Social Media
-
పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!
ఒక్కోసారి మనకు వచ్చే కష్టాలే దారి చూపేలా బతుకుతెరువును కూడా అందిస్తాయి. మనకే ఈ కష్టాలు అనుకుంటాం గానీ, ఒక్కోసారి మనలోని టాలెంట్, సృజనాత్మకతను వెలికితీస్తాయి అవి . కష్టం మనల్ని వదలకపోవచ్చు గానీ దానిపై సవారీ చేసేలా బతుకు మార్గం చూసుకోవాలి అని ఈ మహిళని చూస్తే అర్థమవుతుంది. ఆమె కథ వింటే కన్నీళ్లు వచ్చినా..గెలవాలని మాత్రం కచ్చితంగా ఆకాక్షిస్తారు.నెట్టింట వైరల్గా మారిన కోమల్ అనే మహిళ కథ ప్రతి ఒక్కరిని కదలించేలా మనసులను తాకుతుంది. మహారాష్టకు చెందిన కోమల్ గైక్వాడ్ అనే మహిళ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఇందులో పెద్ద వింత ఏముంది అని తీసిపారేయకండి. ఇక్కడే ఉంది అసలు కథ..!. ఆమె కళ్యాణ్ వీధుల్లో ఆటో నడుపుతూ..అటు జీవనాన్ని, ఇటు మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతోంది. అదెలా అంటే..ఆమె కథ ఏంటో తెలుసుకోవాల్సిందే మరి..!.కోమల్ ఆర్థిక కష్టాలు కారణంగా పదోతరగతితోనే చదువు ఆపేసింది. 2018లో వివాహం తర్వాత కళ్యాణ్ నగర్కు మారింది. అక్కడ ఆమె భర్త ఆటో నడిపేవాడు. కానీ తేజు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే..అతడు తన సొంతూరికి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దాంతో కోమల్ తన బిడ్డను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఎలాంటి ఆసరా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, దీనికి తోడు తేజును చూసుకునేవారు ఎవ్వరూ లేకపోవడంతో ఉద్యోగంలో కొనసాగడం అసాధ్యంగా మారింది. తన బిడ్డకు దూరంగా ఉండని పనిచూసుకోవాలని డిసైడ్ అయ్యి..డైవింగ్ నేర్చుకుంది. అలా అద్దె ఆటోతో మొదలుపెట్టిన కోమల్ ఎప్పుడూ తేజును పక్కనే ఉంచుకుని నగర రోడ్లుపై ప్రయాణించడం ప్రారంభించింది. మొదట్లో ఆటో వెనుకభాగంలో బిడ్డను పడుకునేలా సీటింగ్ ఏర్పాటుచేయాలనుకుంది. కానీ ఆ దూరం తన కూతురుకి ఇబ్బందిగా ఉండటంతో..తన సీటు పక్కనే చిన్న సీటు ఏర్పాటు చేసేలా ఉపాయం ఆలోచించి..అలా సెటప్ చేసింది. దాంతో తేజు రోజంతా తన దగ్గరే ఉండేలా..ఆటో నడపుకోవడం సులభమైంది కోమల్కు. ప్రస్తుతం కోమల్ రోజుకు రూ. 400 నుంచి రూ. 500 దాక సంపాదిస్తోంది. అంతేగాక ఈఎంఐ పద్ధతిలో తన సొంత రిక్షాను కొనుగోలు చేసి, మరో అడుగు ముందుకు వేసింది. కోమల్కి ఏమి పెద్దపెద్ద లక్ష్యాలు లేవు కేవలం తన కూతురుకి మంచి విద్యను అందించేలా, పాఠశాలకు పంపించడం తోపాటు తాను మరింతగా సంపాదించడమే ఆమె ఆకాంక్షలు. నిజంగా కోమల్ గ్రేట్ కదూ..భారం వదిలేసి పారిపోయిన భర్త గురించి పక్కనపెట్టి..కూతురు ఆలన పాలనా చూసుకునేలా నడుబిగించిన స్త్రీమూర్తి కదూ..!. నిజంగా ఆ అమ్మ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..) -
బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..
చాలామంది యువత కలలుగనే లగ్జరీ లైఫే ఈ వ్యక్తిది. ఎంతో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ హాయిగా సాగిపోతున్న జీవితానికి సడెన్గా స్వస్తి పలికి..ఏదో గొప్పజీవితం కోసం అన్వేషిస్తూ దేశాలు పర్యటించడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతడి లైప్ ఏవిధంగా యూటర్న్ తీసుకుని ఫ్యామిలీ మ్యాన్గా మారాడో తెలిస్తే అవాక్కవుతారు. పైగా ఆ తర్వాత కూడా తన నిర్ణయంలో మార్పు లేకపోగా..ఇలా బతకాలి అనేపించేలా రాజులా బతుకుతుండటం విశేషం. ఆ వ్యక్తి తన కథను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో..అందర్నీ అమితంగా ఆకర్షించేలా ఆలోచింపచేసింది. వ్యక్తిగత విజయం కంటే సంతృప్తి మిన్నా అనే చర్చలకే తెరలేపింది. ఆ పోస్ట్ ప్రకారం ఆవ్యక్తి ఐఐటీ చేసి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అతను విజయవంతమైన కార్పొరేట్ కెరీర్ని నిర్మించుకున్నాడు. 38 ఏళ్ల వయసు వచ్చేసరికి, అతను ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్లో డైరెక్టర్గా ఉన్నత స్థాయికి ఎదిగి, చాలామంది కోరుకునే లగ్జరీ లైఫ్ని లీడ్ చేశాడు. కానీ అవేమి తనకు సంతృప్తినివ్వక పోవడమే గాక వివిధ హోదాల వెంట తిరుగుతూ ఓ చట్రంలో ఇరుక్కుపోయిన ఫీలింగి కలిగింది అతడికి. దాంతో ఈ కార్పొరేట్ లైఫ్ నా వల్ల కాదు అని డిసైడ్ అయ్యి..2013లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు. కేవలం ప్రాథమిక అవసరాలతో సోలోగా పర్యటించడం మొదలు పెట్టాడు. అలా 18 నెలల్లో ఏకంగా 35 దేశాలను అన్వేషించాడు. విభిన్న సంస్కృతులు, అనుభవాల్లో మునిగిపోయాడు. కార్పొరేట్ బోర్డురూమ్ల నుంచి ప్రయాణ జీవితానికి మారడం, ఒక సరికొత్త దృక్పథాన్ని అందించింది. ఎలాంటి టార్గెట్లు లేని సరికొత్త లైఫ్ని గడుపుతున్నట్లు అనిపించింది అతడికి. సరిగ్గా మాంటెనెగ్రోలో పర్యటన అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అక్కడ అతను ఆస్ట్రియాకు చెందిన సామాజిక కార్యకర్త అయిన క్యాథీని కలిశాడు. ఒక చిన్న పరిచయంగా మొదలైనది త్వరలోనే ఒక గాఢమైన బంధంగా మారింది. కేవలం 10 నిమిషాల సంభాషణ.. పది రోజుల పాటు విడిచి ఉండలేని విధంగా బలపడింది వారి బంధం. అలా వారిద్దరూ చివరికి 2016లో పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు సాంప్రదాయాల కన్నా, అనుభవాలు, స్వేచ్ఛ, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చే జీవనశైలిని స్వీకరిస్తూ..ప్రపంచమంతటా పర్యటిస్తూ ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి సొంతంగా ఇల్లుగానీ, కారు గానీ లేవు. జస్ట్ హోమ్స్టే లేదా అద్దెంటిలో నివశిస్తోంది ఆ కుటుంబం. భారత్లో పెట్టిన పెట్టుబడుల సాయంతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. తమ పిల్లలకు వేదాలు, ఉపనిషత్తుల తోపాటు ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను ఉపయోగించి ఇంట్లోనే విద్యను అందిస్తున్నారు. అతను తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. 4 BHK ఇంటిని వదులుకుని మొత్తం ప్రపంచాన్ని పొందానని సగర్వంగా చెబుతున్నాడు. అంతేకాదండోయ్ ఇప్పుడే "జీవితాన్ని రాజులా గడుపుతున్నాను" అని పేర్కొన్నాడు. ఈ పర్యాటనలలోనే ఆ ముగ్గురు పిల్లలను కన్నారట. వారంతా సాధారణ ప్రసవం ద్వారానే పుట్టారట. డైపర్లు, ఆధునిక వైద్యం వంటివి లేకుండా పెంచారట. పైగా జీవితం అంటే ఏమవుతారని కాకుండా..మీరు ఎవరు అని తెలుసుకునేలా బోధిస్తున్నామని చెబుతోంది ఈ జంట. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్ఫ్రెండ్ మాత్రం..) -
ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్ఫ్రెండ్ మాత్రం..
ఎంతటి ప్రేమలో అయినా..చిన్న చిన్న మనస్పర్థలు సహజం. కానీ పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా అదే ప్రేమ కొనసాగితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు. ఆ బంధం ఎన్నటికీ అత్యంత బలమైనది..స్వచ్ఛమైనది కూడా. అలాంటి గొప్ప ప్రేమనే పొందాడు ఈ యువకుడు. ఆమె ఆ రోజు అండగా నిలిచి ధైర్యం ఇచ్చి ఉండకపోతే తాను బతికి ఉండేవాడిని కాదంటున్నాడు అశ్విన్. వారి ప్రేమ కథ అమరం, అఖిలం అనొచ్చు. అంత అందమైన ఆ క్యూట్ లవ్ స్టోరీ ఏంటో చూద్దామా..కేరళకు చెందిన ఆదిత్య అనే అమ్మాయి తన లవ్స్టోరీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తమ ప్రేమ కథ పాఠశాల రోజుల్లో 2014లో మొదలైందంటూ చెప్పుకొచ్చింది ఇలా. "ఆమెకు 14 ఏళ్లు, అశ్విన్కు 17 ఏళ్లు ఉన్నప్పుడు..కలిసి నవ్వుకోవడం, రోజువారి చదువు ఒత్తిళ్లు గురించి మాట్లాడుకోవడంతో స్నేహంగా మొదలైంది. క్రమంగా మా బంధం బలపడటం మొదలైంది. మొదటగా అశ్విన్ తన భావాలను వ్యక్తపరిచినప్పుడు..ఆదిత్య దిగ్బ్రాంతికి గురై..దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది". అయితే ఆ దూరంలోనే తనకు అశ్విన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైందని చెబుతోంది. దాంతో మళ్లీ తనని కలిసి తమ రిలేషన్ కొనసాగించినట్లు చెప్పుకొచ్చింది. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడం మొదలైంది కూడా. ఇక అశ్విన్ ఇంజనీరింగ్ చదవడానికి తమిళనాడుకి మారాడు. ఇద్దరి మధ్యం దూరం పెరిగినా..ఏదోలా కలుసుకుంటూ తమ బంధాన్ని నిలబెట్టుకున్నారు. అలా హాయిగా సాగుతున్న తరుణంలో తమ ప్రేమను ఓ కుదపు కుదిపేసింది ఆ రోడ్డు ప్రమాదం.అమాంతం అన్నింటిని మార్చేసిన ప్రమాదం..మే 2017లో మద్యం సేవించిన డ్రైవర్ కారణంగా జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదం అశ్విన్ దారుణంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ అతని కాలుని కాపాడటానికి సుదీర్ఘ వైద్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు అతని ప్రాణాలు కాపాడేందుకు ఆ కాలుని తొలగించక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని ఆదిత్య, అశ్విన్ తల్లి ద్వారా తెలుసుకుని కుంగిపోయింది. మానసిక మద్దతు అవసరమైన సమయంలో ఆదిత్యకు కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి. వైకల్యంతో జీవిస్తున్న అతడితో భవిష్యత్తు గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. దూరంగా ఉండాలని సూచించారు కూడా. ఈ ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే..ఆదిత్య తీవ్రంగా కుంగిపోయే స్థితికి చేరుకుంది. ఆమె ఆవేదన, తీవ్రమైన ప్రేమను చూసి..తల్లిదండ్రులే దిగొచ్చి అర్థం చేసుకున్నారు. ఇక అశ్విన్ సైతం ఆ ప్రమాదం తర్వాత శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా పోరాటం చేశాడు. తాను ఒక భారంగా మారిన జీవితంలోకి రావద్దని ఆదిత్యకు సూచించాడు అశ్విన్. ఈ సంబంధాన్ని ముగించమని చెప్పాడు. కానీ ఆమె అదే ప్రమాదం తనకు జరిగితే నువ్వే ఏం చేస్తావు అని అడిగి.. అశ్విన్ని మారుమాట్లాడకుండా చేసింది. తమ బంధాన్ని పునరుద్ధరించుకుని..తమ జీవితాలను తీర్చిదిద్దుకునే వైపుగా అడుగులు వేశారు ఇద్దరు. ఈలోగా అశ్విన్ తన ఇంజనీరింగ్ చదువుని పూర్తి చేసి ఉద్యోగం సంపాదించగా, ఆదిత్య కూడా తన చదువుని పూర్తి చేసింది. ఒకరికొకరు అందించే అచంచలమైన మద్దతులో పాతుకుపోయిని వారి వ్యక్తిగత ఎదుగుదల తోపాటు వారి సంబంధం కూడా పరిణితి చెందింది. అలా 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారిద్దారు. అయినా అప్పటికే ఇరు కుటుంబాలు వారి ప్రేమలో బలాన్ని చూసి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశాయి. ప్రస్తుతం వారిద్దరూ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ బంధమైన నిరంతర శ్రద్ధ, గౌరవంతో బలోపేతమవుతుందని చెబుతున్నారు ఈ దంపతులు. సరదాగా స్నేహంగా మొదలై ప్రేమగా చిగురించిన ప్రేమను..చిన్న చితకా సమస్యలు, గాలి వానలా వచ్చిన కష్టాలకు తట్టుకుని పోరాడి..విజయవంతంగా పెళ్లిపీటలు ఎక్కేలా చేసుకున్నారు. ఈ కేరళ జంట ప్రేమ నెటిజన్లను ఆకర్షించడమే కాదు పెద్ద ఎత్తున్న ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి కూడా. అయితే ఆదిత్య ఇది త్యాగం వల్ల నిలిచిన ప్రేమ కాదు..అవగాహన, నిబద్ధతపై నిలిచిన శాశ్వతమైన ప్రేమ అని బలంగా చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!) -
భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!
ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజం. అయితే వాటిని అధిగమిస్తు ఎలా ముదుకుపోతామనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టెకీ ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ.. అందంగా తీర్చిదిద్దుకున్న తన కెరీర్ సక్సెస్ని షేర్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఎవ్వరైన చూపించాల్సిన తెగువ, పట్టుదలను హైలెట్ చేస్తున్న ఈ స్టోరీ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఆ టెకీనే బారతీ సంతతికి చెందిన ప్రియాంక వర్గాడియా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో సీనియర్ డైరెక్టర్ డెవలపర్ జీటీఎం మార్కెటింగ్గా పనిచేస్తున్నారామె. ఇన్స్టాగ్రామ్లో తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు. పోస్ట్లో తన కెరీర్ ప్రారంభంలో చాలా పోరాటాలు, రిస్క్లు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో భారీ విద్యా రుణం తీసుకున్నానని వెల్లడించింది. అక్కడ అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు సుమారు రూ. 40 లక్షల దాక రుణం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత భారత్ నుంచి అమెరికాకు తన తొలి ఫ్లైట్ జర్నీ కోసం కూడా తన తండ్రి భూమిని తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఆ రోజు తన విదేశీ ప్రయాణం ఎంత భారమైందో మర్చిపోలేనని, అక్కడ ఒంటరిగా చదవు సాగించడం అంత సులభం కాదని అంటోంది. అక్కడ విద్యా వ్యవస్థకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుందని అంటోంది. ఎందుకంటే అక్కడ బోధనాపద్ధతులు, కొత్త వాతావరణానికి సర్దుకుపోవడం అంత సులభమైనవి కావని, పైగా తన చదువు, వంట, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు తన విద్యార్ధి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడిని కూడా భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన అప్పులు తీర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగం సంపాందించక తప్పని పరిస్థితి. ఇవన్నీ తనని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసేవని అంటోంది. ఈ సవాళ్లన్నింటిని ఎదుర్కొనడానికి తొందరలో మంచి భవిష్యత్తు కచ్చితంగా ఉందనే ఆశ..కొండంత ధైర్యాన్ని ఇచ్చేదని పేర్కొంది. ముందున్న జీవితం గురించి అంతరంగంలో నిశబ్దమైన ఉత్సాహం, అలాగే తాను తీసుకున్న సాహసం చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం తదితరాలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ ఆమె మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు. అలాగే తన ఉద్యోగం కారణంగా అనేక ప్రదేశాలకు పర్యటించే అవకాశం కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం తన తల్లిదండ్రులను అమెరికాకి తీసుకురావడం.. తాను సాధించిన అతిపెద్ద ఘనత అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులకు అదే తొలి విమాన ప్రయాణ అనుభవమని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఉద్యోగ కెరీర్ లైఫ్లో ఎన్నో విమాన ప్రయాణాలు చేసినా.. తన హృదయంలో మాత్రం.. ఆనాడు భయంతో చేసిన తొలి విమాన ప్రయాణానికే ఎప్పటికీ ప్రత్యేక స్థానం అని చెబుతోంది.(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
అసలు ఊహించలేదు.. భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు
కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి నిమిషాల వ్యవధిలోనే వైద్యుడిని ఏర్పాటు చేసి.. సకాలంలో వైద్య సహాయం అందించిన భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసల జల్లు కురిపించారు. మార్చి 13న బెంగళూరు నుంచి గుజరాత్కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటనను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.వృత్తిరీత్యా దంత వైద్యురాలైన ఓ తల్లి.. పాపకు మునగకాయ సూప్ (drumstick soup) తాగించింది. అనంతరం ఆ పాప పదేపదే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందిన ఆ తల్లి వెంటనే ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించి రైలులో మందులు ఎలా తెప్పించుకోవచ్చని అడిగారు. వేగంగా స్పందించిన రైల్వే సిబ్బంది.. రైలు హిందూపూర్ స్టేషన్కు చేరుకునే సరికి పాపకు వైద్యం అందించేందుకు అప్పటికే ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. ఆ వైద్యుడు చిన్నారిని పరీక్షించి అవసరమైన మందులు అందించారు."నేను నా బిడ్డకు మునగకాయ సూప్ తాగించాను.. ఆ తర్వాత, పాపకు చాలా వాంతులు అయ్యాయి.. నేను భయపడి రైలులో మందులు ఎలా ఆర్డర్ చేయాలని టీటీఈని అడిగాను. కానీ నేను వారి నుంచి పెద్దగా సహాయం ఆశించలేదు. వారు ఎంత వేగంగా స్పందించారో చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నా బిడ్డకు సహాయం ఊహించిన దానికంటే వేగంగా వైద్యం అందింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్ చేశారు View this post on Instagram A post shared by Dr. Bhavna K (@chaos_to_care) -
ఇంటిపై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ..!
అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. యూఎస్లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి ఈ స్మారక చిహ్నం. దీన్ని స్వేచ్ఛ, ఆశకు ప్రతీకగా చెబుతుంటారు. అయితే భారత్లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎందుకిలా అంటే..పంజాబ్లోని ఎన్నారై గుర్జీత్ సింగ్ మథారు జలంధర్లోని కిషన్ పురా ప్రాంతంలో తన ఇంటి నాల్గో అంతస్థుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా హైల్గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారట కూడా. రీజన్ ఏంటంటే..గుర్జీత్ సింగ్ న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఇది అని అన్నారు. 26 ఏళ్లుగా న్యూయార్క్లోనే నివశిస్తున్న గుర్జీత్ సింగ్కి ప్రతి ఏడాది భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగర జ్ఞాపకం ఉండేలా ఇలా ఆ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఈ నిర్మాణం స్థానిక ఆకర్షణగా మారింది. ఇది ఒకరకంగా విదేశీ జీవితానికి, స్వదేశంలోని తన మూలాలకు ఒక వ్యక్తిగత వారధిని నిర్మించినట్లు కనిపిస్తోంది ఆ కట్టడం. నెటిజన్లు కూడా పంజాబ్లోని ఓ చిన్న సైజ్ న్యూయార్క్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. VIDEO | Punjab: Gurjeet Singh Matharu, an NRI living in New York for 26 years, has installed a Statue of Liberty replica on the fourth floor of his home in Jalandhar’s Kishanpura area, drawing visitors from nearby and far away.He said the idea came from seeing the Statue of… pic.twitter.com/7PkZaTzJFO— Press Trust of India (@PTI_News) March 21, 2026 (చదవండి: పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!) -
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో కుక్క దాడులు దారుణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూకి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిపై ఓ పెంపుడు కుక్క దాడి ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తమ కుక్క దాడి చేస్తున్న సమయంలో దాని యజమానులు చూస్తూ ఉండిపోవడం దారుణం. దీంతో, వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వేదారణ్యం సమీపంలోని తోప్పుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడికి పాల్పడింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది.అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. వారితోనే(బాధితులతో యజమానులు) వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆమె కుక్కను కర్రతో కొట్టిన తర్వాత అది అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | நாகை: வேதாரண்யம் அருகே தாய் மற்றும் மகளை கடித்து தாக்கிய வளர்ப்பு நாயை வேடிக்கை பார்த்த உரிமையாளர் #SunNews | #DogIssue | #UntrainedDogs pic.twitter.com/xKB7LsyPTh— Sun News (@sunnewstamil) March 21, 2026 -
పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!
పైలట్ వృత్తిలో ఉండే వ్యక్తులకు మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఉంటాయని తెలుసా. అందరీ పైలెట్లకి రెండు ఫ్లైట్ జర్నీలు అత్యంత సర్వసాధారణం. మూడోది మాత్రం.. కొందరికే దొరికే సువర్ణావకాశం. అలాంటి లక్కీఛాన్స్ కొట్టేశాడు ఈ పైలట్. ఆ పట్టరాని సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఇలా. ఆ వ్యక్తే కెప్టెన్ అజమ్ అల్లి. ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ మధురమైన క్షణాన్ని కెమెరాలో బంధించి మరి పంచుకున్నారు. విమానంలో ప్రత్యేక ప్రకటన ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకంటూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఆయన శుభోధయం, లేడీస్ అండ్ జెంటిల్మన్ అంటూ స్పీచ్ స్టార్ట్ చేసి..మీ ఫైట్ డెక్ నుంచి మీ కెప్టెన్.. ఐయామ్ కెప్టెన్ అజమ్ అల్లి, అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పైలట్ జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయంటూ వాటిని వివరిస్తాడు. ఒక పైలట్కి ఎప్పటికీ మర్చిపోలేని మూడు ప్రయాణాలు ఉంటాయని పేర్కొన్నాడు. వాటిలో మొదటిది సోలో ఫ్లైట్ అని, దాదాపు 24 సంవత్సరాల క్రితం భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా ఉన్నప్పుడు తనకు ఎదురైన జర్నీ అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. రెండో ముఖ్యమైన ఘట్టం పదవీ విరమణకు ముందు చేసే చివరి విమానం ప్రయాణం. అయితే ఆ మైలురాయి తనకు ఇంకా దాదాపు రెండు దశాబ్దాల దూరంలో ఉందని అన్నారు. అన్నింట్లకంటే మూడో ఘట్టం అన్నింటికన్నా ప్రత్యేకమైనదంటూ ఇలా చెప్పారు. మూడోది బహుశా ఇది అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విమాన ప్రయాణం..ఎందుకుంటే కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం లభించడం. ఈ రోజు నాకు అలాంటి రోజే ఎదురైంది. నా భార్య, పిల్లలు, ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన మాటలు ముగిసిన వెంటనే..విమానంలోని ప్రయాణికులు చప్పట్లు కొడుతూ, చిరునవ్వులతో స్పందన తెలిపారు. కెప్టెన్ అల్లి ఈ వీడియోకి "ఒక పైలట్ ఎప్పటికీ మరచిపోలేని మూడు విమాన ప్రయాణాలు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Fishbed Motorist (@azam_ally) (చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!) -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
మా మాష్టారే పేషెంట్గా..!
మనల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గురువులు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి గౌరవప్రదమైన వ్యక్తులకు సేవ చేసే అవకాశం దొరకడం కూడా అత్యంత అరుదు. అలాంటి మహద్భాగ్యం ఈ డాక్డర్కి దొరికింది. అంతేగాదు ఆ క్షణాన్ని అత్యంత ప్రత్యేకం, అలాగే గర్వంగానూ ఉంది అంటూ సంబరపడిపోతాందా ఆ వైద్యురాలు.ఆ అదృష్టవంతురాలే డాక్టర్ ప్రతిభ నిఖార్ జునేజా. అందుకు సంబంధించిన వీడియోకు క్యాప్షన్గా డాక్టర్ జునేజా ఇలా రాశారు..ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం, భావోద్వేగభరితమైన రోజు అంటూ..తన కెదురైన మధురానుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన మాజీ గురువు డాక్టర్ బిడి గుప్తా తన క్లినిక్ని సందర్శించిన క్షణం గురించి పేర్కొంది. జామ్నగర్లోని ఎంపీ షా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ గుప్తా, డాక్టర్ జునేజాకు ఆమె మెడికల్ కాలేజీ రోజుల్లో బోధించారు. ఒకప్పుడూ తాను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకుందో ఆ వ్యక్తి ఈ రోజు తనని నమ్మి ఆయన ఆరోగ్యాన్ని తన చేతుల్లో పెట్టారని రాసుకొచ్చింది. డాక్టర్ అవ్వడం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది ఒక "బాధ్యత" అని ఇలాంటి క్షణాలు గుర్తు చేస్తాయని అంటోంది. మన ఉపాధ్యాయులు మనపై ఉంచే నమ్మకమే అన్నింటికన్న గొప్ప బహుమతి. అని భావోద్వేగంగా మాట్లాడింది. ఇన్నేళ్ల తర్వాత చికిత్స నిమిత్తం రావడం, ఆయన్ని కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం వంటివి అన్ని.. నిజంగా ఈ రోజుని మర్చిపోలేను అని అన్నారామె. అంతేగాదు తన ఉపాధ్యాయుడు తనపై ఉంచిన నమ్మకం పట్ల గర్వం, వినమ్రతను కలిగి ఉన్నానని అన్నారామె. నెటిజన్లు సైతం మన గురువులు డాక్టర్గా నమ్మే రోజుకి మించిన అనుభూతి మరోకటి లేదు అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!) -
రోడ్డు మధ్యలో బోరింగ్ పంపు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశం బయటకు రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేదాడి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. కాగా, సీఎం యోగి వస్తున్నారని.. అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. యోగి వస్తున్న కారణంగా మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్గా చేశారు. రోడ్డు పనులు చకచకా కానిచ్చేశారు కానీ.. నడిరోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ పంపును తీసివేయడం మర్చిపోయారు.🚨Mirzapur, UP's new PWD road built AROUND a hand pump. Coordination fail or planning blunder? Who's accountable for this public inconvenience? pic.twitter.com/l1juOKDIsA— indiainlast24hr (@indiain24hr) March 18, 2026బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. దీంతో, నెటిజన్లు యూపీ ప్రభుత్వం, అధికారులపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బోరింగ్ పంపు ఘటన ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా చేరడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజాగా రోడ్డుపై ఉన్న పంపును తొలగించారు. ఈ వీడియో సైతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పంపు వ్యవహారం సోషల్ మీడియాలో కొత్త చర్యలకు దారి తీసింది. Handpump In Middle Of The Road, Netizens Slam #PWD #Mirzapur #UttarPradesh #YogiAdityanath pic.twitter.com/VJyrKmY5x9— HW News English (@HWNewsEnglish) March 18, 2026 -
మైకేల్ జాక్సన్ని తలపించేలా ఆ తండ్రి డ్యాన్స్..!
ఓ కూతురు తన తండ్రి ఆ రైంజ్లో డ్యాన్స్ చేస్తాడని ఊహించలేదు. ఒక్కసారిగి విస్తుపోయి..చివరికి అతడితో కలిసి పాదం కదిపింది. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మేడమ్ బహిరంగంగా ప్లే చేస్తే..ఆయన టాలెంట్ ఏంటో తెలిసేది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు కూడా. వివరాల్లోకి వెళ్తే..ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియలో ఓ యువతి 'బిల్లీ జీన్' పాటకు డ్యాన్స్ చేయడంతో ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి మాములుగా ఆమె వద్దకు వస్తాడు. ఆ తర్వాత ఆతడు చాలా సులభంగా మూన్వాక్ చేయడంతో ఒక్కసారిగా ఆ దృశ్యం అనూహ్య మలుపు తీసుకుంటుంది. ఈ నాన్న సాధారణ దుస్తులతో ఉన్నప్పటికీ..చాలా సునాయాసంగా ఆత్మవిశ్వాసంగా చేస్తున్న ఆ డ్యాన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యంత నేచురల్గా కనిపించే ఆ క్షణం మధుర జ్ఞాపకంగా మారిపోయిందా కూతురికి. ఒక్క క్షణం ఆమె సైతం తన తండ్రి అద్భుతమైన డ్యాన్స్ చూసి నిశ్చేష్టురాలైపోతుంది. ఆ తర్వాత కొంచెంసేపటికీ అతనితో కలిసి అడుగులు కదపడానికి ప్రయత్నించడంతో వీడియో ముగుస్తుంది. కాగా 1982లో విడుదలైన 'బిల్లీ జీన్', మైఖేల్ జాక్సన్ అత్యంత ప్రసిద్ధ ఆల్బమ్లలో ఒకటైన 'థ్రిల్లర్'లోని ఒక భాగం. ఈ పాట పాప్ సంగీతం, నృత్య సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందులోనూ జాక్సన్ చేసిన మూన్వాక్ ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చిపెట్టింది. View this post on Instagram A post shared by 🧚 (@magic._.shopp_)(చదవండి: నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!) -
గ్యాస్ బ్లాక్ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం
అమెరికా-ఇజ్రాయెల్.. ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో, పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. తాజాగా యూపీలో బాత్రూమ్లో సిలిండర్లు దాచిన ఘటన, పశువుల పాకలో 200 సిలిండర్లు దాచి పెట్టిన ఘటనలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాత్రూమ్లో సిలిండర్లు..ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా దాచిపెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బదౌరా మార్కెట్లోని ఒక గృహోపకరణాల దుకాణంలో సోదాలు చేపట్టగా తాళం వేసి ఉన్న బాత్రూమ్ అధికారులకు కనిపించింది. అనుమానంతో గది తలుపును పగలగొట్టి చూడగా అందులో పదుల సంఖ్యలో ఫుల్ సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. ఈ ఘటన సమయంలోనే దుకాణం యజమాని మున్నీలాల్ విశ్వకర్మ, అతని కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు రీఫిల్లింగ్ పరికరాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, జాన్సా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.#BREAKING : During a late-night raid in Hapur, Uttar Pradesh, local authorities recovered 32 LPG cylinders from a residential property. Officials confirmed that 18 of the cylinders were filled. Further action is being taken in the matter.#LPGSeizure #IllegalLPG… pic.twitter.com/9NR8ZWbcbK— upuknews (@upuknews1) March 13, 2026పశువుల పాకలో 201 సిలిండర్లు..రాజస్థాన్లోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 201 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని శ్యామ్నగర్ ప్రాంతంలో అధికారి శశిశేఖర్ శర్మ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 ఫుల్ సిలిండర్లు, 95 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పశువుల పాకకు సమీపంలోనే గుంజన్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఏ ఏజెన్సీ నడుస్తోంది. సోదాల సమయంలో ఏజెన్సీ యజమాని మదన్ సైని అక్కడే ఉన్నారు. దీంతో, అధికారులు ప్రశ్నించగా.. సరైన పత్రాలు లేకుండానే ఏజెన్సీని నడుపుతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం, అధికారులు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్పై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.610 LPG Cylinders of Indane, Bharat Gas & HP Gas were seized, which were illegally storedThe Crime Branch, Delhi Police busted an illegal LPG cylinder hoarding racket operating from a godown in Mundka, Outer DelhiTo defame govt and to create panic situation these people can… pic.twitter.com/v9oWJBGHAM— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) March 16, 2026గ్యాస్ చోరీ.. హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్కు గ్యాస్ను బదిలీ చేస్తున్న వీడియోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫరీదాబాద్ అధికారులు ఎల్పీజీ దొంగతనం, అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్పై చర్యలను ముమ్మరం చేశారు. ఈ విషయమై జిల్లా ఆహార మరియు సరఫరాల శాఖ పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్పై 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు.ఎల్పీజీ బ్లాక్ మార్కెట్.. 33 లక్షలు స్వాధీనంమహారాష్ట్రలో ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టగా 2,129 దాడుల్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 1,208 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేయగా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని నిబంధనల కింద 18 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్పీజీ డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రభుత్వం 9769919229 అనే వాట్సాప్, హెల్ప్లైన్ నంబర్ను జారీ చేసింది.330 LPG cylinders seized in Bhiwandi, Maharashtra. Three people booked for illegal storage.#lpggasissue #LpgCrisis #LpgCylinder #Maharashtra pic.twitter.com/3RfIiLTZB8— Sachin (@Sachin1649242) March 17, 2026 -
గంగా నదిలో బిర్యానీతో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
వారణాసి: గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే, విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగా నది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహారపదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువులు మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు. In Varanasi, 14 Muslim youths were arrested after holding an Iftar Party on a boat in the Ganga River.An FIR was filed alleging that they consumed chicken biryani during iftar and threw leftover bones into the river, which reportedly hurt religious sentiments.The complaint… pic.twitter.com/VDIdIE3cWi— زماں (@Delhiite_) March 17, 2026 -
సింగర్ ఓవరాక్షన్.. డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన
పాట్నా: బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్లో ఓ ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl— The Tatva (@thetatvaindia) March 16, 2026ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. -
ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు
తల్లి కావడం అనేది ఎంత అపురూపమైన క్షణమో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తల్లి అవ్వడంతోనే కుటుంబ సభ్యులకు అమ్మమ్మ, నానమ్మలుగా ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి తల్లికావడం అంటే మాములు వింత కాదు కదా ఇది. అస్సలు ఇదెలా సాధ్యం అని అనుకోకండి. ఈ అద్భుతమైన ఘటన ఇటలీలోని నేపుల్స్లోని కారద్రాల్లి ఆస్పత్రిలో జరిగింది. అక్కడ ఆ తల్లి మారా బారోన్, కూతురు పాలోలకు ఈ అరుదైన సందర్భం ఎందురైంది. నిజానికి మారా బారోన్కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కూతురు పాలా జన్మించింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి బదులుగా గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. విచిత్రం ఏంటంటే మారా మళ్లీ తల్లి అయ్యిన అదే రోజున ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న తన కూతురు కూడా తల్లి అయ్యింది. వారిద్దరు ఒకరోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న 'Futura' అనే పాపకు జన్మనివ్వగా, కూతురు పోలాకి 3.4 కిలోల బరువున్న 'Giovanni' అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి మారా జీవశాస్త్రవేత్త, ఆమెకు ఇది రెండో ప్రసవం. ఆస్పత్రి గైనకాలజీ విభాగం డైరెక్టర్ సైతం ఈ సంఘటనను ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అభివర్ణించారు. తల్లీ కూతుళ్లిద్దరికీ సాధారణ ప్రసవాలే జరగాయని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు వైద్యులు. సాధారణంగా ఒక కొత్త బిడ్డ రాకతోనే కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది. అలాంటిది ఇద్దరు నవజాత శిశువుల రాకతో ఆ కుటుంబానికి ఇది పండుగ వాతావరణంలా మారిపోయింది.(చదవండి: గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!) -
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలని చాలా మంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.వర్ష అనే యువతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్గా ఇచ్చింది.తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు. అందరూ కలిసి కారు పైన కవర్ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n)భావోద్వేగ సందేశం"మా తల్లిదండ్రులు ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."నెటిజన్ల ప్రశంసలుఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
డెలివరీ బాయ్గా 78 ఏళ్ల వ్యక్తి..!
జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా స్పందించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అది చెప్పినంత సులువు కాదు. ఒక్కోసారి ఈ వయసులో ఇంత కష్టమా అని తల్లడిల్లిపోతాం. కానీ కొందరే ధైర్యంగా ఎదురెళ్లతారు. అలాంటి వాళ్లకు ఆ దేవుడు సదా తోడుగా ఉంటాడనేందుకు ఈ తాతగారే ఉదాహరణ.అమెరికాలోని టేనస్సీలోని మాంచెస్టర్కు చెందిన రిచర్డ్ పుల్లీ అనే 78 ఏళ్ల వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ వయసులో ఆ తాతగారి ఏం కష్టం వచ్చిందో అనిపిస్తుంది అతడు పడుతున్న తపన చూస్తే. వస్తువులను డెలివరీ చేసేందుకు వెళ్తున్నప్పుడూ.. వయసురీత్యా జారిపోయే అవకాశం ఉండటంతో ఎంతో జాగ్రత్తగా డెలివరీ చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే అతడు తీసుకుంటున్న శ్రద్ధను చూస్తే ముచ్చటేస్తుంది. ఇంతలా కష్టపడుతూ డెలివరీ చేయడం ఎందుకని బాధ కూడా కలుగుతుంది. అలానే అనుకుంది బ్రిటనీ స్మిత్ అనే మహిళ కూడా స్టార్బక్స్ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్న రిచర్డ్ పుల్లీని చూసి. అతడు డెలివరీ చేస్తున్న విధానానికి ఫిదా అయ్యి అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆ తాతగారి గురించి వివరించింది. ఆయన ఏడుపదుల వయసులో ఎందుకు ఇంకా పనిచేస్తున్నాడో కూడా తెలిపింది. ఫుల్లీ తన భార్య వైద్య ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుపుతాడు. తన భార్య ఆమె తప్పిదం లేకుండానే ఉద్యోగం కోల్పోయిందని చెప్పుకొచ్చాడు ఫుల్లీ. దాని ఫలితంగా ఆమె ఆరోగ్య భీమా కూడా కోల్పోయింది. అందువల్ల తాను తమ జీవన ఖర్చుల తోపాటు మందులు, వైద్య ఖర్చులకు లెక్క చూస్తే..నెలాఖరుకి ఏమి ఉండదు. అందువల్ల ఇలా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు తెలిపాడు ఫుల్. తమది 56 ఏళ్ల వైవాహిక బంధమని చెప్పాడు. తన భార్య ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి ఒక ఏడాదికిపైగా ఇలా డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. దాంతో బ్రిటనీ స్మిత్ ఆ వృద్ధ దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో GoFundMe ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు అండగా నిలిచేందుకు, వారి ఖర్చుల నిర్వహణలో సహాయపడేందుకు వేలాది మంది ప్రజలు ముందుకు వచ్చారు. ఏకంగా రూ. 4.5 కోట్లు దాక విరాళం రావడం విశేషం. NEW: Internet users have raised $280,000 for an elderly man who became a DoorDash delivery driver to help pay for his and his wife's bills.A Tennessee woman decided to take matters into her own hands when she saw the man delivering her Starbucks."I work because I have to. I… pic.twitter.com/qWIXG8ZzSt— Collin Rugg (@CollinRugg) March 12, 2026(చదవండి: రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు టర్నోవర్..) -
ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..
పేరెంట్స్ పిల్లలకు గిఫ్ట్ల ఇవ్వడం అనేది సర్వసాధారణం. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక..తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనిని గుర్తించుకుని తోచిన రీతిలో గిఫ్ట్ ఇచ్చే అద్భుతమైన రోజు ఎంతమంది పెద్దలకు వస్తుంది ఈ అదృష్టం. అలాంటి అదృష్టాన్నే పొందారు ఈ తల్లిదండ్రులు. అంతేకాదండోయ్ అమ్మో ఇద్దరూ కూతుళ్లా..?! అనే వారికి ఈ ఘటన చెంపపెట్టు. ఇద్దరు టీనేజ్ కూతుళ్లు తమ తల్లిదండ్రులకు జీవితకాలం గుర్తుండిపోయే మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటా సర్ప్రైజ్ అంటే..తమ తల్లిదండ్రల కళ్లకు గంతలుగట్టి మరి రోడ్డు మీదకు నడిపిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ గుమిగూడి నవ్వుతూ..ఉంటారు. ఒకపక్క ఈ తల్లిదండ్రలుకు మనసులో ఏం జరుగుతుంది, ఏంటని ఆత్రం..ఏంటా అద్భుతమని కుతుహలంతో ఉంటారు. అంతే ఆ తర్వాత కూతుళ్ల గంతలు విప్పి పార్క్ చేసిన కొత్త కారుని చూపిస్తారు. వారి చేసిన ఆ సడెన్ సర్ప్రైజ్కి నోట మాట రాక భావోద్వేగం చెందుతున్న ఆ తల్లిదండ్రుల ఆనందం మాటలకందనిది. చుట్టుపక్క ఉన్న కుటుంబ సభ్యులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ ‘జీవితకాలానికి ఒక చిన్న ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ను జోడించారు. అంతేగాదు ఆ పోస్ట్లో మీరు మాకు ఎప్పుడు ఇది చేయలేరు అన్న మాటలు చెప్పలేదు. హాయిగా ఎరిగిపోండి అని మాత్రమే చెప్పేవారు. ఈ కారు మీరు మాకిచ్చిన జీవితకాల భద్రత, మద్దతు, నమ్మకానికి చిన్న పాటి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నదే అంటూ పోస్ట్ ముగించారు. చాలామంది నెటిజన్లు ఇది కన్నీళ్లు పెట్టించే ఘటన అని, తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఏముంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n) (చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్
Iran war ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ భీకరదాడులు, ఇరాన్ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వాస్తవం ఏంటి?ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి పోస్ట్ కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. అంతేకాదు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ఏఐతో రూపొందించారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా? నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు వ్యాపించాయి. అసలు ఆయన బతికే ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.అసలు నిజం ఏమిటంటేఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్లైన్లో వ్యాపించిన పుకార్లను అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ, సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు.ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్షాట్లు, తప్పుడు దృశ్యాలు. తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్) -
గ్యాస్ కొరత.. సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా..!
ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ సిలిండర్ల ప్యానిక్ బుకింగ్స్ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్ అంశం ఒకటి.అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడీయో వైరల్గా మారింది. ఈ వీడియోను చూస్తే గ్యాస్ సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు. నెట్టింటిలో వైరల్గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్ పనిముట్ల సాయంతో కట్ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు. ఇలా ఫుల్ గ్యాస్ సిలిండర్ లేదనే చింతను తీర్చుకున్నాడు. ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన భారతీయుల టాలెంట్ మామూలు టాలెంట్ కాదుగా 👍pic.twitter.com/AVN1cCRPTS— UttarandhraNow (@UttarandhraNow) March 13, 2026 -
హైదరాబాద్ పిల్లల సోషల్ మీడియా వినియోగం ఎంతంటే?
పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్కి వెళ్లే ముందు మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి ప్రి్రస్కిప్షన్పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్ కోసం.. పిల్లలు మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో సోషల్ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్ యాప్స్ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్ఫోన్ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ‘డీలా’.. ఓ వైపు చాట్ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరిచయం చేస్తూ.. ఆన్లైన్ క్లాసులు, హోమ్వర్క్ పేరుతో క్రమంగా స్క్రీన్ టైమ్ సోషల్ మీడియావైపు దారి మళ్లుతోంది.ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమ్.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్ ఫ్రెండ్షిప్, లైక్స్, ఫాలోవర్స్ ఆధారంగా రిలేషన్స్ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్ అల్గారిథమ్స్ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్ జీ తరం కన్నా.. జెన్ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్ లిటరసీ, హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్టడి సాధ్యమేనా? దేశంలో చిన్నారుల ఆన్లైన్ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్సైట్లు, ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, కథలు, సైన్స్ వీడియోలు, క్రియేటివ్ ఆర్ట్స్ వంటి కంటెంట్ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. -
విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణ
ఎయిరిండియా విమానం గాలిలో ఉన్నప్పుడు, మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు ఒకరు కాక్పిట్లో కూర్చోని రీల్ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రయాణీకుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ పైలట్ సీటులో కూర్చున్నట్లు కనిపిస్తుంది. కెమెరాను అద్దం (విండ్స్క్రీన్ )వైపు తిప్పినప్పుడు బయట మేఘాలు కనిపిస్తుండటంతో, విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. విమానయాన భద్రతా ప్రోటోకాల్ల గురించి చర్చకు దారితీసింది.క్లిప్ను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ, “విమానం గాలిలో ఉంది, ఒక ఎయిర్ హోస్టెస్ కాక్పిట్లో కూర్చుని రీల్స్ తయారు చేస్తోంది. ఇది నిజంగా దీనికి అనుమతి ఉందా? ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారిని చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియో భద్రతా నిబంధనల ఉల్లంఘనేనంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలుఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాక్పిట్లోకి ప్రవేశించడానికి కఠినమైన ప్రోటోకాల్ ఉంది. దీన్ని అధిగమించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని క్యారియర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఎపుడు, ఎలా చిత్రీకరించారు, దీని యథార్థతను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని ఎయిరిండియా తెలిపింది, కాక్పిట్ ప్రవేశంపై ఎయిర్ ఇండియాకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఎయిరిండియా స్పష్టం చేసింది.Wait until you see the end of this video. The plane is in the air and an air hostess is sitting in the cockpit making reels. Is this really allowed? Feels quite disturbing to see something like this when passenger safety is supposed to be the top priority. @DGCAIndia pic.twitter.com/91Nmsr9R70— Nikhil saini (@iNikhilsaini) March 10, 2026డీజీసీఏ నిబంధనలేంటి?డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు కాక్పిట్లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి.ఒకవేళ పైలట్లలో ఒకరు విరామం కోసం లేదా అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడిని లోపలికి పిలుస్తారు. రెండవ పైలట్ తిరిగి వచ్చే వరకు ఆ క్రూ సభ్యుడు అక్కడే ఉండాలి. కొందరు నెటిజన్లు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ, బహుశా పైలట్ బయటకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారమే ఆమె లోపలికి వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. -
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట -
రైల్లో రీల్స్తో రచ్చ రచ్చ : హెల్ప్ లైన్కు కాల్ చేస్తే...!
