 2025: రోహిత్ శర్మ సరసన అభిషేక్ శర్మ
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈతో నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్లో చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెట్టిన అభిషేక్.. యూఏఈ బౌలర్లపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సరసన చేరాడు.ABHISHEK SHARMA - HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0— Johns. (@CricCrazyJohns) September 10, 2025రోహిత్ (2021లో ఇంగ్లండ్పై), జైస్వాల్ (2024లో జింబాబ్వేపై), సంజూ (2025లో ఇంగ్లండ్పై) కూడా గతంలో అభిషేక్ తరహాలనే ఇన్నింగ్స్ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు.భారీ విజయంఅభిషేక్ విధ్వంసం ధాటికి యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంతుల పరంగా టీ20ల్లో భారత్కు ఇదే భారీ విజయం. మరో 93 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఊదేసింది. 2021లో స్కాట్లాండ్పై 81 బంతులు మిగిలుండగానే గెలుపొందడం దీనికి ముందున్న రికార్డు.ఆసియా కప్ చరిత్రలోనూ బంతుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ఈ మ్యాచ్లో టీమిండియా మరో ఘనత కూడా సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 27 బంతుల్లోనే టార్గెట్ను ఊదేసింది. ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022 ప్రపంచకప్లో ఆ జట్టు ఒమన్పై కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ ఇన్నింగ్స్లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు (22), ముహమ్మద్ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్, శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) ధాటికి 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో తలపడనుంది. -
టీమిండియా సూపర్ విక్టరీ.. 27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
ఆసియాకప్-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వసీం మహ్మద్(19) ఆరంభంలో పర్వాలేదన్పించారు. షరాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబే మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు.అభిషేక్ ధానాధన్..అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది.చదవండి: Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో -
అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?: అక్తర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మంగళవారం మొదలైంది. గ్రూప్-‘బి’ మ్యాచ్లో భాగంగా హాంకాంగ్పై అఫ్గనిస్తాన్ 94 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టాపర్గా నిలిచి.. రన్రేటు పరంగా (+4.700)నూ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ క్రమంలో గ్రూప్-‘ఎ’ తొలి మ్యాచ్లో భాగంగా టీమిండియా- యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. దుబాయ్లో బుధవారం నాటి ఈ మ్యాచ్కు భారత తుదిజట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?భారత్ పటిష్ట జట్టుగా పేర్కొన్న అక్తర్.. ఉన్న పదిహేను మంది సూపర్ అని.. వారిలో ఎవరిని పక్కనపెడతారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘అచ్చా.. అభిషేక్ వచ్చేశాడు. బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు. అంతేకాదు సంజూ కూడా ఉన్నాడు. తిలక్ ఉన్నాడు.హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, రింకూ సింగ్ కూడా ఉండనే ఉన్నారు. శుబ్మన్ ఉన్నాడు. సూర్య ఉన్నాడు. శివం దూబేతో పాటు మన అక్షర్ పటేల్ కూడా!.. ఇందులో ఎవరిని తప్పించగలరు మిత్రమా!’’ అంటూ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.కత్తిమీద సాములాప్రస్తుత పరిస్థితుల్లో భారత తుదిజట్టు కూర్పు మేనేజ్మెంట్కు కత్తిమీద సాములా మారిందంటూ టీమిండియా అత్యంత పటిష్టంగా ఉందని అక్తర్ చెప్పకనే చెప్పాడు. ఇక తొలి మ్యాచ్లో సూర్యకుమార్ సేన విజయం నల్లేరు మీద నడకేనన్న అక్తర్.. యూఏఈ కూడా మంచి జట్టేనని కితాబులు ఇచ్చాడు.ఓటమి ఖాయమే.. కానీ కనీసం‘‘టీమిండియా చేతిలో యూఏఈ ఓడిపోతుందని తెలుసు. అయితే, తక్కువ తేడాతో ఓడిపోవాలని ఆకాంక్షిస్తున్నా. తొలి మ్యాచ్లో అఫ్గనిస్తాన్ చేతిలో హాంకాంగ్ చిత్తుగా ఓడింది. కనీసం మీరైనా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాస్తైనా పోరాట పటిమ కనబరచండి. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినా పర్లేదు. అది కూడా గొప్ప అచీవ్మెంట్ లాంటిదే’’ అని అక్తర్ యూఏఈ జట్టుకు సూచించాడు.