ఎప్పటికీ 'రియల్‌ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్‌ అప్‌లు.. | Army Chiefs Push-up Session With Specially-Abled Child Goes Viral | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ 'రియల్‌ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్‌ అప్‌లు..

Oct 28 2025 5:37 PM | Updated on Oct 28 2025 5:52 PM

 Army Chiefs Push-up Session With Specially-Abled Child Goes Viral

కొన్ని సంఘటనలు అందర్నీ మైమరిచిపోయేలా చేస్తే..మరికొన్ని ఒక్క క్షణం ఆగిపోయి చూస్తుండిపోయేలా ఉంటాయి. వారి హోదాను కూడా పక్కన పెట్టి మనతో సామాన్యుల మాదిరిగా కలిసిపోయే వారి ఔదార్యం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. పైగా ఆ దృశ్యం అందరం ఒక్కటే అనేట్టుగా ప్రతిధ్వనిస్తుంది. అలాంటి అపురూపమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.

ఢిల్లీలో జరిగిన శౌర్య వీర్ - రన్ ఫర్ ఇండియా' మారథాన్‌లో  ఈ ఘటన ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది  ప్రారంభించారు. ఆ వేదికపై ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లవాడు అందర్నీ విస్తుపోయేలా పుష్‌ అప్‌లు చేస్తున్నాడు. ఇంతలో ఆర్మీ చీఫ్‌ ద్వివేది..ఆ పిల్లవాడిని ఉత్సాహపరిచేలా అతడితోపాటు ఆయన కూడా పుష్‌అప్‌లు చేశారు. 

ఆయన చేసిన పని ప్రజల హృదయాలను గెలుచుకుంది. నిజానికి ఈ మారథాన్‌ కార్యక్రమం సైన్యం, ధైర్యం అంకితభావానికి నివాళులర్పించే  79వ శౌర్య దినోత్సవ వేడుకల్లో భాగం. కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వేదికపై ప్రత్యేక సామార్థ్యం ఉన్న పిల్లవాడు పుష్-అప్‌లు చేయడం ప్రారంభించినప్పుడు, ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఆ పిల్లవాడి ఉత్సాహాన్ని చూసి ఆర్మీ చీఫ్‌ జనరల్ ద్వివేది కూడా అతడితో చేరారు. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వడమే కాకుండా నెటిన్ల మనసును దోచుకుంది. అంతేగాదు 61 ఏళ్ల వయసులో ఎంత అప్రయత్నంగా పుష​ అప్‌లు చేశారు సార్‌ అని ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు.

 

(చదవండి: Success Story: కాలేజ్‌కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్‌ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement