breaking news
Social Media
-
కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్చల్, వణికిన రోగులు
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఆసుపత్రిలో ఒక పాము హంగామా రేపింది. తన ఉనికితో ఆసుపత్రి రోగులు, వైద్యులను ఉలికి పడేలా చేసింది. ఈ ఘటన బరేలీ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. అసలు స్టోరీ ఏంటంటే.. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బరేలీ జిల్లా బిథ్రి చైన్పూర్ పరిధిలోని రామ్నగర్ గోటియా గ్రామానికి చెందిన అతుల్ (36)ను పాము కాటేసింది. నీటి మోటారు కింద ఉన్న పామును తొలగించడానికి ప్రయత్నిస్తుండగా పాము కాటేసింది. దీంతో ఆ పామును ఒక సంచిలో వేసుకుని నేరుగా ఆసుపత్రికి వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.కాటు తర్వాత అతని పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన బరేలీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పామును గుర్తించి, దానికి తగిన చికిత్సను (పాము విషానికి విరుగుడు మందు అవసరమా లేదా అనేది సహా) నిర్ణయించడానికి వీలుగా అతుల్ ఆ పామును సంచిలో వేసుకుని వెంట తెచ్చుకున్నాడు. తీరా ఆ పాము సంచిలో తప్పించుకుని వార్డు వైపు పరుగుదీసింది. దీంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగలు ఒక్కసారిగా వణికిపోయారు. తమ సీట్లనుంచి లేచి పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రిలో కాసేపు కలకలం రేగింది.फिरोजाबाद के सरकारी अस्पताल के अंदर एक साँप की वजह से गंभीर हालत में भर्ती मरीजों में अफरा-तफ़री मच गई।सपेरा सांप के काटने के बाद डिब्बे में बंद कर सांप को लेकर पहुंचा था। डिब्बा खुलते ही सांप वार्ड की तरफ भाग गया। मरीज बेड छोड़कर भागे। pic.twitter.com/xnQC55McWr— Dinesh shukla (Journalist) 🇮🇳 (@Dinehshukla) September 19, 2026 > మొత్తానికి దాన్ని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతుల్ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్ బరేలీలో 24 గంటల్లో నాలుగు పాము కాటు కేసులుమరోవైపు బరేలీలోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో పాము కాటుకు సంబంధించిన నాలుగు వేర్వేరు సంఘటనలు నమోదైన తరుణంలో ఈ ఘటన జరిగింది. 60 ఏళ్ల భగవాన్ దేయి తన ఇంటి సమీపంలోని పిడకలు తీస్తుండగా పాము కాటుకు గురైంది. మూడో సంఘటనలో, సాహుకారా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల సత్యవతి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది.పో నాగ్లా గ్రామానికి చెందిన 20 ఏళ్ల సోను కూడా పాము కాటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఆ నలుగురు రోగులూ బరేలీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ చదవండి: పాత చేనేతలకు కొత్త కళ..ఇలా ట్రై చేశారా? -
టికెట్ చూపించమంటే బట్టలు చించేసుకుంది!
రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీ సాధారణమే. టికెట్ లేకపోతే జరిమానా చెల్లించాలి.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. కానీ ఓ మహిళ మాత్రం టికెట్ అడిగిన టికెట్ ఎగ్జామినర్తో వాగ్వాదానికి దిగి.. చివరకు తన దుస్తులనే చించేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడున్నవారంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో రైలులో ప్రయాణిస్తున్న మహిళను యువతి చూపించమని టీటీఈ అడిగాడు. అయితే ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో డ్రామాకు దిగింది. అదే సమయంలో తన సోదరుడు కూడా రైల్వేలో టీటీఈగా పని చేస్తాడని కబర్లు చెప్పింది. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్నట్లు చేస్తూ.. ఆ యువతి ఒక్కసారిగా తన దుస్తులను తానే చించుకోవడం ప్రారంభించింది. దీంతో అక్కడున్నవాళ్లంతా కంగుతిన్నారు. ఆపై టీటీఈ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఫోన్లో రికార్డ్ చేయడంతో..అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని టీటీఈ తన ఫోన్లో రికార్డ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి గొడవకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించిన ఆయన.. అత్యవసర పరిస్థితి అనుకుంటే 112కు ఫోన్ చేయాలని మహిళకు సూచించినట్లు తెలుస్తోంది.ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ మొదలైంది. ఘటనను రికార్డ్ చేయడం వల్ల టీటీఈపై తర్వాత ఎలాంటి ఆరోపణలు వచ్చినా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆధారం ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు అందుబాటులో ఉంచితే ఇలాంటి వివాదాల్లో మరింత స్పష్టమైన ఆధారాలు ఉంటాయని కొందరు సూచిస్తున్నారు.రైల్వే సిబ్బందికి కొత్త సవాల్ప్రయాణికులతో నిత్యం నేరుగా వ్యవహరించే టీటీఈలు, ఇతర ఫ్రంట్లైన్ రైల్వే సిబ్బందికి ఇలాంటి వివాదాలు కొత్త సవాలుగా మారుతున్నాయి. టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఇరువైపులా ఉన్న వారి ప్రవర్తనను రికార్డ్ చేసే వ్యవస్థ ఉంటే వాస్తవాన్ని నిర్ధారించడం సులభమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. సోషల్మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మహిళకు జరిమానా విధించినట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, కేసులో నమోదైన ఆరోపణలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.Woman tears off her clothes to accuse TT of molestation when he asked her to show ticketNeither Indian Police Nor Indian Judiciary knows how to handle such women Men in all such services should be provided bodycams to save themselves from false cases pic.twitter.com/ZoaV3HmBek— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 19, 2026ఇదీ చదవండి: రాజా సాబ్ వార్నింగ్ వీడియో వైరల్ -
‘రోడ్డు వేయకపోతే ఓటు వేయను సర్’.. ఎంపీ సీరియస్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రశ్నించడం ఒక బాధ్యత.. అధికారంలోకి వచ్చాక అదే ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరో బాధ్యత. ఆ మధ్య రాఘవ్ చద్దా నీట్ నిరసనలపై మౌనంగా ఉండడంపై చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తానిప్పుడు అధికార పార్టీలో భాగమని.. ప్రశ్నించే స్థానంలో లేనంటూ వ్యాఖ్యానించారాయన. ఇప్పుడు కేంద్ర మంత్రి, గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తీరు కూడా అలాగే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రోడ్డు సమస్యపై ఓటర్ నిలదీయగా.. కాస్త కోపం.. కాస్త ఆవేశంగా ఆయన స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని గుణలో సెప్టెంబర్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు హనుమాన్ ఆలయం వద్ద సింధియా వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు నిర్మించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. రోడ్డు వేయకపోతే వచ్చేసారి ఎన్నికల్లో మీకు ఓటు వేయబోమని చెప్పాడు.దీనిపై సింధియా స్పందిస్తూ.. “ఈ భాష నా ముందు ఉపయోగించొద్దు.. ఊరుకుంటా అనుకుంటున్నారా’’ అంటూ కటువుగా బదులిచ్చారు. ఆ తర్వాత కాస్త శాంతించి.. మీరు వచ్చి వినతిపత్రం ఇవ్వండి.. నా బాధ్యత, అన్నీ జరుగుతాయి అని చెప్పారు. సదరు వ్యక్తికి వేలు చూపిస్తూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Janta bhi matlab ek dum bewakoof hai.Raja sahab ne election time me khud ko "jan-sevak" aur tumhe "janta-janardan" kya bol diya, tum to khud ko relevant samajh kar accountability maangne lage.Hadd me raho bhai. Charno me let kar nivedan karna seekho. pic.twitter.com/gjonJQJ5Qq— THE SKIN DOCTOR (@theskindoctor13) September 18, 2026మరోవైపు, గుణ పర్యటనలోనే సింధియా అధికారుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలతో ఎదురుచూస్తుండగా కారు వద్ద ఉన్న కలెక్టర్, ఎస్పీలను పిలిపించి.. “వాహనంలో కూర్చోవద్దు.. మీరు నా డ్యూటీలో ఉన్నారు” అంటూ ఆదేశించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.సింధియా స్పందనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్లో ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. యువత పన్నులు చెల్లించాలని, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని తరచూ సూచించే ఆయన.. తాజాగా రోడ్డు సమస్యపై ఓ పౌరుడు, రోడ్డు నిర్మించకపోతే ఓటు వేయబోమని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందిస్తున్న కొందరు.. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల కింద ఉండే ప్రజలు కాదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సిన వారని గుర్తు చేస్తున్నారు. రాచరిక కాలం ముగిసి దశాబ్దాలు గడిచాయని, ప్రజలే అసలైన యజమానులనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలని సింధియాకు చురకలంటిస్తున్నారు.ఇదీ చదవండి: మోదీ 76.. ఆయనకు కూడా 76! -
13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?!
ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి. చదువుకోవాల్సిన వయసులో మాతృత్వం. చివరకు దూరమైన బిడ్డ కోసం ఆమె తల్లడిల్లిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే తన ఏడు నెలల కొడుకు కోసం కోర్టు మెట్లెక్కిన ఆమె.. ఆ న్యాయపోరాటంలో విజయం సాధించింది. చిన్నారి అనామికా కథ.. ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.అనామికా అకర్త్కు సోషల్ మీడియా ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా.. అటు నుంచి అటు పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 11 ఏళ్లే. బాల్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అయినప్పటికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె 2026లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది మేలో భర్త, అత్తమామలు అనామికను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే అనామిక బిడ్డను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ అనామిక కోర్టును ఆశ్రయించింది.‘ఆమె కూడా ఇంకా చిన్నారే’ఈ కేసును విచారించిన కోర్టు.. ఏడు నెలల శిశువును అనామిక సంరక్షణకు అప్పగించాలని ఆదేశించినట్లు వైరల్ వీడియో సారాంశం. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. బిడ్డ తల్లి అనామిక కూడా ఇంకా చిన్నారేనన్న విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ వైరల్ కథనాల్లో కనిపిస్తోంది. అలా తన బాల్యాన్ని కోల్పోయిన ఓ బాలిక.. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడి నెగ్గిందన్నమాట. బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. కఠిన చట్టం ఉన్నా.. బాల్య వివాహాలు మాత్రంబంగ్లాదేశ్లోనూ బాల్య వివాహాలను కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం సమస్య కొనసాగుతోంది. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్లో 20–24 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 47 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నవారే. పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, సంప్రదాయాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల బాలికల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా.. ముందస్తు గర్భధారణ, ప్రసవ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధారపడటం, హింసకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బంగ్లాదేశ్ కోర్టులో అనామికకు న్యాయం జరిగింది. కొన్నిచోట్ల మరో దేశం వినిపిస్తోంది. అలాగే ఆమె వయసు విషయంలోనూ భిన్న వాదనలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఓ బాలిక తన బిడ్డ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన.. బాల్య వివాహం కేవలం ఓ పెళ్లి కాదని గుర్తుచేస్తోంది. ఒక చిన్నారి చేతుల్లో బిడ్డను పెట్టడమే కాదు.. ఆమె చదువు, స్వేచ్ఛ, కలలు, భవిష్యత్తును కూడా ముందుగానే బాధ్యతల కింద నలిపేస్తోంది. అనామికకు దక్కిన ఈ విజయం ఆమె బిడ్డను తిరిగి ఇచ్చింది.. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి మరో బాలిక వెళ్లకుండా ఆపగలమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.🚨 SHOCKING: CHILD MARRIED AT 11, MOTHER AT 13!Anamika Akter, reportedly married to a 22 year old man at just 11, became a mother at 13.A CHILD is now raising another CHILD. 💔How is this still happening in Bangladesh? pic.twitter.com/Ayg0vJIN77— News Matrix (@NewsMatrixIND) September 18, 2026 -
ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతకాదు. ఎలాగైనా లేటెస్ట్ ఐఫోన్ దక్కించుకోవాలని ఉబలాట పడతారు ఐఫోన్ లవర్స్. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ప్రారంభం కావడంతో నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం. తాజా ఐఫోన్ను దక్కించుకోవడం కోసం కొనుగోలుదారులుగంటల తరబడి వేచి చూశారు. ఈ సందర్బంగా భార్యకు కొత్త ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా బంగారాన్ని అమ్మేసిన వైనం నెట్టింట విచిత్రంగా నిలుస్తోంది. ఐఫోన్నుదక్కించుకునేందుకు ఒక్కొక్కరి కష్టాలు మామూలుగా లేవు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మహిళలు స్టోర్ ఓపెన్ చేయకముందు షాప్ ముందు క్యూ కట్టారు. కొందరు ఐఫోన్ దక్కిచంచుకోవడం కోంసం సెలవు కూడా తీసుకున్నారు.ప్రస్తుతం ఇవి సోషల్మీడియాలో వైరల్గా మారాయి.బంగారం అమ్మి మరీ...ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య కోరిక మేరకు బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి బంగారం అమ్మినట్లు తెలిపారు. "ఆనాడు డబ్బులు లేవు, నేడు ఉన్నాయి, రేపు ఉంటాయో లేదో" అని చెబుతూ తన భార్య కోసం ఈ ఫోన్ కొన్నానని ఆయన వెల్లడించారు.తన భార్య 'బర్గుండి' (Burgundy) రంగులో ఉన్న iPhone 18 Proని తీసుకురమ్మని చెప్పిందని ఆయన తెలిపారు.పెళ్లి కానుకగా ఐఫోన్పంజాబ్కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కానుకగా కాబోయే భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేయడానికి ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. తనకోసం ఐఫోన్ 18 ప్రో మాక్స్తో కలిపి మొత్తం రెండు ఫోన్ల కోసం ఆయన రూ. 3.5 లక్షలకు పైగా వెచ్చించారు.ధరల పెంపు లెక్కే కాదుఐఫోన్ ధరలు గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ, ఐఫోన్ ప్రేమికులు ఈ ధరను చెల్లించడానికి వెనుకాడబోరని కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. హర్యానాకు చెందిన విశాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ధరలు పెరిగినా తాము సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.ముందస్తు బుకింగ్స్స్టోర్ వద్ద తీవ్ర రద్దీ నెలకొనగా, ముందుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్నవారికే మాత్రమే స్టోర్లోకి ప్రవేశం కల్పించారు. ముందస్తు బుకింగ్ చేసుకోని కొందరు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.తొలి ఫోన్ అందుకున్న ఆనందం అంతేకాదు ఇండియాలో అందరికంటే ముందే తానే కొత్త ఐఫోన్నుసొంతం చేసుకోవాలనే ఆశతో ఏకంగా 10–12 గంటల పాటు క్యూలో నిలబడ్డావో వ్యక్తి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద రాత్రంతా వేచి చూసి, భారత్లో తొలి iPhone 18 ను సొంతం చేసుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన సంగతి సోషల్మీడియాలో సందడిగా మారింది. -
సిగార్తో యోగి.. యాంగ్రీ యంగ్మ్యాన్గా అఖిలేశ్.. అదిరిపోయే సీన్..
చీకటి గదిలో విలన్ తరహా కుర్చీలో యోగి.. చేతిలో సిగార్.. చుట్టూ అనుచరులు.. మరోవైపు ‘యాంగ్రీ యంగ్మ్యాన్’లా అఖిలేశ్ ఎంట్రీ.. డైలాగ్లు పేలుతుంటే బయట జనం నినాదాలు.. ఇదేదో 80ల బాలీవుడ్ సినిమా కాదు.. 2027 యూపీ ఎన్నికల ముందు సమాజ్వాదీ పార్టీ విడుదల చేసిన ఏఐ పొలిటికల్ సినిమా!ఎన్నికల సమరం మొదలవ్వకముందే ఉత్తరప్రదేశ్లో రాజకీయ తెరపై కొత్త సీన్ మొదలైంది. మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు AI సినిమాల యుద్ధంగా మారుతోంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేస్తూ మరో AI వీడియోను విడుదల చేశారు. ఈసారి ఏకంగా 80ల నాటి మసాలా సినిమాల ఫార్ములాను తీసుకొచ్చారు.సీన్.. విలన్ ఎంట్రీ!తెరపై యోగి ఆదిత్యనాథ్ పాత్ర కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడిలా కాదు.. పాత బాలీవుడ్ విలన్ గెటప్లో! చుట్టూ అనుచరులు.. చేతిలో సిగార్.. తన పీఆర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్లు సన్నివేశం. ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు పీఆర్ యంత్రాంగం పనిచేస్తుందన్న అర్థంలో డైలాగ్లు ఉంటాయి. అంతేకాదు.. పీఆర్ కోసం తాను భారీగా ఖర్చు చేస్తున్నానని, ప్రధాని మోదీ కంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నానని యోగి పాత్ర చెప్పేలా వీడియోను రూపొందించారు.सपा वालों का नया वीडियो जारी! सोशल मीडिया पर रहा है तेजी के साथ वायरल।अजय सेठअब बहुत हुआ तुम्हारा पाप, फूट चुका है तुम्हारा घड़ाअब यूपी लाएगा पीडीए सरकारSamajwadi party | Akhilesh Yadav | CM Yogi pic.twitter.com/0U6Kbcmkp0— India Times Official 🇮🇳 (@indiatimes24x7) September 15, 2026కట్ చేస్తే.. హీరో ఎంట్రీ!కట్ చేస్తే హీరోగా అఖిలేశ్ యాదవ్ పాత్ర తెరపైకి వస్తుంది. ముఖంలో కోపం.. మాటల్లో పదును.. యోగి పాత్రను ప్రశ్నిస్తూ వరుస డైలాగ్లు. మహిళలపై పెరుగుతున్న నేరాలు, ఎక్స్ప్రెస్వేల నిర్మాణ నాణ్యత, అవినీతి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ యోగి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్లు చూపించారు. ధరల పెరుగుదలను కూడా ప్రస్తావిస్తూ.. ‘చక్కెర కంటే మనిషి ప్రాణం చౌకైపోయింది.. గ్యాస్, రేషన్ అన్నీ ఖరీదయ్యాయి.. చౌకగా మిగిలింది పేదవాడి ప్రాణమే’ అనే భావన వచ్చేలా అఖిలేశ్ పాత్రకు డైలాగ్ పెట్టారు.‘పీఆర్’ వర్సెస్ ‘ప్రజల ప్రేమ’!ఇక్కడే కథలో మరో ట్విస్ట్. వీడియోలో యోగి పాత్ర తన పీఆర్ యంత్రాంగం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. దానికి అఖిలేశ్ పాత్ర.. తనకు ప్రజల నుంచి లభించే ప్రేమే ఏ పీఆర్ వ్యవస్థకైనా సరిపోతుందని బదులిస్తుంది. అంటే.. ఒకవైపు పీఆర్.. మరోవైపు ప్రజల ప్రేమ! అంటూ రాజకీయ సందేశాన్ని సినిమా సన్నివేశాల రూపంలో చూపించే ప్రయత్నం చేసింది ఎస్పీ. అయితే, వీడియోలో యోగి పాత్ర రాజకీయ ‘మోడల్’పై కూడా అఖిలేశ్ పాత్ర ఆరోపణలు చేస్తున్నట్లు సన్నివేశాలను రూపొందించారు. ప్రజలను విభజించడం, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించడం వంటి ఆరోపణలు అందులో ఉన్నాయి.చివరి సీన్ మరింత సినిమాటిక్గా ఉంటుంది. కిటికీ బయట భారీగా ఎస్పీ కార్యకర్తలు గుమిగూడినట్లు చూపించారు. చేతుల్లో ప్లకార్డులు.. నినాదాలతో హోరెత్తుతున్న వాతావరణం. ఇదంతా చూస్తే.. ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు, సభలు, రోడ్షోలు దాటి రాజకీయ పార్టీలు ఇప్పుడు AI తెరపైకి కూడా అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇక, యోగి ఆదిత్యనాథ్ను లక్ష్యంగా చేసుకుని ఎస్పీ రూపొందించిన AI వీడియోలలో ఇది తాజా ఎపిసోడ్. గతంలో విడుదల చేసిన మరో AI వీడియోలో యోగి పాత్రను చిల్లం తాగుతున్నట్లు చూపించారు. ఆ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించి విమర్శలు చేసింది. ఇప్పుడు 80ల సినిమా ఫార్ములాతో వచ్చిన కొత్త వీడియోతో మరోసారి రాజకీయ దుమారం మొదలైంది. 2027 యూపీ ఎన్నికల వేడి పెరిగే కొద్దీ.. ఈ AI రాజకీయ సినిమా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.Blockbuster Cinema 📽️ Akhikesh Yadav Vs Yogi Adityanath pic.twitter.com/eZJwroF9eq— Rahul Kumar (@MukAn_X) September 17, 2026 -
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన మాజీ ఉపాధ్యాయుడు హెచ్సీ పటేల్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదీ చిన్ననాటి జ్ఞాపకాలను పటేల్ గుర్తుచేసుకోవడం ఒకవైపు ఆసక్తికరంగా మారితే.. మరోవైపు ఆయన ప్రస్తుత వయసుపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇద్దరికీ ఒకే వయసు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్ల విషయంలోనూ పొంతన కుదరకపోవడమూ.. చర్చకు దారి తీసింది.హెచ్సీ పటేల్ గుజరాత్లోని వడ్నగర్లో మోదీ చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారట. 1965 జూన్ నుంచి 1967 మే వరకు మోదీకి మ్యాథ్స్, సైన్స్ బోధించినట్లు పటేల్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పటేల్ 10, 11 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధించారని పేర్కొన్నారు. పీటీఐ ఆధారంగా వచ్చిన మరో కథనంలో 11, 12 తరగతుల సైన్స్ టీచర్గా పేర్కొన్నారు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే 1965లో ఆయన వయసు సుమారు 14–15 ఏళ్లు. 1967లో స్కూల్ విద్య పూర్తిచేసే సమయానికి ఆయన వయసు 16–17 ఏళ్ల మధ్య ఉంటుంది. అందువల్ల పటేల్ ఆ సమయంలో ఉపాధ్యాయుడిగా ఉన్న విషయం మాత్రం ఆయన చెప్పిన వివరాలతో స్పష్టంగా ఉంది. మరి టీచర్ వయసెంత? అంటూ ట్రోలింగ్ మొదలైంది.Ahmedabad, Gujarat: Teacher of Prime Minister Narendra Modi, H.C. Patel says, "I taught Narendra Modi for two years, from June 1965 to 1967 May, when he was in Classes 10 and 11. In Class 11, he would sometimes come to my house for tuition-not every day, but occasionally. There… pic.twitter.com/d7L7wCqk9N— IANS (@ians_india) September 17, 2026మోదీకి 14–16 ఏళ్ల వయసులో పాఠాలు చెప్పిన టీచర్.. ఇప్పుడు 76 ఏళ్ల మోదీతో పోలిస్తే మరింత వయసులో ఉండాలని కొందరు నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా టీచర్, విద్యార్థి మధ్య ఉండే వయసు తేడాను ప్రస్తుత వయసులతో పోల్చుతూ.. పటేల్ 80 లేదంటే 90లలో ఉండాల్సి ఉంటుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.‘మోదీ.. చాలా షార్ప్’ఓవైపు ఈ చర్చ నడుస్తుండగా.. పటేల్ మాత్రం మోదీ విద్యార్థిగా ఉన్న రోజుల గురించి ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు. మోదీ చాలా చురుకైన విద్యార్థి అని, స్కూల్లో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని చెప్పారు. ఒకసారి పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు నిర్వహించిన నాటకంలో మోదీ జోగీదాస్ ఖుమాన్ పాత్ర పోషించారని తెలిపారు. కత్తితో నటిస్తూ కాఠియావాడీ భాషలో సంభాషణలు చెప్పిన ఆయనకు ప్రేక్షకుల నుంచి దాదాపు పది నిమిషాల పాటు చప్పట్లు(స్టాండింగ్ ఒవేషన్) లభించాయని పటేల్ గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచే మోదీకి ఈత అంటే ఆసక్తి ఉండేదని కూడా పటేల్ చెప్పారు. వడ్నగర్లోని శర్మిష్ఠ చెరువులో ఈత కొట్టే సమయంలో ఓసారి పిల్ల మొసలిని ఇంటికి తీసుకొచ్చారని.. తల్లి హీరాబెన్ దానిని తిరిగి చెరువులో వదిలేయాలని చెప్పడంతో మరుసటి రోజు మళ్లీ చెరువులో వదిలేశారని వివరించారు.రాజకీయాల్లోకి వచ్చినా.. టీచర్ను మర్చిపోలేదుమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను గుర్తించారని పటేల్ తెలిపారు. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు.. జన సందోహం మధ్య తనను గుర్తించిన మోదీ వచ్చి పాదాలకు నమస్కరించారని చెప్పారు. తర్వాత 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన పాత ఉపాధ్యాయులను సత్కరించిన కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు.సోషల్ మీడియాలో ప్రశ్న.. అసలు క్లారిటీ ఇదేఅయితే మోదీ, ఆయన టీచర్ పటేల్ వయసు 76 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. పటేల్ వయసు 90–91 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో ఆయన వయసుపై సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలకు తెరపడినట్టయింది. ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్ల విషయంలో ఎన్డీటీవీ, పీటీఐ కథనాల్లో కనిపించిన తేడా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.Age of PM modi - 76Age of Teacher - 75 pic.twitter.com/kVODe4xyd7 https://t.co/e0mimnacaU— AIN (@Tejusurya_) September 17, 2026ఇదీ చదవండి: ఆ స్టార్ హీరోలు చట్టాన్ని ఉల్లంఘించారని తెలుసా? -
ట్రక్ డ్రైవర్ నుంచి యూట్యూబ్ స్టార్గా.. లక్షల్లో ఆదాయం
అతను ఒకప్పుడు లారీ డ్రైవర్. కుటుంబాన్ని పోషించుకునేందుకు తనవాళ్లకు దూరంగా దాదాపు రెండు దశబ్దాలు పాటు దేశమంతా తిరిగాడు. దిల్ ఉన్నోడు దునియాను ఏలతాడు అన్నట్టు రోడ్డుపై సాధారణ డ్రైవర్గా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయనే నేడు దేశంలోని ప్రముఖ డిజిటల్ క్రియేటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. యూట్యూబ్ స్టార్ ఎదిగిన వైనం నెట్టింట విశేషంలో నిలుస్తోంది. పదండి మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.జార్ఖండ్లోని జమ్తారా జిల్లాకు చెందిన రాజేష్ రవాణి సక్సెస్ స్టోరీ ఇది. హైవేపై సాధారణ వంటలు చేయడం నుండి తన సొంత తన కలల ప్రాజెక్ట్ 'లగ్జరీ ట్రక్'ను డిజైన్ చేసుకునే వరకు ఆయన ప్రయాణం కోట్లాది మందిని ఆకట్టుకుంది. రాజేష్ రవాణి 25 ఏళ్లుగా లారీ డ్రైవర్గా పని చేస్తూ, సుదీర్ఘ ప్రయాణాల్లో రోడ్డు పక్కనే మటన్, చికెన్, ఫిష్, పన్నీర్ వంటి రుచికరమైన వంటలు చేసేవారు. అదే ఇపుడు అనేక లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతియూట్యూబ్ స్టార్గాతన కుమారుడు సాగర్ రవాణి ప్రోత్సాహంతో 2021లో 'ఆర్ రాజేష్ వ్లాగ్స్' (R Rajesh Vlogs) పేరుతో యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించారు. ఫేస్-రివీల్ వీడియో తర్వాత ఈ ఛానెల్కు ఒక్కసారిగా విపరీతమైన ఆదరణ లభించింది. ఒకప్పుడు డ్రైవింగ్ ద్వారా నెలకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల సంపాదించిన ఆయన, యూట్యూబ్ ద్వారా నెలకు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షలు, కొన్నిసార్లు రూ. 18 లక్షల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా బలపడ్డారు. అంతేనా తనకోసం ఒక స్పెషల్ ట్రక్ను కూడా డిజైన్ చేసుకున్నారు. ఒక సందర్భంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆయన పట్టుదలను ప్రశంసించడం విశేషం. View this post on Instagram A post shared by Rajesh Rawani (@r_rajesh_07)ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్స్పెషల్ లగ్జరీ ట్రక్తన డిజిటల్ సంపాదనతో రోడ్డుపై జీవనానికే అనువుగా పూర్తి ఏసీ, కస్టమ్-బిల్ట్ స్టోరేజ్ క్యాబినెట్లు, ఆధునిక వంటగది సదుపాయాలతో కూడిన 'భారతదేశపు అత్యంత విలాసవంతమైన ట్రక్'ను డిజైన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఛానెల్కు యూట్యూబ్లో దాదాపు 3 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, బిలియన్కు పైగా వ్యూస్తో పాటు ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఇదీ చదవండి: లవర్ను పెళ్లాడి బిహార్కు, ఇన్స్టాలో అమెరికా అమ్మడు సందడి -
లవర్ను పెళ్లాడి బిహార్కు, ఇన్స్టాలో అమెరికా అమ్మడు సందడి
అమెరికాలోని అట్లాంటా (జార్జియా) నగరానికి చెందిన యువతి హోప్ తను ప్రేమించిన వాడికోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టింది. భారతీయ యువకుడైన అభిషేక్ సింగ్ను వివాహం చేసుకుని బిహార్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో స్థిరపడింది. ఆమె తన విభిన్నమైన కల్చరల్ లైఫ్స్టైల్కు సంబంధించిన విశేషాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2023లో హోప్ అభిషేక్ సింగ్ను వివాహం చేసుకుంది. 2025 అక్టోబర్లో తొలిసారిగా ఇండియాకు వచ్చింది. అంతే ఇక్కడి సంస్కృతిపై ఇష్టంతో బిహార్లోని ఒక చిన్న గ్రామంలోనే స్థిరపడింది. ఆమె ప్రస్తుతం ఆమె బిహార్లోని గ్రామీణ వాతావరణానికి, అక్కడి సాధారణ జీవనశైలికి అలవాటుపడి, భర్త, కుమారుడితో ఎంతో ఆనందంగా గడుపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Singhfamily2.0 (@singhfamily2.0)ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్ ప్లాస్టిక్ టబ్లో చేతులతో బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, సాంప్రదాయ పొయ్యి మీద వంట చేయడం వంటి సాధారణ గ్రామ జీవితపు దినచర్యలను ఆమె తన సోషల్ మీడియా వీడియోల ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా కుర్తాలు, చీరలు ధరించడం, సింధూరం పెట్టుకోవడం వంటి భారతీయ ఆచారాలను పాటిస్తోంది. 'గెట్-రెడీ-విత్-మి' వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే ఆమె కంటెంట్లో ఆహారం కూడా ఒక ముఖ్యమైన భాగం. సమోసా చాట్, పావ్ బాజీ, రోటీలు చేయడం వంటి వంటకాలను స్వయంగా చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం. ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతిసోషల్ మీడియా స్పందనభారతీయ సంస్కృతికి అలవాటు పడి, స్థానిక భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న తీరుపై నెటిజన్లు సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. అమెరికాను వదిలి బీహార్లోని ఒక మారుమూల గ్రామంలో ఆమె జీవిస్తుండటం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె నిర్ణయాన్ని ఆశ్చర్యంగా,విమర్శనాత్మకంగా చూస్తుండగా,మరికొందరు ఆమె భారతీయ సంస్కృతిని స్వీకరించిన తీరును అభినందిస్తున్నారు. అప్పుడప్పుడు విమర్శలు ఎదురైనప్పటికీ, ఆమె కంటెంట్కు వచ్చిన స్పందనలో చాలా వరకు సానుకూలంగానే ఉంది. ఈ అసాధారణమైన సాంస్కృతిక మార్పు, ఆమె గ్రామ జీవితానికి అలవాటుపడిన తీరు యూజర్లను ఆకట్టుకున్నాయి. ఇదీ చదవండి: మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు -
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్ను తొలగించడంతో డ్రోన్కు ఆపరేటర్తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026ఇదేం కొత్త కాదు!ఉక్రెయిన్లో డ్రోన్లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్ను విసిరి రష్యా డ్రోన్ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట! -
ఆఫీసులో కుక్కల హల్చల్.. ట్రెండింగ్లో వీడియో
నిరసనలు పలు రకాలు.. సమస్యను బట్టి వినూత్నంగా, వెరైటీగా చేపట్టేవి మరికొన్ని. కానీ వీధికుక్కల బెడదపై చేపట్టిన ఈ నిరసన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారులెంతకూ పట్టించుకోవడం లేదంటూ ఏకంగా కుక్కలనే నగర పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చి అధికారి టేబుల్పై వదిలేశారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లతో దండ వేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్లో వైరల్గా మారి ట్రెండింగ్లోకి వచ్చింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. చిన్న సంచుల్లో తీసుకొచ్చిన వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే టేబుల్పై వదిలారు. దీంతో అవి అక్కడి నుంచి అటూ ఇటూ పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.Yuva Sena district chief Vikram Randhave reportedly released 4–5 stray dogs inside the Niphad Nagar Panchayat chief officer’s office to protest the growing stray dog menace and alleged inaction by the civic body. 💀😭 pic.twitter.com/0wgQpHP00l— Ghar Ke Kalesh (@gharkekalesh) September 16, 2026నిఫాడ్ పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయిందని, వాటి వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. పలువురు కుక్కకాటుకు గురయ్యారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో మండపాలకు వచ్చే ప్రజల్లోనూ వీధికుక్కల కారణంగా భయాందోళన నెలకొందని తెలిపారు.వీధికుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించడంతోపాటు వాటిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాంధవే డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా టెండర్ ప్రక్రియలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇదే తరహాలో అధికారుల కార్యాలయంలో కుక్కలను తీసుకొచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.ఇటీవల మధ్యప్రదేశ్లోని ఖండ్వాలోనూ వీధికుక్కల సమస్యను నిరసిస్తూ ఓ వ్యక్తి కుక్క మాస్క్ ధరించి ప్రజావాణికి హాజరైన ఘటన వైరల్గా మారింది. తాజాగా నిఫాడ్లో కార్యకర్తలు ఏకంగా కుక్కలనే అధికారుల కార్యాలయంలోకి తీసుకురావడంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.Khandwa, Madhya Pradesh - In a highly unusual form of protest, the Leader of the Opposition in the Khandwa Municipal Corporation, Deepak Rathore, arrived at the district Collectorate during a public hearing accompanied by a man wearing a dog mask. The demonstration was aimed at… pic.twitter.com/fkUih3zv4F— NextMinute News (@nextminutenews7) August 19, 2026ఇదీ చదవండి: మొసలిని ఇంటికి తెచ్చాడు.. అమ్మ మాటతో వెనక్కి వెళ్లాడు -
మోదీ గుండె ధైర్యానికి ఇదిగో సాక్ష్యం!
నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న భారత ప్రధాని. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే మోదీ చిన్ననాటి జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఓ ఘటన తెలిస్తే మాత్రం.. ఆయన ‘గుండె ధైర్యం’ ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. మోదీకి చిన్నతనంలో ఈత అంటే చాలా ఇష్టం ఉండేదట. ఉదయం కుటుంబ టీ దుకాణంలో పని చేసిన తర్వాత మోదీ వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సుకు వెళ్లేవారు. సరస్సు మధ్యలో ఉన్న ఆలయం వరకు ఈత కొట్టి, అక్కడి జెండాను తాకి తిరిగి ఒడ్డుకు వచ్చేవారు. ఇలా రోజుకు మూడుసార్లు చేసేవారు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైంది. ఈత కొడుతుండగా ఓ మొసలి ఆయన కాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో వారం రోజులు ఆయన మంచానికే పరిమితం అయ్యారు. అయితే నెల తిరగకుండానే ఆయన మళ్లీ అదే సరస్సులో ఈతకు వెళ్లారట. ఈ విషయాన్ని మోదీ జీవితంపై వచ్చిన నరేంద్ర మోదీ: ది గేమ్ చేంజర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ సురేశ్ కే వర్మ ప్రస్తావించారు. అదే తొలిసారి కాదు!మోదీ చిన్ననాటికి సంబంధించిన మరో మొసలి కథ కూడా ప్రచారంలో ఉంది. ఓసారి సరస్సు ఒడ్డున ఓ మొసలి పిల్ల కనిపించడంతో దాన్ని ఆయన భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లారట. అది అడుగుకుపైగా పొడవు ఉందట. దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని మోదీ అనుకున్నప్పటికీ.. తల్లి హీరాబెన్ మాత్రం వద్దని చెప్పారట. వెంటనే దాన్ని ఆయన తిరిగి సరస్సులో వదిలేశారట. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మోదీ స్వయంగా కూడా 2019లో బేర్ గ్రిల్స్తో కలిసి పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సాధారణ కుటుంబంలో, చిన్న ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి మళ్లింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ జీవితంలోనూ ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాల్యంలో మొసలిని ఎదుర్కొన్న ఘటన కావొచ్చు.. తర్వాత పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కావొచ్చు.. మోదీ జీవిత ప్రయాణంలో ధైర్యం, నిర్ణయాత్మకతకు సంబంధించిన అధ్యాయాలు చాలానే కనిపిస్తాయి. అయితే వాటన్నింటికీ చాలా ముందే.. వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సు దగ్గర ఓ బాలుడిగా ఎదుర్కొన్న ఆ మొసలి ఘటన మాత్రం ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: మోదీని శ్రీ కృష్ణుడితో పోల్చేశాడే! -
మడతపెట్టే ఫోన్పై మీమ్స్.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఐఫోన్ ప్రియుల కోసం టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల మడతపెట్టే ఫోన్ ‘డ్యువో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ను దక్కించుకునేందుకు ఎప్పటిలాగే టెక్ లవర్స్ ఆసక్తి కనబరిచారు. యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరి మరీ మడతపెట్టే ఫోన్లు కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొంత మంది నెటిజనులు సరదా కామెంట్లు పెట్టారు.ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ హై ఎండ్ మోడల్ ధర నాలుగున్నర లక్షల రూపాయలు ఉంది. ఈ ధరలపై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ రేటుకి కారు లేదా బైకు వచ్చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా పలు రకాల వీడియోలతో నెటిజనులు నవ్వులు పూయిస్తున్నారు. ఐఫోన్ ధరల మాట ఎలా ఉన్నా ఈ మీమ్స్ మాత్రం తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. వీటిని చూసినవారంతా భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు.. ఎందుకో తెలుసా? #Iphone18 ProMax #Effect .....😂😂 pic.twitter.com/GM1QM6zVwD— హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature) September 15, 2026 4L ki inko 1L kalipisthey Alto vachesthadi🫡#IPhone18 #IPhone17 #AppleEvent pic.twitter.com/ByMYOi8Kl5— Fukkard (@Fukkard) September 10, 2026 ₹4,50,000 for Foldable iPhone? 😳 -#iPhoneDuo #Apple #iPhone18 #iphone pic.twitter.com/d6KHsF26Pt— Ankit Uttam (@ankituttam) September 10, 2026 Rammurthy Avre and friends react to the recent #apple launch and how expensive things are getting. pic.twitter.com/4D5JOYFK3N— Danish Sait (@DanishSait) September 11, 2026 Thank you #apple pic.twitter.com/97gi9hGHbM— Pushpendra Singh (@pushpendrakum) September 11, 2026 सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek— Sanket (@BTechComedian) September 10, 2026Me trying to justify buying iPhone 18 to my parents: 😭#iphone #Apple pic.twitter.com/e4wc92nnrU— escape.1 (@xescape18) September 10, 2026 -
‘క్వీన్ ఫిషర్’ యూట్యూబర్ జీవితం విషాదాంతం
'తంబూరు క్వీన్ ఫిషర్' అనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కేకే తంబూరు (36), అద్దె ఇంట్లోని ఒక గదిలో శవమై కనిపించారు. వైకోం చెంబు కట్టిక్కున్ను తురుతుకు చెందిన తంబూరు, సోమవారం మధ్యాహ్నం పులించువాడ్లోని ఒక అద్దె ఇంట్లో శవమై కనిపించారు. సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన ఆమె 13 ఏళ్ల కుమార్తె వచ్చిన తరువాత ఈ విషాదం వెలుగు చూసింది. ఆమె అకాల మరణం ఎంతోమంది అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.భర్తతో విడిగా ఉంటున్న ఆమె, గత కొన్ని నెలలుగా తన 13 ఏళ్ల కూతురితో కలిసి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కుమారుడు భర్త వద్ద ఉంటున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన కూతురు, లోపల నుండి గొళ్ళెం వేసి ఉండటాన్ని గమనించింది. కిటికీలో నుంచి చూడగా తల్లి ఉరివేసుకుని కనిపించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వైకోం పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం అనంతరం, మృతదేహాన్ని కట్టిక్కున్నులోని ఆమె పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.బంధువుల ఆరోపణలుపాలక్కాడ్కు చెందిన ఒక యువకుడితో ఆమెకు సాన్నిహిత్యం ఉందని, వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలను చూపిస్తూ ఆ యువకుడు ఆమెను బెదిరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.ఎవరీ క్వీన్ ఫిషర్'Queen Fisher' పేరిట యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తూ, సాంప్రదాయ చేపల వేట వీడియోలతో కేరళకు ఒక అరుదైన చేపలు పట్టే పద్ధతి పరిచయం చేసిన ఘనత తంబూరు సొంతం. తరతరాలుగా ఆమె కుటుంబంలో వస్తున్న చేపలు పట్టే పనే తంబూరు జీవిత గమనాన్ని మార్చివేసింది. పదవ తరగతి చదువు పూర్తి చేశాక, ఆమె తన తల్లితో కలిసి చేపలు పట్టడం మొదలుపెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయంతో తన తమ్ముళ్లు, చెల్లెళ్ల చదువును పూర్తి చేసింది.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకుటుంబాన్ని పోషించుకునేందుకు పార్ట్టైమ్ ఉద్యోగాలు, డ్రైవింగ్ స్కూల్లో పని, వస్త్ర తయారీ యూనిట్లో పనిచేస్తున్నప్పటికీ, తంబూరు తన కుటుంబం యొక్క సాంప్రదాయ చేపల వేటను ఎన్నడూ వదులుకోలేదు. వారు పోటు ఎక్కువగా ఉన్నప్పుడు పడవలో వెనుక జలాల్లోకి వెళ్లి, వల గానీ ఎర గానీ లేకుండా బురద, రాళ్ల మధ్య వెతుకుతూ చేతులతో చేపలు పట్టేవారు. అలా ఆమె తొలి వీడియోకే 9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భర్త నుండి విడిపోయి, తమ కుటుంబ జీవనాధారమైన సాంప్రదాయ చేపల వేటను వేలాదిమందికి సుపరిచితం చేసిన తంబూరు, 36 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా కన్ను మూయడం విషాదం. ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి! -
దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు
మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. నాగపట్నం జిల్లాలోని నాగూర్ ఆండవర్ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.ముస్లిం పెద్దల ఆశీర్వాదం..నాగూర్ దర్గా చైర్మన్, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్ ఖలీఫా సాహిబ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.VIDEO | Nagapattinam: Hindu wedding held at Nagore Dargah, with people from both Hindu and Muslim communities attending the ceremony. pic.twitter.com/D2f4vQ83PH— Press Trust of India (@PTI_News) September 15, 2026వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్ అభిప్రాయపడ్డారు. ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నాగ్పూర్ హిట్ అండ్ రన్ కేసులో బిగ్ ట్విస్ట్ -
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్ను తాకాయి. దీంతో ఇంజిన్లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్లైన్స్కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్లో ల్యాండ్ అవుతుండగా రన్వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026 -
ఫోన్పే, గూగుల్పే వాడుతున్నారా?.. అయితే ఎక్స్ట్రా ఛార్జీలు కట్టాల్సింది ఎవరు??