దాయాదితో ఆరోజే పోరుఇదిలా ఉంటే.. రెండో మ్యాచ్లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొడుతుంది. సెప్టెంబరు 14న ఈ హై వోల్టేజీ మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది. ఇక లీగ్ దశలో ఆఖరిగా భారత జట్టు.. సెప్టెంబరు 19న ఒమన్తో తలపడుతుంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో నిలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచాయి. మిగతా జట్లలో బంగ్లాదేశ్ రెండుసార్లు ఫైనల్ చేరి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆసియా కప్-2025కి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసియా కప్-2025: ‘యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 టోర్నీ మంగళవారం మొదలైంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది.అనంతరం సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, సెప్టెంబరు 19న ఒమన్తో మ్యాచ్తో సూర్యకుమార్ సేన తమ లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా యువ స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అరంగేట్రంలోనే డకౌట్.. ఆ తర్వాతకాగా పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్లో సత్తా చాటి.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్లో అరంగేట్రంలోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్లో 47 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో ఓపెనర్గా పాతుకుపోయిన అభిషేక్.. ఇప్పటి వరకు 17 మ్యాచ్లలో కలిపి 33కు పైగా సగటుతో 193కు పైగా స్ట్రైక్రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.వైస్ కెప్టెన్గా రీఎంట్రీఇక మరోవైపు.. దాదాపు ఏడాది కాలం తర్వాత వైస్ కెప్టెన్గా టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుబ్మన్ గిల్. టెస్టుల్లో ఇప్పటికే సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది.యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడుఇక ఆసియా కప్-2025లో తొలి మ్యాచ్కు అభిషేక్, గిల్ సిద్ధమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘యూఏఈ పిచ్లపై కూడా అభిషేక్ శర్మ దూకుడైన ఆట కొనసాగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా అతడో సూపర్ ప్లేయర్. యువరాజ్ సింగ్ అప్గ్రేడ్ వర్షన్ లాంటోడు.గిల్కు మంచి అవకాశంఇక ఈ టోర్నీలో పరుగులు చేయాలనే ఒత్తిడి శుబ్మన్ గిల్పై తప్పక ఉంటుంది. 140- 150కి పైగా స్ట్రైక్రేటుతో అతడు పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఈసారి ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడు అయ్యేందుకు గిల్కు మంచి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో అభిషేక్ శర్మ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్గా.. 14 మ్యాచ్లలో కలిపి 439 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్.. 15 మ్యాచ్లు ఆడి 650 పరుగులతో టాప్-4లో నిలిచాడు.చదవండి: టెంబా బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..! -
గిల్ వద్దు!.. టీమిండియా ఓపెనర్గా అతడే సరైనోడు: రవిశాస్త్రి
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. టాపార్డర్లో విశ్వరూపం ప్రదర్శించే సంజూ శాంసన్ (Sanju Samson)ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనర్గా తప్పించవద్దని జట్టు యాజమాన్యానికి సూచించాడు.వైస్ కెప్టెన్ అయినప్పటికీ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా సంజూను రీప్లేస్ చేయలేడని.. అతడు వేరొక స్థానంలో బ్యాటింగ్కు రావాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. వైస్ కెప్టెన్గా..ఈ మెగా ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి గిల్కు పిలుపునిచ్చిన మేనేజ్మెంట్.. అతడిని వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ నేపథ్యంలో గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా వచ్చిన సంజూ శాంసన్పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.గిల్ లేనందు వల్లే సంజూ ఓపెనింగ్ చేశాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఓపెనర్గా అభిషేక్ శర్మ పాతుకుపోయాడంటూ కితాబులు ఇవ్వడం ద్వారా.. అభి- గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే సంకేతాలు ఇచ్చాడు.ప్రమాదకర బ్యాటర్ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మాత్రం సంజూ శాంసన్కే తన మద్దతు అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ‘‘టాపార్డర్లో అత్యంత ప్రమాదకర బ్యాటర్ సంజూ శాంసన్. అక్కడ ఆడిస్తేనే మనకోసం మ్యాచ్లు గెలవగలడు. కాబట్టి తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చకూడదు.సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులువేం కాదు. టాప్ ఆర్డర్లో టీమిండియా తరఫున టీ20లలో సంజూకు మంచి రికార్డు ఉంది. గిల్ కూడా అతడిని డిస్ప్లేస్ చేయలేడు. కాబట్టి గిల్ వేరొకరి స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిది.సంజూనే సరైనోడుసంజూ శాంసనే ఓపెనర్గా ఉండాలి. టీ20 ఫార్మాట్లో తనకు ఉన్న రికార్డును బట్టి సంజూనే సరైనోడు. టాప్లో రాణిస్తూ పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీలు కూడా చేసిన ఘనత అతడిది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.కాగా రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలోనే సంజూ టీమిండియాలో పునరాగమనం చేశాడు. అయితే, అతడికి వరుస అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో టీ20 ప్రపంచకప్-2021 జట్టులోనూ చోటు దక్కలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో స్థానం దక్కినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.జితేశ్ శర్మతో పోటీఇక గిల్ రాకతో ఆసియా కప్ టోర్నీలో కేవలం వికెట్ కీపర్ కోటాలొ సంజూ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అక్కడ కూడా జితేశ్ శర్మతో అతడికి పోటీ తప్పదు. జితేశ్ స్పెషలైజ్డ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో 42 టీ20 మ్యాచ్లు ఆడిన సంజూ.. మూడు శతకాల సాయంతో 861 పరుగులు చేశాడు.చదవండి: అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు? -
T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న ఘనత టీమిండియా సొంతం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో 2007లో పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత దాదాపు పదిహేడేళ్లకు అంటే.. 2024లో మరోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది భారత్.రో- కో గుడ్బై చెప్పిన తర్వాతఅమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా గతేడాది ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి కప్ను గెలుచుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma).. టీమిండియా విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.అభి- సంజూ జోడీ హిట్ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేయగా.. భారత టీ20 జట్టు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ నిలదొక్కుకున్నారు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ టెస్టులతో బిజీ కావడంతో ఈ జోడీకి వరుస అవకాశాలు వచ్చాయి.అయితే, ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా టీమిండియా ఓపెనర్లు మారే అవకాశం ఉంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి ప్రకటించిన జట్టులో గిల్ స్థానం దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ టెస్టు కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గానూ ఎంపికయ్యాడు.స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమేజట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలను బట్టి.. ఒక ఓపెనర్గా అభిషేక్ శర్మ ఖరారు అయినట్లే. అతడికి జోడీగా సంజూను కాదని గిల్ను పంపే అవకాశాలే ఎక్కువ. ఇక ఈ మెగా ఈవెంట్కు ప్రకటించిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్కు చోటు దక్కనే లేదు. అతడు స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే ఎంపికయ్యాడు.ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లుఇక టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్-2025 టోర్నీతో అభిషేక్- గిల్ టీమిండియా ఓపెనింగ్ జోడీగా దాదాపు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సురేశ్ రైనా మాత్రం భిన్నంగా స్పందించాడు. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు చెప్పాడు.ప్రియాన్ష్ ఆర్య కూడా ఓ ఆప్షన్!శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి యశస్వి ఓ ఓపెనర్గా ఉండొచ్చు. అంతేకాదు ప్రియాన్ష్ ఆర్యపై కూడా సెలక్టర్లు దృష్టి సారించవచ్చు. ఇక అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఉండనే ఉన్నారు.ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉండవచ్చు. అయితే, నా మొదటి ప్రాధాన్యం మాత్రం అభిషేక్ శర్మకే. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడుకాడని చెప్పేందుకు పెద్ద కారణాలు లేవు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన ప్రియాన్ష్ ఆర్య 17 మ్యాచ్లలో కలిపి 475 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