రైలు ప్రయాణం అనేక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. పచ్చని చెట్లు, ఏపుగా ఎదిగిన పైరులు..ఇలా చాలా అనుభవాలను మిగులుస్తుంది. దీంతో పాటు ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా తప్పవు. అలా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది. చివరికి రైల్వే హెల్ప్ లైన్కి కాల్ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా మార్చేసారని అభివర్ణిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.ఇంతకీ ఏమి జరిగిందంటే మన్మోహన్ వర్మ అనే ప్రయాణీకుడు చేసిన వివరాల ప్రకారం ఇటీవల ఆయన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో బిలాస్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తున్నారు. ఈయన ప్రయాణిస్తున్న బోగీలోనే 20-30 మంది సభ్యులు గల ఒక కుటుంబం కూడా చేరింది. రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. బోగిని అరుపులు, కేకలు, పాటలతో "రీల్ స్టూడియో"గా మార్చింది. కోచ్ లోపల డ్యాన్స్ చేస్తూ రీల్స్తో రచ్చ రచ్చ చేశారు. వ్యక్తి తన తలపై రైల్వే బెడ్షీట్ పెట్టుకుని ఇతరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన వర్మ రైల్వే హెల్ప్లైన్కు (139)ను సంప్రదించారు. దీంతో రైల్వే పోలీసులు ఫిర్యాదుపై స్పందించి, కోచ్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. View this post on Instagram A post shared by Manmohan Verma (@bioeducator_manmohan) ‘‘రైల్వే కోచ్ అనేది పబ్లిక్ ప్లేస్. మన సొంత స్థలం కాదు.. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్ సెన్స్ లేకుండా పోయిందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదూ, రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్లో చెప్పారు. నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా స్పందించి తన అనుభవాలు పంచకున్నారు. రైళ్లలో పుట్టిన రోజు జరుపుకోవడం, బిగ్గరగా ఆడిపాటం లాంటి భయంకరమైన అనుభవం తనకూ ఎదురైందంని ఒక యూజర్ పేర్కొన్నారు.ఇలాంటి అనుభవాలు రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి. తాజా వీడియో పబ్లిక్ ప్రదేశాల్లోఎలా ప్రవర్తించాలి, ఇతర ప్రయాణీకులను ఎలా గౌరవించాలి అనేదానిపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్) -
అరుదైన ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసా?
మనకు ఇప్పుడు రైలు ప్రయాణం ఎంతో ఈజీ, అసలు రైలు ప్రయాణమంటేనే సౌఖ్యవంతమైన జర్నీగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చనేది మనకు తెలిసిన విషయం. అయితే రైలు.. నది ఒడ్డున ఆగితే పరిస్థితి ఏమిటి.. ప్రయాణికులు ఎలా దిగి గమ్యస్థానాలకు వెళతారు?, ఈ తరహా పరిస్థితులు కూడా ఉంటాయా?, అంటే ఉన్నాయి అనక తప్పదు. పూర్వకాలంలో నది ఒడ్డున ఆగే రైలు.. ఆపై పడవల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే సంఘటనలు కూడా ఉన్నాయట. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘాజీపూర్లో తారీ ఘాట్ రైల్వే స్టేషన్ ఇందుకు నిదర్శనం. గంగా నదిపై ప్రయాణించే రైలు తారీ ఘాట్ రైల్వే స్టేషన్లో నది ఒడ్డు వరకే ట్రాక్ ఉంటుంది. దాంతో ప్రయాణికులు ఒడ్డున దిగి పడవల్లో వారి స్థానాలకు వెళ్లేవారు. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇక్కడ రైలు ట్రాక్ నది ఒడ్డునే ముగుస్తుంది, ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అప్పట్లో గంగపై పెద్ద రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, రైలు మార్గం ఇక్కడే ఆగిపోయేది. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత పడవల ద్వారా గంగాను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గంగానదిపై గంగానదిపై రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. తారీ ఘాట్ స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది, కానీ ఇది చారిత్రక గుర్తుగా నిలిచింది. భారత రైల్వే చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచిపోతోంది.గతంలో స్టేషన్ ఎంత ఉత్సాహంగా ఉండేదో ఇక్కడ అనుభవాలను ఎదుర్కొన్న వారిని పలకరిస్తే అర్థమవుతుంది. తారీ ఘాట్ వైభవం, టీ దుకాణాలు, పడవల కోసం వేచి ఉండటం ఇవన్నీ తలుచుకుంటే తమ కళ్లలో మెరుపులు తీసుకొస్తాయని ఓ వృద్ధుడు స్పష్టం చేశాడు. -
తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..
కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. డాక్టర్ శరవణ కుమార్ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్లోనే ఉన్న అతన్ని డాక్టర్ ప్లీజ్ టెన్షన్ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.(చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!) -
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..) -
చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!
స్కేటింగ్, స్నోబోర్డింగ్ వంటివి చీరతో సాధ్యమయ్యేవి కావు. అందులోనూ మంచు పర్వతాల్లో రెయ్రెయ్ మని వెళ్లాలంటే శారీతో సాధ్యమైన పనికాదు. కానీ ఇద్దరు మహిళలు చీరతో చాలా ఈజీగా చెయ్యొచ్చని చూపించి అందర్నీ షేక్ చేశారు. భారతీయతను ఉట్టిపడేలా చేసే చీరకట్టుతో చేసిన స్నోబోర్డింగ్ అందర్నీ కట్టిపడేసింది. ఆరుగజాల చీరలో ఊర్మిలా పేబుల్, లిండా ష్మిటర్ అనే ఇద్దరు మహిళలు మంచు పర్వతాల్లో చాలా చక్కగా స్కోబోర్డింగ్ చేసి నోటమాట రాకుండా చేశారు. ప్రొఫెషనల్ అథ్లెట్లు అయినా ఈ ఇద్దరూ చీరకట్టుతో స్నోబోర్డింగ్ చేసే థ్రిల్ కోసం చేసినా..అందర్నీ ఆలోచించేలా చేసింది. భారతీయురాలైన ఊర్మిలా పేబుల్, తన స్విస్ స్నేహితురాలితో కాశ్మీర్లోని గుల్మార్గ్లో మంచుకొండలపై ఈ స్టంట్ చేశారు. అందుకు సంబంధించిన కమనీయ దృశ్యాల్ని స్వీడిష్లో జన్మించిన అడ్వెంచర్ ఫిల్మ్ మేకర్, డ్రోన్ పైలట్ అయిన హెరాల్డ్ ఎడ్లండ్ కెమెరాలో బంధించారు. ఊర్మిళ, లిండా మాదిరిగానే, అతను పారాగ్లైడింగ్, స్పీడ్ఫ్లైయింగ్ వంటి అనేక హై-ఇంటెన్సిటీ అడ్వెంచర్ క్రీడలపై ఆసక్తితోపాటు, పర్వత ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడంలో నిపుణుడు. అయితే ఆ దృశ్యాలకు "శారీ నాట్ సారీ" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఊర్మిలా పేబుల్. ఇదిలా ఉండగా, ఊర్మిలా 19 ఏళ్ల ఉత్సాహభరితమైన ప్రొఫెషనల్ స్కేట్బోర్డర్. ఐదేళ్ల వయసులో రోలర్ స్కేటింగ్ నేర్చుకుంది. అలా ఆమెకు స్కేట్ బోర్డింగ్ పట్ల మక్కువ పెరిగింది. ఇక లిండా ష్మిటర్ స్విట్జర్లాండ్, హిమాలయాలు, వంటి దిగ్గజ ప్రదేశాలలో సాహసోపేతమైన కంటెంట్కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు బర్టన్, మమ్ముట్ వంటి ప్రధాన బహిరంగ స్నోబోర్డింగ్ బ్రాండ్ల నుంచి అనేక స్పాన్సర్షిప్లు కూడా వచ్చాయి. View this post on Instagram A post shared by Urmila P. (@ursk8kid) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
తన లవ్తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!
కనిపెంచిన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్. అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్ మదర్గా ఒంటరిగా తన తల్లి ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. కుమార్తె భావోద్వేగంఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది. తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది." అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. View this post on Instagram A post shared by Pooja (Piyu) (@pooja_bhatnagar_) -
ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!
కొందరు భలే విచిత్రంగా ఉంటారు. ఒక్కరోజు వర్కౌట్లు మిస్సైతేనే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా లబోదిబోమంటారు. ఎలా ఉన్నా..ఎక్కడ ఉన్నా..టెన్షన్గా వ్యాయామాలు చేసేయాల్సిందే. అందుకోసం ఏం చేసేందుకైనా, ఎంత కష్టమైనా డోంట్ కేర్. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఈ టైపే. అయితే ఈ వ్యక్తి ఫిట్నెస్ పిచ్చి ఏ రేంజ్లో ఉందో చూస్తే..ఓర్నీ గాల్లో కూడానా. అంటారు.ఇంతకీ ఏం చేశాడంటే..బెర్లిన్కు చెందిన ఎండ్యూరెన్స్ అథ్లెట్, కంటెంట్ క్రియేటర్ డోమ్ స్ట్రోహ్..ఫ్లైట్లో దాదాపు పదకొండు గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో చాలా గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. కనీస కదలికలు కాస్త కష్టమే. అందువల్ల మనోడు ఎక్కడ ఆరోగ్యం పాడవ్వుతుందని అనుకున్నాడో ఏమో గానీ. ఎలాగైనా..ఈ పరిస్థితుల్లో కూడా తన ఫిట్నెస్ని కాపాడు కోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. అందుకని ఏకంగా ఫ్లైట్లో ఉండే టాయిలెట్నే జిమ్గా మార్చేశాడు. విమానంలో సాధారణంగా వాష్రూమ్లు చాలా చిన్నగా ఉంటాయి. అంత ఇరుకైనా వాష్ రూమ్లో మనోడు ఏకంగా 5కే రన్ పూర్తి చేసే సాహసం చేశాడు. అసలు మనిషి ఒక్కడే పట్టేంత స్థలంలో వాకింగ్ అనేదే సాధ్యం కాదు..కానీ డోమ్ ఏకంగా రన్ చేయాలనుకుంటున్నాడు. ఎలా చేశాడో కూడా అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్చేశాడు డోమ్. అంతేకాదండోయ్ నిజంగానే 5.5 కిలోమీటర్లు రన్చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మనిషి అటు ఇటు కదలడానికి ఏ మాత్రం చోటు లేని ఆ చిన్న బాత్రూమ్లో మనోడు అంత వర్కౌట్ పూర్తి చేశాడా..? అని ఆశ్చర్యం కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం డోమ్ ఆ స్టంట్ ఎలా పూర్తిచేశాడో చూసేయండి మరి..!. నెటిజన్లు కూడా మీరొక్కరే బాత్రూంలో అంతసేపు ఉండిపోయి..ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టారో ఏంటో అని కొందరు. పాపం గాల్లో స్టంట్ చేయాలనుకున్నాడు కాబోలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dom Stroh (@dom.stroh) (చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’) -
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్లెట్ని ముంబైలోని ఈరోస్, చర్చ్గేట్లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak) -
'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!
హోలీ వేడుకును అందరు పలు విధాలుగా జరుపుకుంటారు. సహజసిద్ధమైన రంగులతో కొందరు..ప్రకృతిని ఆస్వాదించేలా కొందరు సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వాటన్నింటికంటే మన పుడమి తల్లి జరుపుకునే హోలీ వేడుకకు మించిన రంగుల పండుగ మరొకటి ఉండదు. సరిగ్గా చూస్తే దానిలో దాచుకున్న అద్భుతం హే రంగులే.. హే రంగులే ..అన్నట్లుగా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గజం షేర్ చేస్తూ అందర్నీ ప్రకృతి రమ్యత గూర్చి ఆలోచింపచేసేలా చేశారు.ఆ వీడియోలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా "హోలీ వేళ తప్పక వీక్షించాల్సిన వీడియో" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఆకాశం నుంచి చూస్తే..రంగుల వస్త్రాన్ని కప్పుకున్న నేల తల్లిలా అందంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అద్భుతమైన ఎర్రమిరప పంట వైమానిక క్లిప్. రైల్వేలైన్ ఇరువైపులా ఎండబెట్టిన మిరపకాయలు షీట్లు కనిపిస్తాయి. అది చూస్తే ఒకవైపు పచ్చదనం..మరోవైపు ఎరుపు రంగు కలగలసి అద్భుతమైన పెద్ద కాన్వాస్ని పోలి ఉంటుంది. భారతదేశంలోని వ్యవసాయ రంగం నుంచి పుట్టుకొచ్చే రంగులే వేరు. బెలూన్ రైడ్, స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలకు మించిన సహజసిద్ధమైన రంగుల ప్రదర్శన అని, తానెప్పుడు దీన్ని చూడలేదని రాసుకొచ్చారు మహీంద్రా పోస్ట్లో. పర్యాటకులను ఆకర్షించేలా తమ ఆదాయాన్ని పెంచుకునేలా స్థానిక రైతులు చేస్తే బాగుండనని, అయితే ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించడం లేదని కూడా అన్నారు. నెటిజన్లు కూడా ఈ పోస్ట్పై స్పందిస్తూ..ఇలా పోస్టలు పెట్టారు. గుంటూరు మిర్చి పొలాలు ఇప్పటికే భారతదేశ సహజ హోలీ కాన్వాస్లు. సరైన ప్రణాళికతో రైతులకు మద్దతు ఇచ్చేలా..ఆంధ్రుల గర్వాన్ని ప్రదర్శించే ప్రపంచ స్థాయి వ్యవసాయ-పర్యాటక ఉత్సవంగా మార్చొచ్చు అని పోస్టులు పెట్టారు.The perfect video to view on Holi… Because the colours of India spring up in many different ways & surprise us. Chillis laid out for drying create an amazingly beautiful tapestry when seen from above.This is Guntur district in Andhra Pradesh which alone has a share of 15%… pic.twitter.com/QKUn1rbDm0— anand mahindra (@anandmahindra) March 4, 2026 (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..) -
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మెరుగైన స్టూడెంట్ గొప్ప ఉద్యోగంలో ఉంటాడని, యావరేజ్ స్టూడెంట్ ఏ ఉద్యోగం లేకుండా ఉంటాడని అనుకుంటాం. కానీ విధి చాలా పక్కా స్క్రిప్ట్తో మన అంచనాలను తలకిందులు చేస్తూ మన రాతన నిర్దేశిస్తుంది. అందుకు ఈ మిత్రులు కథే ఓ ఉదాహరణ. ఇప్పుడు ఆ ఇద్దరు మిత్రులు మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారి..నెటిజన్లను ఆలోచింపచేసేలా చేసింది. ఈ మిత్రుల సంభాషణను భారత్ మాతా కే సేవక్ సోష్ల్ మీడియా ఎక్స్లో షేర్ చేసింది. ఉమర్ అనే వ్యక్తి రైడ్ని బుక్ చేసుకున్నాడు. అయితే ఆ రైడర్ పేరు ఎందుకనో ఆసక్తిగా అనిపించిది. ఆ రైడర్ పేరు చందన్గా మొబైల్లో కనిపించడంతో ఒకప్పటి తన క్లాస్మేట్ చందన్నే. ఆ..! క్లాస్ టాపర్ కదా వీడేనా వాడు అని ఆలోచిస్తూ ఉండగానే..బుక్చేసుకున్న రైడర్ రానే వచ్చాడు. అతడు ఊహించనట్లుగానే ఆ రైడర్ తన క్లాస్మేట్ కావడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతడిని కలిసిన ఆనందంతో ఎప్పటి నుంచి రైడర్గా పనిచేస్తున్నావ్ రా అని అడుగుతాడు. వెంటనే సదరు రైడర్ చందన్ ముందు ఓటీపీ చెప్పరా అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత చందన్ మాట్లాడుతూ..జీవితం ఎప్పుడూ ఓ ప్లాన్ ప్రకారం జరిగిపోదురా. అయిన పర్లేదు మిత్రమా..! నువ్వు నాగురించి ఏం బాధపడొద్దు. అయినా నువ్వు నా ఫ్రెండ్వి. నేను నీకు ఎలాంటి ఛార్జ్ చేయను అని అంటాడు. అప్పుడు ఉమర్ నువ్వు మన క్లాస్ టాపర్వి కదరా ఇలా..అంటూ ఆగిపోగా..చందన్ నవ్వుతూ..జీవితం చాలా విచిత్రమైనది..అయినా నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నువ్వే నా కస్టమర్వి అవుతావని అని నవ్వుతూ అంటాడు. ఆ తర్వాత రా కూర్చో..నేను నిన్ను సురక్షితంగా డ్రాప్ చేస్తాను అని బదులిస్తాడు. ఆ పోస్ట్ చాలా ఆలోచనాత్మక సందేశాన్ని ఇచ్చింది. మార్కులు, డిగ్రీలు లేదా టాపర్గా ఉండటం అనేవి మన భవిష్యత్తుని నిర్ణయించవు. అలాగే నిజాయితీగా పనిచేస్తే ఏ ఉద్యోగం చిన్నది కాదు. ముందు మనల్ని మనం చిన్నబుచ్చుకోకుండా గౌరవప్రదంగా భావిస్తే.. ప్రతి ఉద్యోగానికి ఓ గౌరవం ఉంటుంది అనే విషయాన్ని నొక్కిచెప్పింది అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం క్లాస్ టాపర్ ఇలా రాపిడో రైడర్గా మారడం ఓకింత బాధను కలిగించింది అని పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by The Siasat Daily (@siasatdaily) (చదవండి: శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్గా పనికి వచ్చేయాలి..) -
లిఫ్ట్లో షాకింగ్ యాక్సిడెంట్.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
గుజరాత్లోని వల్సాద్లో అత్యంత భయానకమైన లిఫ్ట్ ప్రమాదంఆందోళన రేపింది. లిఫ్ట్లోంచి బయటకు వస్తూండగానే అమాంతం లిఫ్ట్ కిందికి కదిలి పోయింది. హైటెక్ లిఫ్ట్తో కూడిన 14 అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్గా మారింది. గుజరాత్లో చాలా భవనాల్లో లిఫ్ట్లు శిథిలావస్థలో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వల్సాద్ నగరంలోని తితాల్ రోడ్లోని సర్దార్ హైట్స్లోని విలాసవంతమైన సబర్మతి భవనంలో ఈ సంఘటన జరిగింది. లిఫ్ట్లో ఉన్న ఒకవ్యక్తి తాను దిగాల్సిన ఫ్లోర్కు సంబంధించిన అంతస్తు కోసం బటన్ నొక్కాడు. లిఫ్ట్ కావలసిన అంతస్తుకు చేరుకుంది. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతోనే అతడు బయటకు అడుగు పెడుతుండగాఅకస్మాత్తుగా అధిక వేగంతో లిఫ్ట్ కిందికి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటననుంచి అతను ప్రాణాలతో తృటిలో తప్పించుకోవడం విశేషం. లిఫ్ట్ లోపల ఏర్పాటు చేసిన CCTV కెమెరాలలో ఈ దిగ్భ్రాంతికరమైన క్షణాలు స్పష్టంగా రికార్డైనాయి.ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్సాంకేతిక లోపమే కారణమా?టెక్నికల్ లోపం కారణంగానే ఇలా తలుపు తెరిచి ఉండగానే లిఫ్ట్ కదిలి ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు . ఈ లిఫ్ట్ను ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుందని, లిఫ్ట్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులు రెండు రోజుల ముందే భవనాన్ని సందర్శించారని భవనం ఛైర్మన్ మీడియాకు తెలిపారు.ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! दिल देहलदेने वाला वलसाड का यह वीडियो लिफ्ट के रखरखाव की कमी को उजागर करता है। दरअसल, गुजरात की कई पुरानी सोसायटीज में खस्ता हाल में ही लिफ्ट चल रही है। जो कभी भी मौत को बुलावा दे सकती है। @sanghaviharsh pic.twitter.com/T5vK4tBuhq— Dixit Soni (@DixitGujarat) March 3, 2026 లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా, లిఫ్ట్లో ఇరుక్కుపోయినప్పుడు ప్రాణాపాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లిఫ్ట్ బటన్ నొక్కగానే తలుపులు తెరుచుకుంటాయి. కానీ, లోపల 'క్యాబిన్' (ఫ్లోర్) ఉందో లేదో చూసుకోకుండా అడుగు వేయకండి. కొన్నిసార్లు సాంకేతిక లోపం వల్ల క్యాబిన్ రాకముందే తలుపులు తెరుచుకోవచ్చు.లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కకూడదు. ఓవర్లోడ్ వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.ముఖ్యంగా చిన్న పిల్లలతో లిఫ్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి. చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లండి. లిఫ్ట్ లోపల బటన్లతో ఆడుకోకుండా చూడండి.కదులుతున్న లిఫ్ట్ తలుపులకు ఆనుకుని నిలబడాలి.. అలాగే తలుపులు మూసుకుంటున్నప్పుడు చేతులు లేదా కాళ్లు అడ్డు పెట్టకండి. ఎందుకంటే ఒక్కోసారి సెన్సార్లు పని చేయకపోతే ప్రమాదం జరగొచ్చు. లిఫ్ట్ లోపల గెంతడం లేదా అల్లరి చేయడం వల్ల లిఫ్ట్ 'సేఫ్టీ గ్రిప్స్' లాక్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.చీర కొంగులు, పొడవైన దుస్తులు లేదా బ్యాగ్ బెల్టులు తలుపుల మధ్య చిక్కుకోకుండా చూసుకోండి.ఒక వేళ లిఫ్ట్ మధ్య ఆగిపోతే ఆందోళనపడవద్దు. లిఫ్ట్ ఆగిపోగానే ఊపిరి ఆడదనే భయం అస్సలు వద్దు. లిఫ్ట్లోని 'Alarm' లేదా 'Call' బటన్ను నొక్కాలి.ప్రశాంతంగా ఉంటూ ఫోన్ ద్వారా మెయింటెనెన్స్ టీమ్కు, లేదా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. టెక్నీషియన్లు వచ్చే వరకు లోపలే సురక్షితంగా ఉండటం ఉత్తమం.అలాగే లిఫ్ట్ ఫ్లోర్ల మధ్యలో ఆగినప్పుడు, తలుపులు బలవంతంగా తెరిచి బయటకు దూకడానికి ప్రయత్నించకండి. లిఫ్ట్ ఒక్కసారిగా కదిలితే ప్రాణాపాయం కలగవచ్చు.అపార్ట్మెంట్ కమిటీలు అసోసియేషన్లు కనీసం నెలకు ఒకసారి గుర్తింపు పొందిన టెక్నీషియన్లతో లిఫ్ట్ కండిషన్ను చెక్ చేయించాలి.లిఫ్ట్ లోపల కెమెరా, ఎమర్జెన్సీ లైట్లు పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి.లిఫ్ట్కు తప్పనిసరిగా Automatic Rescue Device (ARD) సిస్టమ్ ఉండాలి. ఇది కరెంట్ పోయినప్పుడు లిఫ్ట్ను దగ్గరలోని ఫ్లోర్లో ఆగేలా చేస్తుంది.ఒకవేళ భవనంలో మంటలు (Fire) చెలరేగినప్పుడు లేదా భూకంపం వచ్చినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్ వాడకూడదు. మెట్లు మాత్రమే ఉపయోగించాలి అనేది గుర్తుంచుకోవాలి. -
సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
‘పెళ్లి’ అంటేనే సంబరాల సందడి. ముచ్చట్లు, మురిపాలతో వధూవరులతో పాటు బంధు మిత్రులుకు మరింత ఉత్సాహాన్నిచ్చే వేడుక. సంగీత్, మెహిందీ అంటూ సాగే ప్రీ వెడ్డింగ్ సంబరాల్లో అలాంటి అరుదైన క్షణాలకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి హృదయాన్ని ఆకట్టుకునే దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. అదేంటో ఒకసారి చూసేద్దామా.సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులే ప్రధాన ఆకర్షణగా ఉంటారు, కానీ ఈ చిన్ని డ్యాన్సర్ ఇద్దరు "చీర్ లీడర్స్" (తాతయ్యలు) అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుక ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతోంది. ఇంతలో చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన ఇద్దరు తాతయ్యల (అమ్మనాన్న, నాన్న నాన్న) చేతులు పట్టుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారిద్దరి మధ్యలో నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. ఆ వయసులోనూ ఆ ఇద్దరు తాతాయ్యలు చిన్నారి ఉత్సాహానికి తగ్గట్టుగా, కొరియోగ్రఫీని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.హైలైట్ ఏంటంటే పాట మధ్యలో వచ్చే ఒక డ్రమాటిక్ బీట్కు, ఇద్దరు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన చేతులను చాపి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా 82 లక్షల (8.2 మిలియన్) మందికి పైగా ముఖాల్లో చిరు నవ్వులు పూయించింది.నెటిజన్ల సంబరంఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోయారు. స్వచ్ఛమైన ప్రేమ, ఉత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిన్నారికి ఇది జీవితాంతం గుర్తుండి పోయే అద్భుతమైన జ్ఞాపకం (Core memory)." అని ఒకరు వ్యాఖ్యానించారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) View this post on Instagram A post shared by Anjali Damani Choreography (@anjalidamanichoreography) "తమ తాతయ్యలను కోల్పోయిన వారికి, ఈ వీడియో చూస్తుంటే తమ నెరవేరని కల నెరవేరినట్లు అనిపిస్తోంది." అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'అంజలి దమానీ కొరియోగ్రఫీ' షేర్ చేసిన ఈ వీడియో, సంజు రాథోడ్ పాడిన 'షకీ' (Shaky) అనే పాపులర్ మరాఠీ సాంగ్కు వీరు స్టెప్పులేశారు.ఇదీ చదవండి: వెజ్ బిర్యానీ షాప్ ఫ్రీజర్లో డెడ్బాడీ, షాకైన ఓనర్ -
సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో బేబీ షవర్ లేదా సీమంతం వేడుకలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని కలకాలం పదిలపర్చుకునేలా మెటర్నిటీ ఫోటోషూట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తి తన భార్య బేబీ షవర్ కోసం వినూత్న ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో హెలికాప్టర్లో పూల వర్షం కురియడం విశేషంగా నిలిచింది. మేళతాళాలు, సంప్రదాయ వేషదారణలు, విందుభోజనాల మధ్య ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి జంట ఫోటోలకు పోజులిస్తుండగా, ఆకాశం నుంచి పూల వర్షాన్ని చూసి అర్పిత ఆశ్చర్య చకితురాలైంది. @maamantraventures అనే ఇన్స్టాగ్రాంలో వీడియోను షేర్ చేస్తూ, "లవ్ ఇన్ ఇది ఎయిర్..మంగళూరులో ఒక నిజమైన హీరో, తన భార్య బేబీ షవర్ కోసం హెలికాప్టర్ ఫ్లవర్ షవర్తో ఆమెను సర్ప్రైజ్ చేశాడు. మంగళూరులో మొదటిసారి! నిజంగా గుర్తుంచుకోవలసిన వేడుక!" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇదిచూసి నెటిజనులను భావోద్వేగానికి లోను చేసింది. View this post on Instagram A post shared by Akshitha Poojary (@akshupoojary) View this post on Instagram A post shared by MMV🫰🏻KUSHI Films (@maamantraventures)వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశాడు. నగర శివార్లలోని అడయార్ గార్డెన్లో అతిథులు హాజరు కాగా సీమంతం వేడుక మధ్య హెలికాప్టర్ ఈ జంటపై పూల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసిఅతిథులు కూడా ఆశ్చర్యంగా చూశారు. చాలామంది ఈ అద్భుత క్షణాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్నెటిజనుల స్పందనపురుషుడు నిజంగా భార్యను ప్రేమిస్తే.. అతని ప్రేమ ఎప్పటికీ అనంతం." అని ఒకరు, చేతిలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు మరొకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ డబ్బును ముగ్గురు అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి ఉంటే బావుండేది అని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.(విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!
సీనియర్ సిటిజెన్ అని ప్రత్యేకంగ పేర్కొన్నప్పటికీ, రైల్వే రిజర్వేషన్ సమయంలో చాలా మందికి లోయర్ బర్త్లు ఎలాట్ కావు. పైగా అప్పర్ బర్త్లు కేటాయించడం ఒక్కోసారి చాలా కోపం తెప్పిస్తుంది. అలా కాసేపు రైల్వేస్ని తిట్టుకుని ఊరుకోకుండా ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. 82ఏళ్ల మహిళకు అప్పర్ బెర్త్ కేటాయించారని వ్యక్తి ఫిర్యాదుపై భారతీయ రైల్వేస్ ఎలా స్పందించింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం ఈ కథనంలో..ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వెబ్సైట్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణులు ట్రైన్లలో లోయర్ బెర్త్లు పొందే అవకాశముంది. కానీ తాజాగా 82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్లో పైబెర్త్ కేటాయించడంపై సోషల్ మీడియా ద్వారా రైల్వేశాఖను ప్రశ్నించాడు. “82 ఏళ్ల మహిళ కోసం ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాను. చాలా సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అప్పర్ బెర్త్ కేటాయించారు. ఇప్పుడు అదే లోయర్ బెర్త్లను ప్రీమియం తత్కాల్ కేటగిరిలో అధిక ధరలకు అమ్ముకున్నారు” అంటూ ఐఆర్సీటీసీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది క్లారిటీ ఇచ్చింది.ఐఆర్సీటీసీ ఏమందీ అంటే..ఈ వైరల్ పోస్ట్కు ప్రతిస్పందిస్తూ, కార్పొరేషన్ సీనియర్ సిటిజన్లు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు లోయర్ బెర్త్ కేటాయింపుకు సంబంధించి నియమాలను స్పష్టం చేసింది."సర్, భారత రైల్వేల కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్లో, సీనియర్ సిటిజన్లు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు, వేరే మార్గం లేకపోయినా, స్వయంచాలకంగా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉంది. అయితే, ఇది బుకింగ్ సమయంలో అటువంటి లోయర్ బెర్త్ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో, లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుకింగ్ను ఎంచుకునే నిబంధన ఉందని కూడా ఉంది. ఈ సందర్భంలో లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ బుక్ అవుతుంది. అంతేకాకుండా, ఇండియన్ రైల్వేలలో, రిజర్వ్ చేయబడిన వసతిని ఫస్ట్ కమ్ఫస్ట్ సర్వ్ కింద బుక్ అవుతుంది. ఎంపిక చేసుకున్న బెర్త్ లభ్యతకు లోబడి కేటాయించబడుతుంది" అని IRCTC వివరణ ఇచ్చింది. Booked ticket for 82 year old lady and @IRCTCofficial allotted upper berth (even though there were many seats available). Now the same lower berths will be sold at high rates in premium tatkal 👏Also well done in removing senior citizen quota @AshwiniVaishnaw— babu bisleri (@baabuOP) February 28, 2026లోయర్ బెర్త్ కావాలంటే ఈ చిట్కా పాటించాలట ఇలాంటి వివాదంలో గతంలో ఇండియన్ రైల్వేస్కు చెందిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఇచ్చిన వివరణ ఇచ్చారు. ఇది చాలామంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తొలగించడంలో సహాయపడింది. "మీరు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకే టికెట్లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చినట్లయితే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయని టీటీ వివరించారు. ఇదీ చదవండి : తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?భారతీయ రైల్వేస్లో సీనియర్ సిటిజన్ కోటా ఆటోమేటిక్ లోయర్ బెర్త్ కేటాయింపు లభ్యతను బట్టి 60 ఏళ్లు, అంతకు పైబడిన పురుషులకు, 45 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు లోయర్ బెర్త్లు కేటాయించ బడతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు వయస్సు రుజువును అందించాల్సిన అవసరం లేదు. అయితే, వారు ప్రయాణ సమయంలో వారి వయస్సును చూపించే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి . టికెట్ తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు దానిని చూపించాలి.ఇదీ చదవండి: విజయ్కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు -
ఇదిగో... బ్లింకిబాండ్
‘గుర్రాలు సినిమాలలో మాత్రమే కనిపిస్తాయి’ అనుకునే వరకు వచ్చింది పరిస్థితి. అయితే నిత్యజీవితంలో ఎక్కడో ఒకచోట అవి మనుషులకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. తాజా విషయానికి వస్తే... రాజస్థాన్లోని ఒక హైవేపై బ్లింకిట్ డెలివరీ బ్యాగ్ను గుర్రంపై మోసుకెళ్తున్న వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటెంట్ క్రియేటర్ కపిల్ బిష్ణోయ్ ఈ వీడియో క్లిప్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.‘ఇది రాజస్థాన్! యువకులకు గుర్రాన్ని స్వారీ చేసే అవకాశం ఇవ్వకుండా వృద్ధులు ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు’ అని సరదాగా తన క్యాప్షన్లో రాశాడు కపిల్.‘ఆధునిక రహదారిపై గుర్రపు డెక్కల లయబద్ధమైన సంగీతం మాత్రమే వినిపిస్తుంది. ఎలాంటి గందరగోళం, హడావిడీ కనిపించదు’ అనుకునేలా చేసిన ఈ తొమ్మిది సెకన్ల వీడియోను చూసి నెటిజనులు ‘వావ్’ అనడమే కాదు... ‘కార్లు, బైక్ల వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యతోపాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో గుర్రాలు పర్యావరణానికి హాని కలిగించని అద్భుతమైన రవాణా సాధనాలు’ అంటున్నారు కొందరు. ‘బ్లింకిట్’ను ‘జేమ్స్బాండ్’ ను కలిపి ‘బ్లింకిబాండ్’ అని నామకరణం చేశారు. -
ఆర్టిస్ట్ మీరే... క్యారికేచర్ మీదే!
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్... క్యారికేచర్ ట్రెండ్. పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీలో క్యారికేచర్లలోకి మార్చడమే ఈ ట్రెండ్ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా క్యారికేచర్లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్–స్టైల్ ఇమేజ్లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్లో భాగం కావడానికి డ్రాయింగ్ స్కిల్స్, డిజైన్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ ఎక్స్పీరియెన్స్లాంటివేమీ అవసరం లేదు. జస్ట్... ఆసక్తి ఉంటే చాలు!మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:→ చాట్జీపీటీ ఒపెన్ చేసి లేటెస్ట్ వెర్షన్ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.→ స్పష్టమైన, ఫ్రంట్–పేసింగ్ సెల్ఫీ లేదా ఫొటోను అప్లోడ్ చేయాలి.→ ‘క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మై మీ’... ఇలా ఇన్పుట్ ఇవ్వాలి.→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్ చేయాలి.→ ఇమేజ్ జనరేట్ అయిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి. -
రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్ మెర్సిడెస్ వచ్చింది!
షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేయడం, కూపన్స్ నింపడం, బంపర్ డ్రాలు కోసం ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?ప్రతీ వేసవిలో దుబాయ్ 'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్ సర్వ సాధారణం. కానీ దుబాయ్లోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం సుమిత్ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్. View this post on Instagram A post shared by Dubai Gold District (@dubaigolddistrict)కారుతో సరదాగా ఫోటో కట్ చేస్తే20ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్న సుమిత్ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్లకు ఒక వోచర్ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. సర్ప్రైజ్ చేసిన కాల్ఒకరోజు నైట్ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్ కాల్ వచ్చింది. మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?) -
తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?
2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర సర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా నమోదైనాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్గా మారింది.పెద్ద నోట్లు రద్దైన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్త నుండి దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను (@ayushidixit) అనే వినియోగదారు షేర్ చేశారు. దీని ప్రకారం.. పాతనోట్లను గుర్తించిన తరువాత అమ్మ తీవ్ర ఆందోళనకు లోనైంది. కంటతడి పెడుతోంది. నాన్నకు తెలియకుండా వీటిని దాచింది. ఇపుడు వీటిని బ్యాంకులు అంగీకరిస్తాయా, లేదా? అంటూ తన ఫాలోయర్స్ను ఉద్దేశించి అడగడాన్ని ఈ వీడియో క్లిప్లో చూడవచ్చు. View this post on Instagram A post shared by AD🧿 (@ayushidixit___)ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్తనెటిజన్లు ఏమన్నారంటేవైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్ కూడా రికార్డ్ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్ -
లాస్ట్ మినిట్లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్
చివరి క్షణంలో బాస్ సెలవు రద్దు చేయడంతో ఒక యువతి స్పందించిన తీరు నెట్టింట్ చర్చకు దారి తీసింది. తన జర్నీ ప్లాన్స్ గురించి ముందుగానే చెప్పినా, సరిగ్గా ఎయిర్పోర్ట్లో ఉండగా సెలవు రద్దు చేశాడట మేనేజర్. దీనికి సంబంధించి జెన్జెడ్ యువతి ఒక వీడియోను సోషల్ మీడియాల పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. సిమ్రాన్ షేర్ చేసిన వివరాల ప్రకారం తాను సెలవు మీద వెళ్లాలనుకుంటున్నట్టు కొన్ని వారాల ముందుగానే మేనేజర్కు తెలిపింది. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం లేవనెత్తలేదు. కానీ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి సిద్ధమవు తున్నప్పుడు, అత్యవసర విస్తరణ అవసరం కారణంగా ఆమె సెలవు రద్దు చేసినట్టు సమాచారం ఇచ్చాడు మేనేజర్. దీంతో షాకైన ఆమె "ఐ డోంట్ కేర్" అని సమాధాన మిచ్చిందట. కార్యాలయంలో అత్యవసర పరిస్థితులు సంభవించవచ్చు, కానీ పర్సనల్ కమిట్మెంట్స్ను పదేపదే దెబ్బతీసేలా ఉండకూడదు కదా సిమ్రాన్ తెలిపారు. ఉద్యోగాన్ని శ్రద్దగా చేస్తాను. అలాగే తన జీవితాన్ని, ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను. కానీ ఉద్యోగులు చివరి నిమిషంలో డిమాండ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని పేర్కొంది.Boss Cancels Leave At Last Moment, Gen Z Worker's "I Don't Care" Reply Goes Viral pic.twitter.com/GH2BZEm1K9— प्रेsident (@Desi_urbann) February 25, 2026నెటిజనుల స్పందనఈ వీడియో త్వరగా ఆన్లైన్లో దృష్టిని, మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఆమె వైఖరికి మద్దతు ఇచ్చారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై తీవ్ర చర్చ సాగింది. ఈ సంఘటన ఆమెను నిరాశకు గురిచేసిదని,ఇది కమ్యూనికేషన్ వైఫల్యంగా కొందరు పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల వ్యక్తిగత సమయం పట్ల గౌరవం లేకపోవడానికి నిదర్శమని కొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ సరైన బ్యాకప్ను ఏర్పాటు చేసుకొని, లీవ్ సంగతి స్పష్టంగా తెలియజేయాలని మరికొందరు పేర్కొన్నారు.అయితే, మరికొందరు సెలవు అధికారికంగా ఆమెదించారా? లేదా అని ప్రశ్నించగా, ఇలాంటి ప్రయాణాలప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ఉద్యోగిపై ఉందని ఒకరన్నారు. మొత్తం మీద ఈ వీడియో ఆఫీసు, అధికారుల ప్రవర్తనా తీరు, ఉద్యోగుల వృత్తిపరమైన జవాబుదారీతనం చుట్టూ పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేసింది. ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
పెళ్లిలో డాన్స్.. ఇలాగా కూడా చేస్తారా?
పదిహేను సంవత్సరాల క్రితం... కాలేజీ ఫంక్షన్లో ‘యూ ఆర్ మై సోనియా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు యశ్, గరీమా.తాజా విషయానికి వస్తే... స్నేహితులు కాస్తా వధూవరులు అయ్యారు.హైలెట్ ఏమిటంటే ఆనాటి డ్యాన్స్ వీడియోను పెళ్లివేడుకలో ప్రదర్శించడం. పెళ్లికి వచ్చిన అతిథులు మాత్రమే కాదు నెట్వాసులు కూడా ‘బ్రహ్మాండమైన ఐడియా’ అంటున్నారు.‘ఎన్నో జ్ఞాపకాలను మోసుకొచ్చి మనసును ఉల్లాసపరిచిన వీడియో ఇది’ అని ఇన్స్టాగ్రామ్లో రాసింది గరీమ.‘‘కాలేజీ డ్యాన్స్ను రీక్రియేట్ చేయాలనే ఐడియా అనుకోకుండా వచ్చింది. ఇంత స్పందన వస్తుందనుకోలేదు’ అన్నాడు యశ్. ‘చిన్ననాటి స్నేహితులు, కాలేజీ రోజుల నాటి స్నేహితులు పెళ్లి చేసుకుంటే వారి పాత వీడియోలు, ఫొటోలను పెళ్లి వేడుకలో ప్రదర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది’ అని సూచించాడు ఒక నెటిజనుడు.చదవండి: ఈ వధూవరులది ఎంత గొప్ప మనసు!పెళ్లివేడుకలో మరో హైలైట్ ఏమిటంటే ‘యూ ఆర్ మై సోనియా’ పాటకు వధూవరులు స్టేజీపై డ్యాన్స్ చేశారు.‘అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు!’ అంటారా?ప్రేమకు ఉన్న పవర్ అదే కదా! View this post on Instagram A post shared by Yash garima yaari (@yaarigram) -
పింక్ ప్యారడైజ్గా బెంగళూరు, వైరల్ వీడియోలు : హీరో ఈయనే
బెంగళూరు నగరంలో వసంతం ముందుగానే వస్తుంది. ప్రతీ వసంతంలో 'పింక్ ప్యారడైజ్'లా అద్భుతమైన అందతో అలరారుతుంది. అచ్చం జపాన్లోని 'చెర్రీ బ్లాసమ్స్' లాగే బెంగళూరులోని ఈ పూలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆకాశం నుండి చూస్తే గులాబీ దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే ఈ అద్భుత దృశ్యం వెనుక ఒక గొప్ప వ్యక్తి కృషి ఉంది. పింక్ పూలతో స్వాగతం పలుకుతున్న బెంగళూరు వీధులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు 'పింక్ ప్యారడైజ్' వెనుక ఉన్న హీరో గురించి తెలుసుకుందాం.గార్డెన్ సిటీ బెంగళూరు ఇపుడు పింక్ ప్యారడైజ్లా దర్శనమివ్వడానికి కారణం సేతురాం గోపాల్రావు నేగిన్హాల్ అనే అటవీ అధికారి. ఆయన కేవలం అటవీ శాఖ అధికారిగా మాత్రమే కాకుండా, ఒక దార్శనికుడిగా పనిచేశారు. కర్ణాటక కేడర్కు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ సేతురామ్ గోపాలరావు నెగినహాల్ (S.G. Neginhal). 1980వ దశకంలో బెంగళూరు నగరం వేగంగా విస్తరిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి గుండూ రావు నగరాన్ని పచ్చదనంతో నింపే బాధ్యతను నెగినహాల్కు అప్పగించారు. అంతే అప్పటివరకు అడవుల పెంపకానికే పరిమితమైన అటవీశాఖ, మొదటిసారిగా నగర వీధుల్లో మొక్కలు నాటడం ప్రారంభించింది అటవీశాఖ. నెగినహాల్ కేవలం చెట్లను నాటడమే కాదు, ఏ వీధిలో ఏ చెట్టు ఉండాలో చాలా శాస్త్రీయంగా నిర్ణయించారు. 1982-1987 వీధివీధిన స్థానికులను అడిగి మరీ సుమారు 15 లక్షల మొక్కల్ని నాటించారు. మొక్కల్ని నాటడంతోనే చేతులు దులుపేసుకోలేదు ఆయన. నాటిన మొక్కల్ని పశువులు, ప్రజల నుండి కాపాడటం మొదలు, వాటిని సంరక్షణ లాంటి అనేక సవాళ్లను శ్రద్ధగా నిర్వహంచారు. View this post on Instagram A post shared by Sharath Kumar (@sharuzlife) నెగినహాల్ అద్భుతమైన ప్రణాళికబెంగళూరు వీధుల్లో ఒకేసారి ఒకే రంగు పూలు పూసేలా ఆయన ప్లాన్ చేశారు. వసంత కాలం వస్తే ఒక వీధి అంతా పసుపు రంగులో (Tabebuia Argentea), మరో వీధి అంతా గులాబీ రంగులో (Tabebuia Rosea) కనిపిస్తుంది.టాబెబుయా రోసియా (Tabebuia Rosea): ఇప్పుడు మనం చూస్తున్న ఈ గులాబీ రంగు పూల చెట్లు నిజానికి విదేశీ జాతికి చెందినవి. ఇవి బెంగళూరు వాతావరణానికి బాగా సరిపోతాయని ఆయన గుర్తించి వేల సంఖ్యలో నాటించారు. (గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం)2024లో నెగినహాల్ ఈ భౌతిక ప్రపంచానికి దూరమైనా ఆయన నాటిన లక్షలాది చెట్లు ప్రతి ఏటా వసంత కాలంలో విరగబూస్తూ ఆయన ఉనికిని గుర్తు చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కబ్బన్ పార్క్, లాల్బాగ్, మల్లేశ్వరం, జయనగర్ తదితర వీధుల్లో పూలు పూసినప్పుడు నేలంతా గులాబీ రంగు పూల రేకులతో నిండి పోయి అద్భుతంగా కనింపించే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆయన దార్శనికత మరింతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. ఇదీ చదవండి: టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్ -
పానీపూరీని ఇలా కూడా సర్వ్ చేయొచ్చా..!?