ఇన్నాళ్లూ ఉచితంగా సాగిన యూపీఐపై ఇప్పుడు వాయింపు మొదలైందనే చర్చ జోరందుకుంది. అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని, ఆన్లైన్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు పడతాయంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని రకాల లావాదేవీలకు రూ.5, మరికొన్నింటికి అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇక యూపీఐతో డబ్బులు పంపినా.. షాపులో చెల్లించినా.. మన జేబుకు మోత పడుతుందా? అన్న ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. అసలు ఈ ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయి? ఎంత చెల్లించాలి? కస్టమర్ జేబు నుంచి డబ్బులు పోతాయా? లేక వ్యాపారే భరించాలా? యూపీఐ వాడే ప్రతి ఒక్కరిపైనా ఛార్జీల భారం పడుతుందా?.. మీరు కిరాణా షాపులో సామాన్లు కొన్నారు.. బయట షాపింగ్ చేశారు. ఫోన్ తీసి యూపీఐతో డబ్బులు పంపారు. ఏమైనా అదనంగా కట్టాలా?.. అవసరం లేదు. స్నేహితుడికి రూ.10 వేలు పంపారు.. ఛార్జీ పడుతుందా? అదీ లేదు. మరి యూపీఐపై ఛార్జీలు అంటూ వస్తున్న వార్తలేంటి? ఇక్కడే అసలు గందరగోళం మొదలైంది. కొత్త నిబంధనల ప్రకారం అందరూ యూపీఐకి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 15 నుంచి కొన్ని రకాల వ్యాపార చెల్లింపులపై మాత్రమే ‘ఎండీఆర్’ అనే ఛార్జీ ఉంటుంది. అది కూడా సాధారణ కస్టమర్ చెల్లించాల్సింది కాదు.. వ్యాపారి చెల్లించాల్సింది.చాలా సింపుల్గా చెప్పాలంటే.. మీరు ఒక వ్యక్తికి డబ్బులు పంపితే ఎలాంటి ఛార్జీ ఉండదు. ఎంత మొత్తం పంపినా ఇదే నిబంధన. ఉదాహరణకు మీ స్నేహితుడికి రూ.10 వేలు పంపినా, కుటుంబ సభ్యుడికి రూ.50 వేలు పంపినా యూపీఐ ఛార్జీ ఉండదు. అలాగే షాపులో మీరు రూ.2 వేల వరకు యూపీఐతో చెల్లించినా ఎలాంటి ఛార్జీ లేదు. అంటే రూ.500, రూ.1,000, రూ.2,000 బిల్లు కట్టేటప్పుడు మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి రూ.2 వేలు దాటితే?ఇక్కడే కొత్త నిబంధన వస్తుంది. ఒక వ్యాపారికి రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపు చేస్తే కొన్ని సందర్భాల్లో 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. కానీ ఆ డబ్బును కస్టమర్ నుంచి తీసుకోకూడదు. వ్యాపారే భరించాలి. ఈ ఛార్జీ ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా రూ.300కే పరిమితం.ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్లో రూ.6,000 బిల్లు కట్టారనుకోండి. 0.4 శాతం ప్రకారం రూ.24 ఎండీఆర్ వస్తుంది. మీరు రూ.6,000 మాత్రమే చెల్లించాలి. ఆ రూ.24ను రెస్టారెంట్ భరిస్తుంది. అలాగే రూ.30 వేల విలువైన మొబైల్ కొంటే.. మీరు రూ.30 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదనంగా యూపీఐ ఛార్జీ పేరుతో డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.పెట్రోల్ పోయించుకుంటే?ఇక్కడ మరో చిన్న తేడా ఉంది. పెట్రోల్, రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి కొన్ని రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుంది. ఈ రూ.5 కూడా కస్టమర్ చెల్లించాల్సినది కాదు.. వ్యాపారి భరించాల్సిందే. అంటే పెట్రోల్ బంకులో రూ.5,000 విలువైన ఇంధనం పోయించుకుని యూపీఐతో చెల్లించినా.. మీరు రూ.5,000 మాత్రమే చెల్లిస్తారు.చిన్న షాపుల వాళ్లకు ఏంటి?ఇదీ చాలా ముఖ్యమైన విషయం. చిన్న కిరాణా దుకాణాలు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు పొందే చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్ సదుపాయం కొనసాగుతుంది. అందుకే చిన్న షాపు దగ్గర రూ.200, రూ.500, రూ.1,000 ఇలా యూపీఐతో చెల్లించే వారికి ఎలాంటి మార్పు ఉండదు.ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది?ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. ‘ఎండీఆర్’ అంటే యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారికి సంబంధించిన చిన్న ఛార్జీ. వచ్చిన మొత్తాన్ని బ్యాంకులు, చెల్లింపు సేవలు అందించే సంస్థలు, యూపీఐ యాప్లతో కూడిన చెల్లింపు వ్యవస్థలోని భాగస్వాములకు పంచుతారు. యూపీఐ వ్యవస్థను నడపడం, భద్రత పెంచడం, మరింత విస్తరించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.వ్యాపారి మీ దగ్గర అడిగితే?ఇదే ఇప్పుడు చాలామందికి ఉన్న భయం. యూపీఐ ఛార్జీ వచ్చింది.. అదనంగా డబ్బులు ఇవ్వండి అని షాపు యజమాని అడిగితే?. నిబంధనల ప్రకారం ఆ ఛార్జీని కస్టమర్పై వేయకూడదు. బ్యాంకులు వ్యాపారులు ఈ ఎండీఆర్ను కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని ఆర్థిక శాఖ సూచించింది. యూపీఐ యాప్లు కూడా అదనపు ప్లాట్ఫామ్ ఫీజులు లేదంటే అదనపు చార్జీలు విధించకూడదు. అంటే.. యూపీఐ ఇక ఫ్రీ కాదా?సామాన్యుడి విషయంలో ఇప్పటికీ ఫ్రీనే. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితం. రూ.2 వేల వరకు వ్యాపార చెల్లింపులూ ఉచితమే. చిన్న వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఆర్థికశాఖ, ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఎండీఆర్ వల్ల మొత్తం వ్యాపారి-కస్టమర్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం ప్రభావితం కావు. అంటే వార్తల్లో ‘‘యూపీఐ ఛార్జీలు’’ అని కనిపించినంతగా సామాన్యులపై కొత్త భారం పడటం లేదన్నమాట. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు స్నేహితుడికి డబ్బు పంపుతున్నారా? ఛార్జీ లేదు. పేమెంట్లు చేస్తున్నారా? ఛార్జీ లేదు. షాపులో రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారా? ఛార్జీ లేదు. చిన్న వ్యాపారి QRకి డబ్బు పంపుతున్నారా? ఛార్జీ లేదు. రూ.2 వేలకు మించిన కొన్ని వ్యాపార చెల్లింపుల్లో ఎండీఆర్ ఉన్నా.. దాన్ని కస్టమర్ కాకుండా వ్యాపారే భరించాలి.యూపీఐ అంటే ఒక్క యాప్ కాదు. మనం రోజూ ఉపయోగించే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తుంటాం. అలాగే చాలా బ్యాంకుల యాప్లలోనూ యూపీఐ సదుపాయం ఉంటుంది. ఏ యాప్ ద్వారా డబ్బులు పంపినా.. వెనుక పనిచేసేది యూపీఐ వ్యవస్థే. ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లతో మనం ఏడాదికి ఎంత చెల్లిస్తున్నామో తెలుసా? -
‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు రాధికా మర్చంట్ నృత్యం..!
అంబానీ కుటుంబం సోమవారం గణేశ్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా రుపుకుంది. నిజానికి అంబానీ ఇంట గణేశ్ నవరాత్రుల్లో అత్యంత ప్రత్యేకం. అక్కడ విఘ్న వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా పూజలందుకుంటాడు. ఇక ఈ వేడుకల్లో భాగంగా శంకర్ మహదేవన్ పాడిన ప్రసిద్ధ భక్తిగీతం ‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆమె సుందరమైన ప్రదర్శన, గణేశుని దివ్య రూపాలు, జ్ఞానం, విశ్వవ్యాప్త ఉనికిని కీర్తించే ఈ సంస్కృత భక్తిగీతానికి లయబద్ధంగా చేసిన రాధికా నృత్యం అక్కడున్న వారందరీ దృష్టిని అమితంగా ఆకర్షించింది. కాగా, 2005లో వచ్చిన ‘విరుద్ధ్’ చిత్రంలోనిది ఈ గీతం. దీనికి అజయ్-అతుల్ సంగీత ద్వయం సంగీతం అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. అందరీ మనసులను హత్తుకునే ఈ పాట అర్థం ఏంటో సవివరంగా చూద్దామా..!.‘శ్రీ గణేశాయ ధీమహి’ అంటే..‘శ్రీ గణేశాయ ధీమహి’ అనే పదబంధానికి అర్థం గణేశుడిని ధ్యానిద్దాం లేదా గణేశుడి దివ్య రూపాన్ని మననం చేసుకుందాం అని అర్థమట. ఈ పాట వినాయకుడి విభిన్న గుణాలను, రూపాలను వర్ణించే సంస్కృత ప్రార్థన. ఇందులో ఏకదంత, వక్రతుండ, గజానన అంటూ వినాయకుడిని కీర్తిస్తూ సాగే అద్భుతమైన గీతం. ఈ పాటతో ఆయన్ను జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, ఆశీర్వాదాలను అందించమంటూ ప్రార్థిస్తారు భక్తులు. ఈ గీతం కేవలం అడ్డంకులు తొలగించే వాడికంటే గొప్పవాడిగా వర్ణిస్తూ వినాయకుడి గుణాలను చాటే భక్తిపాట. View this post on Instagram A post shared by Loveleen Ramchandani (@loveleen_makeupandhair) ఇదీ చదవండి: అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే పూజలందుకుంటాడు..) -
సోషల్ మీడియా ఉచ్చులో పిల్లలు చిక్కుకోకుండా ఉండాలంటే..
చిన్న పిల్లల చేతికి ఫోన్ ఇస్తే క్షణాల్లో నిశ్శబ్దంగా కూర్చుంటారు. సరిగ్గా ఇక్కడే, ఎండ్లెస్ ఫీడ్స్, రికమెండేషన్ అల్గారిథమ్స్, నోటిఫికేషన్లు, లైక్స్ వంటి వ్యసనపరిచే ఫీచర్లతో సోషల్ మీడియా వారిని తన చుట్టూ తిప్పుకుంటోంది. తద్వారా పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గంటల తరబడి స్క్రోలింగ్ చేయడం వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు, ఒంటరితనం వంటి సమస్యలు పిల్లల్లో కూడా పెరుగుతున్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో మరింత కఠినమైన రక్షణ చర్యలు అవసరం అంటున్నారు. ఇండియాలోనూ మారుతున్న గళం అమెరికాలో మెటా సంస్థపై వచ్చిన కేసులు, కోర్టుల జోక్యం నేపథ్యంలో పెద్ద పరిణామమే చోటుచేసుకుంది. పిల్లలను రక్షించడానికి సోషల్ మీడియా కంపెనీలపై ఎలాంటి నియంత్రణలు ఉండాలనే చర్చ ఇప్పుడు ఇండియాలోనూ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిపాదిస్తున్న కొన్ని కీలక నిబంధనలు చూద్దాం. ⇒ రోజువారీ సమయ పరిమితి: పిల్లలు లేదా టీనేజర్లు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే యాప్లను వాడేలా పరిమితి విధించడం. ⇒ రాత్రి సమయపు ఆంక్షలు: రాత్రి 12:00 నుంచి ఉదయం 6:00 వరకు యాప్ యాక్సెస్ను పూర్తిగా నిరోధించడం. ⇒ స్కూల్ మోడ్: పాఠశాల వేళల్లో నోటిఫికేషన్లను నిలిపివేయడం. ⇒ స్క్రోలింగ్ బ్రేకులు: ప్రతి 15 నిమిషాల నిరంతర స్క్రోలింగ్ తర్వాత చిన్న విరామం తీసుకోవాలని గుర్తు చేయడం. ⇒ నాన్ అల్గారిథమిక్ ఫీడ్: పిల్లలకు ఆకర్షించే వ్యక్తిగతీకరించిన ఫీడ్స్ బదులుగా సాధారణ ఫీడ్ను అందించడం. ⇒ ఆటోప్లే, లైక్స్ నిలిపివేత: ఆటోప్లే, లైక్ కౌంట్స్ వంటి ఆకర్షణీయ ఫీచర్లను డిఫాల్ట్గా ఆఫ్ చేయడం, వయస్సు నిర్ధారణను బలోపేతం చేయడం.మెటా కొత్త నిబంధనలు ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కొన్ని కఠినమైన నిబంధనలు, ఫీచర్లను తీసుకొస్తోంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా ఖాతాలపై మరింత స్పష్టమైన నియంత్రణ సాధించవచ్చు. ⇒ స్క్రీన్ టైమ్ కంట్రోల్స్: రాత్రివేళల్లో పిల్లలు ఎక్కువసేపు ఫోన్కి అతుక్కుపోకుండా స్క్రీన్ టైమ్ పరిమితులు సెట్ చేసుకోవచ్చు. ⇒ కంటెంట్ ఫిల్టరింగ్: టీనేజర్లకు అనుచితమైన, హానికరమైన కంటెంట్ లేదా విపరీతమైన బ్యూటీ/కాస్మెటిక్ ఫిల్టర్లు కనిపించకుండా కట్టడి చేస్తారు. ⇒ మెసేజింగ్ భద్రత: పిల్లలకు అపరిచితులు లేదా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను అడ్డుకోవడానికి కాంటాక్ట్ నియంత్రణలను పెంచుతారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు⇒ తల్లిదండ్రుల పర్యవేక్షణ: తల్లిదండ్రుల అనుమతి లేకుండా టీనేజర్లు తమ సెట్టింగ్లను లేదా సమయ పరిమితులను మార్చలేరు. ఒకవేళ పిల్లలు కొత్త ఖాతాలను క్రియేట్ చేసి లింక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్ వస్తుంది. ⇒ లైక్స్ మాయం: పోస్ట్లపై వచ్చే లైక్లు, రియాక్షన్ల సంఖ్యను దాచడం ద్వారా పిల్లల్లో పోలికల వల్ల వచ్చే ఆత్మనూనతా భావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వయస్సు నిర్ధారణ లోపాలు టీనేజర్లు తమ పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసుకుంటే వారిని గుర్తించడానికి మెటా ఏఐ టూల్స్ వాడుతున్నప్పటికీ, నకిలీ పేరెంట్ ఖాతాలను తయారు చేయడం వంటి లొసుగులను పూర్తిగా అడ్డుకోవడం ఇంకా సవాలుగానే ఉంది. ⇒ ఇతర యాప్ల పోటీ: కేవలం మెటా మాత్రమే కాకుండా టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్ వంటి ఇతర ప్లాట్ఫారమ్లు కూడా ఇలాంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. ఇదీ చదవండి: కాళ్లే చేతులుగా చేసుకుని పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ⇒ కుటుంబాల మధ్య అంతరాలు: టెక్నాలజీపై అవగాహన లేదా తీరిక లేని కుటుంబాల్లో (ముఖ్యంగా దినసరి కూలీలు, పేద వర్గాల్లో) ఈ ఫీచర్లు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవచ్చు. డిజిటల్ అక్షరాస్యత ఉన్న తల్లిదండ్రుల పిల్లలకే ఇది నిజమైన రక్షణ కవచంలా మారుతోంది.⇒ సోషల్ మీడియా అనేది పూర్తిగా చెడ్డది కాదు. కానీ పిల్లలు ఎంతసేపు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, రాత్రివేళల్లో కంటి నిద్రను పాడు చేసుకుంటున్నారా లేదా అనే విషయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, సమయ నియంత్రణ ఉండటం అన్నింటికంటే ముఖ్యం. -
గురుగ్రామ్ హిట్ అండ్ రన్ నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్లో మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని దౌసా నుంచి డ్రైవర్ కల్యాణ్ బైన్స్లాను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం అతడిపై హత్యాయత్నం అభియోగాన్ని నమోదు చేసినట్లు సమాచారం.హర్యానా గురుగ్రామ్కు చెందిన సియా.. స్పోర్ట్స్ బైక్ రైడర్. ఆమె ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్పై వెళ్తుండగా ఆదివారం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మరోవైపు కల్యాణ్ ఆ సమయంలో తెల్లటి సెడాన్ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా కుడివైపునకు మళ్లిన కారు.. హెల్మెట్ ధరించి బైక్పై వెళ్తున్న సియాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా.. బైక్ కొంతదూరం జారుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.సీసీటీవీ ఆధారంగా హత్యాయత్నం కేసుప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు ఫుటేజీల్లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.‘జాలిపడితే.. ఎందుకు ఆపలేదు?’ ప్రమాదం తర్వాత కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ యువతి మహిళో, పురుషుడో తెలియదని, ఘటనలో ఒకవైపు కథనం మాత్రమే బయటకు వచ్చిందని చెప్పాడు. ఆమెపై తనకు చాలా బాధ కలిగిందని పేర్కొన్నాడు. అదే సమయంలో అతని లాయర్.. కేవలం వ్యూస్, ఫాలోవర్స్ కోసమే ఆ మహిళా బైకర్ ఇలా చేస్తోందని ఆరోపించాడు. అయితే కల్యాణ్, అతని లాయర్ వ్యాఖ్యలపై సియా తీవ్రంగా స్పందించింది. “నాపై నిజంగా జాలిపడితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆపలేదు? నేను గాయపడ్డానా లేదా అని చూడటం నీ బాధ్యత కాదా?” అని ప్రశ్నించింది. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా వెళ్లిపోయిన తీరును సీసీటీవీ ఫుటేజీలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొంది. అలాగే అతని లాయర్ పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.I don’t think Gurgaon is safe for girls anymore. The guy hit her intentionally as you can see in this clip, he asked her to Stop but she didn’t for her safety. So he hit and run her so badly. https://t.co/eyWEwXt3bn pic.twitter.com/bNdtEw5aSl— LUCK7773 (@Luck_7773) September 15, 2026‘చనిపోయి ఉండొచ్చు’ఈ ప్రమాదంలో తనకు మరింత తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని సియా తెలిపింది. “నా ఎముకలు విరిగి ఉండొచ్చు. అక్కడికక్కడే చనిపోయి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ అలా జరగలేదు” అని చెప్పింది. ప్రమాదం తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోవడం తనను మరింత బాధించిందని పేర్కొంది. సియా తండ్రి రోషన్ చౌహాన్ కూడా నిందితుడికి శిక్ష పడే వరకు తమ కుటుంబం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మళ్లీ బైక్ నడుపుతా..గురుగ్రామ్ హిట్ అండ్ రన్ ఘటనలో గాయపడిన బైకర్ సియా మళ్లీ బైక్ నడుపుతానని, అయితే రోడ్లపైకి ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటుందని తెలిపింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని.. అంటే ఉద్దేశపూర్వకంగా కారు దగ్గరకు వెళ్లడం, కట్ కొట్టడం నేను చేయలేదు. రోడ్లపై నా భద్రత నేను చూసుకుంటా. ప్రమాదానికి ముందు కారు తనను పదేపదే వెంబడిస్తూ బైక్కు దగ్గరగా వచ్చిందని, దీంతో భయపడి కారు నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పింది. అనవసరంగా సమస్యను ఎందుకు సృష్టించుకుంటాను? అని సియా అంటోంది. అయినా కారు వేగంగా వచ్చి తన బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయిందని వివరించింది. ఈ ఘటన తనను తీవ్రంగా భయపెట్టిందని, ముఖ్యంగా మహిళా బైకర్లు రోడ్లపై ప్రయాణించాలంటే ఆందోళన కలిగించేలా ఉందని సియా పేర్కొంది.VIDEO | Delhi: "I am not interested in 'pinching' a car driver; my own safety on the road is paramount, why would I try to cause unnecessary trouble?" says Siya, woman biker who was hit by a car in Gurugram.(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/rUpg6NAzVs— Press Trust of India (@PTI_News) September 15, 2026ఇదీ చదవండి: జై హింద్ అనలేదని ట్రాన్స్ఫర్ చేశారా? -
ధురంధర్-3 ప్లాన్ చేస్తున్నారా భయ్యా? పాక్లో మళ్లీ..
దేశ శత్రువులపై నిఘా పెట్టి, రహస్య ఆపరేషన్లతో వారిని టార్గెట్ చేసే కథే.. ధురంధర్ సినిమా. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో చూపించినట్లే ఆపరేషన్లు నిజంగానే జరుగుతాయా?. టార్గెట్ చేసిన వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్తో హతమార్చడం.. ఆ తర్వాత జాడ లేకుండా పోవడం పాక్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరాచీలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.పాకిస్థాన్లో మరోసారి ‘అన్నోన్ గన్మెన్’ కలకలం రేపారు. కరాచీలో లష్కరే తోయిబా (LeT)తో సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్లపై వచ్చి కాల్చిచంపారు. భైంస్ కాలనీలోని రోడ్ నంబర్ 11 వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మృతుడి అసలు గుర్తింపు, అతడికి ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. అయితే చనిపోయిన వ్యక్తి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్కు అత్యంత సన్నిహితుడని మాత్రం స్థానికంగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఈ ఘటనలో ప్రత్యేకత ఏంటంటే.. దాడి చేసిన తీరు. బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు టార్గెట్ను గుర్తించి వేగంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రాంతం జనాల రద్దీతో ఉన్నప్పటికీ.. దుండగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పించుకున్నారు. దీంతో అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది మరోసారి ప్రశ్నగా మారింది.పాక్లో ఇది మాములే!పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ‘గుర్తుతెలియని దుండగుల’ చేతిలో హతమవుతున్న ఘటనలు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు లక్ష్యంగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.The unsung heros from India : Unknown Men. https://t.co/mXbXjRPuh5— Magizhmaran ❇️ (@Maransadagopan) September 15, 20262026 ఆగస్టులో లష్కరే తోయిబాకు చెందిన రిజ్వాన్ హనీఫ్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి పెంచింది. గత మూడు నాలుగేళ్లలో పాకిస్థాన్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లు అతను చెప్పినట్టు పలు మీడియా సంస్థలు నివేదించాయి. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు ఆ వాదనలో ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సంఖ్యను పాకిస్థాన్ ప్రభుత్వం స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. అంతేకాదు.. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్నదానిపైనా స్పష్టమైన ఆధారాలు బహిరంగంగా లేవు.అసలు ఈ ‘గన్మెన్’ ఎవరు?కరాచీ తాజా హత్యలో ఇదే ప్రధాన ప్రశ్న. మృతుడు నిజంగా ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తేనా? లష్కరే తోయిబాతో అతడి సంబంధం ఎంతవరకు ఉంది? దాడి వ్యక్తిగత కక్షతో జరిగిందా? ప్రత్యర్థి ఉగ్రవాద సంస్థల పనేనా? లేక మరేదైనా నిఘా వ్యవస్థ పాత్ర ఉందా? ప్రస్తుతానికి ఏ ప్రశ్నకూ అధికారిక సమాధానం లేదు.హఫీజ్ సయ్యద్ పాకిస్థాన్కు చెందిన తీవ్రవాది, లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుల్లో ఒకడు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో అతడొకడని భారత్ చెబుతూ వస్తోంది. అమెరికా కూడా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించి, అతడి తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థతో అతడికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల హత్యలు జరిగినప్పుడల్లా హఫీజ్ సయ్యద్ పేరు కూడా చర్చకు వస్తోంది.భారత్పై పాక్ ఆరోపణలు..ఈ వరుస హత్యలపై పాకిస్థాన్లోని కొందరు అధికారులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు భారత నిఘా వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. 2024లోనూ పాకిస్థాన్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురి హత్యల వెనుక భారత్ ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పాకిస్థాన్ అధికారులు కనీసం ఎనిమిది హత్యలను భారత్తో ముడిపెట్టారు. అయితే వాటిలో వేటికి ఆధారాలు మాత్రం చూపించలేదు. ‘ధురంధర్’ను తలపించే సీన్..పాక్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నవాళ్లు మరణించడం కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ హత్యలన్నీ చాలా డ్రామటిక్గా జరుగుతుండడం గమనార్హం. ఇప్పుడు కరాచీ ఘటనలోనూ నలుగురు వ్యక్తులు బైక్లపై వచ్చి టార్గెట్పై కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవడం.. గతంలో నమోదైన కొన్ని మిస్టరీ కిల్లింగ్స్ను గుర్తు చేస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ‘ధురంధర్’ సినిమా తరహా చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ కొత్త ఘటనలతో ‘ధురంధర్-3’ ప్లాన్ చేయాలంటూ కొందరు ఆదిత్య ధర్ను రిక్వెస్ట్ చేస్తూ నెట్టింట ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత వైరం, ప్రత్యర్థి గ్రూపుల దాడులు, స్థానిక నేరగాళ్ల పాత్ర వంటి ఇతర కోణాలూ చర్చకు వస్తుంటాయి. పైగా ఆ దేశంలో ఇలాంటి హత్యలు కొత్తేమీ కాదు. కరాచీ గతంలో రాజకీయ, జాతి, మతపరమైన హింసకు కేంద్రంగా నిలిచింది. 2011లోనే నగరంలో జరిగిన వరుస టార్గెట్ కిల్లింగ్స్లో ఒక్క జూలై నెలలోనే 300 మందికి పైగా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ హింసకు రాజకీయ, జాతి, మతపరమైన కారణాలు ముడిపడి ఉన్నాయని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ప్చ్.. గాడిదలపైనే భారం వేసిన పాక్ -
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్పాత్ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
మహిళా బైకర్ ఘటన : నిందితుడు జిమ్ ఓనర్, బాడీ బిల్డర్?
హర్యానాలోని గురుగ్రామ్లో తన స్నేహితుడి మారుతి సియాజ్ కారుతో మహిళా బైకర్ సియాను ఢీకొట్టిన ఘటనలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. సియా పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది.దీంతో కారు యజమాని స్పందించారు. తన కారును రెండు రోజుల కరితం స్నేహితుడి కిచ్చానని, తనకు ఈ ప్రమాదానికి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కళ్యాణ్ బైన్స్లా వెలుగులోకి వచ్చాడు. దీంతో నిందితుడి వివరాలు నెట్టింట సంచలనంగా మారాయి. అలాగే ఈ కేసును స్యుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పల్వాల్కు చెందిన, KBT జిమ్ యజమాని అని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ ఫోటోలో కండలుతిరిగి ఫోటోలతోపాటు, తనను తాను 'అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, 'భారత రగ్బీ జట్టు' సభ్యుడిని అని చెప్పుకున్నాడు. అతను 'అమెచ్యూర్ ఒలింపియా ఇండియా'(Amateur Olympia India) అనే బాడీ బిల్డింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచానని కూడా అతను పేర్కొన్నాడు. అయితే ఈ వివరాలను ధృవీకరించాల్సి ఉంది. బైన్స్లా ఇన్స్టాలో కసరత్తు చేస్తూ, కండలు చూపిస్తూ కనిపిస్తాడు. ఇతనికి ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అయితే ఈ ఘటన తరువాత అతని అకౌంట్ను డియాక్టివేట్ చేశాడు.ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటనఢిల్లీ-ఎన్సీఆర్ రోడ్లపై భద్రత మరింత ప్రశ్నార్థకంగా నిలిచింది. . ఒక మహిళ బైక్ నడపడాన్ని జీర్ణించుకోలేక, నిన్న గురుగ్రామ్ రోడ్లపై అనే మహిళా మోటార్సైక్లిస్ట్ను ఢీకొట్టడం ద్వారా కళ్యాణ్ బైన్స్లా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు సోషల్మీడియాలో దుమారం రేగింది.కండలు పెంచినంత మాత్రాన నువ్వు 'మర్ద్' (అసలైన మగాడివి) అయిపోవు. అలా ఒకరిని గుద్ది పారిపోవడం కరెక్ట్ కాదు అంటూ మండి పడుతున్నారు.ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!కాగా ఆదివారం రాత్రి, కారులోని వ్యక్తులు తనను వేధిస్తున్న వీడియోను ఆ మహిళ షేర్ చేశారు. ఈ వీడిమో కారు కుడివైపుకు దూసుకెళ్లి, ఆమెను పక్క నుండి ఢీకొట్టి, వేగంగా వెళ్లిపోయింది. ఆమె రోడ్డుపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. -
మలేషియా ప్రధాని నోట సూపర్ హిట్ హిందీ సాంగ్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ ఆలపించిన సూపర్ హిట్ హిందీ సాంగ్ ‘ఖ్వాబ్ హో తుమ్ యా కోయి హఖీకత్’ను మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆలపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన గాన మాధుర్యాన్ని జనం ప్రశంసిస్తున్నారు. 1960వ దశకంలోని తీన్ దేవియా(దేవ్ ఆనంద్ నటించిన చిత్రం)లోని ఈ పాటను పాడుతున్న వీడియోను అన్వర్ ఇబ్రహీం శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బూడిద రంగు సూట్ ధరించి, మరొకరు వాయిస్తున్న పియానో సంగీతానికి అనుగుణంగా ఆయన ఈ పాటను చక్కగా ఆలపించారు. ఈ వీడియోకు తక్కువ సమయంలోనే పది లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు. #WATCH | Delhi: Malaysia’s Prime Minister Anwar Ibrahim sings a popular Hindi song “Khwab Ho Tum Ya Koi Haqeeqat” in Delhi.(Video source: Anwar Ibrahim/X)#BRICSSummit pic.twitter.com/E8RE9erfie— ANI (@ANI) September 12, 2026 భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అన్వర్ ఇబ్రహీం హాజరయ్యారు. ఢిల్లీలోని ఒక హోటల్లో ఆయన బస చేసిన సమయంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు కనిపిస్తోందని జర్నలిస్టులు అంటున్నారు. ప్రఖ్యాత గాయకులు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్లకు తాను పెద్ద అభిమానినని అన్వర్ ఇబ్రహీం గతంలో చెప్పారు. ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన -
మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన
గురుగ్రామ్లో ఒక మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టి, పారిపోయిన ఘటన, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కారు నంబరుతో సహా బాధితురాలు షేర్ చేయడంతో కారు యజమాని మీడియా ద్వారా స్పందించారు. దీంతో ఆయన ప్రకటన కీలకంగా మారింది.వాహనాన్నిఎవరు నడిపారనే దానిపై కారు యజమాని మనీష్ స్పష్టత ఇచ్చారు. కారు తనదేనని యజమాని అంగీకరించినప్పటికీ, ఈ ప్రమాద ఘటనలో తన పాత్ర ఏమీ లేదన్నారు. తాను ఆర్మీ ఉద్యోగినని, ప్రస్తుతం తాను విధి నిర్వహణలో భాగంగా అస్సాంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు కళ్యాణ్ కారు నడిపినట్టు వెల్లడించారు. తన స్నేహితుడు తన కుటుంబం నుండి కారును తీసుకున్నాడని తెలిపారు.ఇదీ చదవండి: గురుగ్రామ్లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్మాట’!సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు ఈ ఘటన గురించి తెలిసిందని ఆయన చెప్పారు. తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారును తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలియగానే తాను తన స్నేహితుడికి ఫోన్ చేశానని, కానీ అతను ఫోన్ తీయలేదని మనీష్ చెప్పారు.. తన తండ్రిని, ఇతరులను కూడా అతని ఇంటికి పంపించానని, కళ్యాణ్ సింగ్ హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడని కూడా కూడా చెప్పారు. కాగా 'మారుతి సుజుకి సియాజ్' (Maruti Suzuki Ciaz), దీని రిజిస్ట్రేషన్ నంబర్ HR30Y4949. ఇది హర్యానాలోని పల్వాల్ నివాసిమనీష్ పేరు మీద నమోదై ఉంది. -
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
వెంబడించి మరీ.. లేడీ బైకర్పైకి కారు!
రోడ్డుపై ఓ లేడీ బైకర్ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్తో కలిసి ఏప్రిలియా ఆర్ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.ఈ మొత్తం ఘటన ఆమె బైక్కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్తో పాటు ఆర్సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026 -
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
కొన్ని సంఘటనలు అత్యంత విచిత్రంగా అబ్బురపరిచే విధంగా ఉంటాయి. సాధారణంగా తప్పిపోయిన కొన్నేళ్లకు అనుకోని విధంగా కలిసిన ఉదంతాలను చూసుంటాం. కానీ ఇలా ఇన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న అరుదైన ఘటనను చూసి ఉండరు. మహా అయితే ఐదు, ఆరేళ్లు దూరం ఉండొచ్చు కానీ ఈ తల్లి కూతుళ్లు ఎన్నేళ్లు ఒకరికొకరు సంబంధం లేకుండా బతికారో తెలిస్తే విస్తుపోతారు. ఈ అరుదైన ఘటన దక్షిణ కన్నడలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..105 ఏళ్ల సీతమ్మకు 11 మంది సంతానం. వారిలో పెద్ద కుమార్తె సుశీల తన అమ్మను కలుసుకోలేకపోతుంది. అది ఏకంగా ఎన్నేళ్లు వరకు అంటే..దాదాపుగా 20 ఏళ్ల పైగానే తల్లిని కలవలేకపోతుంది. ప్రధాన కారణం తన తల్లి సీతమ్మ దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకా సమీపంలోని మక్కీ అనే గ్రామంలో నివశిస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళ్లే ప్రదేశం అటవీ మార్గం, పైగా అటు వైపు సరైన రహదారి లేకపోవడం, అందులోనూ కొండ దిగువున ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఆ నేపథ్యంలోనే సుశీల తన తల్లిని చాలా ఏళ్లపాటు కలుసుకోలేకపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఒకరికి సంబంధిచి ఒకరికి పాత జ్ఞాపకాలే తప్ప రాకపోకలు లేక అమ్మను చూసుకునే భాగ్యం లేక తల్లిడిల్లిపోయింది సుశీలమ్మ. ఇక్కడ సుశీలమ్మ వయసు కూడా 85 ఏళ్ల కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల ఆ అమ్మ కూతుళ్ల మధ్య రాకపోకలు దశాబ్దంగా నిలిచిపోయాయి. మనవళ్ల చొరవతో.. నెరవేరిన చిరకాల కోరిక!తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు సుశీల మనవళ్లు. వారి చొరవతో సుశీల మక్కికి చేరుకునే అటవీ మార్గం గుండా జీపులో ప్రయాణించింది అయితే జీపు నేరుగా ఇంటి వరకు వెళ్లలేకపోయింది. చేసేది లేక అటవీ మార్గం గుండా సుశీలమ్మను ఓ చిన్నపిల్లను పట్టుకున్నట్లుగా పొదివి పట్టుకుని తీసుకెళ్లారు ఆమె మనవళ్లు. ఆ కష్టమైన ప్రయాణం తదనంతరం ఎట్టకేలకు తల్లిని కలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సుశీల. రెండు దశాబ్దాల తర్వాత తన తల్లి సీతమ్మను కలుసుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబైంది సులశీలమ్మ. తాము ఎన్నాళ్ల నుంచో అమ్మమ్మను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, ఆమెకు వయసురీత్యా ఉన్న సమస్యల వల్లే ఇన్నేళ్లూ అది వీలు కాలేదని, చివరకు ఇన్నళ్ల తర్వాత తన అమ్మమ్మ, ముత్తవ్వను కలవగలిగిందని ఆనందంగా చెబుతున్నారు సుశీలమ్మ మనవళ్లు. ఇదీ చదవండి: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట! -
విధి ఆడిన వింత.. భారత్లో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్!
ఇద్దరూ భారత్లోనే పుట్టారు.. వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లారు.. కట్ చేస్తే.. నెదర్లాండ్స్లో ఒకరికొకరు దగ్గర్లోనే పెరిగారు. టీనేజ్లో తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఒకే ముక్కు.. ఒకే నవ్వు.. ఒకే రకమైన హావభావాలు. అందుకే అప్పట్లోనే ఒకరినొకరు సరదాగా ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. కానీ వాళ్లు నిజంగానే అక్కాచెల్లెళ్లని మాత్రం దాదాపు 30 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఓ డీఎన్ఏ టెస్ట్ వాళ్ల జీవితాలనే మార్చేసింది.ముంబైలోని వేర్వేరు అనాథాశ్రమాల నుంచి 1980ల ప్రారంభంలో కొన్ని నెలల వ్యవధిలో మీనా గెల్టింక్, మినాల్ టిజ్సెన్ వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లారు. ఇద్దరూ నెదర్లాండ్స్లో ఒకరికొకరు సమీపంలో పెరిగారు. టీనేజ్లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు వారి స్నేహితులే ఇద్దరి పోలికలను గుర్తించారు. అద్దంలో చూసుకుంటే ఒకేలా కనిపిస్తున్నారని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోయింది. ఒకే ముక్కు, ఒకే నవ్వు ఉండటాన్ని గమనించింది.ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. స్కూల్, స్నేహితులు, ప్రేమ, డ్యాన్స్, క్రీడలు, సంగీతం.. ఇలా ఎన్నో విషయాలను ఒకరికొకరు లేఖల ద్వారా పంచుకునేవారు. ఇద్దరికీ బ్యాక్స్ట్రీట్ బాయ్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకున్నారు. రక్తసంబంధం ఉందన్న చిన్న అనుమానం కూడా లేకపోయినా.. ఒకరినొకరు ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. మినాల్ ఫ్రాన్స్కు వెళ్లగా.. మీనా తన మొదటి బిడ్డకు తల్లి కావడంతో కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయింది.డీఎన్ఏ టెస్ట్.. ఇంతలో 2017లో మీనా భారత్ నుంచి దత్తత తీసుకున్నవారి సమావేశానికి హాజరైనప్పుడు డీఎన్ఏ టెస్టింగ్ గురించి తెలుసుకుని పరీక్ష చేయించుకుంది. కానీ ఎలాంటి సరిపోలిక కనిపించలేదు. ఈ ఏడాది ఫోన్ స్టోరేజ్ సమస్యతో ఆమె ఆ యాప్ను కూడా డిలీట్ చేసింది. ఇంతలో మే 20న మినాల్ ఫేస్బుక్లో మీనాకు మెసేజ్ చేసింది. తాను ఏప్రిల్లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల స్క్రీన్ షాట్ను పంపింది. మీనాకు మొదట నమ్మశక్యం కాలేదు. యాప్ను మళ్లీ ఇన్స్టాల్ చేసి ఫలితాలను చూసిన ఆమెకు షాక్ తగిలింది. ఇద్దరి డీఎన్ఏ 100 శాతం మ్యాచ్ అయింది. వారు కేవలం చిన్ననాటి స్నేహితులు కాదు.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పూర్తి సోదరీమణులని తేలింది.మినాల్కు కూడా తొలుత తన డీఎన్ఏ మ్యాచ్ ఎవరిదో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు చూసిన తర్వాత విషయం తెలిసింది. చిన్నప్పుడు తనను ఆప్యాయంగా పట్టుకున్న అదే అమ్మాయి మీనా అని గుర్తించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన స్నేహం వెనుక ఇంత పెద్ద రక్తసంబంధం ఉందని తెలుసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టులో మళ్లీ కలుసుకున్న ఇద్దరూ కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతల మధ్య తమ అనుబంధాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారు. ఇద్దరి మాట తీరు, నడక, హావభావాలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.ముంబై కోరిక.. తమ జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒకరి అవసరం మరొకరికి ఉందని మీనా చెబుతోంది. తండ్రిని కోల్పోయినప్పుడు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సోదరి తన పక్కన ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు ఇద్దరి కోరిక ఒక్కటే.. తమ బంధం మొదలైన ముంబైకి కలిసి వెళ్లి, తాము పుట్టిన నేలను మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ‘సిస్టర్’ అని పిలుచుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు డీఎన్ఏ ద్వారా తాము నిజంగానే సోదరీమణులమని తెలుసుకున్న ఈ కథ నిజజీవితంలో జరిగిన ఓ సినిమా ట్విస్ట్ను తలపిస్తోంది.Çocukluk arkadaşları, yıllar sonra yaptırdıkları DNA testiyle aslında kardeş olduklarını öğrendi! 👯♀️💞📌 Bebekken Hindistan'daki yetimhanelere bırakılan ve farklı Hollandalı aileler tarafından evlat edinilen Meena Geltink ile Minal Tijssen, ilk kez 1996 yılında evlat edinilmiş… pic.twitter.com/NyMrp7DBu0— Mynet (@mynet) August 17, 2026Video Credit: Mynet. -
బార్బెక్యూలో బీఫ్ : కెనడాలో చిక్కుల్లో భారతీయ మహిళ
కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది. ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు. ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు. ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ -
రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్పతి 18' గురువారం ఎపిసోడ్లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన రోల్ఓవర్ కంటెస్టెంట్ 27 ఏళ్ల ఉద్దేశ్య సచన్ రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో విఫలమై, రూ. 12.5 లక్షల నగదు బహుమతితో గేమ్నుంచి నిష్క్రమించారు. అయితే ఈ ఎపిసోడ్ సందర్భంగా ఉద్దేశ్య వెల్లడించిన వివరాలు నెట్టింట విశేషంగా నిలిచాయి.కాన్పూర్లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతున్నానని, అక్కడ 400 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నానని ఉద్దేశ్య సచన్ చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని ఒక చెట్టు కింద కొద్దిమంది పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. గత కొన్నేళ్లలో ఈ పాఠశాల విస్తరించి, ప్రస్తుతం సొంత భవనాన్ని కలిగి ఉంది. 12వ తరగతి వరకు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఫీజులు లేకుండా మరింత మంది పిల్లలకు విద్యను అందించడానికి దీనిని ఇంకా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్విద్యావ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారిందని, పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీరిలో చాలామంది పిల్లలు సమీపంలోని మురికివాడల (స్లమ్స్) నుండి వస్తారు. దీని ద్వారా తనకు ఎలాంటి ఆదాయం రాదని, తన ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం తన అన్నయ్య చూసుకుంటారని తెలిపారు.కాగా ఉద్దేశ్య తండ్రి దర్జీగా (టైలర్) పనిచేస్తూ నెలకు రూ. 4000-5000 మాత్రమే సంపాదించేవారు. విద్యుత్ షాక్ కారణంగా ఆయన తల్లి అనారోగ్యానికి గురైన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి ఫీజు చెల్లించలేకపోవడంతో ఉద్దేశ్యను 6 - 9 ఏళ్ల వయస్సులో రెండుసార్లు పాఠశాల నుండి పంపించివేశారు. ఫీజులు చెల్లించనందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన తల్లిదండ్రులను తరచూ అవమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే అయన అనుభవించిన అవమానాలు, మానసిక క్షోభే ఈనాటి ఉచిత విద్యకు పునాది అని చెప్పారు.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్రూ. 250తో స్కూలుకు నాంది పడిందిలా ధాబా, కేఫ్ ,కొన్ని కర్మాగారాల్లో (ఫ్యాక్టరీలు) చిన్న చిన్న పనులు చేస్తూ, తండ్రి సహాయంతో తన చదువును పూర్తి చేశారు. అయితే తనలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉంటారని గ్రహించి, వారి జీవితాలను మార్చడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఈ దిశగా అడుగులు వేశారు.తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని స్థానికంగా ప్రచారం చేయడానికి కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాఠశాలను ప్రారంభించినట్లు ఉద్దేశ్య చెప్పారు. ప్రారంభ రోజుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఆయన పాఠశాలకు విరాళాలు ఇచ్చారు. నటుడు ఆర్. మాధవన్ దీనిపై ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు పాఠశాలకు భారీగా విరాళాలు వచ్చాయి. ఇది విన్న అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ పాఠశాల గురించి ప్రచారం చేస్తానని ప్రకటించారు.KBC 18లో ఉద్దేశ్య ఎదుర్కొన్న రూ. 25 లక్షల ప్రశ్న: ఏ ప్రాచీన భారతీయ పాలకుడిని 'అమిత్రఘాత' అనే బిరుదుతో కూడా పిలిచేవారు?ఆప్షన్లు: సమ్రాట్ అశోకుడు, బింబిసారుడు, సముద్రగుప్తుడు, బిందుసారుడుఉద్దేశ్య 'మహాఫ్లిప్' లైఫ్లైన్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రశ్న వచ్చింది. దీని సమాధానంపై కూడా ఆయనకు స్పష్టత లేకపోవడంతో 50:50 లైఫ్లైన్ ఎంచుకున్నారు. లైఫ్లైన్ తర్వాత తెరపై మిగిలిన రెండు ఆప్షన్లు: బింబిసారుడు , బిందుసారుడు.సరియైన సమాధానం తెలియకపోవడంతో, ఆయన గేమ్ను క్విట్ చేసి క్విట్ చేసిన తర్వాత, ఊహించి ఒక సమాధానం చెప్పమని కోరగా, ఆయన 'బిందుసారుడు' అని చెప్పారు. నిజానికి అదే సరైన సమాధానం.‘అమిత్రఘాత’ అంటేమగధను పాలించిన మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి బిందుసారుడిని 'అమిత్రఘాత' అని పిలిచేవారు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు, అలాగే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడైన అశోకుడి తండ్రి. బిందుసారుడి పాలన క్రీ.పూ. 297 నుండి క్రీ.పూ. 273 వరకు కొనసాగింది. ఈ పేరు 'అమిత్ర' (శత్రువు), 'ఘాత' (సంహారకుడు) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే "శత్రు సంహారకుడు" అని అర్థం. విశేషమేమిటంటే, ప్రాచీన గ్రీకు రచయిత స్ట్రాబో ఆయనను 'అమిట్రోచేట్స్' (Amitrochates) అని పిలిచారు, సంస్కృత పదం,అమిత్రఘాతను గ్రీకులో 'అమిట్రోచేట్స్ అంటారు. -
నెక్ట్స్ మిషన్ ప్రకటించిన బిట్టూ భాయ్
ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..మధ్యప్రదేశ్కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.మార్పును వీడియోలుగా..నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు. -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్మెయిలింగ్ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
వానల్లేకున్నా.. గంగమ్మ గర్జన! బిహార్లో 47 లక్షల మంది విలవిల!
వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. బిహార్ను వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. గంగమ్మ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఊళ్లు, రహదారులు, పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమైంది. వరద ఉధృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న సోషల్ మీడియా వీడియోలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. నీటమధ్య చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.భాగల్పూర్ జిల్లా సుల్తాన్గంజ్ వద్ద గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 11 ఉదయం అక్కడ నీటిమట్టం 36.62 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయి కంటే 2.12 మీటర్లు ఎక్కువ. అయితే ఈ ఉదయం అక్కడ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలు చోట్ల నదీ రక్షణ కట్టలు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.వర్షం తక్కువైనా.. వరద ఎలా?ఈసారి బిహార్ వరదలకు ఒకే కారణం లేదని అధికారుల వివరణ, తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు బిహార్లో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 1 నాటికి వర్షపాతం లోటు దాదాపు 30 శాతంగా ఉంది. అంటే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రం వర్షాభావ పరిస్థితినే ఎదుర్కొంది. ఆ తర్వాతే ఒక్కసారిగా నదుల్లో ప్రవాహం పెరగడంతో వరద పరిస్థితి తలెత్తింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, వారాణసి పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ గంగా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల నీరు గంగలోకి చేరి దిగువకు ప్రవహించింది. దీంతో బిహార్లో గంగానది నీటిమట్టం వేగంగా పెరిగింది.అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నీటి ప్రవాహం, బిహార్లో అక్కడక్కడ కురిసిన వర్షాలు కూడా పరిస్థితిని తీవ్రం చేశాయి. గంగా నీటిమట్టం పెరగడంతో దానిలో కలిసే చిన్న, పెద్ద నదుల నీరు వెనక్కి నిలిచే బ్యాక్వాటర్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఇప్పటికే నీటితో నిండిన ప్రాంతాల్లో ముంపు మరింత పెరిగింది.నేపాల్ వర్షాల పాత్ర ఎంత?బిహార్ వరదల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేపాల్ పేరు ముందుకు వస్తుంది. కారణం.. ఉత్తర బిహార్లోని అనేక ప్రధాన నదులు నేపాల్ హిమాలయ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ రాష్ట్రంలోకి రావడమే. కోసి, గండక్, బాగ్మతి వంటి నదులకు ఎగువ పరీవాహక ప్రాంతాలు నేపాల్లో ఉన్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా నీరు చేరే అవకాశం ఉంటుంది.ఆగస్టు చివరి వారంలో నేపాల్లోని కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే నదుల్లోనూ ప్రవాహం పెరిగింది. దీనికి తోడు.. ఈసారి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలు, అక్కడి నుంచి వచ్చిన వరదనీరు ముంచెత్తాయి.బిహార్కే వరద ముప్పు ఎందుకింత?బిహార్ భౌగోళిక స్వరూపమే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మారుస్తోంది. ముఖ్యంగా ఉత్తర బిహార్ హిమాలయాల నుంచి వచ్చే నదులు విస్తారమైన మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే ప్రాంతం. కొండ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు మైదానాల్లోకి వచ్చిన తర్వాత ప్రవాహ వేగం తగ్గుతుంది. దీంతో అవి తీసుకొచ్చే ఇసుక, మట్టి, సిల్ట్ నదీ పడగలో పేరుకుపోతాయి. దీంతో నదుల నీటిని మోసుకెళ్లే సామర్థ్యం తగ్గి, భారీ ప్రవాహం వచ్చినప్పుడు నీరు ఒడ్డులను దాటి బయటకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గంగా, కోసి, గండక్, బాగ్మతి, బుడి గండక్, ఘాఘ్రా, మహానంద, పున్పున్ వంటి నదులు బిహార్లోని వివిధ ప్రాంతాలకు వరద ముప్పును కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కోసి నది తరచూ తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం, భారీగా సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఉత్తర బిహార్లో వరద సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే కోసిని చాలాకాలంగా ‘బిహార్ దుఃఖదాయిని’గా పిలుస్తారు.#WATCH | Bhagalpur, Bihar: Over 90 panchayats and several urban areas in the Bhagalpur area remain severely flooded. NH-80 on the Bhagalpur-Patna route has been shut near Bhavnathpur for five days as floodwater flows nearly two feet deep across the road. Floodwaters have also… pic.twitter.com/nuVuW3LYNa— ANI (@ANI) September 12, 2026రక్షణ కట్టలకూ గండంఅదే సమయంలో వరదనీరు గ్రామాలు, పట్టణాలు, పంట పొలాల్లోకి చేరకుండా నదుల వెంట నిర్మించే ఎత్తైన కట్టలను రక్షణ కట్టలు అంటారు. బిహార్లో దశాబ్దాలుగా ఇలాంటి కట్టలపై ఆధారపడి వరద నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయితే నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగినప్పుడు ఈ కట్టలపై నీటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. తాజా వరదల్లో భాగల్పూర్లో పలు ప్రాంతాల్లో రక్షణ కట్టలు దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకచోట కట్ట తెగితే పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు, రహదారులు, పొలాల్లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.లక్షల మందిపై ప్రభావంతాజా అధికారిక సమాచారం ప్రకారం 15 జిల్లాల్లో 46.88 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 88 బ్లాకులు, 561 గ్రామ పంచాయతీల్లో ముంపు పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులు, ఇతర రవాణా మార్గాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో పడవలే ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా మారాయి. భాగల్పూర్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ వరదనీటిలో చిక్కుకున్న వారిని తరలించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. తాజాగా వరదనీటిలో ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కూడా చోటుచేసుకుంది.The floods in Bihar should now be declared a national disaster, and immediate assistance should be provided to Bihar. pic.twitter.com/H2YlFNH6HW— Sameera Jain (@SameeraJain6) September 7, 2026సహాయక చర్యలు ముమ్మరంవరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 33 రెస్క్యూ బృందాలు, సుమారు 700 ప్రభుత్వ పడవలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి. పొడి రేషన్, పాలిథిన్ షీట్లు తదితర సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం బోటు అంబులెన్సులను కూడా వినియోగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 1,194 కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి.ఇప్పుడేం జరుగుతోంది?కొన్ని ప్రాంతాల్లో గంగానది నీటిమట్టం స్వల్పంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. సుల్తాన్గంజ్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టినా ప్రమాద స్థాయికి రెండు మీటర్లకు పైగా ఎగువన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రక్షణ కట్టలపై నీటి ఒత్తిడి కొనసాగుతోంది.ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా.. నదుల్లో పేరుకుపోయే సిల్ట్ నిర్వహణ, రక్షణ కట్టల బలోపేతం, వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదుల ప్రవాహ మార్గాలపై శాస్త్రీయ అధ్యయనాలు, దీర్ఘకాలిక వరద నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితి మరోసారి గుర్తుచేస్తోంది.వైరల్ ఫెర్రీ వీడియో సంగతేంటి?ఇక భారీగా ప్రయాణికులతో నిండిన ఫెర్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సుమారు 200 మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియో ప్రస్తుత బిహార్ వరదలకు సంబంధించినదా? పాతదా? లేదా ఏఐ సాయంతో రూపొందించిందా? అనేది క్లారిటీ లేదు. అయితే జులై చివరి వారంలోనే ఓ యూట్యూబ్ చానెల్లో ఈ వీడియో అప్లోడ్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుత వరద పరిస్థితుల్లో రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో పడవలపై ప్రజలు ఆధారపడుతున్న విషయం మాత్రం వాస్తవం.This is not an ocean; this is the Mighty Ganges in Bihar. pic.twitter.com/ecSUSLCahb— Magadh Updates (@magadh_updates) September 11, 2026ఇదీ చదవండి: దుర్మార్గులు: ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కావట్లేదని.. -
5జీ వేగం తగ్గిందని.. మొబైల్ టవర్కు కట్టేశారు..!
మనిషిని చెట్టు కట్టేయడం.. టవర్లకు కట్టేయడం అనేది ఎవరైనా తప్పు చేసిన సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ గ్రామ స్థాయిలో తారస పడుతూ ఉంటుంది. ఊరంతా ఒక్కటై తప్పు చేసిన మనిషిని స్తంభాలకో, చెట్లకో, టవర్లకో కట్టేస్తూ ఉంటారు. ఇది అనాగరిక సంస్కృతే అయినా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ చిత్రమేమింటంటే ఓ వ్యక్తి ఒక సంస్థలో టెక్నీషియన్గా పని చేస్తున్నందుకు ఈ అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి అసలు కారణం 5జీ నెట్వర్క్.. ఇది ప్రస్తుతం అత్యంత వేగవంతమైన నెట్వర్క్. ఇది మనకు తెలిసిన విషయమే. మొబైల్ చూడటంలో కానీ వాడటంలో కానీ వేగానికి అలవాటు పడిన ప్రస్తుత సమాజంలో అత్యధిక శాతం మంది.. 5జీ నెట్వర్క్ పట్ల ఆకర్షితులయ్యారనేది కాదనలేని సత్యం. మరి ఆ వేగంలో ఏమైనా మార్పులు వచ్చి ఆ నెట్వర్క్ స్పీడ్ తగ్గితే.. వారు చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతారనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇక్కడ సాటి మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నామా.. అనే సంగతిని కూడా మర్చిపోయి మరీ రెచ్చిపోయారు.తమ ఊరిలో 5జీ నెట్వర్క్ స్పీడ్ తగ్గిందనే కారణంతో సదరు సంస్థకు సంబంధించిన టెక్నీషియన్ను మొబైల్ టవర్కు కట్టేసిన వైనం వెలుగు చూసింది. సాధారణంగానే ఆ టెక్నీషియన్ ఊరిలోకి వచ్చిన సందర్భంలో గ్రామస్తులు తిరగబడ్డారు. తాము 5జీ నెట్వర్క్ను వాడుతుంటే అది ఎందుకు సరిగా పనిచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇన్స్టా రీల్స్ సరిగా స్ట్రీమింగ్ కావడం లేదని ఆరోపిస్తూ సదరు టెక్నీషియన్ను మొబైల్ టవర్కు కట్టేసి ఎవరొస్తారో రండి అంటూ కూడా సవాల్ విసిరారు. దీనిపై ఆ సంస్థకు చెందిన అధికారులు వచ్చి 5జీ నెట్వర్క్ స్పీడ్ను పెంచే వరకూ టెక్నీషియన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏమైతే కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే ఉన్నతాధికారులు వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్లోని ఫతేపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. Frustrated that Instagram Reels wouldn’t stream properly due to poor 5G speeds, angry villagers in UP's Fatehpur tied a Jio technician to the mobile tower and demanded that senior officials come to the site immediately to fix the connectivity problems. pic.twitter.com/eVE0kFDjfA— Piyush Rai (@Benarasiyaa) September 11, 2026 ఇదీ చదవండి:కాబోయే భార్యను ఇంప్రెస్ చేద్దామని.. -
బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి(Suvendu Adhikari) అత్యంత పవిత్రంగా భావించే కౌశికి అమావాస్య (Kaushiki Amavasya) సందర్భంగా కోల్కతా కాళీఘాట్లోని పవిత్ర కాళీమాత అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శతాబ్దాల చరిత్ర కలిగిన కాళీఘాట్ ఆలయ సంప్రదాయం ప్రకారం చేపల ప్రసాదాన్ని కళ్ల కద్దుకుని మరీ స్వీకరించారు. దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం తినడాన్ని ఒక హిందూ పూజారి ఖండించిన నేపథ్యంలో సీఎం మాంసాహార ప్రసాదాన్ని స్వీకరించడం ఆసక్తికరంగా మారింది.కాళీఘాట్ ఆలయంలో నేలపై కూర్చుని, కాళీఘాట్ భోగ్ ప్రసాదంలో ప్రత్యేకమైన పెద్ద చేప తల (Fish head), వేయించిన చేపలు, బసంతి పులావ్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.Putting all controversy at rest. CM Suvendu Adhikari is currently eating Kalighat Kali Maa's Fish Bhog. Today is the final Amavasya and it's a special day for us pic.twitter.com/rLIqwcWg3u— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) September 10, 2026 #WATCH पश्चिम बंगाल के मुख्यमंत्री सुवेंदु अधिकारी ने आज शाम कालीघाट मंदिर में पूजा-अर्चना की।(वीडियो सोर्स: सुवेंदु अधिकारी/फेसबुक) pic.twitter.com/Y3L7Cvkplv— ANI_HindiNews (@AHindinews) September 10, 2026 మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల శాఖాహార అలవాట్లను మాంసాహారం ఎక్కువగా తినే బెంగాల్పై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలను బీజేపీ తరచూ ఎదుర్కొంటోంది. అయితే సువేందు అధికారి కాళీఘాట్ వీడియోను ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. "ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలి. కాళీఘాట్లో సీఎం సువేందు అధికారి మా కాళీ సంప్రదాయ చేపల భోగ్ను స్వీకరించడం ద్వారా బెంగాల్ సంస్కృతి, విశ్వాసాలు, జీవన విధానాన్ని గౌరవించారు. బెంగాల్ సంప్రదాయాలు, ప్రయోజనాలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.కాగా కాళీఘాట్ దేవాలయంలో అధిష్టాన దేవత అయిన కాళికాదేవికి చేపలు, బలి ఇచ్చిన మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.నాన్-వెజ్ వివాదం ఏమిటంటే:బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) ఇటీవల చేసిన శాకాహార వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినకూడదని బెంగాలీ హిందువులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినే బెంగాలీ హిందువులను "పాషాండులు" అని వ్యాఖ్యానించడమేకాదు రాష్ట్రవ్యాప్తంగా మాంస విక్రయాలు, మద్యం దుకాణాలను మూసివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
అమ్మ చివరి చూపు దక్కలేదు.. కృష్ణుడి పాదాల చెంత కన్నీళ్లు!
దాదాపు రెండేళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు. నమోదైన అభియోగాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఆధారాల్లేవీ చూపించలేకపోయింది. అయితే చావు బతుకుల మధ్య తన తల్లి.. ఆ కొడుకును చూసేందుకు అర్జీ పెట్టుకుంది. అధికారుల మనసు కరగలేదు. చివరకు.. ఆ తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించింది. పాపం.. కన్నతల్లిని చివరిసారి చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సరాసరి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి విగ్రహం పాదాలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్లో జైల్లో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడిని చివరిసారైనా చూడాలని కోరుకున్నారు. అయితే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. చివరకు ఆమె మరణించాక అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆవేదనతో ఆయన పెరోల్ టైం పూర్తికాకముందే మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. ఆ మధ్యలో ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సంధ్యా రాణి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిట్టగాంగ్లోని పుండరీక ధామ్కు తీసుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న చిన్మయ్ కుటుంబ సభ్యులు.. ఆమెను చివరిసారిగా చూసేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని బుధవారం అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీకి పరోల్ ఇచ్చే నిబంధన లేదని అధికారులు కుటుంబానికి తెలిపారు. ఆ తర్వాతి రోజే సంధ్యా రాణి కన్నుమూశారు.ఆమె మరణంతో చిన్మయ్ కుటుంబం మరోసారి అధికారులను ఆశ్రయించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని కోరింది. ఈసారి చిట్టగాంగ్ జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథం అని పేర్కొంటూ ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి చిన్మయ్ను బయటకు తీసుకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్మయ్ నేరుగా హతజారీ ప్రాంతంలోని పుండరీక ధామ్కు వెళ్లారు. అక్కడ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ విగ్రహం పాదాలను తాకారు. జైలులో ఉన్న సమయంలో తల్లి అనారోగ్యం, ఆమెను చూడలేకపోయిన బాధ ఆయనలో ఎంతగా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక చిన్మయ్ తిరిగి జైలు బాట పట్టారు. పరోల్ సమయం రాత్రి 9 గంటల వరకు ఉన్నప్పటికీ.. రాత్రి 8.03 గంటలకే చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.Heartbreaking 💔…!Hindu monk Chinmoy Krishna Das Taken into custody again In BANGLADESHHe was out on parole for few hours to see his dead mother…… pic.twitter.com/WMKX7sy68J— Mamta Painuly Kale (@mamta_kale) September 11, 2026ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు ఆమెను బతికుండగానే చివరిసారి చూడలేకపోయిన బాధ.. కేవలం ఐదు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. చిన్మయ్ పరోల్ దృశ్యాలను మరింత భావోద్వేగంగా మార్చాయి.ఆరు క్రిమినల్ కేసులుబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల హక్కుల కోసం గళం వినిపించిన చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్ 25న అరెస్టయ్యారు. చిట్టగాంగ్లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా బెయిల్ నిరాకరించి జైలుకు పంపారు.ఆయన అరెస్టు తర్వాత చిట్టగాంగ్ కోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులోనూ చిన్మయ్ను నిందితుడిగా చేర్చారు. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.ఇవే కాకుండా హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, విధ్వంసం తదితర ఆరోపణలతో ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చిన్మయ్పై ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో నాలుగు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మిగిలిన కేసుల కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. దేశద్రోహం కేసులో లభించిన బెయిల్పైనా స్టే కొనసాగుతోంది.బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల హక్కులు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వరుస దాడులు, హత్యలు, ఈ మధ్యలోనే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయనపై కొనసాగుతున్న కేసులు, తాజాగా తల్లి బతికుండగానే పరోల్ దక్కకపోవడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని బయటపెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పలుమార్లు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఆల్ టైం హైకి చేరితో భారత్ పరిస్థితి ఏంటి? -
రష్యా మంత్రికి మన సినిమాల్లో హీరో ఛాన్స్!.. గోయల్ సరదా ఆఫర్
‘‘మీరు ఒప్పుకుంటే.. త్వరలో మా సినిమాల్లో చూస్తామేమో’’ అంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్యా మంత్రి ఆంటోన్ అలిఖానోవ్ను ఉద్దేశించి గోయల్ ఆ వ్యాఖ్య చేశారు. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన లుక్, కటౌట్లు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన మంత్రి ప్రస్తావించారు..ఇన్నోప్రామ్ ఇండియా 2026 కార్యక్రమంలో భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలపై చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అలిఖానోవ్ చూడటానికి చాలా డ్యాషింగ్గా ఉన్నారని పేర్కొన్న గోయల్.. ఆయన బహుశా పొరపాటున రాజకీయాల్లోకి వచ్చారేమో అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆడియోవిజువల్ సహకారాన్ని కూడా మరింత పెంచుకోవాలని, త్వరలోనే ఆయనను బాలీవుడ్ సినిమాలో చూడొచ్చేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.2030 నాటికి 100 బిలియన్ డాలర్ల టార్గెట్అలిఖానోవ్కు గోయల్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్ సరదా వ్యాఖ్యే అయినప్పటికీ.. ఆయనతో జరిగిన చర్చలు మాత్రం పూర్తిగా వ్యాపారపరమైనవే. భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ వాణిజ్యంలో భారత్ నుంచి రష్యాకు జరిగే ఎగుమతులు తక్కువగా ఉండగా.. రష్యా నుంచి భారత్కు దిగుమతులు భారీగా ఉన్నాయి.Bollywood calling? Piyush Goyal sees a movie star in Russia’s trade minister“Possibly we’ll see him starring in a movie in Bollywood very soon,” Goyal joked about Anton Alikhanov at the India–Russia Business Dialogue 2026. pic.twitter.com/yvRpLn26en— Sputnik India (@Sputnik_India) September 10, 2026పుతిన్ మెచ్చుకుని మరీ..ఆంటోన్ ఆండ్రేయెవిచ్ అలిఖానోవ్ 1986 సెప్టెంబర్ 17న సుఖుమిలో జన్మించారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న ఆయన.. ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రం చదివారు. రష్యా ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. 2016లో కేవలం 30 ఏళ్ల వయసులో కలినిన్గ్రాడ్ ప్రాంతానికి తాత్కాలిక గవర్నర్గా నియమితులై.. అప్పట్లో రష్యాలోనే అత్యంత పిన్న వయస్కుడైన రీజియనల్ లీడర్గా పేరు దక్కించుకున్నారు. 2017లో పూర్తిస్థాయి గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సన్నిహిత అధికారిక సమన్వయం కొనసాగింది. 2024లో పుతిన్ ప్రభుత్వం ఆయనకు కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి రష్యా పారిశ్రామిక విధానాలు, విదేశీ వాణిజ్యంపై కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.భారీగా వాణిజ్య లోటురష్యా నుంచి భారత్ ప్రధానంగా ముడిచమురు, ఇంధనం వంటి ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భారీ అసమతుల్యత(trade imbalance) ఉంది. దీన్ని తగ్గించేందుకు భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, టెక్స్టైల్స్ తదితరాల ఎగుమతులను పెంచాలని గోయల్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదే సమయంలో భారత్–యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. రష్యాతో పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. పీయూష్ గోయల్ సెప్టెంబర్ 10న అలిఖానోవ్తో పాటు ఈఏఈయూ వాణిజ్య మంత్రి ఆండ్రే స్లెప్నెవ్తోనూ చర్చలు జరిపారు.రేర్ ఎర్త్స్, మైక్రోఎలక్ట్రానిక్స్పై దృష్టిఇరు దేశాల మధ్య సహకారాన్ని సంప్రదాయ వాణిజ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా కొత్త రంగాలకు విస్తరించాలన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలను అలిఖానోవ్ ప్రస్తావించారు. రష్యాలో ఏపీఐ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు భారత ఫార్మా కంపెనీలను ఆయన ఆహ్వానించారు.ఇలా ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక చర్చలు జరుగుతున్న వేళ.. అలిఖానోవ్ లుక్ను ప్రస్తావిస్తూ గోయల్ చేసిన ఒక్క సరదా వ్యాఖ్య మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. వ్యాపార చర్చల మధ్య ‘‘బాలీవుడ్లోకి వస్తారా?’’ అంటూ గోయల్ చేసిన చమత్కారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐతో ఎంతో ఈజీగా వినాశనం! -
#80sTrend: హద్దులు దాటిన మీమ్ వార్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘మీమ్ వార్’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్ వెనుక సైబర్ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్గా ఇది మరో టర్న్ తీసుకుంది. ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.కాంగ్రెస్ పోస్టుతో మొదలు..ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్ కౌంటర్పై డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్పై సెటైర్ వేసింది.అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పేజీలు గుజరాత్ గజదొంగ, చాయ్ పేరిట రైల్వే స్టేషన్లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంపోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.వైరల్ ట్రెండ్.. రాజకీయ పోరుకు ఆయుధంఇటీవల సోషల్ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్ను కొత్త క్యాప్షన్లతో వైరల్ చేయడం ట్రెండ్గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా? -
కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక
కేపీహెచ్బీ అంటేనే రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న చర్చ కొంతకాలంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై జరిగే చర్చ చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రివేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ చేస్తున్న పలువురిని కేపీహెచ్బీ సెక్టార్ ఎస్ఐ మౌనిక లాఠీతో తరిమికొట్టారు.కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్ సరీ్వస్ రోడ్డు సమీపంలో కొన్ని రోజులుగా ట్రాన్స్జెండర్లు రాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఠాణాకు పిలిపించి హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. చెట్ల పొదల వద్ద రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్ఐ మౌనిక బుధవారం రాత్రి కారులో వచ్చి లాఠీ తీసుకుని చెట్ల పొదల్లోకి రావడంతో ట్రాన్స్జెండర్లు పరుగులు పెట్టారు. ఎస్ఐ ధైర్యంగా వెళ్లి ట్రాన్స్జెండర్లను తరిమి కొట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆమె సూచించారు. పలువురు ట్రాన్స్జెండర్లపై కేసులు నమోదు చేశారు.ఇప్పటికే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌనిక స్థానికులకు సూచించారు.At this point, KPHB is starting to look less like a residential area and more like Hyderabad’s unofficial red-light district.⁰How the hell did this happen? 🤦♀️ pic.twitter.com/ISCRPcCXl1— Shika Reddy (@Shika_Reddy) September 10, 2026 -
మిరాకిల్.. బస్సులో పడి బతికిపోయాడు!
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అనేది సామెత. కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ అదృష్టం అనే మాట తప్పకుండా వస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి ఎలా వరిస్తుందో ఊహించలేం. విలువైన డబ్బు రూపంలో రావొచ్చు లేదా అమూల్యమైన ప్రాణాలు నిలబడడం కావొచ్చు.. మరేదైనా అవొచ్చు. ఘోర విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలతో బయటపడుతుంటారు. అదృష్టవశాత్తు బతికి బట్టకట్టామని ప్రమాదాల నుంచి బయటపడిన వారు చెబుతుంటారు. ఇలాంటి ఘటన గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దీని కంటే ఈ వీడియోను ఒకసారి చూడండి.A bus driver in Colombia accidentally left the door open. Seconds later, a speeding motorcyclist collided with the bus and was flung straight through the open doorway instead of crashing into its side. Sometimes, a mistake becomes a miracle! pic.twitter.com/TGKwaHznF8— Harsh Goenka (@hvgoenka) September 9, 2026అసలేం జరిగిందో అర్థం కాలేదా? రహదారిపై ఓ బస్సు వేగంగా వెళులోంది. డ్రైవర్గా ఏమరుపాటుగా బస్సు తలుపును తెరిచివుంచాడు. కొద్ది నిమిషాల తర్వాత తెరివుంచిన తలుపులోంచి ఓ వ్యక్తి అమాంతంగా మెరుపు వేగంతో బస్సులోకి వచ్చి పడ్డాడు. ఏం జరిగిందో తెలియక బస్సు డ్రైవర్ అవాక్కయ్యాడు. తెలిశాక గర్వంగా ఫీలయ్యేవుంటాడు!ఈ సంఘటన కొలంబియాలోని బూగా నగరంలో ఆగస్టు 30న జరిగిట్టు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా అతివేగంతో బైకుపై దూసుకొచ్చిన ఓ వ్యక్తి రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా మినీ బస్సును ఢీకొట్టాడు. నేరుగా తలుపు వద్ద బస్సును ఢీకొననడంతో అతడు ఎరిగి బస్సులోపలికెళ్లి పడ్డాడు. బస్సు డ్రైవర్ ఏమరుపాటుగా తలుపు తెరిచివుంచడం బైకర్ పాలిట లక్గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన రెండు సీసీటీవీల ఫుటేజీ వైరల్ కావడంతో దీని గురించి ప్రపంచమంతా తెలిసింది.తాజాగా ఈ వీడియోను మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయాంక ఎక్స్లో షేర్ చేశారు. కొన్నిసార్లు పొరపాటు కూడా అద్భుతంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై నెటిజనులు సరదా కామెంట్లు పెడుతున్నారు.పొరపాటుతో మిరాకిల్!కొలంబియా అధికారులు పౌరులను ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేవలం ప్రజా ప్రయోజన ప్రకటన మాత్రమే అంటూ ఓ నెటిజన్ సరదా వ్యాఖ్య పెట్టారు. అతడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే సురక్షితంగా బస్సులో దేన్ని గుద్దుకోకుండా సీట్ల మధ్యలో పడ్డాడని మరో నెటిజన్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని ఇంకొకరు అన్నారు. దేవుడు సర్వత్రా ఉన్నాడనడానికి రుజువు ఈ అద్భుత ఘటన అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మడతపెట్టే ఐఫోన్పై పేలుతున్న మీమ్స్ -
మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు!
మొన్న వరద నీటిలో కూడా తగ్గేదేలే అంటూ తడి బట్టలతోనే పెళ్లి వేడుకను ముగించుకున్న జంట కథ గురించి తెలుసుకున్నాం. తాజాగా మిన్ను విరిగి మీద పడినా, పెళ్లి మాత్రం ఆగేదే లేదు అంటూ ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. యుద్ధం తెచ్చిపెట్టిన వినాశనం నడుమ ప్రేమ జయించిన ఒక భావోద్వేగ సంఘటన ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్లో చోటుచేసుకుంది. వీరి ఎమోషనల్ వెడ్డింగ్ నెట్టింట వైరల్గా మారింది. రష్యా దాడిలో తాము ఉంటున్న అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఉక్రెయిన్ సైనికుడు , అతని భాగస్వామి శిథిలాల నుంచే తమ పెళ్లి దుస్తులను బయటకు తీసి, షెడ్యూల్ ప్రకారమే వివాహం చేసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసి ల్యుడ్మిలా (33)కు లియోనిడ్ రిజాక్ (43) లు చాలాకాలంగా కలిసి ఉంటున్నారు. తూర్పు ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్ ప్రాంతంలో బాంబర్ డ్రోన్ల విభాగంలో పనిచేస్తున్నాడు రిజాక్. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన ముహూర్తం ఖరారైంది కూడా. సరిగ్గా వివాహానికి కొన్ని గంటల ముందు, వారు నిద్రపోతున్న సమయంలో వారి భవనానికి ఎదురుగా ఉన్న వేర్హౌస్పై రష్యా దాడి జరిగింది. ఈ దాడి ధాటికి అపార్ట్మెంట్ కిటికీలు పగిలిపోయాయి, ఫర్నిచర్ చెల్లాచెదురైంది. ల్యుడ్మిలా పగిలిన గాజు ముక్కలు , శిథిలాల కింద నుంచి తన తెల్లటి పెళ్లి లంగాను బయటకు తీయాల్సి వచ్చింది. రెండో దాడి ముప్పు ఉండటంతో, వారు ల్యుడ్మిలా 6 ఏళ్ల కుమార్తెతో కలిసి బంకర్ (షెల్టర్)కు చేరుకున్నారు. దాడి తీవ్రతకు వారు ఉంటున్న ఫ్లాట్ నివాస యోగ్యంగా లేకుండా దెబ్బతింది.సెప్టెంబర్ 8న జరిగిన ఈ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సైతం వైమానిక హెచ్చరికల (Air-raid sirens) వల్ల వారికీ ఆరు రోజులు పట్టింది. తీరా పెళ్లి రోజున ఉదయం 10:40 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కు చేరుకునేసరికి మళ్లీ సైరన్ మోగడంతో దాదాపు మూడు గంటల పాటు ఆవరణలోనే వేచి చూడాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా : కేంద్రమంత్రి గడ్కరీ ధ్వజంభర్త లియోనిడా సాంప్రదాయ ఉక్రేనియన్ చొక్కా (విషైవాంకా)తో పాటు శిథిలాలనుంచి తీయలేక ఆర్మీ ప్యాంట్, స్నీకర్లతోనే వివాహానికి సిద్ధ మయ్యారు. ల్యుడ్మిలా డ్రెస్కు కూడా చిన్న చిన్న రంధ్రాలు పడినప్పటికీ, ఏమాత్రం వెనుకంజ వేయకుండా పెళ్లి చేసుకున్నారు."దేవుడు నాకు జీవితాన్ని కొనసాగించే అవకాశం ఇచ్చినప్పుడు, దాన్ని ఎందుకు వాయిదా వేయాలి? ఎవరికో జీవితం ముగిసిపోవచ్చు, కానీ రేపు మాకు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కనీసం ఇప్పటికైనా సంతోషంగా ఉండే హక్కు మాకు ఉంది" అని ల్యుడ్మిలా భావోద్వేగంతో పేర్కొన్నారు. 🇺🇦 A Russian strike wrecked their Kyiv apartment just hours before their wedding.Liudmyla and Leonid pulled their wedding clothes from the rubble, waited through another air-raid alert — and got married anyway.Sometimes, carrying on is its own form of defiance. pic.twitter.com/5B0YVjVfAV— Mark (@MarksystemDE) September 9, 2026 -
ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్మీడియాలో పేలుతున్న మీమ్స్
యాపిల్ సంస్థ ఎట్టకేలకు తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ను 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్, ఇతర ప్రత్యేకతలపై కాకుండా సోషల్మీడియాలో జరుగుతున్న సంభాషణ మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జోక్కు IYKYK (if you know, you know) ) అనేది ట్రెండింగ్ ట్యాగ్లైన్గా మారింది.మైక్రోసాఫ్ట్ 2020లోనే తన రెండు స్క్రీన్ల ఫోల్డబుల్ డివైజ్ను యాపిల్ కాపీ కొట్టిందంటూ మీమ్స్, జోకులు పేలిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన ఫోన్కు 'Surface Duo' అని పేరు పెట్టింది. దీంతో 'Duo' అనేది కొత్త పేరేమీ కాదు, పాతదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాపిల్ 'Fold' అని పెట్టకుండా మైక్రోసాఫ్ట్ను కాపీ కొట్టిందని కొందరు ఎక్స్లో విమర్శించారు. మరికొందరు ఇది మైక్రోసాఫ్ట్దే కాకుండా, గతంలొ వచ్చిన ఇంటెల్ (Core Duo) చిప్ల పేరును కూడా గుర్తుచేస్తోందన్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో కంటే ముందే, అంటే 1990లలోనే యాపిల్ తన PowerBook Duo ల్యాప్టాప్లకు ఈ పేరును వాడిందని మరికొందరు గుర్తుచేశారు.విండోస్ సెంట్రల్ ఎడిటర్ జాక్ బౌడెన్ మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ తమ 'Duo' ప్రాజెక్ట్ను మధ్యలోనే వదిలేయడం వల్ల యాపిల్ ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును (మరియు MacBook Neo రూపంలో 'Neo' పేరును) ఉపయోగించుకుందని నిపుణులంటున్నారు. పేర్కొన్నారు. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్ సైట్ వ్యాఖ్యానిస్తూ, మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అత్యంత దారుణమైన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటైన సర్ఫేస్ డ్యూయో పేరునే యాపిల్ ఎంచుకోవడం నవ్వు తెప్పిస్తోందని రాసుకొచ్చింది.విండోస్ లేటెస్ట్ కథనం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో హార్డ్వేర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సోఫ్ట్వేర్ పరంగా విఫలమైంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఆ ప్రాజెక్ట్ను కొనసాగించి ఉంటే సర్ఫేస్ డ్యూయో ఎలా ఉండేదో, యాపిల్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు అలా వచ్చిందని విశ్లేషించింది.యాపిల్ గతంలో 'MagSafe Duo' ఛార్జర్ వంటి వాటికి ఈ పేరు వాడినప్పటికీ, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విఫలమైన ప్రాజెక్ట్ పేరు మళ్లీ యాపిల్ ఫోన్కు రావడాన్ని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అయితే ఈ పేర్ల సారూప్యతపై యాపిల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.'Huawei made a foldable phone five years ago...' '"Junk, that phone will break in an instant... Chinese junk... Why do you need so much screen on a single phone? Just buy a tablet."' 'Apple makes a foldable phone...' '"Only Apple could pull this off."'😁😁😁 pic.twitter.com/kbeCGujp8d— FierceGoys (@GrahamInHell) September 10, 2026 -
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్గా!
సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్ అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తీరా ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించకుండా ఉంటుందా అనే సందేహాం సదా వెంటాడుతుంటుంది. అయినా సరే ఇంతటి భయానక నిర్ణయం తీసుకుంది ఈ మహిళ. అది కూడా దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఉత్తరప్రదేశ్కు చెందిన స్నిగ్ధా బోస్ సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది. ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా మంచి జీతం ఆర్జించే ఉద్యోగాన్ని వదులకుందామె. అసలు ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టారు, వెర్రి నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఆ ఉద్యోగంలో తను పనిచేస్తున్నట్లుగా అనిపించలేదని, నిరంతరం ఒత్తిడి, మానసిక అలసట, సొంత శరీరంలో అనుసంధానం కావడానికి సమయమే లేనట్లుగా అనిపించిందని చెబుతుంది. ఏదో ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఆ ఉద్యోగం వదిలేసినట్లు పేర్కొంది స్నిగ్ధా. ఆ తర్వాత మీరట్లో యోగాకి సంబంధిచిన 'తులా వెల్నెస్ స్టూడియోని నడుపుతున్నట్లు తెలిపింది. తనకు ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత శ్రేయస్సే ముఖ్యమనిపించిందని అంటోంది. ఇలా తనలా ఉద్యోగం మానేసేంత సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాగే తనలా చేయాల్సిన పనిలేదు కూడా. ఒత్తిడితో ఉద్యోగం చేస్తూ కూడా ఆరోగ్యాన్ని చూసుకోచ్చు. ఒక పక్క ఉద్యోగం, అలాగే శారీరక బలం పెంపొందిచుకునేలా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయొచ్చని అంటోంది. చెప్పాలంటే జీవితాన్ని మార్చకుండానే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయొచ్చని, కానీ తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా భావించి, ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా అని సోషల్ మీడియా వేదికగా తన స్టోరీని పంచుకుంది స్నిగ్ధా. అంతేగాదు నెటిజన్లు కూడా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్నిగ్ధ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ..తమ అనుభవాల్ని పంచుకున్నారు. మరొక యూజర్ తాను కూడా ఎస్బీఐలో ఉద్యోగం మానేసి తనకు నచ్చి గోల్ప్ క్రీడపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా దూసుకుపోతున్నా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snigdha | Certified Yoga & Pranayam Instructor (@tulaa_wellness) (చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!) -
‘కాక్రోచ్గా మారిపోవాలేమో!’.. మాల్యా సంచలన వ్యాఖ్యలు
బ్యాంకు రుణాల ఎగవేత, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవహారం, మనీలాండరింగ్ ఆరోపణలతో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్న ఆయన.. తనపై భారత ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా మరోసారి ఆరోపణలు చేశారు. తన ఆస్తులు, నిధుల నుంచి బ్యాంకులకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో వరుస పోస్టులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మాల్యా చేసిన ఓ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తనపై జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఎదుర్కొంటున్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న అన్యాయాలన్నింటినీ చూస్తుంటే.. నేను కాక్రోచ్గా మారిపోవాలేమో అనిపిస్తోంది. బహుశా కాక్రోచ్ వైపు జీవితం మెరుగ్గా ఉండొచ్చు’’ అని ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరు ప్రస్తావనకు వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత చేసిన బొద్దింకల వ్యాఖ్యల నేపథ్యంలో సెటైరిక్ క్యాంపెయిన్గా పుట్టుకొచ్చింది సీజేపీ, అభిజిత్ దీప్కే నేతృత్వంలో పుట్టిన ఈ పార్టీ.. ఆ తర్వాత జంతర్ మంతర్ నీట్ నిరసనలతో దేశం చూపును ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ మాల్యా చేసిన కామెంట్ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.With all the injustices I have faced and continue to face, I wonder if I should become a cockroach. Maybe a better life on the cockroach side.— Vijay Mallya (@TheVijayMallya) September 9, 2026రూ.14 వేల కోట్లపై మాల్యా వాదనతనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మాల్యా ఈడీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. బాంబే హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్లో.. తన నుంచి రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నిధులను స్వాధీనం చేసుకుని, వాటిని తాను బకాయిపడిన బ్యాంకులకు చెల్లించినట్లు పేర్కొందని ఆయన అన్నారు. 2021లోనే ఈ మొత్తాన్ని బ్యాంకులకు అందించినట్లు తెలిపారు.‘‘నా మాటలను నమ్మకపోతే పర్వాలేదు. కోర్టులో ఈడీ ఏం చెప్పిందో చూడండి’’ అంటూ తన వాదనకు మద్దతుగా మాల్యా పేర్కొన్నారు. తనపై భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే తన ఆస్తులు, నిధుల నుంచి పెద్ద మొత్తంలో బ్యాంకులకు చెల్లింపులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.కింగ్ఫిషర్ ఉద్యోగులకూ చెల్లింపులుకింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని కూడా మాల్యా ప్రస్తావించారు. ఈడీ అటాచ్ చేసిన తన నిధుల నుంచి రూ.350 కోట్లకు పైగా విడుదల చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. తన వద్ద నిధులు ఉన్నప్పటికీ.. అవి ఈడీ అటాచ్ చేయడంతో తాను నేరుగా చెల్లింపులు చేయలేకపోయానని వివరించారు.ఇదే సందర్భంగా తన నివాసం, పౌరసత్వం, భారత్కు తిరిగి రావడం వంటి అంశాలపై వస్తున్న విమర్శలకు మాల్యా వివరణ ఇచ్చారు. బ్రిటన్లో శాశ్వత నివాస హోదా ఉండటం, అక్కడి పౌరసత్వం కలిగి ఉండటం రెండూ ఒకటి కాదని చెప్పారు. అలాగే బ్యాంకులకు బకాయిలు చెల్లించడానికి తాను తప్పనిసరిగా భారత్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.‘భగోడా’ వ్యాఖ్యలపైనా స్పందనభారత్కు తిరిగి రావడం లేదంటూ తనను ‘భగోడా’(పరారీలో ఉన్న వ్యక్తి) అని విమర్శిస్తున్న వారిపైనా మాల్యా ఇటీవల స్పందించారు. తాను 1992 నుంచే బ్రిటన్లో శాశ్వత నివాస హోదాలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి బయటకు వెళ్లకుండా తనపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తనపై తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. 2026 ఫిబ్రవరిలోనూ మాల్యా ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటన్ కోర్టుల ఆంక్షల కారణంగా ఇంగ్లండ్, వేల్స్ నుంచి బయటకు వెళ్లలేనని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా దాన్ని కలిగి ఉండటం కూడా తనకు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేత, మోసం, మనీలాండరింగ్, ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాల్యా భారత్లో పలు కేసులు ఎదుర్కొంటున్నారు. 2015లో ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీసుకున్న రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత మాల్యాపై పలు కేసులు నమోదయ్యాయి. న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్ విడిచి బ్రిటన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయనను భారత్కు తీసుకురావడం, బ్యాంకుల బకాయిలు వసూలు చేయడం వంటి అంశాలపై భారత్, బ్రిటన్లలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.అయితే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను మాల్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ‘కాక్రోచ్’ వ్యాఖ్యతో మరోసారి తనపై జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్నదంతా అన్యాయమేనన్న భావనతోనే ఈ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఆమె రీ ఎంట్రీకి ఇదే మాంచి ఛాన్స్! -
సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్!
బంగ్లాదేశ్లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 9) చట్టోగ్రామ్లోని హాత్హజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించారు. బంగ్లాదేశ్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. అసలు ఏం జరిగింది?ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్లోని ఫైరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.చైనా తయారీ ట్యాంక్..!ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్ మోడల్ను వెల్లడించలేదు. టైప్–59ను బంగ్లాదేశ్ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్’గా కూడా అప్గ్రేడ్ చేసింది.Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..చైనాలో తయారైన టైప్–59.. సోవియట్ కాలం నాటి టీ–54 ట్యాంక్ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్గ్రేడ్ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్–59 ట్యాంకుల అప్గ్రేడ్, మరో 58 టైప్–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్ ఫ్లీట్లో భాగంగా ఉన్న కీలక ప్లాట్ఫారమ్లన్నమాట!.దర్యాప్తు ప్రారంభంఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. ఫీల్డ్ ఫైరింగ్ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.ఇదీ చదవండి: మిడిల్ఈస్ట్లో పాక్కు బిగ్ టెస్ట్ -
ఆ ఒరంగుటాన్లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్
5 Baby Orangutans అంతరించిపోతున్న అరుదైన ఐదు ఒరంగుటాన్లు (Orangutans) ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో దర్శనమివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్కు చెందని వీటిని బిచిత్రపూర్ అటవీ ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు వదిలి వెళ్లినట్టుగా భావిస్తున్నారు. సాధారణంగా ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, మలేసియా అడవుల్లో కనిపిస్తాయి. దీంతో అసలివి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు స్మగ్లింగ్ చేశారు అనే కోణంలో అధికారులు ముమ్మర విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణలోని కీలక అంశాలు వెలుగు చూశాయి.ఒరంగుటాన్లు లభించిన రాత్రి అడవి సమీపంలో తిరిగిన ఒక నల్లటి మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనం సీసీటీవీ దృశ్యాలలో కనిపించింది. రాత్రి 11:25 గంటలకు వెళ్లి, తిరిగి 15 నిమిషాల తర్వాత ఆ వాహనం రావడంపై అధికారులు దృష్టి సారించారు.ఈ కేసు విచారణకు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) రంగంలోకి దిగింది.#WATCH | Five rescued Orangutans brought to Nandankanan Zoo in Bhubaneswar, kept in quarantine.(Video source: Nandankanan Zoo) https://t.co/Yl7TEJx0cm pic.twitter.com/THuhiLpugJ— ANI (@ANI) September 9, 2026ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం మరోవైపు రక్షించిన ఒరంగుటాన్లను భువనేశ్వర్లోని నందన్కానన్ జూకి తరలించి క్వారంటైన్లో ఉంచారు. వీటి ఆరోగ్య పరిస్థితిని అటవీ శాఖ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే జాతీయ వన్యప్రాణి నిపుణులను కూడా పిలిపించనున్నారు.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుఅంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో ఒరంగుటాన్ విలువ సుమారు రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుందని ఒడిశా అటవీ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ఖుంటియా తెలిపారు. ఇవి విమాన, జల లేదా రైలు మార్గాల ద్వారా వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఓడరేవుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని వన్యప్రాణి నేరాల నిరోధక బ్యూరో (WCCB)ని మంత్రి కోరారు. <Five young orangutans rescued from Odisha’s Bichitrapur casuarina forest.Forest officials reportedly found the animals apparently abandoned in the coastal forest of Balasore district, raising serious questions about how a species not native to Odisha reached the area.… pic.twitter.com/8Wwo7BfyzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 9, 2026ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది! -
చైనా కండకావరం.. లైవ్లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.ఇది బెదిరించడమే..చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLDYOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIALA dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026దక్షిణ చైనా సముద్రంపై వివాదంఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా? -
యూఎస్ బోర్డర్ దగ్గర భారత సంతతి వ్యాపారవేత్తకు చేదు అనుభవం
అమెరికాలో పుట్టి పెరిగిన భారత సంతతి అమెరికన్ పౌరుడు, వ్యాపారవేత్త, రచయితకు నీల్ బక్షి (Neal Bakshi)కి చేదు అనుభవం ఎదురైంది. దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దు వద్ద, తన రంగు కారణంగా ఎదుర్కొన్న వేధింపుల ఘటన ఆందోళన రేపింది. గ్రీన్ల్యాండ్ విహారయాత్ర తర్వాత అమెరికా సరిహద్దు దగ్గర గదిలో విచారించి, అమానుషంగా ప్రవర్తించారంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఇంగ్లీష్ రాని ఒక వృద్ధురాలితో అధికారుల ప్రవర్తించిన తీరును కూడా తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.అమెరికా పౌరులందర్నీ ఇలానే ట్రీట్ చేస్తున్నారా? లేదా కొంతమంది మాత్రమే టార్గెట్ చేస్తున్నారా అని ఆవేదనతో ప్రశ్నించారు. తనకు 'గ్లోబల్ ఎంట్రీ' (Global Entry) పర్మిషన్ ఉన్నప్పటికీ, అమెరికా చేరుకోగానే సరిహద్దు భద్రతా అధికారులు (US Customs and Border Protection) సాధారణ తనిఖీ అని చెప్పి పక్కకు తీసుకెళ్లారని నీల్ బక్షి వాపోయారు. అదనపు స్క్రీనింగ్ తనకు కొత్తేమీ కానప్పటికీ, ఈ ప్రత్యేక సంఘటన మాత్రం "పూర్తిగా భిన్నంగా" అనిపించిందన్నారు. ఆ సంఘటన ముగిసేంత వరకు, తనను ప్రాసెసింగ్ కోసం వెనుకకు ఎందుకు తీసుకువెళ్తున్నారో ఏజెంట్లు వెల్లడించ లేదని చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Neal Bakshi (@neal.bakshi)కిటికీలు లేని, పసుపు రంగు వెలుతురు ఉన్న పెద్ద గదిలో ఆయనను కూర్చోబెట్టారు. అక్కడ నల్లజాతీయులు, ఆసియా వాసులు , ఇతర వర్ణాల వ్యక్తులు (People of Colour) మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి ఆయన వ్యక్తిగత సమాచారం, వివిధ సంస్థలు లేదా సమూహాలతో ఆయనకున్న సంబంధాల గురించి వివరంగా ప్రశ్నించారు. ఇది ఆయన భద్రత కోసమే చేస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ తన దేశంలోకి తన ఎంట్రీ నిరాకరించడం తనకు చాలా బాధించిందని చెప్పారు. తర్వాత ఏ అబద్ధం చెప్పాలో ఆలోచించి కూర్చోఅంటూ పాపం ఇంగ్లీసు రాని ఒక పెద్దావిడను గద్దించారని తెలిపారు.ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!ఎందుకు ఇలా నీల్ బక్షి ఆవేదనసరిహద్దు భద్రత ముఖ్యమే అయినప్పటికీ, కేవలం నిర్దిష్ట రంగు లేదా ప్రాంతానికి చెందిన అమెరికన్ పౌరులను మాత్రమే ఇలా అనుమానించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. "అమెరికన్లందరినీ సమానంగా చూస్తున్నారా? లేక కొంతమందికి మాత్రమే స్వేచ్ఛ ఉందా?" అని ఆయన ప్రశ్నించారు.కాగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అక్రమ వలసలపై కఠిన చర్యలు వలస నిబంధనల తనిఖీలను బాగా పెంచింది. జాతీయ భద్రత కోసమే ఇవన్నీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, చట్టబద్ధమైన పౌరులు, గ్రీన్కార్డ్ హోల్డర్లు కూడా అనవసరమైన తనిఖీలకు, గంటల తరబడి జరిగే విచారణలకు గురవుతున్నారని హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్? -
ఒలంపియా జిమ్ : బౌన్సర్లు కేరాఫ్ జైపూర్
జైపూర్: బౌన్సర్ అంటే కేవలం కండలు తిరిగిన శరీరం కాదు.. క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతకు ప్రతిరూపం. షాపింగ్ మాల్స్ నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు.. ప్రముఖుల కార్యక్రమాల నుంచి భారీ ఈవెంట్ల వరకు ఎక్కడ జన సందోహం ఉంటే అక్కడ వీరి విధులు కనిపిస్తాయి. అలాంటి బౌన్సర్లను తీర్చిదిద్దుతూ గ్రామీణ యువతకు ఉపాధి బాట చూపుతోంది జైపూర్ మండలం రసూల్పల్లిలోని ఒలంపియా జిమ్ (Olympia Gym). వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు..అదే ఫిటెనెస్ను ఉపాధిగా మలుచుకుంటున్న యువతకు ఈజిమ్ అడ్డాగా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది యువకులు పట్టణ ప్రాంతాల్లో బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఉద్యోగం చేస్తూనేఒలంపియా జిమ్లో శిక్షణ పొందుతున్న వారంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేసూ్తనే బౌన్సర్గా వి«ధులు నిర్వహిస్తున్నారు. తమకు లభించే ఖాళీ సమయాన్ని జిమ్లో వ్యాయామానికి కేటాయిస్తూ ఫిట్నెస్ను కొనసాగిస్తున్నారు. యువతలో శారీరకధారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వ్యసనాలకు దూరంగా..యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలన్నదే లక్ష్యం. జిమ్ ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ, శారీరక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తాంఅంటున్నా ఒలంపియా జిమ్ నిర్వాహకుడు ప్రవీణ్. ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు15 ఏళ్ల క్రితం మొదలై..రసూల్పల్లికి చెందిన కుమ్మరి ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒలంపియా జిమ్ను ఏర్పాటు చేశాడు. మొదట చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆయన ప్రయత్నం క్రమంగా విస్తరించి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో రెండు, చెన్నూర్లో రెండు, రసూల్పల్లిలో ఒకటి మొత్తంగా ఐదు బ్రాంచ్ల వరకు చేరింది. జిమ్లో వ్యాయామంతో పాటు శారీరక ధారుఢ్యం, క్రమశిక్షణ, ఫిట్నెస్పై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు 40 మంది యువకులు, 10 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొందుతూ హైదరాబాద్, సూర్యాపేట, సిద్దపేట, వరంగల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, బెంగళూర్ వంటి పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో రద్దీని నియంత్రించడం, ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించడం, ప్రముఖులు, నిర్వాహకులకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఈవెంట్లలో అవసరాన్ని బట్టి భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. -
ఆ హైజాక్ ఘటన..మా అమ్మ ఫ్లైట్ జర్నీలకు బ్రేక్ వేయలేదు!