Asia Cup 2025: టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈసారి యూఏఈ వేదికగా నిర్వహించే టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్కు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్గా కొనసాగించిన యాజమాన్యం.. రీఎంట్రీ ఇచ్చిన శుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించింది.ఓపెనింగ్ జోడీ ఎవరో?ఇక గిల్ గైర్హాజరీలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఉన్న సంజూ శాంసన్కు కూడా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. అతడిని కేవలం వికెట్ కీపర్గా మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. మరోవైపు.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని ఈ ఈవెంట్కు అందుబాటులోకి రావడం సానుకూలాంశం.ఇక బుమ్రాతో పాటు టీ20 స్పెషలిస్టు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా పేస్ బౌలింగ్ విభాగంలో చోటు దక్కించుకోగా.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమ బెర్తులు ఖరారు చేసుకున్నారు. ఇక తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించారు.సెప్టెంబరు 9-28 వరకుకాగా సెప్టెంబరు 9-28 వరకు ఆసియా కప్ టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. అఫ్గనిస్తాన్- హాంగ్కాంగ్ మ్యాచ్తో ఈ ఖండాంతర క్రికెట్ ఈవెంట్కు తెరలేవనుండగా.. భారత్ సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబరు 14న పాకిస్తాన్తో, సెప్టెంబరు 19న ఒమన్తో భారత జట్టు ఆడుతుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో భారత్ విజయం సాధిస్తుందన్న వీరూ భాయ్.. ముగ్గురు ఆటగాళ్లను గేమ్ ఛేంజర్లుగా పేర్కొన్నాడు.టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు‘‘ఈ టోర్నీలో అభిషేక్ శర్మ గేమ్ ఛేంజర్గా మారనున్నాడు. ఇక బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సత్తా అతడి సొంతం. ఇక మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఓ గేమ్ ఛేంజర్. వన్డే ఫార్మాట్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అతడు ప్రభావం చూపాడు. అదే విధంగా.. టీ20 ఫార్మాట్లోనూ ఉత్తమంగా రాణించగలడు.ఫాస్ట్ బౌలర్లు ఫిట్గా ఉంటే..ఈ ముగ్గురు గనుక స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. టీమిండియాను అన్ని మ్యాచ్లలో గెలిపించగలరు’’ అని వీరేందర్ సెహ్వాగ్ సోనీ స్పోర్ట్స్తో పేర్కొన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా బౌలర్లు.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఫిట్గా ఉంటే.. తిరుగు ఉండదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఫాస్ట్ బౌలర్లు పూర్తి ఫిట్గా ఉంటే.. ఆసియా కప్తో పాటు వరల్డ్కప్లోనూ టీమిండియా గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో మెగా టైటిల్ సాధించింది.చదవండి: అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్ -
సంజూ కాదు!.. ఆసియా కప్ ఓపెనర్గా అతడు ఫిక్స్: అగార్కర్
ఆసియా కప్-2025 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ఖరారు చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ మెగా ఈవెంట్ ఆడబోయే జట్టును మంగళవారం ప్రకటించింది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఆసియా కప్ ఆడబోయే భారత జట్టులోని సభ్యుల పేర్లు వెల్లడించాడు. ఈ ఖండాంతర టోర్నీతో టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill).. టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయనున్నాడు.ఓపెనింగ్ జోడీ ఎవరు?అంతేకాదు.. సూర్యకు డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా గిల్ ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.అయితే, ప్రస్తుత ఆసియా కప్ జట్టులో సంజూకు చోటు దక్కినా.. గిల్ రాకతో ఓపెనర్గా అతడిపై వేటు పడటం ఖాయమే కనిపిస్తోంది. కేవలం వికెట్ కీపర్ బ్యాటర్గా మాత్రమే అతడి పేరును పరిశీలనలోకి తీసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే ఎంపిక చేయడంతో సంజూకు కాస్త ప్రమాదం తప్పినట్లే విశ్లేషకులు అంటున్నారు.అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘‘శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టి సంజూ శాంసన్ ఓపెనర్గా వచ్చాడు.అలాగే అభిషేక్ శర్మ కూడా!.. అయితే, ఓపెనర్గా అభిషేక్ అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. పార్ట్టైమ్ స్పిన్నర్గానూ పనికివస్తాడు. ఇక అభిషేక్ శర్మకు జోడీగా ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు.అక్కడకు వెళ్లాకే నిర్ణయంశుబ్మన్ గిల్, సంజూ శాంసన్.. ఈ ఇద్దరూ మంచి ఓపెనింగ్ బ్యాటర్లు.అయితే, దుబాయ్లో ఓపెనర్గా ఎవరు వస్తారని అక్కడే నిర్ణయిస్తాం. ఇక గిల్ అంతకు ముందు కూడా వైస్ కెప్టెన్గా జట్టులో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇందులో ఎలాంటి సమస్య లేదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మను మొదటి ప్రాధాన్య ఓపెనర్గా చెప్పిన అగార్కర్.. గిల్ రాకతో సంజూపై ఓపెనర్గా వేటు పడక తప్పదనే సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆసియా కప్-2025కి ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
‘ఆసియా కప్- 2025: టీమిండియా ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ!’