ఆహార విక్రేతలు వాళ్ల ఫుడ్ స్టాల్ అమ్మకాల కోసం ఎన్నో రకాల వ్యూహాలతో సాగుతారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ పానీపూరీ విక్రేత అంతకుమించి క్రియేటివిటీతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. మొత్తం సెటప్ చూస్తే..అది పానీ పూరీ అమ్ముతున్నట్లుగా ఉండదు..ఏదో వార్లా కనిపిస్తుంది. ఈ వ్యక్తి క్రియేటివిటీకి, ఐడియాకు మెచ్చుకోకుండా ఉండలేం. అంతలా ఫుడ్స్టాల్ని సెటప్ చేశాడు మరి..!. ఎక్కడంటే..ముంబైకి చెందిన పానీపూరీ వ్యాపారి అసాధారణమైన రీతీలో సర్వ్ చేస్తూ అందర్ని ఆకర్షిస్తున్నాడు. ఆఖరికి అతడి ఆహార్యం సైతం పూర్తి విభిన్నంగా ఉంది. అతడు పానీపూరీని పోరాట అడిషన్గా మార్చేశాడు. యుద్ధం చేసే సైనికుల మాదిరిగా పవర్ఫుల్ వార్మ్యాన్లా దుస్తులు ధరించి చేతిలో సూపర్సోకర్ వాటర్గన్తో ప్రజలకు పానీపూరీని సర్వ్ చేస్తున్నాడు. ఆలుకర్రీ స్టఫ్తో ఉన్న పానీపూరీలోకి మసాలా నీటిని గరిటెతో కాకుండా..ఇలా వాటర్గన్తో సర్వ్ చేస్తున్నాడు. కొందరికీ నేరుగా నోటిలోకే వచ్చేలా అందిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఆ విధానాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుండం విశేషం. అంతేగాదు ఒకరకంగా ఆవిచిత్రమైన శైలిని చూసి.. జనాలు ఎగబడి మరి అక్కడకు వచ్చి పానీపూరీలని ఆస్వాదిస్తున్నారు. ఇది మార్కెటింగ్ ట్రిక్ అయినా..పొట్టకూటి కోసం మనిషి ఎంత దూరమైన వెళ్తాడు..పైగా తనలోని టాలెంట్ మొత్తం బయటకు తీసి ఏదోరకంగా బతుకుబండిని నడిపించేందుకు ఆరాటపడతాడు. అందుకు నిదర్శం ఈ పానీపూరీ వ్యాపారి క్రియేటివిటీనే కదూ..!.(చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!
ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గ్రాడ్యుయేషన్ డే అంటే ఎంతో సంతోషంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అది వారికి ఓ గొప్ప పండుగ. అలాంటి గొప్ప వేడుకలో ఓ తల్లి ఎంత పట్టరాని సంతోషంలో ఉందంటే..ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్లందరి ముఖాల్లో నవ్వలు విరిసేలా చేసింది. కూతురు గ్రాడ్యుయేషన్ డేలో ఆ తల్లి సంతోషమే హైలెట్గా నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందంటే..కెనడాలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తన కూతురి కోసం తల్లి పట్టరాని సంతోషంతో డ్యాన్స్లు వేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ స్నాతకోత్సవంలో కూతురు నల్లగౌనులో వేదికపైకి వచ్చి ప్రొఫెసర్తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుండగా..ఆ తల్లి సంతోషంతో నేను నిన్న ప్రేమిస్తున్నా తల్లి..అని గట్టిగా అరుస్తుంది. ఆ స్వరానికి అందరు ఆశ్చర్యపోతూ..అక్కడ ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. ఆ తల్లి ఎంతో గర్వంగా ఉద్విగ్నంగా కూతురిని, ఆ ప్రొఫెసర్ని ప్లీజ్ రెండు స్టెప్లు వేయమని కోరడం..అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పిల్లలు సాధించిన ఘనతలను సంబరం చేసుకుని ఆనందపడేది ఒక్క మన తల్లిదండ్రులే కదా..!. నిజంగా పేరెంట్స్ మనల్ని చూసి గర్వంగా ఉప్పొంగిన క్షణం మాటలకందని సన్నివేశం, మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Gursehaj Kaur (@impromptu_gursehaj) (చదవండి: రష్మిక, విజయ్ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ఎంత ఖర్చు అవుతుందంటే..) -
మహ్మద్ దీపక్తో రాహుల్ గాంధీ భేటీ, ఫోటోలు వైరల్
ఉత్తరాఖండ్లో గుంపునుంచి 70 ఏళ్ల ముస్లిం దుకాణదారుడిని కాపాడి సంచలనంగా మారిన దీపక్ కుమార్ను లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సోమవారం కలిశారు. త్వరలో తన జిమ్కు వెళ్తానని రాహుల్ దీపక్కు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ఉత్తరాఖండ్ కోట్ద్వార్ పట్టణంలో ఇటీవల ఒక ముస్లిం వ్యాపారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్న సమయంలో, ఆ వ్యాపారిని రక్షించిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ , సోనియా గాంధీలను కలిసిన తర్వాత విలేకరులతో దీపక్ మాట్లాడుతూ, “రాహుల్ జీ ఫోన్ చేసి, తన కుటుంబంతోమాట్లాడారు. ఏం జరిగినా దాని గురించి చింతించ వద్దని చెప్పారనిగుర్తు చేసుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని ,చేసింది మంచిదేనని రాహుల్ చెప్పారన్నారు. కోట్ద్వార్ను సందర్శించి తన జిమ్లో సభ్యత్వం తీసుకుంటానని చెప్పారనీ, రాహుల్ జీ జిమ్ సభ్యత్వం తీసుకుని వర్కౌట్స్ చేస్తే చాలా సంతోషిస్తానని కూడా చెప్పారు. ఇంతకు ముందు తనకు వస్తున్న బెదిరింపులు ఆగిపోయాయని కూడా దీపక్ అన్నారు.नेता विपक्ष श्री @RahulGandhi ने उत्तराखंड के 'मोहम्मद दीपक' से मुलाकात की।मोहम्मद दीपक ने एकता, भाईचारे और हिम्मत की वो मिसाल पेश की है- जो देश के हर युवा को अन्याय और नफरत के खिलाफ लड़ने का हौसला देगा।दीपक 'मोहब्बत की दुकान' के योद्धा हैं- पूरे देश को इन पर गर्व है। 📍… pic.twitter.com/pxGkXZCVKI— Congress (@INCIndia) February 23, 2026 ఈ ఏడాది జనవరి 26న, 38 ఏళ్ల దీపక్, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్న వ్యక్తుల గుంపును ఎదిరించి వకీల్ అహ్మద్ దుకాణాన్ని రక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా భజరంగ్ దళ్ కార్యకర్తలుపేరు అడిగినపుడు‘‘మహ్మద్ దీపక్’’ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు.కాగా వకీల్ అహ్మద్ తన షాపు పేరు ‘‘బాబా స్కూల్ డ్రెస్’’గా పెట్టుకోవడంపై బజరంగ్ దళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంఘటన తర్వాత, దీపక్ నిర్వహిస్తున్న హల్క్ జిమ్లో సభ్యత్వ సంఖ్య 150 నుండి 15కి పడిపోయింది. జిమ్ నిర్వాహకుడిగా ఉన్న దీపక్ ఆ తరువాత కొన్ని ఇబ్బందుల నెదుర్కున్నాడు. అయితే ‘‘ఇండియా హీరో’’ అంటూ దీపక్పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. అలాగే సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మెంబర్ షిప్ తీసుకున్నారు.राहुल गांधी जी ने मुझे मिलने के लिए बुलाया था। उन्होंने मेरे परिवार से बात की और मुझे समझाया कि डरने की कोई जरूरत नहीं, आपने कोई गलत काम नहीं किया है।राहुल जी ने ये भी कहा कि वे कोटद्वार आकर मुझसे मिलेंगे और मेरे जिम की मेंबरशिप लेंगे। : नेता विपक्ष @RahulGandhi जी से मिलने… pic.twitter.com/9GheWSOyPB— Congress (@INCIndia) February 23, 2026 -
ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
గుజరాత్లోని ద్వారకలోని గోమతి ఘాట్ సమీపంలో అద్భుతమైన నెమలి లాంటి తోక ఉన్న అరుదైన చేప ఆసక్తికరంగా మారింది. ద్వారకలోని గోమతి నది పవిత్ర జలాలు సాధారణంగా యాత్రికులతో కళకళలాడుతుంటాయి. సోషల్ మీడియాలో ఒక వింత చేప అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడినెమలి పింఛాన్ని పోలిన చేప అంటూ ఇటు భక్తి పారవశ్యాన్ని, ఇటు శాస్త్రవేత్తలలో ఉత్సుకతను రేకిత్తించింది. అసలేంటీ నెమలి పింఛం పోలిన తోకతో ఉన్న 'నీడిల్ ఫిష్' (Needlefish) కథ తెలుసుకుందాం.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. చూసేందుకు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుని తలపైన ఉండే నెమలి పింఛంలాగే ఉందని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే, అద్భుతంతో పాటు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక చేప నెమలి పింఛంతోకతో కనిపించిన అసాధారణ దృశ్యం సముద్ర జీవవైవిధ్యంలో వస్తున్న మార్పులకు ఇది ఒక సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.చేప తోకలోని రంగురంగుల విసనకర్ర లాంటి తోకను చూసి స్థానికులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తాయని నిపుణుల అంచనా.శాస్త్రవేత్తల ప్రకారం, ఇది ఒక అరుదైన జన్యుపరమైన మార్పు లేదా పర్యావరణ ప్రభావం వల్ల కలిగిన శారీరక మార్పు అయి ఉండవచ్చు ఈ నీడిల్ ఫిష్ శరీరం పొడవుగా, సూదిలా ఉండి, తోక విసనకర్ర ఆకారంలో ఉండి, నెమలి ఈకల వలె మెరిసే నీలం, పచ్చ రంగులతో కూడి ఉండటం విశేషం. సాధారణంగా నీడిల్ ఫిష్లు (Needle Fish) పొడవైన శరీరాలు, పదునైన దవడలు కలిగి ఉంటాయి, కానీ వాటికి ఇంత అందమైన, రంగురంగుల తోకలు ఉండటం చాలా అరుదు. ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ View this post on Instagram A post shared by THE UNITY INDIA™ (@theunityindia)ఈ చేప ప్రత్యేకత ఏమిటి?సాధారణంగా ఈ జాతి చేపలకు తోక రెక్కలు (Fins) చాలా చిన్నవిగా, రంగు లేకుండా ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన చేపకు తోక భాగం చాలా వెడల్పుగా, స్పష్టమైన రంగులతో ఉంది. కాంతి పడినప్పుడు ఆ తోక నెమలి పింఛంలా మెరుస్తూ కనిపిస్తోంది. గోమతి నది అరబిక్ సముద్రంలో కలిసే చోట (Brackish water) మంచినీరు, ఉప్పునీరు కలిసి ఉంటాయి. వాతావరణ మార్పులు, నీటిలోని లవణీయత (Salinity) మారడం లేదా సముద్ర ప్రవాహాల వల్ల ఇలాంటి అరుదైన సముద్ర జీవులు అప్పుడప్పుడు తీరానికి వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు, సముద్రపు నీరు వేడెక్కడం వల్ల కొన్ని జీవుల ఆవాసాలు మారుతుంటాయి. జన్యుపరమైన మార్పులు (Mutation) లేదా స్థానిక పర్యావరణ ప్రభావం వల్ల ఈ చేప తోక ఇలా భిన్నంగా తయారై ఉండవచ్చు. దీనిపై సరైన పరిశోధన జరిగితే, భారత తీర ప్రాంతాల్లోని సముద్ర జీవుల పరిణామ క్రమం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.ఇది తెలిసిన జాతిలో ఒక కొత్త రకమా లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా అనేది పక్కన పెడితే, ఈ "నెమలి తోక చేప" మాత్రం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిగోమతి ఘాట్: ఈ ఘాట్ సుమారు 100 సంవత్సరాలకు పైగా భక్తులచే పూజించబడుతోంది, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ స్నానం చేసినట్లు నమ్మకం. గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే పవిత్రమైన ప్రదేశం. దీనిని గోమతి సంగమ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం చేసి, తమ పాపాలలన్నీ హరిస్తాయని భక్తుల విశ్వాసం. -
ఆటోలో పూలు బదులు..చెవిపోగులు..!
కొన్ని పనులు చూసేందుకు చిన్నగా ఉన్నా.. అందరి హృదయాలను దోచుకుంటుంది. కాస్త మనసుపెడితే..పెద్దపనులతోనే మన ప్రేమను వ్యక్తం చేయాల్సిన పనిలేదు. చాలా చిన్నపాటి వాటితో కూడా అనంతమైన ప్రేమను చాలా సునిశితంగా వ్యక్తం చేయొచ్చు. అందుకు ఈ ఆటో డ్రైవరే నిదర్శనం. బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో వేలాడిదీసిన చెవిపోగులు కారణంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అవి ఆయన భార్య చెవిపోగులు. రోజంతా ఆమెతో ఉన్నట్లుగా ఫీలయ్యేలా ఆటోలో అద్దానికి వేలాడదీయడంతో అవి ప్రతి ఒక్కర్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిజానికి చాలామంది ఆ అద్దం ముందు పూలు వంటి ఇతర డెకరేటెడ్ ఐటెమ్స్ పెట్టుకుంటారు. భార్య గుర్తొచ్చేలా..ప్రతి నిమిషం ఆమెతో ఉన్నట్లుగా ఎదురుగా అలా వేలాడదీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా బయటపడుతుంది అనేందుకు ఈ ఆటోడ్రైవర్ చేసిన పనే ఉదాహరణ. సింపుల్గా చెప్పాలంటే అతడి ప్రేమ చూస్తే..మనుషులెరగలేరు మాములు ప్రేకాదు..అగ్నికంటే స్వచ్ఛమైనది..అనే పాట గుర్తొస్తోంది కదూ..! నెటిజన్లు సైతం సదరు డైవర్పై ప్రశంసలు కురిపిస్తు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sula (@marilyn.sultana.akand) (చదవండి: ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..! -
ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..!
ఏ తల్లిదండ్రులు పిల్లల నుంచి పెద్దగా ఏమి ఆశించారు. పిల్లల క్షేమమే సదా ఆ కాక్షించే ఆ పేరెంట్స్ రుణం ఏమిచ్చినా..తీర్చుకోలేం. వాళ్ల ప్రేమ అనంతం, అజరామరం. వాళ్లకు ఎంతో ఇష్టమైన పని, లేదా వాళ్ల లైఫ్ డ్రీమ్ని నెరవేరిస్తే..ఏ పిల్లలకైనా అంతకు మించిన గొప్ప విజయం మరొకటు ఉండదు. అలాంటి గొప్ప సక్సెస్ని సాధించాడు ఈ కొడుకు. తన అమ్మకు ఎంత గొప్ప అనుభూతిని ఇచ్చాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. ఏ తల్లైన ఇంతకుమించి ఇంకేం కోరుకుంటుంది పిల్లల నుంచి అనిపిస్తుంది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మనీష్ అనే వ్యక్తి విమానం ఎక్కడం అనేది తనతల్లి చిరకాల కోరిక అని. అది ఈ రోజు నెరవేరబోతుందంటూ..తల్లి కొడుకులిద్దరూ విమానం ఎక్కుతున్న దగ్గర నుంచి లోపల కూర్చొని విండోని వీక్షిస్తున్న ప్రతీది వివరంగా చూపించాడు. తన తల్లి మొత్తం కుటుంబంలోనే విమానం ఎక్కిన ఏకైక మహిళ అని భావోద్వేగంగా అన్నాడు. ఆమె కూడా తన కొడుకుతో విమానం ఎక్కుతూ భావోద్వేగంగా చుట్టూ పరికిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి వీడియోలో. ఆమె ఆ ఫ్టైట్లో భోజనం తింటూ సిగ్గుపడుతున్న క్షణాలు, కొడుకుని చూస్తూ..తన కల నెరవేర్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్న కమనీయ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా ఏ తల్లిందడ్రులైనా..ఇంతకు మించి పిల్లల నుంచి ఏమి ఆశించరేమో అనిపిస్తుంది. View this post on Instagram A post shared by MK (@manishh_mk_) (చదవండి: బ్యాండ్ లేదు.. బరాత్ లేదు..సింపుల్గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్ జంట) -
సుందర్ పిచాయ్తో సరదాగా, సర్ప్రైజింగా : వైరల్ వీడియోలు
న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో గూగుల్ ఉద్యోగి సీఈఓ సుందర్ పిచాయ్ను కలవడం గురించి చేసిన హృదయపూర్వక పోస్ట్ ఆన్లైన్లో అందరినీ ఆకట్టుకుంది. గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అయిన తనుషి గుప్తా సుందర్ పిచాయ్ కలవాలనే తన చిరకాలకలను సాకారం చేసుసుకున్న వైనం గురించి లింక్డ్ఇన్లోపోస్ట్ చేసింది.గుర్గావ్ కార్యాలయంలో సుందర్ పిచాయ్తో తన సంభాషణను సంగ్రహించిన వీడియో క్లిప్తో పాటు, ఆ భావోద్వేగ క్షణాన్ని ఆ ఒక కలగా అభివర్ణించింది. తన చిన్ననాటినుంచి తనకు 'రోల్ మోడల్' అయిన వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ఈ ఎన్కౌంటర్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని తెలిపింది. అలాగే తాను గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ని మాత్రమే కాదనీ, మేకప్ కంటే యంత్రాలను ఎంచుకున్న చిన్న అమ్మాయినని పేర్కొంది. టెక్ గురించి అంతులేని ఆసక్తి ఉన్న విద్యార్థిని. వస్తువులను కొనడం కంటే వస్తువులను నిర్మించడం ముఖ్యమని నమ్మిన అమ్మాయి నంటూ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశంసోషల్ మీడియా స్పందనఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో 259,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు తాము ఆరాధించే ప్రజా వ్యక్తులను కలిసిన అనుభవాలను పంచుకున్నారు.> తనుషి కథతోపాటు మరో యువకుడి సరదా సంభాషణ కూడా నెట్టింట సందడిగా మారింది. యూట్యూబ్ ద్వారా సక్సెస్ అయిన అనంత్ లథా స్టోరీ ఇది. ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’ అను యూట్యూబ్ ని రన్ చేస్తున్న అనంత్ ఏఐ సదస్సులో సుందర్ పిచాయ్తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేయడంతోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేశాడు. సదస్సులో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం వచ్చిన తాను నమస్తే సార్.. మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు’ అంటూ పలకరించానని చెప్పుకొచ్చాడు. దీనికి ఆశ్చర్యపోయిన పిచాయ్ ఎలా అని ప్రశ్నించారట. తానొక యూట్యూబర్నిని, మీ మూలంగానే నెలనెలా యూట్యూబ్ నుంచిఆదాయం పొందుతున్నానని చెప్పడంతో ఆయన సరదాగా నవ్వేశారంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుందర్ పిచాయ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు. View this post on Instagram A post shared by Anant Ladha (@anantladha1234) -
‘సాక్షి’ సోషల్ మీడియా అరుదైన ఘనత
నేటి సమాజంలో వార్తా విశేషాల్ని తెలుసుకోవడానికి టీవీలు, పేపర్ల పాత్ర చాలా తక్కువైపోయింది. అంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికలపై దృష్టి పెడుతున్నారు. వార్తలు, వినోదం, అభిప్రాయాలు ఇలా ఆల్ ఇన్ వన్ తరహాలో అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్(ట్విటర్) వంటి ప్లాట్ఫాంలు ప్రధాన సమాచార వనరులుగా మారాయి. తక్షణ సమాచారం అందించే సామర్థ్యం సామాజిక మాధ్యమాలకు ఉండడం ప్రజలను ఆకర్షిస్తోంది. ఫలితంగా యువతలో సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉంది.సమాజంలో అభిప్రాయాలు, చర్చలు ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా కూడా. ఈ క్రమంలోనే ఇక్కడ మీతో(ప్రేక్షక్షులకు) ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ‘సాక్షి’ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లలో నెలవారీ వీక్షణలో 100 మిలియన్ల వ్యూయర్షిప్ను సాధించింది. తెలుగు సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘సాక్షి’ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ఎప్పటికప్పుడు వేగంగా వార్తా సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘సాక్షి’ సోషల్ మీడియాని ఫోలో అవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.సాక్షి ఫేస్బుక్సాక్షి ఇన్స్టాసాక్షి ‘ఎక్స్’సాక్షి వాట్సాప్ చానల్ -
బుజ్జి కోతి ‘పంచ్’.. మరో వైరల్ వీడియో
ఇచికావా సిటీ జూలో నివసిస్తున్న ఏడు నెలల మెకాక్ కోతి 'పంచ్-కున్' ఎట్టకేలకు తన గుంపులో చోటు సంపాదించుకుంది. ఒక పెద్ద కోతి ఈ బుజ్జి పంచ్ని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా హత్తుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమ్మగా భావించి ఒక బొమ్మను పట్టుకుని తిరుగుతూ పంచ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ కోతి పిల్ల పుట్టిన వెంటనే తల్లి వదిలేసి పోయింది. ఆ తల్లి బంధాన్ని తెంపుకుని పోయింది. జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఉంటున్ప పంచ్.. అమ్మ కోసం అది పడే బాధను చూసి జూ అధికారులు దానికో ఉరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు. అప్పటి నుంచి ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకునేది.తన జాతి నుంచి రోజుల తరబడి తిరస్కరణను గురైన బేబీ పంచ్.. ఎట్టకేలకు ప్రేమను అనుభవించింది. ఓ పెద్ద కోతి చిన్నారి పంచ్ను గట్టిగా హత్తుకుని భరోసా ఇచ్చిందంటూ అని వీడియోను ఒక నెటిజన్ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఒక పెద్ద కోతి పంచ్ను సున్నితంగా నిమురుతూ కనిపించింది. ఇలా నిమరడం అనేది నమ్మకాన్ని పెంచుకోవడం, తమ బంధాన్ని బలపరుచుకోవడమేని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.After enduring days of rejection, Baby Punch finally experienced the comfort of love. Today, the adult monkey Onsing drew little Punch into a firm, deeply reassuring embrace. pic.twitter.com/SnCdsDZ5kl— ✮ راينر براون (@dondawastaken) February 20, 2026 -
ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త గురించి తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద భూనత్త (LandSnail) గురించి తెలుసా? గీ జోరోనిమో అనే పెద్ద ఆఫ్రికన్ భూనత్త అతిపెద్ద నత్తగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఇంతవరకూ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది ఆసక్తికరంగా. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా నత్తచాలా చిన్న ప్రాణి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 1978లో పశ్చిమ ససెక్స్ (West Sussex) లో కొలవబడిన 'గీ జెరోనిమో' (Gee Geronimo) అనే 27.3 సెంటీమీటర్ల పొడవుతో 'జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నేయిల్' ప్రపంచంలోనే అతిపెద్ద భూచర నత్తగా గుర్తింపు పొందింది. అయితే, సముద్రపు జాతులతో పోలిస్తే ఇది చాలా చిన్నది.జెయింట్ ఆఫ్రికన్ భూ నత్త రికార్డుభూ నివాస జాతులలో జెయింట్ ఆఫ్రికన్ భూమినత్తలు ప్రత్యేకం. ఇందులో రికార్డ్ కొట్టేసిన గీ జెరోనిమోను పెంపుడు జంతువుగా పెరిగింది. దీని యజమాని ఇంగ్లాండ్లోని వెస్ట్ సస్సెక్స్కు చెందినవాడు. ఈ నత్త షెల్ 27.3 సెంటీమీటర్ల పొడవు. బరువు దాదాపు కిలోగ్రాము బరువు. ఈ నత్తలకు మందపాటి, శంఖాకారంలో ఉండే చిప్పలు ఉంటాయి. వేడి వాతావరణం, నియంత్రిత పరిస్థితులను బట్టి వీటి పరిమాణం ఉంటుంది. అయినప్పటికీ, గీ జెరోనిమో ఇప్పటికీ ఒక అద్భుతంగానే మిగిలి ఉంది.మూడేళ్ల పిల్లాడంత నత్తఅయితే సముద్ర నత్తలు ఇంకా పెద్దవిగా పెరుగుతాయి. ఆస్ట్రేలియన్ ట్రంపెట్ షెల్ వంటి సముద్ర జాతులు సాధారణ నత్తలతో పోలిస్తే భారీ పరిణమాణంలో ఉంటాయి.దాదాపు 72.2 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అంటే దాదాపు మీటరు పొడవు, మూడేళ్ల పిల్లాడంత బరువు అన్నమాట. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లోని ఇసుక పొరలలో నివసిస్తాయి. వీటి పొడవైన చిప్పలు చాలా ప్రత్యేకం.నత్తలు 'మొలస్కా' (Mollusc) అనే విభిన్న సమూహానికి చెందినవి. వీటి పెరుగుదల ఆహారం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. భూమిపై ఉండే నత్తలు ఊపిరితిత్తుల వంటి కుహరం ద్వారా గాలిని పీల్చుకుంటాయి, కానీ సముద్రపు నత్తలు నీటి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తాయి. -
బ్యాండ్ లేదు.. బరాత్ లేదు..సింపుల్గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్ జంట
ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఏ రేంజ్లో గ్రాండ్గా జరుగుతున్నాయో తెలిసిందే. అందులోనూ అత్యున్నత హోదాలో ఉన్నవాళ్ల పెళ్లిళ్లు కళ్లు చెదిరిపోయే రేంజ్లో వీఐపీలతో అత్యంత కోలహలంగా జరుగుతాయి. అలాంటిది ఈ ఐఏఎస్ దంపతులు ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా చాలా సింపుల్గా పెళ్లిచేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. మధురమైన దాంపత్యానికి ఆడంబరంతో పనిలేదని ఎలుగెత్తి చాటారు. ప్రస్తుతం ఈ దంపతుల పెళ్లి సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది.ఆ దంపతులే మాధవ్ భరద్వాజ్-అదితి వర్ష్నీలు. ఎలాంటి హంగు ఆర్భాటం జోలికి పోకుండా సింపుల్గా రాజస్థాన్ అల్వార్ సచివాలయంలో పెళ్లిచేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ నెల (ఫిబ్రవరి) 18న బుధవారం ఆ జంట వివాహం జరిగింది. అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఆ వివాహాన్ని చూసి విస్తుపోయారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తమ వివాహానికి వేదికగా, రాజస్థాన్ జిల్లా కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. దాంతో ఈ జంట వివాహం వార్తల్లో నిలిచింది. బ్యాండ్ లేదు, బరాత్ లేదు, వీఐపీ అతిథులు లేరు. కేవలం తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో కలెక్టర్ ఛాంబర్లో దండలు మార్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం సచివాలమయే వివాహ వేదికగా మారింది. ఈ ఇద్దరూ కూడా 2023 బ్యాచ్కు చెందిన యువ ఐఏఎస్లు. ముస్సోరీకి చెందిన మాధవ్, ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన అదితిలిద్దరూ ఐఏఎస్ శిక్షణ సమయంలోనే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీంతో ఎగిరి గంతేసిన జంట.. పెళ్లి మాత్రం చాలా సింపుల్గా ముగించేశారు. కాగా, మాధవ్ భరద్వాజ్ యూపీఎస్సీ 2022లో లోకోమోటర్ డిజేబిలిటీ విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ 536ని కైవసం చేసుకుని ఐఏఎస్ అయ్యారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి MBA పూర్తి చేసిన ఆయన, భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి శారీరక సవాళ్లను అధిగమించారు. మాధవ్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి సివిల్ సర్వీసెస్కు మారారు.ఇక అదితి వర్ష్నీ 2022లో యూపీఎస్సీ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 57 ర్యాంక్ని సంపాదించి ఐఏఎస్ అయ్యారు. తండ్రి వ్యాపారవేత్త. అయితే మాధవ్ భరద్వాజ్ ప్రస్తుతం రాజస్థాన్ అల్వార్లో SDM (సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. భార్య అదితి వర్ష్నీ ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో SDM(సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్)గా ఉన్నారు.(చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
ఈ వధువరులది ఎంత గొప్ప మనసు..!
చిన్న చిన్న పనులు కూడా మానవత్వానికి అద్దం పడతాయని చెప్పకనే చెప్పిన ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ‘వేడుకలలో మనం కూడా ఇలాగే చేయాలి’ అనిపించేలా చేసింది. సాధారణంగా వివాహ వేడుకల్లో ఎవరి బిజీలో వారు ఉంటారు. వేరే వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఇక ఈ వివాహం విషయానికి వస్తే....క్యాటరింగ్ స్టాఫ్ పెళ్లికి వచ్చిన వారికి రుచికరమై పదార్థాలు వడ్డించారు. విందు కార్యక్రమం పూర్తయింది.ఈలోపు వధూవరులు...‘క్యాటరింగ్ స్టాఫ్ ఎక్కడా?’ అంటూ వచ్చారు. ‘వడ్డించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా?’ అని వారు భయపడ్డారు. ‘సర్, ఎనీ ΄ప్రాలాబమ్?’ అని వినయంగా అడిగారు. ‘ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంతకీ మీరు భోజనం చేశారా?’ అని అడిగారు.‘లేదు’ అని చెప్పడంతో వధూవరులు వారికి ఆప్యాయంగా ఆహారపదార్థాలు వడ్డించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. వధూవరులకు పాన్ఇండియా నుంచి ప్రశంసలు వచ్చాయి. View this post on Instagram A post shared by @Cinematographer🎬 (@aarush7069) -
లోన్లీ మంకీ ‘పంచ్’ కథ తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..!
మూగజీవులు సైతం అమ్మ దగ్గరే కథే సురక్షితంగా, ధైర్యంగా ఉండగలవు. అమ్మ స్పర్శ ధైర్యం, ఆమె చెంత ఓదార్పు, నిశ్చింత అందిస్తుంది. అలాంటిది కన్నతల్లే బిడ్డను సాకేందుకు ఇష్టపడకపోతే..అంతకుమించిన దురదృష్టం ఇంకొకటి ఉండదు. పాపం ఈ కోతి పిల్లకు కూడా అలాంటి కష్టమే వచ్చింది. అమ్మ వద్దంటున్నా..అమ్మే కావలంటే అల్లాడిని చిట్టి కోతి ఎంతలా..అమ్మ సహచర్యం కోసం ఎంతలా ఆరాట పడిందో తెలిస్తే..కన్నీళ్లు వచ్చేస్తాయి. ఆ చిట్టి కోతి జపాన్కి చెందిన మకాక్ జాతీ కోతి. ఇది జపాన్లోని ఇచికావా సిటీ జూలో పుట్టింది. ఆ కోతిపిల్ల పేరు పంచ్. గతేడాది జూలై 26, 2025న జన్మించింది. తక్కవు బరువుతో పుట్టడంతో తల్లిసహచర్యం అత్యంత అవసరం అయితే. చిట్టికోతి తల్లి మాత్రం దాన్ని దగ్గరకు రానివ్వలేదు,పైగా దాని బాగుగోలు చూసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది. నిజానికి ఇదే తొలిసంతానం కూడా. అయినా కోతుల్లో కొన్ని ఎందుకనే మాతత్వాన్ని అంగీకరించవట. వాటి పిల్లలను సరిగా చూసుకోవట. సదరు జూ సంరక్షకులు చెబుతున్నారు. దాంతో ఆ చిట్టికోతి జూ సంరక్షకుల చేతిలోనే పెరిగింది. అయితే దానికి తన తల్లితోనే ఉండాలని చూసేది. దాంతో జూ సంరక్షకులు ఆ కోతి పిల్ల బాధను తీర్చేలా అచ్చం దాని జాతి కోతి బొమ్మని ఇచ్చారు. ఎందుకంటే ఆ బెంగతో పిల్ల కోతి చచ్చిపోకుండదని గత్యంతరం లేక అలా చేశారు జూ అధికారులు. అయితే ఆ బొమ్మతో ఆడుకున్న తీరు..దాంతో మసిలిన తీరు చూస్తే..మనసు ద్రవించిపోతుంది. అదే తల్లి అనుకుని దాన్ని గట్టిగా కౌగించుకుని పడుకోవడం వంటి చర్చలన్ని సీసీఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత తన జాతి కోతుల్లా పెరగాల్సి కూడా ఉంటుంది. కాబట్టి అందుకోసం అని దాని జాతి కోతి దళంలోకి ఆ కోతిపిల్లను మార్చారు. పాపం మొదట్లో పెద్దపెద్ద కోతులు మందలించినా..వాటితో కలసిపోయింది. సహజంగా కోతుల ఉండే తీరులో పెరగడం, వాటితో సంభాషించడం నేర్చుకుంది. పైగా ఇప్పుడు దానికో సహచర్య స్నేహితుడు దొరికాడు. దాంతో ఎంతో సంతోషంగా గడుపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ మారాయి. అవి చూస్తే..ఎవ్వరికైనా..అమ్మ..అమ్మే కదా అనిపిస్తుంది. ఒక్క క్షణం అమ్మ కనిపించకపోతే..ఏ బిడ్డైన అల్లాడిపోతాడు అది మూగజీవులకు కూడా వర్తిస్తుంది కదా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి ఆ వీడియోపై.🇯🇵🥹 In a Japanese zoo, baby monkey Panch, who had been clinging to a plush toy after being rejected by his mother, has finally found a real friend. Zookeepers had given him a plush orangutan to replace his mother, but now he has finally found a friend who truly cares for him. pic.twitter.com/GpgLULkB7T— Visegrád 24 (@visegrad24) February 18, 2026 (చదవండి: డ్యామేజ్ని కూడా ఫ్యాషన్గా మార్చేశారు..!) -
60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!
సోషల్ మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎపుడు ఎలా వినియోగించుకుంటున్నా మన్నదానిమీదే మనుషుల విజ్ఞత ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో బాధితులను సాయం అందించేందుకు ముందుకు రావాలి తప్ప, వీడియోలు తీస్తూ కాలయాపన చేయకూడదు. క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే ఇటీవల కేరళలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి? అతి క్లిష్టమైన సమయంలో పౌర సమాజం తక్షణమే స్పందించి బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే దానిపై ఒక వీడియో నెట్టింట ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.పాలక్కాడ్లోని ఒక చిన్న పట్టణం ఒట్టపాలెం, కానీ అక్కడ జరిగిన ఉదంతాన్ని ఉదాహరిస్తూ సంక్షోభ నిర్వహణలో ఒక మాస్టర్ క్లాస్ అంటూ ఎక్స్లో ఒక వీడియో షేర్ అయింది. దీని ప్రకారం కదులుతున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. పౌరసమాజం స్పందించిన తీరు, చూపింని ధైర్యసాహసాలను 60 సెకన్ల వీడియో చూడవచ్చు.థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! True Kerala Story in 60 Seconds.Ottapalam a small town in Palakkad, but what happened there is a masterclass in crisis management.A moving bus caught fire & you can see a 60 second display of citizen bravery.10th Second: The bus doors opened. People started coming out.… pic.twitter.com/7usNBTGhyZ— FeverChills🥴 (@RebelR3volution) February 18, 202610వ సెకన్: బస్సు తలుపులు తెరుచుకున్నాయి. జనం బయటకు రావడం ప్రారంభించారు.30వ సెకన్: స్థానికంగా ఉన్న ఏ ఒక్కరూ ఈ సంఘటనను రికార్డ్ చేయడానికి రాలేదు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు అగ్నిమాపక యంత్రంతో వచ్చాడు.35వ సెకన్: అగ్నిమాపక యంత్రంతో మరో ముగ్గురు నలుగురు మంటల్ని ఆర్పుతున్నారు. 50వ సెకన్: ప్రతీ ప్రయాణికులు సురక్షితంగా, క్షేమంగా బయటికి వచ్చాడు.60వ సెకన్: మంటలు ఆరిపోయాయి. ఏం జరిగిందంటే..కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం (ఫిబ్రవరి 17) ఒట్టపాలెంలో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్ నుండి గురువాయూర్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. వెనుక ఉన్న డోర్ తెరుచుకుంది కానీ ముందు ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది. దీంతో తీవ్ర ఆందోళన రేగింది. ఒక పొక్క చుట్టు ముడుతున్న పొగ మరోపక్క ప్రాణాపాయంలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు. అటుగా వచ్చిన డెలివరీ ఏజెంట్ ఇది చూసి వెంటనే స్పందించాడు తలుపును పగలగొట్టడంతో పెను ముప్పు తప్పింది. సమీపంలోని ఆటో-రిక్షా డ్రైవర్లు ,దుకాణదారులు అగ్నిమాపక యంత్రాలతో సాయుధంగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. బస్సు సిబ్బంది, ఇతర స్థానికులు సహాయక చర్యల్లో చేరి, సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలునోట్ : అక్కడున్న ఎవ్వరూ తమ మొబైల్తో వీడియోలను తీయడం లేదంటూ ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సాధారణంగా అందరూ చేసేది స్మార్ట్ఫోన్తో వీడియో తీసే పనిలో మునిగిపోతారు. నిజానికి అది కాదు చేయాల్సింది. వెంటనే బాధితులను ఆదుకునేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు సాయం చేయాలి. ఇలా చేస్తూనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేయడం. తత్ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా కాపాడవచ్చు. ఏమంటారు? -
డ్యామేజ్ని కూడా ఫ్యాషన్గా మార్చేశారు..!
ఫ్యాషన్లో కొన్ని వింత పోకడలు పిచ్చెక్కించేలా ఉంటాయి. నీ క్రియేటివిటీ పాడు కాను అని తిట్టుకునేలా ఉంటాయ్. ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లు ఇలాంటే పనులే చేసి అభాసుపాలయ్యాయి. కొత్తగా క్రియేట్ చేసే సామర్థ్యం తప్పిందో లేక జనాలను తక్కువ అంచనా వేస్తున్నారో తెలియదు గానీ..పొరపాటున డ్యామేజ్ అయ్యే వాటినే లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్ అంటూ పరిచేయం చేయడం బాధకరం. పైగా వాటి ధర కూడా కనివినీ ఎరుగుని రేంజ్లో ప్రకటించి..ఆయా బ్రాండ్ విలువలను దిగజార్చుకుంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాంటిదే జరిగింది. 'వెట్మెంట్స్' అనే లగ్జరీ ఫ్యాసన్ బ్రాండ్ 'ఐరన్ బర్న్' గుర్తు ఉన్న సాదా తెల్లచొక్కాను మార్కెట్లోకి విడుదల చేసి..దీని ధర ఏకంగా రూ. 1లక్ష అని ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ఇదేం ఫ్యాషన్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. క్రియేటివిటీ రాకపోతే కామ్గా ఉండు..మరి ఇలానా అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు. చూడాలంటే మనం ఐరన్ చేసేటప్పుడు పొరపాటు షర్ట్ జేబు కాలిన గుర్తులా ఉంది అది. ఏదో లేటెస్ట్ ఫ్యాషన్ షర్ట్ అంటూ మార్కెట్లోకి వదలడమే కాక..అంత ఖరీదు ప్రకటించి జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు నెట్టింట. అంతేగాదు ఫ్యాషన్ కళాత్మకంగా కనుమరుగై..జోక్గా మారిపోయింది అని సెటైర్లు వేస్తు పోస్టులుపెట్టారు కూడా. VETEMENTS made a graphic shirt with an “iron burn” print that retails $1,139 pic.twitter.com/F5e9pkLQ8j— STAYGROUNDEAD TV (@staygroundeadtv) February 16, 2026 (చదవండి: ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..! పాలు, గోధుమలు..) -
ఫ్యామిలీ పోయెమ్కు 30 మిలియన్లు!
మిలియన్ల కొద్ది వ్యూస్ ఊరకే రావు... ఎంతో కొంత శక్తి ఉండాలి! అలాంటి శక్తి ఈ ఉర్దూ కవితకు ఉంది. ‘పాత కాలంలో– ఈ కాలంలో’ టాపిక్పై తన్వీ జోషి అనే మహిళ చదివిన ఉర్దూ కవిత విని నెటిజనులు ‘వాహ్వా వాహ్వ’ అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఒకేరోజులో 30 మిలియన్ల మందికి పైగా వీక్షించడం విశేషం. ప్రముఖ ఉర్దూ కవయిత్రి షబీనా ఆదీల్ రాసిన కవితను కాస్త మార్చి చెప్పింది జోషి. ‘డబ్బు మనిషిని మారుస్తుందా?’యస్... అంటుంది ఈ కవిత్వం. ‘నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఊరకనే ఉండనివ్వదు’ అనే సామెత మన తెలుగులో ఉంది కదా! అకస్మాత్తుగా ధనవంతులైన వారిలో కొందరికి నేల మీద కాలు ఆనదు. గత జీవితాన్ని మరిచిపోతారు. గర్వం తలకెక్కుతుంది... ఇలాంటి వారి గురించి ప్రస్తావించడమే కాదు, పాతతరం కుటుంబ విలువలు, కొత్తతరం కుటుంబ విలువల మధ్య తేడా గురించి చెబుతుంది ఈ ఉర్టూ కవిత. కవిత్వంలోని పంక్తుల పదును మాట ఎలా ఉన్నా, ‘మిజాజ్’లాంటి పదాల ఉచ్చారణకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కవిత్వం చదివిన వ్యక్తి ఏఐ–జనరేటెడ్ మోడల్ అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె ఏఐ మోడల్ కాదని పంజాబ్ అమ్మాయి అని తెలిసింది. -
భారతీయుడి మోసానికి రష్యా మహిళ విలవిల.. వీడియో వైరల్
ఓ భారతీయుడి నమ్మి.. ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకున్న పాపానికి తాను నరకం అనుభవిస్తున్నానని రష్యా మహిళ బోరున విలపించింది. ఇంతటి నమ్మక ద్రోహాన్ని తాను ఎక్కడా చూడలేదని.. తన జీవితంలో మరోసారి భారతీయులను నమ్మను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను స్వదేశానికి(రష్యా) వెళ్లిడానికి భారత్లో వీసా విషయంలో ఉన్న లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో, బాధితురాలి పోస్టుపై స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాకు చెందిన ఒల్గా 2015లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం భారత్కి వచ్చింది. ఈ సమయంలో భారత్కు చెందిన వ్యక్తిని(భర్త పేరు చెప్పలేదు) ప్రేమించింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. అనంతరం, ఆమె భారత్లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కొద్దిరోజుల తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో, ఒల్గా.. 2023 నవంబరులో స్పౌసల్ వీసా(భారతీయ పౌరుడు లేదా OCI కార్డ్ హోల్డర్ను వివాహం చేసుకున్న విదేశీయులకు Spousal Visa (X Visa లేదా Entry Visa) మంజూరు చేస్తారు) కోసం దరఖాస్తు చేసినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. ఈ పరిణామాలతో వారి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఒల్గా.. రష్యా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్త అదృశ్యమయ్యాడు. దీంతో, ఆందోళన చెందిన ఒల్గా.. పోలీసులను సంప్రదించి. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆరు నెలలు అయినా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతను చనిపోయినట్టు భావించి భయంతో కాలం వెల్లదీసింది. కుటుంబం లేకుండా, డబ్బు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వీసా సమస్యల వల్ల రష్యాకు వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)అయితే, ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో జపాన్ పర్యాటకుడి పోస్ట్లో తన భర్త.. ఒల్గాకు కనిపించాడు. వారణాసిలో సన్యాసిలా మారిపోయి కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో, అతడిని కలిసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త మరో స్టోరీ అల్లాడు.. ఒల్గాకు క్షమాపణలు చెప్పి, తనను ప్రేమిస్తున్నట్టు నటించి నమ్మించాడు. మరోసారి ఇలా చేయనని చెప్పడంతో.. అతడి మాటలను ఒల్గా నమ్మి మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో, ఒల్గా.. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ, భర్తకు ఆర్థికంగా సహాయం చేసింది. ఇంతలో.. తన భర్త చేసిన మరో మోసాన్ని ఆమె తెలుసుకుంది. ఆయన మరో మహిళతో 15 కి.మీ దూరంలో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించలేక.. చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రష్యా వెళ్తున్న సమయంలో తన భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కారణంగా ఆమెను విమానం నుండి దింపివేశారు. ప్రస్తుతం ఆమె వీసా సమస్యలు పరిష్కరించుకోవడానికి న్యాయ సహాయం కోరుతున్నట్టు పోస్టులో వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఆమె పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యంగా నిలబడమని ప్రోత్సహించారు. కొంతమంది ఆమె భర్త ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా భారత వీసా చట్టాలు, విదేశీయుల హక్కులు, భార్యాభర్తల మధ్య న్యాయ పరిరక్షణలపై చర్చలు జరిగాయి. -
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ) -
థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!