ఒక్కోసారి కొన్ని ప్రయాణాలు భయానక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎంతలా అంటే ఓ పట్టాన తేరుకోలేం. ఇంకోసారి అలాంటి జర్నీలు చేసే సాహసం కూడా చేయం. కానీ ఈ మహిళ టీనేజ్ వయసులో భయానక హైజాకింగ్ ఘటన ఎదుర్కొంది. క్షణం, క్షణం ఉత్కంఠ రేపే ఆ ఘటనలు బతికున్నంత వరకు మర్చిపోని విషాదం అది. అయినా..అది తన జర్నీలకు బ్రేక్ వేయలేదంటూ తన కథను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నెటిజన్లు ఆమె స్టోరీని అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ రోహన్ శర్మ తన తల్లి అద్భుతమైన కథను ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్ ఘటన జరిగి 40 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. తన తల్లికి 15 ఏళ్ల వయసున్నప్పుడు సెలవుల తర్వాత ఢిల్లీ నుంచి ఒంటరిగా అమెరికాకు వెళ్తుండగా ఈ దురుదృష్టకర ఘటనను ఎదుర్కొందని తెలిపాడు. ఇన్నేళ్లయినా..ఆ భయనాక క్షణాలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నా..విమానా ప్రయాణాలు ఆపలేదని ధీమాగా చెబుతున్నాడు. ఆ విషాద ఘటన తన అమ్మకు ప్రపంచాన్ని చూడాలనే కలను దూరం చేయలేకపోయిందని అంటున్నాడు. కరేబియన్లో స్కూబా డైవింగ్ చేయడం, స్విస్ ఆల్ప్స్లో స్కీయింగ్ చేయడం, పోర్చుగల్ జలాల్లో ఈత కొట్టడం వరకు ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తోంది. పైగా కోలుకోవడం అంటే మర్చిపోవడం కాదని జీవించడం అని నిరూపించిందని గర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు తను ఆ గాయం తనని నిర్దేశించకూడదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది అందువల్లే ఈ సాహసకృత్యాలను చేయగలిగింది, మంచి అనుభవాల్ని సంపాదించుకుందని చెబుతున్నాడు. ఇక ఆమె తల్లి కూడా ఆనాటి విషాద దృశ్యాలు తన మనసులో గాఢంగా ముద్రపడిపోయాయని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారామె. తనలా నాటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లు కోలుకున్నారా లేదా అని ఆలోచిస్తుంటానని చెబుతోందామె. అయితే తాను టీనేజ్ వయసులో ఎదుర్కొన్న ఆ గాయాన్ని తనను శాసించకూడదని అనుకున్నా కాబట్టి ఇవన్నీ చేయగలిగానని అంటోందామె. అలాగే ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. తనెలా బయటపడిందో పంచుకుంది. ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్కు గురైంది. ప్రయాణికులు సుమారు 16 గంటల పాటు బందీలుగా ఉంచారు. హైజాకర్లు కాల్పులు జరపడానికి ముందు ప్రయాణికులను విమానం మధ్యలోకి తీసుకువెళ్లారని, ఇంతలో మరో ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడంతో దానిగుండా తాను బయటపడినట్లు తెలిపింది. అయితే లోపల కాల్పుల శబ్దానికి బిగుసుకుపోయి విమానం రెక్కపై ఉండిపోయానని, ఇంతలో సన్షైన్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నుంచి నెమ్మదిగా కిందకు దించిందంటూ నాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది’. అయితే తాను శారీరకంగా ఎలాంటి గాయాలవ్వకుండా సురక్షితం బయటపడ్డప్పటికీ..ఆ ఘటనలో సుమారు 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. అది నిజంగా ఎవ్వరి జీవితాన్ని అయినా ప్రభావితం చేసే భయానకమైన బాధకర ఘటనగా అభివర్ణించిందామె. అయితే తాను దాన్నుంచి బయటపడి ధైర్యంగా ముందుకు సాగాలనుకున్నా..కాబట్టి విమాన ప్రయాణాలకు బ్రేక్ పడలేదని నవ్వుతూ చెబుతుంది. అంతేగాదు ఇలాంటి అనుభవం పొందిన వాళ్లు ఎవ్వరైనా తెలుసుకోవాల్సింది ఏంటో తన అనుభవంతో గొప్ప పాఠాన్ని నేర్పిందామె. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ మేడం..అద్భుతమైన కథ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rohan Sharma (@rohabits) (చదవండి: ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!) -
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్లోకి..కట్ చేస్తే!
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ప్రజల ప్రాణాలమీదికి తీసుకొస్తున్నా,తీరు మారడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీలో ఒక యువకుడు డేంజరస్ స్టంట్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాస్ల్యాండ్స్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఉన్న పహుంజ్ డ్యామ్ వద్ద ఈ సంఘటన జరిగింది. రక్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వాయి గ్రామానికి చెందిన రాజ్కుమార్ కుమారుడు, 38 ఏళ్ల పుష్పేంద్ర కుమార్ (32) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సమీపంలోని పహూజ్ డ్యామ్ను చూడటానికి వెళ్లాడు ఇన్స్టారీల్ కోసం ఒక స్టంట్ చేయాలను పూనుకున్నాడు. స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తుండగా, పుష్పేంద్ర డ్యామ్లోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న బాండ్రీ వాల్ ఎక్కి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్లోకి దూకాడు.Jhansi - A young man suffered fractures in both legs after he jumped from a 30-foot-high dam in Jhansi while trying to shoot a social media reel. The incident took place at Pahuj Dam. Pushpendra Kumar Manauriya, 32, a resident of Parwai village under Raksa police station, had… pic.twitter.com/HpowlS0MO7— NextMinute News (@nextminutenews7) September 7, 2026డ్యామ్లో నీళ్లు ఎక్కువగా ఉంటాయని భావించి దూకినప్పటికీ, ఆ ప్రదేశంలో నీరు చాలా తక్కువగా ఉండటంతో నేరుగా నేలను బలంగా తాకాడు. ధఋఃథక్ష అతడి రెండు కాళ్లు తీవ్రంగా విరిగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్నేహితులు, స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పుష్పేంద్రను డ్యామ్ నుంచి బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణంనోట్ : సోషల్ మీడియాలో వ్యూస్కోసం లేనిపోని సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు గతంలో చాలా చూశాం. ఇప్పటికే ఇలాంటి స్టంట్లు చేసి, తల్లితండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. కొన్ని సెకన్ల రీల్ లేదా వైరల్ వీడియోల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయవద్దని పోలీసులు, ప్రజలకు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ -
మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెహిందీ పెడుతూ ఎంత ఆదాయం గడిస్తుందో నెట్టింట వీడియో రూపంలో షేర్ చేసింది. భారత్లో మెహిందీ పెట్టే స్కిల్ని ఎలా చూస్తారు..అదే అమెరికాలో అయితే ఎలా ఉంటుందో పోలుస్తూ చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు పార్ట్టైంగా చేస్తున్న ఈ సరదా స్కిల్తో తాను ఎంత మేర ఆర్జిస్తుందో కూడా పంచుకుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించి మెహిందీ స్కిల్పై చర్చలు రేకెత్తించింది. అమెరికాలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియాం కజైన్ ఈ పోస్ట్ పంచుకుంది. తన ఉద్యోగానికి, అభిరుచికి మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తూ..ప్రొఫెషనల్ మెహిందీ ఆర్టిస్ట్గా ఎలా కొనసాగుతుందో చెప్పుకొచ్చింది. కోడింగ్ ద్వారా నెలవారీ ఖర్చులు తీరుతుండగా, మెహిందీ పనితో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. తన డిజైన్ పనికి గంటకు సుమారు రూ. 9 వేల నుంచి పదివేల దాకా ఛార్జ్ చేస్తుందట. అంతేగాదు నిర్ణీత గంటల రుసుము తోపాలు ఒక్కోసారి 20 శాతం వరకు టిప్ రూపంలో అదనపు మొత్తాన్ని కూడా ఆర్జిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాదు పెళ్లిళ్ల సీజన్లో అయితే మెహిందీ పెట్టే పూర్తి స్థాయి బుకింగ్ని బట్టి ఒక్క రోజుకి దాదాపు రూ. 1 లక్ష దాక సంపాదించొచ్చని తెలిపింది. తనకు అమెరికా వచ్చిన తర్వాతే కళాకారులకు ఎంత విలువ ఉంటుందో అర్తమైందని అంటోంది. భారత్లో మెహిందీ ఆర్టిస్ట్ వృత్తిని అంత గొప్ప పనిగా చూడరు, అంతగా గౌరవించరని వాపోయింది. కానీ ఇక్కడ తనను కళాకారిణిగా గౌరవిస్తారని అంటోంది. అంతేగాదు తనకు ఏదో ఒక చిన్న పనిచేస్తున్నట్లు అనిపించదని చెబుతోంది. అయినా ఏపని చిన్నిది, పెద్దది అని ఉండదు, పని అంటే పనే అని నొక్కి చెబుతోంది. ఇక అలాగే అమెరికాలో జీవన వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని ఒప్పుకుందామె. నెటిజన్లు కూడా ఆమె మాటలకు మద్దతిస్తూ..ఔను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్ప మరే ఏ ఇతర ఉద్యోగాన్నీ అంతగ గౌరవించరంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyancka Jaiin (Creating Wings Co.) (@priyancka.jaiin) (చదవండి: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
టీచర్స్డే.. ఐటెం సాంగ్!
టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్గ్రౌండ్లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.డెహ్రాడూన్లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు. కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026 -
రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!
లాటరీలో జాక్పాట్ తగలాలి, ఆ మొత్తంతో బంగ్లా,కారు, నగలు ఇలా ఎన్నో రకాల విలాసాలపై ఖర్చుపెట్టాలనే ఆశతోనే సాధారణంగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తారు ఎవరైనా కదా..! అలా ఒక దంపతులకు అనూహ్యంగా వేలకోట్ల రూపాయల విలువ చేసే లాటరీ దక్కించుకున్నారు. మరి ఆ ధనాన్ని వారు ఎలా ఖర్చుపెట్టారో తెలుసా? ప్రస్తుతం వీరి కథ వైరల్గా మారింది.స్కై న్యూస్ ప్రకారం 2019లో ఫ్రాన్సెస్, ఆమె భర్త ప్యాడీ కాన్నోలీ పెద్ద మొత్తంలో యూరోమిలియన్స్ (EuroMillions) గెల్చుకున్నారు. ఫ్రాన్సెస్ కాన్నోలీ అనే రిటైర్డ్ టీచర్, సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ , టీచర్, పెద్దమొత్తంలో గెల్చుకున్నదీని ఏకంగా రూ. 1,470 కోట్లు. సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తే ఫ్రాన్సెస్ ఇక్కడే చాలా పెద్దమనసుతో ఆలోచించారు. తమ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత, గెలుచుకున్న మొత్తం 115 మిలియన్ల పౌండ్లలో, సగానికి పైగా అంటే రూ. 632.5 కోట్లను ఛారిటీలకు, సంఘాలకు విరాళంగా అందించారు. అందించారు. దీనికోసం ఆమె 'PFC ట్రస్ట్' అనే స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తోంది.A Northern Irish National Lottery winner who has given away half of her £115 million winnings has said it is human nature to help others.Frances Connolly has set up a charitable trust to support good causes since winning the enormous EuroMillions jackpot with husband Paddy in… pic.twitter.com/d9UQRdvJXv— The Irish News (@irish_news) September 6, 2026 అంతేకాదు ఇంత సంపద ఉన్నప్పటికీ, వీరు నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్లో నిరాడంబరంగా జీవిస్తున్నారు. విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా సెకండ్ హ్యాండ్ వాచీలు, వాడిన కార్లనే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.ఇదీ చదవండి : నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా గత నెలలో 80 ఏళ్ల వయసులో మరణించిన గాయని, ప్రముఖ సంగీత విద్వాంసురాలు , దాత డాలీ పార్టన్ (Dolly Parton) తన దాతృత్వానికి ఒక 'స్ఫూర్తి' అని ఫ్రాన్సెస్ అభివర్ణించారు. మిడిల్స్బ్రో వెలోడ్రోమ్లో "60 ఫర్ 60 ఛాలెంజ్"లో కూడా పాల్గొంది. "మనకు తగినంత లభించినప్పుడు ఇతరులతో పంచుకోవడం మానవ నైజం" అంటారు ఆమె. తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉన్నప్పుడు, అనవసరంగా డబ్బును తన దగ్గరే ఉంచుకోవడంలో అర్థం లేదని ఆమె పేర్కొన్నారు.ఉత్తర ఐర్లాండ్లో పెరిగిన ఫ్రాన్సెస్, 1990లో హార్ట్ల్పూల్కు మారారు. అక్కడ దాదాపు 25 ఏళ్లకు పైగా నివసిస్తూ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్కు నిధులు సేకరించేందుకు ఏడుగురు అథ్లెట్లు పలు ఛాలెంజ్లలో పాల్గొంటున్నారు. సామాజిక సేవలో చురుగ్గా ఉంటూ, పూర్తి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తన ట్రస్ట్ ద్వారా యువ సంరక్షకులు సరైన విరామం తీసుకోవడానికి వీలుగా విశ్రాంతి కారవాన్ను డొనేట్ చేసింది. ఇంకా ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం కొన్ని ప్రాజెక్టులు, డిజిటల్ టెక్నాలజీకి నిధులు సమకూర్చింది .అత్యవసర ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. స్థానిక క్రీడా క్లబ్లలో డీఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేసింది.ఈ ట్రస్ట్ తరపున గ్రేట్ నార్త్ రన్లో పాల్గొన బోతున్న పాల్ హెవిట్సన్ తదితరులు సంతోషాన్ని ప్రకటించారు ఇది తమకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందన్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు -
సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!
శారీరకం మానసికంగా ఉండే వైకల్యం ఎల్లప్పుడూ మన గమనాన్ని ఆపలేవు. అవి బలమైన సంకల్పం ముందు ఓడిపోతాయి. అందుకు ఉదాహరణ అనురాగ్ రావత్. ఒకప్పుడూ అతను ఎలా బతుకుతాడు, అతడి జీవితం ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేసిన వాళ్లే ఆశ్చర్యపోయాలా స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నాడు.సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తున్న రావత్ భారతదేశంలో రెండోసారి ఎత్తైన ప్రదేశంలో పరుగును పూర్తి చేసి, తన ఫిట్నెస్ ప్రయాణంలో మరో అద్భుతమై మైలురాయిని అందుకున్నాడు. అతని ఘనతను ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇలా ఉంది. “సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూనే, 12,500 అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి, భారతదేశంలో ఒక వ్యక్తి దేశానికి ప్రపంచవ్యాప్త కీర్తిని తీసుకురావడం ఇది రెండోసారి” అని యూజర్ పేర్కొన్నాడు పోస్ట్లో. రావత్ మారథాన్లు, ఫిట్నెస్ ఛాలెంజ్లు, సాధారణ వ్యాయామాల్లో పాల్గొంటూ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకునేవాడు. అది కాస్తా కాలక్రమేణా అతని పోస్ట్లకు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లతో కూడిన ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకోవడానికి దారితీసింది. కాగా, రావత్కు రెండేళ్ల వయసులో సెరిబ్రల్పాల్సీ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆయన తన తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని కలలు కంటూ పెరిగాడు కానీ ఎనిమిదో తరగతితోనే చదువు మానేయక తప్పలేదు. చదువు మానేయడం రావత్కు చాలా కష్టంగా అనిపించినా తప్పలేదు. దాంతో అంతా అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అనుకున్నారు. చివరికి తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకుని అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. అంతేగాదు రావత్ వీడియోలు చిత్రీకరించడం, ఎడిట్ చేయడం స్వయంగా నేర్చుకుని, పరుగు, జిమ్ వర్కౌట్లు, ఫిట్నెస్ ఛాలెంజ్లు, తోసహా తన దైనందిన జీవితానికి సంబంధించి ప్రతీ కంటెంట్ను పంచుకునేవాడు. అప్పటి నుంచే అతని జర్నీ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అతన కంటెంట్ తన సామార్థ్యాలపై దృష్టిని సారిస్తోంది. పైగా ఆ వ్యాధి తన సామార్థాలను ఆపలేదు, పరిమితులను విధించలేదు అని చెబుతున్నట్లుగా ముందుగా సాగుతున్నాడు రావత్. నెటిజన్లు కూడా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు మాకు స్ఫూర్తివి. వదిలేయడం అనేది రక్తంలోనే లేదు అనడానికి నువ్వే నిదర్శనం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _अनुराग_रावत_🇮🇳 (@_the_distinctive_) (చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ) -
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీలో ఉద్యోగం. లక్షల్లొ జీతం. సౌకర్యవంతమైన జీవితం. సాధారణంగా చాలా మంది నిపుణులు తమ కెరీర్లో ఒక మైలురాయిగా భావిస్తారు. కానీ లక్నోకు చెందిన 27 ఏళ్ల శారదేందు తివారీ తీసుకున్న నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తోంది. తండ్రిని ప్రేరణగా తీసుకొని మరీ తీసుకున్న తివారి సంచనల నిర్ణయం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.శారదేందు తివారీ అమెజాన్లో క్లౌడ్ ఇంజినీర్గా ఏడాదికి సుమారు రూ.46 లక్షల ప్యాకేజీతో పనిచేసేవారు. అయితే చాలా సౌకర్యవంతమైన కార్పొరేట్ జీతాన్ని వదులుకుని త్వరలో భారత ఆర్మీలో ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో పాసింగ్ అవుట్ పరేడ్ తన ప్రతిభను చాటుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులలో ఒకటైన సీనియర్ అండర్ ఆఫీసర్ (SUO)గా ఎంపికయ్యారు.ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్బస్లోనూ పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ , చిన్ననాటి నుంచి ఉన్న సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకునేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నారట తివారీ. శర్దేందు తివారీ ఆర్మీ యూనిఫామ్ ధరించాలనే నిర్ణయానికి ఆయన కుటుంబ నేపథ్యమే కారణం. తండ్రి రాజ్ కుమార్ తివారీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్లో ఆనరరీ కెప్టెన్గా 36 ఏళ్ల పాటు దేశసేవ చేసి రిటైర్ అయ్యారు. తండ్రి సేవలను చిన్నప్పటి నుంచి చూసిన శారదేందుకు మిలిటరీలో చేరాలనే బలమైన కోరిక ఉండేది.శారదేందు తివారీది ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలోని పిపర్గావ్. అయితే వారి కుటుంబం లక్నోలోని నీల్మథ ప్రాంతంలో స్థిరపడింది. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ (చండీగఢ్) నుంచి ఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎం.టెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత, రూ. 46 లక్షల వార్షిక ప్యాకేజీతో అమెజాన్లో క్లౌడ్ ఇంజనీర్గా చేరారు. కానీ ఆర్మీలో చేరాలన్న కోరిక మాత్రం నిరంతరం మదిలో మెదులుతూనే ఉండది. ఫలితంగా ఆర్మీ సెలెక్షన్ ప్రక్రియ కోసం ఆయన 8 సార్లు ప్రయత్నించారు. ఓటమికి కుంగిపోకుండా పట్టుదలతో శ్రమించి 'టెక్నికల్ రూట్' ద్వారా ఆర్మీకి సేవల చేయాలన్న కలను సాకారం చేసుకున్నారు. ఆర్మీ ఇచ్చే సాహసం, నాయకత్వ లక్షణాలు, దేశసేవ చేసే అవకాశం తనను ఆకర్షించాయనిశారదేందు తెలిపారు.ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుషార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) శిక్షణ పూర్తి చేసిన తర్వాత, 219 మంది పురుషులు,35 మంది మహిళలతో సహా మొత్తం 254 మంది క్యాడెట్లు కమిషన్ పొందనున్నారు. వియత్నాం పీపుల్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ లే వాన్ హోయాంగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
‘గేర్ మార్చే’ ఎక్స్ప్రెస్వే.. వరద నీటిలో ఎందుకు మునిగింది? ఢిల్లీలో కురిసిన భారీ వర్షం ఇప్పుడు ప్రకృతితో పాటు రాజకీయ తుఫాన్నూ రేపింది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్ప్రెస్వే టన్నెల్లోనే వరద నీరు చేరడంతో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన టన్నెల్లో గంటపాటు తాను చిక్కుకుపోయానంటూ కాంగ్రెస్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ వీడియో విడుదల చేయడం.. ఇప్పుడు మోదీ సర్కార్కు కొత్త తలనొప్పిగా మారింది.ఈ సందర్భంగా ‘ప్రజల జీవితాల్లో గేర్ మారుస్తుంది’ అన్న ప్రాజెక్టు.. భారీ వర్షం పడగానే నీటిలోనే ఆగిపోయిందంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అసలు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ టన్నెల్లో నీరు ఎందుకు నిలిచింది? మౌలిక వసతులపై ప్రభుత్వ గొప్పలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత భిన్నంగా ఎందుకున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.मैं जिस टनल में एक घण्टे से फँसा हूँ इसे मोदी सरकार ने प्रति किलोमीटर 250 करोड़ रुपये खर्च करके बनाया है। यह उसी Dwarka Expressway का टनल है जिसके उद्घाटन को प्रधानमंत्री मोदी ने लोगों के जीवन का गियर बदलना बताया था। pic.twitter.com/dl5kjSHSkz— Brijendra Singh (@BrijendraSpeaks) September 4, 2026దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, 2024లో ద్వారకా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన సమయంలో ప్రధాని మోదీ.. ఈ ప్రాజెక్టు ఢిల్లీ-హర్యానా మధ్య ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుందని, వాహనాలే కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లోనూ ‘గేర్ మారుతుందని’ పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులోని టన్నెల్ భారీ వర్షాలకు నీటమునగడంతో కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది.మరోవైపు.. భారీ వర్షం కారణంగా ఢిల్లీ ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. భారీ వర్షాల ప్రభావం ఢిల్లీ విమానాశ్రయంపైనా పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో సామాన్లతో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య కనీసం తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. అటు గురుగ్రామ్లోని సైబర్ సిటీ, శంకర్ చౌక్, శీత్లా మాతా రోడ్ ప్రాంతాల్లోనూ భారీగా నీరు నిలిచింది. ఇక వర్షాలపై భారత వాతావరణ శాఖ ఢిల్లీకి తొలుత ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. పరిస్థితి తీవ్రతరం కావడంతో రెడ్ అలర్ట్కు పెంచింది. ఉరుములు, మెరుపులతో పాటు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవైపు భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. The tunnel is part of the most expensive road ever built in India at INR 250 crs per kilometre (against 20 ) i.e. Dwarka e-way in NCR and opened less than 2 yrs ago.This e-way was actually inaugurated twice in the last two years. Yesterday’s drizzle of a receding monsoon and… pic.twitter.com/jmq2xc6Vf6— Ankur Bisen (@AnkurBisen1) September 5, 2026 -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News -
బొమ్మను చూసి అమ్మే అనుకుని..
ఆవు బొమ్మను చూసిన ఓ లేగదూడ అమాయకంగా దాని దగ్గరకు వెళ్లింది. డెయిరీ వ్యాన్పై ఉన్న ఆవు ఫొటోలోని నిండైన పొదుగు నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అది బొమ్మ అని తెలియక.. ఆకలితో, అమ్మ కోసం వెతుకుతున్నట్టుగా వ్యాన్ను అనుసరించిన దృశ్యం చూపరులను కదిలించింది. నిజం తెలియని ఆ చిన్న ప్రాణి, తల్లి కోసం పడిన తపన ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో సహజసిద్ధంగా కారులో నుంచి వీడియో తీస్తున్నట్లు ఉంది. అయితే ఇది ఏఐ వీడియో.అయినప్పటికీ ఈ వీడియో చూస్తూ చాలామంది నవ్వుతూనే.. భావోద్వేగానికి లోనయ్యారు. బంధం అంటే ఇదేనేమో.. తల్లిని వెతికే మనసు అనేది ఇలానే ఉంటుంది కదా అని భావోద్వేగానికి లోనవుతున్నారు.. దాంతో ఈ వీడియో వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అత్యంత పవిత్రమైన తల్లి- బిడ్డ మధ్య ఉండే బంధం ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లి స్పర్శ అనేది బిడ్డకు ధైర్యాన్ని, రక్షణ ఇచ్చేది కావడం ఒకటైతే, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీడియోను వీక్షకులు అమితంగా ఇష్టపడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. The ancients called it physis, the nature that precedes reason! Before we learn to speak, we learn to seek.A calf saw a cow image and without knowing the illusion from reality, walked towards it seeking milk.It is what Aristotle meant by saying: " Some bonds are not taught by… pic.twitter.com/UZDizeT3Kv— WireClicks (@Wireclicks) September 4, 2026 -
మోకాళ్ల లోతు వరదనీటిలోనే పెళ్లి.. వైరల్ వీడియో
మోకాళ్ల లోతు వరద నీటిలో కూడా ఓ జంట పెళ్లి చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక కాథలిక్ చర్చిలో ఫిలిప్పీన్స్ జంట ఇపుటు నెట్టింట హల్చల్ చేస్తున్నారు. తీవ్రమైన వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నప్పటికీ లీన్ లీజా గలాంగ్, గిల్బర్ట్ చికో అనే జంట పెళ్లి వేడుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వినూత్న వివాహానికి ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి.ఫిలిప్పీన్స్లోని ఇటీవలి భారీ రుతుపవన వర్షాలు చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో ఈ అసాధారణ వివాహం జరిగింది. మనీలాకు ఉత్తరాన ఉన్న బులాకాన్ ప్రావిన్స్లోని హగోనోయ్ పట్టణంలో గల 'సెంట్ జాన్ ది బాప్టిస్ట్ పారిష్' చర్చిలో సెప్టెంబర్ 1న ఈ పెళ్లి జరిగింది.గత నెల రోజులుగా ఈ చర్చి ప్రాంతం నీట మునిగి ఉంది. నీటి మట్టం పెరుగుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకోవాలని చర్చి వర్గాలు సూచించినప్పటికీ, ఆ జంట వెనక్కి తగ్గలేదు. వధువు తన వెడ్డింగ్ గౌన్ తడిసిపోతున్నా మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ అల్తార్ (వేదిక) వద్దకు చేరుకోవడం విశేషం.నిజానికి ఈ జంట డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే మిడిల్ ఈస్ట్లో ఉద్యోగం చేసే వరుడు చికో, బాస్కెట్బాల్ ఆడుతూ కాలుకి గాయం కావడంతో అను అనుకోకుండా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చాడు. మళ్లీ ఉద్యోగానికి వెళ్లేలోపు పెళ్లి ముగించుకోవాలని ఈ సమయాన్ని ఎంచుకున్నారు.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న ప్రేమ పెళ్లి.. వాటర్ ట్యాంక్లో శవంగా నవవధువుపెళ్లి దుస్తులు పాడవకుండా ఉండటానికి ప్రత్యేక రవాణా వాహనంలో చర్చి ప్రాంగణం వరకు వచ్చారు. అతికొద్ది మంది కేవలం 15 మందిలోపు బంధువుల సమక్షంలో ఫాదర్ ఈ వివాహాన్ని త్వరితగతిన పూర్తి చేశారు. నడుము లోతు నీళ్లలోనే ఒక చిన్నారిని ఉంగరాలను తీసుకెళ్లాడు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో LOVE, WATER… AND CHAOS 💍🌊One couple’s romantic wedding shoot ended with the bride and groom falling straight into the river. Another couple in the Philippines went through with their ceremony in a flooded church, wading through waist-deep water to say “I do.”#Wedding… pic.twitter.com/9NP0w4gEPy— Unit News (@Unit_News) September 3, 2026 వేడుక సమయంలో తమ పెళ్లి బట్టలు తడిసినా ఫర్వాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తాము ఆ సందర్భానికి తగినట్లే దుస్తులు ధరించామని చికో తెలిపారు "ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా, పరస్పర ప్రేమ ముందు వరదలు కూడా బలాదూర్" నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. -
వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో
భారతదేశంలో కేక్లు, ఐస్క్రీమ్లు, బేకరీ ఉత్పత్తులలో విరివిగా ఉపయోగించే 'టూటీ ఫ్రూటీ' (Tutti Frutti) తయారీ విధానానికి సంబంధించిన ఒక వీడియో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీని తయారీలో పాటిస్తున్న శుభ్రతా ప్రమాణాలు, కాలుష్య పూరిత వాతావరణం చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.'పాయల్ కుష్వాహా' అనే నెటిజన్ ఎక్స్లో ఈ వీడియోను షేర్ చేశారు. ఎంతో శుభ్రమైన పద్ధతిలో టూటీ ఫ్రూటీని తయారు చేస్తున్న వీడియో ఇది అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది చూశాక చాలా మందికి టూటీ ఫ్రూటీ ఇష్టమైనదిగా మారిపోతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. మురికి నీళ్లలో, ఎలాంటి రక్షణ పద్దతులను పాటించకుండా, ఒంటిపై ఒక నిక్కరు మాత్రమే వేసుకుని కార్మికులు పనిచేయడం, ఇతర ప్రక్రియకు సంబంధించి, ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.కేక్లు, డెజర్ట్లలో టూటీ ఫ్రూటీని చూడగానే తమ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తయారీ వాతావరణం, అపరిశుభ్రతను చూసి తీవ్ర అసహ్యానికి గురయ్యారు. ఇకపై తినడానికి ఇది భయపడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.Guys, Aap sabhi ke liye bahut hi hygienic tarike se tuti furti banai ja rahi hai, video dekhne ke baad kafi logo ka fruti favourite ban jayega pic.twitter.com/rvCsvE8GiW— Payal Kushwaha (@payalpixel) September 3, 2026 కాటన్ క్యాండీ, ఐస్ గోలా, స్ట్రీట్ ఫుడ్స్ తయారీ వీడియోలు గతంలో చాలానే వైరల్ అయ్యాయి. తాజా వీడియో కూడా ఆహార భద్రతా ప్రమాణాలు (Food safety standards), అసంఘటిత చిన్న తరహా పరిశ్రమలలో పరిశుభ్రత లోపాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు ఈ వైరల్ వీడియో ప్రామాణికత, ఎక్కడిది లాంటి వివరాలపై స్పష్టతలేనప్పటికీ, లేదా అందులో చూపించిన ఫ్యాక్టరీ వాతావరణంపై ఇప్పటివరకు ఏ ప్రముఖ టూటీ ఫ్రూటీ తయారీ సంస్థ గానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు గానీ అధికారికంగా స్పందించలేదు. -
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership. La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026అలా ప్రధానిగా..1977లో రోమ్లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026మెలోనీ కంటే ముందు..ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.‘మెలోడీ’గా ఫేమస్..మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ మోదీ రికార్డేఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.మరింత బలపడనున్న బంధంఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా? -
‘హబీబీ.. దా!’.. అమెరికాను ఆటాడుకున్న ఇరాన్
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఓసారి ‘హర్ముజ్ సీమైన్లను తొలగించి.. పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాం’ అంటారు. మరోసారి హర్ముజ్లో ఇరాన్ మళ్లీ సీమైన్లు పెడుతోందని.. తమ సైన్యం అడ్డుకుంటోందని అంటారు. ఇంకోసారి ఇరాన్లో అమెరికా నిఘా ఎంత పక్కాగా ఉందో చెబుతూ.. ‘వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ ఇంతలా మాట్లాడుతుంటే.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా?.. ‘హబీబీ.. ఇరాన్కు రా!’ అంటూ అమెరికాను ఓ ఆటాడుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ విషయంలో చేస్తున్న హెచ్చరికలకు నేరుగా స్పందించకుండా.. ఒక వీడియో గేమ్ రూపంలో వ్యంగ్యాస్త్రం సంధించింది ఇరాన్. ఆ దేశ ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఖాతా ఈ వ్యంగ్య వీడియోను పోస్టు చేసింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న యానిమేషన్లో హర్ముజ్ జలసంధి 3డీ మ్యాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత అది ‘మైన్స్వీపర్’ గేమ్లా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడున్నాయో గుర్తిస్తూ ఆడే ఈ గేమ్ను.. హర్ముజ్లోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్ ఈ వీడియో రూపొందించింది. దానితోపాటు ‘హబీబీ (అంకుల్ సామ్).. ఇరాన్కు రా!’ అంటూ సందేశం ఇచ్చింది. అంటే మైన్స్వీపర్లో బాంబుల కోసం వెతికినట్టే.. అమెరికా కూడా హర్ముజ్లో సీమైన్ల కోసం వెతుకుతోందన్న భావన వచ్చేలా హేళన చేస్తూ వీడియోను రూపొందించిందన్నమాట.అసలు మైన్ల గొడవేంటి?పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి.. హార్ముజ్ జలసంధిలో సీమైన్లు ఏర్పాటు చేసి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల తర్వాత సీక్రెట్ ఆపరేషన్తో వాటిని సమర్థవంతంగా తొలగించామని.. ఇది అమెరికా సైన్యం సాధించిన అజేయ విజయమని ట్రంప్ ప్రకటించారు. అయితే రెండ్రోజులకే నాలిక మడతేసి.. ఇరాన్ మళ్లీ కొత్తగా సీమైన్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ అంతర్జాతీయ నౌకా మార్గాల్లో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.Habibi (Uncle Sam), come to Iran! pic.twitter.com/Ay6FdpwF8E— Iran Embassy in Sierra Leone (@IRANinSalone) September 3, 2026ఈ క్రమంలో.. హార్ముజ్ జలసంధిలోని ఇరాన్కు చెందిన లారక్ దీవిపై అమెరికా రెండు రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది. ఆ లాంచర్లతో సీమైన్లను హార్ముజ్లోకి పంపేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో దాదాపు నెల రోజుల తర్వాత పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ క్రమంలో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ముందు నుంచే కొట్టిపారేస్తోంది. హర్ముజ్ సీమైన్ల విషయంలో అమెరికా తొలి నుంచి చెబుతోందంతా అబద్ధమేనని.. మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నమేనని అంటోంది. అంతేకాదు.. హర్ముజ్పై పూర్తి నియంత్రణ తమదేనంటూ ఉద్ఘాటించింది. దీంతో అమెరికా-ఇరాన్ల మధ్య‘ఎవరి నిఘా ఎంత?’.. ‘హార్ముజ్పై ఎవరి పట్టు?’ అనే రీతిలో పోరు కొనసాగుతోంది.ట్రంప్ మాటలకు మాటలతోనే కాదు..తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇరాన్పై సైనిక దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ప్రాంతీయ మిత్రదేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతోంది. దీంతో హర్ముజ్ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆంక్షలను కఠినతరం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే హర్ముజ్ విషయంలో అమెరికా సైనిక బలం, ఇరాన్ వ్యూహాత్మక ప్రతిస్పందన.. రెండూ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: శని గ్రహంపై సరికొత్త మిస్టరీ! -
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
పనే దైవం అంటారు మన పెద్దలు. పాల్ కురియన్ కూడా తాను చేసే పనిని దైవ సమానంగా భావించాడు. తాను పనిలో చేరినప్పటి నుంచి అంకితభావంతో చాలా శ్రద్ధగా పనిచేశాడు. 18 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన చివరి వరకు అంతే అంకితభావంతో సేవలు అందించాడు. పాల్ కురియన్ ఇటీవల పదవీ విరమణ చేశాడు. రిటైర్మెంట్ చివరి రోజున ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయన పేరు వార్తల్లోకి ఎక్కింది.ఎవరీ పాల్ కురియన్?కేరళంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేశారు పాల్ కురియన్. ఇడుక్కిలోని కుమిలీ, కట్టప్పనా డిపోల్లో ఆయన సేవలు అందించారు. ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగిందని, బస్సు స్టీరింగ్ పట్టుకున్నప్పటి నుంచి ఒక్క ప్రమాదం కూడా జరగలేదని కేఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 2న చివరిసారిగా బస్సు నడిపారు. బస్సును వదిలివెళుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బస్సును పార్క్ చేసి స్టీరింగ్ను అప్యాయంగా ముద్దాడారు. తనకు ఎంతోకాలం ఉపాధి కల్పించిన బస్సుకు శిరసు వంచి నమస్కరించారు. నాలుగు టైర్లను ప్రేమగా తాకి దండాలు పెట్టారు.చాన్స్ ఇస్తే మళ్లీ వస్తాఈ సందర్భంగా పాల్ కురియన్ మాట్లాడుతూ.. ఆగస్టు 31నే అధికారికంగా రిటైర్ అయ్యాను. సెస్టెంబర్ 2న ఫిజికల్ చివరిసారిగా డ్యూటీ చేశాను. గత ఎనిమిదేళ్లుగా తమిళనాడులోని కంబం, కొట్టాయం మధ్య బస్సు ఇంటర్ స్టేట్ సర్వీసు నడిపాను. నేను నడిపిన బస్సుతో చాలా ఏళ్లుగా అనుబంధం ఏర్పడింది. ఇంతకాలం నన్ను, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన బస్సుకు నా రిటైర్మెంట్ రోజున నమస్కారాలు తెలిపానని చెప్పాడు. పనిని ప్రేమిస్తే భారంగా అనిపించదని అన్నారు. కాగా, తనకు మళ్లీ డ్రైవర్గా అవకాశం కల్పిస్తే స్టీరింగ్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పాల్ కురియన్ చెప్పారు.ఇదీ చదవండి: హైవేపై 'ఫ్యామిలీ' భోజనం!నెటిజన్ల ప్రశంసలుపాల్ కురియన్.. బస్సుకు సమస్కరిస్తున్న వీడియోను కేఎస్ఆర్టీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసినవారంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిబద్ధతతో పనిచేసే వారికి మన్ననలు దక్కుతాయనడానికి పాల్ కురియన్ మంచి ఉదాహరణ అంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. A KSRTC driver in Kerala bid an emotional farewell to his bus after completing his final trip before retirement. Paul Kurian of the Kumily depot kissed the steering wheel and saluted the bus after his last duty on 2 September, a moment that has touched many online.#kerala… pic.twitter.com/xsxNghIBBi— Salar News (@EnglishSalar) September 3, 2026 -
ది వారియర్: 97 ఏళ్ల వయసులో ప్రాణం మీద ఆశే బతికించింది!
nepal flash flood నేపాల్లో ఆగస్టు 26వ తేదీ సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ కొన్ని వందల మందిని రక్షించినప్పటికీ భయంకరమైన వరదల్లో ఇప్పటివరకు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా బురదలో చిక్కుకున్న 97 ఏళ్ల వృద్ధురాలి గుణా మాయా బొహారా (Guna Maya Bohara) బయ JCB ఎక్స్కవేటర్ బకెట్లో సురక్షితంగా బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి.అత్యంత తెగువతో ఈ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడి ధైర్యానికి గొప్ప సంకేతంగా నిలిచారు.నువాకోట్లోని దేవీఘాట్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆశ్రమంలోని ఏడుగురు వృద్ధులు మరణించగా, ప్రాణాలతో బయటపడిన బొహారా సహా మిగిలిన వృద్ధులను ఖాట్మండులోని తాత్కాలిక పునరావాస కేంద్రానికి విమానంలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెకు తీవ్రమైన ఒత్తిడి రుగ్మత (acute stress disorder) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ‘‘ఆ నీళ్ళు నన్నేఎందుకు ముంచెత్తాయి?" అనే ప్రశ్నను బొహారా అమాయకంగా, తీవ్రమైన ఆవేదనతో పదే పదే అడుగుతూనే ఉన్నారని ఆమె సమీప బంధువు దీపక్ చెప్పారు.ఇదీ చదవండి: స్త్రీవాద దిగ్గజం, రచయిత్రి కన్నుమూతనాలుగు గంటలపాటు.. తల ఎత్తివరద వచ్చిన సమయంలో బొహారా తన గదిలోనే ఉన్నారు. ఆమెకు ముందు నుంచే కాళ్లు పనిచేయవు. దీనికి తోడు ఉధృతమైన నీటి ప్రవాహం వల్ల ఆమె చేతికి గాయమైంది, కానీ బ్రతకాలన్న సంకల్పమే ఆమెను ముందుకు నడిపించింది. ధైర్యపడకుండా గది కిటికీ తెరిచి, నీటిమట్టానికంటే ఎత్తుగా తన తలను ఉంచుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక వాలంటీర్లు 4 గంటల తర్వాత వచ్చి ఆమెను బురద నుంచి రక్షించారు. మరోవైపు రాబోయే ప్రళయం గురించి తమను ఎవరూ సకాలంలో హెచ్చరించలేదని మరో వృద్ధుడు వాపోయారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలుబోహరాకు బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉన్న రోజుల్లో ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. వయసు తన భర్త కంటే 81 సంవత్సరాలు ఎక్కువ జీవించారు. ఆమెకు పిల్లలు లేరు.పెళ్ళైన ఎనిమిదేళ్ళకు తన భర్తను, ఆ తర్వాత నాలుగేళ్ళకు తన తల్లిదండ్రులిద్దరినీ; మరికొంత కాలానికి తన ఏకైక సోదరుడిని ఇలా ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి, తన రక్త సంబంధీకులలో దాదాపు అందరినీ ఆమె కోల్పోయింది. ఆమె భర్త కుటుంబం, అతని ముగ్గురు సోదరులు, వారి భార్యలు, కాలక్రమేణా వారి పిల్లలు మాత్రమే మిగిలారు. ఆమె పదమూడు మంది మేనల్లుళ్ళను, పన్నెండు మంది మేనకోడళ్ళను సొంత పిల్లల్లా పెంచింది. ఆ కుటుంబంలో ఆ తరంలో మిగిలి ఉన్న చివరి వ్యక్తి బోహారా. ఇదీ చదవండి: రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్కాగా నేపాల్ వరదల్లో ఇప్పటివరకు 1,252 మంది మరణించగా, 4,216 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ, సహాయక బృందాలు జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. -
నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
‘దురద ఒకడికి అయితే, గోకుడు ఇంకొకడికా?’ అనేది ఒక వ్యంగ్య సామెత. అంటే ఎవరి సమస్యను వారి తీర్చుకోవాలి అని అర్థం. కానీ చిన్నపుడు దురద పుట్టే మన వీపును అమ్మమ్మనో, తాతయ్యనో మృదువుగా అలా గోకుతుంటూ ఆహా..అనిపించిన అనుభవం గుర్తుందా? ఈ ఫీలింగ్ ఆధారంగా చేసుకునే గంటకు రూ. 4,200 వసూలు చేస్తున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది థాయ్ మసాజ్లు, ఆయిల్ మసాజ్ల గురించి విన్నాం గానీ, ఈ 'ఇచ్-స్క్రాచింగ్' బిజినెస్ ఏంటీ అనుకుంటున్నారా.. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.షెన్జెన్కు చెందిన 32 ఏళ్ల జాంగు షియావోకియావో అనే చైనీస్ వ్యాపారవేత్త శరీర దురదను గోకే (itch-scratching) వినూత్న సేవలను ఒక వ్యాపారంగా మార్చి, రెండు అవుట్లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షలు (1,00,000 యువాన్లు) ఆర్జిస్తున్నాడు. సుమా (Suma) అనే బ్రాండ్ నేమ్తో షెన్జెన్లోని బావోవాన్, ఫుటియాన్ జిల్లాల్లో రెండు స్టోర్లు నడుస్తున్నాయి. అంతేకాదు తన ఈ వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 అవుట్లెట్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు.ఇదీ చదవండి: నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగావినియోగదారులు హాయిగా విశ్రాంతి పొంది, బాగా నిద్రపోవడానికి సహాయపడే ఈ సేవ కోసం గంటకు సుమారు 300 యువాన్లు చెల్లిస్తారు. తన కస్టమర్లలో 70 శాతం మంది పురుషులేనని ఝాంగ్ చెబుతున్నారు. 30 శాతం మహిళా వినియోగ దారులుంటారని చెప్పాడు. మసాజ్ కంటే కూడా ఇది ఎక్కువ విశ్రాంతినిస్తుందని కొంతమంది కస్టమర్లు చెప్పానీ ఫలితంగా దీనివల్ల తమకు రిపీటెడ్ క్లయింట్లు ఎక్కవని కూడా చెప్పుకొచ్చాడు. ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు ఎలా ఉంటుందీ సర్వీస్వినియోగదారులు మసాజ్ సెంటర్లలో లాగా బెడ్పై పడుకుంటారు. ప్రత్యేకంగా రూపొందించిన పదునైన గోళ్లతో అక్కడున్న సిబ్బంది శరీర భాగాలను సున్నితంగా గోకుతారు. ఇది కస్టమర్ల మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి సహాయ పడుతుందని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక మహిళ తన భర్త వెన్ను గోకుతున్న వీడియో , చిన్నతనంలో తన తండ్రి తనకు గోకిన అనుభూతిని గుర్తుచేసుకుని ఝాంగ్ ఈ వ్యాపార ఆలోచనను ప్రారంభించారు. -
డోర్బెల్ కెమెరాలో భయానక దృశ్యాలు.. షాక్ అవ్వాల్సిందే!