ఆసియా కప్-2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను కొనసాగించాలన్న చిక్కా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను మాత్రం పక్కనపెట్టాలని సూచించాడు. అభిషేక్కు జోడీగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపే తాను మొగ్గుచూపుతానని పేర్కొన్నాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్లు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.అందుకే సంజూ వద్దుఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇటీవల ఇంగ్లండ్తో సొంతగడ్డపై టీ20 సిరీస్లో సంజూ శాంసన్ షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు.ప్రత్యర్థి జట్టు అతడి బలహీనతను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంజూతో ఓపెనింగ్ చేయిస్తే టీమిండియాకు కష్టమే. ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయితే.. ఓపెనర్గా అభిషేక్ శర్మకే నా మొదటి ప్రాధాన్యం.వైభవ్ సూర్యవంశీ ఉండాలిఅతడికి జోడీగా నేనైతే వైభవ్ సూర్యవంశీ లేదంటే సాయి సుదర్శన్ను ఎంపిక చేస్తాను. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 ఆడబోయే 15 మంది సభ్యుల భారత జట్టులోనూ నేను వైభవ్ సూర్యవంశీని చేరుస్తాను. అతడు అంత అద్భుతంగా ఆడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘ఐపీఎల్-2025లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా రాణించాడు. అందుకే.. అభిషేక్కు జోడీగా వైభవ్తో పాటు సాయి, జైస్వాల్ల పేర్లను కూడా నేను పరిశీలనలోకి తీసుకుంటా.వికెట్ కీపర్గా మాత్రం సంజూకు చోటుఇది పోటాపోటీ ప్రపంచం. సంజూ శాంసన్కు ఈ జట్టులో ఓపెనర్గా అవకాశం దక్కకపోవచ్చు. కానీ వికెట్ కీపర్గా సంజూ జట్టులో ఉండే అవకాశం ఉంది. అతడికి బ్యాకప్గా జితేశ్ శర్మను తీసుకుంటే బెటర్.ఇక శ్రేయస్ అయ్యర్ కూడా తప్పక టీ20 జట్టులోకి తిరిగి రావాలి. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ల అవసరం జట్టుకు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. సంజూ ప్రదర్శన ఇలాకాగా సంజూ శాంసన్ గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో పాటు.. ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో మాత్రం ఐదు ఇన్నింగ్స్లో కలిపి 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు సంజూ. మరోవైపు.. అభిషేక్ శర్మ 279 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకువెళ్లాడు. ఇక 14 ఏళ్ల బిహారీ ప్లేయర్ వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాల్స్ తరఫున.. అదే విధంగా.. ఇంగ్లండ్లో భారత అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ‘కోహ్లి కాదు!.. వాళ్లిద్దరికి బౌలింగ్ చేయడం కష్టం.. సచిన్ స్మార్ట్’ -
Asia Cup: కెప్టెన్గా గిల్!.. సంజూ అవుట్?.. అతడి రీఎంట్రీ?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా తదుపరి మెగా టోర్నమెంట్లో పాల్గొననుంది. సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆసియా కప్-2025 (Asia Cup 2025)కు భారత ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కు ఆతిథ్య జట్టు భారత్ అయినా.. తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్లు జరుగనున్నాయి.సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.కెప్టెన్గా అతడు?!కాగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ మెగా టోర్నీ ఆడతాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్న సూర్య.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే, ఆసియా కప్ నాటికి అతడు పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది.ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీమిండియా పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తున్నా.. శుబ్మన్ గిల్ రాకతో ఇది సాధ్యం కాదనిపిస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్గా ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీసిన గిల్.. అంతకు ముందు ఐపీఎల్-2025లోనూ గుజరాత్ టైటాన్స్ సారథిగా సత్తా చాటాడు.ఈ క్రమంలో ఐపీఎల్, ఇంగ్లండ్లో ప్రదర్శన ఆధారంగా గిల్ టీ20 జట్టులోకి తిరిగి వస్తే.. అతడే కెప్టెన్ అవుతాడని చెప్పవచ్చు. మరోవైపు.. టైటాన్స్ జట్టులో గిల్ సహచర ఓపెనర్, అత్యధిక పరుగుల వీరుడు (759) సాయి సుదర్శన్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.అభిషేక్ ఓకే.. సంజూ పరిస్థితి ఏంటి?ఒకవేళ వీరిద్దరు ఓపెనర్లుగా ఖరారైతే.. ఇన్నాళ్లుగా టీమిండియా టీ20 విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మల పరిస్థితి సంకటంలో పడుతుంది. మరోవైపు.. యశస్వి జైస్వాల్ నుంచి కూడా వీరికి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అభిషేక్ కాస్త సేఫ్గానే ఉన్నా.. ఫిట్నెస్ సమస్యలతో సతమతమైన సంజూకు మాత్రం చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది.ప్లస్లూ.. మైనస్లూఅయితే, వికెట్ కీపర్గా సంజూకు ఉన్న అదనపు అర్హత అతడికి కాస్త ఊరట కలిగించే అంశం. ఏదేమైనా జైసూ వైపు సెలక్టర్లు మొగ్గుచూపితే మాత్రం సంజూకు కష్టాలు తప్పవు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి జట్టును సన్నద్ధం చేయాలని భావిస్తే జైసూకే సెలక్టర్లు ఓటు వేయొచ్చు.కానీ.. గత రెండేళ్ల కాలంలో టీమిండియా తరఫున మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం బాదిన సంజూకు తుదిజట్టులో చోటివ్వకుంటే మాత్రం విమర్శలు తప్పవు. అయితే, 21 ఇన్నింగ్స్లో అతడు ఐదుసార్లు డకౌట్ కావడం, ఐదుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం కూడా గమనించాల్సిన విషయం.ఇక వికెట్ కీపర్గానూ జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ల రూపంలో సంజూకు పోటీ ఎక్కువగానే ఉంది. పంత్ గాయపడ్డాడు కాబట్టి అతడిని పక్కనపెట్టినా మిగతా వాళ్లు మాత్రం కచ్చితంగా రేసులో ఉంటారు.శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ? ఈ టోర్నీలో సంజూతో పాటు సెలక్టర్లకు తలనొప్పి తెప్పించే మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది.. శ్రేయస్ అయ్యర్. టెస్టులు, టీ20ల నుంచి టీమిండియా సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినా దేశీ క్రికెట్, ఐపీఎల్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపుతున్నాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(వన్డే)ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్-2025లోనూ అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఎంపికైన ఈ కాస్ట్లీ ప్లేయర్ (రూ. 26.75 కోట్లు) ఇటు సారథిగా.. అటు బ్యాటర్గా ఆకట్టుకున్నాడు.17 మ్యాచ్లలో కలిపి 604 పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ను ఫైనల్కు తీసుకువెళ్లాడు. అయితే, ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడటంతో ఈసారి ట్రోఫీని మిస్సయ్యాడు. కాగా గతేడాది అతడు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా టైటిల్ అందించిన విషయం తెలిసిందే.గత 12నెలల కాలంలో 25 ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 949 పరుగులు సాధించడం.. అతడి నిలకడైన ఆటకు నిదర్శనం. మరి ఈసారైనా శ్రేయస్కు టీ20 జట్టు తలుపులు తెరవకపోతే సెలక్టర్లపై విమర్శలు రావడం సహజం.చదవండి: బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ భావోద్వేగం -
Asia Cup 2025: ఆసియా కప్లో గిల్, జైస్వాల్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్లను ఆసియా కప్కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్లను టి20 టీమ్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీమ్ పరిశీలనలో ఉంది. సుదర్శన్ భారత్ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్కు 17 మందితో టీమ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్ గ్రూప్’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్ల విషయంలో టోర్నీకి ముంద ఫిట్నెస్ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. తాజాగా (జులై 30) విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు. తద్వారా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు.ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు చేరే క్రమంలో అభిషేక్ ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ను కిందకు దించాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లు ఉండగా.. హెడ్ వద్ద 814 పాయింట్లు ఉన్నాయి. ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో కూడా భారత బ్యాటరే ఉన్నాడు. 804 రేటింగ్ పాయింట్లతో తిలక్ వర్మ ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-10లో భారత్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. స్కై ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.గత వారం ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉండిన మరో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ (9) తాజా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. భారత బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 25, సంజూ శాంసన్ 33, శుభ్మన్ గిల్ 38, హార్దిక్ పాండ్యా 53, రింకూ సింగ్ 56, శివమ్ దూబే 61 స్థానాల్లో ఉన్నారు.టాప్-10లో అభిషేక్, హెడ్, తిలక్ తర్వాత సాల్ట్, బట్లర్, నిస్సంక, సీఫర్ట్, ఇంగ్లిస్, హోప్ ఉన్నారు. ఈ వారం ర్యాంకింగ్స్లో ఆసీస్ బ్యాటర్లు ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్ బాగా లబ్ది పొందారు. వీరిలో గ్రీన్ ఏకంగా 64 స్థానాలు మెరుగుపర్చుకొని 24 స్థానానికి ఎగబాకాడు. గ్రీన్ తాజాగా వెస్టిండీస్తో ముగిసిన ఐదు మ్యాచ్ల సిరీస్లో విశేషంగా రాణించాడు.