థాయిలాండ్లో అరుదైన దృశ్యం నమోదైంది. ఆసియా గోల్డెన్ క్యాట్గా పిలిచే పైర్ టైగర్ అలా కనిపించి ఇలా మాయమైంది. ఖావో లువాంగ్ నేషనల్ పార్క్ లోపలి ట్రైల్ కెమెరాలో ఈ అరుదైన దృశ్యాలు రికార్డయ్యాయి. త ఏడాది జూన్ 20న దక్షిణ థాయ్లాండ్లోని ఖావో లుయాంగ్ నేషనల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఒక ట్రైల్ కెమెరాలో ఈ అరుదైన వన్యప్రాణి చిక్కింది. దట్టమైన అడవి గుండా నిశ్శబ్దంగా కదులుతున్న దృశ్యాల ఫుటేజ్ పది సెకండ్లు మాత్రమే రికార్డ్ అయ్యింది.ఈ జాతిని శాస్త్రీయంగా కాటోపుమా టెమ్మింకి అని పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియా అడవులకు చెందినది. ఇది మధ్యస్థ పరిమాణంలో,ఒంటరిగా తిరగడానికి ఇష్టపడుతుంది. పగటిపూట అరుదుగా కదులుతుంది. దాని కదలికలు రహస్యంగా , నీడలా ఉంటాయి.దీని శాస్త్రీయ నామం Catopuma temminckii. "అగ్ని పులి" (Fire Tiger) థాయ్లాండ్లో దీన్ని 'సూవా ఫై' (Seua fai) అని పిలుస్తారు, అంటే "అగ్ని పులి" అని అర్థం.దీని శరీరం బంగారు రంగు కాంతిలో మెరుస్తూ ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. అలాగే దీని వెంట్రుకలను కాల్చడం వల్ల పెద్ద పులులు దూరంగా పారిపోతాయని ఒక పురాతన నమ్మకం ఉంది. ఇదీ చదవండి: లండన్ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్ విచక్షణా రహితంగా అడవులను నరకివేయడం, వ్యవసాయం పెరగడం వల్ల వీటి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. వన్యప్రాణుల అక్రమ రవాణా కోసం లేదా పశువులపై దాడి చేస్తాయనే కోపంతో వీటిని చంపేస్తున్నారు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) ఈ జాతిని 'వల్నరబుల్' జాబితాలో చేర్చింది. నిరంతరం నిఘా ఉంచడం, పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే ఈ "అగ్ని పులులను" కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు -
వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..
కొన్ని విలాసవంతమైన పెళ్లిళ్లు తమ విలాసవంతమైన జీవితాన్ని, డాబు, దర్పం చూపిస్తున్నట్లుగా ఉంటాయి వేడుకలు. కావాలనుకుంటే..అట్టహాసంగా చేసుకోవచ్చు..అత్యంత లగ్జరీయస్గా వేడుక చేసుకోవచ్చు తప్పులేదు. కానీ డబ్బులను పూల వర్షంలా కురిపిస్తూ చేసుకోవడం అంటే..! ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఆ సొమ్ము సామాజిక కార్యక్రమాలకు ఖర్చుపెడితే ప్రయోజనం, పరమార్థం ఉంటుంది. పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఆ నూతన దంపతుల మంచి ఆశీర్వాదాలు దక్కుతాయి, మేలు జరుగుతుంది కూడా. ఇలాంటి మంచిపనులు ఏదో ఒకనాటికి మనకు చేరిమేలు చేకూరుస్తాయనే కదా మన పురాణాలు నొక్కి చెబుతున్నాయి. కానీ కొందరు తమ స్వలాభానికి, సంతోషానికే ప్రాధాన్యత చూపిస్తూ వేడుకలు నిర్వహించి విమర్శలపాలవ్వుతారు. అలాంటి పనే చేసింది ఈ వరుడి కుటుంబం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. పంజాబ్లో జరిగిన వివాహ వేడుక అందర్నీ విస్తుపోయేలా చేసింది.వధువుపై డబ్బులు వర్షం కురిపిస్తూ..వరడు కుటుంబం ఆహ్వానం పలికింది. మొత్తం కుటుంబసభ్యులు ఆమెపై నోట్లకట్లను కురిపించారు. మొత్తం అక్షరాల రూ. 8.5 కోట్ల నగదును కురిపించినట్లు సమాచారం. ఆ తర్వాత వరుడు ఆమె చేతిని పట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అతిగా ఉందని, పేదలకు, నిస్సహాయులకు ఆ డబ్బుని ఉపయోగించి ఉంటే బాగుండేదంటూ విమర్శించారు. కానీ కొందరూ..ఈ తంతు చూస్తే..అతడి కుటుంబం ఆమెని బాగా చూసుకుంటుందని ఆశిస్తున్నా, అయినా ఇది వారి డబ్బు..కాబట్టి నచ్చినట్లు ఖర్చుపెట్టుకుంటారని సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by ET NOW (@etnow) (చదవండి: మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ లైఫ్..) -
లండన్ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్
వేడి వేడి సమోసాలు అంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. సప్త సముద్రాల ఆవల కూడా సమోసా తన ఉనికిని గొప్పగా చాటుకుంటోంది. హాట్ సమోసాల మాయాజాలం అలాంటిది మరి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.యూకే రాజధాని లండన్ వీధుల్లో మహిళ బిహారీ సమోసాలను అందిస్తున్న క్షణాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతోంది. ఆన్లైన్లో "గోరియా దేవి" అచ్చమైన దేశీ స్టైల్లో సమోసాలను విక్రయిస్తూ జనాన్ని ఆకర్షిస్తోంది. యాప్రాన్, టోపీ ధరించి,ధోతీ-శైలి స్కర్ట్ వేసుకున్న ఆమె"సమోసా సమోసా!" అంటూ ఉల్లాసంగా వీధిలో విక్రయిస్తుంది. దీంతో అక్కడున్నవారంత ఉత్సాహంగా నవ్వులు కురిపించారు."గోరియా దేవి ఆజ్ లండన్ కే స్ట్రీట్స్ మే బిహారీ సమోసా బేచేగీ ( లండన్ వీధుల్లో గోరియా దేవి సమోసాలు అమ్ముతుంది)." అంటుంది, మరోవైపు సహోద్యోగి వైపు తిరిగి, "జల్దీ జల్దీ బనావో (త్వరగా తయారు చేయి), నేను మార్కెట్లో వెళ్లాలి, బాబూ" అని చెబుతుంది, ఆపై తాజాగా వేయించిన సమోసాల ట్రేలతో బయలు దేరుతుంది. "సమోసే సమోసే, బిహార్ కే సమోసే, గోరియా నే పరోసే" అంటూ నవ్వులు పూయించింది.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅంతేనా.. ఆమె ఒక ఆలయం దగ్గర ఆగి, "హర్ హర్ మహాదేవ్" భక్తితో మొక్కడం కూడా చూడొచ్చు. "మేహెనాత్ కర్తే హై జీ" ( కష్టపడి పని చేస్తున్నామండీ) అని చెబుతూ సమోసాలు అమ్మడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk)నెటిజన్లు ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో నెలిజన్ల ప్రశంసలను అందుకుంది, బిహారీగా ఉండటం గర్వంగా ఉందని ఒకరు, వావ్.. చాలా రుచిగా ఉంది, మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చాలా మంచి మార్గం అని మరో యూజర్ కొనియాడారు. -
65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్న బామ్మ.. కారణం తెలిస్తే!
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అంటే..రెస్ట్ తీసుకునే వయసు అనే భావిస్తారు చాలామంది. ఆ వయసుకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి..ఏదో ఒక కాలక్షేపంతో కాలన్ని గడిపేయడం అనుకుంటుంటారు చాలామంది పెద్దలు. కానీ ఈ మహిళ అందుకు విభిన్నం. పైగా స్వార్జితంలో ఉన్న ఆనందం, సంతృప్తి వేరు అని చెబుతోంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒరిగేది ఏముండదని కొట్టిపారేస్తోంది. గ్రామీణ భారతదేశంలో వృద్ధ మహిళల ఆలోచనలకు, భావాలకు విరుద్ధంగా బతికి చూపించటమే కాదు..'సాధికారత'కు అసలైన అర్థం చెప్పింది ఈ బామ్మ. ఎవరామె అంటే..ఆ బామ్మే..మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల మంగళ ఆజీ. రెస్ట్ తీసుకునే వయసులో చీరకట్టులో డ్రైవింగ్ చేస్తోంది. చక్కగా ఆటో వేసుకుని రైడ్లకు వెళ్తోంది ఈ బామ్మ. ప్రయాణికులను గమ్యస్థానాల్లో దింపుతూ..ఆదాయం గడిస్తోంది. అది కూడా చక్కగా గ్రామీణ నేపథ్యానికి చెందిన మహిళ కట్టుతీరుతో ఏ మాత్రం భయపడకుండా మహారాష్ట్రలోని రద్దీగా ఉండే రోడ్లపై రెయ్..రెయ్..మని ఆటో నడిపిస్తుండటం విశేషం. నిజానికి ఆమె నిశబ్ద ధైర్యానికి చిహ్నంగా మారింది. ఈ వయసులో అంత అవసరం ఏంటీ అంటే..ఆమె చిన్నతనంలోనే వితంతువుగా మారి నలుగురి పిల్లలను ఒంటిరిగా పెంచి పెద్ద చేసింది. వారికి మంచి చదువులు చెప్పించి, తమ కాళ్లపై నిలబడే వరకు కూలి పనులు చేస్తుండేది. ప్రస్తుతం కొడుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) డ్రైవర్గా పనిచేస్తుండగా, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసింది. ఏళ్ల తరబడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడింది. కానీ ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే..ఈ బామ్మ మంగళ ఏమంటుందో తెలిస్తే..విస్తుపోతారు. బామ్మకు షుగర్ కూడా ఉంది. అయినా సరే తన పిల్లలపై ఆర్థిక భారం పడటం ఇష్టం లేదని, తన సొంత వైద్య ఖర్చుల కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఆటో డ్రైవర్గా ఎంతో కొంత ఆర్జించి.. తన ఖర్చులకు అలాగే తన కొడుకు కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందని చెబుతుంది.అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొంటే ఏం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోంది . ఎలా ఆటో నడపడం నేర్చుకుందంటే..కొడుకు మార్గదర్శకంలో కేవలం 15 రోజుల్లో ఆటోనడపడం నేర్చేసుకుందట ఆమె. తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారామె. మహారాష్ట్రలోని కరాడ్-ఉండేల్ మార్గం గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతానని చెబుతోంది ఈ బామ్మ. తనకు డ్రైవింగ్ అస్సలు భయం కలిగించదని, పైగా ఇతర డ్రైవర్లు తనను చాలా అర్థం చేసుకుంటారని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు వాళ్లు ముందు ఆజీని వెళ్లనివ్వండి అని పక్కకు తొలిగి మరి దారిచ్చేస్తారని సంతోషంగా చెబుతోంది. అలాగే తన ఆటోడ్రైవర్ జర్నీలో సవాళ్లు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వయసులో డ్రైవింగ్ చేయడం చూసి..రవాణ అధికారులు పూర్తిగా లైసెన్సింగ్ నిబంధనలను పాటిస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిపింది. తాను ఆ అధికారిక ప్రక్రియని పూర్తిచేసి మరి లైసెన్స్ పొందానంటోంది బామ్మ. సాధికారతే గౌరవం, ఆత్మగౌరవం అని మంగళ బామ్మ కథ చెబుతోంది. తరతరాల అంతరాన్ని చేధించి..వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో సైతం సామాజిక ప్రజా జీవితంలో చురుకుగా ఉండొచ్చని చెప్పింది. అనారోగ్యం అంటూ మూలన కూర్చోవడం కంటే..ఇలా ప్రజల్లో తిరిగితేనే ఇంకా ఉషారుగా ఆయురారోగ్యాలతో ఉండొచ్చని మంగళ బామ్మ కథ చెప్పకనే చెబుతోంది కదూ..! అంతేగాదు ఈ బామ్మ ధైర్యం..తన రైడ్ని బుక్చేసుకున్న ప్రయాణికులను ప్రేరేపించడమే గాక వారిలో స్థైర్యాన్ని నింపుతోంది కూడా. View this post on Instagram A post shared by Sonali H N (@shesays2324) (చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!
విదేశాల్లో చదవాలని..ఒక వ్యక్తి బంగారంలాంటి క్యాంపస్ ప్లేస్మెంట్ని కాలదన్నాడు. చివరికి అప్పులపాలై..ఎంత తక్కవ వేతనానికి పనిచేసేందుకైనా సై అంటున్నాడు.అలా కాకుండా జాబ్ చేస్తూనే లేకా కాస్త ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నాక..ఆ దిశగా అడుగులు వేసిన బాగుండేది. కానీ అత్యాసతో తీసుకున్న ఈ నిర్ణయం..అతడిని ఎంతటి దయనీయ స్థితిలోకి నెట్టేసిందో చూస్తే..విదేశీ మోజులో ఉండే యువతకు అడకి కథ ఓ గొప్ప కనువిప్పు అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్లో చేసిన పోస్ట్ పెను దుమారం రేపి వివిధ చర్చలకు దారితీసింది. ఆ పోస్ట్లో ఇలా ఉంది. "నా స్నేహితుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏడాదికి ఏడు లక్షలు వేతనమిచ్చే జాబ్ ఆఫర్ని కాలదన్నాడు. విదేశాల్లో ఎంఎస్ చేస్తే..అంతకుమించి సంపాదించాలనే అత్యాశతో వద్దనుకున్నాడు. చివరకి తను అనుకున్నట్లుగానే యూఎస్లో విజయవంతంగా ఎంఎస్ పూర్తిచేశాడు. కానీ రూ. 40 లక్షల అప్పుతో రోడ్డుపై నిలబడ్డాడు. దాంతో ఇప్పుడు కనీసం ఏడాదికి రూ. 3లక్షల వేతనమిచ్చే జాబ్లో అయినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూశారా..! దురాశ ఎంతటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుందో తెలుసుకోండి..ఇది బంగారంలాంటి ఆఫర్లను, నిర్ణయాలను నాశనం చేసేస్తుంది తస్మాత్ జాగ్రత్త." అంటూ తన పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..చాలామంది నెటిజన్లు తమ స్నేహితులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఇబ్బందులు పడ్డారని, అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.One of my friends rejected a 7LPA campus job thinking it was not enough for him. He decided to go to the US for MS instead. Now he has a Masters, 40 LPA in debt and is ready to settle for even a 3 LPA job. Greed is the death of all good things my friends.— enji vi (@original_ngv) February 16, 2026 (చదవండి: బేబీ కేర్పై పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..) -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెన్సేషన్గా అందాల ‘ఐరా’
క్రికెట్ మ్యాచ్లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat). ఆ క్షణం ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది. ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలు ఆమె హావభావాలు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. టీమిండియా పట్ల అమె అభిమానానికి,ఆమె క్రికెట్ వైబ్స్కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆసక్తికరంగా, తోటి క్రికెట్ ప్రేమికులతో కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటున్న రావత్ ఫోటోలు కూడా వైరల్గా మారాయి.ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్ ఎవరీ ఐరాఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అన్న ఊహాగానాలకు భారీగా వ్యాపించాయి. ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమట. ఇన్స్టాగ్రామ్ పేజీలో, క్రికెట్ స్టేడియంలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను చూడవచ్చు. ప్రత్యక్ష మ్యాచ్లను చూడటానికి రావత్ తరచుగా స్టేడియాలలో వాలిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లకు ఆమె వీరాభిమాని. నిజానికి, ఒకసారి విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది రావత్. విరాట్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నప్పుడు రావత్ వయసు దాదాపు 18 సంవత్సరాలు. అంతేనా ఐరా రావత్ మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. అందుకే తన బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పేర్కొంది. ఫ్యాషన్ , స్టైలింగ్ పట్ల ఆసక్తి ఎక్కువటఇరా రావత్ గురించి నిజం ఏమిటంటే..ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ విడుదల కాలేదు. అయితే, కొన్ని AI డిటెక్షన్ టూల్స్ , డిజిటల్ విశ్లేషకులు ఆమె వైరల్ చిత్రాలను "అనుమానాస్పదంగా" ఫ్లాగ్ చేయడంతో ఇవి ఏఐమాయాజాలమే అనే ఊహాగానాలకు మరింత పెరిగాయి. AI-జనరేటెడ్ కంటెంట్ వాస్తవికంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో, అసలైన, వర్చువల్ ఐడెంటిటీల మధ్య రేఖను గుర్తించడం చాలా కష్టతరంగామారింది. అందుకే గుడ్డిగా నమ్మకుండా వినియోగదారులు ఇలాంటి ప్రొఫైల్స్ను ఫాలో అయ్యేముందు ప్రామాణికతను ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.(కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్) View this post on Instagram A post shared by Aira Rawat (@aira_rawat_) -
టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!
పది కూడా పాసవ్వని వ్యక్తి పాఠాలు బోధించడం ఏంటని అనిపిస్తుంది కదూ. కానీ ఈ వ్యక్తి చెబుతున్న తీరు చూస్తే..ఆశ్చర్యంకలగక మానదు. ఆర్థిక పరిస్థితులు తనను ఆపేయొచ్చేమో కానీ..తనలోని ఆసక్తి, ప్రతిభని ఆపలేవని, అవి ఏదో రకంగా బయటకు ఉప్పొంగుతాయని చూపించాడు. చుట్టూ ఉన్నవాళ్లు పది పాస్సవ్వలేదని ఎగతాళి చేసినా..తగ్గలేదు, ఆగిపోలేదు. ఇవాళ ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు పాఠాలు చెబుతుండటం విశేషం.అతడే బీహార్కు చెందిన కూరగాయల విక్రేత రోహిత్ కుమార్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. అయితే అతడు కళాకారుడుగా ఉండాలనేది ఆకాంక్ష..అయితే ఆర్థిక ఇబ్బందులు ఆ కలను దూరం చేశాయి. అతడి తల్లి ఆవు పిడకలు అమ్ముతూ..ఇంటిని నడిపించేది. ఇక రోహిత్ ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు. అలా చేస్తున్నప్పుడూ సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించి నలుగురు విద్యార్థులతో ఓ చిన్న తరగతి గదిని ప్రారంభించాడు. ఆ గది ఇప్పుడు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు నడుస్తోంది. ప్రస్తుతం అతడి వద్ద వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ. 125లు వసూలు చేస్తున్నాడు. అతడు పది కూడా పాసవ్వకుండా ఇలా ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నందకు అంతా ఎగతాళి చూస్తున్నా..కుమార్ మాత్రం దృఢ నిశ్చయంతో..సాధారణ సైన్స్ పాఠాలతో ఆ చిన్నారులను ఆకట్టుకున్నాడు, వారి మనసులను గెలుచుకున్నాడు. అయితే దీన్నంతటిని రికార్డు చేసి అతడి విద్యార్థులు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన జోహో మాజీ సీఈవో శ్రీధర్ వెంబు ఇలా రాశారు పోస్ట్లో. దీన్ని చూస్తుంటే..భారత్ పట్ల గర్వం ఆశావాదం కనిపిస్తోంది. బీహార్లోని సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన ఈ పిల్లలందరూ, గణితం, సైన్స్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశ భవిష్యత్తును నిర్వచిస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా అతని ప్రయత్నానికి మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాం అని రాశారు. నెటిజన్లు కూడా రోహిత్ కుమార్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ప్రతిభ ప్రతిచోటా ఉంటుందని, కానీ అవకాశం దాన్ని చేరుకోవడమే అత్యంత కీలకం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు మార్కులు ఎప్పటికీ మన విజయాన్ని నిర్ణయించలేవు అని పోస్టలు పెట్టారు. He once struggled to pass Class 10. Today, 1,000 students climb to his rooftop classroom at 5 a.m. 💛 From charging ₹125 and teaching four children to building a movement that challenges rote learning, Rohit Kumar turned doubt into determination. His mother once sold cow dung… pic.twitter.com/HCHPbzzjOn— Comman Man (@CommanMan777589) February 14, 2026 (చదవండి: కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..) -
కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..
కెపాప్ అనగానే దక్షిణకొరియాలోని సియోల్కి చెందిన మ్యూజిక్ బ్యాండ్. కానీ ఆ దేశం నుంచి వచ్చి మన మహాశివుడికి సంబంధించిన పాటను అద్భుతంగా ఆలాపించి ఆశ్చర్యపరిచాడు. ఓ విదేశీయుడు మన దేశ సంస్కృతిలో భాగం కావడం ఇది కొత్తకాదు గానీ..అందులోనూ పాప్ గాయకులాంటి విదేశీయులు నోట మన దేవుళ్ల పాటలు పలకడం విశేషమే. ఎవరతను..? మన భాషలు ఎలా నేర్చుకున్నాడంటే..అతడే ఔరా అనే పాప్ గాయకుడు. మన భారతదేశాన్ని ఎంతో ఇష్టపడే వ్యక్తి, హిందీ కూడా నేర్చుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం భారత్కి వచ్చి బిగ్బాస్ 17లో కనిపించి సందడి చేశాడు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ..ఎక్కడికి వెళ్లిన అభిమానులను సంపాదించుకుంటూ..అందరి మనసులను గెలుచుకుంటున్నాడు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా చెన్నైలోని శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశాడు. View this post on Instagram A post shared by AOORA (아우라) (@aoora69) ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే..అచ్చం భారతీయ వేషధారణలో ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేశాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..చెన్నైలో ఎప్పటికీ మర్చిపోలేని వరం పొందాను అంటూ భావోద్వేగం చెందాడు. అక్కడ ఎందరో వ్యక్తులు 'శివాయ నమః' అని జపిస్తూ ఉండటం చూశానని, తాను ఈ దేశంలో పుట్టకపోయినా.. ఈ సంస్కృతిని ప్రేమించాలని న ఈ క్షణం తనకు ఎంతో భావోద్వేగంగా అనిపించింది అని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు మహాశివరాత్రి రోజున సాక్షాత్తు ఆ శివుడే తనకు "ఓం నమః శివాయ" అని మార్గదర్శకత్వం చేస్తున్నాడేమో అని పేర్కొన్నాడు పోస్ట్లో. కాగా ఇటీవలే ఫిబ్రవరి 10, 2026న శివ శివం అను పాటను కూడా విడుదల చేశాడు. గాయకుడు ఔరాకి ఈ భారత పర్యటన మూడోసారి. తొలిసారి ఢిల్లీ వచ్చానని, అక్కడ నుంచి ముంబై వంటి ఇతర ప్రదేశాలకు వెళ్లి..ఎంతో అనుభవాన్ని గడించడమే గాక ఎందరో ప్రేమను పొందానని కూడా పేర్కొన్నాడు పోస్ట్లో. View this post on Instagram A post shared by AOORA (아우라) (@aoora69) అందుకు సదా ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞుడనని అన్నాడు. అంతేగాదు తన శివ శివం పాటతో ఇక్కడ కళాకారులతో పనిచేసే అవకాశం పొందానని, ఇలా తన జర్నీలో భాగమైన వారికి ఈ పాట అంకితం అని పేర్కొన్నాడు కూడా. నిజానికి ఇది చాలా గ్రేట్ కదా ఓ విదేశీయుడు మన భాష, సంస్కృతిలో ఇంతలా మమేకమైపోయిన విధం చూస్తే..చాలాఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!.(చదవండి: -
ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
అందమైన ప్రకృతిలో అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతికి, మానవ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తాయి తప్ప కీడు చేయవు. కానీ ప్రపంచంలోని ఏకైక విషపూరిత పక్షి ఒకటి ఉంది తెలుసా. పైకి రంగు రంగుల్లో అందిస్తూ కనిపిస్తూ మానవులకు కీడు చేస్తుంది. అదేంటో? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలేంటో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పక్షి. హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui) న్యూ గినియా (New Guinea) లోని అడవుల్లో కనిపిస్తాయి. ఇవి చూడటానికి నారింజ మరియు నలుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటాయి. కానీ దీని ఈకలను తాకినా, లేదా దాని మాంసాన్ని ఆహారంగా తీసుకున్నాతీవ్రమైన నాడీ సంబంధిత ప్రభావాలు ఏర్పడవచ్చు. సాధారణంగా వీటిని వండుకుని తినడానికి వీలుండదు (వండితే ఘాటైన వాసన , విషం వల్ల అనారోగ్యం కలుగుతుంది)ముఖ్యంగా జలదరింపు, తిమ్మిరి లేదా తేలికపాటి పక్షవాతం వంటివి సంభవించవచ్చు. విషపూరితమైన పక్షి ఎలా అయ్యింది?సాధారణంగా పాములు లేదా కప్పలు విషపూరితంగా ఉండటం చూస్తుంటాం, కానీ ఈ పక్షి ఈకలు, చర్మం , మాంసంలో కూడా విషం ఉంటుంది. పిటోహుయిస్ తమ సొంత విషాన్ని తయారు చేసుకోవు. హుడెడ్ పిటోహుయిస్ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఇదొకటి. వాటి ఆహారం నుండి సీక్వెస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా పాయిజన్ఉత్పత్తి అవుతుంది. అంటే అవితీసుకున్న ఆహారంనుంచి విషాన్ని వారి శరీరంలో నిల్వ ఉంటుంది.ఇవి తినే ఒక రకమైన 'మెలైరిడ్' (Melyrid) బీటిల్స్ (పురుగులు) వల్ల వీటి శరీరంలోకి విషం చేరుతుందని జాక్ డంబాచర్తో సహా శాస్త్రవేత్తలు గుర్తించారు. హుడెడ్ పిటోహుయి కలిగి ఉన్న ఈ పురుగుల్లో విషాన్ని బాట్రాకోటాక్సిన్ (Batrachotoxin) అంటారు. ఇదే విషం కొలంబియాలోని 'పాయిజన్ డార్ట్' కప్పలలో కూడా కనిపిస్తుంది.అందుకే స్థానిక ప్రజలు వీటిని "చెత్త పక్షులు" అని పిలుస్తారు. ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యంమనుషులపై ప్రభావంఒకవేళ ఎవరైనా ఈ పక్షిని పట్టుకుంటే, ఆ విషం వల్ల చేతులు మొద్దుబారిపోవడం, మంట పుట్టడం లేదా తీవ్రమైన తుమ్ములు రావడం వంటివి జరుగుతాయి. ఈ విషపదార్థాలు పక్షి తనను తాను వేటాడే జంతువులు ,పరాన్నజీవుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి.పాములు లేదా ఇతర జంతువులు ఈ పక్షిని వేటాడకుండా ఈ విషం కాపాడుతుంది. అంతేకాదు వీటి ఈ ఈకల్లోని విషం వల్ల పేలు, బ్యాక్టీరియా వంటివి పక్షికి సోకవు.ఇది విషపూరితమని ఎపుడు గుర్తించారుశాస్త్రవేత్త జాక్ డంబాచర్ 1980ల చివరలో న్యూ గినియాలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా ఈ విషపూరిత పక్షిని కనుగొన్నాడు. అతన ఈ పక్షులను తాకినప్పుడు, తన నోటిని లేదా కళ్ళను తాకిన తర్వాత, జలదరింపు, తిమ్మిరి, మండుతున్న అనుభూతిని అనుభవించాడని డిస్కవర్ వైల్డ్లైఫ్ తెలిపింది. తరువాత, పక్షి ఈకలు , చర్మం విషపూరితమైనవని కూడా గ్రహించాడు. 1992లో డంబాచర్, అతని బృందం హుడెడ్ పిటోహుయ్ చర్మం, ఈకలలో బాట్రాచోటాక్సిన్ అనే శక్తివంతమైన విషం, విషపూరిత సమ్మేళనాలు ఉన్నాయని చూపించే ఒక అధ్యయనాన్ని కూడా ప్రచురించింది. ఇదీ చదవండి: బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్ -
"హల్దిరామ్ వివాహం": వేదికగా ప్యాలెస్ సెట్, భారీ కేక్..
అత్యంత విలావంతసమైన వివాహా వేడుక. చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నంత రేంజ్లో హంగుఆర్భాటంగా జరుగుతోంది. ఓ పక్క బాణసంచాతో దద్దర్లిపోతున్న ఆకాశం, మరోవైపు ప్యాలెస్ రేంజ్ వేదిక సెట్, బారీ కేక్లు, మంచు విగ్రహాలు..ఎన్నో అబ్బురపరిచే...దృశ్యాలతో మిరుమిట్లు గొలిపేలా పెళ్లి వేడుక జరుగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..అది బిలియనీర్ శివకిషన్ అగర్వాల్ వివాహ వేడుక. నాగపూర్లో అట్టహాసంగా జరిగింది. అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకలో ఒకటిగా నిలిచింది కూడా. ప్యాలెస్లాంటి వివాహ సెట్, ఎత్తైన పూల అలంకరణలు, మెరిసే మంచు శిల్పాలు, ప్రతిది కనుతిప్పుకోనివ్వతంగా అందంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. ఈ వేడుకలో సంగీత్లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. View this post on Instagram A post shared by The Cake Affair Ⓡ | Custom Cake Boutique (@thecakeaffair.nagpur) అంతేగాదు బారీ కేక్, అడుగడుగున రాజదర్పం ఉట్టిపడేలే అత్యంత గ్రాండ్గా జరిగింది ఆ వివాహ తంతు. ఈ వివాహానికి బిజెపి నాయకుడు హన్స్రాజ్ అహిర్ హాజరై నూతన వధువరులకు పూలబొకేని బహుకరించారు. అంతేగాదు ఆయన వారి వైవాహిక జీవితం అత్యంత సంతోషభరితంగా సాగిపోవాలంటూ ఆ జంటను దీవించారు కూడా View this post on Instagram A post shared by Harsh Ekonkar | FOOD & TRAVELLER 🇮🇳 (@harsh_storiess) ఎవరీ శివకిషన్..?హల్దిరామ్ వ్యవస్థాపక కుటుంబంలోని మూడవ తరం శివకిషన్ అగర్వాల్. ఆయన నాగ్పూర్ ఆధారిత వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తారు. హల్దిరామ్ బ్రాండ్ రాజస్థాన్లోని బికనీర్లోని ఒక చిన్న దుకాణంలో మూలాలు ఉన్నాయి. దీనిని శివకిషన్ అగర్వాల్ తాత గంగా బిషన్ అగర్వాల్ ప్రారంభించారు. కాగా ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ స్నాక్స్, మిఠాయి బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఏప్రిల్ 2023లో ఢిల్లీ, నాగ్పూర్కు చెందిన కుటుంబంలోని రెండు విభాగాలు కలిసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ లిమిటెడ్ను సృష్టించాయి. ఈ వ్యాపారంలో ఆయన వాటా ఏకంగా రూ. 27 వేల కోట్లు. (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
వామ్మో.. వీడు నిజంగానే భలే స్మార్ట్ దొంగ..!
ఇప్పుడు దొంగతనాల ట్రెండ్ కూడా మారిపోయినట్లు ఉంది. ముసుగులు వేసుకుని రాత్రి పూట కన్నాలకు వెళుతూ ఉంటారు కదా.. వారినే సాధారణంగా దొంగలు అనుకుంటాం. ఇప్పుడు దొంగలు కూడా ముదరిపోయినట్లే ఉన్నారు.. వాడు దొంగ అని ముఖం మీద ఏమీ రాసుండదు కాబట్టి వారు కూడా మనలోనే కలిసిపోతున్నారు. మనతో పాటు ఉన్నట్లే ఉండి వారికి కావాల్సింది దోచుకుపోతున్నారు. ఇటీవల జరిగిన పెళ్లి రిసెప్షన్లో జరిగిన చోరీ చూస్తే వీడు నిజంగానే భలే దొంగ అనక తప్పదు. దొంగల్లో భలే దొంగలు ఉండరు.. కానీ చోరీ చేసిన విధానం.. వాడు భలే దొంగ అని కచ్చితంగా అనుకుంటాం. వారం రోజుల క్రితం రాజస్థాన్లోని జగత్పురాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జరిగిన చోరీ చూస్తే ఔరా అనిపిస్తోంది. పెళ్లి విందు సందర్భంగా వధువు స్టేజ్పై ఉంచిన బ్యాగ్ను దొంగ దొంగిలించాడు. ఆ బ్యాగ్లో సుమారు రూ. 4 లక్షల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా దొంగ ఆ బ్యాగ్ను తీసుకెళ్లాడు. పెళ్లి కొడుకు, వధువు స్టేజ్పైకి వచ్చిన వారితో మాట్లాడుతున్న సమయంలో వధువు పక్కనే ఉన్న బ్యాగ్ను ముందే పసిగట్టిన ఆ దొంగ.. దాన్ని వెనకాల నుంచి అతిథిలా వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. VIDEO: शादी में मेहमान बनकर आया शातिर, ब्लेजर में छिपाकर ले गया नगदी और ज्वेलरी से भरा बैग pic.twitter.com/TZ6TbjFYhp— Purnea Mirror News (@mirrorpurnea) February 13, 2026 -
నెలకు రెండున్నర లక్ష : సొంత బిజినెస్, ఐటీ మేనేజర్ కంటే మేలే!
ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూచుంటే జీవితం ముందుకు సాగదు. అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకొని అడుగు ముందుకు వేయాలి. మన ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి వస్తే..ఇంకేముంది విజయం మనముందు సాగిల పడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.. ఒక మధ్య తరగతి జంట ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పు గొప్ప విజయానికి నాంది పలికింది. ఎవరా జంట? ఏమా బిజినెస్ తెలుసుకుందాం.నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా తాను క్రమం తప్పకుండా సందర్శించే డ్రై-క్లీనింగ్ దుకాణం యజమానితో జరిగిన సంభాషణను వివరించారు. డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని భార్యాభర్తలిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మరో ఇద్దరు అదనపు ఉద్యోగులున్నారు. ఇండియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్తో సమానమైన నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నారని ఉనగర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి వారికి ఖర్చులన్నీ పోను నెలవారీ లాభం రూ.2.37 లక్షల లాభం వస్తుంది. సగటున, వారు ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తారట.Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026నెటిజన్ల స్పందనహైదరాబాద్లోని ఇడ్లీ-దోస విక్రయించే అనేకమంది విజయగాథలను చూశాను. తన ఏరియాలో అలాంటి ఒక వ్యక్తి ఇంటి ఖరీదు కోటికిపైమాటేననీ, తాను గల్ఫ్లో దశాబ్దాలు కష్టపడినా అద్దె ఇల్లే. స్వంత వ్యాపారం చేయడం చాలా గ్రేట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. వైట్-కాలర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అనే చట్రంలో ఇరుక్కుపోయాం. కానీ ఇలాంటి కథలు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని కలిగి ఉండటం నిజమైన సంతృప్తితోపాటు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రతిఫలదాయకం కూడా అని ఒకరు, ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముంది అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉంటే చిన్న వ్యాపారమైనా, లాభాలు మెండు అని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ లెక్కలపై పెదవి విరిచిన వారు లేకపోలేదు. ‘‘నేను నా ఇంటి దగ్గర దుకాణం నడుపుతున్న నా డ్రై-క్లీనింగ్ భయ్యాతో కూడా మాట్లాడాను. అతను ఆ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పుదారి పట్టించేది అని చెప్పాడు. రూ. 2.37 లక్షల లాభం గురించి కలలు కనకండి. వాస్తవానికి, అన్ని ఖర్చుల పోనూ వాస్తవ లాభం నెలకు దాదాపు రూ. 60వేలు ఉంటుందని ఒక యూజర్ లెక్కలు చెప్పారు.ఇదీ చదవండి: ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!వైట్ కాలర్ జాబ్స్ అని, మంచి ఆదాయం అని మన గొప్ప వాళ్లం అని మురిసిపోవాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం, వ్యాపార మెళకువలు ఉంటే ఏ పనైనా గౌరవప్రదమే, లాభదాయకమే. భారీ ఆదాయం మాట ఎలా ఉన్నా.. ఉద్యోగ భయం. ఆందోళన, అధికార్ల వేధింపులు. శని, ఆదివారాలు కూడా లాప్టాప్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు..! -
అద్భుతమైన హోమ్ టూర్..! రిటైర్డ్ ఐపీఎస్ అధికారి..
ఇటీవల కాలంలో సోషల్మీడియా పుణ్యమా అని సీనియర్ సిటిజన్లు కూడా కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్లుగా తమ టాలెంట్ని చూపిస్తున్నారు. ఒకరకంగా వారికి ఇదొక వ్యాపకం, కాలక్షేపం కూడా. అలానే ఇక్కడొ వృద్ధుడు కూడా తన హోమ్టూర్ వీడియోతో నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు. తొలిసారిగా చేసిన హోమ్టూర్తో ఆ తాతగారు..జీవితం విలువని తెలియజేశారు. ఆ తాతగారే కర్తార్ సింగ్. వయసు కేవలం సంఖ్యే అని తన హోమ్ టూర్ వీడియోతో చెప్పకనే చెప్పాడు. ఆ వీడియోలో హర్యానాకు చెందిన 89 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తన బెంగూరురు నివాసాన్ని అద్భుతంగా చూపించాడు. తన వన్ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం అద్భుతంగా చూపించారాయన. ఆ తాత గారు నారింజ కుర్తా, సాంప్రదాయ హిమచల్ టోపీని ధరించి..తన ఇంటికి ఆహ్వానించిన తీరు అదుర్స్. ఇలా హోమ్ టూర్ వ్లాగ్ చేయడం ఇదే తొలిసారి అని చెబుతూ..తన ఇంటి గురించి పూసగుచ్చినట్లుగా వివరించారు. ఆ వీడియోలో తన పేరు కర్తార్ సింగ్ తోమర్. హర్యానా కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని. తాను దాదాపు 89 ఏళ్ల వయసులో ఉన్నానని..ఇదే తన 1 BHK ఫ్లాట్, ఇక్కడే రోజంతా గడుపుతానని చెబుతాడు. తన ఇల్లు తనకు స్వర్గం లాంటిదని చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. అక్కడ ఉండే సోఫా-కమ్-బెడ్, డైనింగ్-కమ్-స్టడీ సెటప్ , క్లీన్గా ఉన్నా వంటగది, బాత్రూంలో స్కిడ్-నిరోధక ఫ్లోరింగ్, తదితరాలన్నీ చూపిస్తాడు. అలాగే ఫ్యాన్తో పనిలేకుండా చక్కగా గాలి వచ్చే పెద్ద అద్దాల విండోని, బాల్కనీలో చక్కగా ఆస్వాదించే పచ్చదనం తదితరాలన్నీ చక్కగా వివరిస్తూ..చూపించారు వీడియోలో. సింపుల్గా చెప్పాలంటే.. ఓ సీనియర్ సిటీజన్కి అనుకూలమైన ఇల్లు ఎలా ఉండాలో చెబుతున్నట్లుగా ఉంటుంది. అంతేగాదు పదవీవిరమణ తర్వాత హాయిగా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తున్నట్లుగా ఉంది. View this post on Instagram A post shared by Manasum Senior Living (@manasum.living) (చదవండి: విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని క్యూట్ లవ్ స్టోరీ..) -
ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!
సినిమాలకు ప్రేరణ నిజ జీవిత గాథలు. కొన్ని విజయ గాథలకు ప్రేరణ సినిమాలు. అలా అచ్చం సినిమాలా సాగిన ఒక నిరుపేద జీవితం, ఆయన సక్సెస్ జర్నీ ఆ తరువాత సినిమాకు ప్రేరణగా నిలిచింది. పట్టుదల , కఠిన శ్రమతో, అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చనే స్పూర్తిని రగిలించింది. మరి ఆ విజయగాథ ఏంటో తెలుసుకుందాం పదండి.బిహార్లోని పాట్నాలోని విశున్పూర్ పక్రి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆదిత్య పాండే. ముగ్గురు సోదరీమణులలో అతను చిన్నవాడు. దృఢ సంకల్పంతో UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఈ విజయం వెనుక ఒక తిరస్కారం.. ఆ తిరస్కారంనుంచే విజయాన్ని వెదుకున్న తీరు గురించి తెలుసుకుంటే హృదయం ఉప్పొంగక మానదు.ఆదిత్య 8 , 9 తరగతులలో బాగానే చదివాడు. 10వ తరగతిలో ప్రేమ మొదలైంది. ఆ మైకంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. ఫలితాల్లో వెనుకబడ్డాడు. ఫలితంగా తండ్రి అతన్ని పాట్నాకు తిరిగి పంపాడు. అటు ప్రియురాలు కూడా అవమాన పర్చింది. అది అతణ్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఎదురుదెబ్బతో తన జీవితాన్నిదిద్దుకోవడానికి వాడుకన్నాడు. ఆదిత్య తన శక్తిని కొత్త లక్ష్యం వైపు మళ్లించాలని అపుడు ప్రతిన బూనాడు. తాను కచ్చితంగా తాను ఐఏఎస్ చదవాలని.ఇంజనీరింగ్ నుండి IAS వరకు12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయ కంకర్బాగ్లో విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత, ఆదిత్య బాగా రాణించాడు. పంజాబ్లోని LPU నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిగ్రీ పొందినప్పటికీ, తన నిజమైన అభిరుచి ఇంజనీరింగ్లో లేదని ఆదిత్య గ్రహించాడు. విడిపోవడం వల్ల కలిగే బాధ అతన్ని వెంటాడు తున్నప్పటికీ, తన కోరికతో 2018లో IIT రూర్కీ నుండి MBA పట్టా పొందాడు. ICICI బ్యాంక్లో ఉద్యోగంలో చేరాడు.2020లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. UPSC పరీక్షలో మూడుసార్లు విఫల మైనప్పటికీ, నిరాశపడలేదు. తత్వశాస్త్రం తన ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉండటంతో, అతను UPSC ఫలితం 2021లో కేవలం 2.5 మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఢిల్లీలో ఐచ్ఛిక సబ్జెక్టుల తయారీ కోసం మాత్రమే కోచింగ్పై ఆధారపడుతూ, ఇతర సన్నాహాల కోసం పూర్తిగా స్వీయ అధ్యయనంపై దృష్టి పెట్టాడు. అలా పూర్తి అంకితభావం, కృషి, దృఢ సంకల్పంతో తన మూడవ ప్రయత్నంలో UPSC పరీక్షలో 48వ ర్యాంకును సాధించగలిగాడు. అలా 2022లో కృషి, దృఢ సంకల్పం ఫలించింది.ఆదిత్య జీవితం స్ఫూర్తిదాయకమైన కథ. కష్టాలు,నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చినా కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పమే ధైర్యం. అదే గొప్ప విజయాలకు పునాదిని నిరూపించివాడు. అలాగే తన చదువుపై తండ్రికున్న ఎన్నో సందేహాలను పటా పంచలు చేసినవాడు. అంతేకాదు ఆదిత్య సీరియస్గా చదువితే.. మీసం గీసుకుంటానని సవాల్ చేసిన ఉపాద్యాయుడికి తన ఐఏఎస్ను సగర్వంగా చూపించాడు.షాదీ మే జరూర్ ఆనా2017లో విడుదలైన షాదీ మే జరూర్ ఆనా మూవీకి ఆదిత్య కథే స్ఫూర్తి. నటుడు రాజ్కుమార్ రావు సత్యేంద్ర మిశ్రా (సత్తు) పాత్రను పోషించారు, ఆర్తి శుక్లా (కృతి ఖర్బంద)తో విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత IAS అధికారి అవుతాడు. -
శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..