ఇంటికి అడుగుల దూరంలోనే.. ఒక్కసారిగా పిడుగు పడి ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ భయానక క్షణాలు ఇంటి డోర్బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్లో జరిగిన ఈ ఘటనలో థామస్ ఫహ్మీ ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన శరీరమంతా ఒక్కసారిగా తీవ్రమైన విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించిందని.. మొద్దుబారడం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు.స్టాటెన్ ఐలాండ్లో నివసించే థామస్ ఫహ్మీ గత గురువారం దంత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు తన ఇంటి నుంచి కారువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. విండ్సర్ రోడ్ సమీపంలో తన కారుకు సుమారు 15 నుంచి 25 అడుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఆయన పాదానికి పిడుగు తాకింది. డోర్బెల్ కెమెరాలో నమోదైన వీడియోలో పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ నేలపై పడిపోవడం కనిపించింది. అయితే ఆయన స్పృహ కోల్పోలేదు. తన శరీరమంతా తీవ్రమైన షాక్కు గురైనట్లు, ముఖ్యంగా రెండు పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట మొద్దుబారినట్లు ఫహ్మీ చెప్పారు.Doorbell camera captures dramatic moments when a New York man is struck by lightning pic.twitter.com/QJ4lTyiSkQ— Interesting things (@awkwardgoogle) September 2, 2026పిడుగు ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఫహ్మీ తిరిగి లేచి.. సహాయం కోసం సమీపంలోని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లారు. నాకు సాయం చేయండనే అరుపు వినిపించింది. వెంటనే నా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన నేలపై పడి ఉన్నారని పొరుగింటి మహిళ స్టెఫానీ హోమన్ తెలిపారు. అనంతరం ఫహ్మీని నార్త్వెల్ స్టాటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరుసటి రోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఆయనకు ఎలాంటి కాలిన గాయాలు లేవని వైద్యులు గుర్తించారు. -
400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లోని బల్లియాకు చెందిన ఏడేళ్ల బాలిక నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా చిన్నారులు సరదాగా గెంతుతూ ఎగురుతూ బడికి వెళ్లడం మనం చూసి ఉంటాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ బాలికకు బాధతో కుంటుకుంటూ వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే పాఠశాలకు సులభంగా వెళ్లడానికి వీలుగా ఒక ట్రైసైకిల్ కావాలని జిల్లా మేజిస్ట్రేట్కు పెట్టుకున్న విజ్ఞప్తి చేసి ఆన్లైన్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 6 నెలల వయస్సులోనే జరిగిన ఒక ప్రమాదంలో ఏడేళ్ల రాగిణి తన ఎడమ కాలును కోల్పోయింది. అయినప్పటికీ, చదువుకోవాలనే పట్టుదలతో ప్రతిరోజూ ఒంటికాలితో దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెంతుతూ వెళ్తోంది. బల్లియాలోని మనియార్ విద్యా బ్లాక్లో ఉన్న దిఘేడా ప్రాథమిక పాఠశాలలో రాగిణి మొదటి తరగతి చదువుతోంది.ట్విటర్లో Benarasiyaa అనే యూజర్ ఆమె పరిస్థితిని వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. చదువును కొనసాగించడానికి ఆమెకు కావలసింది కేవలం ఒక ట్రైసైకిల్ మాత్రమే అంటూ జిల్లా కలెక్టర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నిరుపేద చిన్నారికి ప్రాథమిక సదుపాయం అందించేందుకు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్లు కూడా పాఠశాల అధికారులు లేదా స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. ఆ బాలికకు భారీ మద్దతు లభిస్తోంది. “DM Uncle, please get me a bicycle…” 🚲🥹Despite being differently-abled, Class 1 student Ragini’s passion for education is unstoppable. Her small request carries a big dream. 📚❤️#Ballia #Ragini #Education pic.twitter.com/RiozXvVuO9— Sunanda Acharya (@Sunanda_Iam) September 1, 2026నెటిజన్ల స్పందనలుఆమెకు చికిత్స అవసరం. ట్రైసైకిల్ ఆమెకు శాశ్వత పరిష్కారం కాదు. ఆమె వయసు కేవలం 7 ఏళ్లు మాత్రమే, ఇంకా ఆమె శారీరక ఎదుగుదల మిగిలే ఉందని ఒకరు 5-8 వేల రూపాయలకే ట్రైసైకిల్ వస్తుంది కదా, క్రౌడ్ ఫండింగ్ (ప్రజల నుంచి విరాళాలు) చేసి ఉండవచ్చు లేదా కనీసం DMకి సమాచారం ఇచ్చి ఉండాల్సింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు సెలవు పెట్టి చూపించి ఉండాల్సింది కదా మరొకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు బాధ అనిపిపిస్తుంది. వెనుకబడిన పౌరుల కోసం దేశం ఎంతైనా చేయాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆమెకు తక్షణమే సహాయం చేస్తుందని ఆశిస్తున్నా అన్నారు. మరొకరు వ్యక్తి కృత్రిమ కాలు (prosthetic limb) అమర్చడంలో సహాయం చేస్తానని ముందుకొచ్చారు. ఈ ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి కూడా ఆ వీడియోపై స్పందించి ఆమెకు ట్రైసైకిల్ సమకూర్చినట్టు తెలిసిందన్నారు.స్పందించిన యంత్రాంగంచివరికి, బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆ చిన్నారికి ట్రైసైకిల్ను అందించడం విశేషం. దీంతో ఇకపై ఆ చిన్నారి బడికి వెళ్లేటప్పుడు కుంటుతూ నడవాల్సిన అవసరం ఉండదు. అయితే, ఇది శాశ్వత పరిష్కారం కాదు. ప్రమాదంలో దెబ్బతిన్న ఆ చిన్నారి కాలు సరిగ్గా నయమవ్వాలంటే, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం ఇప్పుడు చాలా అవసరమని వీడియో షేర్ చేసినవ్యక్తి ఆనందం వెలిబుచ్చారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 20 మందికి పైగా ట్రైసైకిల్ ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ మొదట జిల్లా యంత్రాంగం నుండి సహాయం కోసం వేచి చూసినట్టు చెప్పారు.बुलंद हौसले वाली बलिया की बेटी रागिनी अब ट्राईसाइकिल से स्कूल जाएगी .उसके सपनों की उड़ान अब नहीं थमेगी🥰बलिया DM मंगला प्रसाद ने रागिनी को ट्राइसाइकिल के साथ किताब और चाकलेट भी दिया... https://t.co/9YXKTWr4P0 pic.twitter.com/0XSXCsgRbl— Ruby Arun रूबी अरुण (@arunruby08) September 2, 2026ఆప్ సాయంమరోవైపు ఈ విషయంలో సోషల్మీడియాలో వైరల్ కావడంతో రాగిణికి సహాయం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు ముందుకు వచ్చారు. AAP ప్రతినిధి సర్వేష్ మిశ్రా , బల్లియా జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ యాదవ్ రాగిణి కుటుంబాన్ని సంప్రదించారు. AAP నాయకుడు సంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, పార్టీ కార్యకర్తలు స్థానిక సభ్యులతో కలిసి ఆ చిన్నారిని కలిసి ఆమెకు వీల్చైర్ను అందించారు. అలాగే ఆ కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక సహాయం కూడా అందజేశారు. -
అమ్మా, నాన్న క్షేమమే కదా..! నీట్ పీజీ విద్యార్థి భావోద్వేగం
నేపాల్లో సంభవించిన జలప్రళయం వేలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందులో గల్లంతైన వారి ఆచూకి కోసం కొండంత ఆశతో చూస్తూన్న ఘోష మాటలకందనిది. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్ క్రియేటర్ నీట్ పీజీ వైద్య విద్యార్థి తన్వి షేర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె పేరెంట్స్ కూడా నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ కానరాలేదు. అయినా సరే తన అమ్మనాన్న ఎక్కడోఒక చోట క్షేమంగా ఉంటారని కొండంత ఆశతో చూస్తున్నా అటూ కన్నీటి పర్యంతమైందామె వీడియోలో. తన్వి తల్లిదండ్రలు 67 మంది సభ్యుల బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ బృందం చివగా ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఫ్రెండ్షిప్బ్రిడ్జ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండు ప్రదేశాలు ఇప్పడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడున్న ఏదో ఒక పునరాసవ కేంద్రానికి చేరుకుని సురక్షితంగా ఉంటారేమోనని ఆశిస్తోందామె. ఆ బృందంలోని ఎవ్వర్నీ సంప్రదించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రలు ఆచూకీ మరింత క్లిష్టంగా మారింది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోలో వివరిస్తూ..కన్నీళ్లు పెట్టుకుంది. తాను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాక, నేపాల్, చైనా అధికారులను సైతం సంప్రదించామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. తాను నీట్ పీజీ పరీక్ష రాస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నానని, కన్నీళ్లు వచ్చేయడంతో కొన్ని ప్రశ్నలు చదవలేకపోయానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. తన తండ్రి ఈ పరీక్ష రాయాలని కోరుకున్నారు, అందువల్ల కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాల్సి వచ్చింది. అంతకంటే బాధకరం ఏంటంటే..పరీక్షకు వెళ్లేమందు అమ్మ పెరుగు చక్కెర కలిపి తినిపించి ఆల్ది బెస్ట్ చెప్పి దీవించేవారు. అది మరింత గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఆవేదనగా చెప్పింది. ఎలాగైన వాళ్లు తిరిగి రావాలి, కచ్చితంగా తిరిగి రావాలంటే ఉబికివస్తున్న కన్నీళ్లతో చెబుతూ తన సంభాషణను ముగించింది. కాగా, నేపాల్ విపత్తులో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 939కి చేరగా, గల్లంతైన వారి సంఖ్య నాలుగువేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. సుమారు 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. View this post on Instagram A post shared by Tanvi (@tanvimakesvideos) (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..) -
సీఎం విజయ్ వృద్ధురాలికి గిఫ్ట్గా సన్గ్లాసెస్.. ధర ఎంతో తెలుసా..!
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్గ్లాసెస్ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!.ఆ సన్గ్లాస్ ప్రత్యేకత ఇది..ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని పారిస్లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్హౌస్ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె.#WATCH | Salem | Tamil Nadu CM Joseph Vijay visits the house of a farmer and gifts his glasses to an elderly woman in Mettur(Source: TN CMO) https://t.co/VQy07Jy7kt pic.twitter.com/NhZN3FfXmF— ANI (@ANI) September 1, 2026(చదవండి: క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) -
ఇంటర్నెట్ కట్.. పాక్ నుంచి మరో మీమ్ వైరల్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ.పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది.ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు.కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్ను ఢీకొట్టింది.కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్!ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు.A Pakistani innovator was demonstrating a driverless car he developed when it lost control and crashed directly into a police vehicle in Islamabad.The car is remotely controlled over the internet through an app or computer.Source: ProPakistani, Khabrain News pic.twitter.com/bUVuesS4cH— Planet Report HQ (@PlanetReportHQ) August 31, 2026ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక టెక్నాలజీని రూపొందించిన యువకుడిని విమర్శించడం తన ఉద్దేశం కాదని ఆలిజా స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, ప్రయోగాలు చేయడం అవసరమేనని.. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకురాకముందు పూర్తిస్థాయిలో పరీక్షించి భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్లపై ఆధారపడే రిమోట్ డ్రైవింగ్ వ్యవస్థల్లో కనెక్షన్ తెగిపోయినప్పుడు వాహనాన్ని సురక్షితంగా నిలిపే ప్రత్యామ్నాయ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.పాక్ నుంచి మరో మీమ్!ఈ తరహా ఘటనలను నెట్టింట ఎలా ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. గతంలో పాక్ నుంచి ఎన్నో ఇలాంటివి మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పాక్ టెక్నాలజీ నాసిరకంగా ఉంటుందని ఎద్దేవా చేస్తుండగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకుని మీమ్స్ చేస్తున్నారు. “పోలీసులను చూడగానే పాకిస్థాన్లో ఏఐ కూడా కంగారుపడుతుంది” అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య వైరల్గా మారింది. మొత్తంగా.. ఇంటర్నెట్ కనెక్షన్ పోవడంతో పోలీస్ వ్యాన్ను ఢీకొట్టిన ఈ రిమోట్ కారు వీడియో పాకిస్థాన్లో నవ్వులు పూయిస్తోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలకు ఆమె కన్నీరే కారణమా? -
మంగాయమ్మ కథ మళ్లీ తెరపైకి.. అసలు కారణమిదే!
లేటు వయసులో కవలలకు జన్మనిచ్చి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగాయమ్మ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత విషయమే కదా.. ఇప్పుడెందుకు తెర మీదకు వచ్చింది? అని చాలామంది అనుకుంటున్నారు. ఏడేళ్ల తర్వాత ఆమె కథ గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం లేకపోలేదు. ఆ కవల పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? తల్లి వయసు పెరుగుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చే ఇందుకు కారణంగా మారింది.2019లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మంగాయమ్మ, ఆమె భర్త రాజారావు ఐవీఎఫ్ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. దాదాపు ఆరు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత వారికి సంతానం కలగడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డోనర్ అండాన్ని ఉపయోగించి, రాజారావు స్పెర్మ్తో ఐవీఎఫ్ చికిత్స నిర్వహించారు. అనంతరం సిజేరియన్ ద్వారా మంగాయమ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వారికి రమా తులసి, ఉమా తులసి అని పేర్లు పెట్టారు. అలా వాళ్ల కథ దేశవ్యాప్తంగా ఆ టైంలో వైరల్ అయ్యింది.57 ఏళ్ల నిరీక్షణ తర్వాత..మంగాయమ్మకు 1962లో రాజారావుతో వివాహమైంది. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. 2019లో వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోగా.. తొలి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. మెనోపాజ్ దశ దాటిపోవడంతో.. డోనర్ అండాన్ని రాజారావు వీర్యంతో ఫలదీకరించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భధారణ చేశారు.ఆ వయసులో తల్లి కావడం సంచలనం..విదేశాల్లో ఇలాంటివి సహజమే కావొచ్చేమో!. కానీ, మన మంగాయమ్మ 74 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనివ్వడం దేశంలో పెద్ద చర్చకే దారితీసింది. వయసు కారణంగా సహజంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగి చివరకు కవలలు జన్మించారు. దీంతో వృద్ధాప్యంలో మాతృత్వంపై వైద్య, సామాజిక, నైతిక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఏడాదికే భర్త మృతిఅయితే మంగాయమ్మ కుటుంబంలో ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కవలలు జన్మించిన మరుసటి ఏడాదే ఆమె భర్త రాజారావు గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 84 ఏళ్లు. దీంతో ఇద్దరు చిన్నారుల బాధ్యత పూర్తిగా మంగాయమ్మపై పడింది. భర్తను కోల్పోయిన తర్వాత కూడా ఆమె తన పిల్లలను చూసుకుంటూ వారి పెంపకాన్ని కొనసాగించారు.74-year-old Andhra woman had twins through IVF😮 pic.twitter.com/WBXKsnc5Wv— Vije (@vijeshetty) August 31, 2026ఇప్పుడు ఏడేళ్ల వయసు..2019లో జన్మించిన రమా తులసి, ఉమా తులసి ప్రస్తుతం ఏడేళ్ల వయసులో ఉన్నారు. మంగాయమ్మ వయసు మాత్రం ఇప్పుడు 80 ఏళ్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో తల్లి వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తు, సంరక్షణ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే ప్రశ్నతో.. ఇదే అంశం పాత కథనాలను, అప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యేలా చేసింది.అప్పట్లోనూ విమర్శలు..వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనడంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు ఎన్నో ఏళ్ల కలను దంపతులు నెరవేర్చుకున్నారంటూ పలువురు అభినందించగా.. మరోవైపు తల్లిదండ్రుల అధిక వయసు కారణంగా పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, సంరక్షణ వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి.ఇప్పుడు వయసుపై చర్చ ఎందుకు?భారత్లో సహాయక పునరుత్పత్తి సాంకేతికతకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ చర్చకు మరో కోణాన్ని తీసుకొచ్చాయి. 2021లో వచ్చిన చట్టం ప్రకారం ఐవీఎఫ్ సేవలకు మహిళల వయసుపై పరిమితులు విధించారు. దీంతో మంగాయమ్మ అంత వయసులో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన ఘటన అప్పటి నిబంధనల నేపథ్యంలోనూ ప్రత్యేకంగా నిలిచింది.మొత్తంగా.. ఆలస్యంగానైనా తల్లైన మంగాయమ్మ కథ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నది కేవలం ఆమె రికార్డు కోసం కాదు. ఏడేళ్ల వయసుకు చేరుకున్న ఆమె కవలల భవిష్యత్తు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులుగా మారడంపై అప్పట్లో మొదలైన చర్చ మళ్లీ తెరపైకి రావడమే తాజా వైరల్కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఆ కుటుంబాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు! -
Viral Video: హైవేపై ‘ఫ్యామిలీ’ భోజనం
జాతీయ రహదారి మధ్యలో కూర్చుని ఒక కుటుంబం భోజనం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, హైవేను పిక్నిక్ స్పాట్గా మార్చారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఈ పోస్ట్ చేసిన ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని సంప్రదించిన మీడియా.. అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది.శివ ప్రకాష్ మాట్లాడుతూ, ఆగస్టు 12న 'హరియావలి అమావాస్య' సందర్భంగా ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలిపారు. తాను తన కుటుంబంతో కలిసి మేనాల్ జలపాతాలకు వెళ్లామని.. చిత్తూరుగఢ్లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా హైవే పక్కన ఉన్న ఒక 'లే-బై' (లే-బై అంటే వాహనాలు ఆపే స్థలం) వద్ద దాదాపు 15 నిమిషాల పాటు ఆగామని చెప్పారు.ఆ రోజు కుండపోత వర్షం కురుస్తోంది. ఆ కుటుంబంలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. సమయం సాయంత్రం 4:30 దాటింది, అందరికీ తీవ్రమైన ఆకలి వేసింది. భోజనం చేయడానికి ఏదైనా హోటల్ లేదా సురక్షితమైన ప్రదేశం ఉందా అని స్థానిక గ్రామస్తులను అడగ్గా.. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే హైవే పక్కనే ఉన్న ఒక 'లే-బై' గురించి వారు చెప్పారు.An Indian family proudly having lunch on a newly inaugurated expressway,as if trespassing onto public infrastructure and turning it into a picnic spot is some achievement. What’s even more disturbing is the sense of pride they seem to take in such blatant disregard for basic… pic.twitter.com/8NQY5WZW0H— Ritik (@ThenNowForeve) August 29, 2026ఆకలితో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధుల కోసం గ్రామస్తుల సూచన మేరకు కేవలం 15 నిమిషాలు మాత్రమే అక్కడ ఆగి భోజనం చేశామని, వెంటనే తమ ప్రయాణం కొనసాగించామని శివ తెలిపారు. తాను ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, కొందరు దీనిని వక్రీకరించి హైవే మధ్యలోనే కుటుంబం కూర్చున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్నప్పుడు ఆకలి వేయడంతో ఇలా జరిగిందని.. ఎవరి ప్రాణాలకూ ప్రమాదం తలపెట్టాలనే ఉద్దేశం తమకు లేదని శివ స్పష్టం చేశారు. -
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం ఆ పసివాడు..
నేపాల్ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగల్చడమే కాదు ఎందరో చిన్నారులను అభాగ్యులగా మార్చేసింది. ఆ విషాదం గడిచి నాలుగురోజులైన దాని తాలుకు బాధకర దృశ్యాలు ఇంకా వెన్నాడుతూనే ఉండటం బాధకరం. అందుకు సంబంధించిన ఓ హృదయ విదారక వీడియో అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. నేపాల్ భారీ వరదల తాలుకా ఓ వీడియో అందరీ హృదయాలను కదిలిస్తోంది. ప్రస్తుతం అక్కడంతా తమ వాళ్ల ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్న ఘోషే కనిపిస్తుంది. ఎటు చూసినా శవాల దిబ్బ, బురదతో కలిసి శోక సంద్రాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు పసివాళ్లు కనిపిస్తున్న తీరు చూస్తే గుండెతరక్కుపోతుంది. వరద ప్రభావిత ప్రాంతాల గుండా ఆ బాలుడు తన చెల్లిని వీపుపై మోస్తూ నీరసంగా నడుస్తూ కనిపిస్తాడు. అతడు ఆమెను ఓదార్చేలా దగ్గరకు పట్టుకున్నట్లుగా ఆ పరిసర ప్రాంతాల్లో కలయతిరగడం చూస్తే..ప్రకృతి విపత్తు మిగిల్చే విషాదం ఇంత భయానకంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేపాల్ వరదలతో అతలాకుతలమైన తరుణంలో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకృతి విపత్తు ఇద్దరు చిన్నారులకు ఎలాంటి కష్టాలను మిగిల్చిందనే దానిపై అందరి దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి నిజంగానే పేరెంట్స్ ఆచూకీ కోసమే తిరుగుతున్నాడా లేక ఇంకేదైనా కారణమా అన్నది నిర్థారణ కావాల్సి ఉంది. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే సాయం చేయడం మానేసి వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు..తోబుట్టువుల అనుబంధాన్ని చాటిచెప్పడమే కాదు ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయి. వారి కళ్లను చూస్తుంటేనే బాధంతా అర్థమైపోతోంది అంటూ పోస్టులు పెట్టారు. Heartbreaking Visual from Nepal 💔Little boy caring his younger sister 🥹 and finding their parents 😭.Look at the pain and scratches on their faces. 💔💔💔 pic.twitter.com/oREDLzii6g— Jeet (@JeetN25) August 30, 2026(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..) -
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్ను వెంటాడుతోందా?
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులు ఓవైపు తరచూ తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు మరోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో పశుపతి నేల నేపాల్ సతమతమవుతోంది. తాజా జల విలయం కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితులు తమకు బాగా అలవాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని నేపాల్ చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనక ప్రచారంలో ఉన్న ఓ గాథ తాజాగా తెరపైకి వచ్చింది. ‘సతి లే సరాపేకో దేశ్’.. సతి శాపానికి గురైన దేశం. నేపాల్ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. రాజరికం అంతరించి పోయిన సమయంలో.. అలాగే వరుసగా ప్రభుత్వాలు కూలినప్పుడల్లా ఈ పదం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ఇది కేవలం ఇందుకే పరిమితం కాలేదు.. ప్రకృతి ప్రకోపం చూపించినప్పుడు కూడా అక్కడి జనాలు దీనిని గుర్తు చేసుకుంటారు. అసలు నేపాల్ శపించిన ఆ మహిళ ఎవరు? ఆమె విషాద గాథ ఏంటి? సతీసహగమన సమయంలో ఆమె పెట్టిన కన్నీరే నేపాల్ దుస్థితికి కారణమా?.. నాలుగు వందల ఏళ్ల కిందట జరిగింది ఏంటి?.. నేపాల్లో 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజులు పరిపాలించేవారు. అధికారం, ఆధిపత్య పోరులతో రాజదర్బాలు కుట్రలకు, కుతంత్రాలుగా నిలయంగా కనిపించేవి. ఆ వంశంలో రాజు లక్ష్మీ నరసింహ మల్లా కొలువులో కాజీ భీమ్ మల్లా అనే సేనాపతి ఉండేవాడు. సైనిక వ్యవహారాల్లోనే కాకుండా పరిపాలన, టిబెట్తో వాణిజ్య సంబంధాల్లోనూ ఆయన రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజు వద్ద ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యం.. సాధారణంగానే సామంత రాజుల్లో అసూయను పెంచింది.చాడీలు విని.. భీమ్ మల్లాపై కుట్రలు పన్నిన ప్రత్యర్థులు.. రాజు లక్ష్మీ నరసింహుడికి లేనిపోని వన్నీ నూరిపోశారు. దాంతో తన సింహాసనానికి భీమ్ ముప్పుగా మారుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నారాయన. అలా రాజద్రోహం ఆరోపణలతో ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన్ని చెరసాలలో బంధించి.. మరణశిక్ష అమలు చేశారు. అది చూసి.. ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలేలా రోదించింది. రాజ్యం సైతం కన్నీరు పెట్టింది.చితిపై నుంచే శాపం?నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని లక్ష్మీ నరసింహుడు అకారణంగా, కుట్రలకు తలొగ్గి చంపడాన్ని భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్లో సతి ఆచారం ఉండేది. భర్త మరణించిన తర్వాత భార్య కూడా అతడి చితిపై ఆత్మాహుతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. భువనలక్ష్మి కూడా భర్త భీమ్ మల్లా చితిపై ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే అంతకు ముందు తన భర్తకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అన్యాయంగా చంపిన ఈ నేల, ఈ రాజ్యాన్ని మనశ్శాంతిగా ఉండబోవని, సర్వనాశనం అవుతాయని శపించారు. ఆ తర్వాత రాజు లక్ష్మీ నరసింహుడు సైతం తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని చెబుతుంటారు. అలా ఆమె శాపం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాథ నుంచే ‘సతి లే సరాపేకో దేశ్’(Sati le Sarape ko Desh) అనే పదబంధం పుట్టిందని చెబుతారు.అయితే కాలక్రమంలో ఈ గాథ భువనలక్ష్మి అనే మహిళ కన్నీటి కథకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్లో తరచూ తలెత్తిన రాజకీయ అస్థిరత, అధికార పోరాటాలు, పాలనా సంక్షోభాలు.. అదనంగా ముంచెత్తున్న ప్రకృతి విపత్తులను ప్రస్తావించేటప్పుడు ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా, ఆవేదన పూరితంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు ఆకస్మిక వరదల వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది. View this post on Instagram A post shared by 𝒩 (@nishantchillma)ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త.. మనుషుల్ని మోసం చేస్తున్న ఏఐ! -
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
నేపాల్ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.నేపాల్లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అసలు కారణం ఇదే.. ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్గా మారిన ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.Good News,Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal FloodsThe family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL— Woke Eminent (@WokePandemic) August 28, 2026ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.ఇంటి ఆకారం కూడా ప్లస్ పాయింట్ఇంటి కాంపాక్ట్ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.‘ఇంజినీర్ ఎవరు?’ అనే ప్రశ్నకు..సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్ ఎవరు? అనే విషయాన్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం! -
అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!
ఏ స్వామికైనా ప్రసాదం నారికేళం, అరటిపండ్లు వంటివి భక్తులు నివేదించడం చూశాం. అలాగే ఆలయంలో స్వామివారికి ప్రసాదంగా లడ్డూలు, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, అటుకులు వంటివి నైవేద్యంగా పెడతారు. పురాతన ఆచారం, ఆలయం విశిష్టత అక్కడ కొలువైన స్వామి ఆధారంగా నైవేద్య సమర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత దేవతకు సమర్పించిన ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుంటారు. ఇది అత్యంత సర్వసాధారణం. దక్షిణాది వాళ్లు కార్తికేయ, సుబ్రమణ్యస్వామి, మరుగన్ వంటి పేర్లతో ఆరాధించే ఆ శరవణభవుడుకి అక్కడ ఏం సమర్పిస్తారో తెలిస్తే విస్తుపోతారు. అది కూడా ఓ చిన్నపిల్లవాడి కారణంగా ఆ పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, ఆచారంగా మారడం విశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే..కేరళలోని అలెప్పీలోని తెక్కన్ పళని సుబ్రహ్మణ్య స్వామి మహా క్షేత్రం అనే తలవాడి ఆలయం అత్యంత పురాతన ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది 300 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఇక్కడ కార్వికేయుడు బాలమురుగన్ రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. అయితే ఇక్కడ స్వామి వారికి మంచ్బార్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆఖరికి ఈ ఆలయానికి వచ్చే భక్తులు సైతం మంచ్ బార్లనే తీసుకొస్తుంటారు. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైందంటే..ఆ బాలుడి కారణంగా..స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. ఒక ముస్లిం బాలుడు ఆడుకుంటూ..ఆ ఆలయ గంటను మోగించడంతో అతని తల్లిదండ్రులు మందలించారు. ఆ రాత్రి అతనికి తీవ్ర జ్వరం రావడంతో, కలవరింతల్లో మురుగని నామస్మరణ చేశాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు అతన్ని ఆలయానికి తీసుకురాగా, పూజారి ఏదైనా స్వామివారికి నివేదించండి అని చెప్పగా ఆ బాలుడు పట్టుబట్టి మరి తన వద్ద ఉన్న 'మంచ్' చాక్లెట్ను సమర్పించాడు. ఆనాటి నుంచి స్వామివారికి మంచ్ చాక్లెట్లు సమర్పించడం ఆచారంగా మారింది. అంతేగాదు స్వామివారికి పూలదండలకు బదులుగా మంచ్ చాక్లెట్ల దండనే సమర్పిస్తారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి ‘మంచ్ మురుగన్’ ఆలయం అని పేరొచ్చింది. అయితే ఇటీవల ఈ ఆలయాన్ని రేహా అదానీ అనే కంటెంట్ క్రియేటర్ దర్శించుకుంది. అక్కడ స్వామివారికి మంచ్ చాక్లెట్లు సమర్పించడం చూసి ఆశ్చర్యంతో..ఆ స్వామివారి సందర్శనకు సంబంధించిన వీడియోని పంచుకుంది. అంతేగాదు తనకు ప్రసాదంగా పూజార్లు ఇచ్చిన మంచ్ చాక్లెట్ని చూపిస్తూ ఆనందంగా ఆస్వాదించింది. నెటిజన్లు కూడా తాము కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నామని, అక్కడ మంచ్ చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Reha Adani (@stitchyourmap) (చదవండి: ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..) -
యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ తీసుకున్న సంచలన నిర్ణయం నెట్టింట వైరల్గా మారింది. యూపీ రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దివ్య మిట్టల్, 13 ఏళ్ల సుదీర్ఘ కరియర్కు రాజీనామా చేశారు. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రజా సేవలో గడిపిన తన సంవత్సరాలను ఒక మరపురాని అధ్యాయంగా మిట్టల్ అభివర్ణించారు.ఐఏఎస్లో 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ను ముగిస్తూ, మిట్టల్ తన దృష్టిలో, అధికారిక పదవిని వదిలివేయడం అంటే, తనను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన ఉన్నతమైన లక్ష్యాన్ని విడిచిపెట్టడం కాదని వ్యాఖ్యానించారు. తాను ఈ పదవిని వీడుతున్నప్పటికీ, సేవ వైపు తనను ఆకర్షించిన గొప్ప కల మాత్రం కొనసాగుతుందని ఆమె అన్నారు. అదే విధంగా ప్రజా సేవపై తన మారుతున్న అవగాహన గురించి, తన వృత్తి జీవితంలో తాను కనుగొన్న ఉద్దేశ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఒకప్పుడు తన కోసం తాను కన్న వ్యక్తిగత కలలు ఇప్పటికే నెరవేరాయని, ఇప్పుడు తాను ఇతరుల కోసం కన్న కలల కోసం జీవించాలను కుంటున్నానని మిట్టల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.‘‘ఈ నేల నాకు విద్యను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ రుణం తీర్చుకోవడానికే సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తాను ఒకప్పుడు విజయంగా భావించిన దానిని సాధించి నప్పటికీ, ఏదో అసంపూర్ణంగా మిగిలిపోయిందని అనిపించిందని ఆమె తన రాజీనామా లేఖలో గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి దూరంగా జీవించడం తనను కలవరపెట్టిందనీ, అందుకే దేశానికి తిరిగి వచ్చి ఐఏఎస్లో చేరినట్టు చెప్పుకొచ్చారు. లండన్లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. आज मैंने 13 वर्षों की अविस्मरणीय यात्रा को अपनी इच्छा से विराम देते हुए IAS से त्यागपत्र दे दिया है।साधारण परिवेश में पलते हुए मैंने एक अच्छे, सफल जीवन का सपना देखा था। दिन-रात एक कर IIT दिल्ली और IIM बैंगलोर से पढ़ने के बाद, लंदन में नौकरी लग गयी। पर 'सब कुछ' पा लेने पर भी कुछ… pic.twitter.com/4VRXpK8nu8— Divya Mittal (@divyamittal_IAS) August 30, 2026 అలాగే కుటుంబాలు తొలిసారిగా భూమి హక్కులను పొందడం, దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించే అవకాశాలను పొందడం, రైతులు తమ పొలాలకు నీటిని అందుకోవడం వంటివి చూడటమే ప్రజా సేవలో అత్యంత సంతృప్తి నిచ్చిన ఉదంతాలన్నారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ప్రజా సేవలోకి ప్రవేశించానని , అయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ, వారి సంతోషం, ఆప్యాయత , నమ్మకం రూపంలో తాను వారి నుండి అంతకంటే ఎంతో ఎక్కువ పొందానంటే సంతోషాన్ని వెలిబుచ్చారు. తన పదవీ కాలంలో తనతో పాటు పనిచేసిన సహోద్యోగులకు, అధికారులకు ,ఉద్యోగులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ప్రేమ, మర్యాద, ఆప్యాయత తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని, కష్ట సమయాల్లో కూడా ముందుకు సాగడానికి అవి తోడ్పడ్డాయన్నారు.లహూరియా దేహ్ గ్రామానికి మొదటిసారిగా నీరు రావడం చూసి, ఒక వృద్ధురాలు వణుకుతున్న చేతులతో తన తలను తాకడాన్ని మిట్టల్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ 75 ఏళ్ల నిరీక్షణ తర్వాత 125 కుటుంబాలకు పైపుల ద్వారా కుళాయి నీటిని అందించింది. తన వీడ్కోలు ప్రసంగంలో, పరిపాలన ,బాధ్యతపై తన అవగాహనను తీర్చిదిద్దడంలో ఈ రెండు పోస్టింగ్లే కీలకమని వ్యాఖ్యానించడం విశేషం. న్యాయమైన దాని పక్షాన నిలబడటం ఒక ఐచ్ఛికం కాదని, అది ఒక కర్తవ్యం అని డియోరియా తనకు నేర్పించిందనీ. "అసాధ్యం అనేది వాస్తవం కాదు, కేవలం ఒక అభిప్రాయం మాత్రమే" అని మీర్జాపూర్ తనకు నేర్పించిందన్నారు. అయితే లండన్లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. మరోఆణిముత్యం లాంటి ఆఫీసర్ను కోల్పోయాం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయిఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!ఎవరీ దివ్య మిట్టల్ఢిల్లీకి చెందిన ఈమె ఐఐటీ ఢిల్లీనుంచి ఇంజినీరింగ్, ఐఐఎమ్ బెంగళూరు నుంచి మేనేజ్మెంట్ పూర్తి చేశారు. లండన్లో ఫైనాన్స్ విభాగంలో అధిక జీతంతో కూడిన ఉద్యోగం సాధించినప్పటికీ, దేశానికి సేవ చేయాలనే తపనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్కు తిరిగొచ్చారు. UPSC సాధించి IAS అధికారిణిగా మారారు. అలా మిట్టల్ తన ఐఏఎస్ కెరీర్లో యూపీలోని మీర్జాపూర్ , సంత్ కబీర్ నగర్, జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అలాగే రెవెన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా సేవలు అందించారు. ముఖ్యంగా మీర్జాపూర్లోని 'లహురియా దిహ్' (Lahuriya Dih) కొండ ప్రాంత గ్రామానికి తొలిసారిగా తాగునీరు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మిట్టల్ మే నెలలో డియోరియా నుండి లక్నోకు రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆమె భర్త గగన్దీప్ సింగ్ కూడా ఐఏఎస్ అధికారి. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి.ఇదీ చదవండి: తుకారాం ముండేకు భారీ ఎదురు దెబ్బ, హైకోర్టు మండిపాటు -
నేపాల్ వరదలు : 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు !
Nepal flash Floods నేపాల్ వరద బీభత్సం పెను విషాదాన్ని మిగిల్చింది. వందలాదిమందిని పొట్టన బెట్టుకుంది. అయితే ఇంతటి భారీ విపత్తులో అక్కడక్కడా వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు నెట్టింట ప్రశంసలందుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడు రానున్న విపత్తును ఊహించి, త్వరితగతిన స్పందించి, వందలమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి ప్రాణాలను కాపాడిన ఘటన భారీ ఊరటనిస్తోంది. బుధవారం ఉదయం 9:20 గంటలకు, నేపాల్లోని నువాకోట్కు చెందిన త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ (47), ఆకస్మికంగా వచ్చిన భయంకరమైన వరదల నుంచి తన సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు.గ్రామం వరదల్లో కొట్టుకుపోయిందని స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో పాటు, ఒక విద్యార్థి తండ్రి వరద నీరు వేగంగా పెరుగుతోందని హెచ్చరించాడు. దీనితో వెంటనే అప్రమత్తమైన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు , ప్రిన్సిపాల్ కూడా అయిన దవాడీ, పాఠశాల గంట మోగించి తరగతి గదులను ఖాళీ చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల భవనాలు వరద నీటిలో కొట్టుకుపోకముందే, దవాడీ 1,643 మంది పిల్లలను కాలినడకన కొండపై ఉన్న ఒక రావి చెట్టు (Bodhi tree) కిందకు సురక్షితంగా తీసుకెళ్లారు.విషాదం అయితే విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఇద్దరు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అంతులేని విచారాన్ని మిగిల్చింది. సంతోష్ పరియార్ (32), సోషల్ హిస్టరీ టీచర్, నది ఒడ్డున ఉన్న తన గదికి తిరిగి వెళ్లిన సమయంలో వరదలో కొట్టుకుపోయారు. అలాగే పాఠశాల తలుపులు మూసివేయడానికి వెనుకకు వెళ్లిన పాఠశాల జానిటర్ సుల్తాన్ లామా కూడా వరదలో ప్రాణాలు కోల్పోయారు.కాగా లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం నుండి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు మరియు రాళ్ల ఉపరితలం 1,200 మీటర్ల ఎత్తు నుండి లెండే ఖోలా నదిలో పడిపోయింది. దీనివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేశాయి. ఈ ప్రమాదంలో నేపాల్లో 734 మంది మరణించగా, దాదాపు 2,500 మంది గల్లంతయ్యారు. టిబెట్లోనూ భారీ నష్టం వాటిల్లింది. -
సునామీలా వరద.. ఆ పరమశివుడే కాపాడాడేమో!
కొండలపై నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద.. క్షణాల్లోనే అంతా తుడిచిపెట్టేసింది. చుట్టూ బురద, రాళ్లు, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువే కనిపించింది. ఇంత విషాదంలో కొందరి ప్రాణాలు మాత్రం అద్భుతంగా దక్కాయి. తాము చూసిన భయానక దృశ్యాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ వారు చెప్పిన మాటలు ఆ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన తమిళనాడు యాత్రికులకు నేపాల్లో ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆగస్టు 26న రసువాగఢి ప్రాంతంలో ఒక్కసారిగా కొండలపై నుంచి నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయి. క్షణాల్లోనే రహదారులు, భవనాలు కొట్టుకుపోవడంతో 21 మంది యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చివరకు సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు.తమ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదీ తీరంలో భారీగా పొగలాంటిది కనిపించిందని యాత్రికులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత ఏదైనా పేలుడు జరిగిందని భావించామని.. అంతలోనే కొండపై నుంచి నీరు, మట్టి, ఇసుక, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం దూసుకొచ్చిందని చెప్పారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ తమ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.వరద ప్రవాహం బస్సులకు చేరువవుతుండటంతో డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చి సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొందరు మహిళలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడటంతో.. చీర సాయంతో ఒకరినొకరు పైకి లాగుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు నానా అవస్థలు పడి చివరకు ఓ రెస్క్యూ కేంద్రానికి చేరుకున్నారు.ఆ పరమశివుడి ప్రతిరూపం..తమను స్వయంగా ఆ శివుడే కాపాడాడని కొందరు యాత్రికులు నమ్ముతున్నారు. వరద ప్రవాహం తమవైపు దూసుకొస్తున్న సమయంలో సమీపంలోని కొండపై మట్టి, బురదతో శివుడి ముఖం ఆకారంలో ఓ రూపం కనిపించిందని వారు భావోద్వేగంగా చెబుతున్నారు. కైలాసానికి వెళ్లి శివుడి ఆశీస్సులు పొందాలనుకున్న తమను.. ఈ విపత్తు నుంచి కూడా ఆయనే కాపాడాడని చెప్పారు. నేపాల్ సైన్యానికి కృతజ్ఞతలువిపత్తులో చిక్కుకున్న యాత్రికులను నేపాల్ సైన్యం, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారిని ఖాట్మాండుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి న్యూఢిల్లీ మీదుగా చెన్నైకి తరలించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యాత్రికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా వందలాది మంది ఆచూకీ లేదుఇదిలా ఉండగా.. నేపాల్, టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 700కు దగ్గర్లో చేరగా.. 2,426 మంది గల్లంతైనట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్కు ఆహారం, మందులు, దుప్పట్లు, సోలార్ ల్యాంపులు తదితర సహాయక సామగ్రిని కూడా భారత్ పంపుతోంది.“We saw Lord Shiva’s face on the mountain as the water came hurtling towards us.”A group of 60 pilgrims from Tamil Nadu were travelling in three buses on the Kailash Mansarovar pilgrimage. The whereabouts of around 40 travelling in two of those buses remain unknown.The 21… pic.twitter.com/qmnWUhcF0Z— Rahul Kanwal (@rahulkanwal) August 28, 2026ఇదీ చదవండి: యుగాంతం వచ్చేసిందా? అన్నట్లు.. -
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
లంచగొండి ఆఫీసర్కు చుక్కలు చూపించిన జనం!
దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO— Truth India Live (@Truthindialive) August 29, 2026అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? -
ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..
రాఖీ పూర్ణిమ సందర్భంగా కొన్ని బంధాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఎలా స్ఫూర్తిగా ఉంటాయో తెలుసా..!. అందుకు ఈ ఇద్దరు తోబుట్టువులే ఉదాహరణ. ఔను మీరు వింటుంది నిజమే. ఒకే ఇంట్లోని ఏ తోబుట్టువులు కూడా ఒకే రంగంలో కొనసాగడం అనేది అత్యంత అరుదు. ఒకవేళ కొనసాగినా..సహోద్యోగులగా ఉండటం అనేది..చాలా వృత్తిల్లో సాధ్యం కాదు. కానీ ఈ అక్కా తమ్ముళ్లు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కాదు..ఒకో చోట కొలిగ్స్గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా అని ఇద్దరికీ పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదనుకుంటే పొరపాటే.ఆ తోబుట్టువులే మణిపూర్కి చెందిన వాహెంగ్బామ్ సురేయా, రోహిత్ సింగ్లు. వారిద్దరికి విమానయానం ఉద్యోగానికి మించి అని చెప్పొచ్చు. ఇంఫాల్లో ఎనిమిదేళ్ల వయసు తేడాతో పెరిగిన ఇద్దరూ..ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ సభ్యులు. ఇద్దరికి ఒకే రకమైన కఠినమైన షెడ్యూళ్లు, ఒకే చోట వేచి ఉండటం తదితరాలన్ని ఎదుర్కొంటుంటారు. అయితే వారి కుటుంబంలో విమానయాన రంగంలోకి ప్రవేశించిన తొలి వ్యక్తి సురేయా కాగా, ఆమె తమ్ముడు కూడా ఆమె బాటలో పయనించి ఈ వృత్తిని ఎంచుకోవడం విశేషం. అక్క సురేయా 2014లో విమానయాన జర్నీని ప్రారంభించింది. అయితే అక్క డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక రోహిత్కి వివిధ ప్రాంతాలు, ఆ వృత్తి విధివిధానాల గురించి ఆమె కథలు కథలుగా చెప్పేది. ఆమె అనుభవాలు వింటూ పెరిగిన రోహిత్కి తెలియకుండానే ఆ వృత్తిపై అమితంగా ఆసక్తి పెరిగిపోయింది. అలా చివరికి కొన్నేళ్ల తర్వాత అక్క మాదిరిగానే ఎయిర్ ఇండియాలో చేరి తన చిన్న నాటి కలను వృత్తిగా మార్చుకుఉన్నాడు. అన్నింట్లకంటే విశేషం ఏంటంటే ఒకే ఎయిర్లైన్ పనిచేయడంతో వారి బంధం మరింత స్ట్రాంగ్గా మారింది. ఎంత బిజీ షెడ్యూళ్లు ఉన్నా ఒకరినొకరు సులభంగా అర్థ చేసుకుంటుంటారు. అలాగే ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటుంటామని చెబుతున్నారు. అయితే ఈ వృత్తి కారణంగా తోబుట్టువుల నుంచి సహోద్యోగులుగా కూడా మారామని నవ్వుతూ చెబుతుంటారు ఇద్దరూ. అలా తామిద్దరి లైఫ్స్టైల్ ఒకటే కాబట్టి ప్రతీది పూర్తిగా వివరించకుండానే..అవతల వాళ్ల బిజీని అర్థం చేసుకుంటామని అంటున్నారు. అలాగే తాము విరామ సమయాల్లో కలిసి గడుపుతామని, అది మాకు ఇంట్లో ఉన్న అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేగాదు మాకు ఎయిర్ ఇండియా క్యాబ్ కేటాయించినప్పుడూ మా ఇద్దరి అడ్రస్ ఒకటే కావడంతో క్యాబ్ డ్రైవర్ ఎయిర్ ఇండియా ఫ్యామిలీ ప్యాకేజీలను ఎప్పుడు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది అని జోక్ చేస్తుంటాడని చెబుతున్నారు. ఒక్కోసారి తన తమ్ముడు రోహిత్కి డ్యూటీ లేకపోతే తనకోసం వేడివేడిగా భోజనం తీసుకొస్తాడని, అది నాకు ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తుందని చెబుతోంది సురేయా. ఇక తమ్ముడు రోహిత్ తన అక్క శ్రద్ధ , దయను ప్రశంసిస్తూ..క్యాబిన్ సిబ్బందిగా ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, ప్రవర్తించే తీరుకి తాను సదా అభిమానిని అంటున్నాడు. నిజంగా ఇలాంటి అదృష్టం ఎందరి సోదర సోదరీమణులకు దక్కుతుంది చెప్పండి. (చదవండి: హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్) -
హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎందరో విదేశీయులను ఆకర్షించాయి. దాంతో ఈ గడ్డపైనే ఉండిపోవాలని నిర్ణయించుకుని మరి స్థిరపడినవారు కూడా ఉన్నారు. కానీ ఈ జపాన్ అమ్మాయి ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఏం చేసిందో తెలిస్తే విస్తుపోతారు. జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో జపాన్ ఇటీవల భారతదేశ పర్యటనలో భాగంగా హరిద్వార్లోని గంగా ఘాట్ వద్ద ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తూ..జీవితంలో మొదటిసారి గంగాస్నానం చేస్తున్నాని చెప్పింది. ఆ తర్వాత నదిలో ఏర్పాటు చేసిన భద్రతా గొలుసులు పట్టుకుని నీటిలో మునిగి స్నానం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నదీప్రవాహానికి కొట్టుకుపోకుండా గట్టిగా గొలుసులు పట్టుకుని కనిపిస్తుంది వీడియోలో. ఆ తర్వాత ఆమె స్నానం సరిపోతుందా అని అక్కడే ఉన్న స్థానికుడిని అడుగుతుంది కూడా. మొత్తం మూడుసార్లు హిందూ భక్తుల మునిగినట్లుగానే మునిగి స్నానం చేస్తుందామె. ఒక అపరిచితుడి సాయంతో ఈ వీడియోని తీయగలిగానని, ఆయన చాలా అద్భుతంగా తీశారని ప్రశంసించిందామె. చివరగా ఆమె బాగా స్నానం చేశాను, చాలా సంతోషంగా ఉంది. అని అన్నారామె. అయితే ఆమెకు హిందీ ఎలా వచ్చు అని సందేహించకండి. ఎందుకంటే..ఆమె హిందీ, భారతీయ సంస్కృతులపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసి, ఎట్టకేలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేసి, చాలా మంచి అనుభూతి పొందింది. అంతేగాదు చివర్లో ఈ ఊహించని జీవిత ప్రయాణం అందించినందుకు భారత్కి సదా ధన్యావాదాలు అని పోస్ట్లో పేర్కొంది కూడా. నెటిజన్లు ఈ పుణ్యస్నానం తర్వాత నిజంగానే మీలో మంచి మార్పు వచ్చింది. ఇది గంగా నది అనుగ్రహం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mayo Japan (@mayojapan) (చదవండి: గూగుల్లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!) -
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
నేపాల్ ఫ్లాష్ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్కే పెనుముప్పు? -
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
తండ్రిని పాకెట్మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం. ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు. పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్వైడ్గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందుతుండటం విశేషం.(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!) -
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..అమ్మ సంకోచం.. నాన్న సరే...సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను. వ్యతిరేకతను ఎదుర్కొన్నా...గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది. ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్తో పాటు భారత్లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.కెరీర్గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది. అమ్మాయిలూ... అలా చేయండిఅమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.– సత్యబాబు, సాక్షి -
నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్! చివరికి ఇద్దరూ..
ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. తాను ఒకప్పుడూ.. బాలీవుడ్లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. దానికి బాప్బేటీ ఫామ్(తండ్రి కూతుళ్ల) ఫామ్ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్డౌన్ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది. చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్బేటీ ఫామ్ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm) (చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!) -
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్ఫ్రెండ్తో అలా.. -
అధికార దర్పం.. 'వారికి' మాత్రమే సాధ్యం!
‘రాజు వెడలె రవితేజము లలరగ’ అని పూర్వాకాలంలో రాజులు తమ పరివారంతో బయలుదేరిన తీరును వర్ణించారు కవులు. వర్తమానంలోనూ ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు మనకు సాక్షాత్కరిస్తుంటాయి. అయితే ఇప్పుడు రాజులు లేరు కదా, ఇంత ఆర్భాటంగా బయట తిరిగేదెవరనే అనుమానం కలగడం సహజం. రాజులు, రాజ్యాలు లేకపోయినా పాలకులు ఉన్నారుగా! పాలకులకు అధికార దర్పం ఉంటుంది, పదర్శిస్తారు సరే. కానీ వారి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా అధికార దర్పం ప్రదర్శించడమే ఇప్పుడు వైచిత్రి. న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన వారూ ఎటువంటి సంకోచం లేకుండా అధికార దర్పంతో వెలిగిపోతున్నారు. మచ్చుకు రెండింటి గురించి మాట్లాడుకుందాం.బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారన్న వాదన ఉండనే ఉంది. ఇటీవల ఆయన ఉదారంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఫలితంగా నితీశ్కు రాజ్యసభ ఎంపీ, ఆయన కుమారుడు నిశాంత్కు బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కాయి. నిశాంత్ను బిహార్ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా జేడీయూ పార్టీ నాయకులు స్తుతిస్తున్నారు. మరి కాబోయే సీఎం జనం మధ్యకు వస్తున్నారంటే ఎంత హడావుడి ఉండాలి!మంత్రి డాబు50పైగా వాహనాల కాన్వాయ్తో నిశాంత్ వెళుతున్న వీడియో ఒకటి తాజాగా ఎక్స్లో షేర్ అయింది. నిశాంత్ వాహనశ్రేణి వీధుల్లో దూసుకుపోతుండగా.. సామాన్య జనమంతా నిలబడి చూస్తున్నట్టుగా వీడియో ఉంది. వీణా జైన్ అనే యూజర్ ఈ వీడియో షేర్ చేశారు. 'బిహార్కు 9 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ పుత్రరత్నం 50కి పైగా వాహనాల కాన్వాయ్లో ప్రయాణించారు. వారికి ఓటు వేస్తూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలు ఆయన కాన్వాయ్కు దారి ఇస్తూ అమితాశ్చర్యంతో చూస్తున్నారు' అని వ్యాఖ్యానాన్ని జోడించారు. ఇక వీడియో చూసిన నెటిజనులు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. భారతదేశానికి 'రాజులు వద్దు' అనే ఉద్యమం ఇప్పుడు నిజంగా అవసరం అంటూ పెట్టిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.బాబా.. దర్జాఇక సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి పదవి లేకపోయినా ఆయన కూడా.. ‘రాజు వెడలె రవితేజము లలరగ’ తరహాలోనే ఆర్భాటాలు ప్రదర్శిస్తుంటారు. తాజాగా మరోసారి పెరోల్పై హరియాణాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన లగ్జరీ కార్ల కాన్వాయ్లో సిర్సాకు చేరుకున్నారు.చదవండి: చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. 17వ సారి పెరోల్పై బయటకు రావడం.. బహుశా మనదేశంలో మాత్రమే సాధ్యమేమో! 2017 నుంచి కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన 435 రోజులు జైలు బయటే ఉండడం మరో విచిత్రం. ఇక, ఈయనగారి దర్జాపై సోషల్ మీడియాలో నెటిజనులు కారాలు మిరియాలు నూరుతున్నారు. గుర్మీత్కు హరియాణా ప్రభుత్వం రాఖీ కానుక ఇచ్చిందని జోకులు వేస్తున్నారు. 'పెట్టి పుట్టాడు' అంటూ నిష్టూరమాడుతున్నారు. 'ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే.. కొంత మంది మాత్రం ఎక్కువ సమానమ'నే నానుడిని గుర్తుచేసుకుంటున్నారు. 9 Times Bihar CM Nitish Kumar's Son Nishant Kumar travelling with 50+ vehicles convoyAnd the people who voted for them continuously and living Below poverty line watching it while giving way for his convoy 👀 pic.twitter.com/jEMRtMwvzY— Veena Jain (@Vtxt21) August 25, 2026#WATCH | Sirsa, Haryana: Rape convict Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh arrived at the Dera headquarters in Sirsa from Sunaria Jail after being granted 21-day parole pic.twitter.com/Q7WKr98dvG— ANI (@ANI) August 25, 2026ఇదీ చదవండి: నేనే నిరసనకు దిగుతా.. బాబా రామ్దేవ్ వార్నింగ్ -
Viral Video: గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు.. ఎగబడిన జనం
కాన్పూర్లోని పంకి పారిశ్రామిక ప్రాంతంలో ఓ చెత్తకుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు కోసం జనం ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీగా జనం ఓ చెత్త డంపింగ్ ప్రదేశం వద్ద గుమిగూడారు. గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం ప్రజలు ఎగబడటం చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్లు, టాఫీలు పడేసినట్లు సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు నేలపై పడిన స్వీట్లను చేతులతో ఏరుకుంటుండగా.. మరికొందరు బ్యాగులు, సంచులతో వచ్చి వీలైనన్ని చాక్లెట్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.ఓ ఫ్యాక్టరీ యజమాని గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల బ్యాచ్ను అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా వ్యాపించడంతో కొద్దిసేపటికే అక్కడ భారీగా జనం చేరుకుని చాక్లెట్లను తీసుకెళ్లారు. అయితే ప్రజలు తీసుకెళ్లిన చాక్లెట్లను నిజంగానే తినేందుకు ఉపయోగించనున్నారా? లేక మరేదైనా అవసరానికి తీసుకెళ్లారా? అనేది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఈ ఘటన ఆహార భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. వాటిని తినడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.यूपी के कानपुर से एक वीडियो सामने आया है। पनकी इंडस्ट्रियल एरिया में डंपिंग साइट के पास किसी ने बड़ी मात्रा में एक्सपायरी चॉकलेट, टॉफी और बिस्किट फेंके जिसे देख देखकर वहां लोगों की भीड़ जुट गई और कई लोग सामान को बैग, बोरे और डिब्बों में भरकर ले जाते दिखाई दिए। pic.twitter.com/4NKFNVQYON— Yogesh Mishra (@iYogeshMishra) August 25, 2026కాగా, గడువు ముగిసిన, విక్రయించేందుకు అనర్హమైన ఆహార పదార్థాలను బహిరంగంగా పడేయకుండా.. నిర్దేశిత విధానంలో నాశనం చేయాల్సి ఉంటుంది. అవి తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా నియంత్రిత పద్ధతిలో వాటిని నిర్వీర్యం చేయడం అవసరం. ఈ ఘటనలో మాత్రం చాక్లెట్లను బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ప్రజలు వాటిని తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదీ చదవండి: వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!! -
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..!
చేతులు పట్టుకుని నడిపించిన ఆ తల్లిదండ్రులనే మనం పెద్దయ్యాక వాళ్లను మనం దగ్గరుండి చూసుకుంటుంటే కలిగే సంతోషం అంత ఇంత కాదు. ఒకప్పడు వాళ్లను గట్టిగా పట్టుకుని నడిచిన మనం ఇవాళ చిన్నపిల్లలుగా మారి మన ఆసరాతో వెళ్తుంటే వాళ్లకళ్లల్లో కనిపించే దృశ్యానికి మాటల్లేవ్ అంతే. అలాంటి భావోద్వేగ దృశ్యమే నెట్టింట వైరల్గా మారింది. ఈ పోస్ట్ని నాన్సీ గుప్తా అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆమె తన తల్లిదండ్రలును తొలిసారిగా విమానంలో తీసుకువెళ్తోంది. ఆ అనుభూతులని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తొలిసారి తన పేరెంట్స్ విమానం ఎక్కడంతో వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోష దృశ్యాలను కెమెరాలో బంధించింది. విమానం కిటికి కుండా దుప్పటిలా పరుచుకుని తేలుతూ కనిపిస్తున్న మేఘాలను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ తిలకిస్తూ..సంబరపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె తల్లి కిటికీలోంచి చూస్తూ సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం మనసుని తాకుతుంది. చిన్నప్పుడు నడక నేర్పించిన తల్లిదండ్రలను ఇవాళ ఆకాశంలోకి విహరించేలా చేస్తే కలిగే అనుభూతికి మించింది ఏం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని తానుపొందుతున్నా అన్నట్లుగా చివర్లో నవ్వుతూ తన సెల్పీని తీసుకుంటూ కనిపిస్తుంది నాన్సీ గుప్తా. ఈ వీడియోకి "మొదటి అడుగుల నుంచి మొదటి విమాన ప్రయాణం" వరకు అని క్యాప్షన్ జోడించి మరి ఇలా రాసుకొచ్చింది. ఏళ్లు గడిచే కొద్దీ..తల్లిదండ్రులు, పిల్లల మధ్య మారుతున్న పాత్రల గురించి ఈ క్షణం ఎలా చెబుతోందో చెప్పారు. ఆవేళ తనను చేయిపట్టుకుని నడిపించారు, ఇవాళ వాళ్లను తొలిసారిగా విమానంలో తీసుకువచ్చా. ఇదంతా చూస్తుంటే జీవితం ఒక వలయంలా పూర్తి అవుతోందనిపిస్తోంది అంటూ పోస్ట్లో రాసుకొచ్చిందామె. నెటిజన్లు కూడా ఇది ఒక అందమైన పరిపూర్ణమైన క్షణం అని, చాలా భావోద్వేగ భరితంగా ఉంది అంటూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Nancy Gupta🍀 (@nancy.gupta18) -
చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!
పంచదార ధర సామాన్యులను బెంబేలెతిస్తోంది. ధరలు రోజు రోజుకు ఎగబాకుతుండడంతో చక్కెర వైపు చూడటానికి జనం జంకుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడదామంటే దాని ధర కూడా దడ పుట్టిస్తోంది. తీపి అంటేనే హడలిపోయేలా రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఉత్పత్తి పడిపోవడం, సరఫరాలో సమస్యల కారణంగా గత కొన్ని వారాలుగా చక్కెర, బెల్లం ధరలు బాగా పెరిగిపోయాయి.కొద్దిరోజుల క్రితం వరకు 45 రూపాయలు ఉన్న కిలో చక్కెర ధర ఇప్పుడు దాదాపు 70 రూపాయలకు చేరుకుంది. బెల్లం కిలో రేటు దాదాపు 20 రూపాయలు పెరిగి రూ.75కు వచ్చింది. పండగ సీజన్తో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో బెల్లం, చక్కెరకు ఫుల్ గిరాకీ ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో ధరలు చుక్కలనంటడంతో జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించి, తమకు ఊరట కల్పించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: భారత్ను ముంచెత్తిన చక్కెర సంక్షోభం!చక్కెర ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు, మీమ్స్ పెద్ద ఎత్తున పోస్ట్ అవుతున్నాయి. గతంలో నాయకుల మాటలను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కమలం గుర్తు బటన్ నొక్కండి, కిలో చక్కెర రూ.13కే పొందండి అంటూ 2019లో స్మృతి ఇరానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకుముందు ఐఫోన్ దక్కించుకోవానికి కిడ్నీ అమ్మాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చక్కెర కోసం మూత్రపిండాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా ఉన్న వీడియో నవ్వులు పూయిస్తోంది.సోషల్ మీడియాపై చక్కెర ధరల పెరుగుదలపై షేర్ అయిన పోస్టులు మీ కోసం..कमल का बटन दबाओ, 13 रुपए किलो में शक्कर पाओ.- स्मृति ईरानी (2019 में)#Sugar pic.twitter.com/mOZE7VoWCH— Abdul Wahab (@AbdulWahabRs) August 23, 2026First it was iPhone, now it's SUGAR #Sugar pic.twitter.com/SiNybQqWJp— Indian (@MeIndian03) August 24, 2026Dhurandhar 3 on the way #Sugar https://t.co/9F5PCKM478 pic.twitter.com/1MNOcaIcgy— Indian (@MeIndian03) August 24, 2026మీ సైడు 50 రూపాయల షుగర్ ఇట్లా ఎట్లా ఇస్తారూ @NaperuShivaMani pic.twitter.com/dKOw7cYpBd— d కృష్ణ (@2029krisha) August 23, 2026#Sugar prices may be going UP… 🍬📈But this #Reel has sweetened the internet for free! And entertainment value is already OFF THE CHARTS! 😂🔥#SugarPriceHikes #BandhanDay #ReelOfTheDay #CreativeContent#NeverStopPlaying pic.twitter.com/GyZlLTVw6i— Zenith Chaudhary (@ZC_zenith) August 23, 2026 -
25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్లో ఏం చేయాలి?
25 ఏళ్లకే కోటీశ్వరుడిగా అవతరించిన ఒక యువకుడు రెడ్డిట్లో తన ఆకట్టుకునే పెట్టుబడి పోర్ట్ఫోలియోను పంచుకున్నారు. మీమ్ పేజీలు, ఆన్లైన్ కంటెంట్పై కేంద్రీకృతమైన వ్యాపారాన్ని నిర్మించడం ద్వారా తాను రూ. 1.6 కోట్ల నికర సంపదను కూడబెట్టినట్లు ఆయన వెల్లడించారు.అయితే తన ఆదాయం బిజినెస్ ఆధారితం కావడం వల్ల హెచ్చుతగ్గులు ఉంటాయని, అందువల్ల భవిష్యత్తు కోసం (FIRE - Financial Independence, Retire Early) ఎలాంటి వ్యూహాలు పాటించాలో అని సలహాలు కోరిన వైనం నెట్టింట సందడిగా మారింది. అంతేనా అతను షేర్ చేసిన నెట్వర్త్ పోర్ట్ఫోలియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భారతదేశంలోని ఒక టైర్-2 నగరానికి చెందిన డిజిటల్ మీడియా బిజినెస్లో రాణిస్తున్న ఈ బిజినెస్మ్యాన్ సోషల్ మీడియాలో తన సక్సెస్ జర్నీని షేర్ చేశాడు. పెట్టుబడి విషయంలో తాను అనుసరించిన క్రమశిక్షణా విధానమే తన ఆర్థిక బలానికి, కోటిన్నర ఆర్థిక మైలురాయిని దాటడానికి సాయపడిందని యువ క్రియేటర్ వివరించారు. తాను 18 ఏళ్ల వయస్సులోనే ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆర్జన మొదలు పెట్టి, చివరికి ఒక డిజిటల్-మీడియా వ్యాపారాన్ని నిర్మించానని వివరించాడు. తన ఆస్తులు,పెట్టుబడుల వివరాలను కూడా పంచుకున్నాడు. ప్రస్తుత నికర సంపద సుమారుగా రూ. 1.6 కోట్లు అని , తనకు రూ. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని తెలిపాడు. అయితే తనకు గానీ, తన తల్లిదండ్రులకు గానీ ఆరోగ్య బీమా లేదని ప్రకటించాడు. రెండేళ్ల క్రితం రూ. 4 లక్షలతో సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేశాడు.ఆస్తి, పెట్టుబడులు మొత్తం ఆస్తి: రూ.1.6 కోట్లుభారతీయ ఈక్విటీలు : రూ 90 లక్షలుబ్యాంక్ డిపాజిట్లు & క్యాష్ రూ. 45 లక్షలురియల్ ఎస్టేట్ (Real Estate)రూ.15 లక్షలుయూఎస్ స్టాక్స్ : రూ 7.5 లక్షలుమ్యూచువల్ ఫండ్స్ : రూ 5 లక్షలుక్రిప్టో & ఫిక్స్డ్ డిపాజిట్లు : రూ 4 లక్షలురెడిటర్లను అడిగిన ప్రశ్నలువ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూనే ఉన్నప్పటికీ, తర్వాత ఏమి చేయాలా అంటూ ఆ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. అందుకే భవిష్యత్తులో తన సంపద కరిగిపోకుండా, మరింత ఆర్థిక స్థిరత్వం కోసం,డిజిటల్ మీడియా బిజినెస్ను మరింతగా స్కేల్ చేయడం ఎలా? ఎలాంటి వ్యూహాలు పాటించాలో తెలపండి నెటిజన్లను సలహాలు కోరాడు. ముఖ్యంగా గత రెండుమూడేళ్లుగా రియల్ ఎస్టేట్ డీల్స్ పెద్దగా లేవు, కనుక బ్యాంక్లో ఉన్న రూ. 30-45 లక్షల మిగులు నగదును ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పండి అంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేయడం విశేషం.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్నెటిజన్ల స్పందన25 ఏళ్లకే ఇంత గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించినందుకు పలువురు అభినందించారు."నిజంగా అద్భుతం, మిత్రమా అంటూ తెగ పొగిడేవారు. ఒక యూజర్ మీమ్ పేజీల ద్వారా సంపాదన ఎలా సాధ్యమో తెలపండి అంటూ ఆసక్తి చూపగా, మరికొందరు రియల్ ఎస్టేట్ ఆస్తులను కొని అమ్మడం లేదా కొన్నింటిని అద్దెకు ఇవ్వడం ప్రారంభించి, మీ డిజిటల్ వ్యాపారాన్ని నడుపుతూనే నెమ్మదిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించండి. తద్వారా నిలకడైన ఆదాయం పొందాలని సూచించారు.ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు -
బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నిజంగా ఈ ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. అత్యంత పేదరికంలో జీవిస్తూ, భిక్షాటనతో రూపాయి రూపాయి కూడబెట్టి, లక్షలు పోగు జేసింది. కానీ ఏ లాభం? ఆ లక్షలేవీ ఆమెకు అక్కరకు రాలేదు. ఆ ధనాన్ని అనుభవించ కుండానే ఆమె కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మాండ్యకు చెందిన 68 ఏళ్ల హూర్ (Hoor) అనే వృద్ధురాలు వయోభారంతో వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఒక మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదుతో నిండిన సంచులు లభ్యమైన ఘటన సోషల్మీడియాలో వైరల్గా మారింది.అనంతరం స్థానికులు ఆమె అద్దె ఇంటిని తనిఖీ చేయగా, దాదాపు 30కి పైగా గోనె సంచుల్లో నింపి ఉన్న వేలాది నాణేలు, రూ. 10,20,రూ 50 కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. స్థానికులు ఆ డబ్బును లెక్కించగా రూ.8,40,000 (ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు) నగదు చూసి అందరూ దిగ్భ్రాంతి పోయారు.At least 30 cash-filled sacks worth over ₹8 lakhs have been found at the house of a woman in Karnataka who spent all of her life begging. She died yesterday due to an age-related illness. The money was handed over to her brothers. One of the brothers took Rs 6 lakh while the… pic.twitter.com/Q0L89fM8d1— Piyush Rai (@Benarasiyaa) August 24, 2026ఇదీ చదవండి: రోజుకు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ హూర్ తన సోదరితో కలిసి ఆ అద్దె ఇంట్లో నివసించేవారు. ఇద్దరికీ వివాహం కాలేదు. రెండేళ్ల క్రితమే ఆమె సోదరి కూడా మరణించారు. దీంతో ఈ సొమ్మును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొక సోదరుడు తన వాటాకి వచ్చిన రూ. 2,40,000 లను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చారు.ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ -
సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా!
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ యువతతో మమేకమయ్యే కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీల కోసం వేదికపైకి వచ్చిన ఓ యువ విద్యార్థిని.. అందరి ముందే రాహుల్ గాంధీ చెంపపై ముద్దుపెట్టుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మహారాష్ట్రలోని పూణేలో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ వేదికపై యువతతో మాట్లాడటంతో పాటు వారితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ఓ విద్యార్థిని రాహుల్ వద్దకు వచ్చి ఆయన చెంపపై ముద్దు పెట్టింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో రాహుల్ షాకయ్యారు. అనంతరం రాహుల్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వేదిక నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమం మొత్తం కచేరీ తరహా లైటింగ్, భారీ ఏర్పాట్లతో సాగింది.#rgtwt gurls are not not ready fr this 😭😭😭😭 pic.twitter.com/Q6t9RS2vpY— Snowbell (@Snowbel) August 23, 2026ఈ ఘటన అనంతరం, 11వ తరగతి చదువుతున్న సదరు యువతి మరియం మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీలా ఎదగడం నా కల. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం యువతలో రాహుల్ గాంధీ తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వదిలిన అంశాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు’ అని వ్యాఖ్యలు చేసింది.It's my dream to become like Rahul Gandhi.♥️Mariyam, an 11th-grade student, aspires to walk in the footsteps of Rahul Gandhi.Rahul Gandhi flat-out owns the narrative among the youth right now. His rivals are just picking up whatever crumbs he leaves behind. 🔥💯 pic.twitter.com/VN3j1OwwzQ— Krishna Yadav (@Control_Krishna) August 24, 2026సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లుఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీతో మహిళలు, యువతులు ఎంత సౌకర్యంగా మెలుగుతున్నారో కొందరు ప్రస్తావించగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ‘మనుస్మృతి’ భావజాలాన్ని విమర్శించిన ఆయన.. మహిళలు పితృస్వామ్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు.రాహుల్ సభపై బీజేపీ ఫైర్రాహుల్ కార్యక్రమంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై సీరియస్గా మాట్లాడకుండా రాహుల్ సాధారణ రాజకీయ ప్రసంగానికే పరిమితమయ్యారని మహారాష్ట్ర బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. సభకు జనాన్ని సమీకరించేందుకు కాలేజీ బస్సులను ఉపయోగించారని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శలను తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందనను చూసి బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. LoP @RahulGandhi Ji's craze among GenZ 🔥A student kissed him with affection.....! This is how safe girls feel around him. It can never happen with any BJP leader. pic.twitter.com/shbLJi6QSK— Venisha G Kiba (@KibaVenisha) August 24, 2026 -
రూ. 150 కోట్ల అవినీతి : బార్ కౌన్సిల్ ఛైర్మన్పై సంచలన ఆరోపణలు
తెలంగాణాలోని నల్సార్ లా యూనివర్సిటీ 2026 విద్యార్థులపై చర్యల వివాదంలో భంగపడ్డ బీజేపీ ఎంపీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ న్యాయవాది, బీసీఐ కో-ఛైర్మన్ వై.ఆర్. సదాశివ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఛైర్మన్ మనన్ మిశ్రానాయకత్వంలో బీసీఏ ప్రతిష్ట, ప్రమాణాలు దిగజారిపోయాయని ఆరోపించారు.మిశ్రా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయనకు ఒక లేఖ రాయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ట్రస్ట్ పనితీరుపై కూడా రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ట్రస్ట్ నిష్క్రియంగా మారిందని, కౌన్సిల్ నిధులలో సుమారు రూ. 150 కోట్లు కొత్తగా సృష్టించబడిన ట్రస్ట్కు మళ్లించారని ఆరోపించడం సంచలనంగా మారింది. తక్షణమే లేదా కనీసం ఈ లేఖ అందిన 15 రోజుల్లోపు రాజీనామా చేయాలని సదాశివ రెడ్డి తన లేఖలో కోరారు. అలాగే తాను లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి BCI ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత రికార్డులను ముందుగానే సభ్యుల ముందు ఉంచాలని కూడా ఆ లేఖలో కోరారు.నిధుల స్పెషల్ ఆడిట్బీసీఐ, బీసీఐ ట్రస్ట్ PEARL-First ఖాతాలపై కాగ్ (CAG - Comptroller and Auditor General of India) ప్యానెల్లోని స్వతంత్ర సంస్థతో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నాటి నుండి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఈ ఆడిట్ జరగాలని, ఆ నివేదికను సభ్యులందరికీ అందించడంతో పాటు బహిరంగపరచాలని కూడా యాన డిమాండ్ చేశారు. అలాగే లా కాలేజీలు, యూనివర్సిటీలు లేదా మేనేజ్మెంట్ల నుండి ఎలాంటి విరాళాలు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా చెల్లింపులను బిసిఐ లేదా దానికి అనుబంధ ట్రస్ట్లు స్వీకరించకుండా తక్షణమే నిలిపివేయాలన్నారు.ఛైర్మన్పై సదాశివ రెడ్డి ప్రధాన ఆరోపణలుబీసీఐలో నియామకాలను ఎటువంటి పారదర్శకమైన రిక్రూట్మెంట్ ప్రక్రియ లేకుండానే చేపట్టారని ఆరోపించారు.బిసిఐ ట్రస్ట్ను నిష్క్రియం చేసి, దాదాపు రూ.150 కోట్ల కౌన్సిల్ నిధులను కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్కు మళ్లించినట్లు పేర్కొన్నారు.అనుమతులు లేదా రెన్యూవల్స్ కోసం వచ్చే లా కాలేజీల నుండి నిరంతరం విరాళాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.బీసీఏ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కీలక పదవులను మనన్ మిశ్రా తన కుటుంబ సభ్యులకు కేటాయించారని విమర్శించారు.నాల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్పై సరైన ఆధారాలు లేకుండానే బిసిఐ చర్యలు తీసుకుందని ప్రశ్నలు లేవనెత్తారు.రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో గ్రూపులు మరియు వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని కౌన్సిల్ నాయకత్వంపై ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: దారుణం బిల్పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫేమనన్ కుమార్ మిశ్రా స్పందనఆర్థిక అవకతవకలు, అనుమానాస్పద నియామకాలు,పారదర్శకత లోపం అంటూ తనపై వచ్చిన ఆరోపణలను చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తోసిపుచ్చారు. బీసీఐ సభ్యుడు వై.ఆర్. సదాశివ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు నిరాధారమైనవని , రాజకీయ ప్రేరేపితమన్నారు. -
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ..!
కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడికి ఆ ఆలింగనం ఎక్కడా లేని ధైర్యం ఇచ్చింది. అతనితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తాకే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.సైనిక శిక్షణ ముగింపు వేడుకలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తోటి సైనికులు తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో.. ఒంటరిగా నిల్చున్న ఓ యువ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్ అతడికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.In a touching human moment in Indonesia, one soldier stood alone during the closing ceremony of a training exercise, while his colleagues celebrated with their families and loved ones.His commander noticed the situation from a distance and approached him, embracing him as if he…— The Actual Event (@Gazawins12) August 17, 2026ఇండోనేషియా ఆర్మీకి చెందిన ఓ రిక్రూట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ఫస్ట్ TNI AD ఎడ్యుకేషన్ (ఇండోనేషియా ఆర్మీ శిక్షణ వ్యవస్థ) ముగింపు వేడుకలో భాగంగా సైనికులు పట్టాలు అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక సందర్భంగా చాలామంది సైనికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ ఓ యువ రిక్రూట్ మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడి కనిపించాడు. చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.అక్కడే ఉన్న కమాండర్ ఆ యువ సైనికుడి పరిస్థితిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఎలాంటి మాటలు చెప్పకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనుకోని ఆ ప్రేమాభిమానానికి ఆ రిక్రూట్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కమాండర్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఓదారుస్తూ అధికారి కొద్దిసేపు అలాగే ఆలింగనం చేసుకున్నాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడి కార్టోనో అనే వ్యక్తి.. ఆ యువ సైనికుడు తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాడని పేర్కొన్నారు. ఇతర సైనికులు తమ కుటుంబాలతో కలిసి వేడుక జరుపుకుంటుండగా.. అతడు ఒంటరిగా నిలబడటం కమాండర్ గమనించారని తెలిపారు. ఆ ఒక్క ఆలింగనం ఆ సైనికుడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రేమను గుర్తు చేసిందని పేర్కొన్నారు.నెట్టింట ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు కమాండర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సైనిక అధికారి కేవలం ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదని.. తన సిబ్బంది భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు. “అది కేవలం ఓ కౌగిలి కాదు.. ఒంటరిగా ఉన్న సైనికుడికి ఇచ్చిన భరోసా” అంటూ పలువురు స్పందించారు. మరికొందరు ఈ ఘటనలో కమాండర్ మానవత్వాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. కఠినమైన సైనిక శిక్షణ మధ్య కూడా మానవత్వానికి చోటుందని చాటిచెప్పిన ఈ క్షణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది.జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. అని శంకర్దాదా చెప్పినట్టు ఇది ఏ మంత్రమో కాదు.. కానీ ఓ కౌగిలి చేసిన మ్యాజిక్. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్.. ఒక్క ఆలింగనంతో అతడికి ధైర్యం ఇచ్చాడు. ఆ హృదయాన్ని తాకే వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. -
నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: 105 ఏళ్ల దోషికి సుప్రీంకోర్టు సాయం -
ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..!
పదవీవిరమణ వయసు వచ్చేటప్పటికీ కాస్త వేటిపై అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి చాలా అరుదు. ఒకవేళ ప్రయత్నించినా మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ పెద్దయన రిటైర్ అయిపోయాక కూడా మరో ఉద్యోగంలో కొనసాగుతూ..ఎంటెక్ పూర్తి చేశాడు. అంతేకాదండోయ్ తన తరగతిలో టాప్ 10 విద్యార్థులలో ఒకరిగా నిలవడం విశేషం. అందుకు సంభందించిన విషయాన్ని ఆయన కుమారుడు శశాంక్ శ్రీవాస్తవ్ నెట్టిట షేర్ చేయడంతో వైరల్గా మారింది. శశాంక్ శ్రీ వాస్తవ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్లో ఇలా రాసుకొచ్చారు. “ 64 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఎం.టెక్ పూర్తి చేశారు. గతనెలలోనే ఈ కోర్సుని పూర్తి చేశారు. ఆయన వయసులో సగం వయసున్న విద్యార్థులతో పోటీపడి మరీ..టాప్ 10లో నిలిచారు. ఆయన కేవలం రిటైర్డ్ వ్యక్తి మాత్రమే కాదని 2022లో పదవీవిరమణ చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్లోని మున్సిపల్ కార్పొరేషన్లను పర్యవేక్షంచే నియంత్రణ సంస్థలో డిప్యూటీ సీఈవోగా చేరారు. ఆయన ప్రతి వారం రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యికిలోమీటర్లు మేర జిల్లాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో పనులను సమీక్షిస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ..తన తండ్రి చదువుకోవడానికి సమయం కేటయించుకుంటారు. ఆ ప్రయాణాల మధ్యలోనే నోట్స్ రాసుకుని వాటిని చదివి, యువ విద్యార్థుల కంటే మెరుగ్గా పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మా నాన్న గారు" అని రాసుకొచ్చారు. అయినా జీవితం మరింత బిజీగా మారేక్దొద్దీ చాలామంది నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టడం మానేస్తుంటారని, అది తాను చూశానని అన్నాడు. అంతేగాదు జీవితంలో ఇక కొత్తగా నేర్చకోవాలనే ఆశ ఉన్నా..ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేరని, వాస్తవికతలో అది ఆచరణసాధ్యం కూడానని చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రి అలాంటి ఆలోచనను దరిదాపుల్లోకి రానివ్వలేదని, ఆయన 40, 60ల కూడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టేవారని అన్నారు. ఇక తన తండ్రి ఎంటెక్తో ఆగడం లేదని, ఐఐఎం లక్నోలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో చేరడం ఆయన తదుపరి లక్ష్యమని అన్నాడు. పైగా చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకోవడం మానేసే వయసులో దరఖాస్తు పత్రాలు నింపుతారని అన్నాడు. అందువల్ల తనకు నైపుణ్యాను పెంపొందించుకోవడంలో ప్రేరణ పొందాల్సిన అవసరం ఏర్పడలేదని ఎందుకంటే అది అది తన డీఎన్ఏలోనే ఉందని చమత్కరిస్తూ.. పోస్ట్ని ముగించారు శశాంక్ శ్రీ వాస్తవ్. చాలామంది నెటిజన్లు చదువు కొనసాగించడంపై స్ఫూర్తిని నింపిందన్నారు. ఆయన్ను చూసి చాలా గర్వపడాలి, చాలా నేర్చుకోవాలి కూడా అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!) -
సూపర్మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్లోనూ ‘సూపర్మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
‘బయటకు రా’ అంటూ పిలుపు.. ఒక్క కాల్తో ముగిసిన టిక్టాక్ స్టార్ కథ!
సోషల్ మీడియాలో ఆమె ఓ స్టార్.. లక్షలాది మంది ఆమెను ఫాలో అయ్యారు.. కోట్లాది లైక్స్ ఆమె సొంతం. కానీ ఓ ఫోన్ కాల్ ఆమె జీవితానికి చివరి కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. “బయటకు రా” అంటూ వచ్చిన పిలుపుతో ఇంటి నుంచి బయలుదేరిన 28 ఏళ్ల పాకిస్థాన్ టిక్టాక్ క్రియేటర్ షమ్సో బీబీ.. కొద్ది సేపటికే రక్తపు మడుగులో విగతజీవిగా మారారు. ఇస్లామాబాద్ సమీపంలోని టాక్సిలాలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె కారును అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. ఒక్క బుల్లెట్ ఆమె మెడలోకి దూసుకెళ్లింది.. కారు అదుపుతప్పి డంపర్ను ఢీకొట్టింది.. 13 లక్షల మంది ఫాలో అయ్యే ఆ సోషల్ మీడియా స్టార్ కథ అక్కడే ముగిసిపోయింది.ఆన్లైన్లో అయేషా గిలమానా పేరుతో గుర్తింపు పొందిన షమ్సో బీబీ గత మూడు, నాలుగేళ్లుగా టిక్టాక్ వీడియోలు చేస్తూ భారీ క్రేజ్ సంపాదించారు. ఆమె ఖాతాకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, కోట్లాది లైక్స్ ఉన్నాయి. అయితే ఆగస్టు 14న జరిగిన ఈ దాడితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు ముందు కాశిఫ్ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్ చేసి ఇంటి బయటకు రావాలని చెప్పినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో బయలుదేరారు. మార్కెట్ సమీపానికి చేరుకోగానే బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో ఒకరు తుపాకీ తీసి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్ షమ్సో మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు డంపర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరి కూడా తీవ్రంగా గాయపడ్డారు.🚨 Pakistani TikTok Star Shot Dead🇵🇰 TikTok creator Shamsu Bibi, aka Ayesha Gilamana (28), was shot dead in Taxila, Punjab, on Pakistan Independence DayTwo bikers allegedly opened fire near a petrol station#Taxila #ShamsuBibi #بی_ایل_اے_کی_پھٹ_گئی #felizdiadelniño pic.twitter.com/64vjc06gW9— Daily Briefs (@Daily_Briefs_) August 17, 2026ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు వచ్చినట్లు సమాచారం. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును ఆపడం, ఒకరు తుపాకీ తీసి కాల్పులు జరపడం అందులో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది యాదృచ్ఛిక దాడి కాదని.. పక్కా ప్లాన్తోనే షమ్సోను టార్గెట్ చేశారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. షమ్సోకు ఇప్పటికే ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు ఆమె తండ్రి చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమెను బెదిరించారని ఆరోపించారు. వారిలో ఒకరే హత్య వెనుక ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ముందే హెచ్చరికలు.. ఈ కేసులో పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిలో షూటర్కు పారిపోవడానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూడా ఉన్నారు. అయితే షమ్సోను చంపాలని ఆదేశించింది ఎవరు? ఆమెను ఇంటి నుంచి బయటకు రప్పించిన ఫోన్ కాల్ వెనుక ఎవరు ఉన్నారు? డబ్బుల వివాదమే కారణమా? అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.నిన్నటి వరకు ఆమె వీడియోలతో సందడి చేసిన టిక్టాక్ ఖాతా ఇప్పుడు లేదు. కుటుంబం ఆమె ఖాతాను తొలగించింది. యూట్యూబ్ పేజీ కూడా కనిపించడం లేదని సమాచారం. లక్షలాది మంది ఫాలోవర్లు.. కోట్లాది లైక్స్.. ఒక్క ఫోన్ కాల్తో మొదలైన ప్రయాణం.. బైక్పై వచ్చిన రెండు తుపాకీ గుళ్లతో విషాదాంతం. షమ్సో బీబీ హత్య వెనుక అసలు కథేంటన్నదే ఇప్పుడు పాకిస్థాన్లో హాట్టాపిక్గా మారింది. -
లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!
పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లే స్ఫూర్తిదాయకం కాదు అని చెప్పే కథ. మన చుట్టూ చిన్న చితక పనులు చేస్తూ..నిరంతరం కష్టపడతూ ఉన్నతంగా బతికే స్థాయికి వచ్చినవాళ్లు ఉన్నారు. మనం అటుకేసి చూడం. గొప్ప గొప్పోళ్లు కంటికి కనిపించినట్లు..కష్టజీవులు వైపుకి దృష్టిసారించం. వాళ్లను ఒక్కసారి పలకరిస్తే..కష్టం అంటే ఏంటో..పైకి రావడం ఎలాగో కచ్చితంగా తెలుసుంది. అందుకు ఈ కంటెక్ క్రియేటర్ సోషల్ మీడియా షేర్చేసిన ప్రేరణాత్మక స్టోరీనే ఉదాహరణ. ప్రస్తుతం ఈ కథ నెట్టింట వైరల్గా మారింది. డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ స్ఫూర్తిదాయక వీడియోని పంచుకున్నారు. అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన లస్సీ వ్యాపారితో డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ జరిపిన సంభాషణ కనిపిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో లస్సీ వ్యాపారి ఒక విషాదాన్ని దిగమింగుకుంటూ..సాగించిన తన అద్భుత జర్నీ గురించి మాట్లాడారు. తాను చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబా భారమంతా తనపై పడిందని చెప్పుకొచ్చాడు. తాను 11 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతను మోసినట్లు తెలిపాడు. అప్పటి నుంచే రోజు కషపడి పనిచేసేవాడినని చెప్పాడు. అప్పట్లో లస్సీ అమ్ముతూ రోజుకి కేవలం రూ. 250లు సంపాదించేవాడినని అన్నాడు. అలా సంపాదించిన డబ్బుతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను పెళ్లిచేసుకుని ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని వెల్లడించాడు. తన తండ్రి తమకంటూ ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదని బాధపడుతూనే చనిపోయాడని..ఆ నేపథ్యంలోనే ఆహర్నిశలు కష్టపడి తనకంటూ ఒక ఇల్లు కూడా నిర్మించుకోగలిగానని అన్నాడు. ప్రస్తుతం దేవుడి దయవల్ల బాగానే సంపాదిస్తున్నానని, ఇప్పుడు లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేల నుంచి రూ. 90 వేలు వరకు ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అదంతా విని కంటెంట్ క్రియేటర్ జీవితంలో అస్సలు ఏ అద్భుతం జరగదని అనుకునేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారని అడగగా..ఆ వ్యక్తి మిత్రులారా కష్టపడి పనిచేయండి, కష్టపడటం ఆపకపోతే..మిమ్మల్ని తప్పక దేవుడు ఆశ్వీరదిస్తాడు, అద్భుతం జరిగినట్లుగా గొప్పవారవుతారని అన్నాడు. ఆ వ్యక్తితో సంభాషణ ముగిసిన వెంటనే ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూ అనుభవాలలో ఇది అత్యంత అద్భుతమైనదని కంటెంట్ క్రియేటర్ వర్మ అన్నాడు. ఈ వ్యక్తి కథ మీరు ఏదైనా సాధించాలనుకుంటే, దాన్ని సాధించగలరని చూపిస్తుంది. ఇక్కడ విజయం సాధించడానికి మీకు కావలసిందల్లా దృఢ సంకల్పం ఒక్కటే అంటూ తన సంభాషణను ముగించాడు డిజిటల్ క్రియేటర్ వర్మ. నెటిజన్లు కూడా అద్భుతమైన కథను పంచుకున్నారని, కఠిన వాస్తవాలతో కూడిన ఇలాంటి కథలే మనసుని తాకుతాయంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upen Verma (@upenverma) (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్
పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరిగిన ఒక వివాహంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి అనగా వరుడిని చూసిన వధువు హతాశురాలైంది. తనకు కాబోయే భర్త ఇతను కాదు అంటూ పెళ్లికి నిరాకరించడంతో వివాదం మొదలైంది.రాజస్థాన్లోని ఛత్తర్గఢ్ నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు, చివరకు వధువు లేకుండానే తిరిగి వెళ్ళిపోయిన ఘటన వైరల్గా మారింది.పోలీసుల సమాచారం ప్రకారం, బంధుమిత్రుల సందడి మధ్య వివాహ తంతు కొనసాగుతోంది. అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేసే వేడుక ప్రారంభానికి ముందు వరుడిని చూసిన వధువు షాకైంది. ఈ పెళ్లి నాకొద్దు అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. పెళ్లికి ముందు తనకు వేరొక యువకుడి ఫోటో చూపించి, వివాహ వేదిక వద్ద వరుడిగా వేరే వ్యక్తిని తీసుకొచ్చారని వధువు ఆరోపించింది. అయితే, వరుడి కుటుంబం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఈ పెళ్లి కుదిరిందని వరుడి కుటుంబం వాదించింది. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం నిశ్చయమైందని, పెళ్లికి ముందు ఇరు పక్షాలు ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయని వారు చెప్పారు. వరుడి ఫోటోలను ముందుగానే చూపించామని, మధ్యవర్తులు , వధువు తల్లి వరుడి తాత (తల్లి వైపు) మహేంద్ర సింగ్ తెలిపారు. అయినా సరే ససేమిరా అన్న వధువు మాత్రం పెళ్లికి గట్టిగా నిరాకరించింది. ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?మరోవైపు రెండు రోజుల క్రితమే వరుడి కుటుంబం నుండి ఫిర్యాదు అందిందని, దానిపై దర్యాప్తు ప్రారంభించా మని గురు హర్ సహాయ్ డీఎస్పీ తేజిందర్పాల్ సింగ్ తెలిపారు. విచారణ సమయంలో ఇరు పక్షాలు తమ వాదనలను వినిపించాయనీ, ఈ సమస్యను పరిష్కరించుకున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఎలా ముగింసిందనే దానిపై స్పష్టత లేదు. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే! -
ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఆ పాట.. 14 ఏళ్లు గడిచినా యూట్యూబ్లో తన జోరు కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అలరించిన ఆ సాంగ్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు యూట్యూబ్లో బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన అదే పాట.. ఇప్పుడు 6 బిలియన్ మార్క్ను అందుకుని తన సత్తా చాటింది. అంతటి ఆదరణ పొందిన ఈ పాట.. సింగర్ పీఎస్వైకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.దక్షిణ కొరియా పాప్ స్టార్ పీఎస్వై పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ తాజాగా 6 బిలియన్ వ్యూస్ దాటి మరో సెన్సేషన్గా మారింది. 2012 జులైలో విడుదలైన ఈ పాట.. అదే ఏడాది డిసెంబర్లో యూట్యూబ్లో ఫస్ట్ బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించింది. 2013లో ఈ పాటకు సుమారు 1.23 బిలియన్ యూట్యూబ్ వ్యూస్ ఉన్న సమయంలో.. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నికేష్ అరోరా ఈ వీడియోకు 8 మిలియన్ డాలర్లకుపైగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి లెక్కల ప్రకారం 8 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లకుపైనే.6 బిలియన్ల వ్యూస్తో రెవెన్యూ ఎంతంటే..తాజాగా ‘గంగ్నమ్ స్టైల్’ 6 బిలియన్ వ్యూస్ దాటింది. 2023 డిసెంబర్లో 5 బిలియన్ మార్క్ చేరుకున్న ఈ వీడియో.. మరో బిలియన్ వ్యూస్ సాధించడానికి రెండేళ్ల ఏడు నెలల సమయం తీసుకుంది. అంటే.. విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదన్నమాట.యాడ్ ఆదాయ రేటును కేవలం సూచికగా తీసుకుని 6 బిలియన్ వ్యూస్కు వర్తింపజేస్తే.. యూట్యూబ్ ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం దాదాపు రూ.250–300 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే యూట్యూబ్ ప్రకటన రేట్లు, ప్రేక్షకులు ఉన్న దేశాలు, మానిటైజేషన్, యాడ్ వీక్షణలు తదితర అంశాల ఆధారంగా ఈ ఆదాయం మారుతుంది. ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిపి చూస్తే.. ఎంత లేదన్నా ‘గంగ్నమ్ స్టైల్’ ద్వారా మొత్తం సంపాదన సుమారు రూ.800 కోట్లకుపైగా ఉండొచ్చన్నది అంచనా.ఆ మొత్తం మొత్తం పీఎస్వైకే దక్కుతుందా?‘గంగ్నమ్ స్టైల్’కు యూట్యూబ్ మాత్రమే ఆదాయ వనరు కాదు. డిజిటల్ డౌన్లోడ్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైసెన్సింగ్, ప్రకటనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. 2013లోనే ఈ పాట డిజిటల్ డౌన్లోడ్లు, ప్రకటనలు, ఆన్-డిమాండ్ సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పీఎస్వైకి దక్కదు. ప్లాట్ఫామ్ వాటాతో పాటు మ్యూజిక్, వీడియో హక్కుదారులు, రికార్డ్ లేబుల్, ఇతర భాగస్వాములకు కూడా ఆదాయం పంచబడుతుంది. అయినప్పటికీ.. అన్ని ఆదాయ మార్గాలను కలిపి చూస్తే పీఎస్వైకి ఈ పాట ద్వారా భారీ మొత్తమే దక్కినట్లు చెప్పొచ్చు. ఆ పాట ఎలా పుట్టిందంటే..‘గంగ్నమ్ స్టైల్’ పుట్టుక వెనుక దక్షిణ కొరియాలోని గంగ్నమ్ ప్రాంత జీవనశైలే ప్రధాన ప్రేరణ. గంగ్నమ్లో పుట్టి పెరిగిన పీఎస్వై.. అక్కడి ఉన్నతవర్గాల జీవనశైలి, వారి ఫ్యాషన్, హంగూ ఆర్భాటాలను తనదైన శైలిలో పాటగా మలిచారు. యూ జంగ్ హ్యుంగ్తో కలిసి సాహిత్యం రాయడంతో పాటు మ్యూజిక్ను రూపొందించిన పీఎస్వై.. సరదా పదాలు, వ్యంగ్యభరితమైన భావన, ఆకట్టుకునే బీట్ను జోడించారు. ఇక గుర్రపు స్వారీని తలపించే డ్యాన్స్ స్టెప్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇలా పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ పాట.. ప్రపంచ సంగీత చరిత్రనే మార్చేసే సంచలనంగా మారింది.ప్రపంచాన్ని ఊపేసిన గుర్రపు స్టెప్పు2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ కొరియన్ భాషలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎస్వై వేసిన ప్రత్యేకమైన గుర్రపు స్వారీ తరహా డ్యాన్స్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అమెరికా బిల్బోర్డ్ హాట్ 100లో ఈ పాట ఏడు వారాల పాటు రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్ చరిత్రలో 1 బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా ‘గంగ్నమ్ స్టైల్’ నిలిచింది. ఈ పాట తర్వాత.. పీఎస్వై నుంచి ఆ స్థాయి ఆల్బమ్ రాలేదు. కానీ, అప్పటి నుంచి ఆయన టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా క్రేజ్ లేని రోజుల్లోనే.. యూట్యూబ్తో గంగ్నమ్ స్టైల్ సంచనాలు సృష్టించడం, ఇప్పుడు 6 బిలియన్ వ్యూస్తో మరో మైలురాయిని అందుకోవడం.. క్రేజ్ను ఏదీ అడ్డుకోలేదని నిరూపించింది. -
ఫ్రీ పెట్రోల్ కోసం ఆశగా వెళ్తే..
కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవలి కాలంలో జనాలను ఆకట్టుకునే పేరుతో చేసే ప్రచారాలు ఎంతవరకు నిజమో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యం పేరిట డబ్బులు వసూలు చేసే స్కాములు, సాయం పేరుతో పెయిడ్ వీడియోలు ఇలా ఎన్నో ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో ‘ఫ్రీ పెట్రోల్’ అంటూ వచ్చిన ఓ ప్రకటనను నమ్మి.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. తీరా అక్కడ వారికి ఊహించని పరిణామం ఎదురైంది.రాకేశ్ ట్రెహాన్ అనే వ్యక్తి సోషల్ సర్వీస్ పేరిట నెట్టింట కాస్త ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. అయితే.. ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తానంటూ ప్రకటించడంతో.. మంగళవారం సాయంత్రం ఛండీగడ్(పంజాబ్) వాహనదారులు బంకుల వద్దకు టూవీలర్లు, కార్లు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. అయితే అప్పటికే భారీ వర్షం మొదలైంది. ఉచితంగా వచ్చే పెట్రోల్ కోసం జనాలు దానిని పెద్దగా లెక్క చేయలేదు. ఈ లోపు క్యూ లైన్ భారీగా పెరిగిపోయింది.అయితే చెప్పిన టైంకి పెట్రోల్ పంపిణీ ప్రారంభం కాలేదు. ఈలోపు బంక్ల వద్ద పరిస్థితులు చేజారిపోతుండడంతో నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి వాహనదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈలోపు బంక్వాళ్లు కేవలం 15 మందికి ఉచితంగా పెట్రోల్ కొట్టి.. మిగతావాళ్లకు నో చెప్పారు. ఫ్రీ టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో మిగతా వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉచిత పెట్రోల్ ఇస్తారన్న సమాచారంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినవారిని ఇలా వెనక్కి పంపడం ఏమిటని ప్రశ్నించారు. రాకేశ్ను బండ బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.Chandigarh: The city witnessed chaos after a video of a petrol langar organized by Amritsar-based Rakesh Trehan, alias Raja Di King, went viral. A large crowd had gathered at the spot before the police arrived, and after their arrival, the crowd was evacuated from the petrol… pic.twitter.com/pA1iPQ4mh8— IANS (@ians_india) August 18, 2026 ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి వచ్చిన సుమన్ అనే మహిళ.. పెట్రోల్ ఇవ్వడానికి పంపు సిబ్బంది అనుమతించలేదని తెలిపారు. కేవలం 10–15 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినట్లు చెప్పారు. అన్షు అనే మరో వ్యక్తి తాను దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షంలో పెట్రోల్ పంపు వద్ద వేచి చూసినట్లు తెలిపారు.రాకేశ్ రియాక్షన్పరిస్థితిపై రాకేశ్ ట్రెహాన్ స్పందించారు. సోషల్ మీడియాలో ‘రాజా ది కింగ్’గా గుర్తింపు పొందిన ఆయన.. భారీ వర్షం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. వర్షంలో ప్రజలు ఇబ్బందులు పడటం, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో పెట్రోల్ పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు. అక్కడికి వచ్చినవారికి ఆయన క్షమాపణలు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.ఆగస్టు 21 నుంచి మళ్లీ.. మూడు రోజుల పాటు!తాజా ప్రకటన ప్రకారం ‘పెట్రోల్ లంగర్’ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు రాకేశ్ ట్రెహాన్ తెలిపారు. అదే సమయం, అదే ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెట్రోల్ పంపిణీ కోసం ఆగస్టు 21న కూపన్లు లేదంటే కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత పెట్రోల్ పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు. -
విషపూరితమైన పాము కాటు : 150 చెంపదెబ్బలు కొట్టి కాపాడుకున్న అన్న
సోదరుడిని కాపాడుకోవాలనే తపనతో ఒక వ్యక్తి అతడిని ఏకంగా 150 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. వైద్యుల సలహా మేరకు అలా చేశాడు. అదేంటి అనుకుంటున్నారా? అయితే నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్కి చెందిన 21 ఏళ్ల అరుణ్ని అత్యంత విషపూరితమైన పాము కాటు వేసింది. నీళ్లు తెచ్చుకోవడానికి పొలానికి వెళ్లినపుడు గడ్డి బస్తాను పైకి లేపుతుండగా, అందులో దాగి ఉన్న పాము అతన్ని కాటు వేసింది.దీంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. క్రమంగా అతని పరిస్థితి విషమంగా మారిపోతోంది. అరుణ్ అరుపులు విన్న అతని అన్నయ్య ఆకాష్ వెంటనే అక్కడికి చేరుకుని, అతన్ని రోడ్డు వైపు తీసుకువెళ్లాడు. అరుణ్ పరిస్థితి మరింత క్షీణించడంతో అంబులెన్స్ ,పోలీసులకు సమాచారం అందించారు.మరోవైపు అరుణ్ పరిస్థితి తీవ్రతను గమనించిన ఒక మెడికల్ స్టోర్ యజమాని, ఆ సోదరులిద్దరినీ తన మోటార్సైకిల్పై మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడు. మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ విభాగంలో, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (EMO) డాక్టర్ షేర్ సింగ్, ఆయన బృందం వెంటనే చికిత్స ప్రారంభించారు.రెండు గంటల వ్యవధిలో 15 డోసుల యాంటీ-వెనం (విష విరుగుడు మందు) ఇచ్చారు, ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఆ సమయంలో అతణ్ణి నిద్రపోనివ్వకుండా చూడాలని, మెలకువగా ఉంచాలను వైద్యులు సూచించారు. దీంతో ఆకాష్ తన సోదరుడి పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే, అతనిపై నీళ్లు చల్లుతూ, అరుణ్ని 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొడుతూ అతణ్ణి మెలకువతో ఉండేలా కాపాలా కాశాడు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్యపాము కాటు కేసుల్లో సాధారణంగా ఐదు డోసుల యాంటీ-వెనం ఇస్తామని డాక్టర్ షేర్ సింగ్ తెలిపారు. అయితే, అరుణ్పై విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రెండు గంటల వ్యవధిలో మొత్తం 15 డోసుల యాంటీ-వెనం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అరుణ్ ప్రాణాలను కాపాడటంలో సహాయపడినందుకు కుటుంబ సభ్యులు వైద్యులకు , మెడికల్ స్టోర్ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!నోట్ : పాము కాటుకు గురైనప్పుడు వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా యాంటి వెనమ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. ఆందోళన,భయం అస్సలు మంచిది కాదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
ఇక ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ మునుపటిలా ఉండవు!
సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది?2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.నేటి నుంచే కీలక విచారణమెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.మెటా ఓడితే ఏం మారొచ్చు?ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.అందులో ముఖ్యమైనవి..టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్ను నిలిపివేయడం.టీనేజర్లను ఎక్కువసేపు యాప్లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్లలో మార్పులు చేయడం.ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.వీడియోలు ఆటోమేటిక్గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్ను నిలిపివేయడం.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం. ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్ఫామ్లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.లైక్ బటనే కీలకం?సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మెటా వాదన ఏంటి?అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసు చాలా పెద్దదే!న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?. మెటా ఓడితే.. లైక్ల సంఖ్య కనిపించని ఇన్స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది. -
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్ (KGF) స్టార్, యష్ (Yash)కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట సందడిగా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత యష్పై క్రేజ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సౌత్ సూపర్ స్టార్ యష్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే. ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతారని మీకు తెలుసా?అవును ఈ కన్నడ హీరో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యేది కేవలం ఒకే ఒక్కరిని. ఇటీవల ఒకటీవీ షోలో యష్ తన రాబోయే చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా పంచుకున్నారు. ఆ సమయంలో, ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఒక అమ్మాయి యష్ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?” అన్న ప్రశ్నకు యశ్ ఇచ్చిన సమాధానం అతని లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.దీనికి సమాధానంగాయష్ నవ్వుతూ, “ఆమె నా భార్య” ఎంతో ప్రేమగా బదులిచ్చారు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. "ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు" అని సరదాగా వ్యాఖ్యానించారు. "నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం." అంటూ చెప్పారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంరెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణునిగా, యశ్ రావణునిగా కనిపించనున్నారు. ఇక సన్నీ డియోల్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. 'రామాయణం మొదటి భాగం' విదేశాలలో నవంబర్ 6, 2026న, భారతదేశంలో నవంబర్ 8, 2026న విడుదల కానుంది. 'రామాయణం: రెండవ భాగం' 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. 'రామాయణం'తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. యష్తో పాటు, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార మరియు రుక్మిణి వంటి కథానాయికలు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చివరకు, ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్కు బాబా రామ్దేవ్ హెచ్చరికకాగా యష్ రాధికా పండిట్ 2007లో 'నంద గోకుల' అనే కన్నడ సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి, 2016 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Coreculture (@coreculture.inn) -
ఇన్ఫ్లుయెన్సర్ కావడం ఇక ఈజీ కాదు!
సోషల్ మీడియా స్టార్ కావడం.. ఇక సరదా వ్యవహారం కాదు. కంటెంట్ క్రియేషన్ను ఓ ప్రొఫెషన్గా గుర్తిస్తూ ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఏకంగా డిగ్రీ కోర్సును ప్రారంభించింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వేదికలపై కెరీర్ నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రొఫెనల్ డిగ్రీ మస్ట్ అంటే ఎలా? అనే చర్చ జోరందుకుంది.ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. కంటెంట్ పేరిట బోలెడంత క్రింజ్ కనిపిస్తుంటుంది. అయితే దానికి చెక్ పెట్టాలని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) నిర్ణయించింది. స్వచ్ఛమైన కంటెంట్ క్రియేషన్లో భాగంగా బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. యూనివర్సిటీలోని వాల్టర్ క్రాంకైట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. కేవలం వీడియోలు చేయడం, వైరల్ కావడం కాకుండా.. కంటెంట్ రూపకల్పన, పాడ్కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ప్రెజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.వైరల్ అయితే చాలు అనుకోవద్దు..ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ భారీగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘క్రియేటర్ ఎకానమీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇన్ఫ్లుయెన్సర్ జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కొత్త కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకులతో అనుసంధానం కొనసాగించడం, బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఆదాయంలో అనిశ్చితిని ఎదుర్కోవడం వంటి సవాళ్లు ఉంటాయని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్ఫారమ్లు కంటెంట్ విషయంలో కొత్త(కఠిన) రూల్స్ తెస్తున్న సంగతి తెలిసిందే.డిగ్రీతో స్టార్ అవుతారా?కంటెంట్ క్రియేషన్లో డిగ్రీ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా స్టార్ కాలేరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ కావడానికి ప్రతిభతో పాటు అదృష్టం, సరైన వ్యూహం, నిరంతర శ్రమ అవసరమని చెబుతున్నారు. అయితే ఈ కోర్సు ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మార్కెటింగ్, వ్యక్తిగత బ్రాండింగ్, నెట్వర్కింగ్ వంటి అంశాల్లో అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. సోషల్ మీడియా రంగంలోనే కాకుండా మీడియా, ప్రకటనలు, డిజిటల్ సంస్థల్లోనూ ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.క్రియేటర్ ఎకానమీకి కొత్త గుర్తింపుఅమెరికాలో కంటెంట్ క్రియేషన్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బిలియన్ల డాలర్ల ఆదాయం చలామణి అవుతోంది. దీంతో ఇంతకాలం కేవలం ‘టైమ్పాస్’గా భావించిన సోషల్ మీడియా కంటెంట్ సృష్టి.. ఇప్పుడు ఓ అధికారిక కెరీర్ మార్గంగా గుర్తింపు పొందుతోంది. అందుకే ఇకపై ‘ఇన్ఫ్లుయెన్సర్ అవుతా’ అంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఈ డిగ్రీ ఇస్తోంది. అయితే ఫాలోవర్ల సంఖ్య కంటే.. నాణ్యమైన కంటెంట్, సృజనాత్మకత, క్రమశిక్షణే విజయానికి అసలు ఆధారమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. -
24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుండగానే ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ ’ అనే పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు సంచలనంగా మారాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ అకౌంట్కు 62 పోస్ట్లను పోస్ట్ చేయగా, సుమారు 35 మందిని ఫాలో అవుతోంది. దీంతో సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్పై హెచ్చరికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెలుగులోకి రావడం విశేషం. మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలు ,నీడలా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ, దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇపుడిక దిమాగీ నక్సల్స్ను పని పడతామని తన ప్రసంగంలో మోదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.🇮🇳 DIMAAGI NAXAL JANTA PARTY — DJP 🇮🇳🚨🚨 01. NATION RE-BUILDING • ECONOMIC CONSTRUCTION🏗️ BUILD THE NATION. REBUILD THE ECONOMY.🇮🇳 $10 TRILLION ECONOMY BY 2035📈 Required nominal growth: ~10.5% CAGR⚙️ ECONOMIC RECONSTRUCTION🏭 Manufacturing: ~17% → 25% of GDP📈… pic.twitter.com/36APNRh3ua— Dimaagi Naxal Janta Party 🧠 (@DJPforINDIA) August 16, 2026 అయితే, ఈ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఖాతాను ఖచ్చితంగా ఎవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మరోవైపు "తెలివిగా ఉండండి.. మూర్ఖంగా ఉండకండి. ప్రశ్నలు అడగండి.. బానిసలా ఉండకండి" అంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక పోస్ట్ను 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' ఖాతా రీట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం, "నేను 'దిమాగీ నక్సల్' అయినందుకు గర్వపడుతున్నాను" అని స్పందించడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.కిరణ్ రిజుజు వివరణఈ వివాదం నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రకటనపై స్పష్టతనిచ్చారు. "ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను నేరుగా 'మైండ్-మేడ్ నక్సల్స్' అని పిలవలేదని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేవారు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు లేదా ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారతదేశం నుండి వేరుచేసే 'చికెన్ నెక్' ప్రాంతం దిగ్బంధనానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించాదని పేర్కొన్నారు. కాగా దేశ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యలకు నిరసనగా పుట్టకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సోషల్ మీడియాలో జెన్జీ నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు నీట్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమం, కేంద్రమంత్రి రాజీనామా దాకా కొనసాగిన సంగతి తెలిసిందే. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ
సాధారణంగా మనకు నచ్చిన వాళ్లు లేదా మనకు బాగా పరిచయం ఉన్న పొరుగింటి వాళ్లు శాశ్వతంగా వేరోచోటికి వెళ్లిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది. అది సహజం. పైగా ఒకే దేశం, ఒకే జాతికి సులభంగా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వెళ్లిపోతున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్. కానీ దేశం కానీ దేశంలో భావోద్వేగంగా వీడ్కోలు చెప్పడం అసాధారణం. కానీ అలాంటి భావోద్వేగ సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాను విడిచివెళ్లిపోతున్న భారతీయ జంటకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పొరగునే ఉండే అమెరికన్ మహిళ. ఒక్కక్షణం అది భావోద్వేగ వీడ్కోలుగా మారిపోయింది. విజయ్ కొక్కెరగడ్డ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోని పంచుకున్నారు. డెట్రాయిట్లో విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ దృశ్యం చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఆ వీడియోలో విజయ్ అమెరికాలోని తన ఇంటి బయట నిలబడి ఉండగా, పోరుగునే ఉండే అమెరికన్ మహిళ వాళ్లను పట్టుకుని భావోద్వగానికి గురవ్వుతుంది. ప్లీజ్ వెళ్లిపోకండి అని కన్నీటిపర్యంతమవుతుంది. అయితే విజయ్ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో రికార్డు చేయడం గురించి విజయ్కి తెలియదట. తన స్నేహితుడు తనకి చెప్పకుండానే ఈ వీడ్కోలుని చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అతనే తనకు ఈ వీడియో పంపడంతో షేర్ చేసినట్లు తెలిపాడు. ఒక రకంగా ఈ వీడియో తన వద్ద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇది నిజమైన భావోద్వేగాలు, ప్రేమను చూపించిందని పేర్కొంటూ తన పోస్ట్ని ముగించాడు. నిజంగా గ్రేట్ కదూ..పరాయి దేశస్థులైనా..మనలానే వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురవ్వడం గ్రేట్ కదూ..!. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :(చదవండి: తొమ్మిది పదుల వయసులో అథ్లెటిక్గా బామ్మ..! ఆఖరికి వందేళ్ల తర్వాత కూడా..) -
ఐదు నిమిషాలు లేట్.. ఫోన్ లాక్కుని డెలివరీ బాయ్పై దాడి.. ఆపై బిగ్ ట్విస్ట్!
ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు.ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.An FIR has been registered against the couple who beat up a Blinkit delivery boy in Meerut, UP. Both have fled after locking their flat. Police raids are ongoing. pic.twitter.com/Sfke34hWFj— subash kumar (@Krishan10_) August 15, 2026డెలివరీ ఏజెంట్ల బంద్..ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 34 ఏళ్ల యమన్ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని భవన్పూర్ పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల ఆలస్యం.. ఆపై గొడవ.. చివరకు సీసీటీవీలో బయటపడిన దాడి! ఈ ఘటన ఇప్పుడు డెలివరీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
రూ. 11.5 కోట్ల ఆస్తి, 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్సా? నెట్టింట ఒకటే చర్చ
పూణేకు చెందిన డింక్ కపుల్ (DINKడబుల్ ఇన్కమ్, నో కిడ్స్) 38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించారు. రూ. 11.5 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, వచ్చే మూడేళ్లలో రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అధిక పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కెరీర్ కంటే వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ దంపతులు.ఒత్తిడికి దూరంగా వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు సమాచారం. వీరి కథను ఒక బంధువు ఎక్స్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీరి ఆస్థులు, జీవనశైలిపై నెట్టింట ఆసక్తి నెలకొంది. ఈ జంట సంవత్సరాల తరబడి సంపదను కూడ గట్టుకున్నారని, కానీ ఇప్పుడు నిజంగా ఎంత డబ్బు సరిపోతుందని ప్రశ్నించుకుంటున్నారని ఆ బంధువు పేర్కొన్నారు.ఆ పోస్ట్ ప్రకారం, ఈ జంట మొత్తం ఆస్తి రూ.11. 5 కోట్లు. ఈ ఆస్తులలో రియల్ ఎస్టేట్లో సుమారు రూ. 3.2 కోట్లు, ఇండియన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో రూ. 1.8 కోట్లు, యూఎస్ ఈక్విటీలలో రూ. 5 కోట్లు, నగదు, పదవీ విరమణ పొదుపుల రూపంలో దాదాపు రూ. 1.5 కోట్లు ఉన్నాయి. వారి వార్షిక గృహ ఖర్చులు సుమారు రూ. 22 లక్షలుగా అంచనా. అయితే పదవీ విరమణ చేసిన తమ తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం, ఈ జంట మొదట్లో తమ సంపదను పెంచుకుంటూనే ఉండాలని ప్రణాళిక వేసుకున్నారని ఆ పోస్ట్ పేర్కొంది. అయితే, ఎక్కువ పని గంటలు, నిరంతర ఒత్తిడి,పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు వారి ప్రాధాన్యతలను పునరాలోచించుకునేలా చేశాయట. అందుకే తాము రిటైర్ అయ్యే ముందు మరో రెండు, మూడేళ్లు పనిచేసి మరికొంత సొమ్మును దాచుకోవాలని భావిస్తున్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్నెటిజన్ల రియాక్షన్స్ ఈ నిర్ణయం ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు నెటిజన్లు రూ. 11.5 కోట్ల నెట్వర్త్ , పిల్లలు లేని కుటుంబానికి రూ. 22 లక్షల వార్షిక ఖర్చుల దృష్ట్యా ఈ రిటైర్మెంట్ ప్లాన్ సరైనదేనని సమర్థించారు. మరికొందరు ముందస్తు రిటైర్మెంట్ (Early Retirement)కు సుదీర్ఘమైన ఆర్థిక ప్రణాళిక, నిరంతర క్యాష్ ఫ్లో అవసరమని హెచ్చరించారు. కెరీర్ పురోగతి కంటే ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం , సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని చాలామంది అభిప్రాయపడటం విశేషం.ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు -
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
సింగిల్ మదర్, రెండు జాబ్లు..!
మహిళలుగా మనం సాధించగల దానికి పరిమితి లేదు అని అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అని సదా నొక్కి చెబుతుంటారామె. అది నిజం అనేలా..మూసధోరణి పద్ధతులను చేధించి ముందుకు దూసుకుపోతున్న ఎన్నో స్ఫూర్తిదాయక కథలు మన కళ్లముందు కదలాడుతున్నాయి. అలాంటి స్ఫూర్తిదాయ కథే ఈ సింగిల్ మదర్ స్టోరీ. ఒక ప్రయాణికురాలు, మహిళా క్యాబ్ డ్రైవర్ మధ్య సాగిన సరదా సంభాషణా వీడియో కాస్తా..శక్తిమంతమైన మహిళా శక్తికి నిర్వచనంగా, స్ఫూర్తిదాయకంగా మారింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వీడియోని నటి ఆయుషి లాహిరి షేర్ చేసుకున్నారు. ఆయుషి ఒక క్యాబ్ని బుక్ చేసుకోగానే 'హైలైట్ ఆఫ్ ది డే' అనే శీర్షికతో ఒక ప్రముఖ క్యాబ్ డ్రైవర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ ప్రకారం, క్యాబ్ డ్రైవర్ ఒక మహిళ అని ఆశ్చర్యపోతుందామె. ఆ తర్వాత వారి మధ్య సరదాగా సంభాషణ సాగుతుంది. ఆ మహిళ క్యాబ్ డ్రైవర్ తన పేరు శోభనా అవస్థి అని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయుషి ఎప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నారని ప్రశ్నించగా జూన్ నెల నుంచి అని సమాధానమిస్తుంది. అయితే తాను కేవలం క్యాబ్ డ్రైవర్ని మాత్రమే కాదని తాను ప్రముఖ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ని అని కూడా చెబుతుంది. అయితే ప్రతిరోజు మేకప్ పని దొరకదని, పైగా తాను ఒంటరి తల్లినని పేర్కొంటుంది. తన కుటుంబాన్ని, పిల్లలను చూసుకునేందుకు ఇలా రెండు వృత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక తనకు డ్రైవింగ్ అంటే మహా ఇష్టమని, తాను 15 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద నేర్చుకున్నానని, చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ఎస్యూవీలతో సహా సుమారు 80 కార్లను నడిపినట్లు పేర్కొంది. ఆ నటి ఈ హృద్యమైన వీడియోకి "నా రోజులోని ముఖ్యాంశం" అనే క్యాప్షన్ని జోడించి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. నిజానికి పురుషాధిక్య రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోవడానికి మహిళలు ఎంతగా కష్టపడగలరో ఈ ఘటన నిరూపిస్తుంది. అందులోనూ ఒక సింగిల్ మదర్గా అటు మాతృత్యం ఇటు వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్న ఆమె నిజంగా సూపర్ విమెన్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Aayushi Lahiri (@aayushmatibhava)(చదవండి: 'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..) -
33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియో
పిల్లలకు తల్లిదండ్రుల తరువాత ఆప్తులు ఎవరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపాధ్యాయులే అని కచ్చితంగా చెప్పవచ్చు. పాఠాలు నేర్పిన గురువులను అనుకరిస్తూ బాల్యంలో బెత్తం పట్టుకుని టీచర్ వేషం వేసిన వాళ్లమే అందరమూ. మనుషులుగా ఎదగడంలో, పరిణతి చెందడంలో గురువుల ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ.తాజాగా గురు శిష్యుల అనుబంధానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. 33 ఏళ్లపాటు సేవలందించి, పదవీ విమరణచేసిన ఒక ప్రొఫెసర్కు విద్యార్థులు భావోద్వేగ వీడ్కోలు పలికారు. XLRI జంషెడ్పూర్లో సుదీర్ఘ అకాడమిక్ ప్రస్థానం ముగిసిన సందర్భంగా ప్రొఫెసర్ వేణుగోపాల్ పింగళికి వీడ్కోలు పలుకుతూ విద్యార్థులు,అధ్యాపకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న ప్రొఫెసర్ మనీష్ సింఘాల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. పదవీ విరమణ రోజు ప్రొఫెసర్ పింగళి చివరి క్లాస్ ముగించుకొని వచ్చీ రావడంతోనే సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తరగతి గది వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ఇది చూసిన ఆయన కూడా ఆశ్యర్యానికి గురైనారు. విద్యార్థులతో పాటు ప్రొఫెసర్కూడా ఎమోషనల్ అయ్యారు. ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ ప్రొఫెసర్ పింగళితో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రొఫెసర్ మనీష్ సింఘాల్ ఈ భావోద్వేగ క్షణాన్ని తన పోస్ట్లో పంచుకున్నారు. 2006 ఏప్రిల్ 13న సింఘాల్ XLRIలో చేరినప్పుడు పింగళి డీన్ (అకాడమిక్స్)గా ఉన్నారు. సింఘాల్ థీసిస్ పూర్తి చేయడానికి ఐఐఎమ్ కలకత్తా వెళ్లేందుకు లీవ్ల విషయంలో ప్రొఫెసర్ పింగళి ఎంతో మద్దతుగా నిలిచారని మనీష్ సింఘాల్ తెలిపారు. విద్యార్థుల వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రొఫెసర్ పింగళి రూపొందించిన ఫ్రేమ్వర్క్లు తరాల తరబడి ఎంబీఏ (MBA) విద్యార్థులకు మార్కెటింగ్పై అవగాహన పెంచాయని ఆయన రాసుకొచ్చారు.ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలుసోషల్ మీడియా స్పందనఈ వీడియో నెటిజన్లు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. నిజంగా అపూర్వమైన క్షణాలు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆయన వద్ద చదువుకునే భాగ్యం లభించిందని ఆయన విద్యార్థులు, ఆయన నిజంగా ఒక లెజెండ్ అంటూ ఇతరులు స్పందించారు. -
ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా
అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం అలజడి రేపింది. ఫ్లోరెస్ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్షాక్స్ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026#BREAKING : New Footage shows the Aftermath of Flores Indonesia Following 7.7m earthquake. 10 Dead & More than 1000 injured: Reports #Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert #IndonesiaEarthquake #EarthquakeNews #NaturalDisaster https://t.co/2V8cg4oQ7m pic.twitter.com/NrAVUu5g5u— Indian Observer (@ag_Journalist) August 15, 2026🚨 7.7-MAGNITUDE EARTHQUAKE HITS INDONESIA 🇮🇩A powerful earthquake struck off the coast of Ternate, causing panic and evacuations. Authorities are assessing possible damage and casualties.#Indonesia #Earthquake #BreakingNews #Ternate pic.twitter.com/WdP3JgvAGF— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026🚨🇮🇩 BREAKING | 7.7-Magnitude Earthquake Hits IndonesiaA powerful 7.7-magnitude #earthquake struck off #Flores Island in eastern #Indonesia early Saturday, causing buildings to collapse and triggering widespread panic and evacuations. A #tsunami warning was issued but later… pic.twitter.com/OKTgVxpBaH— pradhyumn sharma (@pradhyu78651514) August 15, 2026కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులుభూకంపం తీవ్రతకు ఫ్లోరెస్ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్సప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.సిక్కా ప్రాంతంలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్ భయంతో పరుగులు తీశారు. పాస్టర్ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.సునామీ హెచ్చరిక.. ఎత్తివేతఫ్లోరెస్ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.INDONESIA 🇮🇩 | #EARTHQUAKE 7.7 📹 IMAGES OF PANIC: Fear broke out near the coast of Ternate, and people had to be evacuated to safe areas. Authorities are assessing possible damage and casualties. There is a tsunami alert 🌊 pic.twitter.com/CSjsv5ckqW— Elizabeth J Trump (@eliza_Trump212) August 15, 2026మరింతగా మృతులు?ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలుహల్మహెరా దీవిలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.🚨 BREAKING: Double disaster strikes Indonesia!🌋 Mount Ibu erupted on Halmahera, blasting a massive 5 km ash plume into the sky.💥 Shortly after, a powerful 7.7-magnitude earthquake rocked Flores Island.🌊 A tsunami warning has been activated for coastal areas.Stay safe and… pic.twitter.com/xviRMcR5i6— Byte Brief (@Byte_brief) August 15, 2026రింగ్ ఆఫ్ ఫైర్..భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో ఆఫ్టర్షాక్స్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఇండిగో విమానం రద్దు : ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ వీడియో వైరల్
ముందస్తు సమాచారం ఇవ్వకుడానే విమానం రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు గ్రౌండ్స్టాప్తో గొడవకు దిగిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. బిడ్డ అనారోగ్యం కారణంగా ఆమె అత్యవసరంగా విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. తీరా ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ఆమె ఆవేదన గురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.ఆగస్టు 13న భువనేశ్వర్ నుండి కోల్కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 7352) సాంకేతిక లోపం వల్ల రద్దయింది. ఫ్లైట్ క్యాన్సిలేషన్తో తీవ్ర నిరాశకు గురైన ఒక మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలోని లగేజీ బెల్ట్పైకి ఎక్కి మరీ గొడవ చేయడం వివాదానికి దారి తీసింది. ఇండిగో సిబ్బంది డెస్క్పై ఉన్న పేపర్లు, డాక్యుమెంట్లను విసిరికొడుతూ సిబ్బందిపై విరుచుకుపడింది. విమానంలో ప్రయాణించాల్సిన ఆ మహిళ బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని, ("ఇన్ కా బచ్చా బిమార్ హై") అందుకే ఆమె అంత ఆందోళన చెందిందని అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు చెప్పారు. తోటి ప్రయాణికులు నీళ్లు ఇచ్చి ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరికి సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది జోక్యం చేసుకుని, మీరు ఎయిర్పోర్ట్ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారంటూ హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.🚨Woman travelling with her sick child creates ruckus at Bhubaneswar Airport after IndiGo cancelled the Kolkata-bound flight over technical glitch without updates pic.twitter.com/nfXZ8NC40F— The Tatva (@thetatvaindia) August 14, 2026 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. గంటల తరబడి వేచి చూసిన తర్వాత సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మరికొందరు ఇండిగోను తప్పుపట్టారు. ఆమె ప్రవర్తన తప్పే అయినప్పటికీ ఆమె కోపానికి కారణాన్ని, మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని కొందరు కోరారు.మరోవైపు విమానాలు రద్దయితే గ్రౌండ్ స్టాఫ్పై ప్రతాపం చూపడం సరికాదని, వారు కేవలం విధి నిర్వహణలో ఉంటారని నెటిజన్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.ఎయిర్పోర్ట్ ఆస్తిని పాడుచేసినందుకు మరియు భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెను 'నో-ఫ్లై లిస్ట్' (విమాన ప్రయాణాల నుంచి నిషేధం)లో పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.ఇండిగో స్పందనఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది."ప్రీ-డిపార్చర్ తనిఖీలలో సాంకేతిక లోపం గుర్తించడం వల్ల సురక్షిత చర్యల్లో భాగంగా విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఆహారం, బస (అకామడేషన్), ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు లేదా పూర్తి రీఫండ్ వంటి సౌకర్యాలు కల్పించాం. విమానాశ్రయం ఆస్తికి నష్టం కలిగించి నియమాలు ఉల్లంఘించిన సదరు మహిళను 'అన్రూలీ ప్యాసింజర్' (Unruly Passenger) గా గుర్తించి నిబంధనల ప్రకారం భద్రతా సంస్థలకు అప్పగించామని తెలిపింది. -
కోటి రూపాయల జాబ్ వదులుకున్నాడు, కారణం తెలిస్తే షాక్!
ఐదంకెల జీతం, విలాసవంతైన జీవనశైలి, లగ్జరీ ఇల్లు, ఖరీదైన కారు ఇవే జీవితం అనుకొని పరుగులు తీసే కాలానికి ఇక చెల్లు అంటోంది నేటి యువత. ప్రస్తుత కాలంలో ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మస్కాన్ అటార్ అనే మహిళ లింక్డిన్లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారింది. జెన్ జీ డబ్బు, కెరీర్ వృద్ధి,పని-జీవిత సమతుల్యతను ఎలా చూస్తారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.స్టోరీ ఏంటంటే..ఏడాదికి కోటీ రూపాయల వార్షికవేతనం అంటే ఎవరైనా ఆనందంతో ఎగిరి గంతేస్తారు. కానీ ఓ జెన్-జీ మాత్రం అంత భారీ ఆఫర్కు సింపుల్గా నో చెప్పేశాడు. అదేంటి పిచ్చా అని అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే ఉంది అసలు సంగతి. విషపూరితమైనదిగా భావించిన పని ప్రదేశంలో పనిచేయడానికి అతడికి ఇష్టం లేదట. అందుకే ఉద్యోగ అవసరం చాలా ఉన్నప్పటికీ, ఈ ఉద్యోగావకాశాన్ని తిరస్కరించాడు.‘టాక్సిక్ వర్క్ప్లేస్’లో పనిచేయడం కంటే తక్కువ జీతమైనా తనకు నచ్చిన పని చేసుకోవడమే మేలని తన స్నేహితుడు నిర్ణయించుకున్నాడనీ మస్కాన్ అటార్ చెప్పుకొచ్చారు. కెరీర్లో కీలక దశలో ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తాన్ని వదులుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు . 25 ఏళ్ల వయసు లోనే అతడు అంత భారీ ఆఫర్ను వద్దనుకోవడానికి చూపిన స్పష్టత తానైతే ఆ వయసులో చూపించలేక పోయేదాన్నని ముస్కాన్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, లైఫ్స్టైల్ ఆకాంక్షలు, సమాజపు ఒత్తిడి వల్ల సాధారణంగా ఎవరైనా ఆ డబ్బు వైపే మొగ్గు చూపుతారని అన్నారు.నేటి తరం యువత (Gen Z) కేవలం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాల వెనుక పడకుండా, పని ప్రశాంతత (Work-life balance), మానసిక ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ఘటన తెలుపుతోందన్నారు.అంతేకాదు రాబోయే రోజుల్లో నిపుణులైన ఉద్యోగులను నిలుపుకోవాలంటే కంపెనీలు తమ పని సంస్కృతిని, వాతావరణాన్ని మార్చుకోక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్సోషల్ మీడియాలో ఈ పోస్ట్పై నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోటి ఆఫర్ను తిరస్కరించడం వెనక ఆర్థికంగా బలమైన నేపథ్యం లేదా నెలకు కొంతకాలం ఆదాయం లేకపోయినా ఉండ గలిగే వెసులుబాటు ఉన్నవారికే సాధ్యమని కొందరు వ్యాఖ్యానించగా నా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి 45 ఏళ్ల వయసులో కూడా నేను అంత పెద్ద ఆఫర్ను వదులుకోలేను. అలాంటి ఆఫర్లు ఉంటే నాకే రీడైరెక్ట్ చేయండి!" అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. భవిష్యత్తు పని సంస్కృతి రాబోయే రోజుల్లో కేవలం జీతం మాత్రమే కాకుండా ఉద్యోగి మానసిక ఆరోగ్యం, వర్క్ శాటిస్ఫేక్షన్కు ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగులే భవిష్యత్తు కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తారని మరికొందరు సమర్థించారు. ఇదీ చదవండి: లిప్త పాటులో సుఖ్బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు. -
'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..
పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో క్లిప్లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్ హ్యాక్గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ లైక్లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా."ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత, యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.పేరెంట్స్ ప్రయత్నించొచ్చా?తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Siqueiros Bolado (@ck.bolado)గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..) -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
10 ఏళ్లకు స్టైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్
సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్ మార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్గా మారాయి. గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్గా, మోడరన్గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనఈ కొత్త డిజైన్పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. స్టేషన్లో పెళ్లి.. గంటలోనే విషాదం!
ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.బీహార్లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది. -
అదంతా ఫేక్?.. జెన్జీ ముసుగు వెనుక షాకింగ్ ‘లెక్క’!
సోషల్ మీడియాలో ఓ తరం.. వీధుల్లో మరో శక్తి.. అంటూ జెన్ జీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. భారత్లోనూ పరీక్షల వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యవస్థలపై ప్రశ్నలతో జెన్ జీ యువత ఆందోళనలు చేపట్టిన సందర్భాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అయితే పోరాటాలు, ట్రెండ్స్, సోషల్ మీడియా యాక్టివిజంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ తరం.. తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరిస్తోంది?.. ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రావెల్, లైఫ్స్టైల్, ఎక్స్పీరియన్స్లకు ప్రాధాన్యం ఇచ్చే తరం అంటూ కనిపించే జెన్ జీ.. నిజ జీవితంలో మాత్రం డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట!. భారీ కొనుగోళ్లు, విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.శాలరీసే(SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనం కోసం 5.2 లక్షల మందికి పైగా జీతం పొందుతున్న Gen Z వినియోగదారుల యూపీఐ లావాదేవీలను విశ్లేషించారు. సాధారణంగా జెన్జీ అంటే ప్రయాణాలు, డిజిటల్ లైఫ్, అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ ఖర్చుల లెక్కలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.70 శాతం ఖర్చు.. ఈ ఐదు కేటగిరీలకే!జెన్జీ తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం అవసరాలకే వెళ్తోంది. బిల్లులు, సబ్స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సంబంధిత చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలు కలిపి నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే.. జీవితంలోని సాధారణ అవసరాలే వారి బడ్జెట్లో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయి.ట్రావెల్కు కేవలం 5 శాతంజెన్జీకు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం అనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారి నెలవారీ ఖర్చుల్లో ట్రావెల్ వాటా కేవలం 5 శాతమేనని అధ్యయనం చెబుతోంది. ప్రయాణాలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నా.. అవి వారి రెగ్యులర్ బడ్జెట్ను పెద్దగా ప్రభావితం చేయడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే వినోదం, ప్రయాణాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.OTTలకు కూడా చోటుడిజిటల్ వినోదానికి Gen Zలో ఆదరణ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సబ్స్క్రిప్షన్ ఖర్చుల్లో జియోహాట్స్టార్ 12.4 శాతంతో ముందంజలో ఉండగా.. నెట్ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు యువత ఆర్థిక అలవాట్లను మార్చుతున్నాయని అధ్యయనం పేర్కొంది. బిల్లులు ఆటోమేటిక్గా చెల్లించడం, సబ్స్క్రిప్షన్లు డిజిటల్గా కొనసాగడం వంటి విధానాలు Gen Z జీవితంలో సాధారణంగా మారాయి.వయసు పెరిగేకొద్దీ..అధ్యయనం 18–23 ఏళ్ల వయసు, 24–29 ఏళ్ల వయసు ఉన్న Gen Z గ్రూపులను కూడా పరిశీలించింది. ఆసక్తికరంగా.. ఇరు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చులు (డిస్క్రెషనరీ స్పెండింగ్) 32 శాతంగానే ఉన్నాయి. అయితే వయసు పెరిగేకొద్దీ అవసరాలపై ఖర్చు పెరుగుతోంది. 18–23 ఏళ్ల వయసు వారిలో అవసరాల ఖర్చు 50 శాతం ఉండగా.. 24–29 ఏళ్ల వయసు వారిలో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఖర్చుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఇది సూచిస్తోంది.డిజిటల్ ఫైనాన్స్ వైపు Gen Zశాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా ప్రకారం.. భారత జెన్జీ పూర్తిగా డిజిటల్ ఆధారిత ఆర్థిక జీవనశైలిని అభివృద్ధి చేసుకుంటోంది. యూపీఐ విస్తృతి కారణంగా డబ్బు నిర్వహణ, చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, లైఫ్స్టైల్ ఇమేజ్కు భిన్నంగా జెన్జీ వాస్తవ ఖర్చుల తీరు కనిపిస్తోంది. కలలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక భద్రతకే యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
‘ఆపండి.. ప్లీజ్’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్ నుంచి దూకిన యువతి
ఆఫీసుకు వెళ్లేందుకు బుక్ చేసుకున్న ర్యాపిడో బైక్.. కొద్దిసేపటికే ఆమెకు భయానక ప్రయాణంగా మారింది. తెలిసిన రోడ్డు కాస్తా నిర్మానుష్యమైన మార్గంగా మారింది. గమ్యం వైపు వెళ్తున్నామా.. లేక ఎక్కడికో తీసుకెళ్తున్నారా అన్న అనుమానం మొదలైంది. ‘బైక్ ఆపండి.. మరో రూట్లో వెళ్లండి’ అంటూ ఆమె ఎంత చెప్పినా డ్రైవర్ ఆపలేదని బాధితురాలు ఆరోపించారు. చివరకు ప్రాణాలపై భయంతో కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. అనంతరం, ఓ వీడియో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.వీడియో ప్రకారం.. బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకున్నారు. తొలుత ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా కనిపించే మరో మార్గంలోకి బైక్ను మళ్లించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చుట్టూ చూస్తే పెద్దగా జనసంచారం కనిపించకపోవడంతో భయపడినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్ను ప్రశ్నించగా.. అది విశ్వవిద్యాలయానికి వెళ్లే నేరుగా ఉన్న దారేనని చెప్పినట్లు ఆయేషా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు. మరో మార్గంలో వెళ్లాలని, లేదంటే బైక్ను ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ డ్రైవర్ స్పందించలేదని ఆరోపించారు.Gig worker shcoker: A Terrifying Ride: Demand for Accountability In Delhi Ayesha Srivastav had to jump off a moving Rapido bike. The driver ignored her requests, took an isolated route and refused to stop. She suffered injuries from the jump.Shockingly Rapido took action… pic.twitter.com/J463SCdg0B— Ramesh Tiwari (@rameshofficial0) August 12, 2026పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ఆమె.. డ్రైవర్ను ఆపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో తన భద్రతపై తీవ్ర భయానికి గురై.. చివరకు కదులుతున్న బైక్ నుంచి దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో ఆయేషా చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటన తర్వాత కూడా తనకు సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ను సంప్రదించినా సకాలంలో స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు. View this post on Instagram A post shared by ✩⋆ 🖤 𝒜𝓎𝑒𝓈𝒽𝒶 𝓈𝓇𝒾𝓋𝒶𝓈𝓉𝒶𝓋 🖤 ⋆✩ (@ayesha_srivastav96) ‘వేలాది మంది మహిళలు ప్రతిరోజూ ర్యాపిడోలో ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో మీరు ఏం చేస్తున్నారు? డ్రైవర్ వివరాలు ఇవ్వండి. అతడిపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆమె సంస్థను ప్రశ్నించారు. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ను తమ ప్లాట్ఫామ్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. డ్రైవర్ వివరాలను ఆయేషాకు అందజేసినట్లు, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో ఆమెకు సహకరిస్తామని తెలిపింది. వైద్య లేదా చట్టపరమైన సహాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేశారు. -
పాన్షాప్ యజమానికి రూ. కోటి ఆస్తి,కారు, మరి ఎంబీఏ చదివినోడికి?