సహచరుడు గిల్ కూడా టాప్లోనే..!టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అభిషేక్ టాప్ ర్యాంక్కు చేరగా.. అతని ఆప్త మిత్రుడు శుభ్మన్ గిల్ వన్డేల్లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. వీరిద్దరు టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ దగ్గర శిష్యరికం చేస్తుండటం విశేషం. అభిషేక్, గిల్ టీ20, వన్డే ఫార్మాట్లలో నంబర్ వన్ బ్యాటర్లుగా ఉండగా.. భారత్ రెండు ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుంది.అలాగే టెస్ట్ల్లో నంబర్ వన్ బౌలర్గా బుమ్రా, నంబర్ వన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా, నంబర్ వన్ టీ20 ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నారు. -
కపిల్ శర్మ షోలో సందడి చేసిన భారత క్రికెటర్ అభిషేక్ శర్మ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్ను అద్భుత విజయంతో ముగించామని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు విధ్వంసకర ఆటతో విరుచుకుపడుతుంటే తనకు కూడా కాస్త భయం వేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తమ జట్టులో అద్బుత ఆటగాళ్లు ఉన్నారని.. ఫైనల్ చేరే సత్తా ఉన్నా ఈసారి ఆ పని చేయలేకపోయామని పేర్కొన్నాడు.రేసు నుంచి నిష్క్రమించిన తర్వాతకాగా గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్.. ఈసారి మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్పై వీరబాదుడు మినహా ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత మాత్రం కమిన్స్ బృందం వింటేజ్ బ్యాటింగ్తో రెచ్చిపోయింది.ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో గెలిచిన రైజర్స్.. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో రహానే సేనపై 110 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32) రాణించగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 76) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.𝙃𝙚𝙖𝙙𝙞𝙣𝙜 towards a 𝙆𝙡𝙖𝙨𝙨𝙮 show 🍿#SRH cruising along at the moment ⛵Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/AMKTayK7PS— IndianPremierLeague (@IPL) May 25, 2025క్లాసెన్కు పూనకాలు ఇక హెన్రిచ్ క్లాసెన్ పూనకం వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 37 బంతుల్లో శతక్కొట్టిన క్లాసెన్.. ఐపీఎల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 105 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది సన్రైజర్స్.Sky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025లక్ష్య ఛేదనలో కేకేఆర్ను 18.4 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది. సన్రైజర్స్ బౌలర్ల విజృంభణతో రహానే సేన 168 పరుగులకే కుప్పకూలింది. ఇలా సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించడం పట్ల రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.‘‘అద్భుతమైన ముగింపు. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్లలో మేము సూపర్గా ఆడాము. మా వాళ్ల బ్యాటింగ్ భయంకరంగానే ఉందని చెప్పవచ్చు (నవ్వులు). మా ఆటగాళ్ల సమర్థత దృష్ట్యా నిజానికి ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లు ఇంత చెత్తగా ఆడాల్సింది కాదు.ఫైనల్ చేరాల్సిన జట్టుఫైనల్కు చేర్చగల సత్తా ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కానీ ఈసారి మేము ఫైనల్ చేరలేకపోయాం. ఢిల్లీ వికెట్ మీద మా వాళ్లు అదరగొట్టారు. ఈసారి మా జట్టు బాగానే ఉంది. అయితే, కొంత మంది గాయాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయారు. జట్టులోని 20 మంది ఆటగాళ్ల సేవలను మేము ఉపయోగించుకున్నాము’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ పద్నాలుగింట ఆరు గెలిచి.. ఏడు ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో 13 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఆరోస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే గనుక ఏడో స్థానానికి పడిపోతుంది.చదవండి: IPL: రిటైర్మెంట్పై ధోని కీలక వ్యాఖ్యలు -