కొన్ని విషయాలు చూడటానికి సాధారణ చిన్న చిన్న తప్పులుగా కనిపిస్తున్నా ..అవే ఒకరకంగా ఘోర ప్రమాదాలకు మూలం కూడా. పోనీలే అని వదిలేయడం కూడా ఒక కారణం. ఎవ్వరు అనడం లేదు కదా మనం ఒక్కరమే వ్యతిరేకించడం దేనికని వదిలేస్తుంటాం. కానీ కొందరు విభిన్నంగా ఉంటారు. డిఫెరెంట్గా ఆలోచించడమే కాదు..ఒక్కరిగా.. హీరోలా వీరోచితంగా పోరాడి శెభాష్ అని ప్రశంసలందుకుంటారు. ఔను కదా..! మనమెందుకు అలా చేయలేకపోయాం అని ఆలోచింపచేసేలా స్ఫూర్తిని కలిగిస్తారు కూడా. ఇంతకీ ఏం జరిగిందంటే..కేరళకు చెందిన ఓ వృద్ధ మహిళ రద్దీగా ఉండే రోడ్డుకి ఒకపక్కను ఉన్న ఫుట్పాత్పై నడుస్తుంటుంది. ఇంతలో ఒక ద్విచక్ర వాహనదారుడు స్కూటీపై దర్జాగా ఫుట్పాత్పై వచ్చేస్తుంటాడు. అది గమనించిన మహిళ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డగిస్తుంది. పాదాచారులు నడవకుండా మీది నుంచి వెళ్లిపోతావా అని అరుస్తూ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డుకునే యత్నం చేస్తుంది. ఇక్కడ ఆ స్కూటర్ రైడర్ కూడా ఏదో విధంగా ఆమెను తప్పించి వెల్లిపోయే సాహసం చేస్తుంటాడు ఓ పక్కన. అయితే ఆ వృద్ధ మహిళ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అతడి స్కూటర్ని ఫోటోతీసి భయపెట్టి ప్రయత్నం చేస్తుండగా..దెబ్బకు చేసేది లేక వెనక్కి తగ్గి.. నెమ్మదిగా స్కూటర్ని టర్న్ చేసుకుంటూ రోడ్డ మీదకు వెళ్లిపోతాడు. చివర్లో బొటనవేలుని చూపిస్తూ..యాహు గెలిచా..! అన్నట్లుగా చిరునవ్వు చిందించింది ఆ బామ్మ. అలా మనలో ఎంతమంది సాహసం చేయగలం అని ఆలోచిస్తే..సమాధానమే రాదు కదా..!. నిజానికి మనందరికీ కావాల్సింది ఇలాంటి ధైర్యమే అప్పుడు పెను రోడ్డు ప్రమాదాలను కొంతైనా నివారించగలుగుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ చాలామంది అవతల వ్యక్తి దూకుడుగా ప్రవర్తిస్తే మనం ఇబ్బదుల్లో పడే అవకాశం లేకపోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. చాలామటుకు ఇలా చేయడం వల్ల కాస్త భయంతో అయినా..అలా ఫుట్పాత్పై వెళ్లేందుకు జంకుతారని కొందరు వాదిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఫుట్పాత్పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం. ఫుట్పాత్లు కేవలం పాదచారుల కోసం మాత్రమే. దీన్ని ఉల్లంఘిస్తే..జరిమానా, ఆరు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ కేరళ మోటార్ వాహనాల నియమాలు, 1989 ప్రకారం, ఫుట్పాత్పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం కూడా. View this post on Instagram A post shared by Aflah E (@aflu__stories_) (చదవండి: గిఫ్ట్గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..) -
గిఫ్ట్గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..
బంగారం ధర ఏ రేంజ్లో ఉందంటే..కొనాలనే ఆలోచన కూడా మనసులోకి రావడం లేదు. అంతగా భయపెడుతున్నాయ్ దాని ధరలు. అలాంటిది ఇక్కడొక పెళ్లి వేడుకలో ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గిఫ్ట్గా అందిస్తున్నారు. ఎంత ధనవంతులైనా..బంగారం గిఫ్ట్గా ఇవ్వడమా..?! అని సందేహం వస్తుంది కదా..!. కానీ ఇది నమ్మక తప్పని నిజం. ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఒక వివాహంలో వధువు కుటుంబం వరుడి కుటంబానికి బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తోంది. అవి కూడా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను ఏదో చాక్లెట్లను పంచినట్లుగా ఇస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. విలాసవంతమైన పెళ్లిళ్లు ఎన్నో చూసుంటాం గానీ..ఇలా బంగారు బిస్కెట్లను బహుమతులుగా ఇవ్వడg ఇదే తొలిసారేమో కాబోలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 33 సెకన్ల ఆ వీడియో క్లిప్లో ఒక వ్యక్తి ఒక బాక్స్ నిండుగా బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ..అక్కడున్న మగవాళ్ల ముందు పెట్టడం..వాళ్లు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నెటిజన్లు అవి బంగారం కాదని వాదిస్తున్నారు. మరికొందరు దీనిని దుబారా లేదా తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడంగా విమర్శిస్తే..చాలామంది మాత్రం..బంగారు రేకుతో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లని, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వివాహాలు, పండుగ సమావేశాల ఇలాంటి చాక్లెట్లని పంచడం ఆచారమని పేర్కొనడం గమనార్హం. అలాగే ఆరేబియాలో గోల్డ్ రేకుతో చుట్టబడిన పాచీ వంటి లగ్జరీ చాక్లెట్ బ్రాండ్లు బాగా ఫేమస్ కూడా. దాంతో చాలామంది అవి బంగారం కాదని తేల్చి చేప్పేస్తుండటం గమనార్హం.Saudi wedding ceremonyBride’s brother offers 24 karat Gold biscuits to Groom’s family 😳pic.twitter.com/2lOAZwUhoi— Frontalforce 🇮🇳 (@FrontalForce) February 11, 2026 (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..!
వివాహం అనేది అత్యంత పవిత్రమైన బంధం. వేరు వేరు నేపథ్యాల మనుషులు పెళ్లి అను బంధంతో ఒక్కటై..ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే పవిత్రమైన కార్యం అది. అలాంటి వైవాహిక వ్యవస్థనే అపహాస్యం పాలుచేస్తున్నారు నేడు చాలామంది యువతీయువకులు. అలాంటి వాళ్లకు కనువిప్పు నెట్టింట రెడ్డిట్లో వైరల్ అవుతున్న పోస్ట్. అది ఆ గొప్పబంధానికి ఉన్న పవిత్రతను హైలెట్ చేసింది. అంతేగాదు ఒకరికొకరుగా ఉండటం అంటే అవగతమవుతుంది. ఆలుమగలు బంధం అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఆలోచింపచేస్తున్న పోస్ట్ అందర్నీ తెగ ఆకర్షిస్తుంది. పైగా నెటిజన్లు ఆ జంటను 'మేడ్ ఫర్ఈచ్ అదర్' అంటూ కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే..ఆ పోస్ట్లో ఒక మహిళ ఏ ఉద్యోగం లేని తన భర్త ఇచ్చిన గిఫ్ట్ని చూసి కన్నీళ్లు పెట్టుకుందామె. తన భర్తకు కొన్ని నెలలుగా ఉద్యోగం లేదని, తాను కాపీ రైటర్గా పనిచేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది. అతడు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని, అతడి ఖర్చలు, పాకెట్ మనీ అన్ని తానే చూస్తుంటానని రాసుకొచ్చింది పోస్ట్లో. అయితే తన భర్త ఆ డబ్బుని పెట్రోల్ కోసం, స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తాడని తెలిపింది. పైగా తన భర్త పెద్దగా ఖర్చులు కూడా చేయడని, ఎప్పుడైనా స్నేహితులు ఫుడ్ ఆర్డర్ చేస్తే తన వంతుగా రూ. 200 నుంచి రూ. 300లే ఇస్తాడని తెలిపింది. అలాగే తాను తనకు ఉద్యోగం లేదని అతడి స్నేహితుల ముందు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని కూడా పేర్కొంది. అయితే ఉద్యోగం లేకపోయినా..తన భర్త ఈ వాలెంటైన్స్డేకి బహుమతి ఇవ్వడం తనని ఆశ్చర్యంలో ముంచెత్తిందని అంటోంది. తాను ఇచ్చిన పాకెట్ మనీలోనే కొంత తనకు గిఫ్ట్ ఇచ్చేందుకు కొని సర్ఫైజ్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టించేసిందని భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్లో. అంతేగాదు తన భర్త ఇచ్చిన వాలెంటెన్స్డేకి ఇచ్చిన గిఫ్ట్లను తెలియజేస్తూ..ఆయన ఇచ్చన పెంగ్విన్ ప్లషీ, చాక్లెట్ బార్ చూసి ఆనందంతో ఉంబ్బితబ్బిబైంది. ఈ కష్టసమయంలోనూ తన గురించి ఆలోచించినందుకు కంటనీళ్లు ఆగడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. తాము విదేశీ పర్యటనలకు వెళ్లిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కష్టసమయం తమ మధ్య నెలకొన్న బలమైన బంధం కారణంగా ఇట్టే గడిచిపోతుందని ఉద్విగ్నింగా చెబుతూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా ఆ ఆలుమగల మధ్య ఉన్న బలమైన బంధానికి ఫిదా అవ్వడమే గాక ప్రశంసల వర్షం కురిపిస్తు పోస్టులు పెట్టారు.(చదవండి: టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!) -
రైల్లో శాండ్విచ్...నెటిజన్లరియాక్షన్స్ వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటివి ఎదురౌతూనే ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే 24-28 గంటలకు మించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేవారు సరిపడా భోజనాలు చేసుకుని వెంట తీసుకెళతారు. తాజాగా ఓ ఫ్యామిలీ రైలులో శాండ్విచ్లు తయారు చేసుకున్న వైనం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దివ్య జైన్ అనే ఇన్స్ట గ్రామ్ యూజర్ ‘రైల్వేలు ఇలాంటి వారిని నిషేధించాలి, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ప్రమాదకరం’ అంటూ చేసిన పోస్ట్ ప్రకారం కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎంతో సంతోషంగా బ్రెడ్, టమోటా, కీర లాంటి కూరగాయలతో శాండ్విచ్లు తయారు చేసుకున్నారు. ఒకరు కూరగాయలను కట్ చేయడం, మరొకరు బ్రెడ్పై చాకుతోసాస్, చట్నీ పూస్తూ ఎంతో జాయ్ఫుల్గా బ్రెడ్ శాండ్విచ్లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. Railways should ban such people, they are menace in public places pic.twitter.com/m5F0XBcEfD— Ritik (@ThenNowForeve) February 8, 2026 fy"> నెటిజన్ల స్పందన ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేశారు. కొంతమంది వీరి వ్యవహారాన్ని ఖండించగా, రైలంటే సొంత కిచెన్ కాదని మరికొంతమంది ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. రైల్వేస్లోకి చాకుతో ఎలా అనుమతించారు ఒకరు ప్రశ్నించారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియోఫ్యామిలీతో ట్రైన్ జర్నీలో ఎంచక్కా శాండ్విచ్లు బావుంది.. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో దొరికే ఆహారంగా అంత శుభ్రంగా ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిదేగా అన్నట్టు వారిని సమర్ధించారు. ఏముందబ్బా, హ్యాపీగా చేసుకుని తింటారు. ఆ తరువాత ఆప్రాంతాన్నిశుభ్రం చేస్తారు..ఇందులో తప్పేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ రైలులో జరిగింది అనేదానిపై స్పష్టత లేదు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం -
'మొహమ్మద్ దీపక్' కష్టాలు!
'మొహమ్మద్ దీపక్' గుర్తున్నాడా? జనవరి 26న జరిగిన సంఘటనతో అతడు పేరు దేశం మొత్తం మారుమోగింది. 70 ఏళ్ల ముస్లిం వ్యక్తికి అండగా నిలబడి వార్తల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (video viral) కావడంతో అతడి గురించి అందరికీ తెలిసింది. అతడి ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. పలువురు రాజకీయ నాయకులు కూడా మెచ్చుకున్నారు.38 ఏళ్ల దీపక్ కుమార్ ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో హల్క్ పేరుతో జిమ్ నడుపుతున్నాడు. రిపబ్లిక్ డే నాడు బజరంగ్ దళ్కు చెందిన కొంతమంది.. దుకాణం పేరు మార్చాలంటూ ముస్లిం వృద్ధుడిపై ఒత్తిడి తెచ్చారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ముసలాయన కొంచెం సమయం కావాలని వారిని అభ్యర్థించాడు. అయినా వారు వినిపించుకోకుండా వాదనకు దిగడంతో అక్కడే ఉన్న దీపక్ కుమార్ కలగజేసుకున్నాడు. బజరంగ్ దళ్ కార్యకర్తలు తన పేరేంటని అడగడంతో మొహమ్మద్ దీపక్ (Mohammad Deepak) అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బీబీసీ సహా పలు వార్తా సంస్థలు అతడిని ఇంటర్వ్యూ చేశాయి. మానవత్వంతోనే ముస్లిం వృద్ధుడికి అండగా నిలబడ్డానని దీపక్ చెప్పాడు. మనుషులంతా సమానమేనని, మనమంతా సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించాడు.జనం చప్పట్లు కొట్టరుజనవరి 26 ఘటన తర్వాత దీపక్కు ప్రశంసలతో పాటు చిక్కులు ఎదురయ్యాయి. కోట్ద్వార్లో (Kotdwar) సంఘీభావంతో పాటు నిరసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. కొంత మంది అతడిని సమర్థించగా, మరికొంత మంది వ్యతిరేకించారు. జనవరి 31న, బజరంగ్ దళ్ సభ్యులు దీపక్ను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ''కోట్ద్వార్ పట్టణంలో సగం మంది నన్ను సమర్థిస్తారు, కానీ మీరు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టరు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి రావచ్చు" అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.150 నుంచి 15కు డౌన్మరోవైపు దీపక్ జిమ్ను వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకు 150 మంది వచ్చేవారని, ఇప్పుడు కనీసం 15 మంది కూడా రావడం లేదని దీపక్ వాపోయాడు. ''ఆ ఘటన తర్వాత నా జిమ్కు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. వాళ్ల భయం నాకు అర్థమైంది. నెలకు రూ. 40,000 అద్దెతో జిమ్ (Gym) నిర్వహిస్తున్నాను. అదీగాక ఈ మధ్యనే ఇల్లు కూడా కట్టుకున్నాను. దీనికి నెలవారీ రూ. 16,000 రుణాన్ని చెల్లిస్తున్నాను. నాకున్న ఆదాయమార్గం జిమ్ ఒకటే. సభ్యుల సంఖ్య బాగా తగ్గడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంద''ని దీపక్ వాపోయాడు.జాన్ బ్రిట్టాస్ సంఘీభావం దీపక్ కుమార్కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 8న కోట్ద్వార్ పట్టణానికి వచ్చి దీపక్తో పాటు మొహమ్మద్ బాబా డ్రెస్ షాప్ యజమాని వకీల్ అహ్మద్ను కలిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీపక్ జిమ్కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో తాను సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్స్లో వెల్లడించారు జాన్ బ్రిట్టాస్.చదవండి: మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?''మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ తరపున శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను కోట్ద్వార్ పట్టణానికి వెళ్లాను. దీపక్ను మాత్రమే కాకుండా అతడి తల్లి, భార్య, బిడ్డను కూడా కలిశాను. జీవనోపాధి కోసం టీ అమ్ముకునే అతని తల్లి అందించే వేడి అల్లం టీ తాగాను. మతపరమైన అంశాల బెదిరింపుల కారణంగా ఇప్పుడు నిర్జనమై ఉన్న అతని జిమ్ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నాను. ముహమ్మద్ బాబా వస్త్ర దుకాణాన్ని కూడా సందర్శించి కొన్ని కొనుగోళ్లు చేశాను. దీపక్పై కేసు నమోదు చేసిన కోట్ద్వార్ పోలీస్ స్టేషన్లో బలమైన నిరసన తెలియజేశాను. 'ముహమ్మద్' దీపక్గా రూపాంతరం చెందిన దీపక్ కుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతడు భవిష్యత్ విశ్వాసానికి వజ్ర-ప్రకాశవంతమైన కాంతి'' అంటూ జాన్ బ్రిట్టాస్ ఎక్స్లో పేర్కొన్నారు. "Deepak Kumar, now known as 'Muhammad' Deepak... is a beacon of hope in the struggle against the Hindutva communalism .Deepak Kumar entered the scene in Kotdwar, in the foothills of the Himalayas, when Bajrang Dal activists began harassing an elderly man named Muhammad. This… pic.twitter.com/ZVuA5VwgGb— John Brittas (@JohnBrittas) February 8, 2026 -
ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
డెబై ఏళ్ల వయసులో ఆ బామ్మ పడుతున్న కష్టం చూస్తే మనసు కరిగిపోతుంది. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవంగా బతికేందుకు పడుతున్న తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్. ఎందుకమ్మా.. ఈ వయసులో నీకంత కష్టం అనిపిస్తుంది. కానీ ఆ బామ్మ తన కాళ్లపై తనునిలబడాలని పోరాడుతున్న తీరు యువతకు ఆదర్శం, స్ఫూర్తి కూడా. అందుకు సంబంధించిన వీడియోని ఆరాధన ఛటర్జీ షేర్ చేయడంతో నెటింట వైరల్గా మారింది. ఆ బామ్మ పేరు దీపాలీ ఘోష్. తన భర్త మరణించిన తర్వాత దాదాపు మూడు దశాబ్దాలు ఓ చిన్న భోజనశాల నడుపుతోంది. ఆ భోజనశాలలో ప్రతీదీ ఆమెనే స్వయంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఆ హోటల్ సరిగా నడవడం లేదు. కనీసం ఐదు కస్టమర్లు కూడా లేరని భోరుమంటోంది. అది ఓ చిన్న ఇరుకైన స్థలంలో ఉన్న చిన్నపాటి భోజనశాల. అక్కడ ఓ విరిగిన ఫ్లైవుడ్పై నిద్రపోతుంది. చెప్పాలంటే ఆ దుకాణం నిండా ఉన్న పాత సామాన్లు, మసితో నిండిన గోడలు, ఓ పక్క లీకయ్యే పైపుతో చిందరవందరగా ఉంది. బామ్మకు లాక్డౌన్ తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైందట. పైగా వినికిడి శక్తి తగ్గిపోయింది ఆ బామ్మకు. ఆమె తన ఆహారం, మందులు కోసం ఈ పని చేస్తూనే ఉండాలి. ఆమె వృద్ధాశ్రమానికి వెళ్లాలనుకోవడం లేదట. తాను గౌరవంగా జీవనోపాధిని పొందాలనేదే ఆమె ఆశ. ఆ బామ్మ అక్కడే ఉండి తన వ్యాపారాన్ని ఇదివరకిటిలా రన్ చేయాలని తపన పడుతోంది. కాబట్టి మనమందరం కలిసి దీన్ని సాధ్యమయ్యేలా చేద్దామా అని పిలుపునిస్తూ..అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంది సోషల్ మీడియా యూజర్ ఆరాధన. ఆ వీడియో మిలియన్లమంది నెటిజన్ల మనసుని కదిలించింది. ఎలా ఆ బామ్మని కలిసేది, సాయం చేసేది అంటూ పోస్టలు పెట్టారు. మాలాంటి సోమరిపోతులకు నిజంగా ఆ బామ్మ కథ ఓ కనువిప్పు, ప్రేరణ అని భావోద్వేగంగా పోస్టులు పెట్టారు కూడా. View this post on Instagram A post shared by Aradhana Chatterjee (@storiesbyaradhana) (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం
వన్యప్రాణులకు సంబంధించి కొత్త అన్వేషణలు ఔత్సాహికులకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తాయి. ఇటీవల తొమ్మిది రంగుల హిమాలయ మోనాల్ అనే అరుదైన మోనాల్ జంతువు భూటాన్ పర్వత లోయల్లో దర్శనమిచ్చింది. అద్భుతమైన ఇంద్రధనస్సు లాంటి ఈకలు , సహజమైన ప్రకాశవంతమైన మెరుపుతో ఆకాశాన విహరిస్తున్న ఈ పక్షి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఈఫోటో తీసింది ఎవరో తెలుసా? మగ హిమాలయ మోనాల్ విమానం మధ్యలో కనిపించింది. ఈ దృశ్యం భూటాన్ ఎత్తైన పర్వతాలపై ఆవిష్కృతమైంది. వీక్షకులు ఈ దృశ్యాన్ని ఉత్కంఠభరితంగా అభివర్ణించారు. ప్రకాశవంతమైన పర్వత సూర్యకాంతి కింద ఈ పక్షి మెరిసింది. చాలామంది దీనిని ఎగిరే ఆభరణంతో పోల్చారు. సహజ ఇంద్రధనస్సు రంగులతో హిమాలయ మోనాల్ అని పిలిచే నెమలి జాతి మగ పక్షి ఎగురుతూ ఫోటోలకు చిక్కింది. రంగులతో మెరిసిపోయే దేహం దీని ప్రత్యేకత. హిమాలయాల ఆభరణం అని పిలిచే ఈ పక్షి జాతి తేజస్సుకు ప్రసిద్ధి చెందింది. ఈ మేల్ హిమాలయ మోనాల్ విమానం మధ్యలో కనిపించిన దృశ్యం భూటాన్ ఎత్తైన పర్వతాలపై దర్శనమిచ్చింది. వీక్షకులు ఈ దృశ్యాన్ని ఉత్కంఠభరితంగా అభివర్ణించారు. ప్రకాశవంతమైన పర్వత సూర్యకాంతి కింద ఇది అద్భుతంగా మెరిసింది. దాని ఈకలు నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులను, అటు బంగారం , నారింజ రంగులు ప్రకాశవంతంగా మెరుసి పోవడంతో చాలామంది దీనిని ఎగిరే ఆభరణంతో పోల్చారు. మెటాలిక్ కలర్స్ను మార్చుకుంటూ పచ్చ, రాగి షేడ్స్ తక్షణమే కనిపిస్తాయి. వెంటనే వైలెట్, ముదురు నీలంలోకి మారతాయి. ఒక విధంగా చెప్పాలంటే దీని ప్రతి కదలికతో దృశ్యం మారిపోయి, పూర్తిగా సహజమైన రంగులతో నిండుగా కనిపిస్తుంది. ఇదీ చదవండి: View this post on Instagram A post shared by INDIAN PHOTOGRAPHY (@indian.photography)ఈ హిమాలయ మోనాల్ సాధారణంగా భూటాన్, నేపాల్ అంతటా, ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో నివసిస్తుంది. ఉత్తర భారతదేశంలో కూడా అక్కడడక్కడా కనిపిస్తుంది. టిబెట్లోని కొన్ని ప్రాంతాలు ఈ జాతులకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ పక్షి 4,500 మీటర్ల ఎత్తులో వృద్ధి చెందుతుంది. ఇది ఆల్పైన్ పచ్చిక భూములు, అడవులను ఇష్టపడుతుంది. దీనికి ప్రాంతీయంగా సాంస్కృతికంగా ముఖ్యమైనది. ఇది నేపాల్ జాతీయ పక్షి.. ప్రధానంగా నేలపై నివసించినప్పటికీ, ఇది ఎగరగలదు. బిగ్గరగా అరిచే దాని అరుపులు లోయలలో ప్రతిధ్వనిస్తాయి. ఈ దృశ్యం హిమాలయ జీవవైవిధ్య గొప్పతనాన్ని హైలైట్ చేస్తుందనీ, ఇది ఆవాస రక్షణ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుందని వన్యప్రాణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియోఈ చిత్రాన్ని తీసింది ఎవరు?వన్యప్రాణుల ఫోటోలకు ప్రసిద్ధి చెందిన భారత్ ఫోటో గ్రాఫర్ ది డా. సుధీర్ ఈ ఫోటోను తీశారు. దీన్ని ఎడిట్ చేయలేదు. ఇది ఏఐ అంతకన్నా కాదు..అంటూ భూటాన్ ఆకాశంలో ఎగురుతున్న ఈ తొమ్మిది రంగుల పక్షి తన కెమెరా కంటికి చిక్కిన వైనాన్ని పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ విషయంలోఆయన మరో రికార్డ్ కూడా నెలకొల్పారు. గత 10 ఏళ్లుగా ఫేస్బుక్లో వన్యప్రాణుల చిత్రాలను నిరంతరం పోస్ట్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకిది 4వ రికార్డు. ఈ అవార్డు కిట్లో డిజైనర్ పెన్, పుస్తకం, బ్యాడ్జ్లు, ఐడి కార్డ్ , ముఖ్యంగా పతకం ఉన్నాయి! ఐ లవ్ దిస్ కిట్ అంటూ డా. సుధీర్ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇది కఠినమైందే అయినప్పటికీ ప్రతిఫలదాయకమైన ప్రయాణంలో తనకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by DrSudhir Hasamnis (@hasamnisdrsudhir) -
క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
దేశం కాని దేశంలో మనకు సంబంధించిన వస్తువులను చాలా ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా వీసా, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డు అత్యంత ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది. కానీ మన దేశంలో అలా కాదు. క్రెడిట్ కార్డును కోల్పోయిన మహిళను స్నేహితులు సేవ్ చేసారు. దీనికి సంబంధించి ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అదేంటో చూద్దామా.బెర్లిన్కు చెందిన జెన్నిఫర్ అనే 29 ఏళ్ల యువతి భారత పర్యటనకు వచ్చింది. అయితే ఊహించని క్రమంలో క్రెడిట్ కార్డులు. కార్పొరేట్ ఐడి క్రెడిట్ కార్డు ఉన్న పర్స్ ఎక్కడో పారేసుకుంది. దీంతో ఆమె పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. కానీ ఈ సమయంలో ఒక్క సెకను కూడా చింతించిలేదనీ, దీనికి కారణంగా భారత్లో ఉన్న తన స్నేహితులేనని చెప్పుకొచ్చింది. వారంతా కష్టకాలంలో అండగా నిలిచి గట్టెక్కించారనీ, ట్రూ స్టోరీ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసింది. అలాగే జెన్నిఫర్ తన స్నేహితులతో తన వాట్సాప్ సంభాషణల స్క్రీన్షాట్లను షేర్ చేసింది.తన టూర్ పూర్తయ్యేవరకు తన ఫ్రెండ్స్ తనకు కావాల్సిన డబ్బును ఏర్పాటు చేసి తాను ఎలాంటి ఆందోళన పడకుండా చూసుకున్నారని, ఇలాంటి మద్దతు లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని పేర్కొంది. అంతేకాదు ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేస్తాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని వెల్లడించించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనులు కూడా ఆనందాన్ని ప్రకటించారు. View this post on Instagram A post shared by Jennifer (@jennijigermany) నెటిజన్ల స్పందనబెంగళూరులోని బస్సులో పర్సును (క్రెడిట్ కార్డులు , కార్పొరేట్ ఐడీ కార్డ్ ఉన్న) పోగొట్టుకున్నా.. ఆ మరుసటి రోజు ఉదయం దానిని తిరిగి ఇవ్వడానికి తన కార్యాలయానికి వచ్చాడంటూ తన అనుభవాన్ని ఒకరు పంచుకున్నారు. స్నేహం,స్నేహితులు అంటే అదే కదా.. జాతి, జాతీయత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదుకుంటారు అని మరొకరు వ్యాఖ్యానించారు. -
అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..
అత్తా కోడలు బంధం అనగానే ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక ఇంటిలో రెండు కొప్పులు పొసగవు అన్న నానుడిలా ఉంటుంది చాలావరకు. కానీ ఈ అత్తాకోడళ్లు అందుకు విరుద్ధం. పైగా ఆ కోడలు దేశం, సంస్కృతి, వేషధారణ అన్ని పూర్తి విభిన్నం..అయినా వారి మధ్య అనుబంధం మాములుగా లేదు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని డెట్రాయిట్లో జన్మించిన వ్యవస్థపకురాలు బ్రిటినీ గ్రే యాదవ్ షేర్ చేశారు. ఆ వీడియోలో రెండు వేర్వేరు దేశాలు మధ్య శక్తిమంతమైన బాండింగ్ని చూపించింది. ఆమె తన భారతీయ అత్తగారితో గడిపిన క్షణాన్ని షేర్ చేసింది. తాము రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటామని పోస్ట్లో రాసుకొచ్చింది. ఆతర్వాత ఆమె తన అత్తగారు ఆ వీడియోలో ఎందుకు అంతలా నవ్వుకుంటున్నామో వివరించింది. తాము సరదాగా మాట్లాడుకుంటూ..తన అత్తగారు కోడలి నుంచి ఆశిస్తోంది ఏంటో చెప్పగా..దాన్ని తాను చేసి చూపించడంతో నవ్వులు విరిశాయని పేర్కొంది. ఇంతకీ భారతీయ అత్తగారు కోడలి నుంచి ఏం ఆశించారంటే..ప్రతి రోజు వంట చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పాదాలు నొక్కడం తదితరాలని మాట. ఆ అత్తగారు కోరుకున్నట్లుగానే బ్రిటనీ నేలపై కూర్చోగా..అత్తగారు సోఫాలో కూర్చొని..ఒకటే పకపక నవ్వు. ఇద్దర్నీ చూస్తే..అత్త కోడళ్లలా కాకుండా స్నేహితుల్లా మెలుగుతున్న వారిని చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత అద్భుతంగా ఉంది ఆ ఘట్టం. ఇక బ్రిటనీ డెట్రాయిట్కి చెందిన నల్లజాతి అమ్మాయి కాగా, ఆ అత్తగారు భారత్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ. నెటిజన్లు కూడా ఆ అత్తాకోడళ్లు కలిసిమెలిసి ఉన్న విధం చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Brittany Grey-Yadav (@brittanygreyyadav) (చదవండి: బరువు తగ్గాలంటే..తూచా తప్పకుండా పాటించాల్సిన ఏడు సూత్రాలు..!) -
ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!
మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్లో కోడింగ్ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తే అక్షయ్ సైనీ. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మాజీ ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్షయ్ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్ లైఫ్ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్ ఛానెల్లో రెండు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. కేవలం యూట్యూబ్లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్ కంటెంట్క్రియేటర్గా, కోడింగ్ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్యాగ్తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్గా, సేల్స్గైగా, ప్రొడక్ట్ మేనేజర్గా, ఫైనాన్స్గైగా, కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్గా అన్ని రోల్స్ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. అంతేగాదు మనకు బయట స్టార్టప్లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్లైన్ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్, అక్కడే ఒక చిన్న రిమోట్ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్ వేరేలెవెల్ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.When I left Uber, a lot of people thought I had lost my mind.Good salary, big brand, stable life.And I was walking away from it to do YouTube, teaching, content creation. In India.People told me very seriously, “This is not a good decision.”Some said, why don’t you do…— Akshay Saini (@akshaymarch7) February 9, 2026 (చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!) -
క్లబ్బుల్లో భక్తి పారవశ్యం.. 20 వేల కోట్లకు పైగా బిజినెస్
సాక్షి స్పెషల్ డెస్క్: మసక వెలుతురు, దట్టమైన పొగలు, నియాన్ లైట్లు, తెల్లవార్లూ సాగే ‘టకీలా’ షాట్ల సేవనం.. ఇవన్నీ ఇప్పుడు పాత కాలపు యూత్ ఫ్యాషన్. కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా? ‘ఆధ్యాత్మిక ఓలలాట’! భక్తి భావనల ‘దమ్ మారో దమ్’! నైట్ క్లబ్బుల్లో జరుగుతున్నఈ ‘సోబర్ రేవ్’ (మందు లేని మత్తు) పార్టీలు తాజా ఇండియన్ ట్రెండ్! అక్కడ డీజే బేస్ చప్పుళ్ల బదులు.. వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే, దేహం తాదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది.ఆలయాలు దాటిన పారవశ్యంఇప్పటి వరకు, ప్రశాంతత అలుముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన మన భక్తి ధ్యానం.. ‘ఎరీనా ఎరా’ (స్టేడియం రేంజ్ స్టేజ్) లోకి అడుగుపెట్టింది. భక్తికి కార్పొరేట్ గ్లామర్ తోడై, భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ జీవం పోసుకుంది.కాక్టైల్స్కు బదులుగా తేనీరు జెన్–జెడ్ మెట్రో కుర్రకారు పూర్తిగా పంథా మార్చేశారు. మూస నైట్ క్లబ్ల గందరగోళాన్ని వదిలేసి, ఆధ్యాత్మిక క్లబ్బులలోకి క్యూ కడుతున్నారు. చేతిలో కాక్టెయిల్ గ్లాసులకు బదులు వేడి వేడి కుల్హద్ చాయ్ పట్టుకుని.. రాధికా దాస్, కేశవమ్ వంటి కళాకారుల భజన పాటలకు చిందులేస్తున్నారు.‘సన్ బర్న్’ కే సవాలుగా నిలిచి..!అంతర్జాతీయ స్థాయి ఎల్.ఈ.డి స్క్రీన్లు, మెరిసిపోయే స్ట్రోబ్ లైట్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్తో ఈ భజన్ క్లబ్బింగ్ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ ఈవెంట్స్ ఇప్పుడు ‘సన్ బర్న్’ వంటి పాశ్చాత్య శైలి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్స్కు గట్టి పోటీ ఇస్తున్నాయి.పెరుగుతున్న ఆదరణ– మూస క్లబ్ కంటే భజన్ ఈవెంట్లలో జనం ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. స్పాన్సర్ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్ లాభదాయకంగా ఉంటోంది.– ఆల్కహాల్, గొడవలు లేని ఈ వాతావరణం కుటుంబాలను, యువత ఇద్దరినీ ఆకట్టుకుంటోంది.– భారత ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఇలాంటి ‘కల్చరల్ ఎకానమీ’ని దేశ ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా గుర్తించటం కూడా భజన్ క్లబ్బింగ్కు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.సాంస్కృతిక సునామీ పరిశ్రమ దిగ్గజాలు ఈ భజన్ క్లబ్బింగ్ కల్చర్ను ముద్దుగా ‘భారత్కోర్’ అని పిలుస్తున్నారు. ఇదేమీ చిన్న మార్పు కాదు, ఏకంగా రూ. 20,000 కోట్ల లైవ్ ఈవెంట్స్ మార్కెట్ను ముంచెత్తుతున్న ఒక సాంస్కృతిక సునామీ!మార్చిలో సాజ్–ప్రఖర్ టూర్2026 మార్చిలో ‘సాజ్–ప్రఖర్’ బృందం దేశవ్యాప్త టూర్ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్ లుధియానా వంటి నగరాలను సాజ్, ప్రఖర్ దంపతులు భక్తి మత్తులో ముంచేయనున్నారు. సంప్రదాయ భక్తి సంగీతానికి (భజనలు) ఆధునిక క్లబ్ శైలిని సమ్మిళతం చేయటం వీరి ప్రత్యేకత.‘మన్ కీ బాత్’లో ప్రస్తావన!2026 జనవరి 25న ప్రసారం అయిన 130 వ ‘మన్ కి బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రెండ్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సైతం ఈ కొత్త ఒరవడిని ‘భజన్ క్లబ్బింగ్’ గా పేర్కొనటంతో దీనికి ఎక్కడ లేని ప్రాముఖ్యం లభించింది.ప్రధాని ఏమన్నారంటే..‘‘మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి జెన్–జెడ్ యువత ఆ భక్తిని తమదైన శైలిలో, ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడం విశేషం. ఇది ఆధునికత, సంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం’’ -
ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!
భారత కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అది ప్రస్తుత కాలంలో చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ప్రాణప్రదంగా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవాళ్లే..కడదాక కలిసి ఉండలేకపోవడం బాధకరం. అది కూడా చిన్నచిన్న వాటికి, మనస్పర్థలతోటి విడాకులు తీసుకుంటున్నారు. తనకోసం అన్ని వదులుకుని వచ్చిందన్న భావం మగవాళ్లలో కొరవడం ఒక కారణమైతే..తన మాటే నెగ్గాలన్న అహంకారం మరొక కారణం అంటున్నారు మానసిక నిపుణుల. అచ్చం అలాంటి కారణాలతో ఈ టెక్ జంట విడిపోయింది. అందుకు గల కారణం చూస్తే..కన్నీళ్లు వస్తాయి. విమెన్ సాధికారత అన్న మాటలు వెగటుపుడుతాయి. దయచేసి మహిళల్ని మహారాణులు చేయకండి అర్థచేసుకోండి స్వామి..చాలు అని గొంతెత్తి అనాలనిపిస్తోంది. అసలేం జరిగిందంటే..ఈ టెక్ జంట ప్రేమ కథ విడాకులతో ముగియడంతో నెట్టింట వైరల్గా మారింది. సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ప్రకారం. ఆ టెక్ జంట పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకున్నారు. విజయవంతంగా జీవితాన్ని నిర్మించుకున్నారు. గుర్తింపును వెల్లడించిన ఆ ఇంజనీర్ జంటకు ఇద్దరు పిల్లుల, చక్కటి ఆర్థిక భద్రతా ఉంది. ఆమె మంచి కష్టపడి పనిచేసే ఉద్యోగి. గర్భధారణ తర్వాత ఆరునెలలు మినహా ఎన్నడు విరామం తీసుకోలేదు. తొమ్మిదో నెల వరకు ఆఫీసుకు వెళ్లింది. పిల్లలు, భర్త కోసం పనిచేయడం ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది కూడా. రెండో గర్భధారణ తర్వాత ఆ మహిళ కంపెనీ మార్చింది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంది. ఇప్పుడు తన భర్త కంటే అధిక వేతనం సంపాదిస్తోంది కూడా. అయితే అత్తగారు అనారోగ్యానికి గురి కావడంతో భర్త తన భార్యను ఉద్యోగం మానేసి ఆమె బాగోగులు చూసుకునే సంరక్షకురాలిగా మారాలని ఆదేశించాడు. అందుకు ప్రెగ్నెన్సీ వల్ల చాలాసార్లు తాను ఉద్యోగానికి విరామం ఇచ్చాను..ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మీరే జాబ్ మానేయండి, ఫైనాన్షియల్గా మొత్తం చూసుకుంటాను, అలాగే ఇంటి బాగోగుల్లో కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది. అవసరమైతే పిల్లల్ని చూసుకునేందు వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తానని అంది. అందుకు భర్త తల్లి ససేమిరా అంది. కోడలు తల్లి ఇక్కడకు రావడం సరైన కాదని..పైగా ఉద్యోగం కోడలే మానేయాలని పట్టుబట్టింది. పైగా అత్తగారిని చూసుకోవడం అనేది కోడలు బాధ్యతని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది. చివరికీ కోడలు ఉద్యోగం మానేయడం లేదనే అక్కసుతో ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దాంతో విసుగుపోయిన ఆమె పిల్లలుతో సహా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అలాగే భర్తకు ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమెకు ఇష్టమైతే తన ఇంటికి వచ్చి ఉండొచ్చని, తన అమ్మనాన్నలు చూసుకుంటారని అంది. అంతే భర్త ఉద్యోగం మానేయడం లేదనే కోపంతో..విడాకులు ఇస్తానని బెదిరిస్తూ లీగల్ నోటీసు పంపాడు. చివరికీ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఎంతో విజయవంతంగా నిర్మించుకున్న ఆజంట సంసారం విచ్చన్నమైంది, విడాకులు తీసుకున్నారు. ఇక్కడ ఒక మహిళ ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా..ఎంత ప్రేమించినా..త్యాగం చేసినా విలువ ఉండదు. జస్ట్ తన స్వాతంత్య్రాన్ని వదులుకోను అనగానే ఆ భార్య ఒక్కసారిగా పనికిరానిదిగా అయిపోయింది. నెటిజన్లు సైతం ఆమె తల్లికి అనారోగ్యంగా ఉంటే..ఆ భర్త ఉద్యోగం మానేస్తాడా? అని ప్రశ్నించారు, మరికొందరు ఇక్కడ ఆమె బాధ్యత నిరాకరించిందని కాదని, కేవలం తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న విద్వేషం విడాకులకు దారితీసిందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.చదవండి: భార్య కోసం ఏడాదికి 3 కిలోల బంగారం కొంటున్నాడు..! -
భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!?
బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..భారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్ఫ్లిక్స్లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్ చేస్తుంది. ఈ సిరీస్లో నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్లో బారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.ఎవరీ సతీష్ సన్పాల్.. ?సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇక సన్పాల్ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్పూర్లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు. View this post on Instagram A post shared by Luxe Life | لوكس لايف (@luxelifedubai) (చదవండి: 'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..! భావోద్వేగపరంగా..) -
ఏం కొడుకువిరా నువ్వు..
''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వన దేవతలు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు. తన వేదనను వంద రూపాయల నోటుపై రాసి హుండీలో వేశాడు. మరికొంత మంది భక్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వచ్చాయి. ముదిమి వయసులో ముసలి తల్లిదండ్రులను వేదనకు గురిచేస్తున్న విదారక ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. కడుపున పుట్టిన పిల్లలను పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మనాన్నలకు చివరి రోజుల్లో చీదరింపులే ఎదురవుతున్నాయి. జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన పిల్లలు వదిలించుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ పట్టణంలోని బస్టాండ్లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికుడొకరు ఏమైందని ఆరా తీశాడు. తనను కొడుకు, కోడలు వదిలేసి వెళ్లిపోయారని పెద్దావిడ వాపోయింది. తన కుమారుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, అతడి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. తనను కొడుకు- కోడలు సరిగ్గా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది. అమ్మను వదిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్ల స్పందనపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోస్తారని, అలాంటి వారిని చివరి రోజుల్లో చూసుకోవడం వారసుల బాధ్యత మాత్రమే కాదు.. గౌరవం కూడా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్లమ్మ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వసూలు చేయడానికి కేసు పెట్టాలని మరొకరు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొకరు ఆవేదన చెందారు. మన సమాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎక్కువ కాలం బతకం కూడా శాపంగా కింద భావించాల్సి వస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.చదవండి: 100 రూపాయల నోటుపై రాసి.. కాపాడాలని వేడుకోలువీడియోలోని వృద్ధురాలికి ఎవరైనా సహాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందనే వివరాలు తెలియరాలేదు. తల్లిని వదిలేసి వెళ్లిన కొడుకును కచ్చితంగా శిక్షించాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోందని ఆలోచనాపరులు నిట్టూరుస్తున్నారు. Elderly Mother aged 80 Abandoned at Bus Stand in Mandsaur by son after pressure from his wifeThe idea of family losing its meaning?Are aging parents become inconvenient liabilities in their own homes?This incident is not an isolated case. It reflects a growing moral crisis… pic.twitter.com/Cjsemah4AE— Woke Eminent (@WokePandemic) February 4, 2026 -
ఓ తల్లి మూర్ఖత్వంపై సజ్జనార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఫేమ్ అవడం, వ్యూస్ పిచ్చిలో పడిపోయి.. ఏం చేస్తున్నారో తెలియక కొన్ని పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ తన్న బిడ్డల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బావిపై నిలుచుని ప్రమాదకరంగా వీడియో తీసింది. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా..‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!. కన్న బిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యా సదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి అంటూ హెచ్చరించారు. ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని… pic.twitter.com/azXf7hZcBz— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 6, 2026 -
నా పార్టీ వాళ్లే తిట్టినా సరే.. సారీ చెప్పను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన మొండితనం ప్రదర్శించారు. మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీలను కించపరుస్తూ చేసిన పోస్ట్ను సమర్థించుకునే రీతిలో మాట్లాడారు. ఈ క్రమంలో క్షమాపణలు చెప్పాలన్న సొంత పార్టీ నేతల డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు.శనివారం ఎయిర్ ఫోర్స్ వన్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడారు. ‘‘ఆన్లైన్లో పెట్టిన వీడియో క్లిప్లోని ఒక భాగాన్ని నేను ముందే చూశా. కానీ, మొత్తం వీడియోను చూడలేదు. 2020 ఎన్నికల మోసానికి సంబంధించిన పోర్షన్ మాత్రం చూశాను. సాధారణంగా నేను ఏ వీడియో అయినా సరే నా సిబ్బందికి ఇస్తా. వారు మొత్తం క్లిప్ను పరిశీలించి పోస్ట్ చేస్తారు. కానీ ఈసారి ఎవరూ చూడకపోయి ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు.డెమొక్రట్లతో పాటు రిపబ్లికన్లూ ట్రంప్ క్షమాపణలు కోరాలని చేస్తున్న డిమాండ్పై ట్రంప్ స్పందిస్తూ.. నేను వేలాది విషయాలు చూస్తుంటా. ఏ తప్పూ చేయలేదు. ఇంక క్షమాపణలు ఎందుకు చెప్పడం అని అన్నారాయన.గురువారం రాత్రి ట్రంప్ తన ట్రూత్ సోషల్లో నిమిషం నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అందులో ది లయన్ స్లీప్స్ టునైట్ అనే పాట బ్యాక్డ్రాప్లో వినిపిస్తుంటే.. ఒబామా జంటను అవమానించినట్లు(కోతులతో పోలుస్తూ) కంటెంట్ ఉంది. తీవ్ర విమర్శలు రావడంతో.. ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిట్ట్ స్పందించారు. మీమ్ వీడియోను పోస్ట్ చేయడంలో తప్పేంటి? అని సమర్థించుకున్నారు.ఆ ఏఐ వీడియోపై డెమొక్రట్లే కాదు.. రిపబ్లికన్లు కూడా తీవ్రంగా స్పందించారు. అది జాత్యాంహకారాన్ని సూచించేలా ఉందని.. తక్షణమే తొలగించి అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని రిపబ్లికన్ సెనేటర్ టిమ్ స్కాట్ డిమాండ్ చేశారు. ఫేక్ అయినా కూడా అలాంటివి చేయడం సరికాదని సౌత్ కరోలీనా రిపబ్లికన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 12 గం. తర్వాత ఆ వీడియోను టైం లైన్ నుంచి గాయబ్ అయ్యింది. వైట్హౌజ్ ఆ పోస్ట్పై వివరణ ఇస్తూ.. పొరపాటున అది పోస్ట్ అయ్యిందని.. అందుకే తొలగించామని పేర్కొంది.2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో మోసాలు జరిగాయని.. డొమీనియన్ వోటింగ్ సిస్టమ్స్(Dominion Voting Systems) ద్వారా ఓట్లు దొంగిలించబడ్డాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే డెమొక్రటిక్ నేత అయిన ఒబార్ ఒబామాను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదే కాదు.. గతంలో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంపైనా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటోడికి ఇచ్చి.. తనకు ఎందుకు ఇవ్వలేదంటూ నోబెల్ పీస్ కమిటీని ఆయన తిట్టిపోశారు కూడా. -
అందువల్లే భారత్ చాలా స్పెషల్..!