చిన్న చిన్న బడ్డీ కొట్లు, చిన్నదుకాణాలు, చిన్న వ్యాపారాలు బయట నుండి నిరాడంబరంగా కనిపించవచ్చు. కానీ కొంతమంది భారీ స్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జిస్తారు. దీని వెనుక ఏళ్ల తరబడి శ్రమ, నిబద్ధత ఉంటుంది. అయితే ఇటీవల తన పరిసరాల్లోని ఒక పాన్ దుకాణాన్ని సందర్శించిన 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన అనుభవాన్ని సోషల్మీడియాలో పంచు కోవడం నెట్టింట విశేషంగా నిలిచింది.రెడ్డిట్ యూజర్, ఎంబీఏ పట్టభద్రుడు,పంచుకున్న అనుభవం ప్రకారం తమ వీధిలోని ఒక సాధారణ పాన్ షాప్ యజమాని గురించి వివరిస్తూ. .‘‘నేను ఇటీవల సిగరెట్ తాగడానికి దగ్గర్లోని పాన్ షాపుకు వెళ్ళాను. అక్కడ యజమాని సుమారు కోటి రూపాయల విలువైన కారు, షాపు కొన్నాడని తెలిసింది. అతను తన ఇంటిని కూడా రెన్నోవేట్ చేస్తున్నాడు. ఆయన పని చాలా కష్టమైన పనే. ఒకసారి, తెల్లవారుజామున 2 గంటలకు ఒకరికి సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించినందుకు అతనిపై కత్తితో దాడి కూడా జరిగింది.” అంటూ రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతను చుట్టూ ఉన్న మరిన్ని చిన్నదుకాణాలు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ అమ్మేవారిని గమనించడం మొదలు పెట్టాడట.మరోవైపు సదరు MBA గ్రాడ్యుయేట్ వెన్నునొప్పి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సరైన పని దొరకక ఇబ్బంది పడుతున్నారు.తమ చుట్టూ ఉన్నపాన్ షాప్ యజమానులే కాకుండా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, జ్యూస్ సెంటర్లు, మొబైల్ విక్రేతలు కూడా స్వయంగా వ్యాపారం చేసుకుంటూ మంచి ఆస్తులు కూడబెట్టుకోవడం, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడం చూశారని పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలో ఒకతను పెద్దగా చదువుకోకపోయినా, భారతదేశంలో ఖరీదైన మొబైల్ ఫోన్లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అమ్మి బాగా సంపాదిస్తున్నాడంటూ మరొక ఉదాహరణను పంచుకున్నాడు. వీరిని చూశాక చిన్న వ్యాపారం ప్రారంభించడం బెటర్ అనిపిస్తోంది. తనకు నడుము నొప్పి లేకపోయి ఉంటే, తాను కూడా వడా పావ్ లేదా రామెన్ కియోస్క్ ప్రారంభించి ఉండేవాడిని, లేదా ఆన్లైన్ స్టోర్ల కంటే మెరుగైన ధరలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మడం మొదలుపెట్టి ఉండేవాడినన్నాడు. అంతేకాదు చిన్న వ్యాపార యజమానులు గత 15-20 ఏళ్లలో ఒక టైర్-2 లేదా టైర్-3 కాలేజీ గ్రాడ్యుయేట్ తన జీవితకాలంలో సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదించారు అంటూ ఉన్నత చదువులు (ఉదాహరణకు టైర్-2, టైర్-3 MBAలు) నిజంగానే మెరుగైన ఆర్థిక అవకాశాలను ఇస్తున్నాయా? లేదా చిన్న వ్యాపారాలే నయమా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందనలుఈ పోస్ట్పై రెడ్డిట్లో తీవ్ర చర్చ జరిగింది. యూజర్లు వేర్వేరు దృక్పథాలను పంచుకున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ "మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం సక్సెస్ అయిన యజమాని కథ మాత్రమే. ప్రతి పాన్ షాప్ యజమానీ కోటీశ్వరుడు కాలేడు. చాలామంది పూట గడవడానికే కష్టపడతారు. సాధారణంగా ఒక సగటు MBA గ్రాడ్యుయేట్, ఒక సగటు పాన్ షాప్ యజమాని కంటే మెరుగైన ఆర్థిక స్థితిలోనే ఉంటాడు అంటూ వివరణ ఇచ్చారు.“నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మీ వైఖరి చాలా వర్గపరమైనది. అపారమైన లాభాలు సంపాదించేంత వ్యాపార చతురత ఉన్న పాన్ షాప్ యజమాని విలువైన వస్తువులు కొనుక్కోవడంలో తప్పేముంది’’ అని మరొకరు ప్రశ్నించారు. వ్యాపార ఆదాయానికి పరిమితులుండవు. ఉద్యోగాల్లో ఉండే పరిమితుల కంటే చిన్న వ్యాపారాల్లోనే ఎక్కువ సంపాదనకు అవకాశం ఉంటుంది. సరైన గ్రోత్ లేని తక్కువ జీతం ఉద్యోగాల్లో ఇరుక్కుపోయే కంటే, రిస్క్ తీసుకుని వ్యాపారం చేయడం మంచిదని మరొకరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు వ్యాపార నైపుణ్యం ఉండి, శ్రమపడి సంపాదించిన వ్యక్తి కార్లు, ఆస్తులు కొనుగోలు చేయడంలో తప్పులేదని, ఏ పనినీ తక్కువగా చూడకూడదని మరికొందరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటంచాలా మంది 20-30 లక్షల వార్షిక ఆదాయాన్ని అరుదైనదిగా భావించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వారు తమ ఉద్యోగ ప్రపంచం నుండి బయటకు వచ్చి, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, 20-30 లక్షల వార్షిక ఆదాయం చాలా సాధారణం. మీరు భవిష్యత్తులో కెరీర్ వృద్ధి లేని తక్కువ జీతం గల ఉద్యోగంలో చిక్కుకుపోయి ఉంటే, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా వ్యాపార అవకాశాలను అన్వేషించడం ప్రారంభించండి ఇంకొకరు సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఉన్నత విద్య కేవలం ఉద్యోగ భద్రతను ఇచ్చే మార్గం మాత్రమే. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలు చేసే శ్రమ, రిస్క్, కస్టమర్ మైండ్సెట్ ఉంటే చదువుతో సంబంధం లేకుండా గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. ఏమంటారు?ఇదీ చదవండి: రోడ్డుపై టైగర్ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్ -
రోడ్డుపై టైగర్ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ (Tadoba-AndhariTiger Reserve) సమీపంలోని రహదారిపై పులి కనిపించినప్పుడు పర్యాటకులు ప్రవర్తించిన తీరు, ప్రమాదకర ప్రవర్తనపై వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల పట్ల పర్యాటకుల ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ప్రజలు తమ వాహనాల నుండి దిగి, ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి, సోషల్ మీడియా రీల్స్ (Reels) కోసం పెద్ద పులికి ప్రమాదకరంగా దగ్గరగా వెళ్లడం కనిపిస్తుంది. వన్యప్రాణుల ప్రేమికులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు . జంగిల్ సఫారీల సమయంలో అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పర్యాటకులను కోరారు. సఫారీ ఉద్దేశం వన్యప్రాణులను సురక్షితమైన దూరం నుంచి పరిశీలించడమే తప్ప, వాటికి అంతరాయం కలిగించడం లేదా వాటిని రెచ్చగొట్టడం కాదని నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు అటవీ అధికారుల సూచనలు:పులులు లేదా ఇతర అడవి జంతువులు సోషల్ మీడియా సెల్ఫీల కోసం వస్తువులు కావని అధికారులు స్పష్టం చేశారు.వాహనాలు దిగడం, జంతువులకు అడ్డంగా వెళ్లడం, వాటిని తారసపడటం లేదా గట్టిగా అరిచి శబ్దాలు చేయడం వల్ల అవి ఒత్తిడికి గురై దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. View this post on Instagram A post shared by Responsible Sane (@thenewscurrenthq)నిజమైన వన్యప్రాణి అనుభూతికి దగ్గరగా వెళ్లడం అవసరం లేదని, కానీ జంతువు స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం ఇచ్చి, దానిని దాని సహజ స్థితిలో ఉండనివ్వాలని పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు గుర్తుంచుకోవాలని కోరారు.సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ కోసం క్రూర మృగాలను వేధించకుండా, అటవీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పర్యాటకులకు, సఫారీ గైడ్లకు విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటంవన్యప్రాణులను దగ్గరగా చూడటం కోసం లేదా వైరల్ వీడియో కోసం పర్యాటకులు వన్యప్రాణులకు దగ్గరగా వెళ్లి,ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న ఘటన ఇదే తొలిసారికాదు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు చాలానే ఉన్నాయి.జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (జనవరి 2026): ఉత్తరాఖండ్లోని ఫాటో ఎకో-టూరిజం జోన్లో ఒక పులిని సఫారీ వాహనాలు వేగంగా తరిమిన వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు గైడ్లపై అటవీశాఖ నిషేధం విధించింది.ముదుమలై టైగర్ రిజర్వ్ (నవంబర్ 2024): తమిళనాడులోని ఈ రిజర్వ్లో వాహనం దిగి జింకల మందను తరిమిన ముగ్గురు పర్యాటకులకు అటవీ అధికారులు రూ. 15,000 జరిమానా విధించారు.ఇదీ చదవండి: 360 ఎకరాల ‘దెయ్యాల నగరం’ : రూ. 13.3 కోట్లకు వ్యాపారవేత్త డీల్ -
టీచర్కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
బీజేపీ ఆఫీస్లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!
పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.BJP faces allegations of disrespecting Indian flag in Kerala's KasaragodSeveral Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి. -
ఇల్లు రెంట్ కోసం వెళ్లారు.. ఒక్కసారిగా నరకం చూశారు!
ఇల్లు చూసేందుకు వెళ్లారు.. గేటు తెరిచారు.. అంతే! ఒక్కసారిగా లోపలి నుంచి దూసుకొచ్చిన పిట్బుల్ కుక్క భార్యపై విరుచుకుపడింది. ఆమెను కాపాడేందుకు భర్త ముందుకొచ్చినా.. అతడినీ వదల్లేదు. క్షణాల్లోనే ఆ ప్రదేశం భీతావహంగా మారిపోయింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దంపతులు.. చేతుల్లో కర్రలు పట్టుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు.. చివరకు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భార్యాభర్తలు. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పంజాబ్లోని పాటియాలాలో ఘుమన్ నగర్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.వివరాల మేరకు.. పాటియాలాకు చెందిన అంకిత్ సభర్వాల్ తన భార్య షిఫాలితో కలిసి ఓ ప్రాపర్టీ డీలర్తో ఇంటిని చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఇంటి గేటు తెరవగానే లోపలి నుంచి పిట్బుల్ ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి షిఫాలిపై దాడి చేసినట్లు అంకిత్ తెలిపారు. కుక్క ఆమె చేతితో పాటు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా దాడి చేయడంతో లోతైన గాయాలయ్యాయి. గాయాల తీవ్రత కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అంకిత్పైనా కుక్క దాడి చేసింది. అతడి కాళ్లు, వీపుపై లోతైన కాటు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న సీసీటీవీ వీడియోలో కుక్క దంపతులపై దాడి చేస్తుండటం కనిపిస్తోంది. వారు దాని నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుక్క వారిని వదలకుండా వెంటపడినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇక, కుక్క దాడిని ఆపేందుకు స్థానికులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఓ మహిళ చేతిలో కర్రతో ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కర్రలతో అక్కడికి చేరుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు తీవ్రంగా గాయపడిన దంపతులను దాని నుంచి దూరంగా తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.Patiala | A couple was attacked by a pit bull when they went to see a house for rent. pic.twitter.com/wANMStPzJZ— Gagandeep Singh (@Gagan4344) August 12, 2026ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు అంకిత్ తెలిపారు. కుక్కను స్వేచ్ఛగా బయటకు రానిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంటి గేటు తెరిచిన వెంటనే ఇంతటి ప్రమాదకర దాడి జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పాటియాలా మేయర్ కుందన్ గోగియా కూడా స్పందించారు. నగరంలో పిట్బుల్ వంటి దూకుడు స్వభావం కలిగిన కుక్క జాతులను పెంపుడు జంతువులుగా పెంచడాన్ని నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ సమావేశంలో చర్చించి ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
రూ. 50 లక్షలు, 15 ఏళ్ల కష్టం, కెనడాలో మాస్టర్స్ : చివరకు మిగిలింది!
సాక్షి, ముంబై: ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడం, అక్కడ డాలర్లలో సంపాదించడం చాలామంది యువకుల కల. ఇంకా చెప్పాలంటే ప్రతీ తల్లిదండ్రుల కల. కానీ విదేశాల్లో చదువులు, లక్షల కొద్దీ లోన్లు, తద్వారా ఎదురయ్యే ఆర్థిక సవాళ్లపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారింది. ఆన్లైన్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. విషయం ఏమిటంటే.ఒక కుటుంబం తమ కొడుకు మాస్టర్స్ డిగ్రీ చదువు కోసం కెనడాకు పంపింది. ఇందుకోసం పదిహేళ్లనుంచి కష్టపడి దాచుకున్న రూ. 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను కరిగించింది. తీరా చూస్తే లక్షల్లో ఆదాయం ఏమోగానీ, ఆ గ్రాడ్యుయేట్ ఇప్పుడు టొరంటోలో అధిక పన్నులు, ఖరీదైన అద్దె, పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమవుతున్నాడు. అనుకున్నంత పొదుపు చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని వ్యాపారవేత్త హర్ష్ గుప్తా ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. ఇదీ చదవండి: నిబంధనలు గాలికి,అపరిశుభ్రత : జెప్టోకు భారీ షాక్ప్రస్తుతం ఆ యువకుడు టోరంటోలో ఏడాదికి 55 వేల కెనడియన్ డాలర్లు (CAD) సంపాదిస్తున్నప్పటికీ , అక్కడి అధిక ఖర్చుల వల్ల, భారత్లోని ఏదైనా మధ్యస్థ నగరంలో ఉద్యోగం చేసుకుంటే వచ్చే పొదుపు కంటే ఇక్కడే తక్కువ మిగులుతోందని పోస్ట్లో పేర్కొన్నారు. రూ. 50 లక్షల్ని భారత్లోనే పెట్టుబడి రూపంలో ఉంచితే వచ్చే లాభాలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరని, విదేశీ డిగ్రీలు కేవలం ఒక ఖరీదైన అనుభవంగా మిగిలిపోతున్నాయని గుప్తా అభిప్రాయపడ్డారు.వాస్తవానికి లెక్కలు వేసుకునేంత వరకు విదేశాలకు వెళ్లడం ఒక కలలా కనిపిస్తుంది. విపరీతమైన అద్దె, పన్నులు, జీవన వ్యయం వంటి వాటి మధ్య, డాలర్లు లేదా కెనడియన్ డాలర్లలో సంపాదించడం వల్ల, మన స్వదేశంలోని ఒక సాధారణ ఉద్యోగంతో పోలిస్తే చాలా తక్కువే పొదుపు చేయగలం అని వ్యాపారవేత్త హర్ష్ గుప్తా తెలిపారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా అంత మొత్తం ఖర్చు చేయడం ముమ్మాటికీ పొరపాటని కొందరు వ్యాఖ్యానించగా, ఈ అభిప్రాయాన్ని తప్పుబడుతూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...! -
ట్రంప్కే షాక్ ఇచ్చిందా? ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026ట్రంప్కు షాక్ ఇచ్చిందా?..కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్ షాక్ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్ మీడియా, లైఫ్స్టైల్ బ్రాండ్ ది కన్జర్వేటర్ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ట్రంప్కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?వైట్హౌస్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ల మధ్య ఫ్రాంక్లిన్ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్తో కలిసి ఓవల్ ఆఫీస్లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎవరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ గతంలో ట్రంప్ పాలనలో పనిచేశారు. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్లో లెజిస్లేటివ్ ఇంటర్న్గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్ తొలి వైట్హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, బ్యూటీ అంశాలపై కంటెంట్ అందించే కన్జర్వేటివ్ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట. -
జెన్జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీకి బిగ్ షాక్.. ‘ఎయిర్పోర్టుకు పడవలు వస్తాయా?’
నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది. ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.Heavy rainfall today caused severe waterlogging at Noida International Airport in Uttar Pradesh, India. The airport was inaugurated by Prime Minister Narendra Modi on March 28, 2026. pic.twitter.com/mVu12u7B7Z— Weather Monitor (@WeatherMonitors) August 11, 2026విమర్శలకు తోడు రాజకీయ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బీజేపీపై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా?” అంటూ ఎక్స్లో ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్పోర్టు యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించారని వెల్లడించింది.నీరు నిలిచిన సమయంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులను నేరుగా కర్బ్ వద్ద పికప్, డ్రాప్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విమానాలు ఆగిపోయాయా లేదా అన్నది ఒక విషయం.. నీరు ఎందుకు నిలిచింది అన్నది మరో విషయం. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంది? భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను వ్యంగ్యంగా తీసుకున్నారు. “ఇది ఎయిర్పోర్టా.. స్విమ్మింగ్ పూలా?” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఒక్క ఘటన ఆధారంగా మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్టు సిబ్బంది స్పందించి తక్కువ సమయంలోనే నీటిని తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28, 2026న విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ విమాన కార్యకలాపాలు జూన్ 15 నుంచి ప్రారంభమయ్యాయి.Noida International Airport amidst Heavy rains today🚨 #DelhiRains pic.twitter.com/rp0Ur3jaed— Mumbai Nowcast (@s_r_khandelwal) August 11, 2026 -
ఆమె కండక్టర్తో వెళ్లిపోయింది.. అంతే!
వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. CCTV visuals are currently going viral on social media, claiming that Kerala YouTuber Akhil NRD's wife, Megha Nair, has run away with a bus conductor. Watch the video to see the reality behind it! 👇 pic.twitter.com/N9WUns571W— Vijitha (@Vijitha96) August 11, 2026అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామంపై అఖిల్ స్నేహితుడు, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్ రియాక్షన్ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్ అన్నాడట.సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మెర్చంట్ నేవీ నుంచి సోషల్ మీడియా స్టార్..అఖిల్ ఎన్ఆర్డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్టాక్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్స్టైల్ కంటెంట్, వ్లాగ్స్తో భారీగా ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీసోషల్ మీడియా స్టార్ నుంచి మాలీవుడ్లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్. 2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్’ చిత్రంలోనూ నటించాడు. సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.2024లో వివాహం..అఖిల్, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్ సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్ వీడియో రిలీజ్ చేశాక ‘‘ఇది కూడా సోషల్ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు. -
34 ఏళ్ల క్రితం ప్రేమికులుగా.. కాలం మారిందంతే!
నాగార్జునసాగర్ కేవలం ఓ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీత జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయిన ప్రదేశం. మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా.. ఆ ప్రాంతంతో ముడిపడిన అనుబంధం మాత్రం వాళ్లకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలను మరోసారి ఆ జంట గుర్తు చేసుకుంది.34 ఏళ్ల క్రితం యువకుడు రేవంత్రెడ్డి, గీత దంపతుల జీవితంలో ప్రేమ జ్ఞాపకాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరోసారి వారిని ఆకర్షించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పట్లో సాధారణ జీవితంలో ఉన్న వారు.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి చేరుకున్నారు.వరుణయాగం తర్వాత.. సోమవారం నాగార్జునసాగర్లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం దంపతులు విజయవిహార్ అతిథిగృహం వద్ద కృష్ణానది తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో గడిపిన క్షణాలు, అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయానికి వేదికైన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మళ్లీ సందర్శించడం భావోద్వేగ క్షణంగా మారింది.ఒక ఫొటో.. రెండు కాలాల కథఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలకు సంబంధించిన పాత ఫొటోతో పాటు.. ప్రస్తుతం సీఎం దంపతులు సాగర్ వద్ద ఉన్న ఫొటోను కలిపి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “అప్పుడు ప్రేమ ప్రయాణం మొదలైన చోటే.. ఇప్పుడు జీవిత ప్రయాణంలో మరో మైలురాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయాలకతీతంగా ఓ వ్యక్తిగత క్షణంసాధారణంగా రాజకీయ నేతల ప్రతి అడుగు రాజకీయ కోణంలోనే చర్చకు వస్తుంది. కానీ నాగార్జునసాగర్ పర్యటనలో మాత్రం రేవంత్రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం తెరపైకి వచ్చింది. రాజకీయ పోరాటాలు, పదవులు, బాధ్యతలకు అతీతంగా.. జీవితంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేక గుర్తులుగా మిగిలిపోతాయి. నాగార్జునసాగర్ కూడా రేవంత్–గీత దంపతులకు అలాంటి ఓ భావోద్వేగ ప్రదేశంగా నిలిచింది.ప్రేమ నుంచి బాధ్యతల వరకు.. సాగర్ సాక్షిగాయువకుడిగా ఉన్న రేవంత్రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో మారవు. ప్రేమకు సాక్షిగా నిలిచిన నాగార్జునసాగర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతుల పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసిన వేదికగా మారింది. -
డేట్ అయిపోయిందని పారేస్తే మీ జేబుకే నష్టం!
ప్యాకెట్పై ఉన్న తేదీ కనిపించగానే చాలామంది చేసే మొదటి పని.. ఆ ఆహారాన్ని చెత్తబుట్టలో పడేయడం. బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, సాస్లు, పాలు వంటి వాటిపై ఉన్న తేదీ దాటితే ఇక అవి పనికిరావని భావిస్తుంటారు. కానీ ప్రతి తేదీ వెనుక ఒకే అర్థం ఉండదు. కొన్ని సందర్భాల్లో తేదీ దాటినా ఆహారం సురక్షితంగా ఉండొచ్చు.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆహార ప్యాకెట్పై ముద్రించిన తేదీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది అనవసరంగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. బెస్ట్ బిఫోర్(Best Before), ఎక్స్పైరీ డేట్(Expiry Date) మధ్య ఉన్న చిన్న తేడా తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఏ ఆహారం తినొచ్చు? ఏది పారేయాలి? తెలుసుకుందాం..ఇలా అయితే ఫర్వాలేదుఆహార ప్యాకెట్లపై కనిపించే ‘Best Before’ తేదీ అంటే.. ఆ పదార్థం అత్యుత్తమ నాణ్యతతో ఉండే గడువు. అంటే ఆ తేదీ వరకు ఆహారం రుచి, వాసన, రంగు, ఆకృతి వంటి లక్షణాలు మెరుగ్గా ఉంటాయని తయారీదారు హామీ ఇస్తాడు. ఆ తేదీ దాటిన వెంటనే ఆహారం విషపూరితం అయిపోతుందని అర్థం కాదు. ఉదాహరణకు.. కొన్ని ప్యాక్ చేసిన పదార్థాలు సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ‘Best Before’ తేదీ తర్వాత కూడా కొంతకాలం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు జాగ్రత్త అవసరం. తేదీ ఒక్కటే ఆహారం సురక్షితమా? కాదా? అని నిర్ణయించదు.ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ఎక్స్పైరీ డేట్ Expiry Date లేదా యూజ్ బై డేట్ Use-by Date అనేది ఆహార భద్రతకు సంబంధించిన హెచ్చరిక. ఈ తేదీ దాటిన తర్వాత ఆ పదార్థంలో హానికరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల విషయంలో ఈ తేదీని తప్పక పాటించాలి. అందుకే ‘Best Before’ అంటే నాణ్యతకు సంబంధించిన సూచన.. ‘Expiry Date’ అంటే భద్రతకు సంబంధించిన హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.వీటి విషయంలో జాగ్రత్తపాలు, పెరుగు, తాజా మాంసం, చేపలు వంటి పదార్థాలు చాలా త్వరగా పాడయ్యే ఆహారాలు. వీటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే.. ప్యాకెట్పై ఉన్న తేదీ రాకముందే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను తేదీ దాటిన తర్వాత తీసుకునే విషయంలో మరింత జాగ్రత్త అవసరం.ఆహారాన్ని ఉపయోగించే ముందు ఈ విషయాలను గమనించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరంగా పెట్టండిప్యాకెట్ ఉబ్బిపోయిందా?లీక్ అవుతోందా?వింత వాసన వస్తుందా?రంగు మారిందా?ఫంగస్ కనిపిస్తుందా?ఆకృతి మారిందా?.. ఇలాంటి మార్పులు కనిపిస్తే.. తేదీ ఉన్నా, లేకపోయినా ఆహారాన్ని తినకపోవడమే మంచిది.వాసన బాగుందని నమ్మొద్దు!చాలామంది ఆహారం చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి వాసన చూస్తారు. వాసన బాగుంటే తినేస్తారు. కానీ ఇది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఆహారంలో ఉన్నా.. వాసన, రంగు, రుచిలో మార్పు కనిపించకపోవచ్చు. అందుకే అనుమానం ఉన్న ఆహారాన్ని రుచి చూసి పరీక్షించడం కూడా మంచిది కాదు.నిల్వ విధానమే కీలకంఆహారం ఎప్పుడు తయారైంది అన్నదే కాదు.. దాన్ని ఎలా నిల్వ చేశారన్నది కూడా చాలా ముఖ్యం. ఫ్రిజ్లో పెట్టాల్సిన పదార్థాలను బయట ఎక్కువసేపు ఉంచితే.. గడువు తేదీ లోపలే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి ప్యాకెట్ తెరిచిన తర్వాత ఆహారం ఉపయోగించే గడువు తగ్గవచ్చు.తినే ముందు ఈ ఆరు విషయాలు చెక్ చేయండి✅ ప్యాకెట్ సురక్షితంగా ఉందా?✅ ఎప్పుడైనా తెరిచారా?✅ సరైన విధంగా నిల్వ చేశారా?✅ ఆహారంలో మార్పులు కనిపిస్తున్నాయా?✅ అది త్వరగా పాడయ్యే పదార్థమా?✅ తేదీ దాటిన సమయం ఎంతైంది?చివరగా.. ఆహారంపై ఉన్న తేదీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ‘Best Before’ దాటిందని ప్రతి పదార్థాన్ని పారేయాల్సిన అవసరం లేదు. అలాగే తేదీ దాటిందని ప్రతి ఆహారాన్ని తినడం కూడా సరికాదు. ఆహారం రకం, నిల్వ విధానం, ప్యాకింగ్ పరిస్థితులు, పాడైన లక్షణాలు.. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. డేట్ చూసి భయపడొద్దు.. కానీ జాగ్రత్తను మాత్రం మర్చిపోవద్దు! -
సీజేఐ హైదరాబాద్ నల్సార్ ఈవెంట్పై ఉత్కంఠ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది.సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో..విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు.“మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”..NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికను పునరాలోచించాలని కోరారు. “ప్రజల హక్కులు, న్యాయం అందుబాటులో ఉండటం, సమస్యలపై తర్కబద్ధమైన చర్చ” వంటి అంశాలను న్యాయ విద్యలో నేర్చుకున్నామని.. అలాంటి సమయంలో నిరసనకారుల ఆరోపణలపై స్పందన విషయంలో అసంతృప్తి ఉన్న వ్యక్తిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం తమకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. అయితే అసలు సీజేఐని ఈ ఈవెంట్కు నల్సార్ నిజంగానే ఆహ్వానించిందా?.. ఈ అంశంపై వర్సిటీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.మొన్న మహారాష్ట్రలోనూ..ఇదే సమయంలో మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)లోనూ జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సిన కాన్వొకేషన్ కార్యక్రమం వాయిదా పడటం చర్చకు దారితీసింది. ఆగస్టు 2న జరగాల్సిన TISS 86వ కాన్వొకేషన్ను “అనుకోని పరిస్థితుల” కారణంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా.. భద్రతా కారణాలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది.కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావమా?జస్టిస్ సూర్యకాంత్కు సంబంధించిన గత వ్యాఖ్యలు, CJP ఉద్యమం నేపథ్యంలో ఈ పరిణామాలను పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారనే ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించినవని కొందరు భావించగా.. తాను నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పడింది. అనంతరం NEET పరీక్ష అంశంపై ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.సౌరవ్ దాస్ ట్వీట్మరోవైపు నల్సార్లోకాక్రోచ్ల నిరసనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ ఆయన నల్సార్లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో.. ఈ వ్యవహారం వెనుక సౌరవ్ హస్తం ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు.NALSAR student-lawyers with a spine. pic.twitter.com/rX0sDqDzhR— Saurav Das (@SauravDassss) August 9, 2026ఒకే అంశం.. రెండు పరిణామాలుహైదరాబాద్లో NALSAR విద్యార్థులు నేరుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా.. ముంబైలో TISS కాన్వొకేషన్ వాయిదా చుట్టూ భద్రత, నిరసనల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు న్యాయవ్యవస్థపై గౌరవం కొనసాగాలని భావించే వర్గాలు ఉండగా.. మరోవైపు పౌర హక్కులు, నిరసనలపై న్యాయస్థానాల స్పందనను ప్రశ్నించే కొత్త తరం విద్యార్థుల గొంతు వినిపిస్తోంది. కాన్వొకేషన్ వేదికలు కేవలం పట్టాలు అందించే కార్యక్రమాలేనా? లేదంటే రాజ్యాంగ విలువలపై చర్చ జరిగే వేదికలా? అనే కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి. -
Viral Video: 79 ఏళ్లకు.. వచ్చేసింది బుల్లోడా..!
స్వాతంత్య్రం వచ్చి దాదాపు 79 ఏళ్లు గడిచినా ఆ గ్రామానికి ప్రభుత్వ బస్సు మాత్రం రాలేదు. ఎట్టకేలకు తొలిసారి బస్సు కుర్తాల్ గ్రామంలోకి రావడంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పూల వర్షం కురిపిస్తూ.. మంగళహారతులు ఇస్తూ.. డప్పుల మోతతో నృత్యాలు చేస్తూ గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బస్సుకు భావోద్వేగంతో స్వాగతం పలికారు.బస్సు డ్రైవర్, కండక్టర్లకు తలపాగాలు చుట్టి.. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రాజస్థాన్లోని కేక్రి ప్రాంతంలోని కుర్తాల్, కేరోట్ గ్రామాలకు ఈ బస్సు రాక చారిత్రక క్షణమని పలువురు సోషల్ మీడియాలో నెటిజన్లు అభివర్ణించారు. కుర్తాల్ సమీపంలోని కేరోట్ గ్రామాలు దశాబ్దాలుగా బస్సు సౌకర్యానికి దూరంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేరుగా ఆ గ్రామానికి చేరుకున్న తొలి ప్రభుత్వ బస్సు ఇదే.पहली बार रोडवेज की बस गाँव में आई तो गांव वालों की खुशी का ठिकाना नहीं रहा.गांव में बस के प्रवेश करने पर ग्रामीणों ने फूल बरसाए, बस की आरती उतारी, पटाखे फोड़े और चालक-परिचालक का साफा व माला पहनाकर सम्मान किया. राजस्थान के केकड़ी जिले में स्थित केरोट और कूरथल गांव में उत्सव का… pic.twitter.com/Azwz4CVbhw— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 6, 2026ఈ బస్సు రాకతో సమీప పట్టణాలు, మార్కెట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అంతకుముందు గ్రామస్థులు పూర్తిగా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేది. ఈ హృదయానికి హత్తుకునే దృశ్యాలు వైరల్గా మారాయి. -
26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్
ఎవరైనా అందంగా మారాలనుకుంటారు. మంచి ఒడ్డూ పొడుగు, శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎత్తు పెరగాలని లేదా బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ జపాన్కు చెందిన ఒక వ్యాపారవేత్త కుక్కలా మారేందుకు అనేక సర్జరీలు చేయించు కున్నారు. ఇందుకోసం ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాడనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో నిజమెంత?సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న "జాసో (Jaso)" అనే 26 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త దాదాపు రూ.220 కోట్లు ఖర్చు చేశాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కోటీశ్వరుడికి కుక్కలంటే మక్కువ ఎక్కువట. అందుకే కుక్కలా బాడీ మోడిఫికేషన్, ఆపరేషన్లు అంటూ పెద్ద మొత్తంలో ఖర్చుచేశాడనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆన్లైన్ పోస్టులు , వీడియోల ప్రకారం, జపాన్కు చెందిన "జాసో" అనే 26 ఏళ్ల యువ మిలియనీర్, అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సల ద్వారా తనను తాను కుక్కలా మార్చుకున్నాడని, దీనికోసం రూ.220 కోట్లు ఖర్చు అయిందంటున్నవైరల్ వీడియోలలో ఒక వ్యక్తి కుక్క దుస్తులలో, కుక్కలాగే కదులుతున్నట్లు కనిపిస్తున్నాడు.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా? इंसान से 'कुत्ता' बनने के लिए उड़ा दिए ₹220 करोड़🐕🦺ये कहानी सुन के होश उड़ जायेगे 😱सोशल मीडिया पर जापान के 26 साल के करोड़पति जासो का एक वीडियो है, जासो को कुत्ते जैसा दिखने और कुत्ते जैसी जिंदगी जीने का इतना शौक चढ़ा कि उन्होंने इसके लिए करीब ₹220 करोड़ खर्च कर दिए।जासो… pic.twitter.com/KEulnMShgO— Sachin Verma🐦 (@itSachinverma) August 8, 2026ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ ఫ్యాక్ట్ చెక్ఈ వార్తలో ఎలాంటి నిజం ఉన్నట్లు ఆధారాలు లేవు. "జాసో" అనే వ్యక్తి గుర్తింపు, ఆయన వయస్సు (26), ఆయన వ్యాపారవేత్త రూ. 220 కోట్లు ఖర్చు చేశారనే వాదనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన సాక్ష్యాలు లేవని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు. ఇది పూర్తిగా కల్పితం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ కోసం క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీలలో ఇది ఒకటని, ఇప్పటివరకు రూ,220 కోట్ల ట్రాన్స్ఫర్మేషన్ వార్తకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదని స్పష్టమవుతోంది. ఇక ఈ క్లిప్లలో కనిపిస్తున్న జంతువు మనుషుల చర్మం లాంటి రూపం కలిగిన ఒక అరుదైన, ప్రాచీన 'హెయిర్లెస్' కుక్క జాతికి చెందినది.ఇదీ చదవండి: డ్యూప్లెక్స్ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి'జాసో డాగ్ ట్రాన్స్ఫర్మేషన్' స్టోరీ నిస్సందేహంగా ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వివాదాస్పద స్టోరీలపై అధికారిక ప్రకటనలు లేదా విశ్వసనీయమైన నివేదికలు ఈ రెండు కథనాలలో దేనినైనా ధృవీకరించే వరకు అప్రమత్తంగా ఉండాలి.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే! -
గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!
నచ్చిన నెచ్చెలి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రేమికులు. తాజాగా తమ నిశ్చితార్థ కలను నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎంతటి కష్టానికైనా వెనుకాడడని నిరూపించాడు అమెరికాకు చెందిన బ్రాడ్లీ చో (Bradley Cho). తన ప్రియురాలికి విలువైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ గిప్ట్గా ఇవ్వాలనే కోరికతో చాలానే కష్టపడ్డాడు. ఒకపక్క పగలు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క రాత్రుళ్లు ఫుడ్ డెలివరీ బాయ్గా అదనపు పనిచేశాడు. చివరికి..బ్రాడ్లీ చో ఇటీవల తన ప్రియురాలితో కలిసి ఒక కాండో (ఇల్లు) కొనుగోలు చేశాడు. దీంతో అతని వద్ద ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చైపోయాయి. ఇక నిశ్చితార్థపు ఉంగరం కొనడానికి డబ్బులు లేకుండా పోయాయి. ఎలాగైనా ఆమెకు లగ్జరీ డైమండ్ రింగ్ కానుకగా ఇవ్వాని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్డాష్ (DoorDash) ద్వారా డెలివరీ ఏజెంట్గా పనిచేశాడు. రోజూ పగటిపూట రెగ్యులర్ కార్పొరేట్ ఉద్యోగం ముగించుకుని, రాత్రి 2 గంటల వరకు డెలివరీలు చేసేవాడు. మళ్లీ ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఆఫీస్కు వెళ్లేవాడు. ఇలా రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 8 నెలల పాటు కష్టపడ్డాడు. ఈ క్రమంలో రెండు వారాల పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల వల్ల తన కార్పొరేట్ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అయినా పట్టువీడలేదు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) చివరికి 8 నెలల కష్టం తర్వాత 6,500 డాలర్లు (దాదాపు రూ. 6 లక్షలు) విలువైన డబ్బును సమకూర్చుకున్నాడు. దీంతో ల్యాబ్-గ్రోన్ డైమండ్తో (Lab-grown diamond) పాటు వారిద్దరి 'బర్త్ స్టోన్స్' (జన్మ రాశి రత్నాలు) అమర్చిన ప్రత్యేకమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని తయారు చేయించాడు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ నెటిజన్ల స్పందన"డే 89.. మై గర్ల్ఫ్రెండ్కు రింగ్ కొనేవరకు" అంటూ రోజూ తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసిన బ్రాడ్లీకి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. లక్షలాది మంది ఆయన పట్టుదలను, ప్రేమికురాలి పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు అందించడం విశేషం.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా? -
ట్రెండింగ్లో వారణాసి.. మోదీ కంచుకోటలో ఇదేం సీన్?
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. రోడ్లు చెరువులను తలపించేలా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రోడ్డు మధ్యలో వరద నీటిలో ఓ ఆటో బోల్తా పడటం, ఆ వెంటనే ఓ బైకర్ కూడా అదుపుతప్పి నీటిలో పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, అధికారులపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు 22 ప్రాంతాల్లో నీటిముంపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో రోడ్డు ఎక్కడుందో, గుంతలు ఎక్కడున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో నీటితో నిండిన రోడ్డుపై ఓ ఆటో ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో బైకర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడిపోయాడు. ఈ ఘటనల్లో డ్రైవర్, ప్రయాణికులకు గాయలైనట్టు తెలుస్తోంది.అయితే, వరద నీటిలో వాహనాలు బోల్తా పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు చర్చ మరో అంశంపై మొదలైంది. ‘స్మార్ట్ సిటీ’గా అభివృద్ధి చేస్తున్న వారణాసిలో ప్రతిసారీ వర్షానికి రోడ్లు ఎందుకు జలమయం అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో వారణాసిలో మౌలిక వసతుల అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలాంటి నగరంలో భారీ వర్షం పడిన ప్రతిసారీ రోడ్లపై నీరు నిలిచిపోవడం, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న దృశ్యాలు ఇప్పుడు రాజకీయంగానూ, ప్రజా చర్చగానూ మారుతున్నాయి.Varanasi pic.twitter.com/4x2V5VrnW2— Piyush Rai (@Benarasiyaa) August 6, 2026భారీ వర్షాలు పడటం సహజమే అయినప్పటికీ.. వర్షం తగ్గిన తర్వాత కూడా నీరు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోతే మాత్రం డ్రైనేజీ, పట్టణ ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వైరల్ అయిన ఆటో బోల్తా, బైకర్ ప్రమాద దృశ్యాలు వారణాసిలోని నీటిముంపు సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టాయి.Modi promised, he will make Varanasi like Kyoto of JapanBut even after he being the MP of it for 12 years, this is the condition of it 👇👀 pic.twitter.com/qMAUgixOAA— Veena Jain (@Vtxt21) August 7, 2026Agra, Uttar Pradesh Modi ji built roads with Space Technology Now those roads opening portal to the New Universe Modi hai toh mumkin hai ✊ pic.twitter.com/qxPXkkgykg— Veena Jain (@Vtxt21) August 7, 2026 -
గుజరాత్ అలల బావి మిస్టరీ వీడింది..!
సాధారణంగా బావుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఓ వ్యవసాయ బావి మాత్రం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిచింది. సముద్రపు అలలను తలపించేలా నీరు రోజుల తరబడి ఊగుతూ కనిపిస్తోంది. అది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే బావిని నిపుణులు పరిశీలించాక.. దీని వెనక కారణం ఏంటన్నది తెలిసిపోయింది!. విర్పర్డా గ్రామంలోని ఈ వింత బావి గురించి కొన్నిరోజులుగా దేశం చర్చించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అతీత శక్తులంటూ.. ఎవరికి తోచిన కథనాలు వాళ్లు ఇచ్చి పడేస్తున్నారు. అయితే బావిలో ఈ వింత వెనుక సైన్స్ తప్ప మరేయితర కారణాలు లేవని నిపుణులు తేల్చేశారు. అంతేకాదు.. ఎలాంటి ప్రకృతి విపత్తు కూడా రాబోవని అంటున్నారు. ఈ తరహా అలలు ఏర్పడడానికి సరైన కారణం ఏంటన్నది చెబుతున్నారు. An unusual mystery in India: water wildly swaying inside a well in Morbi, and no one can explain whyStrange phenomenon continues for a FIFTH DAY, baffling locals as authorities investigate pic.twitter.com/GykyazKKXi— RT (@RT_com) August 7, 2026సముద్రంలా ఎందుకు ఊగుతోందంటే..భారీ వర్షాల తర్వాత భూమిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుంది. ఈ నీరు భూగర్భంలోని రాళ్ల పొరలు, ఖాళీ ప్రదేశాలు, జలాశయ ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. ఈ సమయంలో భూమి లోపల ఉన్న గాలి, నీటి ఒత్తిడిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ఒత్తిడి మార్పుల ప్రభావంతో బావిలోని నీరు పైకి కిందికి కదులుతూ అలల మాదిరిగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోతైన బావుల్లో ఇలాంటి కదలికలు ఎక్కువగా గమనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.‘వెల్ సీష్’ కూడా ఓ కారణమేనా?ఈ ఘటనకు మరో శాస్త్రీయ వివరణగా ‘వెల్ సీష్’ (Well Seiche). ఒక నిర్దిష్ట ఆకారం, లోతు కలిగిన నీటి నిల్వలో చిన్నపాటి కదలిక కూడా సహజ తరంగాలుగా మారినప్పుడు.. నీరు కొంత సమయం పాటు ముందుకు వెనక్కి ఊగుతుంది. సరస్సుల్లో కనిపించే ఈ తరహా కదలికలు కొన్ని సందర్భాల్లో బావుల్లోనూ కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.मोरबी के वीरपरडा गांव में एक कुएं में अचानक पानी छलकने और हिलने-डुलने लगा, जिसे देखने के लिए बड़ी संख्या में लोग इकट्ठा हो गए। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #Morbi #GujaratNews #ViralVideo pic.twitter.com/hAd95ETbia— Bhoomi (@TheBPnova) August 6, 2026భూకంపం భయం..మోర్బీ ప్రాంతానికి భూకంప చరిత్ర ఉండటంతో ఈ బావిలోని వింత కదలికలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ముఖ్యంగా 2001లో గుజరాత్ను కుదిపేసిన భారీ భూకంపం జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బావిలో కనిపిస్తున్న నీటి కదలికలకు భూకంప కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు, భూగర్భ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ లేదంటే క్రియాశీల ఫాల్ట్ లైన్ గుర్తించలేదని తేల్చేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.సముద్రపు ఆటుపోట్ల ప్రభావమా?మోర్బీ అరేబియా సముద్రానికి పూర్తిగా దూర ప్రాంతం కాదు. దీంతో కొందరు స్థానికులు బావి నీరు సముద్రపు ఆటుపోట్ల ప్రభావంతో కదులుతోందని భావించారు. భూగర్భ జల మార్గాలు సముద్రంతో అనుసంధానమై ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భ జలాల ఒత్తిడి మార్పులే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.🚨 GUJARAT | MYSTERIOUS WELLAn unusual phenomenon has drawn crowds to Virparda village in Gujarat's Morbi district where water inside a roadside well has been continuously moving from one side to the other.According to local reports nearby wells remain completely calm while… pic.twitter.com/rJHvXjOZ8V— contentkikamii (@contentkikamii) August 6, 2026ఇలాంటి వింతలు ప్రపంచంలోనూ ఉన్నాయిబావులు, సరస్సుల్లో నీరు అసాధారణంగా కదలడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. సరస్సుల్లో నీరు ఒకే దిశలో ఊగడం, భూగర్భ జలాల్లో ఒత్తిడి మార్పులతో నీటి స్థాయిలు మారడం వంటి పరిణామాలను శాస్త్రవేత్తలు సహజ ప్రక్రియలుగానే వివరిస్తున్నారు. అయితే బావిలో నీరు కదలడం ఆధారంగా భూకంపాలను అంచనా వేయడం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మన దేశంలో ఇలాంటివి జరిగినా.. ఇప్పుడు సోషల్ మీడియా జమానా కారణంగా మోర్బీ బావి ఉదంతం హైలైట్ అయ్యిందంతే!.భయపెట్టిన బావి.. ఇప్పుడు ఆకర్షణగా మారిందిమొదట ఈ దృశ్యం గ్రామస్తులను భయపెట్టినా.. ఇప్పుడు అదే బావి ఆసక్తికరంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వింతను చూసేందుకు వస్తున్నారు. అధికారులు మాత్రం ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. గుజరాత్ మోర్బీ బావిలో కనిపిస్తున్న ఈ ‘సముద్రపు అలలు’ భూమి లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతోందనే సంకేతం కాదు.. ప్రకృతి తనదైన రీతిలో చూపిస్తున్న అరుదైన జల భౌగోళిక పరిణామం మాత్రమే.