ఇద్దరిదీ తప్పే.. మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండి: రైనా ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)- సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తీరును టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టాడు. ఈ ఇద్దరు భారత క్రికెటర్ల నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదన్నాడు. అసలేం జరిగిందంటే... లక్నో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) చేతిలో ఓడింది. సోమవారం జరిగిన ఈ కీలక పోరులో రిషభ్ పంత్ సేన 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పవర్ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడిన అభిషేక్అయితే, లక్ష్యఛేదనకు దిగిన సన్రైజర్స్ ఓపెనర్లలో అభిషేక్... పవర్ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రవి బిష్ణోయి బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది సత్తా చాటాడు. మొత్తంగా 20 బంతుల్లోనే 59 పరుగులతో చెలరేగి మ్యాచ్ను సన్రైజర్స్ వైపు తిప్పేశాడు.గొడవపడిన దిగ్వేశ్, అభిషేక్ఇలా జోరుమీదున్న అభిషేక్ శర్మను దిగ్వేశ్ సింగ్ రాఠీ.. తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 8వ)లో అవుట్ చేసి ఎప్పట్లాగే నోట్బుక్ సంబరాలు చేసుకున్నాడు. వెళ్లు.. వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. ఈ సమయంలో క్రీజు నుంచి నిష్క్రమిస్తున్న అభిషేక్ దిగ్వేశ్ను చూసి ఏదో అన్నాడు.వెంటనే రాఠీ అతడివైపు దూసుకొచ్చి వాగ్వావాదానికి దిగాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్లు కల్పించుకోవడంతో ఈ జగడం అక్కడితోనే ఆగిపోయింది. అయితే ఈ సీజన్లో దిగ్వేశ్ రాఠి పరిధి దాటడం ఇది మూడోసారి! ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం దిగ్వేశ్ సింగ్పై మ్యాచ్ నిషేధం పడింది.మ్యాచ్ ఆడకుండా నిషేధం‘ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాం. ఈ ఒక్క సీజన్లోనే నియమావళిలోని ‘లెవెల్ 1’ను మూడోసారి అతిక్రమించడంతో 2 డీమెరిట్ పాయింట్లు కూడా విధించాం. ఇదివరకే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉండటంతో మొత్తం 5 డీమెరిట్ల కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్తో, 4న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ల్లోనూ దిగ్వేశ్ ఇలాగే అతి సంబరాలతో డీమెరిట్ పాయింట్లకు గురయ్యాడు.అదే విధంగా.. సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా ఐపీఎల్ నిర్వాహకులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేశారు. ఈ ఘటనపై స్పందించిన సురేశ్ రైనా.. దిగ్వేశ్- అభిషేక్ల తీరును విమర్శించాడు.మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండిస్టార్ స్పోర్ట్స్ కామెంట్రీలో భాగంగా... ‘‘దిగ్వేశ్ రాఠీ నోట్బుక్లో అభిషేక్ శర్మ పేరు కూడా చేరిపోయింది. అప్పుడే ఈ ‘యుద్ధం’ జరిగింది. నేను నిన్నేమీ అనలేదని దిగ్వేశ్ అభిషేక్కు చెప్పినట్లు కనిపించింది.ఏదేమైనా ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరూ భారత ఆటగాళ్లే. వారి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు’’ అని సురేశ్ రైనా పెదవి విరిచాడు.గౌరవం ఇవ్వడం నేర్చుకోఅదే విధంగా.. భారత మరో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం కాస్త కష్టంగానే ఉన్నా.. తప్పదంటూ దిగ్వేశ్ను విమర్శించాడు. అయితే, రాఠీ తన ఆటలో దూకుడు కొనసాగిస్తూనే.. మైదానంలోని ప్రతీ ఆటగాడికి గౌరవం ఇస్తేనే విజయవంతంగా ముందుకు సాగగలడని అభిప్రాయపడ్డాడు. చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ The intensity of a must-win clash! 🔥#DigveshRathi dismisses the dangerous #AbhishekSharma, & things get heated right after! 🗣️💢Is this the breakthrough #LSG needed to turn things around? 🏏Watch the LIVE action ➡ https://t.co/qihxZlIhqW #IPLRace2Playoffs 👉 #LSGvSRH |… pic.twitter.com/TG6LXWNiVa— Star Sports (@StarSportsIndia) May 19, 2025 -
IPL 2025: అభిషేక్ శర్మతో గొడవ.. దిగ్వేశ్ రాఠీపై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమయ్యింది.ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe— Johns. (@CricCrazyJohns) May 19, 2025సస్పెన్షన్ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్లో (మే 22న గుజరాత్తో) ఆడలేడు. ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించి గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్లో రాఠీ డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఓ సీజన్లో మూడు సార్లు కోడ్ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రాఠీ ఈ సీజన్లో పంజాబ్ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్ల్లోనూ కోడ్ను ఉల్లంఘించి డిమెరిట్ పాయింట్లు మూటగట్టుకున్నాడు.కాగా, దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ కాస్త శృతి మించాయి. అభిషేక్తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు. రాఠీ ఇంతలా రియాక్డ్ కావడానికి అంతకుముందు అభిషేక్ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఈ క్రమంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని ఓ మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రాజీవ్ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.