భారత్లో నివశించిన చాలామంది విదేశీయలు భారత్పై మనుసు పారేసుకుని ఇక్కడే ఉండిపోవడమే కాదు..తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుచున్నామని కూడా చెప్పారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ఫ్రెంచ్ మహిళ కూడా చేరిపోయింది. భారత్ని ప్రత్యేకంగా చూపే విషయాలను వివరించి అందరి మనుసులు దోచుకుంది. మన దేశ గొప్ప తనాన్ని, ఔన్యత్యాన్ని రెండు మాటల్లో చాలా చక్కగా వివరించారామె. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..భారతదేశంలో నివసిస్తున్న ఓ ఫ్రెంచ్ మహిళ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన స్వదేశమైన ఫ్రాన్సుతో భారత్ని పోలుస్తూ..ఆ విషయాల్లో ఫ్రాన్స్ కంటే భారత్ ముందు ఉందని అన్నారామె. అలాగే భారత్ని ప్రత్యేకంగా చూపించే అంశాలను సైతం ప్రస్తావించారామె. ఈ మూడు ఏంటంటే..బలమైన సమాజ భావం, దేశ సహజ సౌందర్యం, చేతితో తయారు చేసిన వస్త్రాలు. అంతేగాదు తన స్నేహితులు తరచుగా భారత్లోని సమాజ భావం గురించి చర్చిస్తారని, వాటి అంచనాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వాళ్లంతా అంటుంటారని అన్నారామె. అయితే తాను దీన్ని పూర్తి చేసుకోలేనని, తాను అలా ఉండేలనని కూడా ఒప్పుకున్నారామె. అయితే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు ఆదరించుకుంటూ.. సహాయసహకారాలు అందించుకోవడం చూస్తుంటే..చాలా సంతోషంగా అనిపిస్తుందని అందామె. ఇది కుందేళ్లకు ఆహారం ఇచ్చేదాంతో పోల్చారామె. అదే సమయంలో తన స్వదేశం ఫ్రాన్సుకి కూడా దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయన్నారామె. అలాగే భారత్లో ప్రతి వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. ఇక ఇక్కడ దుస్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటోంది. ఎంబ్రాయిడరీ, పూసల పనిలో ఉన్న నైపుణ్యం తనను ఆశ్చర్యపరుస్తాయిని అన్నారామె. తనకు ఇక్కడ కుర్తీలు కూడా అద్బుతంగా కనిపిస్తాయిని, అవి ఫ్రాన్స్లో హైఫ్యాషన్గా పరిగణిస్తారని, ఖరీదు కూడా ఎక్కువేనని తెలిపింది. చివరగా పోస్ట్లో భారత్లో బలాలుగా భావించిన వాటిని గురించి కూడా హైలెట్ చేశారామె. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే గాక, మా దేశంలో ఈవిషయాలను ఇష్టపడటం చాలా బాగుంది అంటు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Freldaway (@freldaway) (చదవండి: పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!) -
ఫోన్ బ్యాటరీతో ఇలా చేయొద్దు సుమీ..! పాపం ఆ యువకుడు..
సాధారణంగా ఏ వస్తువైనా కొందరికి నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. అంటే కొంతమందికి అదో అలవాటులా ఏదోక వస్తువుని నోట్లో పెట్టుకుని నములుతున్నట్లుగా చేస్తుంటారు. అయితే అది ప్రమాదకరమైనదా లేద పెట్టకూడనిదా అని ఉండదు. ఏదైతేనేం..అలా నోటిలో పెట్టి నమలాల్సిందే. ఇక్కడొక యువకుడు అలాంటి పాడు అలవాటు కారణంగానే తీవ్ర గాయలపాయాలయ్యాడు. అసలేం జరిగిందంటే..ఈ ఘటన చూశాక ఎవ్వరూ ఇలాంటి సాహసం చేసే యత్నమైతే చేయరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడొక మొబైల్ షాప్లో యువకుడు కూర్చొని మొబైల్ ఫోన్ బ్యాటరిని నోటిలో పెట్టుకుని నమిలే ప్రయత్నం చేశాడు. అది లిథియం బ్యాటరీ కావడంతో.. ఇలా గట్టిగా నమిలాడో లేదో..అంతే ఒక్కసారిగా పెద్దశబ్దంతో కూడిన మంటలు ఎగిశాయి. అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. సమీపంలోని వ్యక్తులు అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ మండుతున్న బ్యాటరీని అక్కడున్న మరో వ్యక్తి కాస్త ధైర్యం చేసి బయటకు విసిరే ప్రయత్నం చేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాటరీలను ఇలా నోట్లో పెట్టుకోకూడదని, అందులోనూ లిథియం అధిక శక్తిని నిల్వ చేస్తుందని దాంతో అస్సలు ఆడుకోవద్దని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p— Rosy (@rose_k01) February 5, 2026 (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
బైకర్పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ విభాగంలో చిక్సెంగ్ మాన్పుంగ్ రేడియో ఆపరేటర్గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్ పడి ఉండడం చూసి యాక్సిడెంట్ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్ మరణంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. A female tiger was found unalive with a gunshot injury near Mayudia in Arunachal Pradesh’s Lower Dibang Valley, just two days after a police head constable was attacked and lost his life on the Roing–Anini road. Authorities are probing who shot the tiger, why it was harmed and… pic.twitter.com/EIQWPpSf7W— The Sentinel (@Sentinel_Assam) February 6, 2026 ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్ మాన్పుంగ్ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్ మాన్పుంగ్ దాడి వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు. వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది. ⚠️ Stay Alert, Stay Alive 🐅Suspected tiger attack claims life ofpolice constable in Arunachal Pradesh. pic.twitter.com/7Dg4DA0CaV— अक्स (@Vickyaarya007_) February 6, 2026 -
ర్యాపిడో డ్రైవర్కు షాకిచ్చిన మహిళ.. ఇదో వింత కథ!
ర్యాపిడో.. వాడుకున్న వాళ్లకి వాడుకున్నంత అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు మనుషుల డ్రాపింగ్, పికప్, పార్సిల్, ఫుడ్ సర్వీసులకే బైక్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా ఓ మహిళ చేసిన పనికి ర్యాపిడో బైక్ డ్రైవర్ ఖంగుతిన్నాడు. చెత్త బాక్స్ను ఇచ్చి.. పడేయమని చెప్పడం వివాదానికి దారి తీసింది. దీంతో, సదరు మహిళపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనకు సంబంధించి కరణ్ నిషాద్ అనే యువకుడు ఈ వింత అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియో ప్రకారం..‘ర్యాపిడో పోర్టర్ సర్వీస్ ద్వారా ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అనంతరం, సదరు మహిళ వద్దకు వచ్చిన డెలివరీ బాయ్కు ఒక సీలు చేసిన కార్డ్బోర్డ్ బాక్స్ను అప్పగించింది. లోపల వస్తువులు ఉన్నాయని భావించిన కరణ్.. పేమెంట్ గురించి అడిగాడు. ఇంతలో పేమెంట్ ఆన్లైన్లో చెల్లించినట్లు ఆమె సమాధానమిచ్చింది. అనంతరం, అతను ఆ పార్శిల్ను తీసుకుని డ్రాప్ లొకేషన్కు బయలుదేరాడు.తీరా లోకేషన్కు చేరుకోగానే.. అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడంగా నిర్మానుష్యంగా చెత్తా చెదారాలతో నిండిపోయి ఉంది. ఒక పెద్ద చెత్త కుప్ప మాత్రమే ఉంది. దీంతో, ఎవరికి పార్సిల్ ఇవ్వాలో అర్థం కాక అతను వెంటనే సదరు మహిళకు ఫోన్ చేశాడు. ‘మేడమ్, ఇక్కడ ఎవరూ లేరు.. ఈ ప్యాకెట్ ఎవరికి అందజేయాలి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని అతను షాక్కు గురయ్యాడు. ‘అందులో ఉన్నదంతా చెత్తే.. అక్కడ పారేయండి’ అని ఆమె చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చింది. ఆమె మాటలు విన్న కరణ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు ఇతరుల ఇంటి చెత్తను కూడా మేమే డెలివరీ చేయాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Karan Nishad (@karannishadd1)దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డెలివరీ యాప్లను ఇలాంటి పనులకు వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. కష్టపడి పని చేసే డెలివరీ భాగస్వాములను ఇలా తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. కనీస మర్యాద ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..
పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్ టబ్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్ పెస్టివెల్కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి. View this post on Instagram A post shared by Jordan Egbert (@counting.countries) (చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..
డబ్బుంటేనే సాయం కాదు..మంచి మనసు ఉంటే ఎలాగైనా సాయం అందించొచ్చు అని నిరూపిస్తున్నాడు ఈ 24 ఏళ్ల స్విగ్గీ డెలివరీ బాయ్. అతడి చేసేది చాలాకష్టమైన పని. పైగా అది సేవ రంగానికి చెందింది. అందులో వచ్చే సంపాదన అతడి కుటుంబ బాధ్యతలకు అక్కరకు రావు. అయినా..అందులో సగం పేదల కోసం ఖర్చు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. సాధారణ ఆదాయమే అయినా..ఇంత సేవాతత్పరత..! అని అందరూ విస్తుపోతున్నారు. ఇంతకీ ఎవరా యువకుడు అంటే.. అతడే ఢిల్లీకి చెందిన యువకుడు ఆకాశ్ సరోజ్. అతడి ఉదారతకు హద్దులు లేవు. స్విగ్గీ డెలివరి బాయ్గా పనిచేస్తూ..వచ్చే ఆదాయంలో సగం జీతం పేదల కోసం ఖర్చుపెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అలాగని మనోడుకి ఏమి బాధ్యతలు లేవా అంటే..కుటుంబాన్ని పోషించుకోవాలి, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆకాశ్దే. అయినప్పటకీ..సంపాదనలో 50% పేద ప్రజల కోసం ఉపయోగిస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు. View this post on Instagram A post shared by Aakash Saroj (@imaakashsaroj)డెలివరీ బాయ్గా ఎంతలా కష్టపడితే డబ్బులు వస్తాయో తెలిసిందే. కానీ ఈ యువకుడు..రిక్షా కార్మికుడు నుంచి వీధిల్లో బిచ్చమెత్తుకునే అభాగ్యులు వరకు.. తనకెదురైనా ప్రతి వ్యక్తికి తన ఆదాయంలో ఎంతో కొంత ఖర్చు చేసి మరి సాయం చేస్తాడు. ఎందుకింత ప్రయాస అని ఆకాశ్ని ఎవరైనా ప్రశ్నిస్తే..ఇది తన తండ్రి కల అని, తాను ఒక కొడుకుగా..మంచి వ్యక్తిగా ఉండాలన్నదే అతడి కోరిక అని చెబుతుంటాడు. మరో వీడియోలో కుక్కలకు, పిల్లులకు ఆహారం పెడుతూ కనిపిస్తుంటాడు. పైగా ఇది తన బాధ్యత అని పోస్టులో పేర్కొంటూ..వీడియోకి "ఎక్కవ ఆశీర్వాదాలు సంపాదించు..నీకు మించిన ధనవంతుడు లేడు". అనే క్యాప్షన్ పెట్టడం విశేషం. ఇక్కడ ఆకాశ్ పేదలకు సాయం చేస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వాటికి ఇచ్చే క్యాప్షన్లు కూడా నెజన్లను అత్యంత ఆకట్టుకుంటాయి, ఆలోచింపచేసేలా ఉంటాయి కూడా. View this post on Instagram A post shared by Aakash Saroj (@imaakashsaroj) (చదవండి: వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత) -
కోటి సంపాదించే టెకీ జీవితానికే విలువ లేదు : వ్యాపారవేత్త పోస్ట్ వైరల్
బెంగళూరులో జరిగిన ఒక 'హిట్ అండ్ రన్' (Hit-and-Run) ఘటన సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్ ద్వారా పచుకున్నారు. అసలేం జరిగిందంటే..స్నేహిల్ కారులో ఆయన సోదరి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్నారు. బెంగళూరులోని ఒక రెడ్ లైట్ సిగ్నల్ పడినపుడు, స్నేహిల్ సోదరి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఒక మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, తమకుజరిగిన అన్యాయం, ట్రక్కు యజమానిపట్ల పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ విషయం హైవే పోలీసులకు , ట్రక్కు యజమానికి కూడా తెలుసని, అయినా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ను అరెస్టు చేయలేదనీ కనీసం FIR (ప్రథమ సమాచార నివేదిక) నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని స్నేహిల్ ఆరోపించారు.ఇదీ చదవండి: 6 వేల మీటర్ల లోతులో జపాన్ ఘనత : ప్రపంచంలోనే తొలిసారిపోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలుప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కదా, కేసు ఎందుకు? ఇన్సూరెన్స్తో సెటిల్ చేసుకోమని పోలీసులు బాధితులకు సూచించారనేది ఆయన వాదన. మరోవైపు ట్రక్కు యజమానులు పోలీసులకు క్రమం తప్పకుండా లంచాలు ఇస్తుంటారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఒక అధికారి బాధితులతో అన్నట్లు స్నేహిల్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తన సోదరి బెంగళూరు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతోందని, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?చట్టాన్ని గౌరవించే, పన్ను చెల్లించే నిపుణులను కూడా రక్షించడంలో వ్యవస్థ విఫలమైందని స్నేహిల్ పేర్కొన్నాడు. బాధితుల్లో ఒకరు ప్రధాన డేటా కంపెనీలో పనిచేస్తున్న, ఉన్నత IIT-JEE ర్యాంక్ కలిగిన యువ AI ఇంజనీర్. "ఇది 2025లో బెంగళూరు. ఇది 2025లో భారతదేశం" అని ఆయన రాసుకొచ్చారు. కోటి రూపాయల ఆర్జించి పన్నులు కట్టే వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పౌరులు వ్యవస్థను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.A 1 crore earning techie's life has no value in Bengaluru.And if you're not earning that much? Your life has even less.My sister and her friend were driving home in my car. They stopped at a red light - the logical thing anyone does. A drunk driver in a mini-truck didn't feel…— Snehil Saluja (@mesnhl) February 2, 2026 నెటిజన్ల స్పందనఅధికంగా పన్నులు కట్టే నిపుణులకు కూడా దేశంలో రక్షణ లేకపోతే ఎలా అని నెటిజన్లు కూడా విమర్శించారు.ఈ సంఘటనను సిగ్గుచేటు అని అభివర్ణించారు.ఇటువంటి పరిస్థితుల వల్లే ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బెంగళూరు సిటీ పోలీస్ లేదా ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా? -
భర్తను చితకబాదేసిన భార్య, వైరల్ వీడియో
భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.సోషల్ మీడియా పోస్ట్ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి. తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ వీడియోను క్లిప్లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు. 2025లో ఏప్రిల్లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?నెటిజనుల స్పందనఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి. వేధింపులకు గురవుతున్న వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు అని ఒక నెటిజన్ కోరడం గమనార్హం.అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్ కూడా కనిపించింది. ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?Video source @mishrag47 . There is no domestic violence laws to protect men, no laws to severely punish such women. If man raise his hands on women simp men at once oppose him. #MenToo #GenderBiasedlaws #RejectWaqfBill #WaqfAmendmentBill #MuskanRastogi #IPL2025 #ToxicFeminism pic.twitter.com/KFoR0Ikf1Z— Saurabh Bahuguna46 (@bahuguna46) April 2, 2025 -
మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..!
కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని యుయాంగ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు.. రేయ్..! చుక్కి కళ్లుతెరవరా.., మాతో మాట్లాడరా, ఫుట్బాల్ ఆడదాం త్వరగా లేగు అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్మేట్స్ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు. అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది. A touching story😭😭An 8-year-old boy in Hunan, #China, woke from a 55-day coma after hearing the collected messages of love and well wishes from classmates🥺🥺It's the power of #friendship and #hope. ❤️ pic.twitter.com/M8sEcX8o9Z— GeoSight (互fo) (@ShanxiDaily) January 22, 2026 (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!
ఈ రోజుల్లో చేసిన సాయాన్నిగుర్తించుకుని కృతజ్ఞత చూపించడం అత్యంత అరుదు. ఒక వేళ ఆయా వ్యక్తులు తారసపడిన ముఖం చాటేస్తుంటారు చాలామంది. కానీ ఈ జంట ఎప్పుడో చేసిన వైద్యుడి సాయాన్ని గుర్తించుకోవడం కాదు, అతడు తారసపడిన వెంటనే చేసిన పనికి ఆ డాక్టర్ సైతం కంగుతిన్నాడు, ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఆ వైద్యుడు నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..ఆఫ్రికన్ డాక్టర్ ఇద్రిస్ తాహిర్కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. ఆ సాయంత్రం ఒక రెస్టారెంట్లో చేసిన భోజనం తానొక గొప్ప జ్ఞాపకంగా మిగలనుందని అతడి ఆ సమయంలో తెలియదు. ఒక రోజు సాయంత్రం డాక్టర్ ఇంద్రిస్ ఒక రెస్టారెంట్లో డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ డైనింగ్ టేబుల మీద ఇద్దరు బ్యూటివఫుల్ ట్విన్స్తో ఉన్న జంటను చూస్తాడు. ఆ కవలలను చూసి ఆ వైద్యుడుకి చాలా ముచ్చటేస్తుంది. ఆ తర్వాత వాళ్లంతా తమకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినడం జరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడు డిన్నర్ పూర్తి అవ్వగానే బిల్లు పే చేద్దామని వెళ్తుండగా కవలల తండ్రి ఆపి తాను బిల్లు పే చేశానని చెబుతాడు. దాంతో తాహిర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఎవరతను తన బిల్లు ఎందుకు కట్టాడని కన్ఫ్యూజన్లో ఉండగా..ఆ జంట డాక్టర్ గారు..మీరు మమల్ని గుర్తుపట్టలేదని అర్థమైంది. ఐదు నెలలు క్రితం తాను తన భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చామని, అక్కడ తన భార్యకు కవలలను ప్రసవించేలా సాయం చేసింది మీరేనని వివరిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ డాక్టర్కి ఏం మాట్లాడలేక ఆ దంపతులు చూపిన కృతజ్ఞతకు ఆనందంతో తడిసి ముద్దవుతాడు. అస్సలు ఈ సాయంత్రం డిన్నర్ ఇంతలా తన జీవితంలో ఓ గొప్ప మరుపురాని జ్ఞాపకంగా ఉంటుందని ఊహించలేదు అంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నెటిజన్లు సైతం వృత్తిలో ఆ డాక్టర్ చూపిస్తున్న నిబద్ధతకు అంతా ప్రశంసించడమే కాదు..సేవకు దక్కుతున్న గౌరవం అది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. I saw a couple at a restaurant with their beautiful twins. Just as I was about to pay my bill, the husband insisted he’d already taken care of it. He said, “You probably won’t recognize me, but you’re the one who operated on my wife five months ago, those are the twins you…— Idris Tahir (@Idrees_taheer) February 1, 2026 (చదవండి: ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..) -
Budget 2026 : సోషల్ మీడియాలో మీమ్స్ పండగ
ఫిబ్రవరి 1 ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 చాలామందిని నిరాశపర్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదో యూనియన్ బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, ప్రతిపక్ష నాయకులు, ఇతర పలువురు రాజనీయ నాయకులు, ఆర్థిక వేత్తలు మాత్రం సామాన్యులకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అటు సోషల్మీడియాలోవ్యంగ్యోక్తులు, విమర్శలు వెల్లువెత్తాయి.నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్ ముగిసిన వెంటనే, టాక్స్ విధానంలో ఎలాంటి ఉపశమనం రాకపోవడంతో సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్ వెల్లువెత్తాయి.సెలబ్రిటీలు, వేతన జీవులు మధ్యతరగతి ఆందోళనల వరకు ఫన్నీ, క్రియేటివ్ మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియోసీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ఉద్దేశించి, "ఫిబ్రవరి నెల మొత్తం మూడ్ ఒకే మహిళపై ఆధారపడి ఉంటుంది" అని ఒక మీమ్ పేర్కొనగా, మరో మీమ్లో, "మీ ఫండ్ నుండి కొంచెం డబ్బు వస్తే చాలా బాగుంటుంది" అంటూ ఇంకో మీమ్ను చూడవచ్చు. బడ్జెట్ 2026 అసలీ జాంజ్..పర్సు బరువు, సహనానికి పరీక్ష, మీమ్స్ పండుగ". అనే మరో ఫన్నీ మీమ్ కూడా ఉంది.మరోవైపు తాజా బడ్జెట్పై బెంగాల్ సీఎం మమతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్, జైరాం రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం పారదర్శకంగా లేదని, కీలక కార్యక్రమాలు , పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు.మరో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల కోసం కాదని, పెద్ద కార్పొరేట్ల కోసం అని, ఇందులో ఏమీ లేనప్పుడు ప్రజలు దీనిని ఎలా స్వాగతించగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఏమీ లేదు. ఇది పూర్తిగా డొల్ల అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీBudget Memes - A thread 🧵 Nirmala Sitharaman to Middle Class people pic.twitter.com/XOl1QDWCOO— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025కేంద్ర బడ్జెట్ 2026ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 11.2 లక్షల కోట్ల నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం లక్ష్యాన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. టైర్-2 , టైర్-3 నగరాలతో సహా దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆమె అనేక చర్యలను కూడా ప్రకటించిన సంగతి విదితమే.BCOM students trying to understand the budget pic.twitter.com/JpUTLsVEoV— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025Government to salaried people during every budget#Budget2025 pic.twitter.com/VnfvuKYolM— Finance Memes (@Qid_Memez) February 1, 2025 -
ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..
కొన్ని ఘటనలు ఎంతో ఆలోచించేలా చేస్తాయి. కొత్త స్ఫూర్తిని నింపుతాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తే మనం, ఇలాంటి బామ్మను చూసి ఎంతో ప్రేరణ పొందుతాం. కష్టం ఏదైతేనేం..దాన్ని అధిగమించేలా నవ్వుతూ మనపని మనం ఎలా చేసుకుంటూ పోవాలో ఈ బామ్మని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మగౌరవం అనే మాటకు అసలైన అర్థంలా అనిపిస్తుంది ఈ బామ్మ జీవన విధానం..ఆ బామ్మ పేరు 89 ఏళ్ల కమలాబెన్ మెహతా. ముంబై లోకల్ రైళ్లలో నిశబ్దంగా బ్రాస్లెట్లు అమ్ముతు ఉంటుందామె. ఆమెను చూడగానే ఈ వయసులో ఇంతలా కష్టపడుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమె ఎవరి నుంచి సానుభూతిని, దాతృత్వాన్ని ఆశించకుండా కష్టపడుతున్న తీరు నిజంగా మనసుని కదిలిస్తుంది. చనిపోయేదాక ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బతకడం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఆ బామ్మని చూస్తే. అందుకు సంబంధించిన పోస్ట్ని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఆమెతో మాటలు కలపగా తనపేరు కమలాబెన్ అని, తన వయసు 89 ఏళ్లని ఆ బామ్మ చెప్పిందని పోస్ట్లో పేర్కొన్నాడు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి తన వంతుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలపింది. తాను ముంబైలోని నలసోపారాలో నివశిస్తున్నట్లు పేర్కొంది. ఆమెకు సాయం చేయాలని.. తన దగ్గరున్న బ్రాస్లెట్లు కొందామనుకున్నా.. అంత మొత్తం లేకపోవడంతో ఆ బామ్మ ఇంటి అడ్రస్ అడగగా, ఆమె అందుకు నిరాకరించింది. పైగా తన కుటుంబ తన వల్ల అవమానపాలు కాకూడదు అంటూ అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించిందని పోస్లో రాసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు. నిజానికి ఆ వయసులో ఈ బామ్మ ఏ రకంగానైనా సంపాదించొచ్చు. కానీ తన ఆత్మగౌరవం కోసం శరీరం సహకరించి వృద్ధాప్యంలో కూడా అచంచలమైన పట్టుదలతో చేతితో తయారు చేసిన బ్రాస్లెట్లు అమ్ముతూ సంపాదించాలనుకోవడం నిజంగా ప్రశంసనీయం..స్ఫూర్తిదాయకం. చివరి క్షణం వరకు తలెత్తుకునే బతకాలి కానీ, చేయిచాచి కాదు అని చెంపపగిలేట్టు సమాధానమిచ్చే ఘటన ఇది. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Meeta Tushit Shah (@meetatushitshah) (చదవండి: అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా ఐదు హిమాలయాలు..) -
దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియో
ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, జీవితంలో వర్తమాన క్షణాలను ఆస్వాదించడానికి వయసుతో పనేముంది. సమయం, సందర్భం కలిసి వస్తే మనసు నాట్యమయూరే అవుతుంది. ఇక నాట్యంలో ఆరితేరిన వారైతే.. ఇక చెప్పేదేముంది ఉరిమే ఉత్సాహంతో ఉర్రూతలూగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా ఈ వీడియోను చూస్తే ఎంతటివరైనా కాలు కదపాల్సిందే.. పక్కా.! ఆ సోషల్ మీడియా సెన్సేషన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్. వయసు 70 ఏళ్లు అయితేనేం అందమైన డ్యాన్స్తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన కరియర్లో ఐకానిక్ సాంగ్ ‘రంభా హో హో హో’ పాటకు అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. తాజాగా ఈ పాటను దురంధర్లో వాడుకోవడంతో మరింత ఇంట్రస్టింగ్మారింది. దురంధర్ సినిమా అటు కలెక్షన్లనుంచి ఇటు వివాదాల కారనంగా అనేక కారణాలతో వార్తల్లో నిలిచింది. ఐకానిక్ రెట్రో పాట 'రంభ హో' వాడుకోవడం వాటిలో ఒకటి.1981లో వచ్చిన 'అర్మాన్' చిత్రంలో ఈ పాటలో నటించిన సీనియర్ నటి కల్పనా అయ్యర్, దాదాపు 40 ఏళ్ల తరువాత ఆ మ్యాజిక్ను పునఃసృష్టించారు. దీంతొ అభిమానులు నాస్టాల్జియాతో పులకరించారు. స్వయంగా కల్పనా తన ఇన్స్టాఖాతాలో శుక్రవారం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా అన్నారు. “ఒక స్నేహితురాలు నాకు ఈ క్లిప్ను పంపింది, ఇది నిన్న రాత్రిది, ఇలా చేశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు. ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. సిద్ధాంత్ పెళ్లి.” అని ఆమె పేర్కొన్నారు. నలుపు-బంగారు బ్లౌజ్ ఊదా రంగు పట్టు చీరలో ఆమె స్టెప్పులుకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కల్పనా అయ్యర్పై ప్రశంసల జల్లుకురుస్తోంది ఎవరీ కల్పనా అయ్యర్బాలీవుడ్లో విలన్ పాత్రలకు, ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రంలో తన నటనకు బాగా గుర్తుండిపోయే కల్పనా అయ్యర్, మిస్ ఇండియా 1978 పోటీలో మొదటి రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ 1978లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఎక్కువగా బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలను పోషించారు. 1980 నాటి 'ప్యారా దుష్మన్' చిత్రంలోని "హరి ఓం హరి", ఆ తర్వాత 1981లో 'అర్మాన్' చిత్రంలోని "రంభ హో" వంటి జనాదరణ పొందిన డ్యాన్స్ నంబర్లతో డ్యాన్సింగ్ క్వీన్గా పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by striloka (@strilokaa) -
తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..
ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.అందుకు సంబంధించిన వీడియోని జితేందర్ సారస్వత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్ని ఓ చిన్న కీప్యాడ్ఫోన్లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫోన్ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్ని చూసి చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Jitendar Sarswat (@sarswatjitendar) (చదవండి: హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్గా పోస్ట్) -
ఇదేం జంతువురా బాబూ!
ప్లాటిపస్ అనే జంతువు ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన జంతువుల్లో ఒకటి. ఇది గుడ్లు పెడుతుంది, తన పిల్లల కోసం పాలు ఉత్పత్తి చేస్తుంది, నీటిలో విద్యుత్ సంకేతాలను గుర్తించగలదు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అంతే కాదు, అల్ట్రావయలెట్ కాంతిలో ఇది వెలుగుతుంది కూడా!ప్లాటిపస్లు ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న నదులు, వాగుల్లో నివసిస్తాయి. వీటిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇవి విషం కలిగిన స్తన్యజంతువులు కావడం. సాధారణంగా మనం విషం అంటే పాములు, తేళ్లను గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ మగ ప్లాటిపస్ కూడా విషాన్ని కలిగి ఉంటుంది.మగ ప్లాటిపస్ల వెనుక కాళ్ల దగ్గర పదునైన ముళ్లు ఉంటాయి. ఆడవాటితో జతకట్టే కాలంలో, ఈ ముళ్లు విష గ్రంథులతో కలుస్తాయి. అప్పుడు అవి చాలా శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తాయి. శాస్త్రవేత్తలు ఈ విషంలో కనీసం 19 రకాల ప్రత్యేక రసాయనాలు (పెప్టైడ్లు) ఉన్నాయని కనుగొన్నారు. కొన్ని రసాయనాలైతే ప్రపంచంలో మరే జంతువులోనూ లేవు. ఈ విషం మనుషులకు ప్రాణాంతకం కాదు. కానీ చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ప్లాటిపస్ విషానికి గురైనవారు ‘ఎముక విరిగిన దానికంటే కంటే ఎక్కువ నొప్పి’ అని చెబుతారు. కొన్నిసార్లు ఆ నొప్పి వారాల పాటు లేదా నెలల పాటు కొనసాగుతుంది. దీనికి ఇప్పటివరకు ప్రత్యేక విరుగుడు మందు (యాంటీ వెనమ్) లేదు. ఈ విషం భవిష్యత్తులో మనుషులకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని ద్వారా కొత్త నొప్పి నివారణ మందులు, డయాబెటిస్ మందుల తయారీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.ఇదీ చదవండి: హైఎండ్ కార్లు,చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య? -
ఎప్స్టీన్ ఫైల్స్లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
సంచలనం ఎప్స్టీన్ ఫైల్స్లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి మారు మోగుతోంది.దీనికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ కొత్త ఫైళ్లను వెలికి తీసింది. ఎలోన్ మస్క్ జెఫ్రీ ఎఎప్స్టీన్ మధ్య ఈమెయిల్ మార్పిడి జరిగినట్టు చెబుతోంది. 2012- 2013లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు మస్క్ను ఆహ్వానించినట్లు ఈ మెయిళ్ల సారాంశం. దాదాపు 30 లక్షలకు పైగా కొత్త పేజీల ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసింది. అయితే ఎప్స్టీన్ ద్వీపానికి తనను రమ్మని ఆహ్వానించి నప్పటికీ, తానెప్పుడూ వెళ్లలేదని గతంలోనే మస్క్ ఖండించాడు.తాజాగా విడుదలైన US న్యాయ శాఖ పత్రం, మస్క్ జెఫ్రీ మధ్య ఈమెయిల్స్ ద్వారా చాలా పెద్ద చర్చే జరిగినట్టు గుర్తించింది. ఎప్స్టీన్ ఐలాండ్కు మస్క్ణు ఆహ్వానించినట్టు, మస్క్ అక్కడి వెళ్లినట్టుగా వాదిస్తోంది. వీటిలో షెడ్యూల్ తేదీలు, లాజిస్టిక్స్, ఇతర ప్లాన్స్ ఉన్నాయిన వాదిస్తోంది. 2012 క్రిస్మస్ నాటి ఇమెయిల్లో, తన ద్వీపాన్ని సందర్శించమని మస్క్ను ఆహ్వానించాడు ఎప్స్టీన్. అయితే, మస్క్ వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మరోసారి ఈ వార్తలు నెట్టింట చర్చకు దారి తీశాయి. అయితే ఎప్స్టీన్ ఆఫర్ను మస్క్ తిరస్కరించాడు. దీనికి ప్రతిస్పందనగా, ఎప్స్టీన్ మస్క్ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని, గర్ల్ఫ్రెండ్తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో మరో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత, ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్ను అడుగుతూ ఒక ప్రత్యేక ఇమెయిల్లో పంపాడు. “మీరు హెలికాప్టర్ ద్వీపానికి ఎంత మంది ఉంటారు?”మరుసటి రోజు ప్రతిస్పందనగా, మస్క్ ఇలా వ్రాశాడు, “బహుశా తాలూలా,తాను మాత్రమేనని, మీ ద్వీపంలో పగలు/రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ అడిగాడు. ఆ తరువాత 1-8వ తేదీ వరకు ఏ రోజునా, ఎపుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని మరో ఈయిల్ పంపాడు.కరేబియన్ పర్యటనలోమస్క్ ఇక్కడికి వెళ్లి ఉంటాడని భావించే2013 ఇమెయిల్ మార్పిడి కూడా ఫైల్లో ఉంది. “సెలవులలో BVI/సెయింట్ బార్ట్స్ ప్రాంతంలో ఉంటాను. సందర్శించడానికి మంచి సమయం ఉందా?” మస్క్ 2013, డిసెంబర్ 13 నాటి ఇమెయిల్లో రాశారు. ఇలా పలు దఫాలుగా మారి మధ్య ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిగిందని చెబుతోంది. కానీ మస్క్ ఎపుడు అక్కడికి వెళ్లాడు అనేదానిపై రికార్డులు స్పష్టమైన ధృవీకరణ లేదు.ఎప్స్టీన్తో మస్క్ ఈమెయిళ్ళ వార్త వెలువడిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బిలియనీర్లు బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం. ఉన్నత స్థాయి ఆర్థికవేత్తను కలవమని అడగడం నేరం కాదు. మస్క్ గతంలోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఈ ఫైల్స్లో లక్షలాది ఈమెయిళ్ళు ఉన్నాయి, ఒకరి ఇన్బాక్స్లో పేరు ఉన్నంత మాత్రాన వారి నేరంలో భాగస్వాములైనట్లు కాదు. ఇది కేవలం మస్క్ను వేధించడానికి చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే అని ఒకరువ్యాఖ్యానించారు. అప్పట్లో ఎప్స్టీన్కు ఈమెయిల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్భం ముఖ్యం. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి సంభాషణలను పరగణనలోకి తీసుకోవాలని మరొకరు రాశారు. తాను ఎప్స్టీన్తో సంభాషించలేదని మస్క్ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి ఎప్స్టీన్ నిర్వహించిన అనేక 'లంచ్లకు' వెళ్లాడు. తలులా రిలే ఒకసారి ఎప్స్టీన్ న్యూయార్క్ సిటీ పెంట్హౌస్ను సందర్శించాడు. ఈ విషయం తలులా ఎక్స్లో ఇప్పటికీ ఉన్న ఒక పోస్ట్లో పేర్కొన్నారు. కూడా అని మరొకరు అభిప్రాయ పడ్డారు. -
ఎర్ర రంగు ఏందయ్యా డిఎస్పీ?
తలలో తెల్లవెంట్రుకలను కవర్ చేయడానికి కలర్ వేయడం ఇప్పుడు కామనైపోయింది. తెల్లబడిన జట్టును నల్లగా మార్చడానికి ఎక్కువ మంది హెయిర్డై పెట్టుకుంటారు. మరికొందరు గోరింటాకు పేస్టు కూడా తలకు అప్లై చేస్తుంటారు. కాస్త భిన్నంగా కనిపించాలని తాపత్రయపడేవారు రకరకాల రంగులు ట్రై చేస్తుంటారు. ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఇలాగే చేసి చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఎవరాయన?రష్మి రంజన్ దాస్.. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్నారు. 49 ఏళ్ల రంజన్ దాస్కు స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరుంది. అసాంఘిక శక్తులపై ఆయన కఠినంగా వ్యవహరిస్తారని అంతా అనుకుంటూ ఉంటారు. బుధవారం నాడు (జనవరి 28) ఆయన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ (Viral) అయింది. ఈ ఫొటోలో తలకు ఎర్రరంగుతో ఆయన డిఫరెంట్గా కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్, జోక్స్ (Jokes) పోటెత్తాయి. ఫలితంగా ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు.పోలీసు విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు యూనిఫాంను గౌరవించాలని.. క్రమశిక్షణ, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రష్మి రంజన్ దాస్ వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్య తీసుకున్నట్టు తెలిపారు. హ్యుమన్రైట్స్ ప్రొటెక్షన్ సెల్కు దాస్ను ఎటాచ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడడానికి దాస్ నిరాకరించారు.ముందే హెచ్చరించినా..తలకు ఎరుపు రంగు తీసివేయాలని గతంలోనూ ఉన్నతాధికారులు అనధికారికంగా దాస్ను హెచ్చరించినట్టు సహచర ఉద్యోగులు తెలిపారు. పై అధికారుల మాటలను అతడు ఖాతరు చేయకపోవడంతో తాజాగా చర్య తీసుకున్నట్టు చెప్పారు. పోలీసు మాన్యువల్లో(Police Manual) హెయిర్ స్టైల్స్కు సంబంధించి స్పష్టమైన నియమాలు లేనప్పటికీ.. గౌరవ భావం కలిగేలా క్రమశిక్షణగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తానికి దాస్ వివాదంతో.. క్రమశిక్షణ, హుందాతనం విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే సహించబోమని సందేశాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చారు.చదవండి: ఏసీబీలో పనిచేస్తూనే.. రూ.20 కోట్లు పోగేశాడు -
వీడియో వైరల్: మంచుకొండల్లో అరుదైన క్షణాలు..
ఒక మంచు చిరుత (Panthera uncia) చేసిన అరుదైన వేట దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిమాచల్ ప్రదేశ్లోని కిబ్బర్ గ్రామంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రెస్ నోవాలెస్ తన కెమెరాలో బంధించారు. భారీ హిమపాతం తర్వాత ఆకాశం నిర్మలంగా మారిన సమయంలో కిబ్బర్ లోయ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఓ మంచు చిరుత తన రెండు పిల్లలను లోయ కింద వదిలిపెట్టి.. ఒంటరిగా కొండ పైకి వెళ్లి అక్కడ మేత మేస్తున్న ఐబెక్స్(అడవి మేక జాతి) మందపై దాడి చేసింది. ఒక పెద్ద ఐబెక్స్ను లక్ష్యంగా చేసుకుని దానిపైకి దూకింది. ఐబెక్స్ తనను తాను రక్షించుకోవడానికి అత్యంత వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో రెండు జంతువుల మధ్య పెనుగులాట జరిగింది. ఒక దశలో రెండు జంతువులు లోయ అంచున మృత్యువుకు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే, సరిగ్గా ఆ సమయంలో చిరుత పట్టు సడలడంతో.. ఐబెక్స్ చాకచక్యంగా దిశ మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుంది.ఆండ్రెస్ నోవాలెస్ ఈ అనుభవాన్ని పంచుకుంటూ.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. హిమాలయాల్లో మనుగడ సాగించడం ఎంత కఠినమో, ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇది అద్భుతం.. ప్రకృతి అసలైన రూపం ఇది" అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Andres Novales (@andresnovales_wildlife) -
హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..!
లైఫ్లో ఒకానొక టైంలో కష్టపడకపోతే..మనల్ని ఎవ్వరు రక్షించలేరు అన్నది జగమెరిగిన సత్యం. మన పెద్దలు కూడా వయసులో ఉన్నప్పడు ఏదైనా సంపాదించగలం, ఆ తర్వాత మనతరం కాదు అని అంటుంటారు. అలాగే కష్టబడి డిగ్రీలు చదివి..ఉద్యోగం సంపాదించక హమ్మయ్యా అనేస్తాం. కానీ అక్కడి నుంచే మన అభివృద్ధి, ఎదుగుదల మొదలవ్వుతుంది. అలాకాకుండా..చతికిలపడితే అంతే పరిస్థితి అంటూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక ఆలోచింపచేసేలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.26 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగి నందిని శర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గొప్ప కెరీర్ పాఠాన్ని షేర్ చేశారు. టీనేజ్ చివరలో.. 20ల ప్రారంభంలో ఉన్నవారికి ఉపయోగపడే అధ్బుతమైన కెరీర్ సలహాలను ఇచ్చారామె. కార్పోరేట్ లైఫ్ వాస్తవికంగా ఎలా ఉంటుందనేది ఒక్క మాటలో చెప్పేశారామె. కెరీర్ ప్రారంభ సవంత్సరాల్లో అందరి దృష్టి డబ్బు పైనే ఫోకస్ ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా విజయపరంపరతో జాబ్లో దూసుకోవడం అనేది ఎప్పటికీ శక్తిమంతమైనదని నొక్కి చెప్పారు. అది ఇరవైలలోనే సాధ్యమని అప్పుడే మంచిప్రయోజనం పొందగలమని అన్నారు. ఎందుకంటే అప్పటికీ ఎలాంటి కుటుంబ ఒత్తిళ్లు, బాధ్యతలు ఉండవు, పైగా వారివద్ద చాలా సమయం ఉంటుంది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యక్తిగత డెవలప్మెంట్పై ఫోకస్ పెడితే రానురాను కష్టం అనే మాటే ఉండదని అన్నారు. ఇలాంటి ధోరణితో ఉంటే గనుక రిస్క్ తీసుకునేందుకు భయపడరు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మనం ఫ్రీగా ఉన్న టైంలోనే కష్టపడేందుకు ఆసక్తి చూపాలి..అప్పుడే మన కెరీర్ ఉన్నతంగా ఉంటుంది..అలాగే ఈ కార్పొరేట్ లైఫ్లో మన మనుగడ సాధ్యమని నొక్కి చెప్పారామె. లేదంటే మనల్ని కాపాడే వారెవ్వరూ లేరు అని గుర్తించుకోండి అని అన్నారామె. తాను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నప్పటికీ..తన కెరీర్, ఫిట్నెస్ లక్ష్యాలు, సాధించాల్సిన ఆశయాలను ఎప్పటికీ గుర్తించుకుంటానని అన్నారు. అంతేగాదు తన విజయవంతమైన కెరీర్ జర్నీని డాక్యమెంట్ చేయాలని భావిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఐటీలో పనిచేస్తూ కెరీర్పై ఎన్నో కలలతో ఉన్నవాళ్లకు ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ తన పోస్ట్ని ముగించారు శర్మ. కష్టే ఫలి అంటే ఇదేగదూ.! అంతేగాదు నెటిజన్లు సైతం ఇది ముమ్మాటికీ నిజం. ఎవ్వరికీ మన సమస్యను పట్టించుకునేంత సమయం లేదు. అందరూ వారివారి సమస్యలతో వాళ్లు బిజీగా ఉన్నారని కొందరూ. మరికొందరూ డెవలప్మెంట్ అనేది ఉద్యోగ ఆఫర్తో ముగిసిపోదని అక్కడ నుంచే ప్రారంభమని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.I'm 26 and i work at @Microsoft .if you're in your late teens or early 20s, here are a few things i wish someone told me earlier:1. Hard work compound - espcially early.People talk a lot about money compounding, but effort compounds too. But Consistency changed…— Nandani S (@TheDebugDiva) January 28, 2026 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?) -
‘కుక్కను చూసినా వదిలిపెట్టడు’
‘‘వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు అని నాకు అర్థమైంది’ అంటూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ని ఉద్దేశించి కూటమి నేత ఒకరు చేసిన వ్యాఖ్య నెట్టింట వాయిస్ కాల్ రూపంలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిని ఒకరిని శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పేరిట వాయిస్ కాల్ ఒకటి గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాధితురాలితో మాట్లాడినట్టు ఉన్న ఆ కాల్లో ‘‘మీరేదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నాతో చెప్పండి. నేను మాట్లాడుతాను. శ్రీధర్కు చపలత్వం ఎక్కువ. రాంగ్ట్రాక్లో పోతున్నాడు. మనోడు ఇన్స్టాలో వచ్చిన మెసేజ్లకూ తప్పుగా స్పందించాడు. పిల్ల చేష్టలు. వాళ్ల పెద్దోళ్లకు కూడా నీ గురించి చెప్పా. మీవాడికి చపలత్వం ఎక్కువుంది జాగ్రత్త అని చెప్పా..’’ అంటూ తాతంశెట్టి బాధితురాలికి సర్దిచెప్పారు.దీనికి బాధితురాలు దీటుగా బదులివ్వడంతో ‘‘వీడు(శ్రీధర్) కుక్కను చూసినా వదిలి పెట్టడు అని నాకు అర్థమైంది’’ అంటూ ఫోన్ పెట్టేశారు. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన క్లిప్ తెగ వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు..వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని బాధితురాలు చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ::: సాక్షి, రైల్వే కోడూరు -
వింటర్ వండర్ గడ్డకట్టిన నయాగరా, వైరల్ వీడియోలు
ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటైన నయాగరా జలపాతం కారణంగా గడ్డకట్టింది. పోలార్ వోర్టెక్స్ వద్ద ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోవడంతో నయాగరాజలపాతం ఫ్రీజ్ మోడ్లోకి జారిపోయింది. దీంతో టూరిస్టులు, స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.గడ్డకట్టిన నయాగరా జలపాతానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెయిలింగ్లు, నదీ తీరాలకు అతుక్కుపోయిన మందంగా మంచు పేరుకుపోయినప్పటికీ జలపాతాల హోరు మాత్రం ఆగలేదు.నయాగరా జలపాతం గడ్డకట్టి, అద్భుతమైన దృశ్యాలతో అలరారుతోంది. నయాగరా నది అంచుల దగ్గర పాక్షికంగా గడ్డకట్టినట్లు కనిపిస్తుంది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ లక్షలాది లీటర్ల నీరు జలపాతంపై ప్రవహిస్తుంది.ప్రతి సెకనుకు లక్షలాది లీటర్ల నీరు అంచుల నుండి ఉరుములు మెరుపులతో ఉప్పొంగుతూనే ఉంది. శీతలగాలులు, పొగమంచుకి విరుద్ధంగా, ప్రవహించే నీరు, ఘనీభవించిన ఉపరితలాలు పక్కపక్కనే వీడియోలు నెట్టింట సందడిగామారాయి.సాధారణంగా, శీతాకాలంలో కూడా జలపాతం నుండి వచ్చే పొగమంచు కొద్దిసేపు ద్రవంగా ఉంటుంది. అయితే సూపర్-కూల్డ్ గాలి పొగమంచులోని నీటి బిందువులు చల్లని ఉపరితలాలను తాకిన క్షణంలో సంభిస్తోంది. గంటలు ,రోజులలో, మంచు నెమ్మదిగా రాళ్ళు, చెట్లు, నడక మార్గాలు , పరిశీలనా కేంద్రాల వెంట మందపాటి క్రస్ట్లు, శిల్పకళా కళాకృతులు దర్శనిమిచ్చాయి. ఫలితంగా అరుదైన దృశ్య విరుద్ధంగా కనిపిస్తుంది.కింద గర్జించే నీరు, పైన నిశ్శబ్దంగా, గడ్డకట్టిన ప్రపంచం.ఈ వింటర్ వండర్ను చూసి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానికులు , సందర్శకులు ఈ దృశ్యాన్ని "మరోప్రపంచం"గా అభివర్ణించారు.❄️| Extreme cold freezes the iconic Niagara Falls.pic.twitter.com/oyCw7mlTCe— Earth (@earthcurated) January 26, 2026 నయాగరా జలపాతం ఎప్పుడూ ఘనీభవించదు, ఆర్కిటిక్ గాలులు, విపరీతమైన చలి ఈ ప్రభావాన్ని పెంచుతుంది. శక్తివంతమైన పోలార్ వెర్టిక్స్ చుట్టు పక్కల ప్రాంతాలపై తక్షణమే మంచు వేగంగా పేరుకు పోయేలా చేస్తుంది. దీంతో ఈ దృశ్యం ఫోటోగ్రాఫర్లు , వింటర్ టూరిస్టులను కనివిందు చేస్తోంది. View this post on Instagram A post shared by Erhun Abbasli (@erhunabbasli) -
సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ ‘అప్స్క్రోల్డ్’ అసలేంటిది?
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న యాప్ అప్స్క్రోల్డ్ (UpScrolled) ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్,టిక్టాక్లాంటి యాప్లకు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతోంది. అసలేంటీ అప్స్క్రోల్డ్, ఎందుకు పాపులర్ అవుతోంది? తెలుసుకుందాం.ఎటాంటి సెన్సార్షిప్ లేదా దూకుడు అల్గారిథమ్లు లేని సురక్షితమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రకటించుకుంటోంది యాజమాన్యం. యూజర్ డేటాను థర్డ్ పార్టీలకు అమ్మబోమని హామీ ఇస్తోంది. దీంతో యాక్టివిస్టులు, రాజకీయవేత్తలు సహా పలువురు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. టాప్లో దూకుడు, ఏకంగా సర్వర్లు క్రాష్ఆపిల్(iOS) యాండ్రాయిడ్ యాప్ స్టోర్లో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్గా ఇది నిలిచింది. జనవరి 2026 నాటికి, అమెరికాలో ఈ యాప్ ఆపిల్ యాప్ స్టోర్లో టాప్-10 లోకి చేరింది. టిక్టాక్ , మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) లపై అసంతృప్తిగా ఉన్న యాక్టివిస్టులు, క్రియేటర్లు ఈ ప్లాట్ఫారమ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సార్షిప్లేని కంటెంట్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. పారదర్శకత ,న్యాయమైన కంటెంట్ను అందించే ప్లాట్పాం ప్రత్యామ్నాయాలన కోసం చూస్తున్నారు.ఆపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో టిక్టాక్ను దాటేసింది. అంతేకాదు డౌన్లోడ్ల తాకిడికి జనవరి 26 న ప్లాట్ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. టిక్టాక్ ప్లాట్ఫామ్ యాజమాన్య మార్పు తర్వాత సెన్సార్షిప్ ఆరోపణల మధ్య టిక్టాక్ను వదిలివేసి అప్స్క్రోల్డ్కు మారిపోతున్నారు.అప్స్క్రోల్డ్ ఎక్కడిది?ఆస్ట్రేలియాకు చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్. దీనిని పాలస్తీనా-ఆస్ట్రేలియన్ డెవలపర్ ఇస్సాం హిజాజీ (Issam Hijazi) 2025,జూన్లో ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో టిక్టాక్ యాజమాన్య మార్పుల నేపథ్యంలో, చాలామంది యూజర్లు ఈ యాప్ వైపు మళ్లుతున్నారు. దీని ‘‘ఎబౌట్" పేజీ ప్రకారం, పక్షపాతం, షాడోబ్యానింగ్ లేదా "అన్యాయమైన" అల్గారిథమ్ల ప్రమాదం లేకుండా యూజర్లందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి అనుమతించడమే అప్స్క్రోల్డ్ లక్ష్యం.కంపెనీ తమ మార్గదర్శకాలనుఉల్లంఘించే కంటెంట్ను మాత్రమే పరిమితం చేస్తుందట. అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, అశ్లీలం, లైసెన్స్ లేని కాపీరైట్ కంటెంట్ లేదా "హాని కలిగించడానికి ఉద్దేశించినది". UpScrolled కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిషేధించదని అని కూడా చెపుతోంది. ప్లాట్ఫారమ్ ఉంచి వీడియోలను లేదా మీ ఖాతాను తొలగిస్తే, ఎందుకు తొలగించిందో కూడా వివరిస్తుంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పోలిస్తే దీని ప్రధానమైన తేడా దాని అల్గోరిథం. Discover Feedని ఉపయోగించవచ్చు డిస్కవర్ ఫీడ్, ఫాలోయింగ్ పీడ్ అని రెండు రకాలుగా యాప్ ఫీడ్లను విభజిస్తుంది. Following Feed అంటే మనం ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్లు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. Discover Feed అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న కంటెంట్ను చూడవచ్చు.ఇదీ చదవండి: కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యండిస్కవర్ ఫీడ్ అనేది వివిధ రకాల కంటెంట్ల మిశ్రమం, కానీ ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించిన కంటెంట్తో నిండిపోతోంది. వాస్తవానికి, ప్రధాన స్రవంతి సోషల్ మీడియా యాప్లు ఈ రకమైన పోస్ట్లను సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణలకు ప్రతిస్పందనగా, చాలా మంది వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ను పాలస్తీనాకు మద్దతు ఇచ్చే కంటెంట్ కోసం దీన్ని ఒక వేదికగా ఎంచుకుంటున్నారు. దీంతోపాటు క్రీడలు, వార్తలు, గేమ్లు, సినిమాలు, సంగీతం, టెక్నాలజీ , ట్రావెల్ వంటి అనేక విభిన్న రకాల కంటెంట్లను అందిస్తామని వెల్లడించింది. టిక్టాక్, ఇన్స్టాలా కాకుండా, Discover Feed కొన్ని దూకుడు, వ్యక్తిగతీకరించిన అల్గారిథమ్ను ఉపయోగించదు. దీనికి బదులుగా, ఇది లైక్లు, కామెంట్స్, షేర్స్ మీదధారపడి ఉంటుంది.ముఖ్యమైన ఫీచర్లుప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store, ఐఫోన్ (App Store) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇందులో ఫోటోలు, చిన్న వీడియోలు (Short-form videos) , టెక్స్ట్ పోస్ట్లను షేర్ చేయవచ్చు. స్నేహితులతో నేరుగా చాట్ చేసే సదుపాయం కూడా ఉంది. ప్రధాన సోషల్ మీడియా సంస్థలు కొన్ని రకాల కంటెంట్ను (ముఖ్యంగా రాజకీయ అంశాలను) సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, "సెన్సార్షిప్ లేని ప్లాట్ఫారమ్"గా తనను తాను ప్రకటించుకుంది.షాడో బ్యానింగ్ (Shadowbanning) అంటే యూజర్ల పోస్ట్లను రహస్యంగా అణచివేయడం ఉండదు. ఇతర యాప్లలాగా యూజర్లను అడిక్ట్ చేసే క్లిష్టమైన అల్గారిథమ్స్ కాకుండా, సాధారణమైన క్రోనలాజికల్ (సమయానుకూల) ఫీడ్ను ఇది అందిస్తుంది.అయితే ఇది తన సేవా నిబంధనలను దూకుడుగా కొత్త ట్రాకింగ్తో అప్డేట్ చేస్తోందని, కొన్ని కంటెంట్ రకాలను బ్లాక్ చేస్తోందని, కొత్త పోస్ట్లను "షాడోబ్యాన్" చేస్తోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్స్టాగ్రామ్లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!) -
తిరుమల లడ్డూపై ఆగని టీడీపీ పాపపు ప్రచారం
సాక్షి, విజయవాడ: సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర్ స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ‘‘మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు. దాంతోనే 20కోట్ల లడ్డూలు తయారు చేశారు. వైకాపా పెద్దలు రూ.251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు’’ అని వాటిపై పేర్కొన్నారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
ఎవరీ సోఫీ రెయిన్? కంటెంట్ క్రియేటర్గా అన్ని కోట్లా..!
కంటెంట్ క్రియేటర్గా చాలామంది రాణిస్తున్నారు. కొందరు వేలల్లో ఆర్జిస్తే..ఇంకొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ కోట్లలలో సంపాదించడం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. జస్ట్ కంటెంట్ క్రియేటర్గా ఆ రేంజ్లో సంపాదనా..!? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి తాను చెబుతోందంతా నిజం అంటూ ఏవిధంగా ఆమె ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లలో కోట్లలో ఆర్జిస్తోంది ఆధారాలతో సహా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించింది. ప్రముఖ అమెరికన్ ఓన్లీఫ్యాన్స్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోఫీ రెయిన్ వివిధ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ల ద్వారా సుమారు రూ. 930 కోట్లకు పైనే సంపాదిస్తున్నానని వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలతో సహా స్కీన్షాట్లతో చూపించింది. మొత్తంగా ఆల్టైమ్ ఆదాయం ఎంత ఉంటుందో స్క్రీన్ షీట్ తీసి మరి చూపించింది. తాను అబద్ధం చెప్పడం లేదని, ఈ విజయం అసాధారమైనది మాత్రం కాదని చెప్పుకొచ్చింది. సగటు కంటెంట్ క్రియేటర్ నెలకు దగ్గర దగ్గర రూ. 13 వేలుదాక సంపాదించగలడని..తాను మాత్రం వాళ్లందరికంటే అధిక మొత్తంలో ఆర్జిస్తున్నానని ధీమాగా చెబుతోంది. అందుకు అపారమైన లక్తోపాటు..లక్షలాది ఫాలోవర్స్ కూడా చాలా అవసరమని పేర్కొంది. 2024 ఏడాదికే తాను రూ. 359 కోట్లు దాక ఆర్జించినట్లు వెల్లడించింది. జస్ట్ ఆన్లైన్ వీడియోలతో స్టార్ జేసన్ టాటమ్ వంటి ప్రొఫెషనల్ అథ్లెట్ల వార్షిక జీతాలను అధిగమించింది. ఆమె తన ఆదాయంలో కొంత ప్రైవేట్ జెట్లు, కార్ల కోసం ఖర్చు చేసినా..కొంత భాగాన్ని మాత్రం తండ్రి అప్పులు తీర్చడానికి ఉపయోగించడం విశేషం. అయితే రెయిన్ 70% సంపాదనను పెట్టుబడుల్లో పెట్టినట్లు పేర్కొంది. ఎవరీమె..?సోఫీ రెయిన్ 21 ఏళ్ల అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , కంటెంట్ క్రియేటర్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల మీడియా అకౌంట్లతో బాగా గుర్తింపు దక్కించుకుంది. అక్కడ ఆమె తన తన సబ్స్క్రైబర్లతో ప్రత్యేకమైన కంటెంట్ను పంచుకుంటుంది. 2004లో ఫ్లోరిడాలోని మయామిలో జన్మించిన సోఫీ, ఓన్లీఫ్యాన్స్లో 11 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా, ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్ల మంది ఫాలోవర్లతో సహా బహుళ ప్లాట్ఫామ్లలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది.సోఫీ తన కెరీర్ని వెయిటర్గా ప్రారంభించింది, కానీ ఆమె బాస్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల్మీడియా ఖాతాల సాయంతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కంటెంట్ క్రియేటివిటీ, మాటల ఆకర్షణ సాయంతో ఎక్కువమంది సబ్స్కైబర్లను ఆకర్షించింది. ఆమె కంటెంట్ పరంగానే కాకుండా సన్నిహిత ఫోటోషూట్ల విషయంలోనూ అత్యంత కేర్ఫుల్గా ఉంటుందామె. ప్రస్తుతం ఆమె బాప్హౌస్ కలెక్టివ్ కంటెంట్ క్రియేటర్ వ్యవస్థాకురాలు కూడా. (చదవండి: 'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్ల పైబడ్డ కూడా..) -
'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్లు పైబడ్డ కూడా..
మనషుల ప్రవర్తనలు చాలామటుకు చుట్టూ ఉన్న మనుషులు లేదా అతడు పెరిగిన కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అది అతడి అభ్యున్నతికి ఉపకరించేలా ఉంటే పర్లేదు..తనేం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఉంటే చాలా సమస్యలు ఎదురవ్వుతాయి. ముఖ్యంగా మగపిల్లలను తల్లులు ఎంతలా గారాబం చేస్తుంటారంటే..వాళ్లేం చేసినా కరెక్ట్, ఆడపిల్ల వరకు వచ్చేటప్పటికీ..పరాయి ఇంటికి వెళ్లాల్సింది బాధ్యతతో వ్యవహరించాలన్నట్లుగా పెంచుతారు. బాధ్యతల విషయంలో ఇద్దరు సమానం అన్న ఆలోచన లేమి..ఎంతటి పరిస్థితికి దారితీస్తుందంటే..కట్టుకున్న భార్యతోపాటు, చుట్టు ఉన్నవాళ్లకు, అలాగే తనకు సమస్యగా మారిపోతాడు. మొగ్గగా ఉన్నప్పుడే ఆ ధోరణి సరవ్వాలి లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ఈ వృద్ధుడే ఉదాహరణ..ముంబై విమానాశ్రయంలో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా ఇలా వివరించింది. ఆ పోస్ట్లో ఎయిర్పోర్ట్లో ఓ 50 ఏళ్ల వ్యక్తి రెండు క్యూల వద్దకు వచ్చాడు. అవి ఎయిర్ ఇండియా, ఇండిగో కోసం ఉన్న క్యూలు. అయితే ఆ వ్యక్తి తప్పుగా క్యూలో నిలబడి ఉండటంతో..సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది ఆ క్యూ కాదు అని చెబుతున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అరవడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడున్న వాళ్లు ఏం మాట్లాడలేక అలా చూస్తుండిపోయారు. ఇంతలో అతడి కుటుంబం జోక్యం చేసుకుని అతడిని శాంత పరిచేంతవరకు అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించాడు. అదంతా చూశాక.. సదరు మహిళ ఇలాంటి మానసిక ప్రవర్తనను రాజా బేటా సిండ్రోమ్గా పేర్కొంది. ఇదేమి మానసిక రోగం కాదని, చిన్నప్పటి నుంచి తానేం చేసిన కరెక్ట్ అనే ధోరణిలో పెరిగిన వాళ్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారని, దీని కారణంగా చుట్టూ ఉన్నవాళ్లకు, తనకు సమస్యలు సృష్టిస్తారని అన్నారామె. దక్షిణాది కుటుంబాలలో ముఖ్యంగా పురుషలలో ఈ ధోరణి ఉంటుందని, అందుకు తల్లులు, వారి కుటుంబ ఆలోచన విధానమేనని అన్నారామె. అబ్బాయి కాస్త ఎక్కువ, అమ్మాయిలు కాస్త తక్కువ అనే భావజాలంతో ఉండే కుటుంబాలలో పురుషల మనస్తత్వం ఇలానే ఉంటుందని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రవర్తనను దూరం చేసుకోండి లేదంటే..నెమ్మదిగా ఒక సమయానికి మనుషులు దూరమైపోతారంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా తమ కుటుంబంలోని వ్యక్తులు గురించి వివరిస్తూ..తమ అనుభవాలను షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snowy Rahi | Therapist (@sitwith_rahi) (చదవండి: రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..! ఒంటరి తల్లి..) -
అక్క కోసమని వెళ్లి.. అనంతలోకాలకు!
అమెరికా లాంటి కొన్ని దేశాల్లో.. పిల్లలను స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు లేదంటే దింపేటప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు కొద్దిదూరం వెళ్లిన తర్వాతే వాహనాలు ముందుకు కదులుతాయి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్.. లేదంటే పోలీసు అవసరం ఉండదు. పిల్లల సేఫ్టీ అనేది అక్కడి ప్రజల జీవనశైలిలో ఇదొక భాగమైపోయింది. కానీ, మన దేశంలో.. !ముంబై నగరంలో అంతా చూస్తుండగానే ఘోరం జరిగింది. స్కూల్ బస్సు దిగిన ఓ చిన్నారిని ఆమె నాయనమ్మ రోడ్డు దాటిస్తున్న క్రమంలో.. బస్సు ముందుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ చేతిలో ఉన్న ఏడాది పసికందు ప్రాణం విడిచింది. ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళవారం మధ్యాహ్నాం ఖేట్వాడీ ఏరియాలోని గిర్గావ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రకళ అనే పెద్దావిడ తన ఏడాది మనవడిని చంకలో వేసుకుని.. స్కూల్ నుంచి వచ్చే మనవరాలిని ఇంటికి తెచ్చేందుకు వెళ్లింది. అయితే ముగ్గురూ బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్ అది గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీ కొట్టి ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి పక్కకు పడిపోగా.. చంద్రకళ, ఆమె ఏడాది మనవడి మీదుగా బస్సు వెళ్లింది. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది చిన్నారి అప్పటికే మరణించగా.. గాయపడిన చంద్రకళను ఆస్పత్రికి తరలించారు. డీబీ మార్గ్ పోలీసులు స్కూల్బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు కాగా.. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.मुंबई में स्कूली बस ने ही दो बच्चों और उनकीअभिभावक को कुचल दिया! एक बच्चे की मौत हो गई दूसरा घायल है। अभिभावक भी बस के नीचे आ गई और वो भी गंभीर रूप से घायल है। मैं जानता हूं कि ये भारत है अमेरिका नहीं लेकिन फिर भी ये लिख रहा हूं कि जब भी अमेरिका जाता हूं, देखता हूं और आप भी… pic.twitter.com/RHcmGOUmEp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 28, 2026 -
78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!
వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు లేదా జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సమస్యలు జఠిలంగానే ఉంటాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న పెద్దవాళ్లున్న కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధికా కారణాలు ఏమైనప్పటికీ తమ ఇంటిని, ఇంట్లోని వారిని మర్చిపోతూ ఉంటారు. మరికొంతమంది తమ జీవిత భాగస్వామిని కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉంటారు. అలా అల్జీమర్స్ బాధపడుతున్న 77 ఏళ్ల మైఖేల్ ఓ'రైలీ లవ్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది.సుమారు ఏడేళ్ల క్రింత ఓ'రైలీకి అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కష్టకాలంలో అతనికి అండగా నిలబడి, అతని బార్య ఫెల్డ్మాన్ దగ్గరుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటోంది. మైఖేల్ గడపదాటితే దారి మర్చిపోయేవాడు. చివరికి నిరంతరం తనకు సేవలందిస్తున్న భార్యను కూడా మర్చిపోయాడు. దీంతో ఓ'రైలీ 'ది ఐవీ' అనే సంరక్షణ కేంద్రంలో చేరాడు. ఫెల్డ్మాన్ తన భార్య అని మర్చిపోయాడు. కానీ విచిత్రంగా 39 ఏళ్ల తరువాత ఆమెతో మళ్లీ ప్రేమలో పడిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని లిండా ఫెల్డ్మన్ను ధైర్యంగా అడిగేశాడు. దీంతో ఆమె మారు మాట్లాడకుండానే ఓకే చెప్పేసింది.అక్కడి సిబ్బందికి మైఖేల్ లవ్ ప్రపోజల్ గురించి తెలిసింది. ఈ ప్రేమ జంటకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన పుట్టింది. జనవరి 10న, హోం సంరక్షకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ఆత్మీయ వేడుకలో, ది ఐవీఎట్ బర్కిలీలో వారిద్దరూ మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి ప్రేమ కథలే హృదయాలను మురిపిస్తాయి. నిజమైన ప్రేమ శాశ్వతం అనే నమ్మకాన్ని పుట్టిస్తాయి.వీరి ప్రేమ కథ న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరూ అలమెడ కౌంటీలో పబ్లిక్ డిఫెండర్లుగా పనిచేసేవారు. మంచి అటార్నీ వాదనలు చూడాలంటే, కచ్చితంగా మైఖేల్ను చూడాల్సిందే అన్న స్నేహితుల మాటలకు ప్రభావితమై అతణ్ణి కలిసింది. అద్భుతమైన లాయర్ అనుకొంది. అంతే అప్పటినుంచి మైఖేల్ ఫెల్డ్మన్కు గురువుగా మారాడు. అలా వీరి పరిచయం 1979 నాటికి గాఢమైన స్నేహంగా మారింది. అప్పటికి ఇద్దరికి వివాహాలు అయ్యాయి. ఓ'రైలీకి మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు, ఫెల్డ్మాన్కు ఒక కుమారుడు ఉన్నాడు. కొన్ని ఏళ్ల తర్వాత వారిద్దరూ తమ భాగస్వాముల నుండి విడాకులు తీసుకున్నారు.ఫెల్డ్మన్కు ఫోరెన్సిక్ పాథాలజీపై ఆసక్తి ఉందని గమనించ ఆ కోణంలో ఒక అవకాశాన్నిచ్చిన ఓ'రైలీ ఫెల్డ్మన్ను డేట్కు రమ్మని అడిగాడు. ఫెల్డ్మన్ తొలుత సంశయించినప్పటికీ, చివరికి ఒప్పుకుంది. అలా వారిద్దరూ శవపరీక్ష చూడటానికి వెళ్లి, ఆ తర్వాత డిన్నర్ డేట్కు వెళ్లారు. అక్కడ పరస్పరం చర్చించు కుని తమ పిల్లలతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రయాణం అంతా సాఫీగా సాగలేదు, వారి పిల్లలు వారి ప్రేమను అర్థం చేసు కోవడానికి ఇబ్బంది పడ్డారు. మొత్తానికి 1987లో తమ నివాసంలోని గదిలోనే ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వివాహం చేసుకున్నారు.తాను ఒక నాడీ సంబంధిత సమస్యలున్న చిన్న యూదు అమ్మాయినని, భర్త ఒక ఐరిష్ కాథలిక్ సాహస ప్రియుడని చెప్పింది. నాకు థియేటర్, ఆయనకు మ్యూజియంలంటే చాలా ఇష్టం అని గుర్తు చేసుకుంది ఫెల్డ్మన్కు. తనకు రివర్ రాఫ్టింగ్ వంటివి పరిచయం చేసింది తన భర్తేనని చెప్పింది. ఇద్దరికీ విభిన్న దిశలు అయినా కలిసి విస్తృతంగా ప్రయాణించారు. దేని గురించైనా మాట్లాడు కోవడం, ఒకర్ని మరొకరు గౌరవించుకునే లక్షణమే వారి బంధాన్ని సజీవంగా ఉంచిందనడంలో సందేహం లేదు.మరోవైపు ఫెల్డ్మాన్ తన భర్త గురించి మాట్లాడుతూ అల్జీమర్స్తో బాధపడుతున్న చాలామంది తమ జీవిత భాగస్వామిని కూడా గుర్తించలేరు. కానీఇపుడు తాను చాలా అదృష్టవంతురాలినని, ఎందుకుంటే తన భర్త అంతులేని ప్రేమతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టి, 'ఐ లవ్ యూ' అని చెబుతాడు అంటూ తెగ మురిసిపోయింది. -
అధిక ఆదాయం.. కానీ ఆనందం నిల్..!
అందరు లక్షల్లో ఆదాయం వస్తే ఎంత బాగుండును అనుకుంటుంటారు. అందుకోసం చిన్న పార్ట్టైం ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇంకొందరు ఏకంగా నెలకు లక్షల్లో సంపాదన ఉంటుంది. అయినా ఇంకా ఏదో వెలితి. సంపాదించింది ఏ మాత్రం అక్కరకు రాదు. అలాంటి బాధనే సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకున్నాడు ఓ చార్టడ్ అకౌంటెంట్. చార్టడ్ అకౌంటెట్ నితిని కౌశిక్ సోషల్ మీడియా ఎక్స్ పోస్టులో.. ఆకర్షణీయమైన ఆదాయం ఉంది. కానీ ఆర్థిక స్వేచ్చ లేదంటూ తన గోడుని వెల్లబోసుకున్నారు. మెట్రో నగరాల్లో జీవించేవాళ్లు నెలకు రెండు లక్షలు సంపాదించినా..సరిపోవడం లేదని వాపోయాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాం అని చెప్పాడు. పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడం కూడా భారంగా ఉందని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు కూడా ఆందోళనకరంగా పెరిగాయని అన్నారు. ఇక వైద్యం దగ్గరకు వచ్చేటప్పటికీ..ఆరోగ్య సంరక్షణ తీవ్రమైన ఆర్థిక ప్రమాదంగా ఉందని బాధగా చెప్పుకొచ్చారు. మనమంతా ట్రెడ్మిల్పై పరుగులంఖించుకుంటున్నామే తప్ప సంపదను సృష్టించుకోలేకపోతున్నాం అని వేదనగా చెప్పాడు. నిరంతరం ఈఎంఐలు చెల్లిస్తూ..రుణ చెల్లింపు యంత్రాలుగా మారిపోతున్నాం అంటూ బాధగా తన ఆవేదనను వివరించారు సీఏ కౌశిక్. అయితే ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు మండిపడ్డారు. ఇది ముమ్మాటిక ఆర్థిక నిర్వహణ వైఫల్యమని తేల్చి చెప్పారు. సంపాదన తోపాటు ఖర్చులను బ్యాలెన్స్ చేసే నేర్పరితనం లేనప్పుడూ..ఎంత సంపాదించినా వృధానే అన్నారు. చాలీచాలని జీతంతో బతుకుతూ..తమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నావారు కూడా ఉన్నారని గుర్తుచేశారు. సంపాదనకు తగ్గ ఖర్చు, పొదుపు చేయగలిగే సమర్థత ఉంటే..ఏదైనా సాధ్యం చేసుకోగలమంటూ ఎన్నో ఆర్థిక పాఠాలు, చిట్కాలు షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదండోయ్ అధిక ఆదాయం ఉంటే హ్యాపీ కాదు..సంతృప్తిగా బతకడం తెలియాలి. అసలు ఎంత సంపాదించాం అనేది కాదు..దాన్ని ఏవిధంగా ఖర్చుచేస్తూ..పొదుపు చేయగలం అనేది అత్యంత ముఖ్యం సుమీ. -
హీరోయిన్ హోటల్ ముందు భారీ క్యూ
నచ్చిన వాటిని దక్కించుకోడానికి 'క్యూ' కట్టడం మన దేశంలో సర్వ సాధారణం. అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు టికెట్ల కోసం ధియేటర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీటర్ల వరకు క్యూ కట్టేస్తాం. ఈ మధ్యన బట్టలు కొనేందుకు కూడా షాపుల ముందు నించుంటున్నారు జనం. ఇక మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవర్గ్రీన్. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో కనిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డబ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంతకీ అక్కడ ఏం పెడుతున్నారు, అంత ఫేమస్సా?ముంబై మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న అమ్మకై అనే రెస్టరెంట్ (AmmaKai Restaurant) ముందు జనం క్యూ కట్టిన వీడియోను ఎక్స్లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్తగా ప్రారంభమైన అమ్మకై రెస్టరెంట్.. రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత అల్పహారం ఆఫర్ చేసింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెడతామని ప్రకటించింది. ముందుగా వచ్చిన వారికి మాత్రమే వడ్డిస్తామని షరతు పెట్టింది. ఇది చూసిన జనం రెస్టరెంట్ ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు.బిచ్చగాళ్ల మాదిరిగా..ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసిన యూజర్.. జనం తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడతామంటే జనం బిచ్చగాళ్ల మాదిరిగా రెస్ట్రెంట్ తెరవడానికి 2 గంటల ముందే క్యూ కట్టారని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవరూ పేదవారులా కనిపించలేదన్నారు. కనీసం రెండుమూడు కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లలో నివసిస్తున్న లక్షధికారుల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రీగా వస్తుందంటే చాలు వెనుకాముందు చూడకుండా ఎగేసుకుని వచ్చేస్తారంటూ నిష్టూరమాడారు. ఒక ప్లేట్ బ్రేక్ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారని ధ్వజమెత్తారు. 'ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నందుకు ప్రభుత్వాలను తప్పుబడతాం. కానీ దానికి మన బాధ్యత ఉందని అనుకోం. మన ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద'ని ఎక్స్లో రాశారు. ఫ్రీగా వస్తుందంటే జనం ఇలాగే ఎగబడతారని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. అమ్మకైగా మారిన బాస్టియన్ఇంతకీ అమ్మకై రెస్టరెంట్ ఎవరిదో తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోటల్. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో కలిసి ఈ రెస్టరెంట్ ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్లో దీన్ని మూసివేస్తున్నట్టు ఎక్స్లో శిల్పా శెట్టి ప్రకటించారు. ఎందుకు మూసివేస్తున్నారనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోటల్ మూసేస్తున్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్ను కొత్తగా మార్చి అమ్మకై పేరుతో మళ్లీ ప్రారంభించారు. ప్రమోషన్ కోసం ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ (Free Breakfast Offer) పెట్టారని ముంబై జనం అనుకుంటున్నారు. చదవండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!AmmaKai,a newly launched restaurant by Shilpa Shetty in Bandra announced free breakfast for anyone and everyone with first come first serve basis and this is how the people responded like absolute beggars,standing in que since 7.00 A.M in the morning,2 hours before the… pic.twitter.com/AAz8iqdcFU— DG (@RetardedHurt) January 27, 2026 -
'చల్లటి ఫలుడా'ని ఆస్వాదిస్తున్న సునీతా విలియమ్స్..!
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల కేరళను సందర్శించారు. అక్కడ ఆమె వెర్మిసెల్లి(సేమ్యాలు)తో చేసిన చల్లటి డెజర్ట్ని ఆస్వాదిస్తునన్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో సునీతా పీచ్రంగు టీ షర్ట్ ధరించి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సరదాగా గడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోని ఫలుడా నేషన్ అనే అవుట్లెట్ స్టోర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేం. సునీతా విలియమ్స్ని ఫలూడాకు స్వాగతించడం ఎంత గౌరవం. అంతరిక్షం నుంచి మా స్టోర్కి ఆ ఆలోచన మమ్మల్ని విస్మయానికిలోను చేస్తోంది.ఆమె మా రుచులన పంచుకోవడం..అదోక గొప్ప వరంగానూ, గర్వంగానూ ఉంది". అని పోస్ట్లో పేర్కొంది. ఈ వీడియోకి మిలియన్స్కు పైగా వ్యూస్ రావడమే గాక, ఆకామంత ఎత్తుగా కలలు కనడం నేర్పిన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, సునీతా 27 ఏళ్ల సేవల అనంతరం ఇటీవలే నాసా నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో మూడు మిషన్లు పూర్తి చేసిన ఘనత ఆమెది. అలాగే ఆమె కెరీర్లో మానవ అంతరిక్ష ప్రయాణ రికార్డులను నెలకొల్పారామె. View this post on Instagram A post shared by Falooda Nation (@faloodanation.in) (చదవండి: ఇంటిపేరే ‘బెంగళూరు’..!) -
కొండపై ‘మ్యాగీ’ అమ్మితే.. ఇంత భారీ లాభమా?
ఉత్తర భారత దేశంలోని ప్రజలు చలికాలపు రోజుల్లో వేడి వేడి మ్యాగీని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇదే సమయంలో అక్కడికి వెళ్లే పర్యాటకులు కూడా రకరకాల మ్యాగీలను ఆరగిస్తుంటారు. ఇక ట్రెక్కింగ్ చేసేవారికి మ్యాగీ తప్పనిసరి ఆహారం. మన దేశంలో పర్వత ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉండే దాబాల్లో మ్యాగీ అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారంగా మారిపోయిందనడంలో ఆశ్చర్యం లేదు. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేయగలగడమే దీనికి గల ప్రధాన కారణం.తాజాగా రెండు నిముషాల్లో తయారయ్యే ఈ మ్యాగీ వ్యాపారంతో ఎంత ఆదాయం వస్తుందనే దానిపై కంటెంట్ క్రియేటర్ బాదల్ ఠాకూర్ ఇటీవల ఒక వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో దీనిపై మరింత ఆసక్తిని రేకెత్తించారు. బాదల్ ఠాకూర్ ఒక పర్వత ప్రాంతంలోని ఒక ప్రదేశంలో ఒక చిన్న టేబుల్ పెట్టుకుని, ఒక ఎల్పీజీ సిలిండర్తో తాత్కాలిక మ్యాగీ స్టాల్ను ఏర్పాటు చేశారు. అక్కడకు వస్తున్న పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బాదల్ ఠాకూర్ వ్యాపారం ఊపందుకుంది. సాధారణ మ్యాగీ ప్లేట్ను రూ.70 కి, చీజ్ మ్యాగీని రూ100కి ఆయన విక్రయించారు. కేవలం ఐదు గంటల వ్యవధిలో 200 ప్లేట్లు అమ్ముడయ్యాయి. రోజంతా సుమారు 300 నుండి 350 ప్లేట్ల వరకు విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రోజుకు సుమారు రూ. 21,000 వరకు ఆదాయం లభించిందని బాదల్ ఠాకూర్ వెల్లడించారు.ఖర్చులు పోను.. లాభమెంతంటే..రోజుకు రూ. 21,000 ఆదాయం వచ్చినప్పటికీ, ఇందులో ముడిసరుకు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో 75 గ్రాముల మ్యాగీ ప్యాకెట్ ధర రూ. 15 ఉండగా, గ్యాస్ సిలిండర్, డిస్పోజబుల్ ప్లేట్ల ఖర్చులు పోను నికర లాభం బాగానే ఉంటుంది. కాగా ఒక రోజులో ఇంత పెద్ద మొత్తంలో నగదు బాదల్ ఠాకూర్ చేతికి అందడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఇదే స్థాయిలో నెలంతా వ్యాపారం సాగితే, నెలకు సుమారు రూ. ఆరు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో లెక్కలు వేస్తూ చర్చిస్తున్నారు.బాదల్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఆదాయ వివరాలను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా నా ఉద్యోగం మానేసి మ్యాగీ అమ్మడం మొదలు పెడతాను’ అని కొందరు అంటుండగా, మరికొందరు ఇప్పటికే తాము ఇటువంటి వ్యాపారంలోకి దిగామని కామెంట్స్ చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో మ్యాగీకి ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమయ్యిదని పలువురు అంటున్నారు. ఇది కూడా చదవండి: రెగ్యులర్గా కాఫీ... వయసు పెరిగిపోతుంది జాగ్రత్త! -
ఇంటిపేరే ‘బెంగళూరు’..!
కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.బెంగళూరుకు చెందిన విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె తన వాయిస్ ఓవర్తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు. ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు. ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vipra Bangalore (@vip_z_z) (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!) -
పాచిపోయిన పప్పు, కంపు గొట్టే కూర : వందే భారత్ రైల్లో ఫుడ్పై వైరల్ వీడియో
వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత ఆహార నాణ్యతపై మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమకు పాడైపోయిన ఆహారాన్ని అందిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ప్రయాణీకులు క్యాటరింగ్ సిబ్బందితో తలపడుతున్నవీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై మరో కొత్త దుమారం చెలరేగింది.కోల్కతాకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు చెందినవిగా ఈ వీడియోలో అన్లైన్ షేర్ అవుతున్నాయి. దీని ప్రకారం ఇది తినడానికి పనికి వచ్చే ఆహారమైనా అని ప్రశ్నిస్తూ క్యాటరింగ్ సిబ్బందితో ప్రయాణీకులు వాదనకు దిగారు.తమ ఆహార ప్యాకెట్లను తిరిగిచ్చారు. “ఈ పప్పు చూడండి కుళ్ళిపోయింది, కూర కంపు కొడుతోంది అంటూ ఒక ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెమీ-హై-స్పీడ్ రైళ్లలో అధిక ధరల పాటు భోజనానికి ప్రయాణికులకు ప్రీమియం ధరలు వసూలు చేస్తారని మండిపడ్డారు.WATCH | Passengers on the Kolkata bound Vande Bharat Express allege they were served rotten, foul smelling food onboard. pic.twitter.com/RLvps0Ze1O— The News Drill™ (@thenewsdrill) January 25, 2026 దీంతో వందే భారత్ పేరుతో తీసుకొచ్చిన సెమీ-హై-స్పీడ్ భారతదేశ ప్రధాన రైళ్లలో ఆహార ప్రమాణాలపై మరోసారి చర్చకు తెరలేచింది. చాలామంది వినియోగదారులు ఇలాంటి అనుభవాలను కామెంట్లలో హెరెత్తించారు. ఈ సమస్య ఒకే రూట్కే పరిమితం కాదని ఎక్కడ చూసినా ఇదే తంతు అని విమర్శించారు. వారణాసి-పట్నా వందేభారత్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఇలాంటి సంఘటనను ఒక యూజర్ గుర్తు చేసుకుంటూ, ప్రయాణీకులు ఎక్కువ చెల్లించినప్పటికీ మెరుగైన సేవలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అధిక ఛార్జీలు చెల్లిస్తున్నాం దీనిపై మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని మరొకరు రాశారు. మరికొందరు పరిష్కారాలను సూచించారు. నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతేఇండియన్ రైల్వేలు భోజనాన్ని అందించడం పూర్తిగా నిలిపివేయాలని కొందరు వాదించారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దు, బిస్కెట్లు, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి" అని ఒకరు సూచించారు, వందే భారత్ రూట్లలో ఆహారం పేరుకే ప్రీమియం, క్వాలిటీ యావరేజ్ కంటే తక్కువే అని కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా? We've made efforts to include local cuisine in our menu. On 22/01/26 first day run, after receiving feedback, we withdrew the Assamese-style dal from some passengers due to its tangy flavor and offered alternative meals. The menu has been revised since and we're receiving… https://t.co/SjnDDxnADY— IRCTC (@IRCTCofficial) January 26, 2026 IRCTC వివరణ మరోవైపు ఈ ఆరోపణలను ఖండిస్తూ IRCTC ఒక ప్రకటన జారీ చేసింది. వందేభారత్ రైళ్లలో అందించే ఆహారం, ప్రారంభం, వాణిజ్య ప్రకటనల సమయంలో ఎంత నాణ్యంగా ఉండో ఇపుడు కూడా అలాగే ఉంటుందని తెలిపింది. పప్పు, బియ్యం లేదా పులావ్, కూరగాయలు లేదా పన్నీర్ గ్రేవీ, పొడి కూరగాయలు, చపాతీ లేదా స్వీట్ను భోజనంలో అందిస్తారని, స్థానిక ఆహారాన్ని అందించేందుకు ఒక గొప్ప క్యాటరింగ్ సంస్థ బాధ్యత వహిస్తోందని కూడా ఐఆర్సీటీసీ వివరించింది. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఒకవీడియోను కూడా ట్వీట్ చేసింది. -
గజగజలాడే చలిలో వెచ్చదనంతో కూడిన దయ..!
గజగజలాడే చలిలే కాసింత వెచ్చదనం ఇచ్చే హాయి అంత ఇంత కాదు. వసంత పంచమి తర్వాత హిమచల్ప్రదేశ్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో దట్టమైన హిమపాతంతో పరుచుకున్న సంగతి తెలిసింది. అక్కడున్న చాలా గ్రామాలు మంచుదుప్పటి కప్పుకున్నాయా..? అన్నంతగా మంచు కురుస్తుంది. పాపం పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు.వారి కార్లన్నీ రోడ్లపై దిగ్బంధించి ఉన్నాయి. విద్యుత్, నీటి సరఫరా అంతరాయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి పర్యాటకులు. ఈ విపత్కర సమయంలో స్థానికులు స్పందించిన విధానం నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది రీల్స్లా మారిపోయింది. కానీ ఇక్కడ స్థానికి మహిళలు చాలా నిశబ్దంగా మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులకు వెచ్చటి చాయ్ని అందించి స్వాంతన చేకూర్చారు. మనాలీ సమీపంలోని గోజ్రా గ్రామానికి చెందిన స్థానిక మహిళలు గడ్డకట్టిన వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి వేడినీటి ప్లాస్క్లతో బయటకు వచ్చి వారికి సర్వ్ చేయడం విశేషం. ఎక్కడా.. హడావిడి గానీ హంగామా గానీ లేదు..సౌమ్యంగా సహాయం చేస్తున్న విధానం అందరి మనసులకు హత్తుకుంది. గణతంత్రపు దినోత్సవం ప్లస్ వారాంతపు సెలవు కలిసిరావడంతో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సరిగ్గా దానికి తగ్గట్టు కఠినమైన వాతావరణం ఇబ్బంది పెడితే.. స్థానికులు మాత్రం ఆతిథ్యంతో 'స్వచ్ఛమైన హిమచల్ స్ఫూర్తి'ని కనబర్చి మానవత్వం చాటుకోవడం అందర్నీ ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది పర్యాటకానికి సంబంధించిన రీల్స్ కాదు..నిశబ్దంగా చెబుతున్న మానవత్వపు చర్య ఇది అంటూ పోస్టులు పెట్టారు. The most beautiful video on Tourism Day.Local women serving hot tea to tourists stranded in Manali’s snowfall traffic jam. No noise, no show off, just warmth and kindness.Across tourist states, one thing stays common. Be polite, be gentle, and people will always step up to… pic.twitter.com/gmxhGX3mt9— Nikhil saini (@iNikhilsaini) January 25, 2026 (చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!) -
'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగిలించిందా..!
ఓ డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఒంటరి నిహిలిస్ట్ పెంగ్విన్ క్లిప్ ఇప్పటికీ వైరల్ అవ్వుతూ స్ఫూర్తిని రగిలిస్తూ..యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతేగాదు అసలేంటీ ఒంటరి పెంగ్విన్ కథ అని నెట్టింట చర్చలు లేవెనెత్తాయి. ఇది తిరుగుబాటుకు, ధైర్యానికి, పట్టుదలకు కేరాఫ్గా నిలిచింది. అందరు జీవిస్తారు కానీ ఈ ఎగరలేని పక్షి బతకాలని కోరుకుంటుందంటూ..ప్రేరణను అందించే కథలన్నీ గుట్టుగట్టలుగా ుపుట్టుకొచ్చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్ వెనుకున్న కథేంటంటే..!.నిజానికి పెంగ్విన్లు గుంపులు గుంపులు సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ వీడియోలోనిపెంగ్విన్ మాత్రం నా దారి రహదారి అంటూ..విభిన్నంగా వెళ్తోంది. అది కూడా అది వెళ్లే రూటు ఆహారం దొరికే ప్రదేశం కానేకాదు. సముద్రం వైపుకి వెళ్తున్న గుంపుని వదిలేసి మరి ఒంటరిగా వెళ్తుండటం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులకు ఆద్యం పోసేలా ఈ ఒంటరి పెంగ్విన్ను కలిగి ఉన్న AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. అంతేకాదు చాట్జీపీటీ సైతం పెంగ్విన్ ఒంటరిగా అలా ఎందుకు వెళ్తుందో సర్చ్ చేయగా..ఈ క్లిప్ వన్యప్రాణులను చూడలేదని పేర్కొనడం గమనార్హం. 2007లో చిత్రీకరించిన డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.కానీ, ఒక్క 'అడిలీ పెంగ్విన్' (Adelie Penguin) మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కి.మీ దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తుండటాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ని ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్ వాక్ని డెత్మార్చ్ అని పిలిచాడు. ఎందుకంటే ఆ పెంగ్విన్ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి, పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. వెర్నర్ హెర్జోగ్, ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు. దానిని పట్టుకుని మళ్ళీ పెంగ్విన్ల గుంపులో కలిపారు. View this post on Instagram A post shared by ज़िन्दगी गुलज़ार है ! (@zindagi.gulzar.h) కానీ, ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్ళీ గుంపు నుండి బయటకు వచ్చి అదే పర్వతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ ెపెంగ్విన్ గుండెధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. పైగా దాన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటుండుంటం విశేషం.గుంపులో గోవింద అన్నట్లుగా కాకుండా స్పెషల్గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు ఈ పెంగ్విన్ ఒక రోల్మోడల్ అని కొందరు చెబుతున్నారు. మరి ొకొందరు ఈ పెంగ్విన్ డిప్రెషన్లో ఉందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. ాకానీ ఎక్కువమంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ..కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అంటూ కితాబులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by @reels.olizzzz (చదవండి: కొండల నుంచి సభకు..!) -
వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..!
వణికించే చలిలో పెళ్లి తంతు గురించి సినిమాల్లోనే చూసుంటాం. అందులో హీరో హీరోయిన్లు గడ్డకట్టిన మంచుని ఆస్వాదిస్తూ..గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నట్లు చూపిస్తుంటారు. కానీ రియల్గా మాత్రం అంత ఎంజాయ్ఫుల్గా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై లుక్కేయండి మరి..ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ హిమపాతం నడుమ ఓ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ జంట వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. అదే రోజున ఆ ప్రాంతంలో తొలి భారీ హిమపాతం కురిసింది. ఈ వివహ వేడుక ప్రసిద్ధిగాంచిన త్రియుగినారాయణ్ ఆలయంలో వైభవోపతంగా జరిగింది. ఈ త్రియుగినారాయణ్ ఆలయంలోనే సాక్షాత్తు ఆ పరమశివుడు, పార్వతిదేవి పెళ్లి చేసుకున్నారని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్ల చాలామంది భక్తులు తమ దాంపత్యం బాగుండాలని, తాము కలకాలం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలయంలోనే పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. అయితే పెళ్లి తర్వాత ఆ నూతన దంపతులు దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అత్యద్భుతంగా ఉంది. వారి పెళ్లిని ఆశ్వీరదిస్తూ..ప్రకృతి ఈవిధంగా పూల వర్షంలా హిమపాతాన్ని ఆ దంపతులపై కురిపిస్తుందా అన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. ఇక ఈ వేడుకలో వధువు ప్రకాశవంతమైన ఎర్రటి లెహంగాలో మెరిసిపోతుండగా, వరుడు షేర్వేనీ విత్ జాకెట్ ధరించాడు. గజగజలాడిస్తున్న కఠిన వాతావరణాన్ని చూసి ఆ జంట ఆనందం వ్యక్తం చేస్తూ..ఇది ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం ఆనందంగా చెబుతుండటం విశేషం. ఇదిలా ఉండగా, శుక్రవారం, ఉత్తరాఖండ్లో ఈ ఏడాదిలో తొలి హిమపాతం కురిసింది. ఉత్తరాఖండ్లోని గర్వాల్, కుమావోన్ డివిజన్లలోని బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఔలి, ముస్సోరీ, చక్రతా, ధనౌల్టి, మున్సియారి వంటి వివిధ ప్రదేశాలలో భారీ హిమపాతం సంభవించింది. నైనిటాల్లోని చైనా పీక్, కిల్బరీ, అల్మోరాలోని దునగిరి, పౌరీలోని తర్కేశ్వర్ వంటి ఎత్తైన ప్రాంతాలు పూర్తిగా దట్టమైన మంచుదుప్పటితో కప్పబడ్డాయి. View this post on Instagram A post shared by mahendrasemwal (@mahendrasemwal1) (చదవండి: గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్ చేసిన పనికి..) -
గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్ చేసిన పనికి..
ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశబ్దంగా కూడా ఇతరులు మన్ననలను అందుకోవచ్చు. అందుకు నిదర్శనం ఈ నిశబ్ధ సన్నివేశం. నిజానికి అక్కడ ఆ వ్యక్తి చేసింది చిన్న పనే అయినే..ఎందరో హృదయాలను గెలుచుకుంది..నీ ఉదారమైన మనసుకి సెల్యూట్..నవ్వు గ్రేట్ భయ్యా అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురింపించారు. అంత గొప్ప పని ఏం చేశాడతడు అంటే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎలాంటి సంభాషణ లేకుండా జరిగిన చిన్ని నిశబ్ద దృశ్యాన్ని కారులో ఉన్న రిషి పాండే అనే వ్యక్తి రికార్డుచేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.కరెక్ట్ రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆగి ఉన్నాయి..ఇంతలో ఓ సాదారణ సైక్లిస్ట్కి అక్కడ సమీపంలో ఆగి ఉన్న సూపర్ బైక్పై ఫోటో దిగాలనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..సూపర్ బైక్ని నడుపుతున్న బైకర్ని అడిగిమరి దాన్ని నడుపుతున్నట్టు ఫోటో తీసుకుంటాడు. సదరు బైకరే ఆ సైక్లిస్ట్ ఫోజులను క్లిక్మనిపించాడు. ఆ తర్వాత ఆ సైక్లిస్ట్ చిన్ని చిరునవ్వుతో బైక్ అతడికి ఇచ్చేసి వెళ్లిపోతున్న విధానం..బైకర్ని గౌరవిస్తున్నట్లుగానూ, అటు అతడు ఫుల్ హ్యాపీ అన్నట్లుగా ఉంది. ఇదంత కారులోంచి గమనిస్తున్న రిషి పాండే అనే వ్యక్తికి ఎంతో నచ్చి సైలంట్గా మొత్తం ఆ అందమైన దృశ్యాన్ని రికార్డు చేసి మరి నెట్టింట షేర్ చేశాడు. నెటిజన్ల సైతం అతడి విశాల మనసుకి ఫిదా అవ్వడమే గాక..గౌరవానికి అసలైన అర్థం ఈ కమనీయ దృశ్యం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rishi Pandey (@thewisestfool_rishi) (చదవండి: అబుదాబిలో కరీనా లుక్స్ అద్బుతః..! ఆ జాకెట్ అంత ఖరీదా..) -
చెంప దెబ్బకు చంపేశాడు!
న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్పూర్లోని ఆ కేఫ్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ, ఒక్కసారిగా పేలిన తుపాకీ గుళ్లు అలజడి రేపాయి. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ (24) అనే యువకుడు కేవ్లో ఉండగా.. తల, ఛాతీలో తూటాలు దిగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర గాయాలైన ఫైజాన్ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్స్ట్రాగామ్లో ప్రత్యక్షమై నేరాన్ని అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. ఔను.. నేనే చంపేశా.. హత్య జరిగిన కొన్ని గంటలకే నిందితుడు తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేని ఆ గొంతు వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘నేనే ఫైజాన్ను చంపాను. నాలుగు నెలల క్రితం వాడు నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయాను.. అందుకే ఇప్పుడు వాడి ప్రాణం తీశాను. ఇందులో మా కుటుంబానికి, స్నేహితులకు సంబంధం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత కక్ష!’.. అంటూ నిందితుడు కెమెరా ముందు ఒప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పు తీర్చమన్నందుకే.. హత్యకు కారణం పాత కక్ష అని నిందితుడు బుకాయిస్తున్నా, బాధితుని కుటుంబం మాత్రం మరో భయంకరమైన కోణాన్ని బయటపెట్టింది. నిందితుడు ఫైజాన్ దగ్గర రూ.40,000 అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే పక్కా ప్లాన్తో చంపేశాడని మృతుని సోదరుడు సల్మాన్ ఆరోపిస్తున్నాడు. ‘వాడు కేవలం కాల్చడమే కాదు, కత్తితో కూడా పొడిచాడు. నా తమ్ముడు ప్రాణాల కోసం ఎంత పోరాడాడో ఆ గాయాలే చెబుతున్నాయి’.. అంటూ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమ కేఫ్ సీజ్ ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. అక్రమంగా నడుస్తున్న ఆ కేఫ్ను వెంటనే సీజ్ చేశారు. నిందితుడు పోస్ట్ చేసిన వీడియో నిజమేనా? లేక తప్పుదోవ పట్టించే కుట్రా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
...పెంగ్విన్ ఒంటరి నడక
అది అంతులేని మంచు ఎడారి. ఎటు చూసినా గడ్డకట్టే చలి.. ప్రాణవాయువు కూడా భారమయ్యే శూన్యం. అక్కడ వందలాది పెంగ్విన్లు గుంపులు గుంపులుగా ఆహారం కోసం సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. కానీ, ఒక్క పెంగ్విన్ మాత్రం వెనక్కి తిరిగింది. అందరూ వెళ్తున్న బాటను వదిలేసింది. చావు ఎదురొస్తుందని తెలిసినా.. మంచు కొండల వైపు ఒంటరిగా అడుగులు వేస్తోంది.ఏమిటీ ’నిహిలిస్ట్ పెంగ్విన్’ మిస్టరీ? ఇటీవల టిక్టాక్, ఇన్స్టా్రగామ్లో ఈ వీడియో ప్రత్యక్షమవ్వగానే.. నెటిజన్లు దీనికి ‘నిహిలిస్ట్ పెంగ్విన్’అని పేరు పెట్టారు. ‘నిహిలిజం’అంటే ‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు, ఏ విలువలకు ప్రాధాన్యం లేదు’అనే ఒక తాతి్వక చింతన. ‘నేను ఎక్కడికి వెళ్లినా చివరికి మిగిలేది శూన్యమే కదా’.. అనే భావనలో ఉన్నవారు, ఆ పెంగ్విన్ ప్రయాణంలో తమను దర్శించుకుంటున్నారు. ‘నేను కూడా ఈ పెంగ్విన్ లాగే ఉన్నాను.. అందరిలా పరుగెత్తలేక ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాను’.. అంటూ లక్షలాది మంది నెటిజన్లు తమ భావోద్వేగాలను దీనికి ముడిపెడుతున్నారు.అది ‘మృత్యుయాత్ర’ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ 2007 అంటార్కిటికాలో తన డాక్యుమెంటరీ కోసం చిత్రీకరించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది. సముద్రం వైపు వెళ్తేనే దానికి ఆహారం దొరుకుతుంది, ప్రాణం నిలుస్తుంది. కానీ, ఆ పెంగ్విన్ తన గమ్యాన్ని మార్చుకుంది. ఎవరూ లేని, ఏమీ దొరకని నిర్జన పర్వతాల వైపు అది సాగిస్తున్న ప్రయాణాన్ని దర్శకుడు ‘మృత్యు యాత్ర’అని పిలిచాడు. ఎందుకంటే, ఆ దారిలో దానికి ఎదురయ్యేది కేవలం మరణం మాత్రమే. గుండె బరువెక్కుతోంది జనవరి 16న ఒక టిక్టాక్ యూజర్ ఈ వీడియోను ఎడిట్ చేసి ‘లామోర్ టూజూర్’అనే పాటను జత చేయడంతో అది విశ్వవ్యాప్తంగా కదిలిస్తోంది. ఇది ఒక ఫ్రెంచ్ పేరు. తెలుగులో దీని అర్థం ‘శాశ్వతమైన ప్రేమ’లేదా ‘ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమ’. ఆ గంభీరమైన సంగీతం, పెంగ్విన్ వేస్తున్న ఆ నిశ్శబ్ద అడుగులు చూస్తుంటే గుండె బరువెక్కక మానదు. చివరికి ఆ పెంగ్విన్ ఏమౌతుందో అందరికీ తెలుసు. అది తిరిగి రాదు. కానీ, ఆ ప్రయాణం మనిషికి ఒక నిశ్శబ్ద సత్యాన్ని బోధిస్తోంది. బతుకు పోరాటంలో అలిసిపోయిన ఆత్మలకు ఆ పెంగ్విన్ ఒక మూగ సాక్ష్యం. ఇది కేవలం ఒక పక్షి నడక కాదు.. ప్రతి మనిషి లోపల దాగి ఉన్న ఒక నిశ్శబ్ద ఆవేదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
షకీరా పాటకు.. దేశీ టచ్!
సంగీతానికి సరిహద్దులు లేవని, ఏ భాష పాటకైనా మన మట్టి వాసనను అద్ది కొత్తగా మార్చవచ్చని రాజస్థానీ జానపద కళాకారులు నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాటకి మన స్థానిక సంస్కృతిని జోడించి.. అందరిచే వహ్ వా అనిపించుకుంటున్న వారి సృజనాత్మకతకు నెటిజనులు ఫిదా అయ్యారు.ఆఫ్రికన్ రిథమ్స్తో సాగే షకీరా పాడిన వాకా వాకా అనే ఆ పాటకు మన మూలాలను జోడించడం అద్భుతం. ఇండియాస్ గాట్ టాలెంట్లో మూడుసార్లు పాల్గొన్న ఈ కళాకారుల బృందం, తమదైన శైలిలో రాజస్థానీ సాంప్రదాయ సంగీతంలోకి వాకా వాకా పాటను రీమిక్స్ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.సారంగి, ఖర్తాల్, డోలక్ వంటి వాద్యాలతో ఈ గ్లోబల్ పాటకు దేశీ టచ్ ఇచ్చారు. ఈ పాట చివరలో వచ్చే దిస్ టైమ్స్ ఆఫ్ ఆఫ్రికా అనే ప్రసిద్ధ పంక్తిని వారు వెల్కమ్ టు రాజస్థాన్ (Welcome to Rajasthan) అని మార్చడం ఇందులోని ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల తలపాగాలు, ఎంబ్రాయిడరీ జాకెట్లు, అద్దాలతో అలంకరించిన డ్రస్సులతో పక్కా రాజస్థానీ వాతావరణాన్ని కళ్లముందు ఉంచారు ఆ కళాకారులు.రాజస్థానీ జానపద కళాకారుల బృందం ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో వైరలయ్యింది. బస్సు ప్రయాణంలో కూడా తమ కళను ప్రదర్శిస్తూ వారు పంచుతున్న ఆనందం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చదవండి: కొత్త పెళ్లికూతురి స్టన్నింగ్ క్యాచ్..! View this post on Instagram A post shared by Ismail langa (@ismaillanga_official) -
బెడ్రూమ్ నుంచి సరాసరి పీఎస్కు..
ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది.. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్లో నేరుగా బెడ్రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్గా పిస్టల్తో ఫోజు ఇచ్చింది. దీంతో.. కోడలిని పీఎస్కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె. అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK— NDTV (@ndtv) January 23, 2026 -
పెళ్లికూతురా.. ఏం పట్టావమ్మా!
క్రికెట్ మైదానంలో ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం చూశాం.. కానీ, పెళ్లి మండపంలో ఒక వధువు అంతకంటే వేగంగా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కూతురంటే సిగ్గుతో తలవంచుకుని కూర్చుంటుందనుకుంటే పొరపాటే.. ఈ వధువు వేగం చూస్తే నిష్ణాతులైన క్రికెటర్లు కూడా షాక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. పెళ్లి తంతులో భాగంగా వరుడి తల్లి.. తన కుమారుడికి ప్రేమతో రసగుల్లా తినిపించబోయింది. ఆ మిఠాయి నోటి దగ్గరకు వెళ్లేలోపే స్పూన్ పైనుంచి జారి కింద పడబోయింది.వధువు మెరుపు క్యాచ్! ఆ రసగుల్లా నేలను తాకడానికి ముందే.. పక్కనే ఉన్న వధువు రెప్పపాటు కాలంలో స్పందించింది. తన చేతిని చాచి, గాలిలోనే ఆ రసగుల్లాను అద్భుతంగా క్యాచ్ పట్టింది. ఆ మిఠాయి కింద పడి వరుడి దుస్తులు పాడవకుండా, ఫంక్షన్ మధ్యలో ఇబ్బంది కలగకుండా తన ‘వికెట్ కీపింగ్’ నైపుణ్యంతో కాపాడేసింది. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోకు 6 లక్షలుగాపై లైకులు, 4 వేలకు పైగా కామెంట్లు రావడం విశేషం.ధోనీ కూడా గర్వపడతాడు ఈ వీడియో వైరల్ (Video Viral) కావడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఈమె స్పందన చూస్తుంటే సాక్షాత్తూ ఎంఎస్ ధోనీ గుర్తొస్తున్నాడు’.. అని ఒకరు.. ‘ఫీల్డింగ్లో ఈమె ముందు సీజన్డ్ ప్లేయర్లు కూడా సరిపోరు’.. అని మరొకరు ప్రశంసించారు. ‘బహుశా ఆ రసగుల్లా అంటే వధువుకు చాలా ఇష్టమేమో.. అందుకే అంత ఫోకస్తో క్యాచ్ పట్టింది’.. అంటూ సరదాగా ఆట పట్టిస్తున్నారు. పెళ్లి వేడుకలో ఈ చిన్న పొరపాటు జరిగి ఉంటే కాసేపు గందరగోళం ఏర్పడేది. కానీ వధువు సమయస్ఫూర్తి ఆ క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా, ఒక ‘మ్యాచ్ విన్నింగ్’మూమెంట్గా మార్చేసింది.చదవండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. ఆమె ఫుల్ హ్యాపీ! View this post on Instagram A post shared by Last24hrofIndia 🇮🇳 - Raj Kumar (@last24hrofindia) -
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
శవం సడెన్గా కాళ్లు పైకి లేపింది...ఇదిగో వీడియో!
శ్మశానంలో ఒంటరిగా ఉంటానని పందెం కాసి,చిన్ అలికిడికే ప్రాణాలు పోగొట్టుకున్న గాథలు గురించి విన్నాం. దెయ్యాలతో మాట్లాడే భేతాళ కథలు విన్నాం. కానీ చనిపోయిన తరవాత శవాలు కదులుతాయని, వాటి శరీర భాగాల్లో ఒక్కసారిగా చలనం వస్తుందని తెలుసా? చాలా అరుదే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల శవాల్లో ఇలా కదలికలు కనిపిస్తాయట. అంత మాత్రాన ప్రాణం తిరిగి వచ్చినట్టు కాదు. మరి అదేంటో చూద్దాం.⚠️ Why Bodies Sometimes Move After Death The Lazarus Sign Explained pic.twitter.com/VrsrYqhg9u— OANASA (@OANASA_X_) January 22, 2026మార్చురీలో లేదా చనిపోయిన తర్వాతమృతదేహాలు కదలడం వినడానికి కొంత భయానకంగా అనిపించినప్పటికీ, దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో "లాజరస్ సైన్" (Lazarus Sign) లేదా "పోస్ట్మార్టం మూవ్మెంట్స్" (Postmortem movements) అని పిలుస్తారు. మృతదేహాలు కదలడానికి ప్రధాన కారణాలుకండరాల సంకోచం (Muscle Contraction) మనిషి చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని కణాలు వెంటనే చనిపోవు. నరాలలో మిగిలి ఉన్న విద్యుత్ సంకేతాలు లేదా కండరాలలో నిల్వ ఉన్న క్యాల్షియం వల్ల కండరాలు అకస్మాత్తుగా సంకోచించవచ్చు. దీనివల్ల కాళ్లు లేదా చేతులు స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తుంది.రిగర్ మోర్టిస్ (Rigor Mortis) : మరణం తర్వాత శరీరం గట్టిపడటాన్ని 'రిగర్ మోర్టిస్' అంటారు. ఈ ప్రక్రియలో రసాయన మార్పుల వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఈ సమయంలో శరీరం ఒక స్థితి నుండి మరో స్థితికి మారినప్పుడు (ఉదాహరణకు వేళ్లు ముడుచుకోవడం) అది కదలికలా కనిపిస్తుంది.వాయువుల విడుదల (Gas Accumulation): శరీరం కుళ్ళిపోయే క్రమంలో (Decomposition) లోపల బ్యాక్టీరియా వల్ల గ్యాస్ విడుదలవుతుంది. ఈ వాయువుల ఒత్తిడి వల్ల మృతదేహం ఉబ్బడం, కొద్దిగా పక్కకు తిరగడం లేదా నోటి నుండి శబ్దాలు రావడం (Death Rattle) వంటివి జరుగుతాయి.వెన్నెముక రిఫ్లెక్స్ (Spinal Reflexes) : కొన్నిసార్లు మెదడు చనిపోయినా, వెన్నెముకలోని నాడులు (Spinal cord neurons) ఇంకా ఉత్తేజితంగానే ఉండవచ్చు. దీనివల్ల మృతదేహం అకస్మాత్తుగా చేతులు పైకి ఎత్తడం వంటివి చేస్తుంది. దీనినే పైన చెప్పుకున్న లాజరస్ సైన్ అంటారు.అయితే వైద్యులు మరణాన్ని నిర్ధారించిన తర్వాత ఇలాంటి కదలికలు సహజమంటారు శాస్త్రవేత్తలు. ఇవి కేవలం భౌతిక , రసాయన మార్పులే తప్ప, ప్రాణం రావడం వల్ల జరిగేవి కాదని స్పష్టంగా చెబుతారు. -
ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లల పనీ, పాటా : వైరల్ వీడియో
పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా, అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్స్టా ఖాతాలో భారతీయ పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు, లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్కి వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు జాగ్రత్తగా పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Jung ae Um🇰🇷 living in India🇮🇳 (@wonny_brothers)> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్లో ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్ చేస్తూ ఆన్లైన్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై ఇది కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు. -
ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. సూపర్బ్!
ప్రేమలో పడటం సులభమే కానీ.. ఆ ప్రేమను వ్యక్తపరచడమే ఒక పెద్ద టాస్క్! మన వీరేంద్ర కువేల్కర్ మాత్రం రొటీన్కు భిన్నంగా ఆలోచించి, తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక అదిరిపోయే ‘బైక్ డ్రామా’ ప్లాన్ చేశాడు. ఇన్స్ట్రాగామ్లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.అసలేం జరిగింది? సాదాసీదాగా బైక్ మీద షికారు వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు వీరేంద్ర. పాపం ఆ అమ్మాయి వెనకాల కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకుంటోంది. కానీ వీరేంద్ర మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ‘సిగ్నల్’ కోసం వెయిట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే.. ముందుగా ఒక బైకర్ వచ్చి ఓవర్టేక్ చేసి ముందు నిలబడ్డాడు. అతని టీషర్ట్ వెనకాల ‘విల్’అని ఉంది. వెంటనే రెండోవాడు వచ్చాడు.. అతని టీ షర్ట్పై ‘యూ’అని ఉంది. మరో ఇద్దరు తోడయ్యారు.. వారి టీ షర్టులపై ‘మ్యారీ’, ‘మి’అని ఉంది. అక్షరాలు కలిపి చదివితే.. టడడడాయ్! ‘విల్ యూ మ్యారీ మీ’.. అని ఒక గాలిలో తేలే ప్రపోజల్ సిద్ధమైంది. ఆ నలుగురు బైకర్లు వరుసగా కళ్లముందు వెళ్తుంటే, ఆ అమ్మాయి షాక్ నుంచి తేరుకుని నవ్వే లోపే.. మన హీరో వీరేంద్ర జేబులోంచి మెరిసే ఉంగరం తీసి ఆఫర్ ఇచ్చేశాడు! మాకూ ఇలాంటి గ్యాంగ్ కావాలి ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా బైకర్స్ కమ్యూనిటీ అంతా ‘బ్రదర్హుడ్ అంటే ఇదీ!’అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘రింగు తెచ్చాడు.. దానికి థ్రిల్ కూడా అటాచ్ చేశాడు!’.. అని ఒకరు.. ‘ఆయన హ్యాపీ, ఆమె హ్యాపీ, బైకర్స్ అందరూ హ్యాపీ!’.. అని మరొకరు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ సెటప్లు లేకపోయినా.. నలుగురు దోస్తులు, రెండు లీటర్ల పెట్రోల్ ఉంటే చాలు, ఇలాంటి అందమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చని ఈ జంట నిరూపించింది.చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు! View this post on Instagram A post shared by VIRENDRA KUVELKAR |🇮🇳 (@greek_god_26) -
వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026 -
పోస్టు చేసేముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం!
సోషల్ మీడియా ట్రోలింగ్లు... డిజిటల్ విచారణలు ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయో కేరళలో చోటుచేసుకున్న ఓ ఘటన కళ్లకు కడుతోంది. ఓ మహిళ ఒక వ్యక్తిపై బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపంతో అతను ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. 35 ఏళ్ల శింజిత ముస్తఫా కేరళకు చెందిన ఒక ఇన్ఫ్లూయెన్సర్. ఇటీవల ఆమె తాను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దీపక్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేసింది. ఈ వీడియో సుమారుగా 20 లక్షల వ్యూస్తో వైరలయ్యింది. నిజానిజాలు తెలుసుకోకుండా నెటిజన్లు పెట్టే కామెంట్లు అతన్ని కలచి వేశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయిన దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వ్యూస్ కోసమేనా?దీపక్ ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు రాగానే శింజిత సోషల్ మీడియాలో తాను ఆరోపణలు చేసిన వీడియోని డిలీట్ చేయడమే గాక తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోని అప్లోడ్ చేసింది. కానీ అప్పటికే.. వ్యూస్ కోసమే శింజిత ఇలా చేసినట్లు ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియోని కూడా ప్రైవేట్మోడ్లోకి మార్చేసింది. దీనంతటినీ సీరియస్గా తీసుకున్న పోలీసులు శింజితను అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్గా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు చేసే పోస్టుల పర్యవసానాల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని నిపుణులు అభి్రపాయపడుతున్నారు. -
దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు.. లారీ నుజ్జునుజ్జు..!
రాంచీ: జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్లోని దేవోబంద్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. గోండా-అసన్సోల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.A tragic incident occurred on the Jasidih-Madhupur section of the Eastern Railways.Who's at fault here? #IndianRailways pic.twitter.com/DDzAezLxwD— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) January 22, 2026అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్ పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
'నాకు ముగ్గురు కూతుళ్లు.. నన్నెవరూ భయపెట్టలేరు'
‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది. View this post on Instagram A post shared by SYED KAZIM🩶 (@syed_kazimkazmi110)“మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.” అన్నమెసేజ్ . దీంతోపాటు, దీని “M,” “A” “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్నమాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో ఇది నిరూపించింది. ఈ క్లిప్ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ను సంపాదించింది.నెటిజన్ల రియాక్షన్ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో”, “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం. -
వాట్ ఏ కమిట్మెంట్ బ్రో.. వైరల్ వీడియో
ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు. పండుగైనా, వేడుకైనా వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే. ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్ అవ్వకూడదు. అదీ అతని కమిట్మెంట్. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు. కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో నెట్టింట వైరల్ అవుతోంది. వాట్ ఏ కమిట్మెంట్ బ్రో అని నీ డెడికేష్కి సలాం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లుఇదీ చదవండి : అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత? The way he said "you guys carry on" Shows the level of passion 🤍 pic.twitter.com/PeR4mB15W6— .. (@Superoverr) January 22, 2026 -
అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అటు వ్యాపారంతోపాటు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతార’ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలిచాడు. తాజాగా అనంత్ అంబానీ, వంతారాకు సంబంధించి మరో అంశం విశేషంగా నిలుస్తోంది.న్యూయార్క్కు చెందిన లగ్జరీ జాకబ్ & కో అనంత్ అంబానీ కోసం కస్టమ్ 'వంతారా' గడియారాన్ని రూపొందించింది. ఈ హోరోలాజికల్ మాస్టర్పీస్ 'ఒపెరా వంటారా గ్రీన్ కామో' ను జనవరి 21న ఆవిష్కరించింది. అనంత్ అంబానీకి ఇష్టమైన వంతారాకు నివాళిగా ఈవాచ్ను తయారు చేసింది. డెమాంటాయిడ్ గోమేదికాలు, సావోరైట్లు, ఆకుపచ్చ నీలమణి , తెల్ల వజ్రాలు ఇందులో ఉన్నాయి. 21.98 క్యారెట్లతో దాదాపు 400 విలువైన రాళ్ల సంక్లిష్టమైన అమరిక అని, జాకబ్ అండ్ కో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ టైమ్పీస్ విలువ దాదాపు ‘1.5 మిలియన్లు’ (సుమారు రూ.12.5 కోట్లు). ప్రస్తుతం ఇది హోరాలజీ ప్రియులతోపాటు, ఫ్యాషన్ ప్రియుల ప్రశంసలందుకుంటోంది. (నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు) View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco)'ది వంతారా'లో 397 రత్నాలుఈ వాచ్ డిజైన్ మరింత స్పెషల్గా నిలుస్తోంది. డయల్లో మధ్యలో చేతితో తయారుచేసిన అనంత్ అంబానీ బొమ్మ అమర్చారు. అలాగే చుట్టూ బెంగాల్ టైగర్, సింహాన్నిఅమర్చారు. అలాగే బంగారం రూపొందించిన వంతారా, ఎనుగు ఈ డయల్లో మరో ఆకర్షణ. అనంత్ అంబానీ లగ్జరీ వాచెస్ అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించినాయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే ఉత్తమమైన జాకబ్ బ్రాండ్ది కూడా చేరింది. అనంత్ అంబానీ గడియారాల్లో పటేక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగ్యుట్, రిచర్డ్ మిల్లె, రోలెక్స్ నుండి చాలా అందమైన విలాసవంతైన టైమ్పీస్లు చోటు దక్కించుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ. 200 కోట్లకు పైమాటేనని అంచనా. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) -
రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ఐఐటీ కాన్పూర్లో చదువు, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేతికి కాగానే భారీ ఆఫర్తో ఉద్యోగం ఖాయం. బీటెక్ ఆఖరి సంవత్సరంలోతన బ్యాచ్మేట్స్ అందరికి గ్లోబల్ దిగ్గజ సంస్థలనుంచి భారీ వేతనంతో ఉద్యోగ ఆఫర్లు అందుకున్నారు. కానీ ఒక యువకుడి ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. తన కలను సాకారం చేసుకునే ప్రయోగాల్లో బిజీగా ఉన్నాడు. ఎందరు నవ్వినా, హేళన చేసినా పట్టించుకోలేదు. ఆయనే బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీకి వ్యవస్థాపకుడిగానిలిచిన అంకుష్ సచ్దేవా కథ సాధారణ IIT మేధావి కథ కాదు. దానికంటే కఠినమైనది, మరింత మానవీయమైనది. ఎంతో ఇష్టంగా కష్టపడిన నిలిచి గెలిచినప్రయోగశీలి కథ. పదండి కథేంటో తెలుసుకుందాం.అంకుష్ సచ్దేవా కాన్పూర్ నుంచి పట్టభద్రుడయ్యాక మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంటర్న్గా తన వృత్తిని ప్రారంభించాడు. కార్పొరేట్ ప్రపంచం అతని అభిరుచిని మరిపించలేకపోయింది. వ్యవస్థాపకత మార్గంలో నడిచేలా చేసింది. సచ్దేవా తన కెరీర్ ప్రారంభ దశలో 17 విభిన్న స్టార్టప్ ప్రయత్నాల్లో వైఫల్యం చెందాడు. అవును..అతని గుండె గదుల్లోంచి ఉద్భవించిన ప్రతీ ఆలోచన ఇ-కామర్స్ నుండి యుటిలిటీస్ వరకు దాదాపు అన్నీ క్రాష్. కానీ వైఫల్యాలనే తన విజయానికి మెట్లుగా వాడుకున్నాడు. ఓటమి నుంచే నేర్చుకున్నాడు. ప్రతి వైఫల్యం ఒక ముఖ్యమైన డేటాపాయింట్. కట్ చేస్తే.. 18వ ప్రయత్నంలో ఇద్దరు సహచరులతో కలిసి అతను అసాధారణమైన దాన్ని సాధించాడు.2015లో తన IIT కాన్పూర్ స్నేహితులు ఫరీద్ అహ్సాన్ , భాను సింగ్ లతో జతకట్టాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగి తేలుతున్న సమయంలో ఇదొక విప్లవాత్మక ఆలోచన, స్థానికమైన భాషను మాట్లాడే సోషేల్ స్లేస్ షేర్చాట్ను నిర్మించారు. తొలుత హిందీతో ప్రారంభమైనప్పటికీ, ఆ తరువాత 15 భారతీయ భాషలలోకి వికసించింది. ఫేస్ బుక్, వాట్సాప్ కంటే కొత్త అనుభవాలను కోరుకునే వినియోగదారులకు వరంలా మారింది.ప్రాంతీయ భాషలే బలంఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఇంగ్లీష్పై దృష్టి పెడితే, షేర్చాట్ మాత్రం భారతదేశంలోని ప్రాంతీయ భాషల (తెలుగు, హిందీ, తమిళం మొదలైన 15 భాషలు) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. "మన భాషలో మన సోషల్ మీడియా" అనే నినాదమే విజయానికి పునాది వేసింది. షేర్చాట్ కంటే ముందు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ ముగ్గురు స్నేహితులు యూజర్లు ప్రాంతీయభాషల్లో కంటెంట్ను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారని గ్రహించారు. ఫలితంగా గ్లోబల్ కంపెనీలకు ధీటుగా సొంత ప్లాట్ఫారమ్ను నిర్మించుకోవచ్చని నిరూపించేలా షేర్చాట్ను తీసు కొచ్చారు. ప్రపంచ ఇంటర్నెట్కు కనిపించకుండా ఉన్న లక్షలాది మందిని, మూల మూలన ఉన్న వారిని ఏకం చేసింది. పంజాబ్లోని ఒక రైతును అస్సాంలోని ఒక కవితో కలిపింది. మధ్యప్రదేశ్లోని ఒక గృహిణి వంటకాల ఛానెల్ వైరల్ అయింది. కేవలం ఆరేళ్ళకు 2021 నాటికి, దీనికి 160 మిలియన్లకు పైగా యూజర్లు వచ్చి చేరారు. భారీ ఆదరణతో పాటు కంపెనీ విలువ కూడా పెరిగింది. షేర్చాట్ 2021లోనే 'యూనికార్న్' (1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీ) క్లబ్లో చేరింది. 2022 నాటికి ఇది అక్షరాలా రూ. 40,000 కోట్లకు (సుమారు 5 బిలియన్లు డాలర్లకు) చేరింది.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు k రూ.723 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఇది ఏడాదికి₹1,000 కోట్ల ఆదాయ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది.కేవలం సోషల్ మీడియాగానే కాకుండా, ఇప్పుడు మైక్రో డ్రామా (Micro-dramas) ,లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ లాభాల దిశగా ప్రయాణిస్తోంది.అంకుష్ సచ్దేవా పేరు స్టార్టప్ పరిశ్రమలో అత్యంత స్ఫూర్తిదాయకమై పేరు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే తపనతో ఉన్న ఈ ప్రపంచంలో, ప్రతీ ప్రతికూలతనుంచి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఎంతో శ్రద్ధగా నిర్మించుకున్న వైభవం. దాని గొప్పతనానికి నిదర్శనమైన స్ఫూర్తి. -
ఒక్క వ్లాగ్తో ఓవర్నైట్ స్టార్గా 72 ఏళ్ల తాత..!
చాలామంది సోషల్మీడియాలో స్టార్లుగా సంచలనం సృష్టించేందుకు..చాలా కష్టపడుతుంటారు. పోనీ అంతలా చేసినా..కొందరికీ లక్ కలిసిరాక, లేక కంటెంట్ బాగోకో..జనాలకు రీచ్ అవ్వడంలో విఫలమవుతుంటారు. కానీ సోషల్మీడియా గురించి ఏమి తెలియని ఈ 70 ఏళ్ల తాత నిజాయితీగా మాట్లాడిన తొలి వ్లాగ్ ప్రభంజనమే సృష్టించేలా వ్యూస్ వచ్చాయి. అలా అని అందులో ఏమి అంత గొప్పగా చెప్పిన విషయాలేం లేవు. కేవలం తన గురించి మాట్లాడిన కొద్ది మాటలే..ఎంతలా నెటిజన్లను ఆకర్షించాయో వింటో నోరెళ్లబెట్టేస్తారు.ఉత్తరప్రదేశ్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు వినోద్ కుమార్ శర్మకు అసలు వ్లాగింగ్ గురించి ఏమి తెలియదు. కానీ చాలా ఇన్నోసెంట్గా, నిజాయితీగా ఆ విషయాన్ని వివరించిన విధానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వినద్ శర్మ పదవీ విరమణ అనంతరం తన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా గడిపేందుకు ఈ వ్లాగ్ని ఒక మార్గంగా ఎంచుకున్నానట్లు తెలిపారు. ఆయన వీడియలో ఇలా అన్నారు. నా పేరు వినోద్ కుమార్ శర్మ. "నేను ఉత్తర ప్రదేశ్కి చెందిన వాడిని. నాకు వ్లాగ్ చేయడం రాదు. జస్ట్ కాలక్షేమపం కోసం వ్లాగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఈ వ్లాగ్మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకుంటే మీ ప్రోత్సాహం ఉంటే కదా భవిష్యత్తులో దీన్ని కొనసాగించగలను అంటూ ముగించారు." అంతే ఆ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకుపైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. ఆ వృద్ధుడు వినోద్ శర్మ అమయకత్వానికి మత్ర ముగ్ధలవ్వడంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. అతడిని చూడగానే మా తల్లిదండ్రలు, తాతయ్య అమ్మమలు గుర్తుకొచ్చారని, అంకుల్ మీకు మేము తోడుగా ఉంటాం అంటూ పోస్టులు వెల్లువెత్తాయి. అంతేగాదు అంకుల్ మీరు మా హృదయాలనకు కొల్లగొట్టారంటూ ప్రోత్సహించారు కూడా. మరికొందరు నేర్చుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని నిరూపించారు శెభాష్ అంకుల్ అని ప్రశంసల వర్షం కురిపించారు కూడా. View this post on Instagram A post shared by Vinod Kumar Sharma (@instauncle_9) (చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..) -
తెల్లవారుజాము నుంచే క్యూ కట్టాల్సిందే!
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్ను ముందుగా దక్కించుకోవడానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంటల తరబడి వేచివుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియన్ సిలికాన్వ్యాలీలో దర్శనమిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్లోకి రాలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మరి దేనికోసం?బెంగళూరులోని ఓ దుకాణం ముందు మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు వేచివున్నట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిలబడ్డారని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, సగం ధరకు అమ్మేవో కాదు.. చాలా ఖరీదైన పట్టు చీరలు. ఏంటీ.. అంతేసి డబ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను దక్కించుకునేందుకు ఇంత కష్టపడాలా అని జనం నోరెళ్లబెడుతున్నారు. విషయం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు!మైసూరు పట్టు చీరలను దక్కించుకునేందుకు మహిళలంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగళవారం ఇలా క్యూ కట్టారు. లైన్లో వేచివున్న మహిళల కోసం ప్రత్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీరనైనా దక్కించుకోవాలన్నట్టుగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్యక్తి 'ఎక్స్'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే మైసూరు పట్టుచీరల కోసం మహిళలు తెల్లవారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్నవారిని మాత్రమే దుకాణం లోపలికి అనుమతిస్తారని 'కన్నడప్రభ' తెలిపింది. అందరికీ చీరలు దక్కాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే విక్రయిస్తారని వెల్లడించింది.కేఎస్ఐసీ (KSIC) మాత్రమే అసలు సిసలైన మైసూరు సిల్క్ సారీలను తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత తయారీ హక్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది కలిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్షణ ఇచ్చిన వారు మాత్రమే మైసూరు పట్టు చీరలను నేస్తుండడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతోంది. అందుకే తమ దుకాణానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక చీర మాత్రమే విక్రయిస్తోంది. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఒరిజినల్ పట్టుచీరలను తయారు చేస్తోంది కాబట్టే మహిళలు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజినల్ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మరి!Women queue up from 4.00 AM outside a Karnataka Soviet (sorry Silk) Industries Corporation showroom to buy silk sarees starting from ₹23,000 and going up to ₹250,000. Only 1 saree per customer and you need a token to be in the queue.There is an ongoing shortage (or more… pic.twitter.com/d100w3hql0— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 20, 2026నెటిజన్ల స్పందన..''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మగాళ్లు 12 గంటలు ముందుగానే క్యూ కట్టడం మామూలు విషయం. కానీ చీరల కోసం మహిళలు క్యూలో వేచివుండడం ఆసక్తికరం.''''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివరకు దాన్ని దక్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటే.. వారంతా బాగా డబ్బున్న ఉన్నవారే అయుంటారు.''''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్యతపై నమ్మకంతోనే మహిళలు ఇక్కడ పట్టు చీరలు కొనేందుకు వస్తున్నారు.''చదవండి: కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా? -
అరుదైన కానుక : రాహుల్ గాంధీ భావోద్వేగం, వైరల్ వీడియో
రాయ్బరేలి: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరుదైన అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలోని తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఒక అభిమాని కుటుంబం రాహుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అపురూప జ్ఞాపకాన్ని తిరిగి పొందడంపై రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన రాహుల్ వెంటనే దాని ఫోటోను తన తల్లి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో వాట్సాప్లో షేర్ చేశారు. దీనికి సంబంధించి, అంకిత్ మయాంక్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రాహుల్ గాంధీ తాత, దశాబ్దాల క్రితం రాయ్బరేలీ మాజీ ఎంపీ ఫిరోజ్ గాంధీ పోగొట్టుకున్న పర్సును అక్కడి ఒక కుటుంబం ఇన్నాళ్లూ ఆయన జ్ఞాపకార్థం భద్రంగా దాచిందట. తాజాగా రాయ్బరేలీ పర్యటనలో ఉన్న ఆయన మనవడు, ఎంపీ రాహుల్ గాంధీని కలిసి ఆ పర్సును అందజేయడం విశేషంగా నిలిచింది. స్థానిక కుటుంబం దశాబ్దాలుగా భద్రపరిచిన ఈ లైసెన్స్ను, రాయ్ బరేలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహక కమిటీ సభ్యుడు వికాస్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు తన నియోజకవర్గంలో పర్యటన రెండో రోజున గాంధీకి అందజేశారు. వారు ఏమన్నారంటే.. "చాలా ఏళ్ల క్రితం, రాయ్బరేలిలో జరిగిన ఒక కార్యక్రమంలో, నా మామగారు ఈ డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. అప్పటినుంచీ ఆయన దానిని భద్రంగా ఉంచుకున్నారు. ఆయన మరణం తర్వాత, నా అత్తగారు దానిని భద్రపరిచారు" అని సింగ్ అన్నారు. "రాహుల్ గాంధీ రాయ్బరేలిని సందర్శిస్తు న్నారని తెలిసి దానిని అతనికి అందజేయడం మా బాధ్యతగా భావించాము." దీన్ని తమ కుటుంబం ఒక "అమానత్" (విలువైన ట్రస్ట్)గా దీన్ని గాంధీ కుటుంబానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించామని సింగ్ అన్నారు.కాగా భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా ప్రియదర్శిని గాంధీ, ఇందిరా గాంధీగా సుపరిచితులు. ఆమె ఈ దేశానికి మూడవ ప్రధానమంత్రి మరియు భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ,కమలా నెహ్రూల కుమార్తె ఇందిరా గాంధీ,ఫిరోజ్ గాంధీ 1942 మార్చి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కొడుకులే దివంగతులు రాజీవ్ గాంధీ, సంజీవ్ గాంధీ. డిసెంబర్ 1912లో జన్మించిన ఫిరోజ్ గాంధీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలి సీటును గెలుచుకున్నారు. 1960 సెప్టెంబర్ 7న గుండెపోటుతో ఫిరోజ్ గాంధీ మరణించారు. Rahul Gandhi’s grandfather Feroze Gandhi, who was also Raebareli MP, had lost his wallet many decades agoOne family in Raebareli kept it safe all these years as his memoryToday they returned his wallet to his grandson Rahul GandhiBeautiful moment ❤️pic.twitter.com/SVVCi1pckR— Ankit Mayank (@mr_mayank) January 20, 2026


